breaking news
NTR
-
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సీఐడీతో విచారణ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు‘‘2024 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తుల విలువ రెండు కోట్లు. కొల్లు రవీంద్ర కోటి రూపాయలు చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా మీకు. వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా?. వీకెండ్కు హైదరాబాద్, రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా?. దుబాయ్కి వెళ్లిన పాస్ పోర్టు, వీసా చూపించే దమ్ముందా?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘మచిలీపట్నంలో డిఫ్యాక్టో మంత్రి, ఎమ్మెల్యే.. టీడీపీ నేత గోపిచంద్. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నాడు. గొర్రిపాటి గోపీచంద్ బందర్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. బైపాస్లో దేవుడి ఆస్తి కాజేశానని నాపై విష ప్రచారం చేస్తున్నారు. 2006లో ఆక్షన్లో గోపీచంద్, అతని భార్య పాల్గొన్నారా? లేదా?. గోపీచంద్ భార్య రాజేశ్వరి పేరుతో చలానా కట్టారా.. లేదా?.’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
డెంగీ లక్షణాలతో యువతి మృతి
పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో డెంగీ లక్షణాలతో ఓ యువతి ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని తుఫాన్ కాలనీకి చెందిన పెద్ది రూప (23) కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. నెల క్రితం ఆమె గ్రామానికి వచ్చింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. జ్వరం తగ్గకపోవటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగీ సోకిందని నిర్థారించి చికిత్సచేశారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి 3 రోజుల క్రితం తరలించగా..చికిత్స పొందుతూ ఆదివారం రూప మృతి చెందినట్లు ఆమె తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అయితే రూప రిపోర్టుల్లో డెంగీ నెగటివ్గా ఉందని, వైరల్ జ్వరంతో పాటు వీక్గా ఉండటంతో అవయవాలు దెబ్బతిన్నాయని, జ్వరానికి హైడోస్ మందులు కూడా వాడారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. తుఫాన్ కాలనీలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారని వైద్యాధికారి డాక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
నడిరోడ్డుపై దుశ్శాసన పర్వం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు. అసలేం జరిగిందంటే.. గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్తో పాటు, తండ్రి కుమార్బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య.. హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
లీజు మంత్రం.. దోపిడీ తంత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో విజయవాడ ఉత్సవ్ మాటున ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలి చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఉత్సవాల వెనుక ఉన్న టీడీపీ నాయకులు, అధికారులు తడబడ్డారు. సీఎం కార్యాలయం సైతం జిల్లా యంత్రాంగంతో ఆరా తీసి, పనులు నిలిపివేయాలని ఆదేశించింది.దీంతో ఈ ఉత్సవాల మాటున దేవుని మాన్యంకు ఎసరు పెట్టి, భారీ ప్రణాళిక రచించిన పార్లమెంట్ ముఖ్యనేతతో కూడిన ఐదుగురి బృందంకు ఎటూ పాలు పోలేదు. ఈ ఉత్సవాలు జరపకపోతే తమ పరువు పోతుందని, తాత్కాలికంగా లీజుకు ఇప్పించాలని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న యువనేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవుని మాన్యం భూమిలో ఉత్సవాలు జరిపేందుకు నిబంధనలు ఒప్పుకోవని, ఇప్పటికే లీజు ఉండటంతో, ఆ లీజు రద్దు చేస్తే తప్ప వీలు కాదని తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ నేత లీజుదారులను ఎలాగోలా ఒప్పించారు. ఆలయ కమిటీ సభ్యులనుంచి నిరసన రాకుండా ఆగమేఘాల మీద టీడీపీ పెద్దలంతా మచిలీపట్నం వెళ్లి రూ.45 లక్షల చెక్కును అందజేయటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.ఈ ప్రశ్నలకు బదులేది?● రూ.400 కోట్ల విలువైన 39.99 ఎకరాల భూమిలో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో 5 ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్య క్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షోకేసు, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నియమించేందుకు శాశ్వత వేదిక నిర్మించడం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్లాయి. ఆ ప్రతిపాదనల వెనుక మర్మం ఏంటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.● ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉండగానే ఈనెల మొదటి వారంలోనే దేవుని మాన్యం భూమిలో దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, పంటలు పండే పొలంలో 4 నుంచి 6 అడుగుల మేర మట్టి తోలి చదును ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. మట్టి ఎక్కడ నుంచి తెచ్చారు. దానికి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా, దేవస్థానం భూమిలో అక్రమంగా మట్టి తోలుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.● ఇదిలా ఉంటే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో 30 ఎకరాలకు రూ.45 లక్షల లీజు మొత్తం తీసుకుని దేవదాయశాఖ లీజు ఇస్తూ ఈ నెల 13న మెమో ఇవ్వడం గమనార్హం. ఈ భూములను శాశ్వతంగా కొట్టేసేందుకు భారీ వ్యూహం రచించినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.● 56 రోజుల తరువాత ఆ మట్టి ఎవరు తొలగిస్తారని, దానిని మళ్లీ పంట పొలంగా మార్చాలంటే ఎంత కష్టమని భక్తులు అంటున్నారు. మళ్లీ ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఓ ప్రైవేటు సంస్థ ఈ స్థలాన్ని తీసుకోవడం, అందునా టీడీపీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా విజయవాడ నగరంలో ఎన్నో స్థలాలు ఉన్నా లక్షలాది రూపాయలను ఖర్చు చేసి ఆలయ భూముల్ని తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 56 రోజుల ఉత్సవాల కోసం పంటలు పండే వ్యవసాయ భూమిని చెర పట్టి, కోట్ల విలువైన మట్టిని 4 నుంచి 6 అడుగుల మేర తోలి చదును చేయడం ఏంటని భక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
అప్పుల బాధతో బలవన్మరణం
తాడేపల్లిరూరల్: పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ పండ్ల వ్యాపారి మద్యానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన వెంకన్న (45) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చి సాంబమూర్తిరోడ్లోని బావాజీపేట 1వ లైన్లో నివసిస్తున్నాడు. అతను పండ్ల వ్యాపారి. వెంకన్న మద్యానికి బానిసై అందినచోటల్లా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో అప్పులు తీర్చలేక తాడేపల్లి రూర ల్ కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసుల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో తాడుతో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మహిళ మృతదేహంతో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు. అసలేం జరిగిందంటే.. గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్తో పాటు, తండ్రి కుమార్బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య.. హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
కృష్ణా జేసీ గీతాంజలిశర్మ బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలిశర్మను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. గీతాంజలిశర్మ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ముంబై ఐఐటీలో డేటా ఎనలటిక్స్పై శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ప్రస్తుతం ఇన్చార్జ్ బాధ్యతలను డీఆర్వో చంద్రశేఖరరావు నిర్వర్తిస్తున్నారు. జాయింట్ కలెక్టర్గా గీతాంజలిశర్మ 2024 జనవరి 5వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 20 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. -
ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అర్జీ ఇస్తే తప్పనిసరిగా తమ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు వస్తారని, అధికారులు నిబద్ధతతో అర్జీలపై దృష్టి పెట్టి పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. నిర్దేశ గడువులోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు 168 అర్జీలు జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 168 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 44, పోలీస్ 26, డీఆర్డీఏకు 17, ఎంఏయూడీ 16, విద్య 9, పంచాయతీరాజ్ శాఖకు 8 అర్జీలు వచ్చాయి. ఆరోగ్యం, గృహ నిర్మాణం, విభిన్న ప్రతిభావంతుల శాఖకు సంబంధించి నాలుగు చొప్పున, ఇరిగేషన్, కాలేజీ విద్య, పౌర సరఫరాలు, వ్యవసాయం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు సంబంధించి మూడు చొప్పున, సర్వే, సహకారం, సాంఘిక సంక్షేమం, కాలుష్య నియంత్రణ, విద్యుత్, ఎండోమెంట్స్ శాఖలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. మైన్స్, నైపుణ్యాభివద్ధి, బీసీ సంక్షేమం, ఉపాధి కల్పన, పర్యాటకం, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంకు సేవలు, సాంకేతిక విద్య, గ్రామ–వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. మొత్తం 168 అర్జీలు రాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 86 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 86 అర్జీలు అందగా వాటిలో భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 40, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించినవి 2, వివిధ మోసాలకు సంబంధించినవి 5, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 9, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 20 ఫిర్యాదులు అందాయి. -
ఆటో కార్మికులను ఆదుకోండి
రవాణా శాఖ మంత్రి ఇంటి వద్ద నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): సీ్త్ర శక్తి పథకం వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బృందావన కాలనీ నందమూరి రోడ్డులోని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి నివాసం వద్ద సోమవారం ఉదయం ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత పలువురు ఆటో కార్మికులు మంత్రి రాంప్రసాద్రెడ్డిని కలిసి సీ్త్ర శక్తి పథకం అమలు చేసిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఇంటి ముందు బ్యానర్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. సజావుగా సాగుతున్న వారి జీవితాలు, ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రతి కార్మికునికి నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీఓ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. -
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోడూరు: బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు (28) ఆదివారం సాయంత్రం తన భార్యను కోడూరులోని ఓ ప్రైవేట ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాసరావు ఉల్లిపాలెం సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్తున్నట్లు తన తండ్రి నాగబసవయ్యకు చెప్పి వెళ్లాడు. అయితే రెండు గంటలు దాటినా కూడా శ్రీనివాసరావు రాకపోవడంతో తండ్రి నాగబసవయ్య బంధువులతో కలిసి ఉల్లిపాలెం వారధి వద్దకు వెళ్లాడు. శ్రీనివాసరావు బైక్, చెప్పులు ఉల్లిపాలెం వారధిపై ఉండడాన్ని గమనించారు. కిందకి చూడగా.. నదిలో పడి కొట్టుకుపోతున్నట్లు గమనించి, కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.. ఉల్లిపాలెం వద్ద కృష్ణానదిలో గల్లంతైన శ్రీనివాసరావు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో నదిలో బోట్లపై గాలింపు జరిపారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఉల్లిపాలెం నుంచి హంసలదీవి వరకు నదిని జల్లెడ పట్టారు. సముద్ర పోటుతో పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో శ్రీనివాసరావు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా దొరకలేదని ఎస్ఐ చెప్పారు. మంగళవారం గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. -
నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి( సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నటలు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది ఆశా. హాస్పిటల్స్కి రూ. 2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వారంలోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరంది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. -
‘ఇంటింటికీ పరిశుభ్రత’ కిట్ పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): అజిత్సింగ్నగర్లోని న్యూ ఆర్ఆర్పేటలో ఆదివారం వీఎంసీ సిబ్బంది ఇంటింటికీ హౌస్ హోల్డ్ హైజిన్ కిట్ (ఇంటి పరిశుభ్రత కిట్ )ను పంపిణీ చేశారు. అతిసారా నివారణకు ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో అందజేసిన ఇంటి పరిశుభ్రత కిట్లో.. లిక్విడ్ హ్యాండ్ వాష్, సబ్బులు, నాప్ కిన్స్, ఫినాయిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా ఆహారం తినక ముందు తినిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని, క్రిములు సోకకుండా ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేయాలని, ఇంటిని, మరుగుదొడ్లను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ డిహైడ్రేషన్ అయితే ఓఆర్ఎస్ నీరు తాగాలని వీఎంసీ సిబ్బంది స్థానికులకు సూచించారు. స్వామివారికి నిత్యాన్నదాన ట్రాలీలు సమర్పణ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి భక్తుల సౌకర్యార్థం దాత లు ఆదివారం ట్రాలీలు బహూకరించారు. ఉద యం ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం సుమారు రూ. 1.20 లక్షలతో తయారు చేయించిన ట్రాలీలను ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్కు అందజేశారు. దాతలు మచిలీపట్నంకు చెందిన యర్రంశెట్టి వినయ్బాబు మిత్రబృందం, కొరియర్ శ్రీను, కురిచేటి అప్పారావు, రాయలపాటి రాజేష్, యడ్ల శివశంకర్ కలసి అన్నదానంలో వినియోగించే ట్రాలీలను అందించినట్లు ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు తెలిపారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆదివారం కావడంతో పలు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్వనార్థం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. బుడమేరుకు వరద ప్రవాహం జి.కొండూరు:ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో శనివారం భారీ వర్షం పడడంతో ఆదివారం ఉదయం నుంచి బుడమేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మద్య బుడమేరుపై ఉన్న లోలెవెల్ చఫ్టాపై వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలు నిలిపివేశారు. వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద బుడమేరు వరద ప్రవాహం ఆదివారం సాయంత్రానికి 2.4 అడుగులకు చేరగా 1700 క్యూసెక్కుల వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తుంది. అదే విధంగా రెడ్డిగూడెం మండల పరిధి నరుకుళ్లపాడు, ఓబులాపురం గ్రామాల మద్య ఉన్న కళింగవాగు ఆదివారం పొంగి పొర్లడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనం, రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఘాట్రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులతో ఓం టర్నింగ్ మొదలు, లక్ష్మీ గణపతి విగ్రహం, చిన్న గాలిగోపురం పాయింట్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో వైపున మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం దర్శనాలు తిరిగి ప్రారంభం కాగా రెండు గంటల వరకు భక్తులతో క్యూలైన్లు రద్దీ కనిపించాయి. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి వారిని, ఉపాలయాల్లో దేవతా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ జరిగింది. మొదటి అంతస్తులో బఫే పద్దతిలో భక్తులకు అన్న ప్రసాదం అందించారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను, హోల్డింగ్ ఏరియాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివా రం పరిశీలించారు. వినాయ టెంపుల్ నుంచి ఏర్పా టు చేసిన క్యూలైన్స్ను స్వయంగా నడుచుకుంటూ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అదే విధంగా వాహనాల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్స్ లలో స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. భక్తులు లోనికి వెళ్లడానికి బయటకు రావడానికి ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్ కోసం భవానీపురం, పున్నమిఘాట్ మొదలగు ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సౌత్ ఏసీపీ పవన్కుమార్, ట్రాఫీక్ ఏసీపీ జె. రామచంద్రరావు, వన్టౌన్ సీపీ గురుప్రకాష్ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అణిచి వేస్తే తమను ప్రశ్నించేవాళ్లు ఉండరని కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన అలోచన చేస్తుంది. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు బనాయించి కొత్త సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. పత్రికా స్వేచ్ఛని హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా తమ తప్పును తెలుసుకొని అక్రమ కేసులపై దృష్టి వీడి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి. – నల్లగట్ల స్వామిదాస్, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ -
నగరాలు సంఘం ఆధ్వర్యంలో పలువురికి సత్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): శ్రీనగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ప్రముఖులను సత్కరించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీ.రావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, పోతిన వెంకటమహేష్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరాలు రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరని చెప్పారు. ఉత్తరాంధ్రలోని పదికిపైగా నియోజకవర్గాలు, పిఠాపురం, పాలకొల్లు, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. సామాజిక నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేశ్వరరావు, డైరెక్టర్లతో పాటు బుద్దా వారి దేవస్థాన కమిటీ చైర్మన్ పిళ్లా సుదర్శనరావు, ఏపీసీఎస్ చైర్మన్ పోతిన ప్రసాద్, గొల్లపూడి మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ అడ్డూరి లక్ష్మీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దసరా ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం విడుదల చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్లో ఆదివారం ఆలయ వైదిక కమిటీ, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈవో శీనానాయక్ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ఈ టికెట్లను దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్, దేవస్థాన వైబ్సైట్తో పాటు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఽదరలు ఇలా.. ప్రత్యేక ఖడ్గమాలార్చన టికెట్ రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ రూ.3వేలు, మూలా నక్షత్రం రోజున రూ. 5వేలు, ప్రత్యేక శ్రీచక్రనవార్చన రూ.3వేలు, ప్రత్యేక చండీయాగం రూ.4వేలుగా నిర్ణయించామన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను ప్రత్యేక క్యూలైన్ ద్వారా సేవలు జరిగే ప్రాంతానికి అనుమతిస్తామని తెలిపారు. సేవలో పాల్గొనే వారు ముందుగానే ఆయా వేదికల వద్దకు చేరుకోవాలని సూచించారు. భక్తులు ఉదయం 3.30 గంటల నుంచి 10–30 గంటల వరకు వన్టౌన్ గాంధీ మున్సిపల్ హైస్కూల్, భవానీఘాట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని సూచించారు. వైదిక కమిటీ సభ్యులు కోటప్రసాద్, శ్రీధర్, శంకర శాండిల్య, ఏఈవోలు ఎన్.రమేష్బాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటిపాయకు మళ్లీ వరద
కంకిపాడు: ఏటిపాయకు మళ్లీ వరద వచ్చి చేరింది. వరదనీటితో ఏటిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరవళ్లు తొక్కుతూ వరదనీరు సముద్రం వైపు పరుగులు పెడుతోంది. ఏటిపాయ రహదారి మార్గం మరలా ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయించి లంక పొలాల్లో పనులకు వెళ్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేయటంతో ఏటిపాయ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధి గుండా ప్రవహించే కృష్ణానది ఏటిపాయ రెండు రోజులుగా నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఏటిపాయ అంచులు తాకుతూ నీరు దిగువకు ప్రవహిస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ గుండా లంక పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి మార్గం ఉంది. మొన్నటి వరకూ ఏటిపాయలో నీటి ఉధృతి సాధారణ స్థితికి చేరింది. రాకపోకలు సాధారణ స్థితికి చేరుతాయని భావించారు. అయితే మరలా వరద వచ్చి చేరటంతో లంకపొలాల్లోకి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అయ్యాయి. రహదారి ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవల సాయంతో లంక భూముల్లోకి వెళ్లి పొలం పనులు చూసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఏటిపాయలో వరదనీటి చేరికతో రాకపోకలు సాగటం లేదు. దీంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తుండటంతో పడవలకు డిమాండ్ పెరిగింది. -
కక్ష సాధింపు మానుకోవాలి
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
గాలికొదిలేశారు!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరి పేటలో పరిస్థితులు ఏమీ మారలేదు. నాలుగు రోజుల తర్వాత కూడా రంగు మారిన నీటినే తాగేందుకు సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో డాక్టర్ల నిజ నిర్ధాణ కమిటీ పర్యటించింది. వైఎస్సార్ సీపీకి చెందిన డాక్టర్ మొండితోక జగన్న్మోహనరావు, డాక్టర్ సుధీర్ భార్గవ్రెడ్డి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. డయేరియా బాధిత కుటుంబాలు, క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల ఆర్తనాదాలు విన్న కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. -
ఎరువుల దుకాణం పరిశీలన
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో ఒక ఎరువుల దుకాణాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం పరిశీలించారు. స్థానికంగా రైతులకు కావలసిన యూరియా అవసరాలతో పాటు యూరియా నిల్వలను వీఆర్వో శాయన ప్రకాష్ను అడిగి తెలుసుకున్నారు. యూరియాను కొరత లేకుండా అందజేస్తామని స్థానిక రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుటుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పుట్టిన ఆడశిశువు మొదలు, మహిళలందరి ఆరోగ్య సంరక్షణకు స్వస్థనారి శసక్త్ పరివార్ అభియాన్ అనే పథకాన్ని ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు జిల్లాలోనూ ప్రారంభం అవుతుందన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 2 వరకూ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై స్పెషలిస్టు వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం, సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారం, కుటుంబాలను శక్తివంతం చేయడమని ఆమె తెలిపారు. ప్రత్యేక శిబిరాల ద్వారా మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భస్థ క్యాన్సర్, రక్తహీనత వంటి పరీక్షల చేస్తామన్నారు. కిశోర బాలికల్లో హిమోగ్లోబిన్ పరీక్షలు, గర్భిణులకు పోషకాహారంపై జాగ్రత్తను వివరించనున్నట్లు తెలిపారు. -
వేడుక ఏదైనా చందా చెల్లించాల్సిందే!
ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో.. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘పశ్చిమ నియోజకవర్గంలో ఏమైనా సరే ఏ పార్టీ వారైనా, దేనికై నా సరే, ఏ సమావేశాలకై నా, ఏ ఫంక్షన్ కై నా, ఉత్సవాకైనా కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు. ఇది మన సిద్ధాంతం. మొదటి నుంచి చెబుతున్నాం, మీ వద్దకు ఎవరైనా ఆ విధంగా చందాల వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీసుకు తెలియజేయండి. ఎవరికీ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.’ ఇటీవల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం సంద ర్భంగా విలేకరులతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పిన మాటలివి. దీనిని బట్టే చందాల దందా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.కోట్లు దండుకొనే ప్రణాళిక రచించినట్లు టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గొల్లపూడిలో మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి 39.99ఎకరాల మాన్యం ఉంది. ఆ మాన్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ఆ భూమిలో మట్టి తోలి చదును చేశారు. ఈ విషయం సీఎంఓ దృష్టికి వెళ్లటంతో, వెంటనే ఆ ప్రాంతంలో పనులు నిలిపి వేయాలని ఆదేశించినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉత్సవాల మాటున రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించిన పార్లమెంటు ముఖ్యనేతతోపాటు, మరికొందరు పట్టు వదలకుండా తమ పరువు పోతోందని, ఉత్సవాల నిర్వహణకు తాత్కాలికంగా లీజు ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే ఇప్పటికే ఈ భూమిని గొల్లపూడిలోని ఆరు మంది రైతులకు ఈ ఏడాది మే నెలలో బహిరంగా వేలం నిర్వహించి, జూన్లో ఏడాది పాటు లీజుకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వారి నుంచి సబ్ లీజు తీసుకొని అక్కడ ఉత్సవాలు నిర్వహించే వీల్లేదు. దీంతో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి రెండు రోజుల క్రితం గొల్లపూడిలో ఆ రైతులను పిలిపించి, మాట్లాడి, వారు కట్టిన లీజు మొత్తాని కంటే ఎక్కువగా ఇచ్చి, వారే స్వయంగా లీజు రద్దు చేసుకొంటామనేలా ఒప్పించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నారు. ఈ విధంగా ఎగ్జిబిషన్ సొసైటీ తాత్కాలిక లీజు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతోపాటు మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని, కొనకళ్ల నారాయణలు వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. 56 రోజుల లీజుకోసం రూ.45లక్షల చెక్కును ఆ ఆలయ ఈవోకు అందించారు. మొన్న వినాయక చవితికి భారీగా వ్యాపారుల నుంచి వసూలు ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ పేరుతో మరోసారి చందాల దందా ఎవరికీ రూపాయి ఇవ్వొద్దంటూ ఆదేశాలిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఇతర కూటమి నేతలు ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కొంత మంది నేతలు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారింది. పండుగలు వస్తే అక్కడ వ్యాపారులు హడలిపోతున్నారు. షాపుల వ్యాపారాన్ని బట్టి ‘పచ్చ’ట్యాక్స్ వేస్తున్నారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నా టీడీపీ నేత ‘ధూం ధాం’గా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వ్యాపారవర్గాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా వస్త్ర, ఎలక్ట్రికల్, బంగారు, గొల్లపూడి మార్కెట్, ప్రముఖ వ్యాపార సంస్థలు, హోటళ్లు ఇలా అన్ని వ్యాపార వర్గాల నుంచి టార్గెట్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలు వస్తుండటం, విజయవాడ ఉత్సవ్ అని హడావుడి చేస్తూ, చందాల వసూళ్లకు ప్రణాళిక రచించిన విషయం వ్యాపారుల దృష్టికి రావడంతో హడలి పోయి, కొంత మంది వ్యాపారులు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బహిరంగంగానే పత్రికా సమావేశంలో నో చందా.. నో దందా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాత్కాలిక లీజు పేరుతో భూమిని స్వాధీనం చేసుకొని, శాశ్వతంగా తమ వద్దే ఉంచుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో శాశ్వతంగా రిక్రియేషన్ క్లబ్, మల్టీకాంప్లెక్స్, థియేటర్లు, స్టార్ హోటళ్లు నిర్మించేందుకు తాత్కాలిక లీజును పునాదిగా చేసుకొంటున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఉత్సవ్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ మాటున కోట్లు కొల్లగొట్టే కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి 100 మంది సభ్యులను ఏర్పాటు చేసుకొని వారి నుంచి సభ్యత్వ రుసుం కింద ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు అంటే రూ.10కోట్లు వసూలు చేసేందుకు తెరలేపినట్లు చర్చ సాగుతోంది. ఇందులో 1000 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో 200 వీఐపీ, 300 మధ్యరకం, 500 చిన్నస్టాల్స్ ఏర్పా టు చేసేలా ప్రణాళిక రచించారని తెలు స్తోంది. వీటికి రేటు పెట్టి వీఐపీ స్టాల్కు రూ.10లక్షల చొప్పున మొత్తం స్టాళ్లకు రూ.20కోట్లు, మధ్య రకం స్టాల్కు రూ.5 లక్షలు చొప్పున రూ.15కోట్లు, చిన్న స్టాల్కు రూ.లక్ష చొప్పున రూ. 5కోట్లు వసూలు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. దీంతో పాటు గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ, ఓ హోట ల్ యజమానితోపాటు, మరికొంత మంది నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసేందుకు కుట్రకు తెరలేపారని, దీనికి ఎగ్జిబిషన్ సొసైటీ ముసుగు వేశారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. -
పిచ్చిపిచ్చి మాట్లాడితే మొహం పచ్చడి చేస్తా..!
కంచికచర్ల (నందిగామ): ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు. సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. -
న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటన
సాక్షి, విజయవాడ: న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ ఆదివారం ఉదయం పర్యటించింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, సత్తెనపల్లి ఇంచార్జ్ డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్ ఉన్నారుబాధితుల ఇళ్లకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమను సరిగా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతల వద్ద డయేరియా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంప్ల వద్ద సరైన వైద్యం అందడం లేదని.. ఆర్ఎంపీలు వద్ద వైద్యం చేయించుకున్నామని తెలిపారు. తమకు వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యులపై కేసులు పెడతామని బెదిరించారంటూ బాధితులు తెలిపారు. రంగు మారిన నీటిని తాగుతున్నామంటూ బాధితులు.. వైఎస్సార్సీపీ నేతలకు వాటర్ బాటిల్స్ చూపించారు.మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజుల్లో డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా?. గత ప్రభుత్వంలో మేం అందరికీ సురక్షిత మైన నీరును అందించాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది. విజయవాడ వంటి నగరంలోనే పరిస్థితి ఇంత దారుణమా?. ఇంత వ్యవస్థ పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తోంది?. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ డయేరియా వస్తే బాధితులు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఐదు రోజుల నుంచి ప్రజలు డయేరియాతో బాధపడుతున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాలతో మేం న్యూ ఆర్.ఆర్ పేటలో పర్యటించాం. ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పేందుకే మేం వచ్చాం. ఐదు రోజులైనా ప్రభుత్వం కారణాలను బయటపెట్టడం లేదు.ఈ ప్రభుత్వంపైన నమ్మకం లేకే బాధితులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది? ఎందుకు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు. మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు కాబట్టి ఈ ఉదయం ఓమహిళ చనిపోయింది. కొద్ది రోజుల్లో దసరా మహోత్సవాలు వస్తున్నాయి. 20 వేల మంది ఉన్న ప్రాంతంలోనే డయేరియాను అదుపు చేయలేకపోయారు.దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇంకేం సౌకర్యాలు కల్పిస్తారు. ఆరోగ్యశాఖ మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు. బుడమేరు వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయని మంత్రి చెప్పడం సిగ్గుచేటు. మరణాలను కప్పిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి. అధికారులు గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదు. వినాయకుడి భోజనాలు తినడం వల్ల డయేరియా వచ్చిందంటున్నారు. ఖాళీ వాటర్ టిన్లు ఇస్తే మంచినీళ్లు ఎవరిస్తారు?.మెడికల్ క్యాంప్లో బాధితులను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రేపు సాయంత్రం వరకూ డెడ్ లైన్ పెడుతున్నాం. రేపు సాయంత్రానికల్లా డయేరియా కారణాలను వెల్లడించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతాం. బాధ్యత లేకుండా వ్యవహరించిన మంత్రులను బర్తరఫ్ చేయాలి -
అతి వేగానికి రెండు ప్రాణాలు బలి
గూడూరు: అతివేగం రెండు ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన శనివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై తరకటూరు దగ్గర జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాలు... జీవనోపాధి కోసం పెనమలూరు మండల పరిధిలో నివాసం ఉంటున్న పరిమి ఆదామ్ బాబు(19), కొమ్మవరపు షారీన్(19), కోట కౌషిక్(21) శనివారం ద్విచక్ర వాహనంపై మంగినపూడి బీచ్కు బయలుదేరారు. మధ్యాహ్నం పామర్రు మండలం నిమ్మకూరు నుంచి ఇటుకల లోడుతో మచిలీపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చి ఽఢీకొట్టారు. దీంతో వాహనం నడుపుతున్న ఆదామ్బాబు ఘటనా స్థలంలోనే మరణించాడు. వెనుక కూర్చున్న కొమ్మవరపు షరీన్, కోట కౌషిక్ తీవ్ర గాయాలపాలయ్యారు. షరీన్ను 108లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కౌషిక్కు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పెడన సీఐ నాగేంద్ర కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిమి ఆదామ్ బాబు(19), కోట కౌశిక్ (21) స్వస్థలం చందర్లపాడు మండలం పొన్నవల్లి గ్రామం కాగా, కొమ్మవరపు షారీన్(21) స్వస్థలం పల్నాడు జిల్లా అంబడిపూడి. వీరు ముగ్గురు సమీప బంధువులు. -
సింగ్నగర్కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!
హోటళ్లు మూయించడంపై ఆగ్రహం అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాపించి నాలుగు రోజులైన తరువాత శనివారం సాయంత్రం సింగ్నగర్కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హడావుడిగా బార్లు, వైన్ షాపులతో పాటు బిర్యానీ హోటళ్లను సైతం మూయించి వేశారు. ఆయా హోటళ్ల యజమానులు అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా వస్తే సింగ్నగర్లో హోటళ్లు మూయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము అన్నీ వండుకొని సిద్ధం చేసిన తరువాత హడావుడిగా వచ్చి ఇలా షాపులను మూసేయించారని, ఇప్పుడు వండిన ఆహారం అంతా ఏం చేయాలని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. సింగ్నగర్ డాబాకొట్లు సెంటర్ నుంచి ఎంబీ స్టేడియంకు వెళ్లే దారిలో 20కి పైగా బిర్యానీ హోటళ్లు ఉన్నాయి. కొందరు హోటళ్ల యజమానులు అధికార పార్టీ నాయకులతో ఫోన్లు చేయించుకొని తాము ప్రభుత్వ నిబంధనలకు అతీతులమన్నట్లుగా యథావిధిగా వ్యాపారాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల మద్దతున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా అంటూ పలువురు వ్యాపారులు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్స్టేషన్ (జీఆర్పీ) సిబ్బంది కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రామవరప్పాడు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తల, వంటిపై తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరారు. -
ఆలయాల్లో జరిగే వివాహాలపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో జరిగే వివాహాలపై ఆయా ఆలయాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం ఆయన వాసవ్య మహిళా మండలి, జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మత పెద్దల పేరిట ప్రత్యేక సమావేశం జరిగింది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని వివిధ దేవాలయాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బాల్య వివాహ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరగకుండా కలిసికట్టుగా కృషిచేయాల్సి ఉందన్నారు. ప్రతి దేవాలయంలో వివాహానికి అర్హత వయసు, వయసు ధ్రువీకరణ పత్రాలు, చట్ట నియమ నిబంధనలు తెలియజేసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలపై ఫిర్యాదు చేసేందుకు 112 నంబరుతో పాటు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయాల్లో ప్రదర్శించాల్సిన వివరాలతో కూడిన నమూనా పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయాల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ఎండోమెంట్ ఏసీ షణ్ముఖ నటరాజన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రతినిధులు పాల్గొన్నారు. టైమ్ బ్యాంక్ ఓ వినూత్న కార్యక్రమం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో టైమ్ బ్యాంక్ – మేము సైతం(టైం బ్యాంక్– వియ్ టూ) పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని పైలట్ ప్రాతిపదికన అమలుచేయనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం టైమ్ బ్యాంక్ కార్యక్రమంపై యువ వలంటీర్లకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువ వలంటీర్లు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తే వారు ఎంత సమయం పాటు సేవ చేశారనే దాని ఆధారంగా ఆ సమయం టైమ్ బ్యాంక్లో కాయిన్ల రూపంలో జమవుతాయన్నారు. వారు సంపాదించిన టైమ్ కాయిన్లను వలంటీర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చని వివరించారు. విశేష సేవలందించిన వలంటీర్లకు డిజిటల్ సర్టిఫికెట్లు, మెరిట్ బ్యాడ్జీలు కూడా ప్రదానం చేయనున్నట్లు వివరించారు. టైమ్ బ్యాంకు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ రైల్వే స్టేషన్, పీఎన్ బస్స్టేషన్, ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలుచేయనున్నట్లు తెలిపారు. నాలుగు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత వలంటీర్ల అభిప్రాయాలను సేకరించి, అనంతరం మొత్తం జిల్లా మొత్తానికి ఈ వినూత్న విధానాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు, బంగారు భవిష్యత్తుకు నిర్మాతలుగా తీర్చిదిద్దేందుకు ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ బి.కీర్తి టైమ్ బ్యాంక్ విధివిధానాలు, డిజిటల్ మానిటరింగ్, డ్యాష్బోర్డు, ఈ–సర్టిఫికెట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆగిరిపల్లి)కి చెందిన 45 మంది విద్యార్థులతో పాటు డాక్టర్ నాగసుధారాణి, డాక్టర్ శ్రీలత, వాసవ్య మహిళా మండలి వలంటీర్లు పాల్గొన్నారు. -
యువ న్యాయవాదులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
పెనమలూరు: న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించనున్న యువ న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుని వృత్తిలో రాణించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్కుమార్ అన్నారు. కానూరు వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజీలో శనివారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సహకారంతో విద్యార్థులకు ఏఐబీఈ మాక్టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టే వారికి నైపుణ్యం పెంపొందించటానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏఐబీఈ మాక్ పరీక్ష నిర్వహించామన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను విశ్లేషించుకుని నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాక్టెస్ట్లో 273 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్కుమార్ -
మద్యం మత్తులో వంట మనిషిపై విద్యార్థుల దాడి
గన్నవరం: మద్యం తాగుతున్నారని మందలించిన వంట మనిషిపై విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టిన సంఘటన మండలంలోని గొల్లనపల్లి ఎస్సీ బాలుర హాస్టల్లో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉంటున్నారు. కొంత మంది విద్యార్థులు శనివారం సాయంత్రం హాస్టల్ భవనంపై కూర్చొని మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వచ్చిన వంట మనిషి గొల్లనపల్లికి చెందిన కాశిమ్మ విద్యార్థులను మందలించింది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్కు చెబుతానని హెచ్చరించి వంట చేసేందుకు వెళ్లింది. విద్యార్థులు కొద్ది సేపటి తర్వాత వంట గదిలో కూరగాయలు కోస్తున్న కాశిమ్మపై దుప్పటి కప్పి కొట్టి, గొంతు నులిమే ప్రయత్నం చేశారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో విద్యార్థులు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న కాశిమ్మ విషయాన్ని ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వైద్య చికిత్స నిమిత్తం ఆమెను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుమారు ఏడుగురు విద్యార్థులు తనపై దాడిచేసినట్లుగా కాశిమ్మ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. -
పోరంకిలో అరకొరగా యూరియా పంపిణీ
పోలీసుల బందోబస్తు పెనమలూరు: పోరంకి గ్రామంలో శనివారం అధికారులు అరకొరగా యూరియాను రైతులకు పంపిణీ చేశారు. గ్రామంలో రైతులు గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 10 టన్నుల యూరియా రావటంతో సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో రైతుసేవా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో ఏవో శైలజ యూరియా 10 టన్నులు వచ్చిందని, అరకట్ట నుంచి గరిష్టంగా 3 కట్టల యూరియా ఇస్తామని తెలిపారు. అయితే రైతులు యూరియా అవసరం చాలా ఉందని, అరకొరగా ఇస్తే సాగు ఎలా చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. దశలవారీగా యూరియా పంపిణీ చేస్తామని ఏవో రైతులకు తెలిపారు. రైతు సేవా కేంద్రాల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. గుడివాడటౌన్: ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన క్రీడాకారులకు జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్టేడియం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్టేడియం క్రీడా క్యాలెండర్ను అనుసరించి ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు పురుషులు, సీ్త్రలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో విజేతలకు పతకాలతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనవలసినదిగా ఆయన కోరారు. పూర్తి వివరాలకు 85220 99995ను సంప్రదించవలసిందిగా కోరారు. -
మూడు చెక్డ్యామ్లకు గండ్లు
బుడమేరులో కలిసే ప్రధాన వాగుల్లో పులివాగు ఒకటి. జి.కొండూరు మండలంలోని గంగినేని శివారు కొండల్లో పుట్టిన ఈ వాగు తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల మీదుగా 18 కిలోమీటర్ల మేర ప్రవహించి వెలగలేరు శివారులోని నరసాయిగూడెం వద్ద బుడమేరులో కలుస్తుంది. రైతులకు సాగునీటిని అందించేందుకు దశాబ్దాల క్రితం ఈ వాగుపై పదికి పైగా చెక్డ్యామ్లు నిర్మించారు. వరద వచ్చినప్పుడు చెరువులు నింపడానికి, భూగర్భజలాల పెంపు, నిల్వ ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా చెక్డ్యామ్లు నిర్మించారు. వీటిలో తెల్లదేవరపాడు, మునగపాడు, చెర్వుమాధవరం చెక్డ్యామ్లకు గత ఏడాది వచ్చిన వరదలకు గండ్లు పడ్డాయి. చెక్ డ్యామ్ల వద్ద రెండు వైపులా అంచులు కోతకు గురై భారీ గండ్లు పడటంతో వరద జలాలు నిల్వ ఉండకుండా, దిగువకు వెళ్లిపోతున్నాయి. -
ఆశల సాగుకు కడగండ్లు
జి.కొండూరు: పులివాగులో వరద ఉధృతికి చెక్ డ్యామ్ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడ్డాయి. గండ్లను పూడ్చే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టలేదు. వరద వచ్చినప్పుడల్లా అంచులు కొద్దికొద్దిగా కోతకు గురై సాగు భూములు పులివాగులో కలిసిపోతున్నాయి. చెక్డ్యాముల్లో నిల్వ ఉండాల్సిన నీరు దిగువకు వెళ్లిపోతోంది. చెక్డ్యామ్ల వల్ల రైతులకు మేలు జరగకపోగా వాటికి పడుతున్న గండ్లతో నష్టం వాటిల్లుతోందని రైతులు పేర్కొంటున్నారు. గండ్లు పడి ఏడాదైనా పూడ్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు చెక్డ్యామ్ల నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇరిగేషన్శాఖ నిపుణులు చెబుతున్నారు. వాగు వెడల్పును బట్టి కాకుండా నిర్ణయించిన కొలతలతో డ్యామ్లను నిర్మించి అంచుల్లో మట్టి పోసి వదిలేయడం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని పేర్కొంటున్నారు. పులివాగు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా రెండు వైపులా వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఆక్రమించి, పూడ్చి సాగు చేయడం వల్ల వాగు వెడల్పు తగ్గిపోయింది. దీంతో వాగులో వరద ఉధృతి పెరిగినప్పుడు చెక్డ్యామ్ల వద్ద నీటి ప్రవాహం దిశ మార్చుకొని ప్రవహించి అంచులు కోతకు గురవుతున్నాయని వివరిస్తున్నారు. వాగులో కలిసిపోతున్న సాగు భూములు చెక్డ్యామ్ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడి నెలలు గడుస్తున్నా గండ్లను పూడ్చకపోవడంతో పక్కనే ఉన్న సాగు భూములు కోతకు గురవుతున్నాయి. అధికారులు ఈ గండ్లను అలానే వదిలేస్తే కొద్ది రోజులకి పక్కనే ఉన్న సాగు భూములు వాగులో కలిసిపోతాయని రైతులు ఆందోళన చెందు తున్నారు. చుక్కనీరు కూడా నిల్వకుండా కిందకు పోతోందని, చెక్డ్యామ్లు ఉండి కూడా ప్రయోజనం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాలకు లబ్ధి పులివాగులో వరద ప్రవాహాన్ని చెక్డ్యామ్లు, ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం వల్ల సుమారు 3,500 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. పులి వాగుపై సున్నంపాడు గ్రామం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా మునగపాడు కొత్త చెరువుకు సరఫరా కావడం వల్ల 384 ఎకరాలు సాగువుతోంది. చెర్వుమాధవరం వద్ద ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా జి.కొండూరు పంట చెరువు, ఆత్కూరు ఊర చెరువులకు నీరు సరఫరా చేస్తే 718.80 ఎకరాలకు, పినపాక ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా పినపాక గంగాదేవి చెరువుకు నీరు సరఫరా చేస్తే 487.09 ఎకరాలు, నరసాయిగూడెం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా నరసాయిగూడెం కొత్తచెరువుకు నీరు మళ్లిస్తే 439.41 ఎకరాలకు మేలు జరుగు తంది. చెక్డ్యామ్ల పరిధిలో మోటార్లు, ఇంజిన్ల సాయంతో రైతులు 1500 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు మా పొలాల వద్ద చెక్డ్యామ్కు ఒకవైపు అంచు కోతకు గురై భారీ గండి పడింది. ఇప్పటి వరకు గండిని పూడ్చలేదు. ఆ గండి వల్ల వరద వచ్చినప్పుడల్లా సమీప పొలాలు కోతకు గురై వాగులో కలిసిపోతున్నాయి. చెక్డ్యామ్ వద్ద చుక్క నీరు నిల్వడంలేదు. – కోన పాండురంగారావు(బుజ్జి), రైతు, మునగపాడు గ్రామం మా గ్రామం వద్ద పులివాగు చెక్డ్యామ్కు గండి పడింది. గండిని పూడ్చకపోవడం వల్లన వరద ప్రవాహం వచ్చినప్పుడు నీరంతా దిగువకు వెళ్లిపోతోంది. గండి పూడ్చితే చెక్డ్యామ్ వద్ద పూర్తిస్థాయిలో నీరు నిలిచి రైతులకు ఉపయోగపడుతుంది. చెక్ డ్యామ్లో నీరు నిలిస్తేనే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయి. – ఉమ్మడి ప్రసాద్, సర్పంచ్, తెల్లదేవరపాడు గ్రామం పులివాగుపై చెర్వుమాధవరం, మునగపాడు, తెల్లదేవరపాడు వద్ద ఉన్న చెక్డ్యామ్కు పడిన గండ్లను ఇప్పటికే పరిశీలించాం. వాటి మరమ్మతులకు సంబంధించి ప్రాథమిక అంచనాలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మరోసారి పరిశీలించి తుది అంచనాలు రూపొందిస్తాం. అనుమతి రాగానే గండ్ల మరమ్మతులు ప్రారంభిస్తాం. – టి.రాజేష్, ఇరిగేషన్ ఏఈఈ, జి.కొండూరు -
అదుపులోకి రాని అతిసార!
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ రాజరాజేశ్వరీపేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. నాలుగో రోజు సైతం అతిసార కేసులు నమోద య్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం రాత్రికి 194 కేసులు ఉండగా, శనివారానికి వాటి సంఖ్య 273కి పెరిగింది. అధికారులు మాత్రం అతిసార అదుపులోనే ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాస్పత్రితో పాటు, న్యూరాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొనసాగుతున్న సర్వే డయేరియా బాధితులను గుర్తించేందుకు న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన సర్వే కొనసాగుతోంది. వైద్య సిబ్బంది ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడుగుతుంటే, రెండు, మూడు ఇళ్లకు ఒక డయేరియా కేసుతో పాటు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా బయట పడుతున్నారు. ఆ ప్రాంతంలో డయేరియా, సీజనల్ జ్వరాలు ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. కలుషిత నీరే కారణం? అతిసారకు వందశాతం కలుషిత నీరే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం, ఇతర కల్తీ అయితే నాలుగు రోజుల పాటు డయేరియా కేసులు వచ్చే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం నీటి సర ఫరా పూర్తిగా నిలిపివేసినందున, ఎక్కడ కలుషిత మైందో గుర్తించి సత్వరమే అక్కడ మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు మాత్రం నీటి శాంపిళ్లు ల్యాబ్కి పంపించామని, రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. బాధితులకు పరామర్శ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను మంత్రి పి.నారాయణ, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి అధికారులకు సూచించారు. -
పత్రికా స్వేచ్ఛను భంగపరచడమే
పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు కక్ష సాధింపు మానుకోవాలి సాక్షి మీడియా ప్రజల గొంతుకై నిలిచింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే సంకల్పంతో పని చేస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ఏదైనా వార్తా కథనంపై అభ్యంతరాలు ఉంటే ఖండించ వచ్చు. వివరణ కోరవచ్చు. అలా కాకుండా పాత్రికేయులపై, ఏకంగా ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సహేతుకం కాదు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర కాలంలో సాక్షి మీడియాపై అనేక అక్రమ కేసులు బనాయించింది. ప్రజల గొంతుకగా మారిన సాక్షి గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఖండిస్తున్నా. మీడియాపై కక్ష సాధింపు మానుకోవాలి – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్చార్జి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండే పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం సబబు కాదు. వాస్త వాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షకట్టింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోనికి తెచ్చి ఎండగట్టడం తప్పు ఎలా అవుతుంది. సాక్షి గొంతు నొక్కే విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం ఆక్షేపణీయం. పాత్రికేయుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఉప్పాల హారిక, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం బాధాకరం. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. వాస్తవాలు రాసే సాక్షి అంటే కూటమి నాయకులకు అక్కసు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాలో నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపో తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. – డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి -
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్నాయుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కొత్త ఎస్పీగా వాసన విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గంగాధరరావును రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎస్పీల బదిలీల్లో భాగంగా సాగర్నాయుడు జిల్లా ఎస్పీగా రానున్నారు. సాగర్నాయుడు 24 సంవత్సరాలకే సివిల్స్లో 101 ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్వస్థలం భీమవరం. సాగర్నాయుడు ఎస్పీగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. దసరా ఉత్సవాల్లో పరోక్ష సేవా టికెట్ల విక్రయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే భక్తులకు దుర్గగుడి టికెట్లను విక్రయిస్తుంది. అయితే ప్రత్యక్ష టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలయ అధికారులు తెలపకపోవడం గమనార్హం. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన సేవల్లో పరోక్షంగా పాల్గొనేందుకు టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆన్లైన్ లింక్ ద్వారా సేవలు వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఈ టికెట్లపై అమ్మవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆలయ అధికారులు తేల్చి చెప్పేశారు. ఒక్కొక్క సేవలో పాల్గొనే వారు రూ.1500 చొప్పున, 11 రోజులకు రూ.11,116 చెల్లించాలని ప్రకటించారు. లోక్అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్అదాలత్ ద్వారా సత్వరమే కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్లో లోక్అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడదగిన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 16,599 కేసులు పరిష్కారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోని 42 బెంచ్లలో 16,599 కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. 15,111 క్రిమినల్ కేసులు, 169 సివిల్ కేసులు, 1001 చెక్ బౌన్స్లను పరిష్కరించగా, 100 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు రూ.5.2 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయని న్యాయమూర్తి గోపీ తెలిపారు. 218 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలో కోర్టులో 2,527 కేసులు, విజయవాడ కోర్టుల్లో 7,321, గుడివాడలో 2,619, నందిగామ కోర్టు 494, నూజివీడు 446, మైలవరం 201, జగ్గయ్యపేట 245, బంటుమిల్లి 91, కై కలూరు 263, తిరువూరు 403, గన్నవరం 826, అవనిగడ్డ 435, మొవ్వ 456, ఉయ్యూరు కోర్టులో 272 కేసులను పరిష్కరించామని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా విస్సన్నపేటలో 57.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా జి.కొండూరులో 44.1 మిల్లీమీటర్లు, రెడ్డిగూడెం 41.3, మైలవరం 31.0, ఇబ్రహీంపట్నం 30.0, ఎ.కొండూరు 27.8, తిరువూరు 25.3, గంపలగూడెం 22.6, వత్సవాయిలో 17.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. విజయవాడ ఈస్ట్లో 14.5 మిల్లీమీటర్లు, వీరులపాడులో 14.0, విజయవాడ సెంట్రల్, వెస్ట్ 13.3, విజయవాడ రూరల్ 13.2, నందిగామ 9.5, పెనుగంచిప్రోలు 8.1, జగ్గయ్యపేట 6.3, చందర్లపాడు 5.6, కంచికచర్ల 4.8, విజయవాడ నార్త్లో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పోర్టు పనులు మరింత వేగవంతం
ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కోనేరుసెంటర్(మచిలీపట్నం): బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ కల్లా రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన అధికారులతో కలిసి పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని, గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్ను శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తులు, రహదారులు, పరిపాలన భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై కృష్ణబాబు సమీక్షించారు. వర్కర్లు, యంత్రాలను పెంచి నిర్దేశించిన సమయానికి పోర్టు పనులను పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్టుతో రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరతాయన్నారు. మొత్తం 16 బెర్తుల్లో మొదటి దశలో నాలుగు పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మేర పనులు పూర్తయినట్లు తెలిపారు. గిలకలదిండి పనుల పురోగతిపై ఆరా.. త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ మార్గంతో పాటు పోర్టుకు సమీపంలోని జాతీయ రహదారులు, రైలు రవాణ మార్గాలను అభివృద్ధి చేయనున్నట్టు కృష్ణబాబు తెలిపారు. అందుకు సంబంధించిన డీపీఆర్లను (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. హార్బర్ పనులు నెమ్మదించాయని, ఈ నెలాఖరుకు పనుల్లో పురోగతి కనిపించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని కృష్ణబాబు హెచ్చరించారు. ఈ పర్యటనలో మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, జాయింట్ సీఎఫ్ఓ సతీష్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈ రాఘవరావు, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఇన్చార్జి డీఆర్ఓ శ్రీదేవి, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టీం లీడర్ చేతన్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు నాగభూషణం, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
దసరా ఏర్పాట్లలో అలసత్వం వద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఏర్పాట్లు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, ఎటువంటి అలసత్వం ఉన్నా, భక్తులకు అసౌ కర్యం కలిగినా ఇంజినీరింగ్ అధికారులదే బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించు కుని చేపట్టిన ఏర్పాట్లను పోలీసు, దేవస్థానం అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరిశీలించారు. నాలుగు గంటల పాటు ఆలయ పరిసరాల్లో కలియ తిరిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. తను గుర్తించిన పలు లోపాలను ఆలయ ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులకు తెలిపి వెంటనే సరి చేయా లని ఆదేశించారు. తొలుత ఘాట్రోడ్డు నుంచి ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వరకు క్యూ లైన్లలో నడిచి వెళ్లిన కలెక్టర్ లక్ష్మీశ తాగునీరు, క్యూ లైన్లలో ఫ్యాన్లను సరి చేయాలని సూచించారు. కొండ దిగువన, క్యూలైన్ల మధ్యలో కార్పొరేషన్ సహకారంతో టాయి లెట్లు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లను పంపిణీ చేయాలని సూచించారు. లక్ష్మీగణపతి విగ్రహం వద్ద గతంలో కొండ రాళ్లు విరిగి పడిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. మళ్లీ రాళ్లు విరిగిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘డయేరియా బాధితులకు సరైన వైద్య చికిత్స అందించడం లేదు’
విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 13వ తేదీ) న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితుల వైద్య శిబిరాన్ని మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పోరేటర్ దేవిలు పరామర్శించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఇంకా వందమందికి పైగా జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు. డయేరియా ప్రబలి నాలుగు రోజులు అయినా ప్రభుత్వంలో సరైన స్పందన లేదు. అధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోంది. డయేరియా బాధితులకు సరైన వైద్య చికిత్స కూడా అందించడం లేదు. మంత్రులు మొక్కుబడిగా డయేరియా బాధితులను చూసేందుకు వస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి డయేరియా విషయంలో మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం. డయేరియాతో కళ్ళు ఎదుటీ ఒక వ్యక్తి చనిపోతే అది డయేరియా మృతి కాదని కప్పిపుచ్చే చర్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తోంది. డయేరియా కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. డయేరియా పరబలి నాలుగు రోజులైనా నేటికీ రిపోర్టు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంచినీటి కాలుష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ప్రజలంతా చెపుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరు విత్తనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి మంచి నీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి. ట్యాపుల ద్వారా రక్షిత మంచినీరు శుభ్రంగా ఉందా లేదా పరిశీలన చేసిన తర్వాతే వదలాలి. జరిగిన ఘటనపై క్షేత్రస్థాయి విచారణ చేసేందుకు వైఎస్ఆర్సిపి వైద్యుల బృందం ఆదివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించనుంది. డయేరియాతో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని మునిసిపల్ మంత్రి కనీసం పరామర్శించకపోవడం, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం దారుణం’ అని ధ్వజమెత్తారు.మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ డయేరియా ఘటన జరగి నాలుగు రోజులు అయినా దేని కారణంగా డయేరియా వచ్చిందో ప్రభుత్వం తేల్చలేక పోతోంది. లేదంటే రిపోర్టులు వచ్చినా ప్రభుత్వం కావాలనే దాచి పెడుతుందా? అర్థం కావడం లేదు. డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని మండిపడ్డారు. -
పీపీపీ అంటే పే ఫర్ ప్రాజెక్టుగా అర్థం మార్చేశారు: సీదిరి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పండగ సందర్భంగా మెగా సెల్ పెట్టినట్లు ఫ్రీ గా మంత్రులు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్కి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘పీపీపీ మంచిదని మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రైవేట్కి మెడికల్ కాలేజీలు ఇవ్వడం ట్రయిల్ రన్గా మొదలు పెట్టారా? అంటూ అప్పలరాజు ప్రశ్నించారు.‘‘భవిష్యత్లో ఎన్ని చూడాలో.. టూరిజం కూడా ప్రైవేట్కి ఇచ్చేశారు.. అన్ని టూరిజం కార్యాలయాలను అమ్మకాలకు పెట్టారు. మంత్రులకు సిగ్గు ఉందా?. మంత్రులు రాజీనామా చేసి వల్ల పదవులు కన్సల్టెన్సీకి ఇవ్వండి.. వాళ్లు ప్రభుత్వం నడుపుతారు. మంత్రి పదవులు కాపాడుకోవడానికి పీపీపీని సమర్థిస్తారా?. పీపీపీ బాగుంటే, బ్రహ్మాండంగా ఉంటే ఎయిమ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అప్పల రాజు నిలదీశారు.టెక్నాలజీ మెరుగుపరచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. హోంమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫెయిల్యూర్ మంత్రులు. ఏది అడిగిన డబ్బులు లేవని అంటున్నారు.. మరి రెండు లక్షల కోట్లు అప్పు ఎక్కడ?. నచ్చిన పని చేయడానికి లక్షల కోట్లు అప్పులు చేస్తారు. పేద ప్రజలకు సీట్లు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఉన్నట్లు నడిపితే 2500 కోట్లు మిగులుతుంది. 11 వేల కోట్లు లాస్ట్ 5 ఏళ్లలో ఖర్చు చేశాం. కోటి 43లక్షల కుటుంబాలకు 3575 కోట్లు ఖర్చు అవుతుంది...2500 రూపాయల చొప్పుమ 4075 కోట్లు ప్రీమియం ఇస్తున్నారు.. ఏడాదికి 5 కాలేజీలు ప్రారంభించండి. 8400 కోట్లు 17 మెడికల్ కాలేజీలకు బడ్జెట్ అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా మెడికల్ కాలేజీలు నిర్మించాలో గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సోషలో మీడియాలో అసత్యాలు మాట్లాడే వాళ్లపై కేసులు పెట్టాలి అంటే అనిత మీద పెట్టాలి. 24-25 సంవత్సరంలో క్లాసులు తరగతులు నిర్వహించడానికి అవసరం అయినా పనులు పూర్తయినట్లు ఈనాడులో రాసారు. మెడికల్ కాలేజీలు తానే తీసుకొని వచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెపుతున్నాడు...గతంలో ఎప్పుడో వచ్చిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు, తిరుపతిలో మెడికల్ కాలేజీలు 2014 జూన్లో ప్రారంభం అయితే అదే నెలలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎలా పర్మిషన్ తీసుకొని వస్తారు. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అమ్మడం అంటే అంత కంటే దౌర్భాగ్యం ఉండదు. 2015 లో వేసిన సీఆర్డీఏకి వేసిన పునాది ఫొటోస్ నేడు గూగుల్లో చూపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, బాపట్ల బిల్డింగ్స్ గూగుల్లో కనిపిస్తాయి...పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ కాలేజీల గురించి మంత్రి అనిత తగ్గించి మాట్లాడతారా? ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ అని చంద్రబాబు ఒక పుస్తకం రాశాడు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కి అమ్మేయడాన్ని పొగుడుకొంటూ ఆయనకు ఆయన రాసుకున్నారు. పీపీపీ అంటే పే ఫర్ ప్రాజెక్టుగా అర్థం మార్చేశారు. టూరిజం డిపార్ట్మెంట్లు, హాస్పిటల్, ఆరోగ్యశ్రీ అన్ని ఇచ్చేసారు.. రాష్టాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టేసారు. లులూ మాల్కి ప్రైమ్ లొకేషన్లో ఫ్రీగా స్థలం ఇచ్చేశారు. పీపీపీకి ప్రైవేట్ కాలేజీలు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేదంటే పోరాటం చేస్తాం’’ అని అప్పలరాజు హెచ్చరించారు. -
‘పచ్చ’ బరితెగింపు.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత
సాక్షి, కృష్ణా జిల్లా: మోపిదేవిలంకలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చేశారు. టీడీపీ నేతల దాడిలో విజయ్కుమార్కు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే నెపంతో ఈడే విజయ్ కుమార్ ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. తమ ఇల్లు కూల్చొద్దని విజయ్ కుమార్ కుటుంబం వేడుకున్నా కానీ వారిని దౌర్జన్యంగా టీడీపీ నేత అనుచరులు పక్కకు లాగేసి పడేశారు. టీడీపీ నేత దాడిలో గాయపడిన విజయకుమార్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రీ రమేష్ బాబు శనివారం పరామర్శించారు. దౌర్జన్యంగా విజయ్ ఇంటిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారని.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పేదల ఇల్లు పడగొట్టి పాపం కూడగట్టుకుంటున్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని సింహాద్రీ రమేష్బాబు డిఆమండ్ చేశారు. -
సుస్వరాల కోయిలకు కీర్తి కిరీటం
విజయవాడ కల్చరల్: ఆమె గాత్రంలోని మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.. వయోలిన్పై ఆమె చేసే స్వర విన్యాసం సంగీత ప్రియులకు పరవశించేలా చేస్తుంది. ఆమె వేదికపై ఉందంటే సంగీత అభిమానులకు పండుగే. ఆమే విజయ వాడకు చెందిన వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గాభవాని. విఖ్యాత హరికథా భాగవతార్ కుమార్తెగా ఆమె సంగీత రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానానికి ఇప్పుడు కీర్తి కిరీటం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. సంగీత ప్రస్థానం సాగిందిలా.. బీవీ దుర్గాభవాని బహుముఖ ప్రతిభాశాలి. అటువాయిలీనం, ఇటు గాత్రం.. రెంటినీ సమర్థంగా పోషించగల సంగీత సవ్యసాచి. ఆమె 1965లో విజయవాడలో జన్మించారు. తండ్రి విశ్వనాథ భాగవతార్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అటు గాత్రంలోనూ ఇటు వయోలిన్లోను ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ విద్వాంసురాలిగా పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరేళ్లపాటు వయోలిన్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను సార్థకం చేసుకున్నారు. ప్రముఖుల సరసన.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, టీఎన్ శేషగోపాలన్, ప్రపంచం సీతారాం, టీఎం కృష్ణ, బోంబే సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్తోపాటు పలువురు విద్వాంసులకు వాద్య సహకారమందించారు. అందుకున్న అవార్డులు.. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, మద్రాస్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రసిక రంజని, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలు ఆమెకు పురస్కారాలను అందజేశాయి. కాగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగా ల్లోని ప్రతిభావంతులకు అందించే కీర్తి పురస్కారానికి దుర్గా భవానీ ఎంపికై ంది. ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సభల్లో రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు అందజేయనుంది. వయోలిన్ విద్వాంసురాలు దుర్గాభవానీకి తెలుగు వర్సిటీ పురస్కారం -
డబ్బులు దండుకునేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవీ శరన్నవరాత్రుల సమయంలో నగరంలో ఆధ్మాతిక శోభ వెల్లివిరుస్తుంది.. అలాంటి సమయంలో ఈ వేడుకలకు పోటీగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అంటే దసరా ప్రాధాన్యతను తగ్గించడం కాదా అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు దండుకునేందుకే స్థానిక ఎంపీ విజయవాడ ఉత్సవ్ను తెరపైకి తెచ్చారని అవినాష్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు దీనిని ఖండించాలన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ చూపడం మానేసి.. విజయవాడ ఉత్సవ్ మీద దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలందరినీ కలుపుకుని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. దసరా ఉత్సవాలకు పోటీగా మరొకటి నిర్వహించే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో నిరోధిస్తామని హెచ్చరించారు. 40 ఎకరాలు కబ్జా.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయని అవినాష్ ఆరోపించారు. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలోని దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు గానీ దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు దేవాలయాల భూముల్లో కట్టడం ఏమి టని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. రూ.450 కోట్లు విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తున్నారని, కూటమి నేతలు ఏమి చెబితే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారన్నారు. -
జనసేన రౌడీల దుశ్చర్య
మచిలీపట్నంటౌన్: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త మద్దాల సతీష్ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు. అందుకే కక్షకట్టారు.. ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ బాబు తదితర వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్ వాయిస్ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్ వీడియోలో సతీష్ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. -
సర్కారు బడుల సత్తా
కృష్ణా జిల్లాలో ఐదు స్కూళ్లకు బెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్లెన్సీ అవార్డులుకంకిపాడు: విద్యార్థుల వికాసానికి చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చదువు, తద్వారా వచ్చే మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల జీవితం తరగతి గదుల్లోనే మగ్గుతోంది. రానురాను విద్యార్థులు శారీరక వికాసానికి దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు పాఠశాలలు విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలు, అథ్లెటిక్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో తలపడుతూ పతకాలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఎక్స్లెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో కృష్ణాజిల్లాకు చెందిన ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్స్లెన్స్ అవార్డులను అందుకుని ఆదర్శంగా నిలిచాయి. సత్తా చాటుతున్న విద్యార్థులు.. క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆట స్థలంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు అందించే ప్రోత్సాహం, తర్ఫీదుతో మెరికల్లా మారుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పతకాలు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులను జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు తమ సొంతం చేసుకున్నాయి. జెడ్పీ పమిడిముక్కల, జెడ్పీ గూడూరు, సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం, జెడ్పీ (బాలికలు) గన్నవరం, జెడ్పీ గొడవర్రు పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎక్స్లెన్స్ అవార్డులను దక్కించుకున్నాయి. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ప్రధానంగా హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. వారికి అవసరమైన పోషకాహారాన్ని అదనంగా అందజేస్తూ శారీరకంగా దృఢంగా ఉండేలా తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్త్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో 25 నుంచి 40 మంది విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెస్తున్నారు. పాఠశాల పేరు లభించిన లభించిన పాయింట్లు స్థానం జెడ్పీ పమిడిముక్కల 192 ప్రథమస్థానం జెడ్పీ గూడూరు 107 ద్వితీయ స్థానం సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం 100 తృతీయ స్థానం జెడ్పీ (బాలికలు) గన్నవరం 93 నాలుగో స్థానం జెడ్పీ గొడవర్రు 44 ఐదో స్థానం విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తోంది. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తూ తర్ఫీదు ఇస్తూ వారికి మెలకువలు నేర్పుతున్నారు. ఏటా వివిధ స్థాయి లో విద్యార్థులు పతకాలు దక్కించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. – కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, హెచ్ఎం, జెడ్పీ గొడవర్రు మైదానాన్ని సిద్ధం చేసుకోవటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కీలకమైన అంశం. ఇందుకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూత కూడా మరువలేనిది. విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభ చాటేలా మెలకువలు నేర్పుతున్నాం. – కె.టాన్యాగిరి, పీడీ, జెడ్పీ గన్నవరం(బాలికలు) -
అంతుచిక్కని అతిసార
లబ్బీపేట/అజిత్సింగ్నగర్: న్యూరాజరాజేశ్వరి పేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మృతుల సంఖ్య కూడా మూడుకు చేరింది. ప్రజలు అతిసార బారినపడటానికి ఖచ్చితమైన కారణాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. పూటపూటకీ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారగా, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తుండటం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ దాదాపు 194 మంది డయేరియా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అధికారుల దృష్టికి రానివారు మరో 20 మంది వరకూ ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే అతిసారతో ఇద్దరు మృతిచెందగా, వాంతులు విరచేనాలతో బాధపడుతూ తాజాగా శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతిచెందారు. జీజీహెచ్లో 106మంది రోగులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి డయేరియా రోగులు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం 106మంది అతిసార బాధితులు చికిత్స పొందుతుండగా, 88మంది డిశార్జి అయ్యారు. బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారణాన్ని గుర్తించని వైనం.. అతిసారకు గల కారణాన్ని అధికారులు సైతం ఇప్పటివరకూ ప్రకటించలేదు. వినాయకుని వేడుకల్లో భోజనాలు చేశారని కొందరు, వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే వాంతులు అయ్యాయని మరికొందరు చెబుతున్నారు. మంత్రులు సైతం ఇదే విషయాలను చెప్పుకొస్తున్నారు. భారీసంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారంటే నీటి కలుషితమే కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ సరఫరా చేసే నీటితోపాటు భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితమైనట్లు సమాచారం. నీటికి సంబంధించి ప్రాథమిక పరీక్షలో నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నీటిసరఫరాను సైతం పూర్తిగా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాను కూడా నిలిపివేసి, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ క్యాన్లను అందిస్తున్నారు. బ్లీచింగ్తో కంటితుడుపు చర్యలు.. న్యూరాజరాజేశ్వరీపేటలో ప్రజలు ప్రాణాలు పోతున్నా... ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారుల తీరు మాడరం లేదు. కేవలం ప్రజల కళ్లకు కనబడేలా ప్రధాన రహదారులపై బ్లీచింగ్ చల్లి.. ౖపైపెన కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప.. వాస్తవంగా నివాస ప్రాంతాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదు. అధ్వానంగా పారిశుద్ధ్య పరిస్థితి.. డయేరియా వెలుగు చూసి 72 గంటల సమయం గడిచినా కూడా నేటికి న్యూరాజరాజేశ్వరీపేట అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నడిరోడ్లపైనే పదుల సంఖ్యలో పందులు సంచరిస్తూ ఉన్నాయి. కాలువలన్నీ చెత్తతో నిండిపోగా.. అపార్ట్మెంట్ల మధ్య స్థలాలు మురుగునీటితో తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక అపార్ట్మెంట్ల డ్రెయినేజీ పైపులన్నీ గతేడాది బుడమేరు వరదలో పగిలిపోగా నేటికి వాటి పరిస్థితి అలానే ఉండడంతో ఆ మురుగు, వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి నివాసాల ముందు పారుతుండటం గమనార్హం. ఇక మంచినీటి పైపులైన్లు కూడా పగిలిపోవడంతో పక్కనే ఉన్న మురుగునీరు పైపుల్లో చేరుతూ కలుషితనీరే సరఫరా అవుతోందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాది 17వ నంబర్ బ్లాకు.. ఈ ఇళ్ల మధ్య మురుగు, చెత్త తొలగించకపోతుండటంతో దుర్వాసనకు ఇళ్లల్లో అస్సలు ఉండలేకపోతున్నాము. తరచూ జ్వరాలు, వాంతులు, విరేచనాల సమస్యలతో అల్లాడిపోతున్నాం. శశిరేఖ, 17వ బ్లాకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో న్యూరాజరాజేశ్వరపేటలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో దాదాపు నగరంలోని వైద్యసిబ్బంది అంతా అక్కడే పనిచేస్తున్నారు. అంతేకాకుండా నగర సమీపంలోని పీహెచ్సీలు, వెల్నెస్ సెంటర్ల నుంచి సీహెచ్ఓలకు కూడా డ్యూటీలు వేశారు. ఇప్పటివరకూ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటిని రెండు, మూడుసార్లు సర్వేచేసి జల్లెడ పట్టారు. అయినప్పటికీ అతిసారకు కారణం మాత్రం కనుగొనలేకపోవడం గమనార్హం. వాంతులు, విరోచనాలు అవుతున్న వారికి మాత్రం సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర పరిధిలో ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో అతిసార వ్యాధితో కొందరు బాధపడుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను తనిఖీ చేశారు. నగర పరిధిలో మొత్తం 216 ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా, తాజాగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్లేని 51 దుకాణాలను సీజ్ చేశారు. 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట పరిధిలోని తొమ్మిది చికెన్ షాపులు, ఒక బీఫ్ షాపును వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్రెడ్డి మూసి వేయించారు. అదే ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేసి 24 ఆహార దుకాణాలను సైతం మూసివేయించారు. -
యూపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈనెల 14వ తేదీన జరగనున్న యూపీఎస్సీ– నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (2), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (2) పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్డీఏ అండ్ ఎన్ఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ అబ్జర్వర్ హరీష్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి లైజన్ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రెవెన్యూ, రవాణా, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈనెల 14న విజయవాడలో ఆరు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. సీడీఎస్కు 672 మంది, ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షకు 718 అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీడీఎస్ పరీక్ష మూడు షిఫ్ట్ల్లో, ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష రెండు షిఫ్ట్ల్లో ఉంటుందని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఆశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్స్టేషన్, రైల్వేస్టేషన్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తూ.చ.తప్పకుండా పాటించాలన్నారు. పరీక్ష సజావుగా జరిగేలా పోలీసుశాఖ తగిన భద్రత కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఇది పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వదాడి..
పత్రిక ఎడిటర్కి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించి వార్తలను సాకుగా చూపి క్రిమినల్ కేసులు పెట్టడం దారుణమైన విషయం.ఇటువంటి చర్యలు పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వ ప్రత్యక్ష దాడి తప్పించి మరొకటి కాదు. మీడియాపై ప్రభుత్వం చేసే ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.‘సాక్షి’పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని స్టేట్స్ స్మాల్ అండ్ మీడియం న్యూస్పేపర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి మీడియాపై కక్ష సాధింపు ధోరణి తగదు. సీహెచ్ రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి, సామ్నా -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్సలెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. విజయవాడ కల్చరల్: సంగీత విద్యాంసురాలు బీవీ దుర్గాభవానిని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. నూతనంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా హిమాన్షు శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతికశుక్లా నియమితులైన నేపథ్యంలో శుక్రవారం వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితులతో వేదాశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు భూమిపూజ నందిగామటౌన్: వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని వైద్యారోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నందిగామలోని డీవీఆర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న వంద పడకల ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్లతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే నందిగామ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, నాయకులు మండవ కృష్ణకుమారి, కోట వీరబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి?: సీదిరి అప్పలరాజు
సాక్షి, విజయవాడ: న్యూఆర్ఆర్ పేటలో డయేరియా అదుపులోకి రాలేదు. మెడికల్ క్యాంప్లకు బాధితులు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామంటున్న బాధితులు చెబుతుండగా.. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అంటోంది. డయేరియాతో ఇద్దరు చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుండగా.. డయేరియా మరణాలను చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్ క్యాంప్లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు. మెడికల్ క్యాంప్ను విజిట్ చేసి బాధితులను పరామర్శించాం. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు.‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైఎస్ జగన్ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్ జగన్ నాలుగు యూపీహెచ్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు...క్యాంటమ్ కంప్యూటర్ అంటాడు. క్యాంటమ్ కంప్యూటర్ తో డయేరియా తగ్గించు. మాట్లాడితే ఏఐ టెక్నాలజీ అంటాడు. రండి ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా?. యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?. నేపాల్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేశామని నిన్న ఓ మంత్రి షో చేశాడు. ఆర్టీజీఎస్లో కూర్చున్నామని ఊదరగొట్టాడు. ఇక్కడ డయేరియా బాధితుల మాటేమిటి?. చంద్రబాబుకు ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల సేఫ్టీపై లేదు. మున్సిపల్ మంత్రికి అమరావతిలో భూములు అమ్మడం పైనే దృష్టి. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు...వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడంపైన ఉన్న శ్రద్ధ ప్రజల పై లేదు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి?. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన కావాలి. గతేడాది గుర్ల గ్రామంలో డయేరియాతో 13 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారు?. ఇదేనా ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ. స్థానిక ఎమ్మెల్యేకు కలెక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ స్థానిక సమస్య పట్ల లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మరణాలను దాచేస్తోంది. తక్షణమే న్యూ ఆర్.ఆర్.పేటను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాలి. ఇంటింటికీ ఒక వాటర్ టిన్ సప్లై చేయాలి’’ అని అప్పలరాజు డిమాండ్ చేశారు. -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
సకాలంలో పనులన్నీ పూర్తి చేయండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లు, సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ పాయింట్లు, కేశఖండనశాలను పరిశీలించారు. హోల్డింగ్ పాయింట్లు పెంచాలి.. ఈ ఏడాది భక్తులను హోల్డింగ్ పాయింట్ ద్వారా క్యూలైన్లోకి అనుమతించాలని, అదే విధంగా రద్దీకి అనుగుణంగా పాయింట్లను పెంచాలని నిర్ణయించారు. క్యూలైన్లలో భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారు ఏ విధంగా బయటకు రావాలనే అంశాల గురించి ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదోడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై భక్తులకు సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో దుర్గగుడి ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
లాఠీలతో కలాన్ని అణచలేరు..
లాఠీలతో కలాన్ని అణచలేరు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీస్స్టేషన్కు పిలవగలరేమోగాని, పత్రికను నిజాలు రాయకుండా ఆపటం ఎవరివల్లా కాదు. అది ప్రపంచ నియంతల వల్లే కాలేదు. మూడు సంవత్సరాల్లో కూలిపోయే ఈ ప్రభుత్వం నిజాలు వార్తగా రాసే కలాన్ని అదిరించలేదు, బెదిరించలేదు. పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్రపు హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. – పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు -
కన్న తండ్రే కడతేర్చాడు!
మైలవరం: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు. రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు. ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు. చంపేసి.. విసిరి పారేసి.. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
సర్కారు తమాషా
ఎరువుల గోస..14 నెలలుగా ‘గౌరవం’ లేదుమచిలీపట్నంటౌన్: జిల్లాలో యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. జిల్లా వ్యాప్తంగా సరిపడినంత యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా యూరియా కొరత అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పోడియంను ముట్టడించారు. ఈ చర్చ జరిగే సమయంలో సభలో సభ్యుల వద్దకు పోలీసులు రావటాన్ని సభ్యులు తప్పుపట్టారు. కొరతే లేదంటూ వితండవాదం.. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి జిల్లాలో యూరియా కొరత లేదంటూ పేర్కొనటంతో పెదపారుపూడి ఎంపీపీ గోదం సురేష్తో పాటు జెడ్పీ వైస్చైర్మన్ గుదిమళ్ల కృష్ణంరాజు, గన్నవరం, కృత్తివెన్ను, కంచికచర్ల జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి, మైలా రత్నకుమారి, వేల్పుల ప్రశాంతి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని పేర్కొనడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంత మేర వరి సాగవుతోంది? దీనికి ఎంత మేర యూరియా అవసరమవుతుందో లెక్కకట్టి, ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించలేదన్నారు. పీఏసీఎస్లకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటంతో చైర్మన్ కనుసన్నల్లో యూరియా వారి పార్టీకి చెందిన వారికి, పెద్ద రైతులకు దొడ్డిదారిన ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పంట పొట్టదశకు చేరిందని ఇప్పటికీ యూరియా పూర్తిస్థాయిలో అందకపోవటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బదులిస్తూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే తొలి పంట వర్షాలకు దెబ్బతినటంతో మళ్లీ నాట్లు వేశారని, ముంపు బారిన పడిన పొలాలు మళ్లీ ఊడ్చారని దీంతో యూరియా మళ్లీ అవసరం కావటంతో కొరత ఏర్పడినట్లు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్కు అనుగుణంగా యూరియాను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొంత చేరిందని, మరికొంత రానున్న రోజుల్లో చేరుతుందన్నారు. ● 2024 ఆగస్టులో తువ్వకాలువకు వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వరకు 20 గండ్లు పడి దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు కావటం లేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీతో పాటు పలువురు జెడ్పీటీసీలు పేర్కొ న్నారు. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.1.60 కోట్లను మంజూరు చేసినా, పనులు చేపట్టకపోవటంతో ఇప్పటికీ మూడు పంటలను రైతులు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. గండ్లకు సంబంధించిన ఫొటోలతో మేట వేసిన పొలాల ఫొటోలను వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ వారికి హామీ ఇచ్చారు. ● జెడ్పీటీసీ, ఎంపీపీలకు కూటమి ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రొటోకాల్ ప్రాధాన్యం ఇవ్వటం లేదని సభ్యులు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకాలపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు ప్రొటోకాల్కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు ఫొటోలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ బాలాజీలకు చూపించారు. ఇకపై నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ● భోజన విరామం జరిగిన అనంతరం సభలో పంచాయతీరాజ్ డీఈ నగేష్ తాము జిల్లా కలెక్టర్కు శిలాఫలకం ప్రొటోకాల్ను పంపుతామని ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాటిని పెడుతున్నామని పేర్కొన్నారు. జేసీ గీతాంజలిశర్మ కలుగజేసుకుని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇకపై ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ● రెండు నెలల కిందట గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రథమ మహిళకే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కలెక్టర్ బాలాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ.. ఎస్పీ గంగాధరరావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తాను కూడా పర్సనల్గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు.జిల్లాలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ సమస్యలను లేవనెత్తేందుకు నిర్వహించే ప్రధాన సమావేశమైన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం పట్ల తాము అధికారులకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న జెడ్పీ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరుకాకపోవటం గమనార్హం.14 నెలలుగా గౌరవవేతనం రావటం లేదని, ఇది త్వరితగతిన ఇప్పించాలని జెడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్ను కోరారు. గౌరవవేతనం రాకపోవటంతో మండల పరిషత్ సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు హాజరుకామని చెబుతున్నారని, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీలకు జెడ్పీ నిధుల నుంచి గౌరవ వేతనం చెల్లించేలా సమావేశంలో తీర్మానించారు. నందిగామ మండలం రాఘవాపురంలో అక్రమ మట్టి తోలే క్రమంలో ఆపరేటర్, లారీ డ్రైవర్ మట్టి కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేయించాలని కంచికచర్ల, నందిగామ జెడ్పీటీసీలు వేల్పుల ప్రశాంతి, జి. వెంకటేశ్వరరావు తదితరులు అధికారులను కోరారు. విద్యపై జరిగిన చర్చలో తల్లికి వందనం పథకం ద్వారా చాలా మండలాల్లో తల్లులకు రూ. 6వేలు, 7వేలు మాత్రమే పడ్డాయని కొంత మందికి అసలు పడలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డీఈవో రామారావును కోరారు. సమావేశంలో నూజివీడు సబ్కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ‘హెల్త్ ఫస్ట్–1991’
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్ను గురువారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్లో 14 వేల మందికిపైగా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన సభ్యులు అనుసంధానమై ఉంటారని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుల వైద్య సేవల కోసం ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ, అన్ని రకాల సేవలు దానిలో కవర్ కావడం లేదని, దీంతో చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి, 1991 బ్యాచ్ పోలీసు అధికారులు చొరవ చూపినట్లు తెలిపారు. 29 ప్రత్యేక విభాగాల్లో.. జిల్లాలోని 26 ప్రముఖ హాస్పిటల్స్తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్తో పాటు, వైద్య ఖర్చులో 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగా 29 ప్రత్యేక విభాగాల్లో 106 మంది డాక్టర్లు స్పందించి పోలీసులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ కేజీవీ సరిత, 1991 అధికారులు పాల్గొన్నారు. పెడన: మండలంలోని బలిపర్రు గ్రామంలో ఉన్న లిల్లి స్వయం సహాయక సంఘం(ఎస్హెచ్జీ) సభ్యురాలు కొణతం వినీత కలంకారి యూనిట్ను గురువారం సెర్ప్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మోర్డ్, ఎన్ఆర్ఎల్ఎం జాతీయ స్థాయి మేనేజరు లక్ష్మీకాంత్ పరసర్, జిల్లా ఏడీ శ్రీధరరావు కలంకారీ తయారీదారులతో మాట్లాడి ఎంటర్ప్రెన్యూర్గా వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు వాల్మీకి, సత్యభామ, శోభారాణి పాల్గొన్నారు.యాప్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
దూసుకొస్తున్న మృత్యువాహనాలు
జి.కొండూరు: అక్రమ మైనింగ్ క్వారీల నుంచి మెటల్, కంకర, గ్రావెల్, బూడిద చెరువు నుంచి బూడిద రవాణా చేసే వెయ్యికి పైగా టిప్పర్ లారీలు ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. లారీలు బోల్తా పడడం, ఓవర్టేక్ చేస్తూ ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి జీవనోపాధిని కోల్పోతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న టిప్పర్ల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడింగ్తో ప్రమాదం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో నిర్వహిస్తున్న రాతి క్వారీలలో కంకర, భారీ బండరాళ్లు, గ్రావెల్ను తరలించేందుకు రోజుకి 500 టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడిదను తరలించేందుకు రోజూ 400 లారీల వరకు తిరుగుతుంటాయి. ఈ క్వారీలు, బూడిద చెరువు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలు, రహదారులకు నిత్యం వందలాది లారీలతో మెటల్, గ్రావెల్, బూడిద తరలిస్తుంటారు. టిప్పర్ లారీకి సైజును బట్టి 25 నుంచి 30 టన్నులకు మించి రవాణా చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఎక్కువ కిరాయి కోసం 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు కూడా లోడు చేసి రవాణా చేస్తున్నారు. డ్రైవర్లు గ్రామాల్లో చిన్న రోడ్లలో సైతం మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలను నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2న మునగపాడు చెరువు వద్ద కంకర లోడుతో వెళ్తూ బోల్తాపడి దగ్ధమైన టిప్పర్ లారీ జూన్ 6న ఇబ్రహీంపట్నం ట్రక్కు టర్మినల్ వద్ద బోల్తాపడిన బూడిద లోడుతో ఉన్న టిప్పర్ లారీ టిప్పర్ మే సవాల్ గ్రావెల్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి టిప్పర్ లారీలను చూస్తే భయమేస్తోంది గ్రావెల్, కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కువ ట్రక్కులు రవాణా చేస్తే కమీషన్ ఎక్కువ వస్తుందని డ్రైవర్లు వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి. –పెయ్యల ప్రతాప్, గ్రామస్తుడు, వెలగలేరు జి.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని గ్రావెల్ లారీ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... జి.కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన తొర్లికొండ శివయ్య(60) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య గురువారం ఉదయం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పని కోసం కవులూరు వెళ్తున్నాడు. కవులూరు గ్రామ శివారులోకి రాగానే వెనక నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్ రోడ్డు మార్జిన్ వైపు పడిపోగా వెనక కూర్చున్న శివయ్య లారీ కింద పడిపోయాడు. శివయ్యపైకి లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివమ్మ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
అతిసార పాపం ఎవరి పుణ్యం?
అధికారిక లెక్కలు ఇలా... లబ్బీపేట(విజయవాడతూర్పు): అతిసారకు కారణం ఏమిటంటే.. ఉత్సవాల్లో వడ్డించిన భోజనాలే అని అధికారులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు పగలు వండిన వంటకాలు రాత్రి తిన్నారని అందుకే ఇలా...అని అంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం పైప్లైన్ల నుంచి రంగు మారిన నీరు, దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. పెరుగుతున్న బాధితులు అతిసార బాధితులు గురువారం సాయంత్రం వరకూ ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారిని ప్రత్యేక వార్డుల్లో అడ్మిట్ చేసి జనరల్ మెడిసిన్ నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు అవడానికి కలుషిత ఆహారం కారణమని అధికారులు చెబుతున్నారు. వంద మందికి పైగా ఎఫెక్ట్ కావడంతో నీరు కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తూ ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. వైద్య సేవల పర్యవేక్షణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను గురువారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కూడా ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అతిపెద్ద ఎపిడమిక్ సమస్య కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల క్లినిక్స్(ఆర్ఎంపీ)లను మూసివేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 మంది డయేరియా బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 61 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇంకా 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వారిలో పెద్దవాళ్లు కొత్తాస్పత్రిలో, చిన్నారులు పాత ఆస్పత్రిలోని పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. -
ఏఎన్యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఆ విషయం బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం కృష్ణలంక (విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీకి సాగిలపడుతున్నాయని తెలిపారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు అవకాశం ఇచ్చిన వారవుతారని అన్నారు. ఈ ఏడాది కాలంలో భారత రాజకీయాల్లో వస్తున్న పెనుమార్పులు, అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు వారి పాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి లేని లోటు కనిపిస్తోందన్నారు. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చాయంటే వామపక్షాలు, అందులోనూ సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించడం వలనే సాధ్యమైందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ప్రజాస్వామ్యం పట్టడం లేదన్నారు. భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీ
విజయవాడ: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ జరిగింది. 12 జిల్లాల కలెక్టర్లను బదితీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్వతీపురం, విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఆ 12 జిల్లాల కలెక్టర్లుగా నియమితులైనవారు..1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి2. విజయనగరం – రామసుందర్ రెడ్డి3. తూర్పు గోదావరి – కీర్తి చేకూరి4. గుంటూరు – తమీమ్ అన్సారియా5. పల్నాడు – కృతిక శుక్లా6. బాపట్ల – వినోద్ కుమార్7. ప్రకాశం – రాజా బాబు8. నెల్లూరు – హిమాన్షు శుక్లా9. అన్నమయ్య – నిషాంత్ కుమార్10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి11. అనంతపురం – ఓ.ఆనంద్12. సత్య సాయి – శ్యాంప్రసాద్ -
డయేరియా బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్లో డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు మండిపడ్డారు. గంటగంటకూ బాధితులు పెరుగుతున్నారని.. వారికి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేకపోతోందన్నారు.‘‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. మంచినీటి వల్లే సమస్య వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వల్ల అంటున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా నీటి వల్ల కాదని ఎలా నిర్ధారిస్తారు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘మెడికల్ క్యాంప్కు వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. మున్సిపల్ మంత్రి వచ్చి చూసి వెళ్లిపోయారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోవటం వల్లే ఈ పరిస్థితి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 48 గంటల నుంచి ఈ ప్రాంతం భయంకరమైన వాతావరణంలో ఉంటే అధికారులు మీటింగ్లకు పరిమితమయ్యారు...అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? పేషెంట్లను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ విభాగాల కీలక ప్రగతి సూచికల (కేపీఐ) పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నాలుగు సూచికలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం వేసే ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాదికి జిల్లా మొత్తంమీద 4వేల ఎకరాలను, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 20 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు 3,741 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా మునగ సాగుకు 894 ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. మండలాల వారీగా లేబర్ మొబిలైజేషన్, సీసీ రహదారుల నిర్మాణం, పశువుల షెడ్లు, జీవాల షెడ్ల నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలపైనా సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనాథ సాహిత్యం అజరామరం
విజయవాడ కల్చరల్: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. వేముల చారిటీస్ కన్వీనర్ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. ● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● బీజేపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. -
రైళ్లలో స్నాచింగ్లు.. పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస దొంగతనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్తో కలసి జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ వివరాలు వెల్లడించారు. పద్మావతి ఎక్స్ప్రెస్లో.. తిరుపతికి చెందిన బండి రాజ్యలక్ష్మి ఆగస్టు 23న తిరుపతి నుంచి వరంగల్లుకు పద్మావతి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడలో ఆగి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు నానుతాడును తెంచుకుని కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించి రెండు రోజుల తరువాత విజయవాడ చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తుడి కోసం గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించడం, పాత నేరస్తులను విచారించడం ద్వారా చోరీకి పాల్పడింది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్నగర్కు చెందిన తండ్రికంటి రమేష్గా గుర్తించారు. ఇతనిపై గతేడాది విజయవాడ స్టేషన్లో స్నాచింగ్ కేసులోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ముమ్మర గాలింపు.. పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం హైదరాబాద్, వరంగల్లు, ఖమ్మంలో గాలింపు చేపట్టినా పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిందితుడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తిరుగుతుండగా.. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్నాచింగ్కు పాల్పడిన లక్షరూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారు నానుతాడుతో పాటుగా గతంలో చోరీ చేసిన నాలుగు లక్షల విలువైన రెండు సూత్రాలతో కూడిన 40 గ్రాముల బంగారు నానుతాడును కూడా పోలీసులు రికవరీ చేశారు. రూ. 5లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
ప్రభుత్వ తీరు సరికాదు..
మీడియా గొంతునొక్కే కుట్రలు చేయటం సరికాదు. మీడియా వల్లే సమాజంలో ఉన్న అనేక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. సమాజ గతిని నిర్ణయిస్తున్నాయి. పాలకుల వైఫల్యాలను బహిర్గతం చేయటం తప్పు అనేట్లుగా ప్రస్తుత విధానాలు కనిపిస్తున్నాయి. మీడియా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవాలు లేకపోతే ఖండించాలి. అంతే తప్ప కేసులు నమోదుచేయటం, ఇబ్బందులకు గురిచేయటం సరైంది కాదు. దేశ ప్రగతిలో ముఖ్యభూమిక పోషిస్తున్న మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించటం మానుకోవాలి. కచ్చితంగా మూల్యం చెల్లించుకునేందుకు పాలకపక్షాలు సిద్ధంగా ఉండాలి. – నక్కా శ్రీనివాసరావు, సగర సంఘం రాష్ట్ర నాయకుడు, కోలవెన్ను -
దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడకు కూత వేటు దూరంలోని గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఈ మాన్యం భూముల్లో అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో మట్టి తోలి చదును చేసే పనులు నిలిచిపోయాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసి, దేవదాయ శాఖ పొలాల్లో ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. విజయవాడ ఉత్సవాలకు వేరే ప్రైవేటు స్థలాన్ని చూసుకోవాలని చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవుడి మాన్యం చదునుపై అనుమానాలు దేవుడి మాన్యం భూమిని చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ అనేది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అనే స్పష్టత ఇప్పటికీ లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చును ఏవిధంగా సమకూర్చుతున్నారనే అంశంపైనా చర్చ సాగుతోంది. ప్రముఖులు, వ్యాపార సంస్థల నుంచి చందాల వసూళ్లకు ప్రణాళిక రచించారనే ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విజయవాడ ఉత్సవ్ వెనుక భారీ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలో గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ మల్టీ కాంప్లెక్స్లు, మల్టీ థియేటర్లు నిర్మిస్తుందని, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత రిక్రియేషన్ క్లబ్, ఓ ప్రముఖ హోటల్ సంస్థ యజ మాని స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతారని, మరో టీడీపీ నాయకుడు క్యాంటీన్లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం జరిగిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థలంపై కన్నేసిన వారిలో కొంత మంది ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల కోసం పెట్టుబడులు పెట్టడంతోపాటు, పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసేందుకు రూప కల్పన జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి చేరాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. పెద్దలకు విన్నపాలు విజయవాడ ఉత్సవ్ జరుపుతామని ప్రచారం చేశామని, ఎలాగైనా అక్కడే ఉత్సవాలు జరపా లని టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా అయినా ఉత్సవాలకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే లీజు ఉండటంతో, వారి నుంచి సబ్ లీజుకు తీసుకొనే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ లీజుదారులను ఒప్పించి వారి లీజు రద్దు చేసి, గుడికి ఆదాయం ఎక్కువగా వస్తుందని చూపి, తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరికై నా అనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలు పండే పొలంలో కోట్ల రూపా యల మట్టిని ఆ ప్రదేశంలో నింపారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులూ తీసుకో లేదు. ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులు నిలిపి వేసినా మూడు అడుగుల మేర నింపిన మట్టి తొలగింపు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మొత్తం మీద గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందనే విషయం చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే గుడి కమిటీ, విశ్వ హిందు పరిషత్ సంస్థ సభ్యులు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో సమావేశమై ఆ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు. దేవుడి మాన్యంపై కూటమి నేతల కన్ను గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యంపై విజయవాడ పార్లమెంట్ ముఖ్యనేతతో పాటు, మరికొంత మంది టీడీపీ నేతల కన్ను పడింది. విజయవాడ ఉత్సవ్ ముసుగులో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ.400 కోట్ల విలువైన ఈ 39.99 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షో, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు శాశ్వత వేదిక నిర్మాణం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి పనులూ మాన్యం భూమిలో చేపట్టరాదని దేవదాయశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి అధికారికంగా తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. -
గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల గ్రంథాలయ పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండు లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియే షన్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ – ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, నెట్, సెట్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఏపీపీఎస్సీ దగ్గర నిలిచిపోయిన జూనియర్, డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీ లెబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కె.జగదీశ్, డీవైఎఫ్ఐ నాయకులు పి.కృష్ణ, పిచ్చయ్య, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు చేపట్టాలని, ఓవర్హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో మృత్యుఘోష
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో డయేరియా పడగవిప్పింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా బాధితులు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజరాజేశ్వరి పేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆ ప్రాంతంలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం మంగళవారం రాత్రి తీసుకున్న కలుషిత ఆహారం కారణమని చెప్పుకొస్తున్నారు. బుధవారం మరికొందరు స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కొందరు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసారతో ఎంత మంది బాధపడతున్నారనేది అధికారులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. వంద మంది వరకూ వేర్వేరు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఉరుకులు పరుగులున్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అతిసారతో బాధితులు ఆస్పత్రుల దారి పట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సైతం బాధితులు రాగా ప్రాథమిక వైద్యం అందించి పంపించేశారు. అదే సమయంలో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బుధవారం ఉదయానికి పరిస్థితి తీవ్రమైంది. వాంతులు, విరేచనాలతో బాధపడే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. కొందరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరి కొందరికి సింగ్నగర్ యూపీహెచ్సీలో వైద్యం అందించారు. అయితే ఎంత మంది అతిసారకు గురయ్యారనే విషయం లెక్కతేలడం లేదు. మరో వైపు అతిసారకు తాగునీరు కారణమా అనే విషయం తేల్చేందుకు గురువారం వాటర్ ఎనలిస్ట్స్ ఆ ప్రాంతంలో పర్యటించి శాంపి ల్స్ను పరీక్షించనున్నారు.జీజీహెచ్లో 25 మందిఅతిసార బాధితులు ప్రస్తుతం 25 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరొక చిన్నారి పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారికంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ప్రకటించారు. మరో ముగ్గురు మంగళవారం రాత్రి చికిత్స కోసం రాగా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పంపించివేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ జి.లక్ష్మీశ పరామర్శించారు. బాధితులకు మెరుగైన, వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.28 మందిని నిర్ధారించాంఅతిసారకు గురైన వారు 28 మంది వేర్వేరు ప్రాంతాల్లో చికిత్స పొందినట్లు నిర్ధారించామని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. మరో ఆరుగురు ఓపీలో పరీక్షలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికే 735 గృహాలను సర్వేచేశామని, గురువారం మరిన్ని గృహాలను సర్వే చేస్తా మని పేర్కొన్నారు. ఎక్కువ మంది సమీపంలోని ఆర్ఎంపీల వద్దకు వెళ్లారని, వారి వివరాలు తీసు కున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్లారనే సమాచారం సర్వేలో రాలేదన్నారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, వాటి ఫలితాలు వచ్చేందుకు మూడు రోజుల సమయం పడుతుందన్నారు.బాధితులకు మల్లాది విష్ణు పరామర్శప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూఆర్ ఆర్పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపో వడం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో నాలుగు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూరాజరాజేశ్వరీపేటలో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యా రని ఆందోళన వ్యక్తంచేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్ నజీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మెదడులో మాంసం తినే పరాన్నజీవి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగి మెదడులో మాంసం తింటున్న అరుదైన పరాన్నజీవిని విజయవాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు శస్త్ర చికిత్సతో తొలగించారు. అనంతరం దానిని నిర్ధారించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కోల్కత్తాలోని జీవశాస్త్ర నిపుణులకు పంపించారు. మాంసం తినే స్క్రూవార్మ్ పరాన్నజీవిగా వారు నిర్ధారించినట్లు జీజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్కుమార్ తెలిపారు. ఈ పరాన్నజీవిని తొలిసారిగా అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కేసు వివరాలు ఇలా... తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో ఉన్న 50 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు విజయవాడ జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, తలనుంచి చీము కారుతోందని గుర్తించారు. స్కాన్ చేసి ఆమె మెదడులో చీము గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మానని లోతైన గాయంలో కదులుతున్న క్రిములను మాగ్గోట్లుగా గుర్తించారు. ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసేందుకు నిర్ణయించి తొలుత తలలోని పుండు నుంచి మాగ్గోట్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం తలపై గాయాన్ని తొలగించి శుభ్రపరచడంతో పాటు, శస్త్ర చికిత్స చేసి మెదడులోని చీము గడ్డను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎ.ఆర్.సి.హెచ్.మోహన్ సారథ్యంలో ఫ్లాప్ సర్జరీ చేసి తలపై ఉన్న గాయాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నిర్ధారణ ఇలా... మెదడు నుంచి తొలగించిన మాగ్గోట్లను, క్రిమి గురించి ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర నిపుణులు డాక్టర్ జ్ఞాణమణి, గుంటూరు లామ్ నిపుణులు రత్నంను సంప్రదించగా వారు స్క్రూ వార్మ్లుగా గుర్తించారు. అనంతరం కోల్కత్తాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించి స్క్రూవార్మ్లుగా నిర్ధారణ చేశారు. సాధారణంగా ఈగల నుంచి జనించే మాగ్గోట్లు జంతువులు, మనుషుల శరీరంలో చెడిపోయిన, కుళ్లిన నిర్జీవ కణజాలాలపై మాత్రమే ఆధారపడి జీవిస్తాయి. కానీ స్క్రూవార్మ్ సజీవ కణజాతాలను సైతం తినే పరాన్నజీవులుగా జీవిస్తాయని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీచేసిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. రోగి మెదడులో నుంచి తీసిన అరుదైన పరాన్నజీవి స్క్రూవార్మ్ -
నందిగామ: వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు. -
కదనభేరి!
కర్షకుడి పక్షాన వైఎస్సార్ సీపీ పోరు బాటనందిగామ టౌన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. నందిగామలోని పార్టీ కార్యాలయం నుంచి సీఎం రోడ్డు, మునిసిపల్ కార్యాలయం గాంధీ సెంటర్ మీదుగా వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండి తోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, నల్లగట్ల స్వామిదాసు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ తిలక్ అక్కడకు చేరుకుని ముఖ్య నాయకులను మాత్రమే అనుమతిస్తామని రైతులు, నాయకులు, కార్యకర్తలను అనుమతించేది లేదని, సహకరించాలని సూచించారు. దీంతో ప్రధాన నాయకులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జిల్లా లోని రైతులు పడుతున్న యూరియా సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. వివరాలిస్తామన్నా స్పందించటం లేదు.. యూరియా ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్లో ఉంది.. ఎక్కడ అమ్ముతున్నారు.. రైతులు ఎలా నష్టపోతున్నారు అనే వివరాలను ఇస్తామన్నా అధికారులు స్పందించలేని దుస్థితిలో ఉన్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ దుయ్యబట్టారు. ఆర్డీవోను కలిసి అన్ని వివరాలు అందించామని యూరియా డిమాండ్ ఎంత ఉంది? ఎంత సరఫరా చేస్తున్నారని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. బఫర్ స్టాకు లేదు.. వచ్చే పంటకు మళ్లీ తీసుకువస్తాం అంటూనే.. మళ్లీ కొరత లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతా మధ్యవర్తుల పాత్ర ఉందని అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రాయితీపై వచ్చే యూరియా మధ్యవర్తులకే వెళ్తోందన్నారు. రైతులు సొమ్మసిల్లే పరిస్థితులు.. యూరియా, ఎరువుల కోసం రైతులు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. రూ. 270కు విక్రయించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్లో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తూ రూ. 300కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం లూటీ చేసిందన్నారు. కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని అసమర్థ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని పార్టీ తిరువూరు ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు మండిపడ్డారు. రైతులు యూరియా కొరతతో పాటు అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారన్నారు. అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంటే కూటమి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), అవుతు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నంబూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, జెడ్పీటీసీ సభ్యులు గాదెల వెంకటేశ్వరరావు, వేల్పుల ప్రశాంతి, ముక్కపాటి నరసింహారావు, కంచికచర్ల ఎంపీపీ మలక్ బషీర్, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, మంచాల చంద్రశేఖర్, వేమా సురేష్బాబు, బండి మల్లికార్జునరావు, కందుల నాగేశ్వరరావు, ఆవుల రమేష్బాబు, కోటేరు ముత్తారెడ్డి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ పాల్గొన్నారు. కాగా కృష్ణాజిల్లా పరిధి ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు, గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో గూండా రాజ్యం సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. యూరియా గురించి మాట్లాడితే బొక్కలో వేయండంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధాకరమన్నారు. శాంతియుతంగా రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేస్తున్నా.. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి రైతులు, నాయకులు వస్తున్నా రాకుండా అడ్డుకున్నారని ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులను సైతం తనిఖీ చేసి నిర్ధాక్షిణ్యంగా దించి వెనక్కు పంపారని మండిపడ్డారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ఉప్పెనలా తరలి వచ్చారని తెలిపారు. -
రోగులకు మెరుగైన వైద్య సహాయం అందాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ ఎప్పటి కప్పుడు పరీక్షించాలన్నారు. చర్యలు తప్పవు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనన మరణ నివేదికలు, అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, డీఐఓ శరత్ కుమార్, డీసీహెచ్ఎస్ మాధవి దేవి పాల్గొన్నారు. -
ఆర్జిత సేవ భాగ్యం దక్కేనా?
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. మరో 12 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నా ఇంత వరకు సేవా టికెట్ల ఊసే లేకుండా పోయింది. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన, ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. గతంలో సేవా టికెట్లను దేవస్థాన కౌంటర్ల విక్రయించడంతోపాటు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచేవారు. అయితే ఈ ఏడాది ఆర్జిత సేవలపై మొదటి నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆర్జిత సేవల టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. అన్ని సేవలకు కలిపి రోజుకు 300 చొప్పున 11 రోజులకు 3,300 టికెట్లు విక్రయించేలా దేవస్థానం చర్యలు తీసుకుంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు తమ వరకు వస్తాయో రావోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీహోమానికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ ఆర్జిత సేవలకు షిఫ్టునకు 75 టికెట్లు చొప్పున విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ప్రముఖులు, వీఐపీలు, సిఫార్సు ఉన్న వారికే ఈ సేవ టికెట్లు దక్కుతాయనే భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవస్థాన టోల్ఫ్రీ నంబర్కు రోజూ వస్తున్న ఫోన్ కాల్స్లో అత్యధికంగా సేవా టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనే కావడం గమనార్హం. రెండు విడతలుగా ఆర్జిత సేవలు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3 వేలు, మూలా నక్షత్రం రోజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్ర నవార్చనకు రూ.3 వేలు, ప్రత్యేక చండీహోమానికి రూ.4 వేలుగా టికెట్ల ధరలు ఖరారు చేశారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన తెల్లవారుజాము ఐదు నుంచి ఆరు గంటల వరకు, ప్రత్యేక కుంకుమార్చన మహామండపం ఆరో అంతస్తులో మొదటి విడత ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు, రెండో విడత ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాల నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రత్యేక కుంకుమార్చన ఉదయం పది నుంచి 12 గంటల వరకు ఒక విడత మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో పొందే అవకాశం ఉందన్నారు. పరోక్ష సేవకు రూ.1,500 ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒక రోజు పరోక్ష సేవ టికెట్ ధరను రూ.1,500గా, 11 రోజుల పాటు సేవకు రూ.11,116గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా భక్తులు తెలిపిన చిరునామాకు పంపిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఉద్యాన పంటల ఎగుమతితో అధిక లాభాలు
హనుమాన్జంక్షన్ రూరల్: నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించొచ్చని ఏపీఈడీఏ రీజనల్ బిజిసెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్కుమార్ సూచించారు. బాపులపాడు మండలం మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ), ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి అవకాశాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికంగా పండే మామిడి, కూర గాయలు, ఆకుకూరలను ఎగుమతి చేసే అవకాశాలను ఏపీఈడీఏ కల్పిస్తోందని అశోక్కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి మాట్లాడుతూ.. పంటల ఎగుమతి కోసం ఎఫ్ఈఓలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, రాయితీలను వివరించారు. మామిడి పరిశోధన కేంద్రం (నూజివీడు) సినీయర్ శాస్త్రవేత్త బి.కనకమహాలక్ష్మి మాట్లా డుతూ.. మామిడిలో తరుచుగా కనిపించే చీడ పీడల నివారణ చర్యలు, నాణ్యమైన దిగుబడికి పాటించాల్సిన సన్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ‘సూక్ష్మ గామా’ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ వివేక్ మాట్లాడుతూ.. ఐక్యూఎఫ్ పద్ధతి ద్వారా తాజా కూరగాయలను ఫ్రోజెన్ కూరగాయలుగా మార్చి ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బాపులపాడు, అవనిగడ్డ, ఉయ్యూరు, కంకిపాడు మండలాల ఉద్యాన శాఖ అధికారులు, ఉద్యాన రైతులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రౌండ్టేబుల్ సమావే శంలో వక్తలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించా లని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపం లోని బాలోత్సవ భవన్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మో హన్రావు అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైతే విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే 300 బెడ్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నడపాలని కేంద్ర వైద్య శాఖ చేసిన విధానం వల్ల ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్లోకి మారితే ఈ ఫలాలు పేదలకు అందవన్నారు. ప్రైవేటుపరం చేయాలనుకున్న పది మెడికల్ కాలేజీలు ఉన్న పది జిల్లాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలని పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం ప్రవేశపెడతానన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. పీపీపీ విధానంతో ఆ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడడమే కాకుండా పేద ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థి సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయకూడదని, ప్రభుత్వంలోనే నడవా లని, అందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జన చైతన్య వేదిక నాయకుడు లక్ష్మణరెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, వైఎస్సార్ ఎస్యూ రాష్ట్ర నాయకుడు చైతన్యబాబు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి. ఆంజనేయులు, పీటీఎల్పీ నాయకుడు ఎం.సూర్యా రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
డ్రోన్లతో నానో యూరియా పిచికారీ
జి.కొండూరు: డ్రోన్లతో నానో యూరియా పిచికారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జి.కొండూరు మన గ్రోమోర్ సెంటర్లో యూరియా పంపిణీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. యూరియా స్టాకు, పంపిణీ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో డ్రోన్తో నానో యూరియా పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 32 డ్రోన్లతో నానో యూరియా పిచికారీపై డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో అవసరం మేరకే యూరియాని వినియోగించాలన్నారు. కొరత లేకుండా ఉండేలా ఎరువుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, ఏఓ సూరిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే చాన్స్!
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టిన దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు నిర్మించిన బీటీరోడ్డును పరిశీలించారు. క్యూకాంప్లెక్స్ను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మహా మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న లడ్డూ పోటును పరిశీలించి భవన డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణంలో ఎటువంటి అలసత్వం వద్దని, భవష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజగోపురం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని పరిశీలించారు. కొండపై నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని, యాగశాలను పరిశీలించి మిగిలిన పనులు ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. -
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ తన కార్యకలాపాలను సాగిస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం సోమవారం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. అనంతరం చలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హనుమాన్ జంక్షన్లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1210 కోట్లు టర్నోవర్ సాధించామని, 29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కృష్ణామిల్క్ యూనియన్లో రూ.230 కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయన్నారు. బుడమేరు ముంపు యూనియన్ను తీవ్రంగా నష్టపరిచినా పాడి రైతులకు రూ.46 కోట్లు బోనస్గా చెల్లించామని, అదే సమయంలో రూ.16 కోట్ల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. గడిచిన ఆరేళ్లలో పాల దిగుబడిని పెంచేలా యూనియన్ నాణ్యమైన పశుదాణాను సబ్సిడీపై అందిస్తోందన్నారు. విజయ పార్లర్ ద్వారా డ్వాక్రా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు చలసాని చక్రపాణి, నెలకుదిటి నాగేశ్వరరావు, వేమూరి వెంకట సాయిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు తగ్గట్లు ఎరువులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమీపంలోని సొసైటీలో అందుబాటులో ఉన్న ఎరువులు, వచ్చే వారం రోజుల్లో కొత్తగా వచ్చే ఎరువులు, పంట దశను బట్టి ఎరువుల మోతాదు తదితర అంశాలతో పాటు నానో యూరియా ప్రయోజనాలను కూడా ఇంటింటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది వివరించినట్లు తెలిపారు. గతేడాది ఖరీఫ్తో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తగ్గట్లు యూరియాకు కూడా డిమాండ్ పెరిగిందని, ఇటీవల వర్షాలు కూడా బాగా పడటం వల్ల ఒక్కసారిగా డిమాండ్ అధికమైందని వివరించారు. ఎక్కువ మంది ఒకేసారి వచ్చిన సందర్భంలో రైతులు లైన్లలో ఉండి క్రమశిక్షణతో యూరియా తీసుకుంటున్నారని, అయితే ఆ ఫొటోల ఆధారంగా యూరియా లేదంటూ కొందరు వదంతులు సృష్టిస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎరువులకు సంబంధించి వాస్తవ సమాచారం కోసం రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), పీఏసీఎస్లను సంప్రదించాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరులో సంప్రదించాలన్నారు. ఒకవేళ ఎరువులు మార్గమధ్యంలో ఉంటే టోకెన్లు ఇచ్చి ఎరువులు చేరుకోగానే అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రైతులతో ముచ్చటించి సాగు విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ జి.లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతి
శావల్యాపురం (పల్నాడు జిల్లా): రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. శావల్యాపురం ఎస్ఐ లేళ్ళ లోకేశ్వరరావు కథనం ప్రకారం... విజయవాడ చిట్టినగర్కు చెందిన తమ్మిన ప్రసాదు, కొలుసు అశోక్ స్కూటీపై శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గంటావారిపాలెం స్పీడు బ్రేకరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. వాహనం నడుపుతున్న ప్రసాదు (33) రోడ్డుపై పడిపోవడం.. ఈ క్రమంలో పక్కనే టిప్పర్ రావడంతో ఘటనా స్థలంలో మృతి చెందాడు. స్కూటీపై వస్తున్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించారు. ఇద్దరూ స్నేహితులు. కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి. ఏడాది గడిచినా ఈ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసేందుకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్న విలువైన మోటార్లు, స్టార్టర్ బోర్డులు, పైపులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచలేదు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఎత్తిపోతల పథకాన్ని చూస్తే అర్ధమైపోతుంది. నిర్మాణం ఇలా... వర్షాకాలంలో పులివాగులో ప్రవహించే వరద ప్రవాహం బుడమేరులో కలిసి వృథాగా పోతుంది. ఈ క్రమంలో ఎటువంటి నీటి వనరులేని చెర్వుమాధవరం గ్రంథివాని చెరువుకు నీటిని సరఫరా చేసేందుకు గడ్డమణుగు గ్రామ శివారులో పులివాగుపై ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1.30 కోట్లతో 2014–19 మధ్య కాలంలో నిర్మించారు. ఈ పథకం నిర్మించిన ప్రదేశంలో చెక్ డ్యామ్ కూడా ఉండడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ఎత్తి పోసేందుకు వీలుంటుందని భావించి నిర్మించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో నీటి సదుపాయం ఉండని పులివాగు మీద ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం చెరువును నింపకపోయినప్పటికీ పులివాగులో నీరున్న సమయంలో నీళ్లను చెరువులోకి సరఫరా చేయడం ద్వారా ఆయకట్టు భూముల్లోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేది. ఏడాదిగా నిర్లక్ష్యం ఈ ఎత్తిపోతల పథకం గత ఏడాది ఆగస్టులో పులివాగుకు వచ్చిన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో నేటికీ అలాగే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.1.30 కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలాలను తొలగించి, మోటార్లను మరమ్మతులు చేసి, ఎత్తిపోతల పథకాన్ని పునఃనిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న క్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద వర్షం నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా చేస్తే ప్రయోజనం చెర్వుమాధవరం పక్కనే ఉన్న గడ్డమణుగు గ్రామ శివారు వరకు ఉన్న తారకరామా ఎత్తిపోతల పథకంలోని నాల్గవ పంపు హౌస్ నుంచి నీటిని పులివాగులోకి తరలించాలి. పులివాగు వద్ద ధ్వంసమైన ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకొస్తే గ్రంథివాని చెరువుకు పుష్కలంగా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఈ చెరువు కింద ఉన్న కాల్వలు సైతం ఇప్పటికే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కాల్వలను ఏర్పాటు చేస్తే రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ చెరువుకు నీటి వసతి కల్పించి రిజర్వాయర్గా మార్చగలిగితే చెరువుకింద ఆయకట్టుగా ఉన్న 160 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. అంతే కాకుండా సమీప గ్రామాలైన సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బెట్ట సమయంలో బోర్లలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
బార్లు బార్లా.. వైద్యం బోర్లా
జి.కొండూరు : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి పచ్చజెండా ఊపి, పేదలకు అవసరమైన వైద్యాన్ని నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామగ్రామానా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. బార్లు పనివేళలను సైతం పెంచిన ప్రభుత్వం అర్ధరాత్రి వరకూ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ఆయుర్వేద, హోమియో వైద్యశాలల్లో సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఈ ఆస్పత్రులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు.మూతబడిన రెండు వైద్యశాలలువైద్యాధికారులు లేక ఎన్టీఆర్ జిల్లాలో ఒక హోమియో వైద్యశాల, ఒక యునాని ఆస్పత్రి మూతబడ్డాయి. మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో నాలుగు నెలల పైబడి వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ బదిలీపై వెళ్లగా మరో డాక్టరును ప్రభుత్వం నియమించలేదు. సిబ్బంది కూడా లేకపోవడంతో ఆస్పత్రి మూతబడింది. ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని వెంటనే తెరిచి వైద్య సేవలు కొనసాగించాలని సీపీఎం నాయకులు స్థానికులతో కలిసి సోమవారం ధర్నా చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న యునాని ఆస్పత్రిలో వైద్యాధికారి లేక కొన్నేళ్లుగా వైద్య సేవలు నిలిచిపోయాయి.సిబ్బందిలేక వెలవెలనందిగామ, గంపలగూడెం, మైలవరం మండలాల పరిధిలో మూడు హోమియో వైద్యశాలలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి, జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి, పెనుగంచిప్రోలు మండలంలో అనింగండ్లపాడు, కొణకంచి, నందిగామ మండలలో నందిగామ, పెద్దవరం, వీరులపాడు మండలంలో అల్లూరు, కంచికచర్ల మండలంలో పరిటాల, ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి, జి.కొండూరు మండలంలో వెల్లటూరులో పది ఆయుర్వేద వైద్య శాలలు ఉన్నాయి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కంచి కచర్ల మండలం పెండ్యాలలో యునాని ఆస్పత్రి, కంచికచర్లలో యోగా నేచరోపతి ఆస్పత్రి, మైలవరంలో ఆయుర్వేద ఆస్పత్రి ఉన్నాయి. ఈ పదహారు ఆస్పత్రుల్లో ఒక్కొక్క ఆస్పత్రిలో వైద్యాధికారితో పాటు ముగ్గురు సహాయక సిబ్బంది ఉండాలి. గూడవల్లి, పెద్దవరం, నందిగామ, కొండపల్లి ఆస్పత్రుల్లో మాత్రమే వైద్యాధికారితో పాటు ఒక్కొక్కరు చొప్పున సిబ్బంది ఉన్నారు. మిగిలిన 12 వైద్య శాలల్లో సిబ్బందే లేరు. ఆయుష్ శాఖ కింద నడుస్తున్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద వైద్య కళాశాలలో కూడా సరిపడా సిబ్బంది లేక ఇక్కట్లు తప్పడం లేదు.డాక్టర్ను నియమించాలిఏడేళ్లుగా దగ్గు, జలుబు, నొప్పులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులు వాడుతున్నాను. డాక్టరు లేక కొన్ని నెలలుగా పుల్లూరులో హోమియో ఆస్పత్రి మూతపడింది. ఇంగ్లిషు మందులు వాడలేక ఇబ్బంది పడుతున్నా. నాతో పాటు చాలా మంది ఆస్పత్రికి వచ్చి వెనక్కి పోతున్నారు. అధికారులు స్పందించి డాక్టర్ను నియమించాలి.– వజ్రాల ధనలక్ష్మి, మంగాపురం, మైలవరం మండలంఇంగ్లిషు మందులతో ఇబ్బందినేను గత 15 సంవత్సరాలుగా హోమియో మందులను వాడుతున్నాను. పుల్లూరు గ్రామంలో ఉన్న హోమియో ఆస్పత్రిని మూసేయడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంగ్లిష్ మందులను వాడాలంటే ఇబ్బందిగా ఉంది. హోమియో మందులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి డాక్టరును కేటాయించి ఆస్పత్రిని తెరవాలి.– చిలుకూరి సుబ్బారెడ్డి, చిలుకూరివారిగూడెం, మైలవరం మండలంనిర్లక్ష్యం తగదుఆయుర్వేద, హోమియో వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వ పర్యవేక్షణ లేక ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. పుల్లూరు హోమియో వైద్యశాలకు ఆరు నెలలుగా తాళం తీయడం లేదు. హోమియో వైద్యానికి ఆలవాటు పడిన వారు ఇంగ్లిషు మందులు వాడలేక నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యులను, సిబ్బందిని కేటాయించాలి.– చాట్ల సుధాకర్, సీపీఎం మండల కార్యదర్శి, మైలవరం -
ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం
రైతులకు యూరియా కూడా అందించలేని అసమర్థ పాలనను ఇప్పుడే చూస్తున్నాం. యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు రూ.కోట్లు దండుకొంటున్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. రైతుల సమస్యల విషయంలో అన్నదాత పోరుతో ప్రభుత్వం కళ్లు తెరి పిద్దాం. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందజేయా లని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత పోరులో రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
కట్టకటపై ఆగ్రహ జ్వాల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అదనుకొచ్చిన పంటకు బలం ఇవ్వకుంటే దిగుబడులు దిగజారుతాయన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. మార్కెట్లో యూరియా దొరకడంలేదు. వచ్చిన కొద్ది సరుకును కొన్ని ప్రాంతాల్లో కూటమి పెద్దలు పక్కదారిపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్ బోర్డు’లు దర్శనం ఇస్తున్నాయి. రైతులు తిండీతిప్పలు మానుకుని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులు, రైతుసంఘాల నాయకులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేయనుంది. యూరియా కోసం రైతుల అవస్థలు పైర్లను రక్షించుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ల వద్ద బారులు తీరులు తీరి కనిసిస్తున్నారు. రాత్రిళ్లు సైతం నిద్రమానుకుని మరీ ప్రాథమిక సహకార సంఘాల వద్దే కాపు కాస్తున్నారు. యూరియా తీవ్రంగా కొరత ఉండటంతో రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకొని, అందులో ఉన్న సరుకును తమకు పంచా లని ఆందోళనకు దిగుతున్నారు. గంపలగూడెం మండలంలో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక లైన్లలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్ల కింద తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం కొత్తమాజేరు గ్రామంలో రైతులు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోయారు. అయినా ‘కట్ట’ యూరియా దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే పిలకలు రావని, దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా కూటమి పెద్దల తీరులో మార్పు రావడంలేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్తలు రైతులకు అండగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. పంటలకు యూరియా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించొద్దని, అవి వాడిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్లు, మౌజన్లకు పెండింగ్ గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గౌరవ వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మైనార్టీ విభాగం ఆధ్యర్యంలో మైనార్టీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఖాదర్బాషా, హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇమామ్లు, మౌజన్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నెలకు ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం నిరంతరాయంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి గౌరవ వేతనం చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల వేతన బకాయి ఉందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్లు, మౌజన్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మసీదు కమిటీలు కూడా చెల్లింపులు చేయలేని స్థితిలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో వారికి క్రమం తప్పక గౌరవ వేతనాలు అందాయని గుర్తుచేశారు. బకాయిలు తక్షణమే ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ప్రతి నెలా గౌరవ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్లు, మౌజన్ లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, కార్పొరేటర్ ఎండీ ఇర్ఫాన్, రఫీ, మైనార్టీ నాయకులు, పలువురు ఇమామ్లు, మౌజన్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన -
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధిచేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రో క్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులను కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు.తిరుపతమ్మ ఆలయంలో..పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం అనంతరం పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారి ఆలయం సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరుచుకుంది. గ్రహణం సందర్భంగా 15 గంటల పాటు ఆలయాన్ని కవాట బంధనం చేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి అర్చకులు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.పీహెచ్సీలో తనిఖీలు పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి అని ఆరా తీశారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవ ల్లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. ఆర్డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీ డీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు : కలెక్టర్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువులు అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్లో ఎరువుల డీలర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఎరువుల విక్రయాలు సాగాలని స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలపాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవస్థను కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎరువుల దుకాణాలకు వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, మార్క్ఫెడ్ డీఎం నాగమల్లిక, వివిధ కంపెనీల డీలర్లు పాల్గొన్నారు. -
కోర్టు కళ్లుగప్పి కుప్పి గంతులు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): మద్యం విధానంపై అక్రమ కేసులో ఆది నుంచీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్న కూటమి సర్కారు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా బరి తెగింపు ధోరణితో ప్రవర్తించడం న్యాయవర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రిటైర్డ్ అధికారులు కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వారు జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు విఫల యత్నాలు చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ వారిని విడుదల చేయకుండా విజయవాడ జిల్లా జైలు వద్ద ఆదివారం ఉదయం మూడు గంటల పాటు హై డ్రామా నడిపింది.ఉదయం 6 గంటలకే రావాల్సిన జైలర్ను 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దలు తెరచాటు కుతంత్రాలకు పాల్పడ్డారు. దొంగ కేసుల్లో ఇరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు మరింత పదును పెట్టారు. అయితే న్యాయవాదులు జైలు ఎదుట ధర్నాకు దిగటం.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం.. అప్రజాస్వామిక పోకడలపై అన్ని వర్గాలు ప్రశి్నస్తుండటంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం హడావుడిగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వారు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించింది.అందుకు జైలు అధికారులు సహకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే విడుదలలో తీవ్ర జాప్యం చేశారు. మచిలీపట్నం నుంచి జైలు సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటూ కొద్దిసేపు ఈ నాటకాన్ని రక్తి కట్టించగా.. తీరా ఆయన వచ్చాక కూడా విడుదల చేయకుండా ఆలస్యం చేశారు. అయితే ఆ కుట్రలేవీ ఫలించకపోవడంతో ఏసీబీ కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎట్టకేలకు ఉదయం 9.30 గంటల సమయంలో ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. గోవిందప్ప తదితరులకు ఏసీబీ కోర్టు శనివారం సాయంత్రం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కృష్ణమోహన్రెడ్డి తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ సకాలంలో పూచీకత్తులను కోర్టుకు సమరి్పంచారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్ని జైలుకు పంపాలని ఆయన కోరగా ఏసీబీ కోర్టులోని ఓ అధికారి ఇందుకు ససేమీరా అన్నారు.దీంతో విష్ణువర్ధన్ ఈ విషయాన్ని న్యాయాధికారి భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. రిలీజ్ ఆర్డర్ను కోర్టు అమీనా ద్వారా జైలు అధికారులకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సదరు కోర్టు ఉద్యోగి మాత్రం మొండికేశారు. మిగిలిన ఇద్దరి పూచీకత్తులు సమరి్పస్తేనే మొత్తం ముగ్గురి రిలీజ్ ఆర్డర్లను జైలుకు పంపుతానని ఆ అధికారి స్పష్టం చేశారు. ఏకంగా న్యాయాధికారి ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఆ అధికారి సమయం ముగిసిపోయేంత వరకు తాత్సారం చేశారు. దీంతో కృష్ణమోహన్రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలైతే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు తెర వెనుక ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా ఈ తతంగం నడిపించినట్లు చర్చ జరుగుతోంది. ప్లాన్ ‘బీ’ కూడా బెడిసికొట్టడంతో... ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా మొదటి ప్లాన్ను అమలు చేసిన ప్రభుత్వ పెద్దలు రెండో ప్లాన్లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలకు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచి్చన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసి అత్యవసర విచారణను కోరింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల మేరకు గోవిందప్ప తదితరులు ఆదివారం విడుదల కానుండటంతో దాన్ని అడ్డుకునేందుకు హౌస్ మోషన్ అస్త్రాన్ని ప్రయోగించింది.దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ హౌస్ మోషన్ పిటిషన్ల గురించి హైకోర్టు రిజిష్ట్రార్ (జుడీషియల్) ఫోన్ ద్వారా ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తెచ్చారు. అయితే ఈ వ్యాజ్యాలపై ఇప్పటికప్పుడు అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని భావించిన ప్రధాన న్యాయమూర్తి అనుమతిని నిరాకరించారు. వీటిని సోమవారం అనుబంధ కేసుల విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. కోర్టు కేసుల విచారణ జాబితా శుక్రవారం సాయంత్రమే సిద్ధమైపోయినప్పటికీ, అత్యవసరం దృష్ట్యా ఆ వ్యాజ్యాలను అనుబంధ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరపనున్నారు. హౌస్మోషన్ అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించడంతో బాలాజీ గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ పెద్దల రెండో ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఎప్పుడైతే హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించిందో ఇక అప్పుడు జైలు అధికారులు చేసేదేమీ లేక ఏసీబీ కోర్టు తీర్పు మేరకు గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయం, చట్టం అంటే గౌరవం లేదు: ధనుంజయరెడ్డి కోర్టు ఆదేశాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్క లేదని.. న్యాయం, చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేదని అనంతరం ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఉద్దేశపూర్వకంగానే విడుదలలో జాప్యం చేశారని చెప్పారు.జైలు ఎదుట న్యాయవాదులు,నేతల బైఠాయింపు..వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, పార్టీ నేతలు, న్యాయవాదులు ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని నిరీక్షించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా 15 గంటల పాటు జైలులోనే నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలు గడిచిపోతున్నా విడుదల చేయకపోవడంతో జైలు సూపరింటెండెంట్ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. జైళ్ల శాఖ డీఐజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు అధికారుల తీరుపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్ తీవ్ర నిరసన తెలిపారు. 15 గంటలు అక్రమంగా జైల్లో ఉంచారు ముగ్గురికీ శనివారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు గంటలలోపే జైలు వద్దకు వచ్చాం. ఆదివారం ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామన్నారు. విడుదల చేయకుండా అధికారులు కావాలనే తాత్సారం చేశారు. 15 గంటలకు పైగా ముగ్గురిని జైలులో అక్రమంగా ఉంచారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. – చంద్రగిరి విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్, న్యాయవాదులు కోర్టు ఉత్తర్వుల ధిక్కరణే ఏసీబీ కోర్టు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది. జైలు అధికారులకు శనివారం సాయంత్రమే మెయిల్ ద్వారా, నేరుగా అందజేసింది. ఫోన్లో జైలు సూపరింటెండెంట్ను సంప్రదించినా సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేశారు. ఇది పూర్తిగా కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కిందకే వస్తుంది. జైలు నియమావళి ప్రకారం బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం లోపల ఉంచినా అక్రమ నిర్బంధమే అవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తించారు. – టి.నాగార్జునరెడ్డి, న్యాయవాది పస లేని అక్రమ కేసు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు కోర్టులంటే లెక్కలేదు. ఆ ముగ్గురూ జైలు నుంచి బయటకు రాకుండా లంచ్ మోషన్ దాఖలు చేసేందుకే విడుదలలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్లుగా చిత్రీకరించి అక్రమంగా జైల్లో పెట్టారు. చార్జ్ïÙట్ అంతా తప్పుల తడక. ముగ్గురికీ బెయిల్ రావడంతో ఈ అక్రమ కేసులో పసలేదని ప్రభుత్వం భయపడుతోంది. చంద్రబాబు చెప్పినట్లుగా సిట్ అధికారులు కథలు అల్లుతున్నారు. న్యాయవాదులు సైతం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది. గతంలో వంశీపై బనాయించిన కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. – అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత -
‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, నీకింత–నాకింత అని పంచుకు తినడాన్ని అలవరుచుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. ‘చిన్న’ పథకంతో ఏకంగా రూ.400 కోట్ల విలువైన భూమిని గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్ వేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నంబర్లు 454/2బీ, 3బీలో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కల్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు.ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవదాయ శాఖ ఆలయ నిర్వహణతోపాటు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం రూ.10 కోట్లకు పైగానే ఉంది. దీంతో రూ.400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు.. విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షోకేస్, టూరిజం ప్రమోషన్ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది. కారు చౌకగా కొట్టేసే ఎత్తుగడ ⇒ మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్ కోసం ఈ భూమి కేటాయించాలని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి రూ.500 చొప్పున, 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ⇒ నిజానికి ఆ భూములకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాదిపాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి రూ.95,500తో ఏడు ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు రూ.1,00,500తో 6.50 ఎకరాలు, అనుమోలు రామారావుకు రూ.66,700తో 4.50 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు రూ.97,000తో 4.50 ఎకరాలు ఇచ్చారు. కె.ధర్మారావుకు 2023–24 నుంచి 2025–26 వరకు ఐదెకరాల భూమిని రూ.52,500కు, కె.అయ్యప్పకు 2.50 ఎకరాలను రూ.23,500తో కౌలుకు ఇచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ⇒ అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్ లీజుకు తీసుకొని, ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలం పాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఉత్తర్వులు రాక ముందే భూమి స్వాధీనం⇒ దేవదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక ముందే ఈ భూములను పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే రూ.కోట్ల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ⇒ మరో వైపు ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్ సచివాలయంలో శరవేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాల సమాచారం. ⇒ ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ నుంచి తప్పించి, విజయవాడ దుర్గామల్లే«శ్వర స్వామి పరిధిలోకి తెచ్చారు. అయితే గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గత ప్రభుత్వంలో ఆలయానికి పూర్వ వైభవం ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలిపోయే దశలో ఉన్న గొడుగుపేట ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. అప్పటి మంత్రి పేర్ని నాని ప్రతిపాదన మేరకు 2020 మార్చిలో ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోంచి తప్పించి దేవదాయ శాఖ పరిధిలోకి తెచ్చి ఈవోను కూడా నియమించారు. ⇒ 2020 అక్టోబర్లో పేర్ని నాని సీజీఎఫ్ నిధులు రూ.1.80 కోట్లు, భక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.20 లక్షలు వెరసి రూ.2 కోట్లు వెచ్చించి, ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా పునఃప్రారం¿ోత్సవం జరిపించారు. 2023 జూలైలో ఈ ఆలయ భూములకు వేలం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భూములకు వేలం పాట నిర్వహించి, రైతులకు లీజుకు ఇస్తున్నారు. 2024 మే వరకు ధూప దీప నైవేద్యాలు, ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేశారు.గోల్ఫ్ కోర్టుకు వెంకన్న స్వామి స్థలమే కనిపించిందా?⇒ప్రపంచ స్థాయి అమరావతిలో స్థలమే దొరకలేదా?⇒ ఆలయ భూముల్నీ పప్పు బెల్లాల్లా పంచుకుంటారా?⇒ ఆ భూమిపై మోజు ఉంటే విక్రయించి ఆలయానికి డబ్బు జమ చేయాలి ⇒ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజంమచిలీపట్నం టౌన్: ప్రపంచ స్థాయి రాజధానిగా చెబుతున్న వేలాది ఎకరాల భూమి ఉన్న అమరావతిలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుకు స్థలమే కనిపించ లేదా.. అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్టు సంస్థకు కేటాయించనుండటం దారుణం అన్నారు.విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆలయ భక్త బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఆలయం జీర్ణావస్థకు చేరిందని, కూలేందుకు సిద్ధంగా ఉంటే సరుగుబాదుల సపోర్టుతో ఆలయాన్ని భక్తులు కాపాడుతూ వచ్చారన్నారు. ఆ సమయంలోనే ఈ భూమిపై కూటమి పాలకులు కన్ను వేసి.. ఆలయాన్ని విజయవాడ దుర్గ గుడి ఆధీనంలోకి తీసుకెళ్లారన్నారు.దీంతో ఈ ఆలయ ధూప, దీప నైవేద్యాలకు కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ఆలయాన్ని దుర్గ గుడి నుంచి మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణకు దాదాపు రూ.1.80 కోట్లు సీజీఎఫ్ నిధులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. భక్తుల వద్ద నుంచి రూ.20 లక్షలు సేకరించి.. మొత్తం రూ.2 కోట్ల నిధులతో ఆలయ పునరుద్ధరణ గావించామని చెప్పారు. ఈ భూమిని రైతులకు బహిరంగ వేలంలో కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదాయాన్ని ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారని వివరించారు. మళ్లీ కూటమి నేతల కన్నుకూటమి అధికారంలోకి వచ్చాక ఈ 40 ఎకరాల భూమిపై మళ్లీ కన్నేసి కౌలు దారులను, అధికారులను బెదిరించి పంట వేయకుండా అడ్డగిస్తూ గోల్ఫ్ కోర్టు నిర్మాణం పేరుతో ఆ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టి తోలుతూ, దేవుడి ఆస్తి అనే భయం లేకుండా మెరక పనులు చేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం అండగా ఉండటం పాపం కాదా..? ఇదే కలెక్టర్ ఈ భూమిని గోల్ఫ్ కోర్సుకు, ఎగ్జిబిషన్కు కేటాయించాలని జూలైలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాశారు.దేవదాయ భూమిని లీజుకు తీసుకోవాలంటే బహిరంగ వేలం ద్వారానే తీసుకోవాలని, వేరే ఏ పద్ధతుల్లోనూ తీసుకోకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. దేవుడి భూమిని కూటమి పాలకులు పప్పు బెల్లాల్లా పంచుకోవాలని చూస్తుండడం ఎంతవరకు సబబు?’ అని నాని నిలదీశారు. స్వామి వారి భూమిపై మీకు మోజు ఉంటే బహిరంగ వేలం వేసి విక్రయించగా వచ్చే మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ భూమి ఆక్రమణపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన ఈ దోపిడీని నిలిపివేస్తే సరి అని, లేదంటే కోర్టును ఆశ్రయించాలని సమావేశానికి హాజరైన భక్తులు, పలు రాజకీయ పక్షాల నాయకులు తీర్మానించారు. ఈ సమావేశంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల దాడి హేయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం.. చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ అన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను నిలువరించలేరన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 14 నెలల కూటమి పాలనలో విద్యార్థుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. చలో విజయవాడకు పిలుపునిచ్చామని, విద్యాశాఖమంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారన్నారు. పోలీసుల దాడిలో కావ్య అనే విద్యార్థికి చెయ్యి విరిగిందని, ముగ్గురు విద్యార్థినులు స్పృహతప్పి పడిపోయా రని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్కు అర్థం అని ప్రశ్నించారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ఎమ్మెల్యేలకు వినతులు ఇస్తామని, పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో అనేక ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నారని, విద్యార్థులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పొలిటికల్ అజెండాలకు అతీతంగా విద్యారంగ సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఉష, మాధవ్, షణ్ముఖ్ జశ్వంత్ పాల్గొన్నారు. -
11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్లో ఈ నెల 11వ తేదీన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, అమెరికాతో చర్యలు జరపాలని, తక్కువ సుంకాలున్న అవసరమైన దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలు తిప్పి కొట్టాలని, అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఆక్వా రైతులు ఇతర పంటల రైతుల సహకారంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు. -
యువత క్రీడలు, ధ్యానంపై దృష్టి పెట్టాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత క్రీడలు, ధ్యానం మీద దృష్టి పెట్టి ప్రకృతితో మమేకం అవ్వాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ఎస్వీ రమణ సూచించారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవమైన గ్రామోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. గౌరవ అతిథి కేఎల్ విశ్వవిద్యాలయం క్రీడల సంచాలకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ యువకులకు నూతన ప్రోత్సాహం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వాలీబాల్ (పురుషులు) రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు) రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆటల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్న మహిళలు -
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్
భవానీపురానికి చెందిన 48 ఏళ్ల మహిళ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్తో, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండేది. ఆమె నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లగా సర్జరీ చేయాలన్నారు. ఆమెకు సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేదు. తెలిసిన వారి ద్వారా ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయగా సాధారణ స్థితికి వచ్చింది. వీరిద్దరే కాదు అనేక మంది ఫిజియోథెరఫీతో ఉపశమనం పొందుతున్నారు. పుట్టుకతో వచ్చిన లోపాల నుంచి వృద్ధాప్యం వచ్చే కండరాల బలహీనత, పక్షవాతం వంటి వ్యాధులకు సమర్థంగా చికిత్సలు అందిస్తున్నారు. పటమటకు చెందిన 15 ఏళ్ల బాలిక గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీఎస్)కు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందినా కండరాలు సాధారణ స్థితికి రాలేదు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఫిజియోథెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ థెరపీలతో ఆమె సాధారణ స్థితికి వచ్చింది. -
అరకొరగానే యూరియా
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. రైతులు యూరియా పూర్తి స్థాయిలో అందుతుందని ఎదురు చూడగా అధికారులు కేవలం అరకొర యూరియా మాత్రమే రైతులకు అందజేశారు. దీంతో రైతులు అధికారుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వణుకూరులో వాగ్వాదం.. రైతులు చాలా కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం వణుకూరు గ్రామానికి కేవలం 10 టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతుండగా కేవలం 10టున్నుల యూరియా మాత్రమే రైతులకు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి వచ్చి యూరియా పంపిణీని పరిశీలించారు. యూరియా చాలినంత ఇవ్వక పోవటంపై రైతులు ఆమెను ప్రశ్నించారు. ప్రభుత్వం త్వరలో యూరియా సరఫరా చేస్తుందని ఆమె రైతులను నచ్చ చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కట్టల కోసం పడిగాపులు కాశారు. రైతుకు గరిష్టంగా 3 బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. రైతులకు తాగటానికి నీరు కూడా ఇవ్వలేదు. ● పెదపులిపాక సొసైటీలో కూడా 15 టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా రైతులు యూరియా కోసం రాగా రైతులకు 3 బస్తాల యూరియా సీలింగ్ పెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి కనకమేడల శైలజ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి పాల్గొన్నారు. అవసరం మేరకు సరఫరా చేయండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరం మేరకు ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహీర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12 వేల టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, ఆర్డీవో స్వాతి, ఏవో శాంతి పాల్గొన్నారు. పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటన.. గూడూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదివారం కృష్ణాజిల్లా పామర్రు మండలం జుఝ్జవరం, గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి యూరియా పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో రాజశేఖర్ ముఖాముఖీ మాట్లాడారు. పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ -
ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలను ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు, ఇమామ్లకు, పాస్టర్లకు గౌరవ వేతనాలను ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యేడాది కాలంలో ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి ముస్లింలకు ఇవ్వవలసిన గౌరవ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడు ముందడుగేస్తుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు గౌరవ వేతనాలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కంచికచర్ల: వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వర్గం ఫిర్యాదే తీసుకుంటారా అని దళితులు పోలీసులను ప్రశ్నించారు. తమ వర్గం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆదివారం రాత్రి కంచికచర్ల పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పరిటాల దళితవాడలో శనివారం నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు ఒక వర్గం వారిపై కేసు నమోదు చేశారు. తమ వర్గంలో ఉన్నవారికి కూడా దెబ్బలు తగిలాయని వారిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్స్టేషన్ వద్ద దళితులు ఆందోళన చేశారు. ఆందోళనకారుల వద్దకు సీఐ చవాన్దేవ్, ఎస్ఐ విశ్వనాఽథ్ వెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రెండో వర్గంపై కూడా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. -
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం పట్టణ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ జి.రాజు మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన నేరస్తుడిని, దోపిడీ చేసిన బంగారు, వెండి నగలను మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ జి.రాజు, ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు, నందిగామ, జగ్గయ్యపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశారన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు శీలంశెట్టి వెంకటరమణను హైదరాబాద్లో శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ జనగాం జిల్లా రాజీవ్నగర్ కాలనీకి చెందిన నేరస్తుడిపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇతని నుంచి రూ.6 లక్షల విలువైన సుమారు 85 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంట్) జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. విజయవాడ నగరానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డికి నందిగామ, పెనమలూరు నియోజకవర్గాలను కేటాయిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలను తంగిరాల రామిరెడ్డికి, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలను ఆళ్ల చెల్లారావుకు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. అలాగే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు షేక్ సలార్దాదా, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు మాదు శివరామకృష్ణ, పెడన, పామర్రు నియోజకవర్గాలకు అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి (చిట్టిబాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఘాట్రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ భక్తజనుల అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షించారు. కోడూరు: ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని ఎరువుల, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను అధికారులు గుర్తించారు. బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈ–పోస్ మిషన్లను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న స్టాక్కు దుకాణంలో ఉన్న ఎరువుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. దుకాణంలో రూ.2లక్షల విలువైన 13 టన్నుల ఎరువులకు ఏ విధమైన పత్రాలు లేనట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒమర్ తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు నెల వ్యవధిలో మూడు సార్లు ఎరువులు దుకాణాలపై దాడులు జరపడం గమనార్హం. కోడూరు: హంసలదీవి సాగర తీరంలో పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రంలో గుంతలు ఏర్పడడంతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు తీరానికి తరలివచ్చారు. వీరంతా సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మైరెన్ పోలీసులు లౌడ్స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు గస్తీ చేపట్టారు. ఎస్ఐలు పూర్ణమాధురి, ఉజ్వల్కుమార్ పర్యవేక్షించారు. -
దేవాలయాల ద్వారాలు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల తలుపులను ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఈవో శీనానాయక్ సమక్షంలో ఆలయ తలుపులు మూసివేశారు. అమ్మవారి ప్రధాన నివేదన శాలతో పాటు అన్నదానం, లడ్డూ పోటులోని ఆహార పదార్థాలు, సరుకులపై దర్భలను ఉంచామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కామథేను అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఘాట్రోడ్డులోని ప్రధాన ద్వారాలను కూడా సెక్యూరిటీ సిబ్బంది మూసివేసి భక్తులెవరినీ కొండపైకి అనుమతించలేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పరిసరాలు గ్రహణం నేపథ్యంలో వెలవెలబోయాయి. సంప్రోక్షణతో.. గ్రహణ అనంతరం సోమవారంతెల్లవారుజామున నదీ తీరం నుంచి జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సుబ్బారాయుడి ఆలయంలో.. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేసేన సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మద్యాహ్నం 12.30 గంటల నుంచి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతమ్మ ఆలయం.. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 11 గంటలకు కవాటుబంధనం చేసి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో అర్చకుల చర్యలు -
పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకం
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకిలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకానికి దిగారు. వృద్ధ దంపతుల స్థలంపై ఎమ్మెల్యే కన్నేశారు. వృద్ద దంపతులకు నాదెళ్ల భానుతో కొంతకాలం సరిహద్దు వివాదం సాగుతోంది. సంబంధం లేకపోయినా స్థల వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు. బోడె ప్రసాద్ తీరుపై వృద్ధ దంపతులు మండిపడుతున్నారు. పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరులు.. అక్రమంగా గోడకట్టించారు. 10 రోజుల క్రితం స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు మొక్కలు నాటారు.‘‘పోరంకిలో మేం ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్నాం. నాదెళ్ల భాను అనే వ్యక్తికి, తమకు సరిహద్దు వివాదాలున్నాయి.. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు మా స్థలంతో ఎలాంటి సంబంధం లేదు. అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు. పది రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూలమొక్కలు పెట్టించారు. నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు మా స్థలంలో గోడ కట్టారు’’ అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులే దగ్గరుండి మరీ గోడ కట్టించారు. గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు బోడే ప్రసాద్ మనుషులు నా భర్త పై దాడి చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా లాగి పడేశారు. మాకు న్యాయం చేయాలి’’ అంటూ బాధితురాలు వేడుకుంటున్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
జైలు నుంచి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ(ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న(శనివారం) సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ(ఆదివారం) వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయరెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.పాస్పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్ను యాక్టివ్లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. -
తాంబూలాలిచ్చాం...తన్నుకు చావండి!
పెనమలూరు: మద్యం వ్యాపారుల మధ్య పోటీ మందుబాబులకు మజా సంగతేమో కాని జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కూటమి ప్రభుత్వం బార్ షాపులకు అనుమతులు ఇచ్చింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 బార్లకు టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాలుగు వైన్ షాపులు అమలులో ఉన్నాయి. గంగూరు చేపల కుండీలు వద్ద (పోరంకి పరిధి) మద్యం ప్రియులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గతంలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే ఒక వైన్ షాపు పెట్టి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేశారు. వైన్ షాపులో మద్యం తాగిన వారు జాతీయ రహదారి పైకి వచ్చి వీరంగం వేస్తుండటంతో అనేక ప్రమాదాలు జరిగాయి. కొత్తగా బార్షాపు గతంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న వైన్షాపునకు ఆనుకునే కొత్తగా బార్షాపు పెట్టారు. షామియానా వేసి రెస్టారెంట్ ఆండ్ బార్ అని బోర్డు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న వైన్షాపు..బార్ షాపు నిర్వాహకుల మధ్య గొడవ మొదలయింది. మద్యం ప్రియులను ఆకట్టుకోవటానికి ఒకరితో ఒకరు పోటీలు పడి రండి బాబూ..రండి అని చేపల మార్కెట్లో పిలుస్తున్నట్లు మద్యం ప్రియులను ఆహ్వానిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వివాదం బార్ షాపులో లూజ్ మద్యం విక్రయాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేయకూడదు. బార్లో ఏ ధరకై నా మద్యం అమ్ముకోవచ్చు. వైన్ షాపులో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంది. వైన్ షాపునకు పర్మిట్రూమ్ ఉంటుంది. బార్ షాపులో ఇతర సౌకర్యాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేస్తుండడంతో వ్యాపారుల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇరువురూ పరస్పరం నిఘా పెట్టుకున్నారు. ప్రమాద ఘంటికలు గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే రెండు మద్యం షాపులు ఉండటంతో వాహనాలపై వచ్చిన వారు ఇక్కడే మద్యం తాగి ఆ తరువాత వాహనాలు నడుపుతూ వెళుతున్నారు. మద్యం ప్రియులు రాత్రి సమయాల్లో జాతీయ రహదారి పక్కనే కూర్చుని మద్యం తాగుతూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. రెండు మద్యం షాపుల మధ్య పోటీతో మాకు సంబంధంలేదు. నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చాం. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకోవాలి. – శేషగిరి, సీఐ, ఎకై ్సజ్ శాఖ -
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఏడీ వీరాస్వామి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 120లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు డీడీ శ్రీనివాస్కు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ట్రాక్టర్ను, జేసీబీను స్వాధీనం చేసుకుని వీఆర్వో శ్రీనివాస్కు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వత్సవాయి: వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరి (24) అదే మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒకరు అనారోగ్యంగా ఉన్నట్టు ఫోన్ రావడంతో గౌరవరం నుంచి అనుమంచిపల్లి వెళ్లే క్రమంలో రహదారి పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. దస్తగిరికి అవివాహితుడు. తల్లి జాన్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిల్లకల్లు – వైరా రహదారిలో పెద్ద కాలువ వద్ద జరిగిన మరో ప్రమాదంలో మక్కపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు(25) మరణించాడు. వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం మక్కపేట నుంచి చిల్లకల్లు వెళ్తుండగా పెద్ద కాలువ సమీపంలో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించి చికిత్స చేస్తుండగా శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఏడాది వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతుని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్(ఏఐ–4 ఎస్యూఆర్ఈ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం డీఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త – ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. నిట్ – వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ రెండు సెషన్లలో ఆరుగంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, గ్రామీణ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.కల్పన, అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఏఐ ఫర్ ష్యూర్ శిక్షణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
వానొచ్చెనంటే...వరదొస్తది!
శనగపాడు నుంచి నందిగామ వెళ్లేందుకు శనగపాడు వద్ద గండివాగు, అనాసాగరం వద్ద మరో వాగు ఉంది. వరదలకు మా గ్రామం వద్ద గండివాగు పొంగి వాగు చప్టా గత ఏడాది, ఈ ఏడాది కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాగుపై వంతెన నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయి. –కీసర లోకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, శనగపాడు ఏకొద్దిపాటి వర్షమొచ్చినా గండివాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు, రైతులు పొలాలకు వెళ్లలేక పోతున్నారు. వాగు చప్టా వద్ద వంతెన నిర్మించాలి. ఆగస్టు నెలలో మూడు సార్లు వాగు పొంగింది. అధికారులు ఇప్పటికై నా దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలి. –బరిగెల నాగరాజు, లింగగూడెం పెనుగంచిప్రోలు: వాగుల వద్ద వంతెనలు లేక మండల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాగులు ఉధృతంగా ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మండలంలో వాగులపై చప్టాలు ఉన్నా వర్షాకాలం వాగులు పొంగి చప్టాలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోవటంతో జనజీవనం పూర్తిగా స్తంభిస్తోంది. వాగులు పొంగటంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేరు. ప్రయాణికులు ఎటూ వెళ్లలేక ఇంటికి పరిమితం అవుతున్నారు. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షాలకు వాగులు పొంగినప్పుడల్లా ఇవతల గ్రామాల ప్రజలు అటు వెళ్లలేక..అవతల గ్రామాల ప్రజలు ఇటు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఆగస్టు నెలలోనే మూడుసార్లు వర్షాలకు వాగులు పొంగి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు వంతెనల గురించి, రోడ్లు గురించి ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అంచనాలు పంపించాం అని చెప్పి ఊరుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుల వద్ద వంతెనలు నిర్మించటంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. వానలకు పొంగే వాగులు ఇవే కూలే స్థితిలో కల్వర్టులు మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం వాగులపై నిర్మించిన చిన్నపాటి కల్వర్టులు పూర్తిగా శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనిగండ్లపాడు ఊరు ముందు దూళ్లవాగుపై కల్వర్టుకు రెండు వైపులా రెయిలింగ్ ఊడిపోవటంతో పాటు పూర్తిగా శిథిలమైంది. గుమ్మడిదుర్రు ఊరు ముందు వాగుపై కల్వర్టు వరదలకు పూర్తిగా కుంగిపోవటంతో పాటు తాత్కాలికంగా వేసిన తూములు కూడా వరదకు బయటకు వచ్చాయి. ఈ కల్వర్టుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
వినాయక నిమజ్జనంలో కత్తులతో నృత్యాలు
వీరులపాడు: వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత మారణాయుధాలతో హల్చల్ చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది యువత అత్యుత్సాహంతో పసుపు కండువాలు వేసుకుని డీజే సౌండ్స్, సినిమా పాటల మధ్య కత్తులు చేత పట్టుకుని నృత్యాలు చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే యత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని, భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి యువకుడు మృతి చల్లపల్లి: నదిలో నడిచి వస్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి ఓ యువకుడు నీటిలో మునిగిపోయి విగత జీవుడైన ఘటన మండల పరిధిలోని నిమ్మగడ్డ వద్ద కృష్ణానదిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ శివారు నిమ్మగడ్డ గ్రామానికి చెందిన మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు మేడేపల్లి తేజబాబు(20) శనివారం ఉదయం కృష్ణానది మధ్యలో ఉన్న తమ లంక పొలాలకు నదిలో నీటిలో నడిచి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరొక వ్యక్తితో కలిసి తిరిగి నదిలో నడుస్తూ వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకీ పైకి తేలకపోవటంతో పక్కనున్న వ్యక్తి ఊళ్లో వారిని పిలుచుకొచ్చాడు. తేజబాబు మునిగిన చోట నీటి లోపల పెద్ద గుంట ఉండటంతో లోపల ఇరుక్కుపోయి ఉంటాడని గమనించిన స్థానికులు వలలు వేసి బయటకు తీయగా అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. తేజాబాబు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇటీవలే అప్రెంటీస్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉత్సవ ఏర్పాట్లు, పనుల ఆకస్మిక తనిఖీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం మహా మండపం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం, మల్లేశ్వరాలయం నుంచి కొండ దిగువకు జరుగుతున్న ర్యాంప్, మెట్ల నిర్మాణంతో పాటు ప్రసాదాల పోటు భవనాల పనులను ఆయన పరిశీలించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఆయా భవనాల్లో అన్ని పనులు పూర్తి కావాలని, అదే సమయంలో పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కనకదుర్గనగర్, రథం సెంటర్లో జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నూతన అన్నదానం, ప్రసాదాల పోటులో పూజలు మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులో శనివారం కమిషనర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారథ్యంలో అర్చకులు అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాల్లో పాలు పొంగించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు నిరంతరం ప్రసాదాలను అందించేందుకు ఈ రెండు భవనాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదం, ఉచిత లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం రైతులనూ ఘోరంగా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత జన జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నం పెట్టే రైతుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. పంట దిగుబడులు సక్రమంగా లేక, గిట్టుబాటు ధర అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలపై పగ సాధిస్తోందన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో యూరియా కోసం రైతన్నలను రోడ్డెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అందుకే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ముందుకొచ్చిందన్నారు. ఈ నెల 9వ తేదీన రైతులకు మద్దతుగా అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను సమర్పిస్తామన్నారు. రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, రైతు సంఘాల నాయకులు సాయిబాబా, రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులను జైల్లో పెడతారా..? యూరియా అడిగితే రైతులను జైల్లో పెడతా మంటూ ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటని దేవి నేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవాల్సింది పోయి వారినే జైల్లో పెడతామంటూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్న రైతులను కించపరుస్తూ విమర్శించడం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి నేతలు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కాక తప్పదన్నారు. -
లోడింగ్ను అడ్డుకున్న లారీ యజమానులు
ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఎన్టీటీపీఎస్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ను రద్దు చేయాలని స్థానిక లారీ ఓనర్లు, డ్రైవర్లు శనివారం లోడింగ్ పనులను అడ్డుకున్నారు. బూడిదకు డిమాండ్ లేని సమయంలో ఎన్టీటీపీఎస్ అధికారుల సలహాతో ఈ ప్రాంతానికి చెందిన తాము సుమారు 400 లారీలు కొనుగోలు చేసి 30 ఏళ్లుగా బూడిద రవాణాపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. దూరం బట్టి లారీ బూడిదను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్న తాము ఇప్పుడు లారీకి రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు, డీజిల్ ఖర్చులకే వచ్చే ఆదాయం సరిపోతే తాము ఎలా బతకాలని వాపోతున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకే సుమారు 300లపైగా లారీలు ఉన్నాయని తెలుస్తోందని, తమకు అసలు బూడిద ఇస్తుందో లేదో కూడా తెలియదని స్థానిక లారీ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. -
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖలో 92 శాతానికి పైగా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులదే కీలక భూమిక అని డెమోక్రటిక్ పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను అన్నారు. గత 40 ఏళ్లుగా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ అపరిష్కతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ హోటల్ ఐలాపురంలో శనివారం రాష్ట్ర బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను ఉపాధ్యాయుల సమస్యలను మాధవ్కు వివరించారు. అనంతరం మాధవ్ను శాలువాతో సత్కరించి భారతమాత జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో. విద్యారంగంలో విశిష్టమైన కృషి చేసిన 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను -
తెలుగు వెలుగును భావి తరాలకు అందించాలి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తెలుగు భాష వెలుగులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ, చెన్నపురి తెలుగు అకాడమీ (చైన్నె) సంయుక్తంగా ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి సంవ త్సరం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనిషి అవసరం రీత్యా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. ఆచార్య దోణప్ప తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రాచీన తెలుగు విషయాలతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి గొప్పతనాన్ని పిల్లలకు తెలపాలని కోరారు. మనదేశాన్ని భయపెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన దేశం ఆయిల్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తే అమెరికాకు ఎందుకని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూరం శ్రీనివాసులు, డాక్టర్ తూమాటి సంజీవరావు, గుమ్మా సాంబశివరావు, తూమాటి ప్రేమ్నాథ్ పాల్గొన్నారు. ● సభ అనంతరం జరిగిన సదస్సులో తమిళ సాహిత్యంలో తెలుగు ప్రాచీనత – విశిష్టతపై డాక్టర్ గాలి గుణశేఖర్, విశిష్ట తెలుగు భాష నేపథ్యంపై గారపాటి ఉమామహేశ్వరరావు, విశిష్ట తెలుగు భాష – వ్యాకరణ ప్రాశస్త్యంపై డాక్టర్ లగడపాటి సంగయ్య, తెలుగు పాఠ్య ప్రణాళిక, పరిశోధనపై బీరం సుందరరావు, తెలుగులో వ్యాఖ్యాన విశిష్టత గురించి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ, నేటి తెలుగు–స్థితిగతులు గురించి జాగర్లపూడి శ్యామ్సుందర శాస్త్రి ప్రసంగించారు. -
చంద్రగ్రహణం.. రేపు దుర్గగుడి మూసివేత
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా రేపు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) విజయవాడ దుర్గమ్మవారి గుడిని మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం గం. 3.30ని.లకు దుర్గగుడితో పాటు ఉపాలయాలు కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. గ్రహణ మోక్షకాల అనంతరం అంటే 8వ తేదీ లెల్లవారు జామున 3 గంటలకు కవాట ఉద్ఘటన( తిరిగి తలుపులు తీయడం) ఉంటుంది. స్నపనాభిషేకాల అనంతరం ఉదయం గం. 8.30ని.ల నుంచి తిరిగి భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. -
ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పకు బెయిల్
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయగా ఆయన 117 రోజులుగా జైల్లో ఉన్నారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అరెస్ట్ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.కాగా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిట్ భేతాల కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందన్నారు. ‘‘లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేక పోయింది. కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మనోహర్రెడ్డి అన్నారు.బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈ రోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. -
మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది.అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట ఎదుట విచారణకు హాజరయ్యారాయన. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదేరోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. మిథున్రెడ్డి పిటిషన్కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
ఉత్సవాల ముసుగు
భారీ దోపిడీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈవెంట్లు నిర్వహించడమే తప్ప ప్రజల సాధకబాధలు గురించి పట్టించుకునే రకం కాదు. గతంలో రాష్ట్రాన్ని ఒక కంపెనీగా, తాను ఒక సీఈఓలా వ్యవహరించిన చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో మైసూరు దసరా ఉత్సవాల స్థాయిలో చేస్తామంటూ విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత సన్నాహాలు చేస్తున్నారు. ఈ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి భారీ ప్రణాళిక రచించారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విజయవాడలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఫార్మా కాలేజి గ్రౌండులో గత రెండేళ్లుగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు కమిటీగా ఏర్పడి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే వారిని పార్లమెంటు ముఖ్యనేత తన వద్దకు పిలిపించుకుని, ఈ ఏడాది అక్కడ ఉత్సవాలు జరపవద్దని, తాను విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. మీరు ఉత్సవాలు నిర్వహిస్తే నేను నిర్వహించే ఉత్సవాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. దానిపై ఇప్పుడు టీడీపీ వర్గాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవు తోంది. పార్లమెంటు ముఖ్యనేత వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చూసీ చూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత విజయవాడ ఉత్సవ్ ముసుగులో భారీ దోపిడీకి ప్రణాళిక రచించారు. శతాబ్దాలుగా అత్యంత ఘనంగా జరుగుతున్న విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు సమాంతరంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను తన అక్రమార్జనకు పార్లమెంటు ముఖ్యనేత వేదికగా చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా విజయవాడ ఉత్పవ్ నిర్వహించడానికి పార్లమెంటు ముఖ్యనేత సిద్ధమయ్యారు. మైసూరులో జరిగే ఉత్సవాల కంటే ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని గొప్పలు చెబుతున్నారు. ఆ ఉత్సవం నిర్వహించడానికి పున్నమి ఘాట్ను కేటాయిస్తే వాటిలో స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు నో చెప్పడంతో.. దేవదాయ భూమిపై కన్ను విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, భక్తుల అవసరాల దృష్ట్యా పున్నమి ఘాట్ను కేటాయించలేమని ముఖ్యనేతకు అధికారులు తేల్చి చెప్పారు. దాంతో గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగు పేటలోని సర్వే నంబరు 454లో ఉన్న 39.99 ఎకరాల వెంకటేశ్వర స్వామికి చెందిన భూమిపైన కన్ను పడింది. ఆ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని దేవదాయ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో తన అధీనంలోకి తీసుకున్నారు. మట్టి తోలి చదును చేస్తున్నారు. ఈ భూమిలో విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్, వినోద కార్యక్రమాలు, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు ఉత్సవాల కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతూ ఆ స్టాల్స్ను భారీ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి తేర తీశారు. భవిషత్తులో ఈ భూమిని విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో లీజుకు తీసుకొని భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్నారని, టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలిక్లినిక్ రోడ్డులో ఉత్సవాలు నిర్వహించవద్దని హుకుం... -
డయల్ యువర్ కలెక్టర్కు రైతుల నుంచి విశేష స్పందన
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 కాల్స్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాలను నివృత్తి చేసే ఉద్దేఽశంతో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 45 కాల్స్ వచ్చాయి. కలెక్టర్ లక్ష్మీశ ప్రతి ఫోన్ కాల్ను స్వీకరించి రైతు చెప్పిన సమస్యను విని, ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి, పరి ష్కారానికి ఆదేశాలిచ్చారు. యూరియా వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలను రైతులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, నేల సారాన్ని కాపాడేందుకు నానో యూరియా ఉపయోగించాలని సూచించారు. విడతల వారీగా అవసరమైన ఎరువులను పంపిణీ చేసే విషయంలో ఎక్కడా ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని, కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్క్ఫెడ్ అధికారి నాగ మల్లిక తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీ బస్సులతో మా పొట్ట కొట్టారు!
విజయవాడ సిటీ బస్టాండ్లో ఆటో కార్మికుల భిక్షాటన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి తమ పొట్ట కొట్టిందంటూ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్(ఇఫ్టూ అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని సిటీ టెర్మినల్లో ఆటో కార్మికులు వినూత్నంగా చేతుల్లో బొచ్చెలు పట్టుకుని ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. తమ గోడును ప్రయాణికులతో వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఇఫ్టూ నాయకులు కె.పోలారి, దాది శ్రీనివాసరావు, మునిశంకర్లు మాట్లాడుతూ ఆటో కార్మికులను చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చ జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకుండా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి రూ.30వేల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 రద్దుతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 18వ తేదీన అన్ని ఆటో మోటారు సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇఫ్టూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు సీహెచ్ పెద్దిరాజు, డి.శ్రీధర్ బాబు, యాదగిరి, సూరిబాబు, వై.అప్పారావు, వలి, రఫీ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఏడాదిగా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలే నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లా డారు. పాలకులు అధికార మత్తు వీడి వైద్య రంగాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. తురకపాలెంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 30 మంది మృతి చెందారని, ఆరోగ్యశాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెల్లారితే గత ప్రభుత్వాన్ని వివర్శించడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందిందో ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియర్ వైద్యులను అడిగితే చెపుతారని డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రచార ఆర్బాటాలు కాకుండా, మరణాలకు కారణాలు తెలసుకుని, నివారణ చర్యలు చేపట్టా లని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న వారికి సైతం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు గుడివాడరూరల్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్ఐ పి.గౌతమ్కుమార్ గురువారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్టౌన్ సీఐ మాట్లా డుతూ.. గంజాయి అక్రమ రవాణాపై అందిన విశ్వసనీయవర్గ సమాచారం మేరకు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ పర్యవే క్షణలో స్థానిక ఎఎన్ఆర్ కళాశాల వెనుకవైపు తుప్పల ప్రాంతంలో దాడులు చేసి బేతవోలు పెదపేటకు చెందిన గొడవర్తి కిరణ్, బేతవోలుకు చెందిన పడ మట నాగస్వామి, ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఎలమర్తి నాని, కార్మికనగర్కు చెందిన మాదాసు రామకోటేశ్వరరావు, ఓర్స్ కిషోర్ను అరెస్ట్ చేశామన్నారు. వారికి సహకరించిన ఆరో వ్యక్తి బేతవోలుకు చెందిన పడమట మణికంఠ హనుమాన్ జంక్షన్లో దొంగతానికి పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడని పేర్కొన్నారు. మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశా మని, ఒకరు జైల్లో ఉండగా మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపర్చ న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారని వివరించారు. నిందితులను నెల్లూరు సెంట్రల్ జైల్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
7న ఆలయాల మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని ఈ నెల ఏడో తేదీ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు రాత్రి 9.56 నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు గ్రహణ కాలంగా ఉంటుందని దుర్గగుడి అర్చకులు పేర్కొన్నారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఏడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇంద్రకీలాద్రిపై ఇతర ఉపాలయాల తలుపులు మూసివేస్తామని వివరించారు. ఎనిమిదో తేదీ సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేయనున్నట్లు డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు బుధవారం తెలిపారు. దీంతోస్వామివారి నిత్య శాంతి కల్యాణం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయాన్ని 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం సందర్భంగా గ్రామంలోని శ్రీతిరుపతమ్మ ఆలయాన్ని 7వ తేదీ మహానివేదన అనంతరం 11 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈఓ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు నిత్య పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. -
మీడియాకు దూరం.. దూరం!
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న అధికారులు మీడియాకు మాత్రం దూరం దూరంగా ఉంటున్నారు. దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం రెండో సమీక్ష సమావేశం నిర్వహించింది. మొదటి సమీక్ష సమావేశంలోనూ మీడియాకు దూరంగా ఉన్న అధికారులు, ఇప్పుడూ అదే పంథాను అనుసరించారు. మూడు గంటల పాటు అధికారులు సమీక్ష నిర్వహించగా, మీడియాతో మాట్లాడేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఉత్సవ ఏర్పాట్లలో క్షేత్రస్థాయిలో లోపాలను మీడియా ఎత్తి చూపుతుందనే భావనతోనే దూరంగా ఉంటున్నట్లు దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది. -
జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?
ఇబ్రహీంపట్నం: మండలంలోని జూపూడి భీమేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన పేలుళ్ల వెనుక ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రాత్రి పేలుడు జరిగి, ఇద్దరు వెల్లింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ఇంటితోపాటు మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్డింగ్ మిషన్కు విద్యుత్ వినియోగించడం వల్లే పేలుడు జరిగిందని ఇంటి యజమానులు చెబుతుండగా, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు. బాణసంచా తయారీ వల్లే భారీ పేలుడు జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఇంటిలో జరిగిన భారీ పేలుళ్ల వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా పక్క జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు స్థానికులకు పేలుడు ముడిసరుకు ఇచ్చి బాణసంచా తయారీ చేయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాణసంచా తయారీకి వస్తువుల లెక్కన నగదు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. 3 కి.మీ. వినిపించిన పేలుడు శబ్దం జూపూడి భీమేశ్వరకాలనీలో జరిగిన పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వినిపించింది. పేలుడు సమయంలో దట్టమైన పొగ అలుముకుని భరించలేని దుర్వాసన వెలువడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పేలుడు జరిగిందని భావించిన కొందరు విద్యుత్శాఖ లైన్మెమన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఓ వైపు భారీ శబ్దం, మరోవైపు దట్టమైన పొగ, ఇంకో వైపు భరించరాని దుర్వాసన, కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు చీకట్లో ప్రాణం అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. కొందరు చీకట్లో బయటకు పరుగులు తీశారు. దళారుల ప్రమేయంతో బాణసంచా తయారీ పొరుగు జిల్లాకు చెందిన కొందరు పేదల కాలనీలను ఆసరాగా చేసుకుని బాణసంచా తీయారీ వృత్తిలోకి లాగుతున్నారు. వారి ఆర్థిక అవసరాలు తెలుసుకుని ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి ప్రమాదకరమైన ఈ వృత్తిలోకి తీసుకొస్తున్నారు. ఉల్లిపాయ బాంబులు వంద తయారీ చేస్తే ఒక రేటు, వెయ్యికి మరో రేటు చొప్పున ఒప్పుకొని కుటీర పరిశ్రమలా బాణసంచా తయారీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల కోసం తీసుకొచ్చిన ఉల్లిపాయ బాంబులను మెట్ల కింద ఉంచామని పేలుడు జరిగిన ఇంటి యజమానులు చెబుతున్నారు. మెట్ల కింద ఉంచిన ఉల్లిపాయ బాంబుల వల్లే భారీ విస్పోటనం జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రమాదానికి కారణం కోతుల కోసం తెచ్చిన ఉల్లిపాయ బాంబులా, తయారీ చేసినవా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పేలుడు తీవ్రతకు కుప్పకూలిన రేకుల ఇల్లు పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనం పొట్టకూటికోసం వచ్చి ప్రాణాపాయ స్థితికి.. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పేలుడు జరిగిన ఇంటి యజమానులు ఇంటి చుట్టూ ఐరన్ మెస్ ఏర్పాటు చేసేందుకు కోనాయపాలేనికి చెందిన వెల్డర్లు గోపీ, మహేష్ను పిలిపించారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిద్దరు పేలుడులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరారు. ఐరన్ మెస్ బిగిస్తున్న మహేష్ పేలుడు ధాటికి పక్కింటి రేకుల షెడ్డుపైకి ఎగిరిపడ్డాడు. రేకులు పగిలి నేలపై కుప్ప కూలి తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో వెల్డర్ గోపీపై ప్రహరీ కూలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపీని స్థానికులు బయటకు తీశారు. ఇద్దరినీ 108లో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గోపీ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ఇంటి యజమానులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాంవెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో బ్లాస్టింగ్ జరిగినట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. మేము చేపట్టిన పరిశీలనలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. క్లూస్ టీమ్ నివేదికలను బట్టి బ్లాస్టింగ్కు కారణాలు వెల్లడవుతాయి. పోలీస్ శాఖ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. నివేదికల ఆధారంగా త్వరలో పేలుళ్లకు కారణాలు వెల్లడిస్తాం. – దుర్గారావు, వెస్ట్జోన్ ఏసీపీ రేకుల షెడ్డు ధ్వంసమైంది నా భర్త చనిపోవడంతో ఒంటిరిగా బతుకీడుస్తున్నా. మా పక్క ఇంటిలో జరిగిన పేలుడు ధాటికి మా రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వెనక గోడలు కూలిపోయాయి. రేకులు పగిలిపోయాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. మళ్లీ ఇల్లు నిర్మించుకునే స్తోమతు లేదు. ఇంటి నిర్మాణానికి అధికారులు సహకారం అందించాలి. – మిద్దే శిరోమణి, కాలనీ వాసి -
సర్వీసు వైద్యులపై చిన్నచూపు తగదు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జీడీఏ ఏపీ సభ్యుల వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్వీసు వైద్యులపై ప్రభుత్వం కనబరుస్తున్న చిన్నచూపు తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సంఘ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్న వైద్యులు 25 ఏళ్ల సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని మంత్రికి వివరించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మూడు, నాలుగేళ్లకే సర్వీసులో ఉద్యోగో న్నతి పొందుతున్నారని వివరించారు. వైద్యుల ఉద్యోగోన్నతుల సమస్య పరిష్కారానికి తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డైనమిక్ అస్యూర్డ్ కేరీర్ ప్రోగ్రామ్ను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు. జనరల్ కేటగిరీ వైద్యులందరినీ ఏకీకృత సీనియారిటీ పరిధిలోని తీసుకు రావాలని, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని ఉన్నత స్థాయి పదవుల్లో వైద్యాధికారులను మాత్రమే భర్తీ చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జీడీఏ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇంజేటి బాబ్జీ శ్యామ్కుమార్, గౌరవాద్యక్షుడు డాక్టర్ పంజాల శ్రీని వాసరావు, డాక్టర్ స్వరూప్కాంత్, డాక్టర్ భానుకుమార్, డాక్టర్ యావ్, డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ గోపాల్నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. -
రైతులకు అందుబాటులో యూరియా
గౌరవరం(జగ్గయ్యపేట): జిల్లాలో అందుబాటులో యూరియా ఉందని రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో సొసైటీలోని ఎరువుల గోడౌన్ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగానే జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో జాయింట్ యాక్షన్ టీం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ టీం యూరియా సరఫరా ఎలా ఉంది.. బ్లాక్ మార్కెట్కు తరలుతుందా లేదాని చూస్తారని తెలిపారు. జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందు బాటులో ఉందని మరో వారంలో పల్నాడు జిల్లా నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పటికే 6ఏ కేసులు 11 నమోదు చేశామని తెలిపారు. రైతులు కూడా అవసరం మేరకే యూరియా తీసుకోవాలని ఇష్టానుసారం యూరియా వినియోగించొద్దని ఎకరాకు 90 కిలోల యూరియా సరిపోతుందని చెప్పారు. అనంతరం కార్యదర్శి నాగేశ్వరరావును స్టాకు వివరాలను, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, ఏడీఏ భవానీ, సీఐ వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ నరసింహారావు, ఏవో వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ -
యువత.. చెడు నడత
లబ్బీపేట(విజయవాడతూర్పు): కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఎక్కువ మంది యువత ఆలోచనలు ఉంటున్నాయి. ఈ తరుణంలో అనేక నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిలో విలాసాలకు అలవాటు పడిన వారు కొందరైతే, దురల వాట్లకు బానిసలైన వారు మరికొందరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో మోసాలకు పాల్పడుతున్న ఇంకొందరు. మోసం ఏ రూపంలో చేసినా పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో డబ్బు లావాదేవీల్లో మోసాలకు పాల్పడిన ఫిర్యాదులు పోలీస్ గ్రీవెన్స్లో ఎక్కువగా వస్తున్నాయి. నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్న వారు ఉంటున్నారు. ఇవే నిదర్శనం.. ఇవి మచ్చుక కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో మోసాలు, చోరీలు, చీటింగ్ కేసుల్లో అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్న వారే ఉంటున్నారు. అంతేకాదు సైబర్ నేరాలు, మాయ మాటలు చెప్పి, నమ్మబలికి డబ్బులు తీసుకుని మోసం చేయడం వంటి నేరాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్నేహితులు, బంధువులనూ వదలడం లేదు.. ఈజీ మనీ కోసం తెలియని వారినే కాదు, తమ స్నేహితులు, బంధువులను సైతం మోసం చేస్తున్నారు. సత్యనారాయణపురంలోని యుపిక్స్ కేసులో ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు ఉండటం గమనార్హం. కొందరు అమాయక ప్రజలు సైతం అధిక వడ్డీలు వస్తాయని అలాంటి వారి బుట్టలో పడిపోతున్నారు. ఇటీవల శిశువును ఇస్తామంటూ తెలంగాణకు చెందిన స్నేహితుడి నుంచే రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు సైతం ఫిర్యాదులు అందాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. డ్రగ్స్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు లోనై జీవితాలను అంధకారం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ మత్తులో నారాలకు పాల్పడితే అమలు చేసే శిక్షలు గురించి వివరిస్తున్నారు. అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత విద్యతోనే అత్యున్నత హోదా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.ఎదుటి వారితో పోల్చుకోవడం ఇటీవల ఎక్కు వైంది. అలాంటి వారు అనవసర ఆడంబరాలకు పోతూ, ఆదాయానికి మించిన ఖర్చులతో అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల పిల్లల్లో ఒకరు ఖరీదైన బైక్ వేసుకొస్తే, తమకు స్తోమత లేకున్నా అలాంటి బైక్ కొనాలని భావిస్తూ.. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో యువత డగ్ర్కు, ఆల్కాహాల్కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ గర్రే శంకరరావు, మానసిక నిపుణులు -
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నూతన సబ్ స్టేషన్లకు స్థలాలు పరిశీలించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించాలని సీఎండీ పి.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి అధ్వర్యంలో సీపీడీసీఎల్ సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, సీఆర్డీఏ, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల సర్కిల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థలాలు పరిశీలించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లు, సరఫరా లైన్లలో అంతరాయాలు తగ్గించాలన్నారు. ఇందు కోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యవసాయదార్లకు పగటిపూట తొమ్మిది గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలని, నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని, జాతీయ గ్రీన్ ఎనర్జీను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్.వెంకటేశ్వర్లు, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
ఆక్వా కుయ్యో.. రొయ్యో
గుడివాడరూరల్: ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాల భారం ఆక్వా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు మూడుశాతం ఉన్న సుంకాలను 50 శాతం మేరకు పెంచడం గుదిబండలా మారింది. రొయ్యల ధరలు పతనమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఏడాది దాటినా అమలు చేయకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలోనే ఆక్వా ఎగుమతుల్లో కృష్ణా జిల్లా అగ్రగామిగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు రొయ్యల, చేపల ఎగుమతులవుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 1,03, 977 ఎకరాల్లో రొయ్యల, చేపల చెరువులు సాగవుతున్నాయి. 46,385 ఎకరాలు రొయ్యల సాగును రైతులు చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా జిల్లాలో ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు, హేచరీలు, కోల్డ్స్టోరేజ్లు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలకు ఎక్కువగా రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. ఏటా 3 నుంచి 4లక్షల టన్నుల మేర ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రైతులకు ఆశాజనకమైన ధరలు లభించేవి. ఆంక్షలతో అవస్థలు ఎగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచడంతో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. 100 కౌంట్ ధర ప్రస్తుతం రూ.230, 90 కౌంట్ ధర రూ.240, 80 కౌంట్ ధర రూ.260, 70 కౌంట్ ధర రూ.285, 60 కౌంట్ ధర రూ.305, 50 కౌంట్ ధర రూ.325, 40 కౌంట్ ధర రూ.335కు పడిపోయాయి. ఇప్పుడు కౌంట్కు రూ. 100 నుంచి 135 వరకు తేడా వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో నాడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, ఇతర ఉపయోగాల రూపంలో ఆక్వా రైతులకు మంచి ధర పలికేది. హామీలు విస్మరించిన కూటమి ఆక్వా రంగంతో రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చేది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆక్వా రైతులకు భరోసా ఇస్తూ వాగ్దానాలు చేశారు. రొయ్యల పరిశ్రమకు ఎక్కువగా మేలు చేసే విద్యుత్ ధరలను యూనిట్కు రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లను సైతం ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే ఇచ్చిన వాటిలో ఒక్కటీ నెరవేరలేదు. ప్రస్తుతం యూనిట్ ధర రూ.3.84 ఉంది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రైతులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మేతల కొనుగోలుకు సైతం ధరలు తగ్గిస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కూటమి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే కొంత మేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన ఆక్వా రైతులకు నిరాశే ఎదురవుతోంది. రొయ్యల సాగులో లాభాలకు బదులు నష్టాలు రావడం, ధరలు పడిపోవడం, విద్యుత్ బిల్లుల భారం, అధికంగా రొయ్యల మేతల ధరలు పెరగడం, తరచూ వచ్చే వ్యాధుల దెబ్బకు రొయ్యల రైతులు సాగంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసి కనీసం విద్యుత్ బిల్లులు తగ్గిస్తారనే ఆశ.. నిరాశగా మారడంతో రైతన్నలు సాగంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీజులు ఎకరాకు రూ.90 వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు అందకపోవడంతో ఆక్వా రైతులు అప్పుల పాలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ప్రధాని వరకు తీసుకెళ్లి ఆక్వా రైతుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది.చాలా కాలంగా రొయ్యల సాగు చేస్తున్నాం. విద్యుత్ భారం అధికమైంది. రొయ్యల ధరలు సైతం పతనమయ్యాయి. పెట్టుబడి ఎక్కువైంది. వచ్చే లాభాలు కన్నా నష్టాలు తీవ్రమయ్యాయి. విద్యుత్ ధరలు తగ్గిస్తారని ఆశించాం. అది జరగలేదు. ప్రస్తుతం సాగు భారంగా మారింది. రొయ్యల్లో వ్యాధులు సైతం ఎక్కువ కావడంతో సాగు చేయడం కష్టంగా మారింది. అన్నీ నష్టాలే వస్తున్నాయి. –చింతాడ పెద్దిరాజు, ఆక్వా రైతు, ఎల్ఎన్పురం, నందివాడఎన్నికల సమయంలో విద్యుత్ ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాగులో విద్యుత్ వలన ఎక్కువగా పెట్టుబడి అవుతుంది. ట్రాన్స్ ఫార్మర్లు సైతం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ పెట్టుబడి కావడంతో ఆక్వా రైతులం ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న ట్రాన్స్ ఫార్మర్లను ఇవ్వడం లేదు. యూనిట్ ధరలను తగ్గించడం లేదు. ఆక్వా రైతులు విద్యుత్ ధరలను తక్షణమే తగ్గించి నష్టాల బారి నుంచి కాపాడాలి. –గురువెల్లి చంటి, ఆక్వా రైతు, ఎల్ఎన్పురం, నందివాడ -
8న అప్రెంటీస్ మేళా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తమ కళాశాల ఆవరణలో ఈ నెల ఎనిమిదో తేదీన అప్రెంటీస్ మేళా జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ సంస్థల్లో అప్రెంటీస్ చేసేందుకు అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల విద్యార్థులతో పాటుగా 2025 సంవత్సరంలో ఐటీఐ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, రెండు పాస్ఫోర్ట్ సైజు ఫొటోలు, పాన్కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, కులధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్తో పాటుగా మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే అప్రెంటీస్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి జి.కొండూరు: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పని చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. అల్లూరిసీతారామరాజు జిల్లా, జీకే వీధి మండల పరిధిలోని ఈకోడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(38) మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేసేందుకు ఈ నెల ఒకటో తేదీన వచ్చారు. ఇటుక బట్టీలో రెండవ తేదీ నుంచి పనిలో చేరిన ఈ ఆరుగురు కార్మికులు, గురువారం ఇటుక బట్టీలో ఉన్న పాత షెడ్డును తొలగించి మరో చోట నిర్మించే పనులను చేపట్టారు. ఈ క్రమంలో సన్యాసిరావు తొలగించిన షెడ్డు నుంచి ఇనుప రాడ్డుని పైకి తీసి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్లైనుకు తాకింది. విద్యుదాఘాతానికి గురైన సన్యాసిరావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సన్యాసిరావుని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఏపీలో మెడికల్ కాలేజీల అమ్మకానికి గ్రీన్సిగ్నల్!
విజయవాడ: ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి సిద్ధమైంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. -
ఏపీ కేబినెట్కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
బాబు సర్కార్కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
అన్నదాన పథకానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. మచిలీపట్నం(ఆజాద్ రోడ్)కు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.2 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్ట్స్, ఆరో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని చింత శివరామకృష్ణ రూ.1,00,116 అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 19 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. నగరంలోని 4వ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని 6వ అడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్డులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి లెనిన్బాబు జరిమానాలు విధించారు. ఒక్కరికి రూ.15 వేలు, 18 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా విధించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కానుకల హుండీలు దొంగతనానికి పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత పోస్టాఫీస్ రోడ్డులో ఉన్న కూర్తాళం పీఠంలో, మెట్లబజార్లోని శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పీఠంలోని హుండీని పద్మావతి ఘాట్లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని నగదు తీసుకుని హుండీని అక్కడే వదిలి వెళ్లిపోయారు. శివాలయంలోని హుండీలో నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఘాట్లోకి వాకింగ్ కోసం వెళ్లిన వాకర్స్ హుండీని చూసి పీఠం నిర్వాహకులకు సమాచారం అందించారు. శివాలయంలో పనిచేసే పని మనిషి బుధవారం ఉదయం గుడి వద్దకు వెళ్లిచూడగా హుండీ పగలగొట్టి ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఫుటేజీల ఆధారంగా రెండు ఆలయాల్లో ఇద్దరు వ్యక్తులే దొంగతనానికి పాల్పడ్డారని, వారు పాత నేరస్తులుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. -
ముక్కు కారడం సమస్యకు సర్జరీతో విముక్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెదడు ద్రవం ముక్కు ద్వారా కారడం వంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న 35 ఏళ్ల శేషుకుమారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒబెసిటీ కలిగిన పెరిమోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆ సమయంలో హార్మోన్ లోపం కారణంగా ఎముకలు బలహీనమవుతాయని తెలిపారు. మెదడు పొరలు బలహీనమై, దగ్గు, బలంగా తుమ్మడం, మలబద్దకం వంటి పరిస్థితులు సమస్యను మరింతగా ప్రేరేపిస్తాయన్నారు. శేషుకుమారి పదేళ్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతూ 2015లో విజయవాడ జీజీహెచ్లో, 2021లో గుంటూరులో ఓపెన్ క్రానియోటమీ సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. సమస్య మళ్లీ పునరావృతం కావడంతో ఆస్పత్రికి రాగా ఈఎన్టీ వైద్యులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సమస్య నుంచి ఉపశమనం పొందారన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతిలతను సూపరింటెండెంట్ అభినందించారు. -
చవితి వేడుకలు నిర్వహిస్తున్న బాషా ఆదర్శనీయం
ఘంటసాల: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడైన అక్బర్ బాషా(షామియాన) ఆధ్వర్యంలో ఘంటసాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని కృష్ణా మిల్క్ యూనియన్, వినాయక చవితి కమిటీ రాష్ట్ర చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఘంటసాలలో బాషా ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి వేడుకల్లో ఆంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చలసాని నిర్వాహకుడు అక్బర్ బాషా(షామియాన) – షర్మిల దంపతులను సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందించి అభినందించారు. దేశాభివృద్ధికి యువత సహకరించాలి అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఘంటసాల గ్రామంలో బాషా ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా వినాయక చవితి ఉత్సవాలతో ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమన్నారు. మొదటి రోజు పీటల మీద కూర్చుని వినాయకునికి పూజలు చేసిన బాషా, షర్మిల దంపతులను అభినందించారు. కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి యువత సహకరించాలని కోరారు. ముందుగా శ్రీ జలధీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంజనేయులను టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 2 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమాన్ని చలసాని స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగినట్లు అక్బర్ బాషా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి, పీఏసీఏస్ చైర్పర్సన్ బండి పరాత్పరరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, పాలకేంద్రం అధ్యక్షుడు గొర్రెపాటి సురేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్
పటమట(విజయవాడతూర్పు): పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్ అని, విజయవాడ నగరం సుందరంగా– పరిశుభ్రంగా ఉందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) వీఎంసీకి కితాబిచ్చింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ధ్యానచంద్ర చాంబర్లో జీఈఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి నగరంలో వారి పరిశీలను వివరించారు. వీఎంసీ–యూనిడో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామలింగేశ్వర నగర్ 20 ఎంఎల్డీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పునరుద్ధరీకరణ, బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ పురోగతిపై జీఈఎఫ్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ జీఈఎఫ్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీఎంసీ పర్యావరణ పరిరక్షణకు వీఎంసీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడం కోసం మరింత నిధులు అవసరమని, వారి ఆర్థిక సహాయంతో కేవలం వాడుక నీరు శుద్ధి చేయడమే కాకుండా, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి కాలువల డ్రెయిన్లు వంటివి నిర్మించేందుకు వారి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం జీఈఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలెట్ ఇన్ ఇండియా(సీఐఏపీ) ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఐదు పైలట్ నగరాలను ఎంపిక చేశామన్నారు. విజయవాడతో పాటు గుంటూరు, మైసూర్, భోపాల్, జైపూర్ నగరాల్లో ఈ ప్రాజెక్టుని అమలు చేశారని, ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంతర్జాతీయ పరిశీలకుడు రోనాల్డ్ వంగ్, జాతీయ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్ ష్రాఫ్, యూనిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, యూనిడో నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపిక శ్రీపాద, వీఎంసీ అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. -
పోలికతో ప్రమాదమే !
● పెరుగుతున్న కంపేరిజన్ సిండ్రోమ్ ● ఇతరులతో పోల్చుకొని కుంగిపోతున్న వైనం ● నగరానికే చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధిని ఇన్స్టాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాను పెట్టిన రీల్స్ కంటే, స్నేహితుల రీల్స్కు ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. తనకు తక్కువగా వస్తున్నాయని నిరాశ చెందుతోంది. ● విజయవాడకు చెందిన కార్తిక్ ఓ విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతి సెమిస్టర్లో 9 జీపీఏకు పైగా మార్కులు సాధిస్తున్నాడు. కానీ తనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చుకుంటూ ప్రతిసారీ తీవ్ర నిరాశకు లోనై ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు గమనించి ఓ సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. -
మీ పురస్కారాలు మాకొద్దు!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎవరికై నా పురస్కారం అనగానే ఎగిరి గంతేస్తారు. ఆ పురస్కారం కోసం ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకోవటం సహజం కనిపిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న తరువాత తమకు తెలిసిన ప్రజాప్రతినిధితోనో లేక ఇతర ఉన్నతాధికారులతోనే సిఫార్సులు సైతం చేయిస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగే తంతు. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో జరిగే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు గురువులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు వారిచ్చే పురస్కారాలకు సైతం ఆసక్తి చూపటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం 28 దరఖాస్తులే.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగే గురుపూజోత్సవానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఏటా వందలాదిగా దరఖాస్తులు వస్తుంటాయి. వాటి ఎంపికకు పెద్ద కసరత్తు చేసి వారిని ఎంపిక చేస్తుంటారు. కానీ ఈ ఏడాది జిల్లా పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి బుధవారం సాయంత్రానికి కేవలం 28 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇస్తామని ప్రకటించినా ముందుకు రాకపోవటంపై అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,160 మంది ఉపాధ్యాయులు ఎన్టీఆర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ఆయా విద్యాసంస్థలో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో నాలుగు వేలమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులవుతారు. అయితే అందుకోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎంపిక చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 60 మందికి ఇవ్వటానికి అధికారులు సమాయత్తమయ్యారు. తీరా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కేవలం 28 మంది మాత్రమే ఉండటంతో జిల్లా అధికారులకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనేనా? ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అందువల్లే కనీసం పురస్కారాలను తీసుకోవటానికి సైతం ముందుకు రాకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని అర్థంపర్ధం లేని యాప్లతో సతాయిస్తున్నారని వారు చెబుతున్నారు. తాజాగా విద్యార్థులు రాసిన పరీక్షల మూల్యాంకనం భారంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి ఆయా పరీక్షలు రాసిన బుక్లెట్లను దిద్దాలని నిర్ణయించటం వల్ల తరగతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటితో పాటుగా పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటంపైనా గురువులు తమకిచ్చే పురస్కారాలకు వ్యతిరరేకంగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా స్థాయిలో జరిగే గురుపూజోత్సవం వేడుకల్లో ఏటా విద్యాశాఖ సుమారు 50 నుంచి 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తోంది. వివిధ కేటగిరీలతో పాటుగా ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పురస్కారాలను వారికి ప్రదానం చేయటం పరిపాటి. కలెక్టర్ లేదా మంత్రి వంటి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ఆ ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది 60 మంది కి పురస్కారాలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది ఈ గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాది ఇంకా అధికంగా గురువులు దరఖాస్తు చేసుకుంటారని అధికాారులు భావించారు. కానీ అందుకు భిన్నంగా దరఖాస్తులే రాకపోవటంపై సర్వత్రా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చందర్లపాడు(నందిగామ టౌన్): ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న తైవాన్ జామ తోటను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఎకరా విస్తీర్ణంలో 444 మొక్కలు నాటారని పథకం కింద రూ.2.51 లక్షల సాయం అందుతుందన్నారు. మొదటి ఏడాది రూ.1,26,110, రెండో ఏడాది రూ.60,707, మూడో ఏడాది రూ. 64,407 చొప్పున రైతుకు అందుతుందని తెలిపారు. ఉద్యాన పంటలతో పాటు పశుపోషణను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బంగారు కుటుంబాలతో.. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ముప్పాళ్ల గ్రామంలోని బంగారు కుటుంబాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలోని చెరువులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. నందిగామ పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని యూరియా, తదితర ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, చందర్లపాడు ఎంపీడీవో పద్మజ్యోతి, నందిగామ డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు పాల్గొన్నారు. -
తప్పుల్లేని భూ రికార్డులే లక్ష్యం
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంకిపాడు: ఎలాంటి తప్పులు లేకుండా నాణ్యమైన భూమి రికార్డులను అత్యంత బాధ్యతతో రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ, ఉయ్యూరు డివిజన్ల అధికారులకు స్వామిత్వ సర్వేపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కంకిపాడులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని, భూమిని సరిహద్దులతో గుర్తించి, సర్వే నంబర్ కేటాయించేలా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రికార్డులను రూపొందించేందుకు స్వామిత్వ సర్వే దోహద పడుతుందన్నారు. ఆర్ఎస్ఆర్ మాదిరిగా స్వామిత్వ సర్వే రికార్డులు మదర్ రికార్డు అవుతుందన్నారు. భూమి రికార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా నాణ్యతాయుతంగా రికార్డులను తయారు చేయటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, సర్వే భూ రికార్డుల ఏడీ జోషిలా, డీఎల్పీఓ సంపత్కుమారి, డీఎల్డీఓ రాజేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఆయా డివిజన్ల పరిధిలోని 175 గ్రామ పంచాయతీలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్ బుధవారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రి దిగువన క్యూ లైన్ల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఉత్సవాల సమయంలో భక్తులకు మెరుగైన దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాత ఆర్బీ ఫ్రేమ్ల స్థానంలో సింహాచలం దేవస్థానం నుంచి తెప్పించిన క్యూ ఫ్రేమ్ల ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రసాదం పోటు భవనంలో డ్రెయినేజీ తదితర పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కొండపై భాగంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పూజా మండపాల పనులకు సంబంధించిన వివరాలను ఈఈ–1 కేవీఎస్ కోటేశ్వరరావు ఈఓ శీనా నాయక్కు వివరించారు. మిగిలిన 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మిగిలిన 12 బార్లకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు తెలిపారు. మొత్తం 12బార్లకు గానూ గుడివాడ పట్టణంలో ఆరు, మచిలీపట్నం కార్పొరేషన్లో నాలుగు, పెడన మునిసిపాలిటీలో ఒకటి, బందరు మండలం మంగినపూడిలో ఒక టూరిజం బార్కు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 14వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వీటికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సమక్షంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9963604239, 8466981837లో సంప్రదించాలన్నారు. ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరికి కీలక పదవి లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరి నాగ వరప్రసాద్ ఏషియన్ మస్క్యూలో స్కేలేటల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల సింగపూర్లో జరిగిన సొసైటీ 27వ వార్షిక సమావేశంలో డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సొసైటీ ఏర్పాటైన రెండున్నర దశాబ్దాల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు వర ప్రసాద్ కావడం విశేషం. ఆయన ఆగస్టు 2027 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల కాలం వరకూ ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్ఐఏ)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్కు(ఐసీఆర్ఐ)కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి నందిగామ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న స్వామిత్వ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ముందుగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠాలలోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించేందుకే ప్రభుత్వం స్వామిత్వ సర్వేను నిర్వహిస్తోందన్నారు. స్వామిత్వ సర్వే పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారా జరుగుతున్న సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో బాలకృష్ణ, డీఎల్పీవో రఘువరన్, తహసీల్దార్ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీలో రిషి కీర్తన సత్తా లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని కె. రిషి కీర్తన ఆర్చరీలో సత్తా చాటినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పద్మజ తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆగస్టు 24 నుంచి 26 వరకూ తిరుపతిలో నిర్వహించిన అమరావతి చాంపియన్ షిప్ 2025లో ఆర్చరీలో కె. రిషి కీర్తన ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన కీర్తనను ప్రిన్సిపాల్ పద్మజతో పాటు అధ్యాపకులు అభినందించారు. -
పది గంటలు!
● యూరియా కొరత.. రైతన్న కుతకుత! ఒక్క కట్ట కోసం.. ఇంతటి దారిద్య్రం ఎప్పుడూ లేదని అన్నదాతల ఆక్రందనఅవనిగడ్డ/కంకిపాడు: ఎరువుల కొరత రోజు రోజుకీ తీవ్రతరమవుతోంది. పంటకు అవసరమైన సమయంలో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్లో యూరియా ఎప్పుడు వస్తుందా? అన్న ఆశతో ఎరువుల దుకాణాల వద్దే రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. ఇప్పటి వరకూ 1.34 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండు నెలల నుంచి నెల రోజుల పంట పొలాల్లో ఉంది. కొన్ని గ్రామాల్లో వరిపైర్లు దుబ్బు చేసి చిరు పొట్ట దశకు చేరువ అవుతున్నాయి. యూరియా లభ్యతపై జిల్లా వ్యవసాయశాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. ఆగస్టు నాటికి 27,299టన్నులు యూరియా జిల్లాకు అవసరమని వ్యవసాయశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఉన్న యూరియా నిల్వలతో కలిపి 28,743టన్నులు ఉండగా ఆగస్టు నాటికి 27,299 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని, ఇంకా 1,443 టన్నులు యూరియా మార్కెట్లో నిల్వ ఉందని లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి యూరియా దొరక్క రైతులు విలవిల్లాడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిండి (ఎరువులు) చల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. బుధవారం కొన్ని చోట్లకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారు జాము నుంచే పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. మొత్తం 322.425 టన్నుల యూరియా లోడ్లు వచ్చాయి. వీటి కోసం లైన్లు వేసేందుకు కొన్నిచోట్ల రైతుల మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. వచ్చిన లోడులు తక్కువ కావడంతో చాలా మంది రైతులకు యూరియా అందలేదు. నాట్లు వేసిన వారం పదిరోజుల లోపు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. కొన్నిచోట్ల 30 నుంచి 40 రోజులు అయినా యూరియా అందకపోవడం వల్ల ఎరువులు వేయలేదు. దీంతో పిలకలు పెరగక పంట ఎదుగుదల లేకుండా పోయిందని కొంతమంది రైతులు చెప్పారు. 40 నుంచి 50 రోజులు దాటితే పిలకలు పుట్టవని, అప్పుడు ఎరువులు వేసినా ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. ఎకరం అంతకంటే తక్కువ ఉంటే కట్ట చొప్పున యూరియా ఇచ్చారు. రెండు నుంచి ఐదు ఎకరాలు ఉంటే రెండు కట్టలు ఇచ్చారు. కానీ కూటమి పార్టీలకు అనుకూలమైన వారు వస్తే మూడు, నాలుగు కట్టలు కూడా ఇచ్చారు. ఐదు, పదెకరాలు కౌలుకు సాగుచేస్తున్న కొంతమంది రైతులకు రెండు కట్టల కంటే మించి ఇవ్వలేదు. వాళ్లిచ్చే యూరియా సగానికి కూడా చాలదని ఏమి చేయాలో తెలియడం లేదని కొంతమంది కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఒక ఎకరం సొంత పొలం ఉండగా, మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటల వచ్చాను. పది గంటలు పడిగాపులు పడితే ఒక కట్ట యూరియా ఇచ్చారు. ఇంతవరకూ ముఖం కూడా కడగలేదు. నాలుగు ఎకరాలకు కనీసం రెండు కట్టలయినా కావాలి. ఒకకట్ట ఇస్తే ఎలా సరిపెట్టాలి. ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు. – బచ్చు నాగబసవయ్య, మోదుమూడి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్–2025 సీజన్కు సంబంధించి ఎరువుల సరఫరాపై సమస్యలు, ఫిర్యాదులతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అవసరాల మేరకు సమృద్ధిగా ఎరువులు ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ ఏర్పాట్లు, ఫిర్యాదులు, సమస్యలను 91549 70454కు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు తెలియజేయవచ్చన్నారు. -
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రాధాన్యం గల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తీరుతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రహదారి కష్టాలకు మద్దూరు–గోసాల రోడ్డు మార్గమే నిలువెత్తు నిదర్శనం. ప్రయాణం.. నరకప్రాయం.. విజయవాడ–దివిసీమ కరకట్ట రహదారి నుంచి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మార్గం మద్దూరు– గోసాల రోడ్డు. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్డు పూర్తిగా అడుగడుగునా గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్జిన్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. మద్దూరు, వణుకూరు, గోసాల గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటుగా కరకట్ట మీదుగా విజయవాడ, దివిసీమ ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏలూరు రోడ్డు సమీపంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లాలన్నా మద్దూరు–ఈడుపుగల్లు మీదుగా ఉప్పలూరు రోడ్డు మార్గాన్ని వినియోగిస్తుంటారు. నిత్యం అధిక సంఖ్య లో వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి. అభివృద్ధి ఊసే లేదు.. దశాబ్దకాలం పైగా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ల నుంచి భారీ లోడుతో ఇసుక లారీలు ఈ మార్గం గుండానే ఇసుకను రవాణా సాగించాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతుల మయంగా తయారైంది. చిన్న పాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతేకాకుండా వాహనాలు అదుపుతుప్పి ప్రమాదాల బారిన పడటం, తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండటం ఇక్కడ సర్వసాధారణమైంది. ఇంకెన్నాళ్లీ ‘దారి’ద్య్రం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోసాల నుంచి మద్దూరు వైపు రోడ్డు దుస్థితి ఇది శంకుస్థాపన చేస్తే.. పనులు రద్దు చేశారు..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు మద్దూరు–గోసాల–ఉప్పలూరు రోడ్డు అభివృద్ధికి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించింది. సింగిల్ లైన్గా ఉన్న రోడ్డును ప్రజల అవసరాల రీత్యా డబుల్ లైన్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అప్పటి మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ఈడుపుగల్లు సెంటరులో శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పనులు ప్రారంభానికి నోచలేదు. తదుపరి రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి పనులను రద్దు చేసింది. కొత్తగా మద్దూరు–గోసాల రోడ్డు అభివృద్ధికి రూ 6.50 కోట్లతో అంచనాలను నివేదించి సరిపెట్టేసింది. గోతులమయంగా మద్దూరు–గోసాల రహదారి -
ఆకాంక్షిత మండలాలకు నీతి ఆయోగ్ పట్టం
అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్రం ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాలు.. ఆదర్శ మండలాలుగా నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ రెండు మండలాలకు నీతి అయోగ్ బంగారు పతకాలను ప్రకటించగా ఈ ప్రగతిలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బంగారు పతకాలు రావడం అభినందనీయం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ జిల్లాలోని రెండు మండలాలకు నీతి ఆయోగ్ బంగారు పతకాలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఎ అధికారుల కృషి కారణంగా ఈ విజయం సాధించామని తెలిపారు. సత్కారం పొందిన అధికారులు ఇవే.. సీపీఓ వై. శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఎంపీడీఓలు, ఏబీపీ కో ఆర్డినేటర్లు జి. మోహన్ సందీప్, పి. శ్రీనివాస్, వివిధ మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి ఫ్రంట్లైన్ వర్కర్లు సత్కారం అందుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డుదాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో స్వాతి సెంటర్ వైపు నుంచి వస్తున్న లారీ ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతని చేయి నుజ్జునుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు 40ఏళ్లు ఉంటుంది. అతని పూర్తి వివరాలు తెలియలేదు. దీనిపై సచివాలయ మహిళా పోలీసు వెంపటి శ్రీవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.