breaking news
NTR
-
తిరునాళ్లలో బెల్టుషాపు
జి.కొండూరు: టీడీపీ మద్యం మాఫియా బరితెగించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో శివరాత్రి పురస్కరించుకొని బాలకోటేశ్వరస్వామి ఆలయం వద్ద తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. అలాంటి పవిత్రమైన దేవాలయం వెనక భాగాన పార్కింగ్ ప్రదేశంలో ఆదివారం ఏకంగా బెల్టుషాపు ఏర్పాటు చేశారు.దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరునాళ్లలో బెల్టుషాపు ఏర్పాటు చేయడమేంటని మండిపడ్డారు. ఆదాయం తప్ప భక్తుల మనోభావాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది’
విజయవాడ: ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు. -
చంద్రబాబు సర్కార్ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు...సూపర్ సిక్స్లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’ అంటూ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కేజీబీవీని ప్రక్షాళన చేస్తాం ఎ.కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం సందర్శించారు. విద్యార్థుల ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. మోపిదేవి: మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం జరిగిన గ్రామోత్సవంలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగాల అభి వృద్ధి లక్ష్యంతో విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన నైపుణ్య వర్క్షాప్ను గుంటుపల్లి రైజ్ సెంటర్లో శనివారం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం లాభదాయకమన్నారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త కలను సాకారం చేయడానికి ప్రతివారం రైజ్ కేంద్రంలో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తున్నామని, మహిళలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, ఆర్డీఓ కావూరి చైతన్య, కూలెక్స్ ఇండస్ట్రీస్ యజమానులు పాలకుర్తి రాధాకృష్ణ, భ్రమరాంబ, సందేశ్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. శివోహం మహాశివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో ప్రభబండ్లు కొలువుదీరాయి. ఓం నమఃశివాయ అన్న మహాదేవుని నామ స్మరణతో ఆలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ Iఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 35.8640 టీఎంసీలు. -
మహిళల నెట్బాల్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ముందుకు సాగాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ (మహిళల) టోర్నీ శనివారం ప్రారంభమైంది. మంత్రి రాంప్రసాద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు విజయవాడ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కూన రాంజీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న 88 యూనివర్సిటీల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, 200 మంది కోచ్లు, అధికారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు టోర్నీ జరుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ, యూనివర్సిటీ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొదటి మూడు రోజులు నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయి. మైదానంలో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టుల్లో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి క్రీడాకారులు పోటీ పడ్డారు. -
నయవంచన
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మరో సారి నయవంచన చేసింది. బడ్జెట్ మొత్తం అంకెలగారడీ. మసిపూసి మారేడు కాయ చేశారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బుడమేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులు లేవు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలను దగా చేసింది. నీటి పారుదల రంగానికి సంబంధించి పులిచింతల, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు నామమాత్రంగానే నిధులు కేటాయించారు. విజయవాడ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపుల ఊసే లేదు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సర్పించారు. విజయవాడకు చెందిన డాక్టర్ వి.విజయ్కుమార్, బి.శాంతికిరణ్ బొర్రా సుబ్బారావు, సువర్చలా దేవి పేరిట రూ.1.15 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ శీనానాయక్కు అందజేశారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మల్లేశ్వర స్వామికి చేనేత పట్టు వస్త్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శని వారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రి సమ ర్పించారు. చిల్లపల్లి మోహన్రావు, అందే నాగవరప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాథం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బందోబస్తును పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీపీపెనమలూరు: మండలంలోని యనమలకుదురులో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి.అశోక్కుమార్ శనివారం పరిశీలించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి కొండపైన ఆలయ ప్రాంగణ, కొండ దిగువు ప్రాంతాలను పరిశీలించారు. అశోక్కుమార్ మాట్లాడుతూ.. మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్లలో భక్తుల తోపులాట జరగకుండా సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్ రూమ్లో నిరంతర పరిశీలన చేస్తామన్నారు. స్వామిని ఐజీపీ అశోక్కుమార్, ఎస్పీ విద్యాసాగర్నాయుడు దర్శించుకుని పూజలు చేశారు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షే మశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, ఇతర అధికారులతో కలిసి సంజీ వయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య నిరాడంబరత, నిజాయితీ, కార్యదక్షత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, వసతి గహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సాగు ఎండమావిడి
జి.కొండూరు: ప్రభుత్వ వివక్ష, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడితో ఏటా నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులు తోటల్లోని చెట్లను నరికేస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి విపత్తులతో మామిడి కాయలు నేలరాలినా ప్రభుత్వం పరిహారం చెల్లించడంలేదు. ప్రీమియం జమ చేసినా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవో సాకులు చూపి బీమా పరిహారం ఇవ్వడంలేదు. సాగు, కోత ఖర్చులు కూడా రాక రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రెండేళ్లలో 4,580 హెక్టార్లలో మామిడి తోటలను రైతులు తొలగించారు. ప్రభుత్వం చొరవ చూపి రైతులకు భరోసా ఇవ్వకపోతే మామిడి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. భారీగా నరికివేత ఎన్టీఆర్ జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవు తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో తీరు అందుకు భిన్నంగా ఉంది. మామిడి సాగు అధికంగా ఉండే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో ఏటా పది శాతానికి పైగా తోటలను రైతులు తొలగించి పామాయిల్ సాగు చేపడుతు న్నారు. నీరు అందుబాటులో లేని ప్రదేశాల్లో ఇతర మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలతో కాయ నేల రాలడంతో పాటు, ఉన్న కాయలు కూడా మంగు వచ్చి ధర పతనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మామిడి తోటల తొలగింపు అధికమైంది. ముదురు తోటలను తొలగిస్తున్న స్థాయిలో కొత్త తోటల సాగు ప్రారంభం కావడంలేదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 623 క్టార్లలో మాత్రమే లేత తోటల సాగు ఉండడం మామిడి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. రూ.10.57 కోట్ల పరిహారం ఎక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ ఏడు, 13వ తేదీల్లో భారీ వర్షాలు, పెను గాలుల వల్ల మామిడి తోటల్లో కాయలు భారీగా రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు రాలినట్లు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ పంట నష్ట గణన బృందాలు ఇచ్చిన నివేదిక ప్రకారం 5,418 మంది రైతులకు చెందిన 3,021 హెక్టార్లలో 33 శాతాని కన్నా ఎక్కువగా కాయలు రాలినట్లు తేల్చారు. ఈ నష్టానికి రూ.10,57,37,534 పెట్టుబడి రాయితీ కింద నిధుల విడుదల కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ మొండిచేయి 2024–25 సంవత్సరానికి మామిడి తోటల బీమా పథకం కింద అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్టీఆర్ జిల్లాలో 290 మంది రైతులు మామిడి బీమా ప్రీమియంగా రూ.13,26,328 చెల్లించారు. 2024 డిసెంబరు 15 నుంచి 2025, మే 31వ తేదీ మధ్య కాలంలో అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం, అధిక గాలి వేగం వంటి పరిమాణాల ఆధారంగా బీమా చెల్లించేందుకు నిబంధనలు విధించారు. దీనిని మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నష్ట అంచనాలను లెక్కించి మీమా నిబంధనలకు సరిపోలిన ప్పుడు మాత్రమే బీమా పరిహారాన్ని రైతుకు అందించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్లో భారీ వర్షాలు, పెనుగాలులకు జరిగిన నష్టానికి రైతుల నుంచి ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఈసారీ అరకొరే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో శనివారం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మైట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, బుడమేరు ఆధునికీకరణ వంటి వాటికి నామ మాత్రంగానూ నిధులు కేటాయించలేదన్న భావన వ్యక్తం అవుతోంది. విజయవాడ కార్పొరేషన్కు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. నీటి పారుదల రంగానికి గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులే అరకొర, వాటిలోనూ అంతంత మాత్రంగానే ఖర్చు చేశారు. గత ఏడాదికన్నా ఈ ఏడాది తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయ్యేనా..? 2026 జూన్ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆ ప్రాంతాల ప్రజలకు తాగు నీరు అందించే అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావ లంటే రూ.4 వేల కోట్లకు పైగా అవసరం. గత ఏడాది రూ.30 కోట్లు కేటాయించినా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది రూ.430 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. కృష్ణా డెల్టాకు గత ఏడాది కేవలం రూ.400 కోట్లు కేటాయించినా అరకొరగానే ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.300 కోట్లు మాత్రమే కేటా యించారు. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది రూ.16.37 కోట్లు కేటాయించి కొంత మేర నిధులు ఖర్చు చేశారు. ఈ ఏడాదీ బడ్జెట్లో అన్నే నిధులు కేటాయించారు. మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లతో సరిపెట్టారు. మచిలీపట్నం ిఫిషింగ్ హార్బర్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గన్నవరం ఎయిర్పోర్టుకు మాత్రం రూ.30 కోట్లు కేటాయించారు. హామీల అమలుకు ఏదీ పూచీ? సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీల అమలు బడ్జెట్లో చేసిన కేటాయింపులతో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపుపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,41,726 మంది, కృష్ణా జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఉచిత పంటల బీమా వంటి పథకాలకు మంగళం పాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 6,09,032 కుటుంబాలు, కృష్ణా జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం మాట అటుంచి బడ్జెట్లో నిధులు లేకపోతే భృతి ఎలా అమలవుతుందని ఈ కుటుంబా ల్లోని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఊదర గొట్టారు. బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాటను నమ్మి నిండా ముని గా మని వాపోతున్నారు. డ్వాక్రా మహిళలకు బడ్జె ట్లో మొండి చెయ్యి చూపారు. కృష్ణా జిల్లాలో 28,878 డ్వాక్రా సంఘాల్లో 2,88,633 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 24,783 సంఘాల్లో 2,45,401 మంది సభ్యులు ఉన్నారు. సున్నా వడ్డీ వంటి పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్ అంకెల గారడీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2024 సెప్టెంబర్లో వచ్చిన బుడమేరు వరదలకు బెజవాడ నగరంలో సగం భాగం నీట మునిగింది. పది రోజులకు పైగా వరదలో చిక్కుకొని ప్రజలు అల్లాడారు. ఇకపై నగరం బుడమేరు వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని అప్పట్లో ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుడమేరును ఆధునికీకరిస్తామని, అక్రమణలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే బడ్జెట్లో బుడమేరు ఆధునికీకరణకు ఒక్క పైసా కేటాయించలేదు. దీంతో బుడమేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇది మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు...నాడు-నేడు స్కీమ్ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు...బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. -
విజయవాడ: అంతిమ యాత్రలో రౌడీషీటర్ల బీభత్సం
సాక్షి, విజయవాడ: నగరంలో 100 మందికి పైగా రౌడీషీటర్ల గ్యాంగ్ హల్చల్ చేశారు. రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రలో బైక్ ర్యాలీలు, డీజేలతో బీభత్సం సృష్టించారు. భవానీపురంలో నివాసముంటున్న రౌడీషీటర్ పండు ఆటో నడుపుతూ.. యాక్సిడెంట్లో మృతిచెందగా.. మార్చురీ నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో రౌడీషీటర్లు రచ్చరచ్చ చేశారు. రౌడీషీటర్ల బీభత్సంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ పచ్చి అబద్ధాలు, కాకిలెక్కలు, ఊహాజనిత సిద్ధాంతాలతో నిండి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల ఆదాయ, వ్యయాల విశ్లేషణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదంటూ తూర్పారబట్టారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ బండారం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్లో పేర్కొనలేదంటూ దెప్పిపొడిచారు. ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన మూడు నెలల్లో ఏకంగా రూ.44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అంటూ నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నా.. వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చిచెప్పారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?‘ అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల నుంచి కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్ తప్ప.. పెర్ఫార్మెన్స్ మాత్రం పూర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీది ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆరి్టఫిషియల్ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. బాధ్యత లేని బడ్జెట్ కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు, రెండూ కలిపి రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఖర్చూ అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉన్న అత్యంత బాధ్యత బడ్జెట్ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడూ అదే ఉంది. అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప.. విశ్లేషణాత్మక వాస్తవాలెక్కడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. చివరకు అప్పు ఎంత ఉందన్నదీ ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నంబర్లు మాదిరిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. మూలధన వ్యయంపైనా అసత్యాలే 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు మాత్రం రూ.80,500 కోట్లు అప్పులు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.20 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025–26లో మూలధన వ్యయం కింద బడ్జెట్లో పెట్టిన అమౌంట్ రూ. 40,635 కోట్లు కాగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు తొమ్మిది నెలలుగా మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్ దాదాపు రూ.14 వేల కోట్లు. ఇప్పుడు కేవలం మూడు నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యమవుతుందా? పైగా రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2024 జూన్ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024–25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్ఫెడ్ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి.. రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనలేదు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్ రూ.12,110 కోట్లు, ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ సంస్థ ద్వారా రూ.1,000 కోట్లు తెచ్చారు, జలజీవన్ మిషన్ కింద రూ.10 వేల కోట్లు అప్పు చేసి.. అవి దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రూ.10 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్డీపీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి తొమ్మిది శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం రెండు శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క? అవినీతి, కక్ష, మోసం, రెడ్బుక్ సహా మీది పది సూత్రాల ప్రణాళిక తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్థికమంత్రి సీఎం గురించి చెబుతున్నది నిజమే. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు నియంత పాలన సాగించారు. అవినీతి, పక్షపాతం, కక్ష, అబద్ధాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీ అనే ఈ పది సూత్రాల ప్రాతిపదికన దుర్మార్గ పాలన సాగిస్తున్నారు. కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్ ఊసే ఎత్తలేదు. 2024 జూన్ నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్ ఎన్క్యాష్మెంట్ 2024 నుంచి లేదు. పోలీసులకు 2024 నుంచి 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ పెండింగ్లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అటకెక్కింది. ఒకటో తారీఖున జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30–07–2024న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఏ ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ప్రజల తరఫున మేం ప్రశి్నస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు.20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం 20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లాంటి ఓ ఆరేడు కూడా సాధించలేదు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలిపి రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ ఉన్నారు. 20 లక్షల మంది 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు పింఛన్ బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20.865 కోట్లు ఎగ్గొట్టారు. సుమారు 6 లక్షలపైచిలుకు ఉన్న కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రూ.6,183 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 24,504.39 కోట్లు ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో.. మా ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చామని అబద్ధాలు చెబుతున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్బీఐ లెక్కలు, లెజిస్లేచర్ లెక్కలు అన్నీ తప్పు చెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే యత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రశ్నకు బదులిచ్చినదాని ప్రకారం మీరు 02–06–2014 నాడు పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.3,06,952 కోట్లకు చేరింది. మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014–19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. -
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు’
విజయవాడ: ఏపీలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ విమర్శించారు. 100 పడకల ఆసుపత్రులను ప్రైవేట్పరం చేసే ఆలోచన లేదని మంత్రి చెబుతుంటే, చంద్రబాబేమో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారన్నారుఉ. పీపీపీ విధానానికి ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసేశామంటున్నారని, పేషెంట్ల వద్ద రుసుము వసూలు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ‘వంద పడకల ఆసుపత్రుల నిర్వహణను పిపిపికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రులను కూడా ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే నీచ సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ‘ ఈ బడ్జెట్ను చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందోనన్న ఆందోళన కనిపిస్తుంది. గత ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 3.42 లక్షల కోట్లు అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగంలో 9.70 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరలు ఇవ్వటం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో ఒక్క గంజాయికి తప్ప మరో పంటకు మద్దతు ధర లేదు. ఉద్యోగుల ప్రస్తావనే లేకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెబుతున్నారు. అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులు ఎన్ని.. తెచ్చిన బకాయిలు ఎలా తీరుస్తారనేది చెప్పలేదు. అన్నీ వర్గాలను విస్మరించి మీరు తెచ్చిన బడ్జెట్ మీ డొల్లతనాన్ని బయటపెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని మండలిలో కడిగేస్తాం’ అని స్పష్టం చేశారు.శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీ బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఇది నారా వారి నకిలీ బడ్జెట్ అంటూ ధ్వజమెత్తారు.‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి నేతల కమిషన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. అప్పుల్లో ఏపీని నెంబర్వన్కు తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. సూపర్ సిక్స్ హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో మొండిచేయి చూపించారు. ఏ వర్గాన్ని ఈ బడ్జెట్ సంతృప్తి పరచలేదు. పేదల కోసం ఏమి చేస్తారో కూడా చెప్పలేకపోయారు’ అని విమర్శించారు. -
పదిలం.. ప్రేమ జ్ఞాపకం
● బందరు తాజ్మహల్ ● అరబెల్లా ప్రేమ సమాధి ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ● నేడు ప్రేమికుల దినోత్సవం మచిలీపట్నం టౌన్: ప్రేమకు చిహ్నం తాజ్మహల్. దీన్ని షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలు ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మిస్తే.. 1815లో బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్సన్ కోసం ఓ సుందర భవనానికి రూపు నిచ్చారు. అదే సెయింట్మేరీస్ చర్చి. దానిలో అరబెల్లా సమాధి ఉంది. తాజ్ మహల్లోలేని ఓ విశేషాన్ని ఈ అరబెల్లా మందిరంలో పొందుపరిచాడు. ప్రియురాలు అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా పీటర్ ఈజిప్ట్ తదితర దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలు, రసాయనాలను తెప్పించి పూయించారు. ఓ అందమైన గాజు పెట్టెలో ఆమె మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచారు. ప్రియురాలి మృతదేహాన్ని చూడాలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను తిప్పితే లోపల ఉన్న పెట్టి పైకి వచ్చేటట్లు అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే పెద్దలను ఎదిరించి.. మేజర్ జనరల్ పీటర్ ఆనాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా మచిలీపట్నంలో పని చేశారు. అక్కడ కెప్టెన్గా పని చేస్తున్న రాబిన్సన్ కుమార్తె అరబెల్లా సౌందర్యానికి ముగ్ధుడైన మేజర్ పీటర్ ఆమెను ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె తండ్రి రాబిన్సన్, మతాధికారులు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ప్రేమైక సహజీవనాన్ని కొనసాగించారు. వారిద్దరి చర్యను ఎవరూ హర్షించ లేదు. ఆ సమయంలో పీటర్, రాబిన్సన్ల మధ్య కలతలు వచ్చాయి. అరబెల్లా ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె కన్నుమూసింది. పీటర్ అరబెల్లా మృతదేహాన్ని పెళ్లి గౌను, ఉంగరాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు ఇచ్చారు. ప్రియురాలి సమాధే దేవాలయం.. అరబెల్లా మృతదేహాన్ని పరిశుద్ధ యోహాను అవరణలోనూ, బందరుకోటలోని ఆంగ్లేయుల శ్మశాన వాటికలో సమాధి చేసేందుకు నాడు పెద్దలు అంగీకరించలేదు. దీంతో పట్టణంలోని బైపాస్రోడ్ ఆనందపేట ఎదురుగా ఉన్న స్థలంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచారు. ప్రతి రోజూ ఆమెను చూసుకుని కుమిలిపోయేవారు. అరబెల్లా మృతదేహాన్ని చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె భౌతికదేహం ఉంచిన చోటే దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అరబెల్లా తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ షీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చారు. ఆయన మద్రాసు బదిలీపై వెళుతూ ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని (సమాధుల చర్చి) ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారు. 1819 నుంచి మధ్య చర్చిలో ప్రార్థనలకు అనుమతిచ్చారు. అదే ఏడాదే పీటర్ మద్రాస్లో మృతి చెందారు. ఆయన పేరుతో మద్రాసులో ఓ ఉద్యానవనం, ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. మేరీస్ చర్చిలో పని మనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పింది. దీంతో సమాధిపై రాయి తొలిగి అరబెల్లా మృతదేహం పైకి రావటంతో అది చూసిన ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఈ అమరికను శాశ్వతంగా మూయించారు. ప్రస్తుతం ఈ చర్చి ఆవరణలో క్రైస్తవ మతస్తుల మృతదేహాలను సమాధి చేస్తున్నారు. ఆ ఆవరణలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు చర్చి నియమాల ప్రకారం కొంత మొత్తాన్ని ఫీజుగా వసూలు చేస్తున్నారు. మచిలీపట్నంలో శతాబ్దాల నాటి అరబెల్లా, జాన్ పీటర్ల అమర ప్రేమగాథకు చిహ్నమే ఆ సమాధి. ఇది ఉన్నచోటే సుందరమైన సెయింట్మేరీస్ చర్చి నిర్మించారు. దీన్ని ‘బందరు తాజ్మహల్’గా పిలుస్తారు. ఇది నాటి ప్రేమగాథను నేటి తరానికి తెలియజేస్తోంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరి ‘ప్రేమ జ్ఞాపకం’పై ప్రత్యేక కథనం. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026uIIలో వైద్య రంగంలో ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుని మరిన్ని మెరుగైన సేవలు అందించాలని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డి.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. Iవాడవాడలా మహా శివరాత్రి సందడి మొద లైంది. యనమలకుదురు రామలింగేశ్వరుడి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి మొదలుకానున్నాయి.పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ నిత్యాన్న దానానికి శుక్రవారం గ్రామస్తులు ఇంజం నాగేశ్వరరావు, రాములమ్మ కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. -
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
ఎ.కొండూరు: ఎలుకలు కొరికి గాయాలపాలైన ఎ.కొండూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శుక్రవారం పరామర్శించారు. వసతి గృహంలో టీడీపీ నాయకులు ఉండటంతో పోలీసులు అవినాష్ను గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి ఆయన పాఠశాలలోని విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల డార్మెటరీలో నిద్రిస్తుండగా ఎలుకలు కరిచాయని విద్యార్థినులు అవినాష్కు తెలియజేశారు. మెనూ ప్రకారం భోజనం లేదని, ఆదివారం చికెన్ ఇవ్వట్లేదని కూడా తెలిపారు. దోమలు, ఎలుకల బాధతో అల్లాడుతున్నామని, కిటికీలకు మెష్లు కూడా లేవని తెలియజేశారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఉదాసీన వైఖరి అవలంబించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అవినాష్ వారికి హామీ ఇచ్చారు. పేద విద్యార్థినులకు రక్షణ కల్పించలేకపోవడం తగదని హితవు పలికారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకున్న దేవినేని అవినాష్ -
మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత
విజేతలుగా మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు మచిలీపట్నంఅర్బన్: పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ వైద్య విభాగం ఆధ్వర్యాన ఎపిక్ క్విజ్–2026 పేరుతో అంతర వైద్య కళాశాలల (మూడవ సంవత్సరం) విద్యార్థులకు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి శాసీ్త్రయ పోటీలు విద్యార్థుల్లో వైద్య విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. పోటీల్లో మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలు పాల్గొన్నాయి. వాటిలో గుంటూరు మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గన్నవరం), ఎయిమ్స్ మంగళగిరి, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు తదితర కళాశాలలు ఉన్నాయి. పోటీల్లో మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గన్నవరం పీఈఎస్ వైద్య విజ్ఞాన సంస్థ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్య విభాగాధిపతి డాక్టర్ టి.శివయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆశాలత, డాక్టర్ రత్నమంజుల, డాక్టర్ దుర్గారాణి, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరంలో జాతీయ స్థాయి ఆహ్వాన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 17 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. అతిథులుగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.సత్యనారాయణ, చైన్నె ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్ వెంకట చలపతి, కృష్ణా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలగపూడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టి పెరిగిన పల్లెటూరు కారణంగా చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువతో ఆటల్లో పాల్గొంటూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించానన్నారు. లీగ్ కమ్ సూపర్ లీగ్ పద్ధతిలో నిర్వహించే పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తి శివ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ వి.దేశపతి, చీఫ్ రిఫరీ సింగరాజు మురళి, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, సమ్మెట నాగేశ్వరరావు, మత్తి మణికుమార్, తూము కృష్ణ ప్రసాద్, పింగళి వెంకట సుబ్బారావు, పింగళి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): డ్రగ్స్ రహిత ఏపీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సుజనా ఫౌండేషన్, ఎన్టీఆర్ జిల్లా పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో వన్టౌన్ గాంధీజీ హైస్కూల్ ప్రాంగణంలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతారని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగంతో యువత పెడదోవ పడుతోందన్నారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్పై దండయాత్ర పేరుతో 18 రోజులుగా సైకిళ్లపై గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న ఐదుగురు మహిళా పోలీసులను సత్కరించారు. డ్రగ్స్పై దండయాత్ర ఏవీని లాంచ్ చేశారు. డ్రగ్స్ గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరును చూపించిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, ఈగల్ ఐజీ రవికృష్ణ, సీపీ రాజశేఖర్బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ ఇది గుర్తించుకో: చెవిరెడ్డి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్సార్సీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.‘‘ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా?. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని తెచ్చింది. ఇలాంటి సంస్కతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు. ఇక పెట్టుడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడ?. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇలాంటి అక్రమ కేసులు, దాడులు, ఇళ్లు తగలబెడితే భయపడతారనుకోవడం అమాయకత్వం’’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
‘మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?’
విజయవాడ: కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టడానికా? అని ప్రశ్నించారు శాసన మండలివ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) శాసనమండలిలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స. ‘ అంబటి రాంబాబు పై దాడి చేస్తే...ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తరువాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యల పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విజ్ఞత కలిగిన వ్యక్తి...అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజా స్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా..??, మరోమాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. రాజకీయాల్లో మహిళలను తీసుకు వచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారు. అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా...??, అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా...?, తల్లి ఎవరికైనా తల్లే. మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?, మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు బొత్స. -
‘నా స్టేటస్లు ఆగవు.. నా ట్వీట్లు ఆగవు’
విజయవాడ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు తనకు క్లాస్ పీకారనేది అవాస్తమన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. తమ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికే తాను సీఎం కలిశానని అంతకు మించి ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్చాట్లో కొలికపూడి మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు లేవు,.. వసతులు లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సమస్యలు ఉన్నంతవరకు, నా స్టేటస్ లు ఆగవు, నా ట్వీట్ లు ఆగవు. మా అధ్యక్షుడు పల్లా నాకు క్లాస్ పీకారు అనేది అవాస్తవం. మా నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి నేను సీఎంని కలిశాను. నా వాట్సాప్ స్టేటస్ లపై ఎవరు ఏమీ అడగలేదు, నేను ఏమీ చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి కొలికపూడి సోషల్ మీడియా పోస్టులు వంటి అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు తుది హెచ్చరిక జారీ చేశారని మీడియాలో వార్తలు వెలుగుచూశాయి. ఇకపై పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కొలికపూడి వివరణ ఇస్తూ.. తనకు పార్టీ అధ్యక్షుడిని నుంచి ఎటువంటి హెచ్చరికలు రాలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. -
వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయం
విజయవాడ కల్చరల్: వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయమని విశ్రాంత అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు అన్నారు. స్వరఝరి సంగీత సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే తెలుగు భాషా సంగీత మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి సభకు అధ్యక్షత వహించారు. అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎంఎస్ఎం రమాశ్రీ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్లో స్వరఝరి సహకారంతో 16 ఏళ్ల లోపు యువ కళాకారులు లక్ష మందితో ప్రపంచ బాల మహోత్సవం నిర్వహిస్తామన్నారు. సభలో విద్యావేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. స్వరఝరి కార్యదర్శి మోదుమూడి సుధాకర్ సభను నిర్వహించారు. సంగీత సాహిత్యాలకు వేదిక తొలి రోజు కార్యక్రమంలో వయోలిన్ విద్వాంసుడు గండూరి శ్రీనివాసమూర్తి బృందం కీర్తనలను ఆలపించారు. రాకమర్ల వెంకటదాసు కీర్తనల వైశిష్టి అంశంగా డాక్టర్ శేషులతా విశ్వనాథ్ ప్రసంగించారు. అన్నమయ్య తెలుగుభాషా సౌందర్యం అంశంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ టేకుమళ్ళ వెంకటయ్య మాట్లాడారు. సినీ సంగీతంలో తెలుగుభాష అంశంగా కె.శాంతిశ్రీ ప్రసంగించారు. పి.సదాశివశాస్త్రి అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఆంధ్రేతర వాగ్గేయకార రచనల వివరాలను ఆకొండి శ్రీనివాసరావు, లలిత సంగీత శిఖరాలు రజనీకాంతరావు, మల్లిక్ సాహిత్య విశేషాలను వివరించారు. భద్రాచల రామదాసు కీర్తనలను తుషార పూర్ణవిల్లి వివరించారు. ప్రారంభమైన తెలుగుభాషా సంగీత మహాసభలు -
లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటం
దేశవ్యాప్త సమ్మెలో కార్మిక, రైతు సంఘాల నాయకులుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వామపక్ష పార్టీలు, కార్మిక, రైతు సంఘాలు మండిపడ్డాయి. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్పొరేట్ల మేలు కోసమే తప్ప, కార్మికులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో విజయవాడలో భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు కార్మికులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 12ఏళ్లలో దేశంలో సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్మికులు, సంఘాలు పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, హక్కులకు భంగం కలిగితే అడిగేందుకు వీలు లేకుండా దుర్మార్గంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. గతంలో పార్లమెంట్ చేసిన 29కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో 750మంది రైతులు చనిపోయారని, ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 35కోట్ల మంది కార్మికులు.. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెలో 35కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రభుత్వం వాటిని అమలు చేయాలని తహతహలాడుతోందన్నారు. ఏఐటీయూ సీ నగర కార్యదర్శి ఎం.సాంబశివరావు, సెంట్రల్ సిటీ సీఐటీయూ నగర ప్రధాన కె.దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు పి.ప్రసాద్, లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, మరీదు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగును ప్రోత్సహించండి
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి హనుమాన్జంక్షన్ రూరల్: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను విజయ డెయిరీ పార్లర్ ద్వారా విక్రయించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు రావటం అభినందనీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ కామథేను పాల ఫ్యాక్టరీని గురువారం ఆయన సందర్శించారు. చిన జీయర్ స్వామి చేపట్టిన ‘సుఫల రైతు యాత్ర’లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. కృత్రిమ ఎరువుల వినియోగంతో నేల, ఆహారం, వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తామని రైతులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించే రైతులకు బాసటగా నిలుస్తామని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారి మహేష్, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం చిన జీయర్ స్వామి హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవ స్థానం, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాలను దర్శించారు. తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామిని గురువారం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందించారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్ పాల్గొన్నారు. -
మెట్టినింట ప్రవేశించిన వీరమ్మతల్లి
ఉయ్యూరు: వీరమ్మతల్లి శ్రీ కనక చింతయ్య సమేతంగా మెట్టినింటిలోకి ప్రవేశించారు. 15 రోజులు పాటు వైభవంగా జరిగిన తిరునాళ్ల ముగియటంతో గురువారం ఉదయం ఆలయం నుంచి అమ్మవారు పల్లకీలో ఊరేగింపుగా తరలివెళ్లి మెట్టినింటిలో కొలువుదీరారు. తిరుగు ప్రయాణంలోనూ అమ్మవారు ఊయల స్తంభాల వద్ద ఊయల ఊగి.. ప్రధాన సెంటరు, రావిచెట్టు సెంటరు, కాలేజ్ రోడ్డు, కాపుల రామాలయం సెంటరుల్లో గ్రామోత్సవం జరుపుకొన్నారు. పల్లకీకి భక్తులు పసుపునీరు ఓరబోస్తూ హారతులు పట్టి స్వాగతం పలికారు. మెట్టినింటి వద్ద అమ్మవారి వంశస్తులు, భక్తులు వసంతోత్సవం జరుపుకొని, విగ్రహాలను మెట్టినింటిలో కొలువుదీర్చి పూజలు చేశారు. మహాశివరాత్రి రోజున అమ్మవారు ఐలూరు వద్ద కృష్ణానది పాయలో పవిత్రస్నానం ఆచరించి మరలా మెట్టినింటిలో ప్రవేశిస్తారు. -
ఉపాధ్యాయుల వేతన వ్యథలు!
ఏడు మాసాలుగా పలువురు టీచర్లకు జీతాల్లేక ఇబ్బందులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాశాఖలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం ఉపాధ్యాయుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వంతో పలువురు ఉపాధ్యాయులకు ఏడు మాసాల నుంచి జీతాలు అందటం లేదు. ఒకవైపు పని భారం ఎక్కువై పలువురు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ రోగాల బారిన పడుతుంటే.. మరోవైపు మానవ తప్పిదాలతో గందరగోళం చేసి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పదే పదే తప్పులు చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి తరచుగా కొనసాగుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జూన్ మాసంలో బదిలీల సందర్భంగా జరిగిన హేతుబద్ధీకరణలో భాగంగా పలువురు ఉపాధ్యాయులను విద్యాశాఖ వివిధ ప్రాంతాలకు బదిలీ చేసింది. అదేవిధంగా బదిలీల ప్రక్రియ అనంతరం ఉన్న సిబ్బంది, ఖాళీలను గమనించి పలువురిని మళ్లీ బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ క్రమంలో జి. కొండూరు మండలం నుంచి టి. లావణ్య (ఎస్జీటీ)ను విజయవాడ రూరల్ మండలం పీఎస్ఆర్ కాలనీ రామవరప్పాడుకు బదిలీ చేశారు. అలాగే అదే మండలం కవులూరు ప్రాథమిక పాఠశాల నుంచి టి. పూర్ణచంద్రరావు (ఎస్జీటీ)ను ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి జెడ్పీ హైస్కూల్కు ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా సీహెచ్ రాజేశ్వరి (స్కూల్ అసిస్టెంట్)ను మల్కాపురం జెడ్పీ హైస్కూల్ నుంచి పెనుగంచిప్రొలు మండలం కొణకంచికి బదిలీ చేశారు. వీరితో పాటు ఈ విధంగా బదిలీ అయినటువంటి పలువురికి జీతాలను విద్యాశాఖ ఏడు మాసాల నుంచి నిలిపివేసింది. నాలుగు మాసాల క్రితం ఇదే పరిస్థితి నాలుగు మాసాల క్రితం ఇదే విధమైన పరిస్థితుల కారణంగా కొన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోయాయి. పదవీ విరమణ, ఉద్యోగోన్నతుల వల్ల ఆయా ఖాళీల్లో అర్హత ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. విద్యాశాఖ ఆ తదుపరి చర్యలు తీసుకోవటంలో, ఉత్తర్వులు జారీ చేయటంలో గందరగోళం చేస్తోందని పలువురు నాయకులు మండిపడుతున్నారు. ఆ క్రమంలోనే ఐదారు మాసాల పాటు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోవటంతో వారంతా నాయకుల ద్వారా ఉన్నతాధికారులను, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు తిరిగి మామూళ్లను సమర్పించుకొని తిరిగి జీతాలు పొందినట్లు నాయకులు ఒకరిద్దరు వ్యాఖ్యానిస్తున్నారు. దిద్దుబాటు చర్యలేవి? ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరిగినా అధికారులు సరి చేయటంలో అలసత్వం వహిస్తున్నారని యూటీఎఫ్ నాయకులు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సరిదిద్దటానికి ఏడు మాసాలు దాటినా పని జరగలేదంటూ వారు మండి పడుతున్నారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు చేసిన పొరపాట్ల వల్ల బదిలీల ప్రక్రియ అయిన తరువాత మళ్లీ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. అయితే వారికి సంబంధించిన జీతాలు చెల్లించడంలో తగు ఉత్తర్వులు లేకపోవటం వల్ల ఏడు మాసాలుగా జీతాలు లేక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనిపై ఎంతమంది అధికారులను కలిసినా స్పందించేవారు కరువయ్యారంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ముఖ ఎముకల ఫ్యాక్చర్లు పెరిగాయి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరుగుతున్న వారు పెరుగుతున్నారు. దిచక్రవాహనదారులు హెల్మెట్ వినియోగం ద్వారా ముఖ ఎముకలు గాయాలు అవకుండా కాపాడుకోవచ్చు. నోటి క్యాన్సర్, ముఖ దవడ కణితులతో భాదపడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. వారికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. హెడ్ అండ్ నెక్ సర్జరీలు, కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటిని ఫేషియల్ సర్జన్స్ సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. సామాన్యులకు సైతం శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తేవడం జరిగింది. – డాక్టర్ మెహబూబ్ షేక్, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏఓఎంఎస్ఐ -
ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు..
ఉపాధ్యాయుల జీతాల సమస్యపై పలుమార్లు జిల్లా విద్యాశాఖాధికారులకు వినతిపత్రాలను అందించాం. పలు రూపాల్లో ఉన్నతాధికారుల వద్ద ఉపాధ్యాయులకు నిలిచిన జీతాల సమస్యపై చర్చించాం. అయినా వారు సరైన రీతిలో స్పందించకపోవటంతో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదు. సమస్య ఏదైనా త్వరతగతిన పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవటంతో ఏడు మాసాలుగా పలువురు జీతాలు పొందటం లేదు. ఇప్పటికై నా స్పందించాలి. – ఏ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా -
బాబోయ్ బస్సు ప్రయాణం!
కంచికచర్ల: వరుస రోడ్డు ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒకటి మరువక ముందే మరొకటి సంభవిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. గత అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండ లం చినటేకూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది మృత్యువాత పడిన ఘటన మరువక ముందే అదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చూసి ఉండకపోతే.. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ వరుణ్ ట్రావెల్స్ బస్సులో 39మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు. కీసర టోల్గేట్ను శనివారం తెల్లవారుజామున 5.26గంటలకు దాటిన బస్సు 65వ నంబర్ జాతీయ రహదారిపై ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు రావటం బస్సు డ్రైవర్ చంద్రమౌళి గుర్తించాడు. బస్సును ఆపి కిందకి దిగి వెనుక ఇంజిన్ వద్దకు వెళ్లి చూడగా పెద్దపెద్ద పొగలు వస్తున్నాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయా ణికులను కేకలు వేస్తూ లేపి కిందకు దించాడు. వారి సామగ్రిని కూడా క్లీనర్ సాయంతో కిందకు దించారు. ఆ కొద్దినిముషాలకే బస్సుకు మంట లు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేశారు. వారు రెండు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే బస్సు వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది. 39 మంది ప్రయాణికులు బస్సు తగులబడుతుంటే నిశ్చేష్టులయి చూస్తుండిపోయారు. బస్సుల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవటం వల్ల బస్సుల్లో మంటలు వ్యాపిస్తాయి. ఒక్కోసారి బస్సు ఇంజిన్ వేడెక్కటం వల్ల కూడా మంటలు వస్తాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం, మితిమీరిన వేగంతో బస్సులు నడపటం వల్ల ఇంజిన్ వేడెక్కుతుంది. కొన్ని గంటలు ఏకధాటిగా బస్సును నడిపిన తర్వాత ఒక గంట పాటు రోడ్డు పక్కన బస్సును ఆపాల్సి ఉంటుంది. – ఎ. శివారెడ్డి, ఫైర్ అధికారి, కంచికచర్ల -
ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం
అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మాక్సిల్లో ఫేషియల్సర్జన్స్ ఇండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది తాము చేసే శస్త్రచికిత్సలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ గాయాలు, ఓరల్ క్యాన్సర్, ముఖ దవడ కణితులకు శస్త్ర చికిత్సలు , వాటి నివారణ మార్గాలపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల డెంటల్ వింగ్స్, దంత వైద్య కళాశాలల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది ఈ ఏడాది నినాదంగా తెలిపారు. – నాదెళ్ల కోటేశ్వరరావు, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, ఏఓఎంఎస్ఐ -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ అమీన్పూర్కు చెందిన వి.సుబ్బలక్ష్మి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. వి. గున్నేశ్వరరావు పేరిట రూ. లక్ష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎం.ప్రసన్నదేవి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలను, 22వ తేదీన నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సైక్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–13, 15, 17, 19 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోగా స్పోర్ట్స్. ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబరుతో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 28వ తేదీ, మార్చి 1 తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఇతర వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా కోటేశ్వరరావు కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక వ్యాధులైన లుకేమియా, తలసీమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి తీవ్రమైన రక్తసంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించే స్టెమ్సెల్ దాతల నమోదు కార్యక్రమం గురువారం ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ)లో నిర్వహించారు. ధాత్రి బ్లడ్ స్టెమ్సెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మంది వైద్య విద్యార్థులు స్టెమ్సెల్ డొనేషన్కు ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ధాత్రి ప్రతినిధి చావా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 2009లో తమ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 6 లక్షల మంది వరకూ స్వచ్ఛంద దాతలు నమోదు అయ్యారన్నారు. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న 1700 మందికి విజయవంతంగా స్టెమ్సెల్ మార్పిడి(ట్రాన్స్ప్లాంట్) సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ బెల్లం శివప్రసాద్తో పాటు ధాత్రి వలంటీర్ గోకుల్ కృష్ణ పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణ యాలు తీసుకుందని ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు పేర్కొన్నారు. ఎంఎస్ ఎంఈ సేవారంగ సంస్థలకు భవన నిర్మాణ ప్రణాళికల అనుమతుల దరఖాస్తులను పారిశ్రామిక సంస్థలతో సమానంగా పరిష్కరించడంతో పాటు మినహాయింపులు కూడా అదే విధంగా ఉంటాయని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థలు (యూడీఏ), పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని సేవారంగ ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్లో నమోదై ఉన్నట్లయితే ఈ వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఆటోమొబైల్ సర్వీసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్, హోటళ్లు (20 గదుల వరకు), ఫంక్షన్ హాళ్లు, లాండ్రీ–డ్రై క్లీనింగ్ సేవలు, గోదాము సేవలు, పర్యాటక సేవలు వంటి సేవల కార్యకలాపాలకు సంబంధించిన ఎంఎస్ఎంఈలకు తాజా నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. -
గుణదలలో మృతదేహం కలకలం
పాడుబడిన కారులో గుర్తింపు మధురానగర్(విజయవాడసెంట్రల్): గుణదలలో పాడుబడిన కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. రామవరప్పాడు నుంచి విజయవాడ వచ్చే మార్గంలో ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న పాతకారులో మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు గుణదల పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో మృతుడు విజయవాడ గిరిపురానికి చెందిన పెయింటర్ నిమ్మకోరి చక్రపాణి (45) అని గుర్తించారు. చక్రపాణి గత సోమవారం నుంచి కనిపించటం లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడ కనిపించకుండా పోయిన చక్రపాణి గుణదల పోలీస్స్టేషన్ పరిధిలోని పాత కారులో, గుణదల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో విగతజీవిగా పడిఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చక్రపాణి అనారోగ్య సమస్యలతో చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. –––––––––––––––––––––––– 12విఐసీ127ఏ: మృతుడు చక్రపాణి -
వదనం... వికసిత కమలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిని చూస్తుంటాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ఉంటే పర్వాలేదు. లేకుంటే ముఖ ఎముకలు గాయాలవుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారికి విరిగిన ఎముకలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారారు. అంతేకాదు గ్రహణం మొర్రితో పుట్టిన చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేలా చేస్తున్నారు. అంద విహీనంగా ఉన్న ముఖాన్ని కాస్మోటిక్ సర్జరీలు చేసి, అందంగా ఉండేలా చేస్తున్నారు. ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, నోటి క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ సర్జరీలు ఇప్పుడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అలవోకగా చేసేస్తున్నారు. ఇలా వైద్య రంగంలో కీలకంగా మారారు. ఆయా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 13 అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... ఏటా 500కు పైగా శస్త్ర చికిత్సలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి ఏటా 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు ఫ్యాక్చర్స్ అవుతున్నాయి. వారికి మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ శస్త్ర చికిత్సలు చేసి వాటిని సరి చేస్తున్నారు. ముఖంలోని ఏ ప్రాంతంలో ఎముక విరిగిన చాకచక్యంగా సర్జరీలు చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో హెడ్ అండ్ నెక్ సర్జరీలు సైతం ఎక్కువమందికి అవసరం అవుతున్నాయి. ముఖ దవడ మీద కణితులు రావడం, గొంతులో కణితులు వంటి వాటికి కూడా విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న నోటి క్యాన్సర్ ఉమ్మడి కృష్ణాలో రోజు రోజుకు నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. టుబాకో, పచ్చి వక్కలు, సున్నం వేసిన తమలపాకులు, పాన్ పరాగ్, గుట్కా, జర్దా కిళ్లీలు, హుక్కా, అడ్డ పొగ సేవనం, బీడీలు, చుట్ట, సిగరెట్, హుక్కాలు తాగే వారికి ఎక్కువగా నోటి క్యాన్సర్ సోకుతుంది. కొందరు పాన్పరాగ్, గుట్కా నమిలిన తర్వాత రాత్రి వేళల్లో అలాగే నిద్రిస్తారు. అలాంటివారు త్వరగా నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. జిల్లాలో నమోదవుతున్న ఓరల్ క్యాన్సర్లలో నాలుక, పెదవి, అంగడి, బుగ్గ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి ఏటా 700 వరకూ నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వారికి అధునాతన శస్త్ర చికిత్సలను మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రూపు రేఖలు మార్చేస్తారు ప్రస్తుతం మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కాస్మోటిక్ సర్జరీలు చేసేందుకు డీసీఐ అనుమతిచ్చింది. దీంతో ఫేషియల్ కాస్మోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముక్కు వంకరగా ఉన్నా, నుదిరు సరిగా లేకున్నా, దవడ రూపం బాగా లేకున్నా వాటి రూపురేఖలు మార్చేసి అందంగా ఉండేలా చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఫేషియల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు సైతం డీసీఐ అనుమతి ఇచ్చింది. ఇలా కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి శస్త్ర చికత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విరిగిన ముఖ ఎముకలు.. సరిచేసేస్తారు! ఏటా రోడ్డు ప్రమాదాల్లో 500కు పైగా ముఖ ఎముకల ఫ్యాక్చర్స్ నోటి క్యాన్సర్కు అధునాతన శస్త్ర చికిత్సలు గ్రహణం మొర్రి చిన్నారుల్లో సైతం చిరునవ్వులు పూయిస్తారు ముఖాన్ని అందంగా మార్చేందుకు కాస్మోటిక్స్ సర్జరీలు వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారిన వైనం నేడు అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే -
రీ సర్వే పనులు సమయానికి పూర్తి చేయాలి
రామవరప్పాడు: గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టు పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సర్వే, సెటిల్మెంట్ అండ్ భూరికార్డుల డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు సచివాలయంలో గురువారం రీ సర్వేకు సంబంధించిన పనులు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూర్మనాథ్ ఎల్పీఎం వెక్టరైజేషన్, లాగిన్ డేటా పనులను పరిశీలించారు. జీటీ అయిన వెంటనే సమాంతరంగా వెక్టరైజేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జీటీ సమయంలో ప్రతి రైతుకు ముందుగానే తెలియపరిచి ఈకేవైసీ యాప్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్, సర్వే ఏడీ మోహనరావు, విజయవాడ తహసీల్దార్ సుగుణ, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారావు, హుమయూన్ బేగ్, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
ఏలికల ‘ఎలక’ట్టలేని నిర్లక్ష్యం
ఎ.కొండూరు: ఎలుకలు కరిచి 11 మంది విద్యార్థినులు గాయపడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో జరిగింది. విద్యార్థినులు బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో చిమట ప్రసన్న, కావూరి కళావతి, చావల కుమారితో పాటు మరో ఎనిమిది మందిని ఎలుకలు తీవ్రంగా కరిచాయి. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థినిలకు స్థానిక ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు తహసీల్దార్ అరవింద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కేశవరావు, జీసీడీఓ విశ్వభారతిని విచారణకు ఆదేశించారు. వారు విద్యాలయాన్ని సందర్శించి ఘటనపై విచారణ జరిపారు. నివేదికను కలెక్టర్, ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఎలుక కరిచిన విద్యార్థినులను గురువారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్సెల్ కార్యదర్శి నరెడ్ల వీరారెడ్డి తదితరులు పరామర్శించారు. కేజీబీవీలో సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల స్వాతిని వివరణ కోరగా విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వాస్తవమేనన్నారు. మొత్తం 11 మందిని కరవగా వారికి టీటీ, ఏఆర్వీ వ్యాక్సిన్లు వేశామని వివరించారు. -
బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి పార్థసారధి
సాక్షి, విజయవాడ: తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ.. ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారధి ఎదురుదాడికి దిగారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా? అంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80 శాతం మందికి పైగా విద్యార్థులకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఇచ్చారని.. రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన మాటలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించండి. నేను చెప్పింది వాస్తవమోకాదో మీ అధికారులతో విచారణ చేయించండి. తప్పు నాదైతే సభకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం’’ అంటూ బొత్స సవాల్ విసిరారు.తానూ 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. మీరు మాకు సభా సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదని బొత్స పేర్కొన్నారు. బొత్స ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి కొలుసు పార్ధసారధి నీళ్లు నమిలారు. బొత్సపై మంత్రి ఎదురుదాడికి దిగారు.సభ అనంతరం బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల్లో రెండు అంశాల పై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలుకే ఇవ్వడం పై ప్రశ్నించామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖలో ఐటీని అభివృద్ధి చేశాం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలుకే భూములిస్తానంటోంది.. ఎందుకు కంపెనీలతో లాలూచీ పడి భూములివ్వాలంటూ బొత్స ప్రశ్నించారు.వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చింది. సీఎం కుటుంబ సభ్యులు 5 వేల కోట్ల భూములు కబ్జా చేశారు. 5 వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని గీతం సంస్థ చెబుతోంది. వేల కోట్ల భూములు కబ్జా చేయడమేంటి?. పెన్షన్లపై ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగంపై అధికారపార్టీ సభ్యులు డబ్బాలు కొట్టారు. ప్రతీ ఒక్కరికీ 15 వేలు తల్లికం వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందరికీ ఇచ్చారా అని ప్రశ్నిస్తే సమాధానం లేదుతల్లికివందనం డబ్బులో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. చాలామంది ఖాతాల్లో ఏడెనిమిది వేలే జమ అయ్యాయి. మేం చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపిస్తే మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పా. మేం వేసిన ప్రశ్నకు అడ్డగోలుగా మంత్రి సమాధానం చెబుతున్నారు. 15 ఏళ్లు నేను కూడా మంత్రిగా చేశా. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు చేతనైతే మీ అధికారులతో ఎంక్వైరీ చేయించండి. మేం చెప్పింది అసత్యమని నిరూపించండి. ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలి.ప్రతిపక్షం చెప్పిన విషయాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తదా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వేణుగోపాలుని హుండీ ఆదాయం రూ.17.52లక్షలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించినట్లు సహయ కమిషనర్ ఎన్. సంధ్య తెలిపారు. ఆరు హుండీలలో రూ. 17,38,791 రాగా, అన్నదానం హుండీలలో రూ. 13,488 వచ్చినట్లు చెప్పారు. బంగారం 5.8గ్రాములు, వెండి 92. 400గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 175, సింగపూర్ డాలర్లు 10 ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ పాల్గొన్నారు. జగ్గయ్యపేట: పట్టణంలో తాచు పాము హాల్చల్ చేసింది. శాంతి నగర్కు చెందిన కిషోర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఓ చెట్టు పొదలో బుసలు కొడుతూ ఉన్న పామును చూశారు. దీంతో స్నేక్ క్యాచర్ సుధాకర్కు సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. తాను ఎప్పుడూ ఇలాంటి తాచును చూడలేదని ఐదు అడుగుల పొడవు గల తెల్లటి ఈ పాము చంద్రనాగు జాతికి చెందినదిగా సుధాకర్ తెలిపారు. అనంతరం పామును సమీపంలోని బుదవాడ అటవి ప్రాంతంలో వదిలి వేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) నిర్వహించే బీఎడ్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల జనవరి–2026 సెషన్కు, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ (పీజీడీఆర్సీ) కోర్సు జూలై–2026 సెషన్కు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి బీఎడ్, ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 27, అలాగే బీఎస్సీ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు మార్చి 5 ఆఖరు తేదీగా యూనివర్సిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్థులు ఇగ్నో వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని గాని లేదా దగ్గరలోని ఇగ్నో అధ్యయన కేంద్రాన్ని లేదా 0866–2565253లో సంప్రదించాలని కోరారు. వెంగనాయకునిపాలెం(పెనుగంచిప్రోలు): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంగనాయకునిపాలెంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముళ్లగిరి సురేష్(38) అనే వ్యవసాయ కూలీ అప్పుల బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొలుత నందిగామ, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం పోస్టుమార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భూమాతను కాపాడుకోవాలి
అయోధ్య(మోపిదేవి): మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం వరకు సుఫల రైతు పాదయాత్ర బుధవారం చేపట్టారు. అందులో భాగంగా ఉదయం ఆయన సందేశమిస్తూ అన్ని రకాల సుఖాలు అందిస్తున్న భూమాతను ఆనందింపజేయాల్సి ఉందన్నారు. దీనికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి సన్నిధి నుంచి మోపిదేవిలంక, నడిమిలంక, కోసూరువారిపాలెం, మేళ్లమర్తిలంక, ఉత్తరచిరువోలులంక గ్రామాల మీదగా సుమారు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అయోధ్య చేరుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం సమీపంలోని తరకటూరులో పూర్తి ఆర్గానిక్స్ సాగుతో అత్యధిక ఆదాయం పొందుతున్న విజయారావ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, అధికారులు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, కృష్ణలంక ప్రాంత వాసులకు డబ్బు ఎరగా చూపి వారితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించే సైబర్ ముఠాను కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం సైబర్ పోలీస్స్టేషన్లో సౌత్ ఏసీపీ డి. పవన్కుమార్, సైబర్ ఏసీపీ బి. రాజశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు యనమలకుదురు తాడిగడప డొంకరోడ్డుకు చెందిన రాయపాటి రవికుమార్, రాయపాటి స్టీఫెన్, యరగుంట్ల బాజీలు స్థానికులను ప్రలోభాలకు గురిచేసి వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరంతా ఈ బ్యాంక్ ఖాతాలను కేరళ, మహారాష్ట్ర గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్ఘడ్ ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఫిషింగ్, విషింగ్, ఓటీపీ తదితర సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. రిమాండ్కు నిందితులు.. యనమలకుదురు వద్ద తాము మెరుపుదాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద రూ.3.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 21 సెల్ఫొన్లు, 46 ఏటీఎం కార్డులు, 21 చెక్బుక్లు, 16 పాస్బుక్కులు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను 3వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన వారికి రిమాండ్ విధించారని వివరించారు. పెనమలూరు: విధుల నుంచి ఇంటికి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి గ్రామానికి చెందిన భుక్యా బాలు(53) ఆర్టీసీలో గవర్నర్పేట డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి బైక్పై బయలుదేరి కామయ్యతోపు పెట్రోల్బంక్ వద్దకు రాగా.. అనారోగ్యానికి గురై బైక్పై నుంచి పడిపోయాడు. స్థానికులు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలుపగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికై చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య పార్వతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన ఎం.వెంకటేశ్వరరావు కుమారుడు ఎం.శ్రీహర్షవర్థన్(15) కానూరు కెనడీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం శ్రీహర్షవర్థన్ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాడు. రాత్రి 7 గంటలకు మరలా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా రాజాచికెన్ సెంటర్ వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్పై అతివేగంగా వచ్చి శ్రీహర్షవర్థన్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమయింది. అతనిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు
కంచికచర్ల: అమరావతి ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్తో పాటు పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఓఆర్ఆర్కు భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నాలుగు రెట్లు న్యాయ సమ్మతమైన పరిహారం అందజేయాలని, ఓఆర్ఆర్ వెడల్పు 70 మీటర్లకు కుందించాలని డిమాండ్ చేశారు. సారవంతమైన విలువైన భూము లు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలి.. ఓఆర్ఆర్లో కోల్పోతున్న భూములు సీఆర్డీఏ అమరావతి జోన్ పరిధిలో ఉన్నాయని ఈ ప్రాంతా న్ని ప్రొటెన్షియల్ ఏరియాగా గుర్తించాలన్నారు. అలైన్మెంట్ వెడల్పు 140 మీటర్ల నుంచి 70 మీటర్లకు కుదించాలని సమీప డోర్ నంబర్లలో నమోదైన విలువల ఆధారంగా భూముల ధరలు నిర్ణయించాలని బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ కోసం భూములను కోల్పోతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలిపారు. ఈ మేరకు కంచికచర్ల తహసీల్దార్ కార్యలయంలో డీటీ మానసకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గంగిరెడ్డి రంగారావు, నన్నపనేని వీఎల్ నరసింహారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు, బుడ్డి సూర్యప్రకాష్, కపలవాయి సుబ్బారావు, సూర్యదేవర రమ తేళ్ల శ్రీనివాసరావు, చెన్నుపాటి కృష్ణ, చంద్రం, జొన్నలగడ్డ వీరబాబు, సాయిరాం, కాపా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కంచికచర్లలో ధర్నా -
రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు, దాడులతో రాక్షస పాలన సాగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం మంట కలుపుతున్న వేళ గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ విడివిడిగా జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పరిశీలించారు. అనంతరం అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడిచేయడం ఉగ్రవాదుల చర్య అని అన్నారు. దాడి జరిగిన వీడియోలు చూస్తే పక్కా ప్రణాళికతో దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా -
శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈఓ శీనానాయక్ తెలిపారు. తన చాంబర్లో ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏఈఓలు, సూపరిండెంటెంట్, ఇతర ముఖ్య అధికారులతో శివరాత్రి ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని దర్శించుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్, వీఐపీ స్నానఘాట్లలో ఏర్పాట్లపై చర్చించారు. ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఏఈఓలు సుధారాణి, చంద్రశేఖర్, గంగాధర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై వేంచేసిన శ్రీపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ త్రినాథరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఆలయానికి వచ్చి ఏర్పా ట్లను పరిశీలించారు. భక్తులకు సకల వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎన్వి.సాంబశివరావు, ఆలయ ఈఓ ఎన్.భవాని పాల్గొన్నారు. శివ రాత్రి పండుగ రోజు వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించా మని ఈఓ భవాని తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వీఐపీలు స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన ఎం.వెంకటేశ్వర్లు, లక్ష్మీరాజ్యం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ కుటుంబ సభ్యులు కె. దీిప్తి, రాజేష్, జి.విద్య, సతీష్ సూర్యనారాయణ పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మెట్టపల్లి రామదేవి అన్నదానానికి రూ.1,01,116 విరాళం సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితుడు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.78.12 లక్షలను కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. హుండీ కానుకలను బుధవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 71 రోజులకు రూ.78,12,667 నగదు, 50 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి సమకూరాయని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. 12 యూఎస్ఏ డాలర్లు, పది సౌదీ రియాల్స్, ఒక మలేషియా రింగిట్, 20 ఆస్ట్రేలియా డాలర్లు కూడా వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. ఆలయ ఈఓ, గ్రూపు ఆలయాల ఈఓ సురేష్, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. -
వైభవంగా ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల
ఉయ్యూరు: కోరిన కోర్కెలు తీరుస్తూ ఉయ్యూరులో కొలువైన శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లికి అశేష భక్తజనం విశేష పూజలు జరిపించారు. తిరునాళ్ల మహోత్సవం ఆఖరి రోజైన బుధవారం పెద్ద ముఠా కార్మికులు సంప్రదాయం ప్రకారం పొట్టేళ్ల పూల ప్రభ బండిని అమ్మవారికి సమర్పించి ఆఖరి మొక్కు చెల్లించారు. డప్పు వాయిద్యాల జోరు, బాణసంచా వెలుగులు, డీజే మోతలతో పట్టణం మారుమోగింది. చివరి సారిగా అమ్మను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అమ్మవారిని దర్శించుకున్నారు. మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన మెట్టినింటి నుంచి వేలాది మంది భక్తజన గండ దీప హారతుల నడుమ శ్రీ కనక చింతయ్య సమేతంగా బయలుదేరిన అమ్మవారు 15 రోజులు పాటు ఆలయంలో భక్తుల పూజలు అందుకున్నారు. దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు తిరునాళ్లకు వచ్చారు. చల్లని తల్లికి పాల పొంగళ్లు నైవేద్యంగా చెల్లించి, పసుపూ కుంకుమ సమర్పించారు. శిడి బండి అనంతరం జోడుపొట్టేళ్ల పూల ప్రభ బండ్లును భక్తులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల 15 రోజులూ ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాలు అన్నీ బంధుమిత్రులతో కళకళలాడాయి. ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండి ఊరేగింపు తిరునాళ్లు ఆఖరి రోజు పెద్ద ముఠా కార్మికుల ప్రభ బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఠా ఏర్పడిన నాటి నుంచి అమ్మవారికి ఊరేగింపుగా తరలివెళ్లి జోడు పొట్టేళ్ల పూల ప్రభ బండిని సమర్పించటం సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయన్నే కొనసాగిస్తూ ముఠా కార్మికులు బుధవారం శ్రీ వెంకటేశ్వరస్వామి, శివలింగాల ఆకృతిలో పూలు, పండ్లుతో ప్రత్యేకంగా ప్రభ బండిని తయారు చేయించి పొట్టేళ్లతో భారీగా ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. మెట్టినింటికి చేరుకోనున్న అమ్మవారు ఆలయంలో పూజలందుకున్న అమ్మవారు గురువారం ఉదయం శ్రీకనక చింతయ్య సమేతంగా మెట్టినింటికి బయలుదేరుతారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ప్రధాన ఆలయంలో అమ్మవారిని పారుపూడి, నెరుసు వంశస్తులు ప్రత్యేక పూజలు చేసి ఆలయం వెలుపలకు చేర్చుతారు. పల్లకిలో ఊరేగింపుగా ఊయల స్తంభాల వద్ద ఊయల ఊపి రావిచెట్టు రోడ్డు మీదుగా మెట్టినింటికి చేరుస్తారు. అమ్మవారి తిరునాళ్ల అన్ని రోజులూ ఉయ్యూరు పట్టణంలో వివాహాది శుభకార్యాలకు అవసరమైన పనులు చేపట్టడం, పసుపు కొట్టడం అనేవి ఉండవు. ఉత్సవం పూర్తికావటంతో వివాహ శుభకార్యాలకు పట్టణ వాసులు శ్రీకారం చుట్టనున్నారు. -
భక్తి నీరాజనం
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విశ్వమాతకుకృష్ణానదిలో చేప పిల్లలు విడుదలవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 537.60 అడుగులకు చేరింది. ఇది 183.3636 టీఎంసీలకు సమానం. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని చిన జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు.గన్నవరం: స్థానిక రైతు బజార్లో ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ఓ టీడీపీ నేత సాగిస్తున్న అవినీతి, అక్రమాల డొంక కదిలింది. రైతుబజారులో కూరగాయల సరఫరా పేరుతో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమ వసూళ్లపై ‘బజారులో దళారీ భోజ్యం!’ శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో గన్నవరం రైతుబజార్కు కూరగాయలు రవాణా చేస్తున్న టీడీపీ నేతను ఆగమేఘాల మీద తప్పించారు. సదరు టీడీపీ నేత ధరల దోపిడీ వ్యవహారంపై రైతుబజార్ స్టాళ్ల నిర్వాహకులను పిలిపించి సర్దుబాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక రైతుబజార్లో ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి సరఫరా చేసే కాంట్రాక్టును స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు మేరకు గన్నవరానికి చెందిన టీడీపీ నేత మోర్ల నాగబాబు దక్కించుకున్నారు. అయితే రైతుల వద్ద కొనుగోలు చేసే ధరలకంటే ఎక్కువగా నాగబాబు వసూలు చేయడం, నాసిరకం సరుకును సరఫరా చేయడంతో స్టాళ్ల నిర్వాహకులు అడ్డం తిరిగారు. అతని వద్ద కూరగాయలు తీసుకునేందుకు పలువురు నిరాకరించారు. నాగబాబు దోపిడీ వ్యవహారం బయటపడటంతో అధికార పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నరసింహారావు బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. రైతుబజారులో కూరగాయల సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని తప్పించినట్లు తెలిపారు. శాఖా పరమైన విచారణ రైతుబజార్లో అవినీతి జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై శాఖా పరమైన విచారణ చేయా లని జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులకు సూచించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. రైతుబజార్లో ఇకపై అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. భక్తులతో పోటెత్తిన గుణదల పుణ్యక్షేత్రంగుణదల(విజయవాడ తూర్పు): ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మూడు రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు బుధవారం ముగిశాయి. లోక మాతను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలు, కొండదారులన్నీ యాత్రికులతో నిండిపోయాయి. భక్తులు మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొని తరించారు. లక్షలాదిగా భక్తుల రాక గుణదల ఉత్సవాలకు మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది యాత్రికులు వచ్చారని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పాటు నగర వాసులు సైతం కుల మతాలకు అతీతంగా తిరునాళ్లలో పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉత్స వాల ముగింపు ప్రార్థనలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను ఉత్సవ నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. మరియమాత దయతో నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తదితరులు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వమానవులు శాంతి, సమాధానాలతో జీవించాలంటే క్రీస్తు మార్గమే శరణ్యమని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. సమాజంలో అసమానతలు తొలగిన నాడు దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. సర్వ మానవాళి కోసం తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశా యని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు అందరిపై మరియతల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. అనంతరం అమెరికాకు చెందిన బిషప్ షమీంద్ర జయవర్ధన, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు తదితర గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించి, భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. 7 -
గ్రూప్-1పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై సిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు.. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. -
ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు ఉండాలి
ఇబ్రహీంపట్నం: రాజకీయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలేకానీ అరాచకాలు, దాడులను ప్రోత్సహించకూదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను మంగళ వారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. బయటి ప్రాంతాల నుంచి వచ్చి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం యాసిడ్, పెట్రోల్ బాంబులతో దాడులను కక్ష పూరితంగా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జోగి రమేష్ కుటుంబం వైఎస్సార్ సీపీకి సేవలు అందించిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూర్తిస్థాయిలో అండగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో దాడులను ప్రోత్సహించకపోవడం కూటమి ప్రభుత్వానికే మంచి దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి మిక్కిలి శరభయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గోగులమూడి రాణి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు కోలకాని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే శైలజానాఽథ్ -
నగర పౌరులపై పన్నుల భారం లేని బడ్జెట్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని సూచించేలా, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా 2026–27 ఏడాది వార్షిక బడ్జెట్ను రూపొందించా మని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశం మంగళవారం జరిగింది. మేయర్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. తమ హయాంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ స్వచ్ఛ లీగ్లో మొదటి స్థానం పొందామని, గార్బేజ్ ఫ్రీ సిటీలో సెవెన్ స్టార్ ర్యాంకింగ్, మురుగునీటి శుద్ధీకరణలో ఫైవ్స్టార్ రేటింగ్ సాధించామన్నారు. నగరంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు రెవెన్యూ కేపిటల్ ఆదాయం రూ.1,894.57 కోట్లు, ప్రారంభ నిల్వ రూ.2,213.28 కోట్లు ఉందని వివరించారు. రెవెన్యూ, క్యాపిటల్ వ్యయాల్లో లోన్, డిపాజిట్లు చెల్లింపులతో కలిపి రూ.2,093 కోట్లు ఉందని, 2025–26 సవరించిన రెవెన్యూ, క్యాపిటల్ ఆదాయాలు రూ.1,130 కోట్లని, రెవెన్యూ క్యాపిటల్ వ్యయం రూ.1,175 కోట్లని పేర్కొన్నారు. సమావేశాన్ని తప్పుదారి పట్టించే యత్నం 2026–27 వార్షిక బడ్జెట్లో నగరపాలక సంస్థ పరి ధిలోని మూడు నియోజకవర్గాల్లో రూ.600 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణాలు చేపట్టేందుకు ఖర్చుచేయాలని, ఇందుకు రూ.300 కోట్లు వీఎంసీ రుణాల ద్వారా సేకరించాలని, రూ.150 కోట్లు సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించాలని, మరో రూ.150 కోట్లు సీఆర్డీఏ సమకూరుస్తుందని బడ్జెట్లో అధికారులు పొందుపరిచారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలి పారు. ఈ ప్రతిపాదన స్థాయీసంఘం సమావేశం దృష్టికి వచ్చిన సమయంలోనే సభ్యులు అభ్యంతరం తెలిపారని, అయినా అధికారులు బడ్జెట్లో ఎలా పొందుపరుస్తారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరానికి ప్రత్యేక నిధుల కేటాయించాలని, అలా కాకుండా నగరపాలక సంస్థను అప్పులపాలు చేసేందుకు యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు విమర్శించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు కల్పించుకుని సభను తప్పుదోవపట్టించేలా కేకలు వేశారు. ఈ ఓవైపు మునిసిపల్ కమిషనర్ ధాన్యనచంద్ర వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నా టీడీపీ నాయకులు ఖాతరు చేయలేదు. పీపీపీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఎంసీపై రూ.450 కోట్లు భారం మోపేలా అధికారులు పొందుపరిచిన స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ ప్రతిపాదనలను తొలగించి 2026–27 సవరణ బడ్జెట్ను మేయర్ భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ చేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. డ్రాఫ్ట్ బడ్జెట్ పుస్తకంలో 40వ పేజీలో ఉన్న రూ.150 కోట్లు, కన్సెషనరీ సమకూర్చే రూ.300 కోట్లు వ్యయం, 51వ పేజీలో పొందుపరిచిన 70, 72వ అంశాలు, రూ.450 కోట్లు క్యాపిటల్ వ్యయం మినహా మిగిలిన బడ్జెట్ను మెజారిటీ సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. సీపీఎం డీసెంట్ నోట్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పీపీపీ పద్ధతిలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ నిధుల ఖర్చు వ్యవహారంలో సీపీఎం ఫ్లోర్లీడర్ సత్తిబాబు మేయర్ రాయన భాగ్యలక్ష్మికి డీసెంట్ నోట్ అందించారు. ఈ బడ్జెట్లో రూ.450 కోట్ల రుణం రూపంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను గ్రాంట్స్గా కేటాయించాలని డీసెంట్ నోట్లో పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు గతంలో స్ట్రాంగ్ వాటర్ డ్రెయిన్ పథకానికి కేటాయించిన రూ.460 కోట్ల నిధుల్లో రూ.172 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన రూ.289 కోట్లు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు. ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులకు పీపీపీ విధానంలో రూ.450 కోట్లు ఖర్చు చేయాలని టీడీపీ పట్టు సభ్యుల ఓటింగ్తో నిధుల కేటాయింపు ప్రతిపాదనల తిరస్కరణ -
‘రైజ్’తో మహిళల ఆర్థిక సాధికారత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని గుంటుపల్లిలో రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు ఆయన పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సహకారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మహిళలు రైజ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ సదుపాయాలను పూర్తిగా వినియోగించుకుని స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, మహిళలు పాల్గొన్నారు. పని ఒత్తిడితోనే డిజిటల్ అసిస్టెంట్ మృతి వత్సవాయి: జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గువ్వల అశోక్ పని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ల సంఘ నాయకుడు వామన్నాయక్ పేర్కొన్నారు. అశోక్ మృతదేహానికి ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టార్గెట్లు విధించడంతో పని భారంతో ఉద్యోగులు మానసిక సంఘర్షణకు గురై మరణిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500మంది ఉద్యోగులు బలైనట్లు చెప్పారు. చిరుద్యోగులమైన తమపై ఇంత పని ఒత్తిడి పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని, గతంలో ఇంత పని ఒత్తిడి టార్గెట్లు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లుతెరిచి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లోనే జీతాలు పెంచాలి గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఇఫ్టూ) డిమాండ్ చేశాయి. మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిర్వహించిన 42 రోజుల చారిత్రక సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వేతనాలు రూ. 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అనేకమార్లు సీఎం, మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. మహాశివరాత్రికి భారీ బందోబస్తు కోనేరుసెంటర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద భారీ బందోస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా ఏడు శైవ క్షేత్రాలు ఉన్నాయని, అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పెద్ద సంఖ్య భక్తులు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్టు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు. -
బజారులో దళారీ భోజ్యం!
పచ్చనేతల కబంధ హస్తాల్లో రైతు బజార్లు సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతు బజార్లపై ‘పచ్చ’ గద్దలు వాలిపోయాయి. మార్కెట్ సిబ్బందితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి. బజార్లలో షాపుల కేటాయింపు మొదలు, కూరగాయల సరఫరా వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి. కనీసం రైతులు తాము పండించిన కూరగాయలను సైతం అమ్ముకోనివ్వకుండా, తాము చెప్పిన వారి వద్దే కూరగాయలు తీసుకోవాలని దుకాణాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ దందాలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రైతు బజార్లలోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ రైతు బజార్లలో ఈ దందా కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు కూరగాయలపై కేజీకి రూ.4 చొప్పున నెలకు రూ. 25లక్షల నుంచి రూ. 35 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. షాపుల కేటాయింపునకు దుకాణదారుల నుంచి రూ.4లక్షలు, స్థానికంగా రైతు బజార్ల పరిధిలో ఉండే పచ్చ నేతలకు నెలకు రూ.7లక్షల మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం. రోజువారీ మార్కెట్ ధరలు కూడా వారే నిర్ణయిస్తూ, మార్కెట్పై పెత్తనం సాగిస్తూ, రోజుకు లక్షల రూపాయలు దండుకొంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. మేం చెప్పిన వారి వద్దే కొనాలి.. ప్రధానంగా ఇంగ్లిష్ కూరగాయలుగా పేర్కొనే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, బీన్స్, కీరతో పాటు పచ్చి మిర్చి, టమాట, అల్లం వంటి వాటిని రైతు బజార్లలో కొంత మంది వ్యాపారులు విజయవాడ, గుంటూరు, హనుమాన్జంక్షన్ తదితర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి, రైతు బజార్లలో దుకాణదారులకు హోల్సేల్గా విక్రయిస్తారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా పచ్చనేతలు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మకై తాము చెప్పిన వారి వద్ద నుంచే కొనాలంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో కూరగాయలు సరఫరా చేస్తున్న వ్యాపారులకు, ప్రస్తుతం మార్కెటింగ్ సిబ్బంది సూచిస్తున్న విజయవాడ వ్యాపారికి మధ్య గొడవలు తలెత్తడంతో విషయాలు బహిర్గతం అయ్యాయి. అనధికారిక షాపులు.. విజయవాడ పటమట రైతు బజారులో అధికారికంగా 110 షాపులుండగా, అనధికారికంగా ప్రస్తుతం 200కు పైగా షాపులున్నాయి. ఇందులో ఫుట్పాత్లకు అటు, ఇటు కూడా షాపులున్నాయి. ఇక్కడ ఆ కూరగాయలు సరఫరా చేసే వ్యాపారి ఆధీనంలో ఏకంగా 24 షాపులు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఒక్కో షాపునకు రూ.4లక్షలు దుకాణదారుల నుంచి వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు, ఉయ్యూరు రైతు బజార్లు సైతం ఈ విజయవాడ వ్యాపారి ఆధీనంలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడలో రైతు బజార్లను పర్యవేక్షించే వారితోపాటు, అతను ఉన్నతాధికారులను సైతం బుట్టలో వేసుకొని ఆడింటి ఆట, పాడింది పాటగా దోపిడీ సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు విజయవాడ సెంట్రల్ నందిగామ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, టాస్క్ఫోర్స్: గన్నవరం రైతుబజార్ కేంద్రంగా టీడీపీ నేత సాగిస్తున్న దోపిడీ బహిర్గతమైంది. ఆ నేతకు విక్రయదారులు అడ్డం తిరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నేతకు కూరగాయల సరఫరా అనుమతుల కోసం సాక్షాత్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు చేయడం గమనార్హం. వివరాలు ఇవి.. రైతుబజార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప సరఫరా కాంట్రాక్ట్ను ఇటీవల ఎమ్మెల్యే సిఫార్సు మేరకు గన్నవరానికి చెందిన టీడీపీ నేత మోర్ల నాగబాబు నిర్వహిస్తున్నారు. రైతుబజార్ ఎస్టేట్ అధికారితో కుమ్మకై ్క ఆ నేత స్టాల్స్ నిర్వాహకులు తాను సరఫరా చేసే కూరగాయలనే విక్రయించాలని నిబంధన పెట్టారు. దీనికితోడు రైతుల వద్ద కొనుగోలు చేసే ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నాడు. దీనివల్ల విక్రయదారులు ఆర్థికంగా నష్టపోతుండటంతో ఆ నేత వద్ద కూరగాయలు కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. అయినప్పటికీ నాగబాబు తన మనుషులతో విక్రయదారులను బెదిరింపులకు పాల్పడుతున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రైతుబజార్ నిబంధనలకు వ్యతిరేకంగా నాగబాబుకు కాంట్రాక్ట్ను అప్పగించాలని ఎమ్మెల్యే సిఫార్సు లేఖను మార్కెంటింగ్ శాఖకు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కాంట్రాక్ట్ నుంచి నాగబాబును తాత్కాలికంగా తప్పించారు. -
సద్గుణరాశి.. సదా సన్నుతి
దయాప్రాప్తురాలి చెంత.. భక్తజన కెరటం విశ్వాస శిఖరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. వేలాదిగా తరలివస్తున్న భక్తజనం మదిమదిలో సద్గుణరాశి మరియమాతను నింపుకొని మనసారా ప్రణమిల్లుతోంది. మొక్కుబడులు చెల్లిస్తూ.. ప్రార్థనల్లో పాల్గొంటూ.. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ దీవెనలు పొందుకుంటోంది. మేరీమాత తిరునాళ్ల రెండో రోజు మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గుణదల పుణ్య క్షేత్రం కిక్కిరిసింది. ఉత్సాహపరిచే పాటలు.. మనోనేత్రాన్ని వెలిగించే ప్రసంగాలు.. గురువుల సమష్టి దివ్యపూజాబలి, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. గుణదల(విజయవాడ తూర్పు): విశ్వ జననిగా కీర్తినొందిన మరియతల్లిని గౌరవిస్తూ.. ఆమె కుమారుడైన ఏసుక్రీస్తు మార్గాన్ని మనమంతా అనుసరించాలని నెల్లూరు కథోలిక పీఠాధిపతి పిల్లి ఆంథోని దాస్ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండో రోజు మంగళవారం ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంథోని దాస్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. మానవాళికి మరియమాత ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేవాది దేవునికి సంపూర్ణమైన శిష్యురాలిగా ఆమె జీవించిందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును, ఆయన కట్టడలను అనుసరిస్తూ మానవులంతా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని కోరారు. తన ప్రియ కుమారుడు శిలువ మరణం పొందుతున్నా ఆమె ఎంతగానో సహించి.. తన జీవితాన్ని దేవునికి అప్పగించిందని వివరించారు. మరియతల్లిని ఆదర్శంగా తీసుకుంటూ దేవుడిపై విశ్వాసముంచుతూ మానవులంతా భక్తిమార్గంలో నడుచుకోవాలన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలయం జయరాజు, తదితర గురువులతో కలసి సమష్టి దివ్య బలి పూజ సమర్పించా రు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కిటకిటలాడిన పుణ్యక్షేత్రం.. మేరీమాత తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి యాత్రికులు లక్షలాదిగా పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో గుణదల కొండపై భక్తులు కిటకిటలాడారు. కొండపై కాలిబాటలు, మెట్ల మార్గాలు యాత్రికులతో నిండిపోయాయి. మరియమాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మా వందనం.. మరియతల్లీ వందనం అంటూ శరణు వేడారు. కొబ్బరి కాయలు కొడుతూ, తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అటుపై కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి భక్తులు క్రీస్తు శిలువ వద్దకు చేరుకుని ప్రార్థించారు. దేదీప్యంగా గుణదల కొండ.. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో గుణదల కొండంతా కాంతులీనుతోంది. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దగ్గర నుంచి మెట్ల మార్గాలు, మేరీమాత స్వరూపం అటుపై కొండ శిఖరాగ్ర వరకు ధగధగ మెరుస్తోంది. పగటి వెలుగును ప్రతిబింబిస్తూ పుణ్యక్షేత్రం అలరారుతోంది. సాయంత్రం సమయంలో జరిగిన సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఉడుముల బాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మరియమాత పరమ పునీతురాలిగా కీర్తినొందుతోందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును విశ్వసించి ఆయనను అనుసరించిన భక్తులకు రక్షణ మార్గం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని, దైవ చింతన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. -
అవాస్తవాలతో డైవర్షన్ పాలిటిక్స్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని నిందలు మోపారని.. ఇప్పుడు వాస్తవాలు బయటకు తెలుస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అవినాష్ మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ లేదన్నారు. పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటానికి దుర్గగుడి మెట్లు కడిగిన పవన్ కల్యాణ్ నటించారన్నారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చిన నేపథ్యంలో పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన ట్యాంకర్లు అన్నీ తనిఖీ చేసి, పంపించింది కూటమి ప్రభుత్వమేనన్నారు. ఈ విషయం లో వైఎస్సార్ సీపీకి సంబంధం ఏమి ఉందో చెప్పాలన్నారు. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా... తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే విషయంలో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని అవినాష్ చెప్పారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని, హిందువులకు అండగా ఉండేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అపనమ్మకం తీసుకొచ్చింది చంద్రబాబేనని, 2014–19 మధ్య వందలాది హిందూ గుడులు కూల్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు చిందులు వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసే విష సంస్కృతి ప్రారంభించింది చంద్రబాబేనన్నారు. -
సకల కళా వల్లభుని స్మరణకే మహోత్సవాలు
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుజాతికి చేసిన మహోపకారాన్ని స్మరించుకోవడానికే ఈ మహోత్సవాలని రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ సహకారంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ బహు భాషా కోవిదుడైన శ్రీకృష్ణ దేవరాయలకు ఆంధ్ర మహావిష్ణువు స్వప్నంలో ఇచ్చిన ఆదేశాలతో తెలుగు బాషలో ఆముక్త మాల్యద కావ్యాన్ని శ్రీకాకుళం దేవస్థానంలో గావించడం, అది పంచ మహాకావ్యాల్లో ఒకటిగా ఖ్యాతి గడించడం శ్రీకాకుళం గ్రామ ప్రజలకు గర్వకారణమన్నారు. శ్రీకాకుళం నుంచే ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర శ్రీకాకుళం నుంచే ప్రారంభమైందన్నారు. ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం నుంచే ఆంధ్ర రాజుల పాలన ప్రారంభించారన్నారు. అనంతరం ఆముక్త మాల్యద మండపంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి, పక్కనే ఉన్న కాసుల పురుషోత్తమ కవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా శ్రీకాకుళేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మైలవరం: డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ ర్యాలీ ఇప్పటి వరకు 201 కి.మీ. పూర్తయినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం 15వ రోజు జి.కొండూరు పరిధిలో కొనసాగిందన్నారు. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ గన్నవరం మండలం సావరగూడెం గ్రామస్తులు మంగళవారం ఆందోళన బాట పట్టారు. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు. -
కోడూరుపాడు కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
●వరుస మరణాలతో గ్రామస్తుల ఆగ్రహం ●కార్మికుడి మృతదేహంతో ఆందోళన హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త తత ఏర్పడింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల వరుస మరణాలు మిస్టరీగా మారాయి. ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న కెమికల్ వల్ల కార్మికులకు ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తాళ్లపూడి కాన్కుమార్ (30) మృతి చెందాడు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మి కుడిగా పని చేస్తున్న కాన్కుమార్కు ఏడాదిన్నర క్రితం అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉండ టంతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందినా ఫలితం లేకుండాపో యింది. విజయవాడ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట కాన్కుమార్ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషపూరిత రసాయనాలు తయారు చేస్తూ, అమాయక యువత ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తొమ్మి ది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పని చేయగా, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డా రని, మిగిలిన వారు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణం వచ్చి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో తయారవుతున్న కెమికల్స్పై సమ గ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న వీరవల్లి ఎస్ఐ సురేష్ ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు. -
ఉత్సవాల్లో పిల్లలకు చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మేరీమాత ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ నేతృతంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సీ్త్ర శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ, ఫోరమ్ ఫర్ చైల్డ్ వారు బృందాలుగా ఏర్పడి చిన్న పిల్లలకు ట్రాకింగ్ ట్యాగ్లు వేస్తున్నారు. కార్యక్రమంలో మాచవరం సీఐ డీవీ రమణ, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లపై అవగాహన పెంపొందించుకోవా లని సూచించారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి ఆర్బీఐ – ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల (ఫిబ్రవరి 9 నుండి 13 వరకు) పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందేందుకు కూడా అవగాహన అవసరమన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తన, బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎల్డీఎం కె.ప్రియాంక, జీఎం డీఐసీ మధు, ఎస్బీఐ కోఆర్డినేటర్ జగదీష్, కెనరా బ్యాంక్ కోఆర్డినేటర్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగ కుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. జిల్లాలో మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడు చేసేందుకు గుర్తించిన నాలుగు రీచ్లకు ఈ–టెండర్ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మల్కాపురం, ఏటూరు, మున్నలూరు, గని ఆత్కూరు ఇసుక రీచ్లు గుర్తించారు. సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో ఇసుక తవ్వకానికి పొక్కునూరు–4 రీచ్కు అన్ని అనుమతులు పొందినందున ఈ –టెండర్ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని సమావేశం నిర్ణయించింది. పట్టా భూముల్లో ఇసుక తీసి రవాణా చేసేందుకు మల్కాపురంకు చెందిన పట్టాదారు జ్వాలా ప్రసాద్, దాములూరుకు చెందిన ఘంటా లక్ష్మణ్కు అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఇసుక కొరత లేకుండా ప్రభు త్వం నిర్ణయించిన ధరకు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మెంబర్ కన్వీనర్ ఆలా శ్రీనివాస్ కుమార్, పీసీబీ ఈఈ శ్రీనివాస్, రివర్ కన్జర్వేటర్ రవికిరణ్, జిల్లా పంచా యతీ అధికారి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డీడీ పాల్గొన్నారు. -
11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష
కోనేరుసెంటర్(మచిలీపట్నం): నేరం జరిగిన 11 నెలల్లోనే నిందితుడికి కోర్టు జీవితకాలపు శిక్ష విధించేలా దర్యాప్తు చేసిన పోలీసులను కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అభినందించారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వేర్వేరుగా జీవిస్తున్నారు. భార్య తన ఇద్దరు కుమార్తెలతో మంటాడలో, భర్త తన కుమారుడు కొమ్ము సౌల్తో కలిసి ప్రకాశం జిల్లా కొండెంపి మండలం పెట్లూరు గ్రామంలో నివసిస్తున్నారు. 2023లో కొమ్ము సౌల్ మంటాడలోని తల్లి వద్దకు వచ్చాడు. సౌల్ తన మైనర్ చెల్లెలికి మాయమాటలు చెప్పి 2024 డిసెంబర్ 19వ తేదీన గుణదల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమైపె తరచూ లైంగికదాడి చేశాడు. కొంత కాలానికి బాలిక గర్భం ధరించడంతో విషయం బయటికి పొక్కింది. తల్లి నిలదీయగా అన్న సౌల్ విషయం చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పమిడిముక్కల పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్వినీల్ కేసు దర్యాప్తు చేపట్టి సౌల్ను అరెస్టు చేసి, పూర్తి ఆధారాలతో విజయవాడ పోక్సో కోర్టులో హాజరుపరిచారు. నింది తుడిపై నేరం నిరూపణ కావడంతో సౌల్కు జీవితకాలపు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఈ నెల తొమ్మిదో తేదీన తీర్పు చెప్పింది. బాలికకు రూ.30 వేలతో పాటు రూ.5 లక్షలను పరిహారంగా ఇవ్వాలని జిల్లా లీగల్సెల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించిందని ఎస్పీ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేసిన డీఎస్పీ ధీరజ్వినీల్తో పాటు పమిడిముక్కల పోలీస్స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్.రాజ పాల్గొన్నారు. -
భర్త ఆచూకీ కోసం పోలీస్స్టేషన్ ఎదుట గర్భిణి ఆందోళన
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): తన భర్తను అతని అన్న, తల్లి ఎక్కడో నిర్బంధించారని, ఆయన ఆచూకీ తెలపమంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ నిండు గర్భిణి తన బంధువులతో కలిసి సింగ్నగర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం జరిగింది. బాధితు రాలి కథనం మేరకు.. సింగ్నగర్ పైపులరోడ్డు సమీపంలో నివసిస్తున్న పినపాల లిఖితకు జ్ఞానపవన్ కుమార్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. పెళ్లయిన కొంతకాలం వరకూ తన భర్త, అత్త పుణ్యలక్ష్మీదుర్గ తనను బాగానే చూసున్నారని, ఆ తరువాత వారిద్దరితో పాటు తన బావ ఉదయ్కిరణ్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని లిఖిత ఆరోపించింది. గతేడాది టూ టౌన్ పోలీస్స్టేషన్లో 498ఏ కింద కేసు పెట్టగా ఆ తరువాత తాను, తన భర్త పటమటలో వేరు కాపురం పెట్టుకుని నివసిస్తుండగా, అత్త, బావ అక్కడకు కూడా వచ్చి తనను వేధింపులకు గురిచేశారని, దీనిపై పటమట పోలీస్స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపింది. ఆ తరువాత నుంచి తన భర్త జ్ఞానపవన్కుమార్ ఆచూకీ తెలియడం లేదని, తన అత్త, బావలే ఎక్కడో నిర్బంధించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తూ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నెల రోజుల నుంచి పట్టించుకోవడం లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించింది. లిఖిత నోటీసులు తీసుకోవడం లేదు తన భర్త ఆచూకీ తెలపాలంటూ లిఖిత నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సింగ్నగర్ సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. గత డిసెంబర్ 25వ తేదీన లిఖితే తనపై దాడి చేసి గాయపర్చిందని ఆమె అత్త పుణ్యలక్ష్మీదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి 41ఏ నోటీసులు తీసుకోవడానికి రావాలని లిఖితను ఎన్నిసార్లు పిలిచినా స్టేషన్కు రావడం లేదన్నారు. పటమటలో లిఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సింగ్నగర్ పోలీస్స్టేషన్కు బదిలీ కావడంతో గత నెల 19వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కేసు విచారణకు ఆమె సహరించకపోగా ఇలా పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపడతామన్నారు. -
మైనింగ్ నిలిపివేయాలని ఆందోళన
గన్నవరం రూరల్: మండలంలోని సావరగూడెం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మన ఊరు–మన భవిష్యత్ అని పేర్కొంటూ ‘బాంబు పేలుళ్లు వద్దు.. అక్రమ మైనింగ్ వద్దు అని నిదిస్తూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మైనింగ్ జరుగుతున్న క్వారీ వద్దకు చేరుకుని నిరసన దీక్ష చేపట్టారు. సావరగూడెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న వెదురుపావులూరులో సర్వే నంబరు 717–2లో కొండపోరంబోకు ఉంది. దీనిలో ఏపీఎస్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. నిర్మాణాలు చేసేందుకు ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏడాదిగా ఇక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని, రాత్రి వేళల్లో బాంబ్ బ్లాస్టింగులు చేస్తున్నారని సావరగూడెం గ్రామస్తులు ఆరోపించారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తరువాత జరుగుతున్న బ్లాస్టింగ్ ధాటికి తమ ఇళ్లు కదిలిపోతున్నాయని, ఇంట్లో సామగ్రి దెబ్బతింటోందని, తాగునీరు, సాగునీటి బోర్లు పూడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ జరుగుతున్న పరిసరాల్లో పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్ ఉన్నాయని వివరించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై గన్నవరం తహసీల్దారు కె.వి.శివయ్యను వివరణ కోరగా.. గ్రామస్తుల ఆందో ళన విషయం తన దృష్టికి రాలేదన్నారు. మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీఆర్వో శేఖర్ ఆందోళనకారుల అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. ముస్తాబాద సీపీఎం నాయకులు కై లే ఏసుదాసు, ఆంతోని, బాలశౌరి, ఏడుకొండలు తదితరులు నిరసన శిబిరం సందర్శించి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. -
‘పుణ్యక్షేత్రంలో లాఠీలకు పని చెపుతారా?’
విజయవాడ: శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీఛార్జిని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. శ్రీశైలం లో నిన్న జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. వారం రోజుల క్రితం, రెవిన్యూ, హోమ్, ఇండోమెట్ మంత్రులు వెళ్ళి రద్దీ పై సమీక్ష చేసినా ఫలితం శూన్యమన్నారు. వేలాది మంది భక్తుల వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. క్యూ లైన్లు లేవు, వాటర్ లేదు కనీసం సౌకర్యాలు కల్పించలేదు. పోలీసు యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సింది పోయి శివ భక్తుల మీద లాఠీఛార్జ్ చేశారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది. ఏపీలో దేవాలయాలకు వెళ్లిన భక్తులు వెనక్కి వస్తారా అనే భయం కలుగుతుంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు, సింహాచలం, కాశీబుగ్గలో భక్తులు చనిపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..అరసవిల్లిలో రథ సప్తమిలో తొక్కిసలాట జరిగింది. తప్పులు సరిచేసుకోవాలి అనే భావన ప్రభుత్వంలో కనిపించడం లేదు. హిందూ దేవుల్లో భద్రత గాలికొదిలేశారు. హిందూ ధర్మం పై కూటమి చిన్న చూపు చూస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవీ చదవండి: శ్రీశైలంలో ఉద్రిక్తతశ్రీశైల మహాక్షేత్రంలో అపచారం..చరిత్రలో మొదటిసారి.. -
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
ప్రతి అర్జీని ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే ప్రతి అర్జీని ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, డీఆర్వో కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరిగాయి. జేసీ ఇలక్కియ, డీఆర్వో నరసింహాం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల న్నారు. మొత్తం 192 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో 54 రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అర్జీలు 138 ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం తాడేపల్లి రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ నంబరు 39లో కోట్ల విలువ చేసే మట్టి అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ గ్రామ నాయకుడు ఎం.జమలయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, రోజుకు సుమారు 500 లారీలకుపైగా మట్టి తరలిపోతోందని వివరించారు. జోగా ప్రవీణ్ అనే వ్యక్తి ఎన్ఓసీ తీసుకుని, దానిని అడ్డం పెట్టుకున్న అడ్డగోలుగా తవ్వేస్తున్నారని, అధికారులకు లారీలు అప్పగించినా నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. -
జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య
మాజీ హోం మంత్రి తానేటి వనిత ఇబ్రహీంపట్నం: జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య అని మాజీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, దాడులు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక వారి ఇళ్ల పైన పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు చేయించడం ఆటవిక చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్లు, కుటుంబ సభ్యులపై దాడి చేయడం, ఆస్తులు ధ్వంసం చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదన్నారు. దాడులు చేసే వారిని ఆపకుండా పోలీసులు వారికి సహకరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడమే అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని రిపోర్టు వచ్చినా దానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు ప్రభుత్వ నాయకులు నిస్సిగ్గుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంట గోపాలపురం జెడ్పీటీసీ కాకులపాటి శ్రీను, నల్లజర్ల, ద్వారకాతిరుమల ఎంపీపీలు బంకా అప్పారు, బొండాడ వెంకన్నబాబు, వివిధ మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. అలాగే అమలాపురం ఎస్ఈసీ సభ్యుడు కూడిపూడి భరత్భూషణ్, సీనియర్ నాయకుడు కంచె రమణారావు, రాష్ట్ర దృశ్యకళల మాజీ చైర్మన్ కూడిపూడి శాంతి, తదితరులు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సాఫ్ట్ టెన్నిస్లో ఏపీ క్రీడాకారుల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పంజాబ్ రాష్ట్రం లూథియనాలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 2వ ఏషియన్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్షిప్–2026లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు అన్నారు. పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ కార్యాలయంలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఏఎస్ వైశాలి అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, పీవీ చిన్హాస్ అండర్–15 బాలుర డబుల్స్ విభాగంలో కాంస్య పతకం, అండర్–18 బాలుర డబుల్స్ విభాగంలో ఎం.రేవంత్ కాంస్య పతకం సాధించారని వివరించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
బాల్యాన్ని నులిమేస్తుంది.. జాగ్రత్త!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యమే తొలిమెట్టు. పిల్లల ఎదుగుదల కేవలం ఆహారం మీద మాత్రమే కాదు, వారి కడుపు ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నులి పురుగులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదల క్షీణించి, రక్తహీనతకు దారి తీస్తాయి. పిల్లల్లో నులిపురుగుల సమస్య, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ఏటా ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నులి పురుగులు అంటే.. నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగే పరాన్న జీవులు. ఇవి అపరిశుభ్రమైన చేతులు, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. మట్టిలో చెప్పులు లేకుండా ఆడటం వల్ల చర్మం ద్వారా కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. చాలా నష్టదాయకం.. ● చాలామంది తల్లిదండ్రులు దీనిని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ ఇది తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని వైద్యులు చెబుతారు. రక్తహీనతకు దారి తీయొచ్చు. నులి పురుగులు రక్తంలోని పోషకాలను పీల్చుకోవడం వల్ల పిల్లలు పాలిపోయి కనిపిస్తారు. ● మనం ఇచ్చే బలమైన ఆహారాన్ని పిల్లల శరీరం గ్రహించకుండా ఈ పురుగులు అడ్డుకుంటాయి. ● శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది. ● ఏకాగ్రత లోపించి చదువులో వెనుకబడతారు. ● త్వరగా అలసిపోతారు. ఇలా గుర్తించాలి.. కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం. బరువు తగ్గడం, ఎదుగుదల లేకపోవడం, మలద్వారం వద్ద దురద (ముఖ్యంగా రాత్రి వేళల్లో), తరచూ వాంతులు, విరేచనాలు అవ్వడం జరుగుతుంది. కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా శరీరంలోకి.. తద్వారా చిన్నారుల్లో రక్తహీనత ఎదుగుదల లోపించి ఇబ్బందులు జాగ్రత్త వహించాలంటున్న వైద్యులు వైద్యులు సూచించిన విధంగా పిల్లలకు నులి పురుగుల మాత్రలను తప్పనిసరిగా వేయించాలి. ఇది సురక్షితమైనది. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. పిల్లల గోర్లు పెరగకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే గోర్ల కింద మురికిలో పురుగుల గుడ్లు ఉంటాయి. తాగునీరు శుభ్రంగా ఉండాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే వాడాలి. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరచూ కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో వైద్యుడితో పరీక్షలు చేయించి నులి నివారణ మాత్రలు వేయాలి. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేస్తే మంచిది. – డాక్టర్ వైభవ్ వెంకటేష్, పిడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము
జి.కొండూరు: క్వారీలు, క్రషర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నత్తనడకన రహదారులు విస్తరణ పనులు, అడుగడుగునా భారీ గోతులతో నిండిన రోడ్లపై అధిక లోడింగ్తో అతివేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ల రాకపోకలతో రైతులు నష్టపోతున్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న పొలా ల్లోని పైర్లు టిప్పర్ల కారణంగా రేగుతున్న దుమ్ముతో నిండిపోతున్నాయి. పంట వేయకుండా ఉండలేక, వేసినా దుమ్ము కారణంగా పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జి.కొండూరు మండలంలోని లోయ గ్రామాల రైతులు దుమ్ము సమస్యతో సతమతమవుతున్నారు. వందల టిప్పర్ల రాకపోకలు ఎన్టీఆర్ జిల్లాలో క్వారీలు, క్రషర్లు అంటే గుర్తొచ్చేది నందిగామ నియోజకవర్గంతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలు. ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో కలిపి 39 క్వారీలు ఉన్నాయి. జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతంలో తొమ్మిది, కొండపల్లి పరిధిలో మరో ఆరు క్వారీలు నడుస్తున్నాయి. కొండ పల్లి, లోయలో ప్రాంతాల్లోని 15 క్వారీలు, క్రషర్ల నుంచి రోజూ వందల టిప్పర్లు మెటల్, డస్టును రవాణా చేస్తూ ఉంటాయి. జి.కొండూరు నుంచి గంగినేని వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జి.కొండూరు నుంచి గడ్డమణుగు ఎస్సీ కాలనీ మీదుగా మరో రహదారి సైతం మరమ్మతులకు నోచుకోక భారీ గోతులతో నిండిపో యింది. ఈ నేపథ్యంలో భారీ లోడులతో టిప్పర్లు మితి మీరిన వేగంతో రాకపోకలు సాగించడం వల్లన రహదారులను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో సాగువుతున్న పంటలపై దుమ్ము పేరుకుపోతోంది. దుమ్ము కారణంగా పంట దిగుబడులు పడిపోతున్నాయి. ఏడు గ్రామాల్లో సమస్య తీవ్రం క్వారీల నుంచి టిప్పర్ల రాకపోకల వల్ల జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు, పినపాక, కడింపోతవరం, చెర్వుమాధవరం, మునగపాడు, జి.కొండూరు, లోయ గ్రామాల్లో రహదారుల పక్కన రబీలో సాగువుతున్న 5,487.07 ఎకరాలలో మొక్కజొన్న, వరి, ఉద్యాన పంటలైన మిరప, అరటి, పామాయిల్, కూరగాయ పంటలపై దుమ్ము చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దుమ్ము లేవకుండా ఉండేలా నిత్యం రహదారులపై నీరు చల్లాల్సి ఉంది. అయితే క్వారీల నిర్వాహకులు నామమాత్రంగా నీళ్లు చల్లి వదిలేస్తున్నారు. దుమ్ము ప్రభావంతో అవసరాలకు భూములు అమ్ముకోవాలన్నా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు. -
దుర్గగుడికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయానికి సోమ వారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ గొల్లపూడికి చెందిన వెనిగళ్ల కృష్ణకుమారి కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.5,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజే సింది. ఆలయ అభివృద్ధి పనులకు సంతరావూరు గ్రామానికి చెందిన కొప్పుల రవికిరణ్ కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్కు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య, ఆరోగ్య శాఖలో డెమో విభాగం సేవలు అత్యంత కీలక మని ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా అధికారులు(డెమోల) సంఘం – అమరావతి 2026 క్యాలెండర్, డైరీని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో డెమోలు కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సాగర్, గణాంక అధికారి లక్ష్మోజి, రాజశేఖర్, బాషా ఏపీ ఎంఓహెచ్ఈ అసోసి యేషన్ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, కొవ్వూరి ప్రభాకరరెడ్డి, ఎంఎంవై శ్రీనివాస్, మహ్మద్ యూసుఫ్, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు. జి.కొండూరు: డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా పోలీసు శాఖ చేపట్టిన డ్రగ్స్పై దండయాత్ర ర్యాలీ సోమవారం జి.కొండూరులో కొనసా గింది. అడ్మిన్ డీసీపీ సరిత, రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ నేతృత్వంలో మండలంలోని కట్టుబడిపాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సైకిల్ ర్యాలీ పినపాక, విద్యానగరం, జి.కొండూరు వై జంక్షన్ మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు జి.కొండూరు చేరింది. ఈ ర్యాలీకి మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, ఎస్ఐలు సతీష్కుమార్, గిరిజామణి, స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జి.కొండూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీసీపీలు సరిత, లక్ష్మీనారాయణ, ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో 510 కిలోమీటర్లు మేర సైకిల్ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, పోలీసు సిబ్బంది, వివిధ పాఠ శాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
సింగన్నగుంట చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
గన్నవరం: చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొజ్జ వెంకటేశ్వరరావు(45) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ వివాదాల కారణంగా అతని భార్య, పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుణదలలో మేరీమాత ఉత్సవాల్లో ఖర్జూరం, జీడీలు విక్రయించేందుకుగాను భీమవరానికి చెందిన వ్యాపారులు అతనిని తీసుకువచ్చారు. అయితే గుణదల నుంచి గన్నవరం వచ్చిన వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం స్థానిక ఎస్సీ కాలనీలోని సింగన్నగుంట చెరువులో దూకాడు. నీట మునుగుతున్న అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈత గాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
వైభవంగా గుణదల తిరునాళ్ల ప్రారంభం అమ్మా దర్శనం.. మరియ తల్లీ దర్శనమన్న భక్తుల శరుణుఘోషతో గుణదల కొండ మారుమోగింది. మరియమాతను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివస్తున్నారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు తిలకిస్తూ యాత్రికులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. గుణదల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. గుణదల(విజయవాడ తూర్పు): మేరీమాత కొలువైన గుణదల కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దక్షిణ భారత దేశంలో ప్రముఖ క్రైస్తవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు బిషప్ గ్రాసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, సిల్వర్ జుబిలేరియన్ గురువులు నేలటూరి ఫ్రాన్సిస్, మద్దాల జోసఫ్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛన ప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసిన నేలటూరి ఫ్రాన్సిస్ భక్తులకు దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. శ్రీసభలో మరియ తల్లి సమైక్య మాతగా గుర్తింపు పొందింద న్నారు. మరియమాత సంపూర్ణ దైవత్వానికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. నేటి ప్రపంచంలో అనేక దేశాలు విభజన దిశగా అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు మానవీయత సన్నగిల్లుతోందని అభిప్రాయపడ్డారు. సమస్త జనులను ఐక్య పరిచే శక్తి సృష్టికర్త అయిన దేవునికే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. తమ జీవితాలను, కుటుంబాలను కట్టుకోవా లని వివరించారు. అనంతరం విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ.. గుణదలలో జరుగుతున్న 102వ మహోత్సవాలు దీవెనకరంగా జరగాలని కోరారు. పుణ్యక్షేత్రానికి చేరుకునే యాత్రికులకు మరియ తల్లి దీవెను మెండుగా లభిస్తాయని వివరించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులతో కలసి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందించి యాత్రికుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సజావుగా ఉత్సవాలు పుణ్యక్షేత్ర గురువులు, పోలీసులు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో గుణదల ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా భక్తుల తొక్కిసలాటలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది తాగునీరు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య శిబిరాలు వంటి వసతులు కల్పించారు. ఎప్పటికప్పుడు పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడప బిషప్ సగినాల పాల్ ప్రకాష్ మాట్లాడుతూ.. మరియమాత పవిత్రతను బట్టి దేవాది దేవుడే ఆమెను లోకమాతగా ఎంపిక చేశాడని చెప్పారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు వరుస క్రమంలో దేవుని గీతాలను ఆలపిస్తూ జపమాల ధ్యానంతో వేదిక పైకి చేరుకున్నారు. మహోత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
వ్యక్తిపై దాడి చేసి డబ్బులు కాజేసిన ఏడుగురు అరెస్ట్
పెనమలూరు: యనమలకుదురులో వ్యక్తి పై పలువురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేసి, అతని వద్ద సొమ్ము కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామానికి చెందిన తాడిబోయిన గోపాలకృష్ణ ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తాడు. ఈ నెల 7వ తేదీన యనమలకుదురు సుగాలి కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద నుంచి గోపాలకృష్ణకు తెలిసిన వ్యక్తి అయిన సాయి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. దీంతో రాత్రి 8 గంటలకు గోపాలకృష్ణ అక్కడికి వెళ్లగా.. సాయి అతని బైక్ ఎక్కి యనమలకుదురు హోసన్నా మందిరం వద్ద కృష్ణానదిలోకి తీసుకువెళ్లాడు. కొద్ది సమయం తరువాత సాయి పలువురికి ఫోన్ చేసి నది వద్దకు రమ్మని పిలిచాడు. నది వద్దకు విచ్చిన వ్యక్తులు గోపాలకృష్ణపై దాడి చేసి అతని వద్ద ఫోన్ తీసుకొని పేటీఎం ద్వారా రూ. 15 వేలు ఒకసారి, రూ. 12 వేలు మరోసారి దౌర్జన్యంగా సొమ్ము బదిలీ చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. అయితే బాధితుడు 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు వ్యక్తులు అరెస్టు.. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను సోమ వారం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యనమలకుదురుకు చెందిన బత్తుల మహేష్, ఎం.దీపక్చంద్, రెబ్బ ఉజ్వల్, షేక్ సమీర్, బణావత్ బుజ్జి బాబు, రెబ్బ సంజయ్, మద్దెల పవన్ ఉన్నారు. నింది తులను విజయవాడ కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్గాంధీ పార్కు ఎదురుగా రైల్వేట్రాక్ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు సోమవారం సాయంత్రం 5.30గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఊరు, పేరుకు సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. మృతురాలు వయస్సు సుమారు 50ఏళ్లు ఉండవచ్చని, ఎరుగు రంగులో ఉండి పచ్చని జాకెట్, పింక్ చీర ధరించి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించండి
చిలకలపూడి(మచిలీపట్నం): గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించాలని గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్కు వినతిపత్రం సమర్పించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లవల్లి గ్రామంలో ఆర్ఎస్ నంబర్–11 ఉన్న అటవీభూముల్లో పశువుల మేత కోసం వినియోగించుకుని జీవనం సాగించేవారన్నారు. అయితే ఈ భూములను ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించారన్నారు. దీని కారణంగా జీవనభృతి దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి, కొంతమందికి మాత్రమే చెల్లించారని.. మిగిలిన వారికి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీఐఐసీకి 1,460 ఎకరాలు బదిలీ చేసిన నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులు 2,400 మంది ఉన్నారని వీరికి సర్వే నంబరు 11లో ఉన్న 100 ఎకరాలను ఇళ్లపట్టాలు అందించాలని ఆయన జేసీకి వివరించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో ఈ భూమికి సంబంధించిన అన్ని అంశాలను జేసీకి ఆయన వివరించారు. ‘మీ కోసం’లో జేసీకి విన్నవించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ -
దుర్గమ్మ భక్తులకు త్వరలో జలప్రసాదం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇకపై దేవస్థానమే ఉచితంగా మినరల్ వాటర్ బాటిళ్లను జల ప్రసాదంగా పంపిణీ చేయనుంది. ఇందు కోసం మినరల్ వాటర్ను బాటిళ్లలో ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ప్లాంట్ను దేవస్థానం ఏర్పాటు చేయనుంది. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో రూ.1.10 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం సోమవారం బ్రాహ్మణ వీధిలో ఉన్న జమ్మిదొడ్డి ఆవరణలోని బోర్డు సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈఓ శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఏఈఓలు హాజరయ్యారు. బోర్డు సమావేశంలో మొత్తం 15 అంశాలు చర్చకు రాగా పది అంశాలను ఆమోదించారు. కొన్నింటిని వాయిదా వేశారు. మరి కొన్నింటిని తిరస్కరించారు. ఆమోదం తెలిపిన అంశాలివే... ప్రసాదాల ప్యాకింగ్కు అవసరమైన క్యారీ బ్యాగులను 12 నెలలకు సరఫరా చేసే టెండర్ను ఆమోదించారు. దుర్గగుడి దత్తత దేవస్థానం కొమర వోలులోని అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి ఆలయానికి మరమ్మతులు, పెయింటింగ్, నిర్వహణ పనులకు ఆమోదం తెలిపారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని రాయబార మండపం ఉత్తరభాగంలో మెట్లు అభివృద్ధికి రూ.8.25 లక్షల అంచనాలకు, వేసవి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటుకు రూ.14.50 లక్షల అంచనాలకు, మార్చిలో జరిగే కుంభాభిషేకానికి అవసరమైన స్కాఫోల్డింగ్ పనులకు రూ.6.50 లక్షల అంచనాలకు, భవానీ దీక్ష విరమణ సమయంలో లడ్డూ తయారీ నిమిత్తం కాంట్రాక్టర్కు రూ.19.85 లక్షలు చెల్లించేందుకు, ప్రసాదాల పోటులో నాలుగు లిఫ్ట్ల ఏర్పాటుకు రూ.1.70 కోట్ల అంచనాలకు, అన్నదాన భవనంలో రూ.70 లక్షల అంచనాలతో లిఫ్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ చేసిన తీర్మానాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించారు. దేవస్థానానికి చెందిన భూములు, పొలం లీజులు, కౌలు వంటి అంశాలపైనా చర్చ జరిగింది. -
‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ సైకిల్ ర్యాలీ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ ని చేపట్టినట్లు కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యాన 11 మంది విద్యార్థులు ఆరు రోజుల పాటు ఐదు జిల్లాల మీదుగా 600 కి.మీ ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్, ఈగల్ ఏపీ, రెడ్ రోప్ మూవ్మెంట్ ఆధ్వర్యాన పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఈగల్ ఏపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ రవికృష్ణ, ఈగల్ ఏపీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.నగేష్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ కె.భాగ్యలక్ష్మి, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వల్లూరు నీరజ హాజరయ్యారు. విజయవాడ టు విశాఖ.. ఆయన మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ద్వారా మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, మానవ అక్రమ రవాణా, సురక్షిత వలసలపై అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, న్యాయ ప్రాప్తి, లైంగిక విద్య, ఎయిడ్స్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర సాగుతుందని తెలిపారు. కళాశాల విద్య అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ తులసి మస్తానమ్మ, రెడ్ రోప్ కోఆర్డినేటర్ క్రిస్టోలెట్, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే..
విజయవాడ కల్చరల్: సంస్కార భారతి మహానగర్, సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో భరతముని జయంతి సందర్భంగా నగరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్యపోటీ విజేతల వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, నగర అధ్యక్షుడు పసుమర్తి భాస్కరశర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. నాట్యాచార్యులు హేమంత్కుమార్, సుధీర్రావ్, సంతోష్, పద్మశ్రీ హేమంత్, యల్లా జోస్యుల అనూరాధ, తులసీ కృష్ణ, మంజూష, స్రవంతి, కల్పన నృత్యపోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని చెప్పారు. విజేతల వివరాలు.. ● కూచిపూడి నృత్యం సీనియర్స్ విభాగంలో సాయి వర్షిత వర్మ, భావన, నిఖిల లక్ష్మి, జూనియర్స్లో జాస్విత, యశ్వర్థిక్, నిశ్వన, సబ్ జూనియర్స్లో లోచన శ్రీ వర్షిత, దేవాన్విషి, ప్రీతి మహల్లిక ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. ● భరతనాట్యం సీనియర్స్లో మధురిమ, సన్వితశ్రీ, నమోనిక, జూనియర్స్ విభాగంలో మిధున, మనస్వి ఫణి, సాయి లక్ష్మి, సబ్ జూనియర్స్లో నాగవర్నిక, ఆరాధ్యశ్రీ, దివ్యాన్ శ్రీసార విజేతలుగా నిలిచారు. ● ఆంధ్రనాట్యం సీనియర్స్లో షేక్ షర్మిళ, దేవార్షిణి, హరిణి, జూనియర్స్లో నాగత తన్విశ్రీ, లాస్య ప్రియ, తేజస్విని, సబ్ జూనియర్స్లో అక్షరదేశ్ పాండే, మేఘన, సహస్రలు వరుసగా ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ● జానపద బృంద నృత్యంలో మధురిమ గ్రూప్, శ్రీ ఉమామహ్వేర గ్రూప్, తులసీ లహిత గ్రూప్, శాసీ్త్రయ బృంద నృత్యంలో శ్రీ కనకదుర్గా నాట్యమందిర్, అమృత గ్రూప్, సన్విశ్రీ గ్రూప్లు ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు -
రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి
తిరువూరు: రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వాట్సాప్లో స్టేటస్ పెట్టారు.తాను మూడ్రోజులపాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యానని, రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్లో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, వారి పరిస్థితి సైతం కంటతడి పెట్టించిందని కొలికపూడి పేర్కొన్నారు. ఇప్పుడు కొలికపూడి వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. -
ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఆత్మహత్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యల విపరీతమైపోయాయి. రైతుల కంటే రైతు కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడైంది. కార్యదర్శల సమీక్షలో ఏపీలోని ఆత్మహత్యల వాస్తవాలు బయటకొచ్చాయి. ఏపీలో ఆత్మహత్యలకు గల కారణాలు..4,456 మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు2,742 మంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు447 మంది ప్రేమ విఫలమై ఆత్మహత్యలునిరుద్యోగం వలన 206 మంది ఆత్మహత్యలుమద్యంకి బానిసై 1544 మంది ఆత్మహత్యలుచదువుల ఒత్తిడితో 191 మంది ఆత్మహత్యలుపని ఒత్తిడి వలన 31 మంది మరణాలుఇతర కారణాలతో 4,500 మంది ఆత్మహత్యలు -
AP: పని ఒత్తిడి.. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్మ
విజయవాడ: పని ఒత్తిడి భరించలేక ఇద్దరు సచివాలయ ఉద్యోగులు వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తున్న దాసి సబిత ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఇదిలా ఉంచితే, మరో సచివాలయ ఉద్యోగి ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా బి. కొత్తపేటలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక బైపాస్ రోడ్ లోని తన ఇంటిలో ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం అనే వెల్ఫేర్ అసిస్టెంట్. మృతుడి స్వగ్రామం రామసముద్రం మండలం ఇటీవల బదిలీల్లో భాగంగా బి.కొత్తకోట వచ్చాడు సుబ్రహ్మణ్యం. అయితే సుబ్రహ్మణ్యంకు పని ఒత్తిడి పెరిగిపోయింది. డబ్యూఈఏ(వార్డు ఎడ్యకేషన్ అసిస్టెంట్), డీఏ(డేటా అనాలిసిస్), పీఎస్(పబ్లిక్ సర్వీసెస్), బీఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్, ఈఎన్ఏ(ఎంక్వరీ యాక్టివిటీ) తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో యూఎఫ్ఎస్(అర్బన్ ఫ్రేమ్ సర్వే)లో భాగంగా 888 గృహాలు అతనికి కేటాయించారు. ఇలా పనిభారం పెరిగిపోయింది. దాంతో విరామం లేకుండా పనిచేసి అత్యధిక బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బి.కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించేసిన కూటమి ప్రభుత్వం..ఏపీలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. పెద్దఎత్తున ఉపాధి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు.మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థ కాస్త తెరమరుగై పోయింది. దాంతో లెక్కల్లో మాత్రమే ఉన్న సచివాలయ ఉద్యోగులపై పని భారం అధికమైంది. తాజాగా జరిగిన ఈ రెండు ఆత్మహత్మ ఘటనలే అందుకు అద్దం పడుతున్నాయి. -
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వాట్సప్ స్టేటస్..
సాక్షి,ఎన్టీఆర్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సప్ స్టేటస్లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సప్ స్టేటస్ మరోసారి చర్చాంశనీయంగా మారింది.ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్లో మూడు రోజులపాటు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందని పెట్టిన స్టేటస్పై స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. కొలికపూడి స్టేటస్ టీడీపీ పాలనకు అర్ధం పట్టే విధంగా ఉందని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలికపూడి పోస్టుతో టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ మొదలైంది. పరోక్షంగా సొంత పార్టీనే ఉద్దేశించి స్టేటస్ పెట్టినట్లు గుసగుసలాడుకుంటున్నారు. -
నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం
విజయవాడ కల్చరల్: స్వరనర్తన సంగీత నృత్య శిక్షణా సంస్థ, బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆంధ్రనాట్య పోటీ విజేతలకు బహు మతి ప్రదానం, నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ హాజరవగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, ఏపీ సృజనాత్మక సమితి చైర్ పర్సన్ పొగడపాటి తేజస్వి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్రాంత హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, నాట్యాచార్యుడు కళాకృష్ణ ఆంధ్రనాట్య వైభవం గురించి ప్రసంగించారు. నాట్యాచార్యుల బృంద సభ్యులు ప్రదర్శించిన నృత్యాలు నేత్ర పర్వంగా సాగాయి. బహుమతి ప్రదానం.. ● జూనియర్ విభాగంలో శారదా రామకృష్ణ బృందానికి ప్రథమ స్థానం, తమ్మిన జ్యోత్స్న బృందం, పెడమల్లు క్షీరసాగరానికి ద్వితీయం, కె. సాహితీ లక్ష్మి, ఉమామహేశ్వర పాత్రుడికి తృతీయ స్థానం లభించింది. ● సీనియర్స్ విభాగంలో శారదా రామకృష్ణకు ప్రథమం, సాయిమాధవికి ద్వితీయం, ఉమామహ్వేర పాత్రుడుకి తృతీయ బహుమతి లభించింది. ఆయా బృందాలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. -
వీరమ్మ తల్లి తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు
ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు. భక్తులకు అగచాట్లు.. వేలాదిగా భక్తజనం తిరునాళ్లకు తరలిరావటంతో భక్తజనం నరకయాతన పడ్డారు. క్యూ లైన్లు అన్నీ కిక్కిరిసిపోవటంతో శిడి బండి వరకూ బారులుతీరి గంటల కొద్దీ దర్శనానికి నిరీక్షించి అవస్థలు పడ్డారు. భక్తులకు క్యూలైన్లలో వసతులు కల్పించకపోవటంతో వృద్ధులు, చిన్నారుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు మరింత ఇబ్బంది పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల కొద్దీ వేచి ఉండలేక ధ్వజస్తంభం, ఆలయం వెలుపలే మొక్కులు చెల్లించుకుని వెనుతిరిగిరు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు. -
ముగిసిన నవదిన ప్రార్థనలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఓ హాలులో ఆదివారం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జి. కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎ. సులోచన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా 2016 నుంచి విధుల్లో ఉన్నారని.. పదేళ్లుగా పనిచేస్తున్నా రెగ్యులర్ చేయలేదని, వేతనాలు కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మెడికల్ లీవ్లు, డీఏలు, హెచ్ఆర్ఏ, నైట్ డ్యూటీ అలవెన్స్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు పాల్గొన్నారు. -
నదీమ తల్లికి కవితా హారతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదిపై జలవిహారం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించిన కవులు, కవయిత్రుల్లో భావావేశాలు ఉప్పొంగాయి. కృష్ణా తరంగాలపై ఓలలాడుతూ ఆనందోత్సాహాల నడుమ తమ కవితలతో కృష్ణమ్మకు హారతులిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆదివారం విజయవాడ భవానీపురంలోని బెరంపార్క్ వద్ద ‘కృష్ణా తీరం.. కవితా హారం’ పేరుతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నదిలో ప్రయాణిస్తున్న బోటులో కవి సమ్మేళనం నిర్వహించడం ఒక కొత్త ఒరవడికి నాంది అని, ఇదే తరహాలో పెన్నా, గోదావరి నదీ తీరాలలో సాహిత్య కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవీపట్నం నుంచి పాపికొండలు వెళ్లే లాంచిలో త్వరలోనే కవి సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. కవులు, రచయితలు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. కళలు, సాహిత్యం మన సంస్కృతికి చెట్ల వేర్లు వంటివని, అవి ఎంత బలంగా ఉంటే మన సమాజం అంత బలంగా ఉంటుందని చెప్పారు. జాతి బతకాలంటే భాష బతకాలి ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజశ్వి మాట్లాడుతూ జాతి బతకాలంటే భాష బతకాలన్నారు. చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి మాత్రమే కాదని, కవుల పద్యాల నుంచి కూడా తెలుసుకున్న చరిత్ర మనదని పేర్కొన్నారు. భాష, సాహిత్యాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ప్రతినిధులు, సాహిత్యాభిలాషులు తదితరులు పాల్గొన్నారు. -
జల్లు స్నానాలకు ఇక చెల్లు
విజయవాడ దుర్గాఘాట్లో నేటి నుంచి నదీ స్నానం ప్రారంభం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులు, యాత్రికులు ఇకపై దుర్గాఘాట్లో నదిలోకి దిగి స్నానాలు చేసేందుకు వీలు కల్పిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి భక్తులు నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత నాలుగు రోజులుగా స్నానఘాట్ లో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలు, బురదను పొక్లయిన్తో తొలగించే పనులు చురుగా సాగాయి. స్నానాలు చేసే వారు నది గర్భంలోకి వెళ్లకుండా ఉండేందుకు పది అడుగుల ఎత్తులో స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా అనంతరం నదిలోకి పుణ్యస్నానాలు ఆచరించకుండా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కరోనా అనంతరం నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో మరికొంత కాలం నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించడం సాధ్యం కాలేదు. ప్రత్యామ్నాయంగా జల్లు స్నానాలకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఏడాది మహా శివరాత్రికి దుర్గాఘాట్లోని నదిలోకి దిగి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకుంటున్నారు. క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లు.. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం బస్సులను ఏర్పాటు చేసింది. నడక దారిలో వెళ్లే వారి కోసం అండర్ పాస్ను నిర్మించింది. నదీ తీరం నుంచి నేరుగా దేవస్థాన కేశఖండనశాల వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఘాట్రోడ్డులో కామథేను అమ్మ వారి ఆలయానికి చేరుకుంటారు. దుర్గాఘాట్లో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, లగేజీ భద్రపరుచుకునేందుకు క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లను అందుబాటులో ఉంచింది. -
పోటీలలో పాల్గొనడంతో ఆత్మవిశ్వాసం పెంపు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశ పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 16 గ్రూపులకు పోటీల నిర్వహణ..ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తపేట పీఎస్ పరిధిలో ఇద్దరి బలవన్మరణం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట బ్రహ్మణ వీధి రాయన వారి వీధిలో వర్రి హైమావతి, సూర్య ప్రకాష్రావులు నివాసం ఉంటారు. వీరి ఇంటిలోని ఓ పోర్షన్లో బంకా లక్ష్మణరావు ఒంటరిగా నివాసం ఉంటాడు. లక్ష్మణరావు తోపుడు బండిపై నిమ్మకామలు అమ్ముతూ జీవిస్తుంటాడు. లక్ష్మణరావుకు గతంలో వివాహం కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వారితో విభేదాల కారణంగా నాలుగేళ్లగా హైమావతి ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఒంటరి జీవితం, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇంటి యజమానికి మూడు నెలలు అద్దె బకాయి ఉండటంతో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన లక్ష్మణరావును డబ్బులు అడిగేందుకు హైమావతి కిందకు దిగింది. లోపల ఉన్న లక్ష్మణరావును ఎంత పిలిచినా పలకక పోవడంతో తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే లోపల సీలింగ్ ఫ్యాన్కు లక్ష్మణరావు ఉరి వేసుకుని కనిపించడంతో కేకలు వేసింది. చుట్టు పక్కల వారు వచ్చి లక్ష్మణరావుకు ఉరి నుంచి కిందకు దింపగా అప్పటికే మృతి చెందాడు. ఘటనపై హైమావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరి వేసుకుని మైనర్.. కొత్తపేట ఆంజనేయ వాగు నాగేంద్రస్వామి వారి పుట్ట ప్రాంతంలో పాల కనకం, గోవిందుల కుటుంబం నివాసం ఉంటుంది. గోవిందుకు మొదటి వివాహం కాగా అమ్మాయి, అబ్బాయి సంతానం. గోవిందు మొదటి భార్య చనిపోవడంతో కనకంను రెండో వివాహం చేసుకున్నాడు. గోవిందు తాపీ పని చేస్తుండగా, కనకం టిఫిన్ బండి నడుపుతుంది. కనకం కుమార్తె 9వ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. రెండు రోజులుగా సరిగా అన్నం తినకుండా ముబావంగా ఉండటంతో తల్లి ఆరా తీసినా విషయం చెప్పలేదు. ఆదివారం మధ్యాహ్నం బెడ్ రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న కనకం ఇంటికి వెళ్లి కుమార్తెను ఉరి నుంచి కిందకు దింపి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఘటనపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోనేరుసెంటర్: బందరు బస్టాండ్లో ఓ బాధితురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని సేకరించిన పోలీసులు సదరు వస్తువును సంబంధిత మహిళకు అప్పగించిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నరసాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే ఆమె కొంత మంది స్నేహితులతో కలిసి మొక్కుబడి తీర్చుకునేందుకు ఈ నెల 5న విజయవాడ బయలుదేరింది. నరసాపురం బస్సు బందరు బస్టాండ్కు రావటంతో విజయవాడ బస్సు ఎక్కేందుకు అందరూ బస్టాండ్లో దిగారు. ఆ సమయంలో లిఖిత చేతికి ఉన్న బ్రేస్లెట్ కింద పడిపోయింది. విషయాన్ని ఎప్పటికో గ్రహించిన లిఖిత ఆభరణం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో అదే రోజు వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ క్రైం పార్టీ సిబ్బంది బస్టాండ్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఓ వృద్ధుడికి ఆభరణం కనిపించగా అతను ఆభరణాన్ని తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. సదరు వృద్ధుడి శారదనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆభరణాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చిలకలపూడి సీఐ ఎస్కే నభీ చేతుల మీదుగా బాధితురాలికి ఆభరణాన్ని అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వర్గాలుగా చీలిన విజయవాడ సెంట్రల్ టీడీపీ7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 36.1837 టీఎంసీలుగా ఉంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దందాలతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చివరకు ఫుట్పాత్లు, టిఫిన్ బండిని కూడా వదలకుండా భారీ రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ అదనపు అంతస్తులు, అక్రమ కట్టడాలు కడుతున్నా స్థానిక టీడీపీ నేతలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు వాలిపోతున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేతలకు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నియమించిన ఏజెంటుకు మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. కొన్ని చోట్ల బహిరంగంగానే తన్నుకోవడంతో రచ్చ, రచ్చ అవుతోంది. ఈ విషయం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లినా, తన ‘ఏజెంట్’ వైపే మొగ్గు చూపుతుండటంతో ఆయనపై క్యాడర్ సైతం కారాలు, మిరియాలు నూరుతోంది. ఎవ్వరు ఏమనుకుంటే, నాకేంటి.. అన్న రీతిలో ఆ ఏజెంట్ వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉండటం ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ‘తమ్ముళ్ల’ మధ్య జరుగుతున్న గొడవల వెనుక అసలు రహస్యం ఈ దందాల వసూళ్లలో వచ్చిన తేడాలే అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇంతకు మునుపు బీసెంట్ రోడ్డులో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో దందా జరిగేది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఇద్దరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని స్వయంగా దందాలు చేస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకరేమో పలు కేసుల్లో నిందితుడు, మరొకరు ఇటుకల వ్యాపారి కావడం విశేషం. ప్రధానంగా బీసెంట్ రోడ్డులో కొత్తగా 16 బండ్లు ఏర్పాటు చేసి, బండికి రూ. 4లక్షల చొప్పున వసూలు చేశారు. దీంతో పాటు రెండో సెక్టార్లో ఒక్కో పాత బండి నుంచి రూ.3లక్షల చొప్పున రూ.35 లక్షలు వసూలు చేశారు. మొత్తం మీద బీసెంట్ రోడ్డులో హాకర్ల నుంచి రూ. కోటికి పైగా వసూళ్లు రాబట్టారు. అ‘ధన’పు వసూళ్లు..దీంతో పాటు అక్కడ నాలుగు భవనాలకు సంబంధించి అదనపు అంతస్తుల నిర్మించారు. వీరు అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధిని కలుసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే నిర్మాణం చేసుకున్నారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా బిల్డింగ్ వ్యవహారం చూస్తున్న ప్రజాప్రతినిధి ఏజెంట్ అయిన ఇటుక వ్యాపారి అక్కడ వాలిపోయారు. అదనపు అంత స్తులు నిర్మించిన భవన నిర్మాణ యజమానులను, నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని కలవాలని హుకుం జారీ చేశారు. వారు వెంటనే నియోజకవర్గ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి, స్థానిక ప్రజా ప్రతినిధికి చెప్పి నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. ఆగ్రహంతో రగిలి పోయిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధి మధ్యాహ్నం 12 గంటలలోపు అదనపు అంతస్తుకు రూ.25 లక్షల చొప్పున, మధ్యాహ్నం 12 గంటల లోపు తెచ్చి ఇవ్వాలని ఆదేశించారు. వారు డబ్బు సమీకరించుకొని తీసుకురావడం కొంత ఆలస్యం కావడంతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు, టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ట్రాక్టర్లు, బుల్డోజర్లు తీసుకొని కూల్చేందుకు సిద్ధం చేసినట్లు చర్చ సాగుతోంది. డబ్బులు తీసుకు వస్తున్నామని, ఫోన్ చేసి చెప్పి, వెంటనే ముట్టజెప్పడంతో శాంతించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధికి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి మధ్య వసూళ్లలో కోల్డ్ వార్ నడిచి.. చివరకు బహిరంగ తన్నులాటకు దారి తీసినట్లు సమాచారం. ప్రధానంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గం వారు కావడం, స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధి స్థానికంగా బలమైన సామాజిక వర్గం వారు కావడంతో అక్కడ వర్గ పోరు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. వసూళ్లలో విభేదాలతో ఇటీవల బాహాబాహీ కార్పొరేటర్ వర్సెస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఎక్కడ అదనపు అంతస్తు వేసినా వాలిపోతున్న ‘ఏజెంట్’ రగిలిపోతున్న స్థానిక టీడీపీ నేతలు బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారులనూ వదలని వైనం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్లవల్లేరు: డోకిపర్రులోని శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సరస్వతి యాగం జరిగింది. విద్యార్థులు చదు వుల తల్లి కటాక్షం కోసం పూజలు చేశారు. అజిత్ సింగ్నగర్లో ఓ బ్రాందీ షాపు మార్పు విషయంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు తలదూర్చడంతో పాయకాపురానికి చెందిన నేతలు ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆయన వారి మాట వినకపోవడంతో చివరకు బార్లకు సంబంధించి ఓ వ్యక్తి ద్వారా మధ్య వర్తిత్వం చేయించి రూ.4లక్షలు చెల్లించినట్లు అక్కడ చర్చ సాగుతోంది. నాలుగు స్తంభాల సెంటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులకు 200 గజాల స్థలం ఉంది. దాని పక్కనే ప్రభుత్వానికి చెందిన 100 గజాల స్థలం ఉంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, దానిని కలుపుకోవటంతో అక్కడ రచ్చ జరుగుతోంది. 64వ డివిజన్లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత బ్యానర్లను చించి వేయటంతో అక్కడ గందరగోళం నెలకొంది. మధురానగర్లో ఓ టీడీపీ స్థానిక ప్రజా ప్రతినిధి, ఇటుక వ్యాపారి పెత్తనాన్ని జీర్ణించుకోలేక రగిలిపోతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికితోడు రేషన్ బియ్యం, మట్టి దందా జోరుగా సాగుతోంది. బీసెంట్ రోడ్డులోనూ దందా ఇతనే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ భవన నిర్మాణం, అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న నియోజక వర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు (ఇటుకల వ్యాపారి) వాలిపోతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర తానే పోషిస్తూ, బిల్డింగ్ను బట్టి పెనాల్టీ వసూలు చేస్తున్నారు. ఈ దందాతో భవనాలు నిర్మించే యజమానులు హడలిపోతున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతున్నారు. -
ఐక్యత చాటిన సత్యసాయి రన్ రైడ్ 5కే ర్యాలీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): సేవా భావం, క్రమశిక్షణ శ్రీ సత్యసాయి భక్తుల ప్రత్యేకత అని.. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్కే షిరీన్ బేగం అన్నారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో శ్రీసత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి రన్.. రైడ్.. 2026 5కే ర్యాలీ ఆదివారం జరిగింది. ర్యాలీలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావుతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. రన్ రైడ్కు విశేష స్పందన ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం నగరంలో ఐక్యతా సందేశాన్ని చాటుతోందన్నారు. బాబా అందించిన ప్రేమ, కరుణ, సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఐక్యతా భావం వ్యాప్తి, ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా శ్రీ సత్యసాయి రన్ – రైడ్ – 2026 5కే రన్ నిర్వహించామన్నారు. కార్పొరేటర్ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. 9 వేల మందికి పైగా 5కే రన్ రైడ్లో ఉత్సాహంగా పాల్గొని ఐక్యత, సమరసతకు ప్రతీకగా నిలిచారు. శ్రీ సత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్ను బీఆర్టీఎస్ రోడ్డులో షిరీన్ బేగం, లక్ష్మణరావు మోశారు. ప్రపంచ వ్యాప్త్తంగా ఐక్యత, పవిత్రత, దైవత్వం సందేశాన్ని చాటేందుకు రూపొందించిన ఈ టార్చ్ను గతేడాది నవంబర్ 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. తొలుత సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, జాతీయ యువ సమన్వయకర్త లక్ష్మీకాంత్శర్మ, జిల్లా అధ్యక్షుడు జి.విశ్వనాథం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ సురేంద్ర, సేవా సమన్వయకర్త కె.శ్యామ్ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సర్వమత ప్రార్థనలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన గాయకులు సర్వమత ప్రార్థనలు ఆలపించి, విశ్వ శాంతి కోసం ప్రార్థించారు. ప్రముఖ ఫిట్నెస్ కోచ్, జుంబా ఇన్స్ట్రక్టర్ బోదేష్ కుమార్ ఉత్సాహభరిత వార్మప్ సెషన్ నిర్వహించారు. బాలవికాస్ విద్యార్థుల సంగీత బృందం ఆకట్టుకునే ప్రదర్శనతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. రన్లో పాల్గొన్న వారికి ప్రత్యేక టీ షర్టులు, ఫినిషర్ మెడల్స్ అందజేశారు. -
1న జెన్ ఏఐ, చాట్బాట్ క్రియేషన్పై వర్క్షాప్
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జెన్ ఏఐ(జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్), చాట్బాట్ క్రియేషన్ అంశాలపై ఒక రోజు వర్క్ షాపును మార్చి 1వ తేదీన గుంటూరులో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నామని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ వర్క్షాపును జేవీవీ, సన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, స్వేచ్ఛా ఫ్రీ సాప్ట్వేర్ మూవ్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆదివారం వర్క్ షాపుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ మార్పులను అర్థం చేసుకుని వాటిని సృజనాత్మకంగా వినియోగించాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకునే అవకాశం వర్క్షాప్లో వాల్మార్ట్ ఇండియాలో సీనియర్ టెక్నాలజీ నిపుణుడిగా పనిచేస్తున్న దిలీప్కుమార్ ముఖ్య రిసోర్స్ పర్సన్గా పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే వరంగల్ ఎన్ఐటీకు చెందిన ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య పాల్గొని సాంకేతికత, శాసీ్త్రయ దృక్పథం వంటి పలు విషయాలపై ప్రసంగిస్తారన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్క్షాప్ ద్వారా విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్స్తో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్, కె.త్రిమూర్తులు, లెనిన్ బాబు, రత్నకమల్ పాల్గొన్నారు. -
లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు
హజ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరానికి చెందిన చందన సీతారావమ్మ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన పాములపాటి రాజేశ్వరరావు, శేషరత్నం దంపతులు కుమార్తె, అల్లుడు మణిశ్రీ, రామకృష్ణల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు చేతుల మీదగా దేవస్థానానికి అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. కృష్ణలంక(విజయవాడతూర్పు):లారీ ఢీకొనడంతో ద్విచక్ర వామనంపై వెళ్తున్న కారు డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన శ్రీరాం సందీప్ (25) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అదుపుతప్పి లారీ వెనుక చక్రం కిందపడి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు):హజ్ యాత్రికులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారి కోసం ప్రభుత్వాస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహిహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా శనివారం ఆమె శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. హజ్ యాత్రకులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్ వంటి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. వారికి కావాల్సిన హెల్త్ కార్డును పరిపూర్ణంగా పూర్తి చేయించుకుని మాత్రమే వెళ్లాలని కోరారు. యాత్రికులు 101 మంది శనివారం నమోదు కాగా, వారిలో 90 మందికి పరీక్షలు పూర్తి చేశామని, ఇద్దరు అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు డాక్టర్ నూరుల్లా, నోడల్ ఆఫీసర్ ఫాజల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ● టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం బంటుమిల్లి: మండల పరిధిలోని ముంజులూరు గ్రామ శివార్లలో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బందరు మండలం, గిలకలదిండి గ్రామానికి చెందిన మోకా శివకృష్ణ (40) భార్యాపిల్లలను అత్తారిల్లు కృత్తివెన్ను మండలం, పోడు గ్రామంలో దించేందుకు ఈ నెల 5వ తేదీన ద్విచక్రవాహనంపై వచ్చారు. అనంతరం 6వ తేదీ రాత్రి పోడు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్లేందుకు బయలుదేరాడు.ముంజులూరు సమీపంలోని టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుపై వెళుతున్న లారీ ఢీకొనడంతో శివకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ ఎ.గణేష్కుమార్ టోల్ప్లాజాలోని సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాలపై దృష్టి పెట్టగా ఈ ప్రమాదానికి టిప్పర్ కారణమని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా డ్రైవరు జరిగిన ప్రమాదం విషయం చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ నాగార్జున సాగర్ జీజీహెచ్లో ప్రత్యేక వైద్య శిబిరం -
ఉన్నతమైంది న్యాయవాద వృత్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైందని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ అన్నారు. సూర్యారావుపేటలోని రైల్వే ఫంక్షన్ హాలులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యాన కృష్ణాజిల్లా 12వ, విజయవాడ నగర 13వ కాన్ఫరెన్స్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ దుర్గాప్రసాద్ ‘రాజ్యాంగ హక్కులకు రక్షణ – న్యాయవాదుల పాత్ర’ అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చట్టం లేకపోతే అరాచకత్వం పేట్రేగిపోతుందని, దానిని కట్టడి చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఐఏఎల్ స్థాపించిన నాటి నుంచి ప్రజల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తున్నామన్నారు. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, పరీక్షలు నిర్వహించి వారిని చైతన్యం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపాల్ దివాకర్బాబు, యూనియన్ నాయకులు సురేష్ కుమార్, సుధాకర్ రాజు, అన్నారావు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ యు.దుర్గాప్రసాద్ -
జాతీయ స్థాయి నృత్య పోటీలు ప్రారంభం
విజయవాడ కల్చరల్: కళా సాంస్కృతిక రంగాల పూర్వ వైభవానికి సంస్కార భారతి కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. భరతముని జయంతి సందర్భంగా సుమధు కళానికేత్, సంస్కార భారతి మహానగర్ శాఖ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి నృత్య పోటీలను శనివారం అయోధ్యనగర్లోని కళావేదికపై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కార భారతి పనిచేస్తుందని చెప్పారు. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అంశాల్లో యువతకు, చిన్నారులకు శిక్షణ తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నాట్యాచార్యులు సుధీర్రావు, పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధి దుర్భా శ్రీనివాస్, సంస్కార భారతి సంస్థ బాధ్యలు బోడి ఆంజనేయరాజు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీలను గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదిక, ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కల్యాణ మండపం, కోదండ రామాలయం, అయోధ్యనగర్లోని హైందవి, శ్రీధర్మ పరిషత్ వేదికలపై సోలో విభాగంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి అవుట్ఫాల్ డ్రెయిన్లో పడి మృతిచెందిన సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన జయ్యద్ జానీ(45) అనే వ్యక్తి సింగ్నగర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తుంటాడు. శుక్రవారం కూడా పనికి వెళ్లిన ఆయన రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తూ పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో నందమూరినగర్ అవుట్ఫాల్ డ్రెయిన్ వెంబడి రోడ్డుపైనే నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున చూసే సరికి జానీ అవుట్ఫాల్ డ్రెయిన్లో పడిపోయి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను భవిష్యత్ తరరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కళాకారులు సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తి చేయాలని కోరారు. కొండపల్లి బొమ్మల కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో హస్త కళాకారుల సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమ య్యారు. శతాబ్దాల చారిత్రక ఔన్నత్యమున్న కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు అందరి కృషి అవసరమన్నారు. కొత్త డిజైన్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశా ల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధితో పాటు కొండపల్లి ఒక మోడల్ గ్రామీణ ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొరవ చూపుతున్నా మని వెల్లడించారు. జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, బొమ్మల కళాకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్, గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్శాఖ కఠిన చర్యలతో పాటు, మానవతాదృక్ఫథంతో ముందుకు సాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానం కలిగినా, నిర్ధారణ అయినా వెంటనే పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్ , వైద్య చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణా , విక్రయం వంటి నేరాల్లో పోలీసులకు చిక్కితే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్ వారితో సహకరించాలని కోరారు. -
ప్రభుత్వం తొండి..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆరోగ్యశ్రీ అంటేనే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఎందరో పేదల ప్రాణాలకు ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల మదిలో నుంచి తుడిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చింది. అయినా ప్రజలతో పాటు వైద్యులు కూడా ఆరోగ్య శ్రీ అనే పిలుస్తున్నారు. దీంతో పథకాన్ని కనుమరుగు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్య శ్రీని రద్దు చేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను ముందుకు తెస్తోంది. వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఆ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆ పథకంలోని ప్యాకేజీలపై ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. పేరుకుపోయిన బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శ్రీ పథకంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేసే నెట్వర్క్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో 2024లో మొదటి రెండు క్వార్టర్లకు సంబంధించి బిల్లులు రూ.1600 కోట్లు వరకూ పెండింగ్ ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం కనికరించలేదు. అంతేకాదు ఆ తర్వాత చేసిన వాటికి సైతం అరకొరగా నిధులు విడుదల చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీంతో ఉమ్మడి కృష్ణాలోని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.300 కోట్లకు చేరాయి. దీంతో ఆస్పత్రుల మనుగడ కష్టతరంగా మారింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని ఆర్థిక సంక్షో భంలో పలు ఆస్పత్రులు కొట్టుమిట్టాడుతున్నాయి. తెరపైకి కొత్త పథకం ఆరోగ్య శ్రీని రద్దు చేసి, యూనివర్సిల్ హెల్త్ స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఈ స్కీమ్లో ఆరోగ్య శ్రీ పథకంలో ఉన్న ప్రొసీజర్ ప్యాకేజీలను వర్తింపజేస్తామని చెప్పడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. తమతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశ పెడితే అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నాయి. పేదల వైద్యానికీ ఇబ్బందులే.. ఆరోగ్య శ్రీ నిధులు విడుదలలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో ఇప్పటికే సగానికి పైగా ఆస్పత్రులు సేవలు నిలిపివేశాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో కొత్త స్కీమ్ తీసుకొచ్చి, దానిని ఆస్ప త్రులు వ్యతిరేకిస్తే పేదల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తమ పాలిట సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీని రాజకీయాల కోసం రద్దు చేయడంపై పేదలు మండిపడుతున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13.50 లక్షల ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నాయి. వారందరికీ గత ప్రభుత్వం రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించింది. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో సైతం వైద్య సేవలు పొందే వెసులుబాటు కల్పించింది. ఎన్టీఆర్ జిల్లాలో 90, కృష్ణాజిల్లాలో 70 వరకూ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో దాదాపు 120 మందికి పైగా ఆరోగ్య మిత్రలు, ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో పథకం పెట్టిన 2008 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నాయి. ఇప్పుడు పథకాన్ని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టడం దుర్మార్గం. ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వక పోవడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఫలితంగా పలు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కింద సేవలను నిలిిపివేశాయి. ఉచిత వైద్యం అందక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు హర్షించరని తెలుసుకోవాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
నయనానందకరం.. శిడి బండి ఉత్సవం
ఉయ్యూరు: శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడి బండి ఉత్సవం శనివారం రాత్రి నయ నానందకరంగా సాగింది. కొబ్బరి తోట ప్రాంతంలో శిడి బండికి భక్తులు పసుపు నీరు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల కోలాహలం నడుమ శిడి బండిని కాలేజీ రోడ్డు, ప్రధాన సెంటరు మీదుగా ఊయల స్తంభాలు వద్ద ప్రదక్షిణలు చేయించి ఆలయం ఎదుట నిలి పారు. దళితవాడ నుంచి సీఆర్పీఎఫ్ విశ్రాంత మేజరు శివన్న కుమారుడు ఉయ్యూరు విక్రమ్ సింహ పెండ్లి కుమారుడిగా చలువ కావిళ్లతో ఊరేగింపుతో శిడి బండి వద్దకు చేరుకున్నాడు. సంప్రదాయం ప్రకారం శిడి బండి బుట్టలో విక్రమ్ సింహను కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడి బండిని నిలిపి మూడు సార్లు శిడి ఆడించారు. శిడి ఆడే క్రమంలో అశేష భక్తజనం ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షిస్తూ అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఎస్ఐలు బందోబస్తును పర్యవేక్షించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. అమ్మవారికి చీర సారె సమర్పించారు. -
ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా జగదీష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ జగదీష్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఆయుర్వేద వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.ల్లయ్య, డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల జ్యోతి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జగదీష్ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. సూపరింటెండెంట్ను పలువురు వైద్యాధికారులు, అసోసియేషన్ సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓ)ను బలోపేతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు తాము నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సంఘాలు విలువ ఆధారిత ఉత్పత్తులు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు, వివిధ వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. సంఘంలోని సభ్యులు తమకున్న విస్తీర్ణంలో కొంత భాగం తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు సైతం ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మామిడిలో నాణ్యత పెరగడానికి కాయ చిన్న దశలోనే కవర్లు కట్టి పండిస్తున్న ఎఫ్పీఓను కలెక్టర్ అభినందించారు. ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న ఎఫ్పీఓలను అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి, డీఏఓ, డీసీఓ, పీడీ ఆత్మ, డీఆర్డీఏ పీడీ, జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేరస్తులపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని పోలీస్ కమిషన్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. నేరస్తులకు విజయవాడ సురక్షితం కాదనే సందేశాని ఇస్తున్నామన్నారు. భవానీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయం సెంటర్లో శని వారం డ్రగ్స్పై దండయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మరిపాలెం నుంచి నాలుగు స్తంభాల సెంటర్, చెరువు సెంటర్ మీదుగా జీఎన్నార్ స్కూల్, సితార జంక్షన్, కాబేళా, ఊర్మిళా నగర్, చర్చ్ సెంటర్ మీదుగా శివాలయం సెంటర్కు చేరుకుంది. ఇక్కడ సభ అనంతరం స్వాతి మీదుగా గొల్లపూడి పంచాయతీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్లో జరిగిన సభలో సీపీ రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ ఎన్.వి.దుర్గారావు, ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బార్ లైసెన్స్ రద్దు కోసం ఆందోళన
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బీవీఆర్ కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేయనున్న బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలని మహిళలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. బార్ ఎదురుగా టెంట్ వేసి బైఠాయించారు. బార్ తొలగించాలి, డౌన్ డౌన్ ఎకై ్సజ్ శాఖ, లైసెన్స్ రద్దు చేయాలి అంటూ మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సుమారు 300 కుటుంబాలకు చెందిన వారందరం నివసిస్తున్నామని, తమ ఇళ్లు, పాఠశాలలు, హాస్పిటల్కు అతి సమీపంలో బార్ను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఈ ప్రాంతంలో వైన్స్ షాపు నిర్వహించారని అప్పట్లో మందు బాబుల ఆగడాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం బార్తో పాటు రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థినులు, మహిళలు, చిన్నపిల్లలకు భద్రత కరువు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనసంచారం లేని చోట, జాతీయ రహదారికి అర కిలో మీటరు దూరంలో, స్కూల్స్, హాస్పిటల్స్ లేని ప్రాంతంలో మద్యం విక్రయాలు నిర్వహించాలని జీఓ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన వైన్స్ షాపు ఫలితంగా చైన్ స్నాచర్లు, గంజాయి, మద్యం బ్యాచ్ల వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తక్షణం బార్ లైసెన్స్ రద్దు చేయా లని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తా మని ఎకై ్సజ్ అధికారులను హెచ్చరించారు. -
గుణదల క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ
గుణదల(విజయవాడ తూర్పు): దేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రం విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయం. తమిళనాడులోని వేళాంగిణీ మాత ఆలయం తరువాత అంతటి విశిష్టత కలిగిన క్షేత్రమిది. ఈ ఆలయంలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజులపాటు 102వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు తరలిరానున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు విజయవాడ కతోలిక పీఠం బిషప్ రాజారావు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ తిరునాళ్ల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. యాత్రికులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలను సమర్థంగా నిర్వహిస్తామని ఆలయ గురువులు చెబుతున్నారు. లక్షలాదిగా తరలిరానున్న విశ్వాసులు 1937 నుంచీ గుణదల మేరీమాత ఆలయంలో ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. కాలక్రమంలో యాత్రికుల సంఖ్య పెరగటంతో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. 1946లో కొండ ఎగువన ఉన్న మరియమాత స్వరూపం వద్ద సమష్టి దివ్యబలిపూజలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. శిఖరాగ్రానికి చేరుకునే కాలిబాటలను విశాల పరిచారు. 1951లో మేరీమాత స్వరూపం వద్ద ఆర్చి నిర్మించారు. ప్రస్తుతం సకల వసతులతో ఈ ఆలయం భక్తులకు చేరువైంది. సాధారణ రోజుల్లో వేలాదిగా భక్తులు వచ్చి మరియతల్లిని దర్శించుకుంటారు. ఏటా జరిగే ఉత్సవాలకు విశ్వాసులు లక్షలాదిగా ఇక్కడకు తరలివచ్చి తిరునాళ్లలో పాల్గొంటారు. ఆలయం ముస్తాబు తిరునాళ్ల నేపథ్యంలో మేరీమాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం మెట్ల మార్గాలు, కాలి బాటలను సిద్ధం చేస్తున్నారు. ఆయా మార్గాలకు రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా భక్తులకు వీలుగా పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం నుంచి శిఖరాగ్రం వరకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఆధ్యాత్మిక వేదిక మేరీమాత పుణ్యక్షేత్రం దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు జరిగే సమష్టి దివ్యబలి పూజ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేదికపై జరుగుతాయి. ఈ కార్యక్ర మాలను తిలకించేందుకు వచ్చే యాత్రికుల కోసం వేదిక దిగువన చలువ పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల సహకారం ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పాలకవర్గం అభ్యర్థన మేరకు ఆర్టీసీ అధికారులు కొన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దూర ప్రాంతాల నుంచి గుణదల చేరుకునే ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు సైతం కొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇచ్చారు. గుణదల, రామవరప్పాడు రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగు తాయి. పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేప ట్టింది. మూడు రోజుల పాటు విధులు నిర్వహించేదుకు సిబ్బందిని నియమించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026u8లో జన కెరటం.. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం, (ఇన్సెట్లో)అభివాదం చేస్తున్న వైఎస్ జగన్లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైద్య విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సిద్ధా ర్థ వైద్య కళాశాల నుంచి జీజీహెచ్ వరకూ నిర్వహించిన ర్యాలీలో వైద్య విద్యార్థులు, టీ చింగ్ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ దీపికకు ఘన నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ దీపిక పీజీ విద్యార్థినిగా వైద్య రంగానికి అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి, బోధనా పద్ధతులను పరిశీలించారు. వలంటీర్లు అందిస్తున్న శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిరక్షరాస్యులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించామని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్పై ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యారావుపేటలోని ఆ సంస్థ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలు పాల్గొని, ఫీడర్ లెవల్ సోలరైజేషన్పై సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సర్వీసు ఇవ్వాలని, రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్ అన్నీ బ్రేక్డౌన్ కాకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవిఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. జి.కొండూరు: సర్కారు ఆంక్షలు.. అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు వచ్చిన వేలాది మంది జనంతో విజయవాడ వెస్ట్ బైపాస్, నల్లకుంట జంక్షన్ కిక్కిరిసిపోయింది. ఇటీవల టీడీపీ గూండాలు పెట్రోలు బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడి చేసి తగలబెట్టిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరిశీలించి, కుటుంబాన్ని పరామర్శించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నల్ల కుంట జంక్షన్కు మధ్యాహ్నం 1.40గంటలకు చేరిన వైఎస్ జగన్ అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి చేరుకోవడానికి 3.25 గంటలు సమయం పట్టిందంటే అభిమానులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారో అర్థమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ విజయవాడ వెస్ట్ బైపాస్ నల్లకుంట జంక్షన్ వద్దకు మధ్యాహ్నం 1.40కి చేరుకున్నారు. అక్కడికి ఉదయం 9గంటలకే వేలాదిగా చేరుకున్న అభిమానులు పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో మహిళా నాయకులు వైఎస్ జగన్కు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్పై నుంచి ఆయనపై పూల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి కృష్ణానది వారధి మీదుగా విజయవాడ చేరుకొని కనకదుర్గ ఫ్లై ఓవర్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని ముందుగానే తెలియజేసినా పోలీసులు అనుమతించలేదు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపుతూ రూట్ మ్యాప్ మార్చుకోవాలని నోటీసు ఇచ్చారు. దీనితో గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ మంగళగిరి బైపాస్, కాజా నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట చేరి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అదేవిధంగా ర్యాలీగా వెళ్లొద్దంటూ నియోజకవర్గ ఇన్చార్జులు, ముఖ్య నేతలకు గురువారం రాత్రే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జులు నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహన్రావు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకు పోలీసులు నోటీసులు అందించారు. నల్లగట్ల స్వామిదాసును తిరువూరులోని ఆయన నివాసంలో అడ్డుకోవడంతో పాటు మైలవరం మండలంలోని బాడవ టోల్ప్లాజా, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల వద్ద అడ్డుకున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా, బాడవ టోల్ ప్లాజా, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి.కొండూరు వై జంక్షన్, కట్టుబడిపాలెం జంక్షన్ల వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే చులకన కాబట్టే బీసీ నాయకుడిగా ఎదుగుతున్న జోగి రమేష్ను అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్ కంపెనీని స్థాపించిన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకుండా జోగి రమేష్పై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు దారుణ పాలనలో జోగి రమేష్ నకిలీ మద్యం ఎలా తయారు చేయగలుగుతాడో చెప్పాలన్నారు. జోగి రమేష్పై 12 అక్ర మ కేసులు పెట్టి 83రోజులు జైలులో ఉంచింది కాక రాజకీయంగా ఎదుగుతున్నాడని ఆయన కుమారుడు జోగి రాజీవ్పై 7కేసులు పెట్టారని మండిపడ్డారు. చివరకు భర్తను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన ఆయన భార్య శకుంతలమ్మ, చిన్న కుమారుడిపై కూడా కేసులు నమోదు చేయడం చూస్తే బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అర్థమవుతుందన్నారు. ఇన్ని కేసులు పెట్టి ఇంత వేధించినా తట్టుకొని నిలబడడమేంటని గూండాలతో పెట్రోలు బాంబులు, కర్రలు, రాళ్లతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయించి ఇంటిని తగలబెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. జోగి రమేష్ ఇంట్లో నిప్పు అంటుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, నాయకులువీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వద్ద బారులు తీరిన జనాలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మామయ్య ఆశీర్వాదం.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థినిని దీవిస్తున్న వైఎస్ జగన్మా బిడ్డొచ్చాడు.. జననేతను చూసి అభివాదం చేస్తున్న వృద్ధ మహిళలు దాడి వివరాలను జగన్కు చెబుతున్న జోగి రమేష్ కుటుంబ సభ్యులు, చిత్రంలో దేవినేని అవినాష్, మల్లాది, మొండితోక, వెలంపల్లి తదితరులు జిరాక్స్ కాపీలతో దర్జాగా దర్శనాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో కొనుగోలు చేసిన దర్శన టికెట్లను కొందరు భక్తులు వాటిని జిరాక్స్ తీసి ఆ కాపీలతో దర్జాగా రాజమార్గంలో అమ్మవారి దర్శనాలు చేసుకుంటున్న వ్యవహారం బయటపడింది. నిజానికి.. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ తప్పనిసరిగా దర్శన టికెట్లు కొనుగోలు చేయాలి. అంతరాలయ దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరూ రూ.500 టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఇందు కోసం దేవస్థానం ఆన్లైన్తో పాటు ఆలయ ప్రాంగణంలోని ఓం టర్నింగ్ వద్ద కౌంటర్లు ఏర్పాటుచేసి టికెట్లు విక్రయిస్తోంది. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏ4 పేపర్పై ప్రింట్ తీసుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. కిటుకంతా ఇక్కడే.. దేవస్థాన కౌంటర్లలో విక్రయించే టికెట్లను చిన్న పేపర్ స్లిప్పై ప్రింట్ వేసి ఇస్తుంటారు. వీటితో దందా చేయడం కుదరని పని. కానీ, ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ల విషయంలోనే కొందరు భక్తులు, పలువురు ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏ4 షీట్పై ఒకే టికెట్ను రెండు మూడు జిరాక్స్ కాపీలు ప్రింట్ తీసి దర్జాగా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. స్కానింగ్ పాయింట్, ఆలయ ప్రాంగణంలోని టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీ చేస్తుండగా ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ అంశాన్ని ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన శుక్రవారం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ఇటువంటి టికెట్లపై ఎవరెవరూ దర్శనాలు చేసుకున్నారో గుర్తించారా అని వాకబు చేశారు. 7వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్ వద్ద 15 నిముషాల పాటు అభిమానులకు అభివాదం చేసిన వైఎస్ జగన్ 2.09గంటలకు నల్లకుంట గ్రామం సెంటర్కు చేరారు. అక్కడి నుంచి సూరాయిపాలెం జంక్షన్, గుంటుపల్లి జంక్షన్, ఖాజీపేట, తుమ్మలపాలెం జంక్షన్, వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వంతెన, బుడమేరు డైవర్షన్ కెనాల్ వంతెన మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కు 4.17కి చేరుకున్నారు. రింగ్సెంటర్లో భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతూ 5.05 గంటలకు జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. బెజవాడ దుర్గగుడిలో ఆన్లైన్ టికెట్ల దందా కొందరు భక్తులు, ఆలయ సిబ్బంది చేతివాటం దర్యాప్తునకు టెక్నికల్ సిబ్బందికి ఈఓ ఆదేశాలు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 36.2750 టీఎంసీలు. దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. పెడన: పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్తు ఉందని వారు పేర్కొంటున్నారు. గతంలో కూడా విశేష పర్వదినాలు, దసరా పండుగల్లో ప్రత్యేక కుంకుమార్చనకు, ఇతర ఆర్జిత సేవలకు ఇదే తరహాలో జిరాక్స్ కాపీలతో పూజలు, దర్శనాలు చేసుకుంటున్న వైనాన్ని దేవస్థానం అధికారులు గుర్తించి కట్టడి చేశారు. ఇప్పుడీ దందా దర్శన టికెట్లకు కూడా పాకడంతో ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ దందాలో కొంతమంది ఆలయ సిబ్బంది హస్తం కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు టెక్నికల్ టీంకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
చిప్ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘ఒక మాజీ మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి?. పెట్రోల్ బాంబులు వేయడాన్ని జై ఆంధ్ర ఉద్యమం సమయంలో చూశా. పోలీసులు ఉంది దేనికి అసలు?. పోలీసులంటే దాడులు ఆపాలి. అదీ పోలీసింగ్ అంటే. కానీ, ఇక్కడ పోలీసులు గూండాలకు ఎస్కార్టులుగా, రక్షణగా ఉంటున్నారు. పోలీసులు, గూండాలు కలిసి దాడికి వస్తారా?. ఇదెక్కడైనా చూశామా?. 30 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి?. ఏ సెక్షన్లు పెట్టాలి?. దాడులు చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారా?..304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు...కారణమేంటి?. .. జోగి రమేష్ ఇంటిపై దాడి హేయమైన చర్య. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదు. ఇది పక్కా ఆర్గనైజ్డ్ దాడి. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబూ.. అసలు మీ ఆలోచన ఏంటి ?. జోగి రమేష్ అన్నదాంట్లో తప్పేముంది?. ఆయన చెప్పినట్లు మంత్రి లోకేష్కే కాదు చంద్రబాబుకి కూడా చిప్ పోయినట్లు ఉంది. చిప్ పోతేనే ఇలాంటి పనులు చేస్తారు. రాజకీయాల్లో సంమయనం పాటించాలి కానీ.. ప్రతీకారాలకు పాల్పడకూడదు. జోగి రమేష్ కు కూడా నేను ఇదే సూచించా. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకోవద్దని జోగి రమేష్ చెప్పా. ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం....చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?. రాష్ట్రంలో అసలు పాలన ఉందా?. శాంతి భద్రతలు అసలు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి దాడులు రాజకీయంగా చాలా తప్పు. ప్రజాస్వామ్యం గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. తాను ఏం మాట్లాడుతున్నారో .. తాను చెప్పిన సనాతన ధర్మమేంటో పవన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నా దాడులు ...ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు పవన్కు కనిపించడం లేదా?. .. రాజకీయంగా మీరు తప్ప వేరే ఎవరూ బ్రతక కూడదా?. చంద్రబాబూ.. ఏమైంది మీ జ్ఞానం?. మీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. ఈ దాడుల పై న్యాయపోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలిపించడం ధర్మమేనా ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం ప్రమాదకరం’’ అని బొత్స అన్నారు. ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచన ఉందా... ప్రతీదీ డైవర్షన్ చేయడమేనా?. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పింది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయిస్తారా?. లడ్డూ వ్యవహారం పై సిట్ ఏమి చెప్పిందో మీరెందుకు చెప్పలేకపోతున్నారు. లడ్డూ అంశం పై ఏకసభ్య కమిషన్ వేయడం దేనికి?. పవన్ ,లోకేష్ ,బీజేపీ నేతలను ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయొచ్చు కదా!. ఆ దేవదేవుడిని ఎందుకు రోజూ కించపరుస్తున్నారు?. దేవుడితో రాజకీయాలెందుకు?.. దేవుడే అన్నీ చూస్తున్నాడు. తప్పు చేస్తే..తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది...అంతే కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన వారిని ఎవరినీ వదలం. చట్టముందు దోషులుగా నిలబెడదాం..ఈ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడ మాదిరి ఉంది. చంద్రబాబు తనను విశ్వామిత్రుడు, వశిష్టమహర్షిగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందని ఎన్ని కేసులైనా పెడుతుంది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. మా నేతల పై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఇది అని బొత్స మండిపడ్డారు. -
జోగి రమేష్పై మరో అక్రమ కేసు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనను సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు నమోదు చేయడమే ఇందుకు ఉదాహరణ. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్లో జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంకు జన సందోహం స్వచ్ఛదంగా తరలివచ్చింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి వైఎస్ జగన్ ఘనమైన సంఘీభావం తెలిపారు. చివరి నిమిషంలో వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్ మార్చి కూటమి ప్రభుత్వం కుట్రలు చేసినా.. అది ప్రజాభిమానం ముందు నిలవలేకపోయింది. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో అది కూటమి ప్రభుత్వానికి రుచించడం లేదు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై అక్రమ కేసు బనాయించింది. జన సమీకరణ చేశారంటూ ఏవో కథలు చెబుతూ అక్రమ కేసును నమోదు చేయించింది. ఇవీ చదవండి:YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీలడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణలు చెప్పాలి -
అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్షీట్లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది. మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు. పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్. మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా. అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్. -
బాబు, పవన్ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ, అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్ చేశారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె. -
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ ఆవిష్కరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): పద్మజ సుజుకి ఆధ్వర్యంలో సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను విజయవాడలోని రింగ్రోడ్లో గల పద్మజ సుజుకి షోరూమ్లో గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పద్మజ సుజుకి రీజనల్ సేల్స్ మేనేజర్ కర్ణ శివరామకృష్ణ, రీజనల్ సర్వీస్ మేనేజర్ ఎస్.సునీల్ ముఖ్యఅతిథులుగా హాజరై స్కూటర్ను ఆవిష్కరించారు. వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వినోద్ కుమార్, పద్మజ సుజుకి సీఈఓ అనూరాధ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను వివరించారు. సుజుకి ఈ–యాక్సిస్ ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన బ్యాటరీ పనితీరు, వినియోగదారులకు అనుకూలమైన ఫీచర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించనుందని తెలిపారు. సుజుకి ఈ–యాక్సిస్ స్కూటీ వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాహనాన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 ఏళ్లలో తిరిగి విక్రయించేవారికి బైబ్యాక్ ఆఫర్లో 60 శాతం వరకు చెల్లిస్తామన్నారు. పద్మజ సుజుకి ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు, విశ్వసనీయ ఆఫ్టర్–సేల్స్ సపోర్ట్ అందించేందుకు కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పద్మజ సుజుకి మేనేజ్మెంట్, సిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ మద్యం కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో గురువారం రిమాండ్ ముగియడంతో బెయిల్పై ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు, నకిరికంటి రవి, షేక్ అల్లాభక్షు, జోగి రమేష్, జోగి రాము తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా, మిగిలిన బాలాజి, శ్రీనివాసరెడ్డి, అంగలూరు కళ్యాణ్, చెక్కా సతీష్కుమార్, సుదర్శన్ న్యాయస్థానంలో హాజరయ్యారు. మదనపల్లి, నెల్లూరు, విజయవాడ జిల్లా జైళ్లలో రిమాండ్లో ఉన్న 12 మంది నిందితులను వర్చువల్గా విజయవాడలోని ఆరో అదనపు ఫస్టుక్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఎకై ్సజ్ పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి లెనిన్బాబు ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. సుదర్శన్ న్యాయస్థానంలో హాజరు నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న సుదర్శన్ తన భార్య గర్భవతిగా ఉన్నందున ఆమెను చూసుకునేందుకు పొందిన మధ్యంతర బెయిల్ గడువు గురువారం ముగియడంతో న్యాయస్ధానంలో హాజరయ్యాడు. అనంతరం సుదర్శన్ను నెల్లూరు జైలుకు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. జోగి సోదరుల బెయిల్ రద్దు పిటీషన్పై విచారణ వాయిదా నకిలీ మద్యం కేసులో బెయిల్ పొందిన జోగి రమేష్, జోగి రాము బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎకై ్సజ్ పోలీసులు వారిరువురి బెయిల్ రద్దు చేయాల్సిందిగా దాఖలు చేసిన పిటీషన్పై డిఫెన్స్ వారికి నోటీసులు అందించాలని ఆదేశిస్తూ 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. గుణదల(విజయవాడ తూర్పు): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిఽధిలోని మొగల్రాజపురంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన శింగం సుబ్బారావు(35) వస్త్ర వ్యాపారం నిర్వహించే వాడు. ఇతనికి భార్య, ఒక బాబు ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడం వలన దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. వత్తిడి పెరగటంతో కుటుంబ సమేతంగా అనపర్తి నుంచి విజయవాడకు వచ్చి జీవిస్తున్నాడు. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. మానసిక ఆందోళనకు గురై తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన భార్య స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి సుబ్బారావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు సుబ్బారావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాట్రాయి: మండలంలోని గుడిపాడులో గురువారం ఓ స్కూలు బస్సు బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని సిద్ధార్థ స్కూల్కు చెందిన బస్సు గుడిపాడు గ్రామంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ డి.రామకృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు ఆ శాఖ సీఈవో ఆర్.మల్లికార్జునరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి నిపుణుల ఎంపిక మేరకు పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపద, మిమిక్రీ, అవధానం, వైద్యం, ఇంద్రజాలం, మూకాభినయం, హరికథ, బుర్రకథ, జర్నలిజం సామాజిక సేవతోపాటు కమిటీ సిఫార్సు చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేస్తారని వివరించారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవార్డులు పొందిన వారికి అవకాశం లేదని చెప్పారు. చివరి తేదీ ఈనెల 20వ తేదీలోపు తమ దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల, దుర్గాపురం, విజయవాడ అనే చిరునామాకు పంపాలని సూచించారు. -
లేబర్ కోడ్లు రద్దు కోరుతూ 12న సమ్మె
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, దేశ స్వావలంబనకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఇన్సూరెన్సు ఉద్యోగుల జోనల్ సహాయ కార్యదర్శి జి.కిషోర్కుమార్ అధ్యక్షతన గురువారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీమా ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య మాట్లాడుతూ దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.వేతనాలను యాజమాన్య దయా దాక్షిణ్యాలకు వదిలివేసేలా కోడ్ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం చేశారన్నారు. తమ సమస్యల పరిష్కారానికి, సంఘం పెట్టుకోవడానికి, ఆందోళన నిర్వహించడానికి అవకాశం లేకుండా చేశారన్నారు. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఉరి తాళ్లని, వాటిని రద్దు చేయటమే పరిష్కారమని చెప్పారు. బెఫి రాష్ట్ర కార్యదర్శి ఆర్.అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. సదస్సులో మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.వి.కృష్ణయ్య, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ బాలాజీ, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.రాజు, ఆర్టీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతోనే జోగి రమేష్ ఇంటిపై దాడి
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా ప్రణాళిక పరంగా జరిగిన హత్యా ప్రయత్నమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం వచ్చిన ఆయన జోగి రమేష్ నివాసానికి వెళ్లి రమేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేష్ కుమారుడిపై అక్రమ కేసు, జోగి రమేష్పై నకిలీ మద్యం కేసుతో పాటు లోకేష్ను దూషించాడని పలు కేసులు పెట్టి ఎలా వేధిస్తుందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని విమర్శించారు. నేతల ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసే సంస్కృతి కొత్తగా ప్రారంభమైందన్నారు. గతంలో ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నుంచోబెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము కచ్చితంగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామన్నారు. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు జోగి రమేష్ పైన హత్యాయత్నం అవకాశం ఉన్నందున వన్ ప్లస్ వన్ సెక్యూరిటీతో పాటు ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దాడి విషయమై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాజీ మంత్రులు అందరం కలిసి జాతీయ మానవహక్కుల కమిషన్కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు నూజివీడు, కై కలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఏలూరు ఇన్చార్జి జయప్రకాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లమోతు ప్రకాశ్ తదితరులు జోగి రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. -
పట్టుదలతో సాధించిన ఆ నందం
అసలే నిరుపేద కుటుంబం. దానికి తోడు విధి ప్రమాదం రూపంలో వచ్చి కంటి చూపును తీసుకుపోయింది. కరెంటు షాక్ తగిలి తండ్రి మరణించాడు. వంట పని చేసే తల్లే కుటుంబం మొత్తానికి జీవనాధారం. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క అంధత్వం ఇన్ని సమస్యలు చుట్టుముట్టి వెంటాడుతున్నా... ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టు విడువలేదు. తన లక్ష్యాన్ని చేజార్చుకోలేదు. తన చెవులనే నయనాలుగా మార్చుకుని కఠోర శ్రమ చేశాడు. చివరకు ఎలాగైతేనేం గ్రూప్–2లో ఉద్యోగానికి ఎంపికై అనుకున్నది సాధించాడు. ఇదీ...చల్లపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన నందం నాగరాజు విజయగాథ. -
పారిశ్రామిక క్షోభ..
ప్రభుత్వ ఆదరణ లేక ఐడీఏలో పరిశ్రమల మూత బాట ఇబ్రహీంపట్నం: రాష్ట్రాభివృద్ధి కోసం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ చంద్రబాబు సర్కార్ ఊదరగొడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆయన చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ లేకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఐడీఏ (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా)లో పరిశ్రమలు మూతబాట పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక బ్యాంకు రుణాలతో వాటిని నిర్వహించలేక.. భారంగా మారడంతో పారిశ్రామిక క్షోభ ఏర్పడుతోంది. అందని భరోసా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి పాలకులు పరిశ్రమల నిర్వహణకు భరోసా ఇచ్చారు. వాటికి అవసరమైనవన్నీ అందుబాటులోకి తీసు కొచ్చారు. నాడు అందించిన భరోసా.. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలకు అందడం లేదు. ఆదరణ ఉపన్యాసాల్లోగానీ.. ఆచరణలో కానరావడం లేదు. దీంతో ఏపీఐఐసీకి చెందిన అనేక ఖాళీ స్థలాలు కూడా నిరుపయోగంగా మారాయి. కొండపల్లిలో 1986లో 438 ఎకరాల్లో 308 ప్లాట్లతో ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేశారు. ఇక్కడ 150 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. అప్పటి నుంచి ఎందరికో జీవనోపాధి చూపిన పరిశ్రమలు నేడు మూసివేత దశకు చేరుకోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి దుస్థితి ఎదురవుతోంది. పరిశ్రమల నిర్వహణ భారం ఒకప్పుడు కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమల్లో తయారైన వివిధ రకాల ఉత్పత్తులు రాష్ట్రవ్యాప్తంగా ఎగుమతి జరిగేవి. ప్రస్తుతం పరిశ్రమలు నిర్వహణ కష్టంగా మారిందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పెట్టుబడులు అధికమొత్తంలో వెచ్చించడం, ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడం, కూలీల కొరత, తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలు చెల్లించలేక పోవడం, మార్కెట్లో ఉన్న పోటీతత్వంతో యజమానులు పరిశ్రమల మూసివేతకు మొగ్గుచూపుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఇక్కడ సుమారు 30కి పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. మూలధనం పెట్టుబడి, వార్షిక ఆదాయ వ్యయాల్లో భారీ వ్యత్యాసాలు నమోదు కావడంతో వీటిని నిర్వహించలేకపోతున్నారు. కొందరు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ భారం పెరగడంతో పాటు కార్మికుల కొరత వేధిస్తోంది. నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి శబ్దాలతో కళకళలాడిన పరిశ్రమలు నేడు మూగనోము పట్టాయి. ఒకప్పుడు పొగలు కక్కిన చిమ్నీలు నిశ్శబ్దంగా నిలిచాయి. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ తీరుతో ఆదరణ లేక.. పెరుగుతున్న నష్టాల కారణంగా కొండపల్లి ఐడీఏలోని అనేక పరిశ్రమలు మూత బాట పడుతున్నాయి. పారిశ్రామిక సంక్షోభ ఛాయలు ఎదురుకావడంతో వేలాది కుటుంబాల భవితవ్యం ఆందోళనలో పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎంఎస్ఎంఈ మూడేళ్ల నూతన పాలసీ తీసుకొచ్చి కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేవారికి అనేక రాయితీలు ప్రకటించింది. కరోనా కష్టకాలంలో అనేక పరిశ్రమలు నిలదొక్కుకోలేక మూలనపడే దశకు చేరుకున్నాయి. ఆ సమయంలో అప్పటికే ఉన్న బ్యాంకు రుణాలపై 20శాతం అదనంగా రుణాలు అందజేసింది. పెండింగ్లో ఉన్న సబ్సిడీలు మొత్తం విడుదల చేసి ఇండస్ట్రీస్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రోత్సాహం అందించింది. దీంతో రెండేళ్ల కరోనా కాలంలో సైతం అవి నిర్విరామంగా నడిచాయి. ఎంఎస్ఎంఈలపై మరింత భారం పడకుండా చేశారు. మారటోరియం విధించి ఆరు నెలల కాలవ్యవధిలో రుణాలకు అప్పులు, వడ్డీలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కింది. -
దేవునిపై విధేయతతో జీవించాలి
గుణదల(విజయవాడ తూర్పు): దేవునిపై విధేయత కలిగి జీవిస్తే సకల ఆశీర్వాదాలు లభిస్తాయని పాస్ట్రల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ విజయరాజు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న నవదిన ప్రార్థనలు 6వ రోజుకు చేరుకున్నాయి. గురువారం జరిగిన ప్రార్థనల్లో ఆయన మాట్లాడుతూ దేవుని మహిమను గుర్తించి ప్రార్థిస్తే సకల దీవెనలు లభిస్తాయన్నారు. మరియతల్లిపై విశ్వాసం ఉన్న భక్తుల జీవితాలు సంతోషకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆమె పవిత్రతను, భక్తి జీవితాన్ని గుర్తించిన దేవుడు మరియ గర్భాన జన్మించాడని వివరించారు. అందుకే మరియమాతకు ప్రత్యేక అనుగ్రహాలు దేవుని ద్వారా సిద్ధించాయని చెప్పారు. ఆమెను లోకమాతగా కీర్తిస్తున్నారని, ఆమెను ఆశ్రయించిన భక్తులకు శాంతి సమాధానాలు లభిస్తాయన్నారు. అనంతరం మరియమాత స్వరూపం వద్ద ఉన్న ప్రత్యేక బలిపీఠం వద్ద సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. కార్యక్రమంలో మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ మరియన్న,ఫాదర్ నునీల్ రాజు, తదితరులు పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీక గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతోందని పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి జయరాజు అన్నారు. ఈ ఏడాది లూర్దు మాత మహోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
22, 23 తేదీల్లో పీడీఎస్యూ మహాసభలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జాతీయ ప్రథమ మహాసభలను ఈనెల 22, 23 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ తెలిపారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జాతీయ మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, మేధావులు కార్మికులు, కర్షకులు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యారంగ సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. నూతన జాతీయ విద్యా విధానం–2020, విద్య వ్యాపారీకరణ, ప్రభుత్వ యూనివర్సిటీల్లో కుల, మత ప్రాతిపదికన వివక్ష, యూజీసీ నిర్వీర్యం వంటివి జరుగుతున్నాయన్నారు. లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ, ఉపాఽధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు యు.గనిరాజు, ఇడంపాక విజయ్కన్నా, తెలంగాణ, ఏపీ అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి, ఎస్. కిరణ్కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. సంఘ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ -
నేడు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడిచేసిన విషయం విదితమే. దాడి చేయడంతోపాటు పెట్రోలు బాంబులు విసిరి ఇంటికి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరతారు. కనకదుర్గ వారధి, ఎం. హోటల్, సత్యంగారి హోటల్ సెంటర్, ఆర్టీసీ బస్స్టాండు, రాజీవ్ గాంధీపార్క్, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిసెంటర్, దర్గాసెంటర్, గొల్లపూడి వై–జంక్షన్, వన్సెంటర్, గుంటుపల్లి, తుమ్మల పాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం తాడేపలిలోన్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘరాం పరిశీలించారు. జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించారు. -
లాటరీ పద్ధతిలో 21 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ నూతన మద్యం పాలసీ (2025–28) ప్రకారం జిల్లాలో 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ తీశారు. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలనలో లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. వీటిలో 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించామన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్తో పాటు కొండపల్లి, తిరువూరు మునిసిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎకై ్సజ్ అధికారుల ఆధ్వర్యాన లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి.శ్రీనివాసరావు వివరించారు. కార్య క్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్వీ రామశివ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టమాట వినాల్సిందే!
చల్లపల్లి: అతి తక్కువే ధరకే టమాటా దొరుకుతున్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటిని తీసుకోవాలని అధికారులు హుకుం జారీ చేయడంతో రైతుబజార్లో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురువారం చల్లపల్లి రైతు బజారులో చోటుచేసుకుంది. చల్లపల్లిలోని రైతుబజార్ వ్యాపారుల్లో ఎక్కువ మంది మోపిదేవి మండలానికి చెందిన రైతులే. ఆ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొని, మరికొందరు సొంత పొలంలో పండించుకున్న కూరగాయలు ఇక్కడ విక్రయిస్తుంటారు. మోపిదేవి మండలంలో 500 ఎకరాలకు పైగా టమాటా సాగు అవుతోంది. సగటున 29 కిలోలు ఉన్న టమాటా బాక్సు ధర రూ.160 పలుకుతోంది. అంటే కేజి ఆరు రూపాయలు పడుతోంది. మార్కెట్లో బోర్డు రేటు ప్రకారం టమాటా కిలో ధర రూ.17 ఉంది. కిలోకు రైతు బజారు వ్యాపారులకు రూ.11 వరకూ లాభం పొందుతున్నారు. పాడైన టమాటా తీసుకోవాలంటూ ఒత్తిడి అయితే గురువారం ఒక్కొక్కటి 15కిలోల బరువున్న టమాటా బాక్సులు 40 వరకూ చల్లపల్లి మార్కెట్కు వచ్చాయి. వీటిలో చాలా వరకు పాడైపోగా కొన్ని కుళ్లిపోయాయి. ఈ 15 కిలోల బాక్సులను ఒక్కొక్కటీ రూ.200 చొప్పున తీసుకోవాలని మార్కెట్లోని టమాటా వ్యాపారులకు అధికారులు హుకుం జారీ చేశారు. వాటి ధర కిలోకు రూ.14 వరకూ పడుతోంది. రైతు బజారులో మొత్తం 10 వరకూ టమాటా దుకాణాలు ఉన్నాయి. నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు తిరస్కరించారు. అధికారులు ఒత్తిడి చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆ రైతుబజార్లకు కూడా.. జిల్లాలో ఏడు రైతు బజారులు ఉండగా చల్లపల్లి రైతుబజారుతో పాటు మచిలీపట్నం, పెడన, పామర్రు, గుడివాడ, గన్నవరం రైతు బజారులకు కూడా ఈ నాసిరకం టమాటాను అధికారులు పంపినట్లు సమాచారం. దీనిపై చల్లపల్లి రైతు బజారు కార్యదర్శి చంద్రమోహన్ను వివరణ కోరగా పైనుంచి వద్దన్నా టమాటాలు పంపించారని ఇకనుంచి తీసుకోబోమని చెప్పారు. మోపిదేవి ప్రాంతాల్లోని టమాటా దిగుబడులను అన్ని మార్కెట్లకు పంపిచే ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఇక్కడి వాటిని కాదని దూర ప్రాంతాల నుంచి టమాటాలు తీసుకరావడంపై ఎందుకు స్పందించడం లేదని రైతులు అంటున్నారు.తీసుకోవాల్సిందే అని చల్లపల్లి రైతుబజార్లో అధికారుల హుకుం! మా పొలంలో టమాటాలే ఉన్నాయి ఎలా కొనాలి మాకు సొంత పొలాలు ఉన్నాయి. అందులో టమాటానే పండిస్తున్నాం. ఇక్కడ చాలా తక్కువ రేటుకే మంచి టమాటాలు వస్తున్నాయి. బయట నుంచి తెచ్చి తీసుకోమంటే ఎలా తీసుకోవాలి. రేటు కూడా గిట్టుబాటు కాదు. నాణ్యత కూడా లేదు. –ఉప్పల బుల్లెమ్మ, దుకాణదారు, రైతుబజార్, చల్లపల్లి -
క్వారీ లీజుల దరఖాస్తులపై దృష్టిపెట్టాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమరావతిలో మౌలిక వసతులకు సంబంధించిన పనుల వేగవంతానికి మైన్స్ శాఖతో పాటు రెవెన్యూ, అటవీ, పర్యావరణం వంటి సమన్వయ శాఖల కృషి కూడా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. మైన్స్తో పాటు రెవెన్యూ, అటవీ, సీఆర్డీఏ, పర్యావరణం తదితర విభాగాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో రాజధాని పనులు – జిల్లా సమన్వయ శాఖల భాగస్వామ్యం, ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం క్వారీలకు ఉన్న లీజులను సమీక్షించుకుంటూ కొత్త క్వారీ లీజుల దరఖాస్తులను వీలై నంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. గనులు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో కూడిన బృందాలు జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కీలకమైన నిరభ్యంతర పత్రాల (ఎన్ఓసీ) జారీకి రెవెన్యూ, అటవీ, పీసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్ కుమార్, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారి బి.శ్రీనివాసరావు, పీసీబీ ఈఈ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. రూ.9.13 లక్షల బ్యాటరీ వాహనం అందజేత లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పీహెచ్డీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్డీ కొత్త గైడ్ల పునరుద్ధరణ, మార్గదర్శకులు, కేంద్రాల గుర్తింపు, ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్స్ దరఖాస్తులు 2025, ఫాకల్టీ రీసెర్చ్ రిపోర్టు ధరఖాస్తులు వంటి వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పీహెచ్డీ కొత్త గైడ్ల కోసం తొమ్మిది దరఖాస్తులు ఐదింటిని ఆమోదించారు. పీహెచ్డీ గైడ్ల పునరుద్ధరణ కోసం ఆరు దరఖాస్తులు రాగా ఐదింటిని ఆమోదించారు. ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్ 2025, మొత్తం 147 అప్లికేషన్లను సమీక్షించారు. ఫ్యాకల్టీ గ్రాంట్ 2022, 2023, 2024 తుది నివేదికలు అన్నింటినీ ఆమోదించారు. పీహెచ్డీ ఆరు నెలల నివేదికలు ధ్రువీకరించిన 22లో 17 ఆమోదించారు. ఈ సందర్భంగా యూఎన్ అజెండా ఫ్రేమ్వర్క్, యూఎన్ విజన్ స్టేట్ స్మాస్షిప్ అప్రోచ్ ఇతర అంశాలపై ఎక్స్పర్ట్ జయరాములు లింగుట్ల విశ్లేషణ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ పాల్గొన్నారు. -
వన్స్టాప్ సెంటర్లతో మహిళల భద్రతకు భరోసా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ) మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని, బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు కృషిచేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం ఇగ్నైట్ సెల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సఖి వన్ స్టాప్ సెంటర్కు కేటాయించిన ప్రత్యేక వాహ నాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలపై హింసను అరికట్టడం, బాధిత మహిళలకు తక్షణం సమగ్ర సహాయం అందించడంలో సఖి – వన్ స్టాప్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, విజయవాడ అర్బన్ సీడీపీఓ జ్యోత్స్న, మిషన్ శక్తి కోఆర్డినేటర్, సూపర్వైజర్లు, ఆంగన్వాడీ కార్యకర్తలు, సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
520 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
గన్నవరం రూరల్: రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించి 520 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం మండల సూరం పల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బుధవారం తెల్లవారు జామున ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ నాగరాజు, ఆగిరిపల్లి పీడీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు విజయవాడ వైపు రేషన్ బియ్యంతో వస్తున్న గూడ్స్ ఆటోను వెంబడిస్తూ వచ్చారు. ఆ వాహనం సూరంపల్లి పారిశ్రామికవాడ సమీపంలోని గోదాము దగ్గరకు వెళ్లి ఆగింది. వెనకే వెళ్లిన అధికారులు గోదాములోకి వెళ్లగా రేషన్ బియ్యం అని నిర్ధారించారు. వాళ్ల పరిధి కాకపోవ టంతో గన్నవరం పీడీఎస్ డీటీ అంకాలుకు సమాచారమిచ్చారు. ఆయన వీఆర్వో సందీప్తో కలసి గోదాము దగ్గరకు వచ్చారు. పామర్రు వాసి గొట్టపు రమేష్బాబుకు చెందిన గోదాములో 520 బస్తాల్లో 260 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారని గుర్తించారు. పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి 50 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పీడీఎస్ సంచుల్లోనే రేషన్ బియ్యం గోదాములో ఉన్నాయి. వీటితో పాటు అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం కింద అందజేసే 2.5 కిలోల 14 బాలామృతం ప్యాకెట్లు కూడా ఉన్నాయి. చెందిన గౌడౌన్లో 260 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఉయ్యూరు తర లించారు. రేషన్ బియ్యం నిల్వచేసిన రమేష్బాబును గత అక్టోబర్లోనే అధికారులు పట్టుకున్నారు. మూడు నెల ల్లోపే మళ్లీ పట్టుబడటం గమనార్హం. ఆగిరిపల్లి ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ ప్రాంతంపై ఏలూరు విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో విజిలెన్స్, పీడీఎస్ ప్రత్యేక నిఘాలో రేషన్ బియ్యం తరలింపు గుట్టురట్టు అయ్యింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని అధికారులు అడ్డుకోకుండా వాటిని వెంబడిస్తూ గోదాముకు చేరుకోవడంతో భారీ నిల్వ పట్టుబడింది. రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు వాహనాలను సైతం సీజ్ చేసి గన్నవరం పోలీస్స్టేషన్లో అప్పగించారు. సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో అనేక గోదాములు ఉండ టంతో అక్రమార్కులు విజయవాడ, ఆగిరిపల్లి వైపు నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి, ఇక్కడ సంచుల్లో మార్పిడి చేసి వీటిని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి అధికారులు, రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నర సింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. 12 జీవాలు అగ్నికి ఆహుతి 18 నుంచి టీచర్స్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు డ్రగ్స్ను తరిమేద్దాం.. భవితను కాపాడుకుందాం..అగ్నిప్రమాదంలో పశువుల పాక బుగ్గితోట్లవల్లూరు: మండలంలోని యాకమూరులో జరిగిన అగ్నిప్రమాదంలో పశువుల పాక బుగ్గిపాలైంది. స్థానిక పాలకేంద్రం ఎదురు బజారులో నివశించే మహ్మద్ అస్మదుల్లాకు చెందిన పశువుల పాకకు బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు గొర్రెలు, ఎనిమిది మేకలు సజీవదహనమయ్యాయి. మూడు గేదలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువులను కాపాడే క్రమంలో యజ మాని అస్మతుల్లాకు కూడా ఒంటిపై గాయాలయ్యాయి. ఎవరో కావాలనే పశువుల పాకకు నిప్పు పెట్టినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రూ.3 లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. పామర్రు ఫైర్ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా, తహసీల్దార్ కుసుమకుమారి బాధిత రైతు అస్మతుల్లాను పరామర్శించారు. వీఆర్ఓ అక్బర్బాషా నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు.18 నుంచి లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలువన్టౌన్(విజయవాడపశ్చిమ): టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులకు (డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) సంబంధించి లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వర జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ బుధవారం తెలిపారు. హ్యాండ్లూమ్, వీవింగ్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలిఅజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): మన ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు అన్నారు. డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీసు శాఖ చేపట్టిన ‘డ్రగ్స్పై దండయాత్ర’ కార్యక్రమం బుధవారం అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముందుగా పోలీసులు, విద్యార్థులు కలిసి ‘డ్రగ్స్ను తరిమికొడదాం – దేశ భవిష్యత్తును కాపాడుదాం’ అనే నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టారు. గంగిరెద్దుల ఆటలు, తీన్మార్ డాన్సులతో కేదారేశ్వరాపేటలోని ప్రభాస్ కళాశాల నుంచి లోటస్ ల్యాండ్ మార్క్, యర్రకట్ట, పాత రాజరాజేశ్వరి పేట మీదుగా కొత్త రాజరాజేశ్వరిపేట, కేర్ అండ్ షేర్ స్కూల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీపీ రాజశేఖరబాబు ప్రసంగించారు. డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 35 రోజులు జరిగే సైకిల్ యాత్రను చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. డ్రగ్స్కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం, ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్ జోన్ ఏసీపీ స్రవంతి రాయ్, సింగ్నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు పలువురు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.ప్రత్యేక రైలు పొడిగింపురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – అనకాపల్లి మధ్య ఇప్పటి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును పొడిగించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ – అనకాపల్లి (07041) ప్రత్యేక రైలు ఈ నెల 22న ఆదివారం, అనకాపల్లి – సికింద్రాబాద్ (07042) ఈ నెల 23న సోమవారం కూడా నడవనున్నట్లు తెలిపారు. -
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం మత్తులో వాహనాలు నడిపిన ఆరుగురికి ఆరో అడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లెనిన్బాబు బుధవారం జైలు శిక్ష విధిస్తూ తీర్చు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. లిటీవల రెండు, ఐదో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుతున్న ఆరుగురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఒకరికి 14 రోజులు, మరొకరికి పది రోజులు, ఇద్దరికి ఎనిమిది రోజులు, మరొకరికి వారం, ఇంకొకరికి నాలుగు రోజుల చొప్పున న్యాయమూర్తి లెనిన్బాబు జైలు శిక్ష విధించారు. ఒకరికి రూ.15 వేల జరిమానా విధించారు. నగరంలో నిత్యం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని డీసీపీ షిరీన్ బేగం హెచ్చరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో సంచలనం రేకెత్తించిన హత్యకేసులో నిందితుడిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్ బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. మంగళవారం ఉదయం రైల్వేస్టేషన్లో హత్య జరిగిందని సమాచారం అందటంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెజ్జోని పేటలో నివసించే పలసాని సాయికృష్ణ అలియాస్ టాటూసాయి(28)గా గుర్తించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలంచి హత్యకు పాల్పడింది సరగడ రాముగా గుర్తించారు. కొద్ది గంటల్లోనే నిందితుడిని రైల్వే పార్శిల్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అదేరోజు రాత్రి 7.15 గంటలకు రైల్వేకోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తాను వన్టౌన్లోని చర్చి ప్రాంతంలో ఫుట్పాత్లపై నిద్రిస్తున్న సమయంలో తన బ్యాగును సాయికృష్ణ దొంగి లించాడనే అనుమానంతో అతడిని సరగడ రాము వెంబడించాడు. రైల్వేస్టేషన్లోని ఎనిమిదో నంబర్ ప్లాట్ఫాం సమీపంలో పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడి నుంచి పరాయ్యాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడు, మృతుడు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులని వెల్లడైంది. గన్నవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన గన్నవరం మండలంలోని బూతిమిల్లిపాడు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిన్నఆవుటపల్లి గ్రామానికి చెందిన కాండ్రు రాజశేఖర్, రత్నకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆహిష్(7) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బూతిమిల్లిపాడులో బుధవారం జరిగిన పునీత అంతోని పండుగకు రత్నకుమారి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని వెళ్లింది. కుటుంబ సభ్యులు ప్రార్థనలో ఉండగా ఆహిష్ మరో బాలుడితో కలిసి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఆడు కుంటూ ఆహిష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బాలుడు మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం): ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన తుమ్మలపాలెం శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన దువ్వపు గణపతి నాగరాజు (36) గుంటుపల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లలకు బుధవారం మధ్యాహ్నం భోజనం ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. గణపతి నాగరాజు తిరిగి ఇంటికి వస్తుండగా గుంటుపల్లి వైపు నుంచి దూసుకొచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జినేష్, శిబు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై బుధవారం ఎకై ్సజ్ న్యాయస్థానంలో విచారణ పూర్తయింది. తీర్పును ఈ నెల తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి లెనిన్బాబు వాయిదా వేశారు. -
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. అంబటి రాంబాబు అరెస్టుఅంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్ అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే. -
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026u8లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించారు. సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ ఉంచిన 520 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. 7దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9.13లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని సమకూర్చింది. కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను చెలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
బలహీన వర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు
ఇబ్రహీంపట్నం: రెడ్ బుక్ రాజ్యాంగతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బలహీన వర్గాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కై లే అనిల్కుమార్ ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం ఇబ్రహీంపట్నంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకుల రాక్షసత్వానికి బలహీన వర్గాలకు రోజు గడిచే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి బలహీన వర్గాలపై దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే విధమైన పాలన కొనసాగితే సామాన్యులు సైతం తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు పవన్కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారికి వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఆయన వెంట తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యుడు మోహన్రెడ్డి, పామర్రు ఎంపీపీ అశోక్, పెదకూరపాడు ఎంపీపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ను ఉపయోగించడం ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు ఆదా చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక లబ్బీపేటలోని ఓ హోటల్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ అండర్ యుటిలిటీ లీడ్ అగ్రిగేషన్ మోడల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సోలార్ వినియోగంపై బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు సోలార్ విద్యుత్ పరికరాల కొనుగోలుకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. ఏషియన్ డెవలప్మెంట్స్ బ్యాంక్ ప్రతినిధి టీవీఎస్ఎన్ మూర్తి, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో పాటుగా విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
విశ్వాసానికి మూలస్తంభం మరియతల్లి
గుణదల(విజయవాడ తూర్పు): యావత్ క్రైస్తవ విశ్వాసానికి మరియతల్లి మూల స్తంభంగా నిలిచిందని, ఆమె ద్వారా సకల జనులు దీవెనలు పొందుతున్నారని నిడమానూరు రీజనల్ సుపీరియర్ ఫాదర్ బాలాజీ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న నవదిన ప్రార్థనల్లో ఐదవ రోజు బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మరియతల్లిని ఆశ్రయించిన భక్తులకు ఆమె అండగా నిలుస్తుందన్నారు. కుల, మతాలకు అతీతంగా సర్వజనులకు ఆమె తనయుడు ఏసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గం లభించిందన్నారు. అనంతరం మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొండపై ఉన్న ప్రత్యే బలిపీఠం వద్ద సమష్టి దివ్యబలి పూజ నిర్వహించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందచేశారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు, ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, ఫాదర్ మరియన్న, తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు
మచిలీపట్నంఅర్బన్: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ అదనపు వైద్య విద్యా డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ టీటీకే రెడ్డిని, మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఇన్చార్జ్)గా నియమించినట్లు బుధవారం వైద్య విద్యా డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాక్టర్ టి.టి.కె. రెడ్డి తక్షణమే జీజీహెచ్ సూపరింటెండెంట్ పదవికి సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరించి, నివేదికను డీఎంఈ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కల్చరల్: విజయవాడలో తొలిసారిగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి మూడు రోజులపాటు తెలుగు భాషా సంగీత మహాసభలను నిర్వహిస్తున్నట్లు స్వరఝరి సంగీత సేవా సంస్థ కార్యదర్శి మోదుమూడి సుధాకర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే సంగీత ప్రదర్శనలు వాగ్గేయకారుల సంగీత సాహిత్యసేవ అంశంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అన్నవరపు రామస్వామి ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు కార్యక్రమంలో గండూరి శ్రీనివాస మూర్తి శిష్యులచే బృందగానం, అన్నమయ్య తెలుగు భాషా వరివస్య, సినీ సంగీతంలో విరబూసిన తెలుగుభాష, అన్నమాచార్యుల సంకీర్తన గానం, ఆంధ్ర వాగ్గేయకారుల తెలుగు సంగీత రచనలు తదితరాలుంటాయన్నారు. 13వ తేదీన త్యాగయ్య పంచరత్న కీర్తనల విశిష్టత, లలిత సంగీంలో సంగీత సాహిత్య విలువలు, జానపద సంగీతంలో తెలుగుభాష, క్షేత్రయ్య పదాలు, శ్యామశాస్త్రి రచనలు.. 14న శనివారం తెలుగు సంగీత సంకీర్తనలు, తెలుగుభాషకు వాగ్గేయకారుల సేవ, సంగీత మూర్తి త్రయం తెలుగుభాషా శైలి అంశాలపై ప్రసంగాలుంటాయని తెలిపారు. కంకిపాడు: రబీ సాగులో రైతులు స్వయంగా పంట నమోదు చేసుకోవచ్చని, ఈ–పంట యాప్ ద్వారా నమోదు చేసుకోవటం తప్పనిసరి అని కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను ప్లే స్టోర్ నుంచి రైతులు స్వయంగా డౌన్లోడ్ చేసుకుని ఆధార్ వివరాలను నమోదు చేసుకుని, ఎం.పిన్ ద్వారా లాగిన్ అయ్యి.. ‘నా పొలాలు’ విభాగంలో సాగు వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. రైతు సేవ కేంద్రం సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరణ చేస్తారన్నారు. ఇప్పటి వరకూ ఈ–యాప్ ద్వారా 19 మంది రైతులు 43 సర్వే నంబర్లకు ఈ–పంట నమోదు చేసుకున్నారన్నారు. పంట నమోదు సమయంలో రైతు ఒకవేళ పొలంలో ఉంటే వివరాలను అప్లోడ్ చేసిన వెంటనే అక్కడికక్కడే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. -
బీపీఎస్ అనరే?
పెడన: అనధికారిక లే అవుట్లు(ఎల్ఆర్ఎస్), భవనాల క్రమబద్ధీకరణ(బీపీఎస్)లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసి క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. దీంతో కొందరు దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. బీపీఎస్కు(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం– భవనాల క్రమబద్ధీకరణ), ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరేజేషన్ స్కీం– లే అవుట్లు క్రమబద్ధీకరణ)కు దరఖాస్తు ఫీజు రూ.10వేలు నిర్ణయించడంతో కొందరు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలు గడిచినా బీపీఎస్ కింద దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారం కావడం గమనార్హం. బీపీఎస్కు మార్చి 11తో గడువు పూర్తవనుండగా, ఎల్ఆర్ఎస్కు ఏప్రిల్ 23 వరకు గడువు ఉంది. ఎల్ఆర్ఎస్కు ఇప్పటికే పలు దఫాలుగా జీవోలు జారీ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ నెల 23న జీవో 49 జారీ చేసి ఏప్రిల్ 23వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొంది. బీపీఎస్ దరఖాస్తులు ఇలా.. భవనాల క్రమబద్ధీకరణ కోసం కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీలకు సంబంధించి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జనవరి 29వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. ● కృష్ణాజిల్లాలో 1,196 దరఖాస్తులు రాగా 91 మాత్రమే పరిష్కరించారు. గుడివాడలో 145 దరఖాస్తులు రాగా 4 పరిష్కరించారు. మచిలీపట్నంలో 176కు ఆరు, పెడనలో 24కు జీరో, తాడిగడపలో 806కు 75, ఉయ్యూరు నగర పంచాయతీలో 45 దరఖాస్తులకు ఆరు దరఖాస్తులను పరిష్కరించారు. ● ఎన్టీఆర్ జిల్లాలో పరిశీలిస్తే 1,905 దరఖాస్తులకు 137 మాత్రమే పరిష్కరించారు. జగ్గయ్యపేటలో 35కు 11, కొండపల్లిలో 12కు ఒకటి, నందిగామ నగర పంచాయతీలో 116కు జీరో, తిరువూరు నగర పంచాయతీలో 47కు 11, విజయవాడ కార్పొరేషన్లో 1,695కు 114 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు ఇవి.. ● లే అవుట్ల రెగ్యులరేజేషన్ స్కీంకు సంబంధించి జనవరి 29వ వరకూ కృష్ణాజిల్లాలో 2,397 దరఖాస్తులు రాగా వీటిల్లో 392 మాత్రమే పరిష్కరించారు. గుడివాడలో 96కు 19, మచిలీపట్నంలో 391కి 41, పెడనలో 38కి 5, తాడిగడపలో 1,555కు 265, ఉయ్యూరు నగర పంచాయతీలో 317కు 62 దరఖాస్తులను పరిష్కరించారు. ● ఎన్టీఆర్ జిల్లాకు వస్తే 3,416 దరఖాస్తులు రాగా వీటిల్లో 1,058 మాత్రమే పరిష్కరించారు. మునిసిపాలిటీల వారీగా చూస్తే జగ్గయ్యపేటలో 36కు 9, కొండపల్లిలో 192కు 15, నందిగామలో 33కు జీరో, తిరువూరుకు 231కి 168, విజయవాడ కార్పొరేషన్లో 2,924కు 866 దరఖాస్తులు పరిష్కరించారు. పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా రూ.74.62కోట్లు ఆయా పురపాలక సంఘాల్లోను, కార్పొరేషన్లలో, నగర పంచాయతీలలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించడం ద్వారా రెండు జిల్లాలకు కలిపి వచ్చిన ఆదాయం రూ.74.62 కోట్లు. కృష్ణాజిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వచ్చిన ఆదాయం 21.96 కోట్లు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన ఆదాయం రూ.46.14 కోట్లు. బీపీఎస్ దరఖాస్తుల ద్వారా కృష్ణాజిల్లాకు రూ.2.63 కోట్లు రాగా ఎన్టీఆర్ జిల్లాకు రూ.3.90 కోట్లు ఆదాయం వచ్చింది. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరిస్తే ఆదాయం వంద కోట్లకు పైగా దాటుతుందని మునిసిపల్ అధికారుల అంచనా. దరఖాస్తు చేయని వాటిని కూడా అధికారులు గుర్తించారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి జారీ చేస్తే రెండోసారి కూడా ఇవ్వాలని ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. ఉదాహరణకు పెడన పురపాలక సంఘంలో బీపీఎస్కు సంబంధించి దరఖాస్తు చేసినవి కేవలం 24 మంది మాత్రమే. క్షేత్రస్థాయిలో గుర్తించినవి 217 వరకు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్కు సంబంధించి 43 వరకు అనధికారిక లే అవుట్లు ఉంటే దరఖాస్తు చేసింది 38 మంది. ఈ విధంగా మిగిలిన పురపాలక సంఘాల్లోను, నగర కార్పొరేషన్లలోను, నగర పంచాయతీల్లోను అధికంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారీగా పెండింగ్లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు రెండు జిల్లాల్లోనూ అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారం బీపీఎస్కు మార్చి11 వరకూ గడువు ఎల్ఆర్ఎస్కు మాత్రం ఏప్రిల్ 23వరకూ అవకాశం -
క్యాన్సర్పై అవగాహన పెరగాలి
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ● విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, అందుకు ప్రజల్లో అవగాహన పెరగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన సవాల్గా మారిందన్నారు. ఏటా 14 లక్షల నూతన క్యాన్సర్ కేసుల వస్తుండగా, దాదాపు 9 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. నోటి, రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు వంటి వాటిని ప్రారంభంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, క్యాన్సర్ మరణాలను కూడా తగ్గించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 18ఏళ్లు నిండిన వారు 18.31 లక్షల మంది ఉండగా, వారిలో 5.49 లక్షల మందిని సర్వేలో పరీక్షించినట్లు తెలిపారు. వారిలో 2.40 లక్షల మంది సీ్త్రలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినట్లు పేర్కొన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కువగా ఇవే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ పురుషుల్లో ప్రోస్టేట్, గొంతు క్యాన్సర్, సీ్త్రలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా సోకుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వే 4.0లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్, క్యాన్సర్ సంరక్షణ చర్యల గురించి అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. -
ధరల దోబూచులాట..
● తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్న ధరలు ● ఏడాదిలో రెట్టింపైన బంగారం ధర ● సగానికి పైగా పడిపోయిన వ్యాపారం వన్టౌన్(విజయవాడపశ్చిమ): బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. గత వారంలో తులం బంగారం రూ.1.80 లక్షల మార్కు దాటింది. అయితే అంతలోనే కొద్దిమేర వెనుకకు తగ్గి దోబూచులాడుతోంది. అయితే నాణేనికి ఒకవైపు పుత్తడి ధరల విషయంలో సానుకూల అంశాలు మనకు కనిపిస్తుంటే.. మరోవైపు బంగారు ఆభరణాల అమ్మకాలు లేక వ్యాపారులు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వ్యాపార వర్గాల జీవితాలపైనా దాని ప్రభావం అధికంగా పడుతోంది. ఏడాదిలో రెట్టింపైన ధర.. బంగారం ధరలు కేవలం ఏడాదిలో రెట్టింపు అవ్వటంతో అందులో పెట్టుబడులు పెట్టిన మదుపరులు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో వెనుకకు, ముందుకు వెళ్తుండటంతో టెన్షన్కూ గురవుతున్నారు. 2025 జనవరి ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,800గా నమోదైంది. అదే నెల చివరిలో రూ.8,400గా నమోదైంది. అలాగే వెండి సైతం 2025 జనవరి ప్రారంభంలో కిలో రూ.88,300 నమోదు కాగా, అదే మాసం చివరిలో రూ.93,100గా ఉంది. కానీ గత గురువారం విజయవాడ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,86,000 మార్కుకు చేరుకొని ఆల్టైం రికార్డు కొట్టింది. తాజాగా రూ.1,63,860 అంటే దాదాపుగా ఏడాదిలో బంగారం ధర రెట్టింపు అయ్యింది. ఇక వెండిని పరిశీలిస్తే గత వారం బులియన్ మార్కెట్లో కిలో నాలుగు లక్షలుగా నమోదైంది. వెండి ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దారుణంగా చిరు వ్యాపారుల పరిస్థితి ఉమ్మడి కృష్ణాజిల్లాలో బులియన్ అమ్మకాలు చేసే దుకాణాలు సుమారుగా 15వందల వరకూ ఉన్నాయని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. విజయవాడ పాతబస్తీతో పాటుగా గవర్నరుపేట, బందరురోడ్డులో అత్యధిక దుకాణాలు కొనసాగుతుండగా, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ వంటి ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలోనే దుకాణాలను నిర్వహిస్తున్నారు. వ్యాపా రుల్లో అత్యధికంగా 85 నుంచి 95 శాతం చిన్న వ్యాపారులే ఉన్నారు. అమ్మకాలు లేకపోవటం, ఊహించని దానికన్నా బంగారం ధర పెరిగిపోతుండటంతో వ్యాపారులు అతలాకుతలమవుతున్నారు. వీరిలో అత్యధికులు వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని తయారు చేసి ఇచ్చే వారే అధికంగా ఉంటారు. ఆర్డరు తీసుకున్న సమయంలో ఉన్న ధరకు, డెలివరీ ఇచ్చే సమయానికి మధ్య ధరలో భారీగా వ్యత్యాసం ఉండటంతో ప్రభావితమవుతున్నారు. ఒకరిద్దరు పెట్టుబడులు పెట్టే వారు మినహా మిగిలిన వ్యాపారులను ఈ ధరల పెరుగుదల తీవ్రంగా నష్టపరుస్తుందని వ్యాపార సంఘాల నేతలు వివరిస్తున్నారు. కార్మికుల ఆత్మహత్యలు.. బంగారం ధర భారీగా పెరుగుతుండటంతో ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. దాంతో పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రధానంగా గడిచిన రెండేళ్లగా కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు తెగబడుతున్నారంటూ నాయకులు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఆటో కార్మికులుగా ఇతర రంగాలకు తరలిపోతున్నారని వాపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఆర్డరు ఇచ్చే సమయంలో ఉన్న ధర ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొన్నటి వరకూ పెరిగిన ధరలు కొంత తగ్గితే కొనుగోలు చేద్దామని వినియోగదారులు ఎదురు చూశారు. ఇప్పుడు తగ్గినా మరింత తగ్గుతుందోమోనని చూస్తున్నారు. ఈ అనిశ్చిత కారణంగా కొనుగోలు చేసే వారు దుకాణాలు వైపు చూడటం మానేశారు. దాంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. – కోన శ్రీహరిసత్యనారాయణ, అధ్యక్షుడు, బెజవాడ జ్యూవెలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ -
వేగవంతానికి ఆదేశించాం
బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ప్లానింగ్ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేస్తున్నాం. వ్యక్తిగతంగా దరఖాస్తులు పరిశీలించి ఇబ్బందులుంటే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెబుతున్నాం. కోర్టు, విజిలెన్సు కేసులున్నా సంబంధిత యజమాని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం పరిష్కరించి క్రమబద్ధీకరించాలని చెబుతున్నాం. – జి.సుబ్బారావు, డైరెక్టర్, ఆర్డీడీటీపీ, రాజమహేంద్రవరం -
పొలాలు కుయ్యోరొయ్యో
సాక్షి టాస్ఫోర్స్: కోడూరు మండలం పరిధిలో సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఏడబ్ల్యూడీ భూములపై బడాబాబులు కన్నేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ భూముల్లో యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేపట్టారు. రొయ్యల చెరువుల సాగు వల్ల సమీపంలోని పంటపొలాలు చౌడుబారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న తవ్వకాలు కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామ సమీపంలో దింటిమెరక రహదారిని అనుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూమి ఉంది. సాగునీటి సమస్య కారణంగా ఈ ప్రాంతాన్ని బీడుగా వదిలేశారు. దీనిని అదునుగా చేసుకున్న కొంతమంది బడాబాబులు రెవెన్యూ అధికా రులతో సంబంధం లేకుండానే ఈ భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటికే 25 ఎకరాల ఏడబ్ల్యూడీ భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా చెరువు తవ్వకాల పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో పది అడుగుల ఎత్తున చెరువుల గట్లను నిర్మిస్తున్నారు. దింటిమెరక – హంసల దీవి రహదారి మార్జిన్ను కూడా ఆక్రమించి గట్లను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులకు సంబంధించిన పరికరాలు భద్రపర్చుకోవడం, కూలీలకు ఉండేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా రహదారి మార్జిన్ వెంట చేపట్టారు. చెరువుల్లోని వ్యర్థాలను వదిలేందుకు పక్కనే ఉన్న పంటకాలువను వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. లేని చెరువులకు మరమ్మతుల పేరిట అనుమతులు ప్రస్తుతం బడాబాబులు తవ్వకాలు చేపట్టిన చెరువులు నిన్నటి వరకు బీడు భూములు గానే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్వా జోన్ పరిధిలో మాత్రమే ఉప్పునీటి రొయ్యలు, చేపల చెరువుల తవ్వడానికి అనుమతి ఉంది. ఆక్వా జోన్ పరిధి కాకుండా కొత్త చెరువుల తవ్వినా, ఉన్న చెరువులకు మరమ్మతులు చేసినా అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ చెరువుల తవ్వకాలకు మత్స్యశాఖ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు సమీప రైతులు ఆరోపిస్తున్నారు. అసలు చెరువులు లేకుండానే ఈ భూముల్లో చెరువులు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు 11 నెలలకు సీఓసీ (సాగు సర్టిఫికెట్) ఇచ్చినట్లు సమాచారం. లేని చెరువులు ఉన్నట్లు చూపి, కొత్త చెరువులు తవ్వడానికి బడాబాబులకు పూర్తిస్థాయిలో మత్స్యశాఖ అధికారులు సహకరిస్తున్నట్లు రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న చెరువులు కొత్తవి కాదని, గతంలో ఉన్న చెరువులకు మరమ్మతులు చేస్తున్నారని మత్స్య శాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వడం చర్చనీయంశమైంది. ఈ చెరువుల తవ్వకాలు జరిపేందుకు సంబంధించి అధికారులకు బడాబాబులు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆయకట్టు రైతులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూముల్లో యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. చెరువులు తవ్వకాలు పూర్తిగా మత్స్యశాఖ పరిధిలోకి వస్తాయని, వీటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. చెరువు గట్లను నిబంధనలకు విరుద్ధంగా పది అడుగులు ఎత్తున ఏర్పాటు చేస్తున్నా మైనింగ్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. రైతులు తమ పంట పొలాల్లో మెరకలు తీసుకొనేందుకు మైనింగ్ అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తారు. ఇంత భారీ మొత్తంలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా వారు పట్టించుకోకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తవ్వకాలు చేపడుతున్న చెరువుల పక్కనే వేలాది ఎకరాల మాగాణి భూమి ఉంది. ఈ భూమిలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఉప్పునీటి చెరువుల కారణంగా ఆయకట్టు మొత్తం బీడుబారే ప్రమాదం ఉందని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే సముద్రతీర ప్రాంతం వెంట తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని, పొలాల పక్కన కూడా ఉప్పునీటి చెరువులు తవ్వితే భవిష్యత్లో సాగు భూమి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. తీరప్రాంతాన్ని రక్షించాల్సిన అధికారులు, పాలకులు బడాబాబులకు కొమ్ముకాస్తూ నిబంధనలకు విరుద్ధంగా చెరవుల తవ్వకా లకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తు న్నారు. ఈ వ్యవహరంపై కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తీరప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ ఏడీ ప్రతిభను వివరణ కోరగా, హంసలదీవి సమీపంలో తవ్వేవి కొత్త చెరువులు కాదని, గతంలో ఉన్న వాటికి మరమ్మతులు చేసుకుంటున్నారని చెప్పడం గమనార్హం. -
వృద్ధుల ఆవేధన
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన చల్లా చంద్రమౌళి, సరోజిని దంపతులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో ఏఐ ఆధారిత కాంపిటెన్సీ బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలోని 38 మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్, వైఎస్ ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులకు మంగళవారం వెబ్ఎక్స్ నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలో వైద్య ఆరోగ్య రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ చంద్రశేఖర్ బందుగల ఎడ్మెడ్ ఏఐ సహకారంతో రూపొందించిన ఏఐ ఆధారిత అభ్యాస మౌళిక సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్చంద్ర శేఖర్ బొందుగుల మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడినప్పుటికీ మన దేశంలోని వైద్య విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని అత్యుత్తమ నాణ్యత కలిగిన ఏఐ ఆధారిత వైద్య విద్య పక్రియలను అందించేందుకు యాప్ను రూపొందించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతిభావంతులైన వైద్యులను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధుడి పేరు షేక్ ఆలీ సాహెబ్. వయసు 80 ఏళ్లు. స్వగ్రామం జి.కొండూరు మండలం కవులూరు. సంతానం లేరు. గ్రామంలో 75 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతూ తనకున్న భూమిని నలుగురు చెల్లెళ్ల పేరుతో రిజిస్టర్ చేశారు. అంతే ఆ తర్వాత అతని గురించి చెల్లెళ్లు పట్టించుకోలేదు. ఆలీ సాహెబ్ కంటి చూపు పూర్తిగా దెబ్బతింది. అక్కడా ఇక్కడా తిరుగుతూ ఇబ్బందులు పడుతూ దూరపు బంధువుల ఇంటికి చేరాడు. తన భూమి తనకు ఇప్పించాలంటూ వృద్ధుల సంరక్షణ చట్టం కింద కలెక్టర్ కార్యాలయంలో మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. నందిగామ ఆర్డీఓ కార్యాలయం అతనికి మెయింటినెన్స్ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది. అది కూడా ఆ నలుగురు చెల్లెళ్లు సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వృద్ధుడు ఆప్పీల్ చేసుకున్నాడు. తనకు ఆిస్తి ఉండీ ఈ దుస్థితి ఏమిటని? రోదిస్తున్నాడు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీవితంలో చివరి మజిలీకి చేరిన పండుటాకులు వారు. మనవళ్లు, మనవరాళ్ల ముద్దూ ముచ్చట్లతో హాయిగా జీవితం గడపాల్సిన వయసు. వారు కష్టపడి సంపాదించిన, పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులను తమ పేరున రాయించుకున్న అనంతరం బిడ్డలు పట్టించుకోకపోవడంతో ఇక తమకు దిక్కెవరని రోదిస్తున్నారు. వయోభారం తెచ్చిన రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నారు. బిడ్డలపై కొండంత ప్రేమ ఉన్నా మనసు చంపుకొని.. గుప్పెడు మెతుకులకు, మందు బిళ్లలకు అవసరమైన డబ్బులన్నా ఇప్పించండయ్యా అంటూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో బిడ్డలపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. రెండేళ్లలో ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 454 ఫిర్యా దులు అందాయి. వాటిలో 392 ఫిర్యాదులను పరిష్కరించగా, మరో 62 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. బిడ్డలను పిలిచి తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అనంతరం తమ ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో అన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. అధికారులు పరిష్కరించామని చెబుతున్న కేసుల్లో వృద్ధులు ఎప్పటిలానే ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నారు. కన్నబిడ్డలకు, తోడబుట్టిన వారికి ఉన్న ఆస్తులు రాసిచ్చి.. ఆ తరువాత ఆలనా పాలనా లేక అల్లాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగు తోంది. అవగాహన లేని కొందరు వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆసరా పొందలేకపోతున్నారు. మరి కొందరు ఎవరో ఒకరి ద్వారా ఈ చట్టాన్ని ఆశ్రయించినా జాప్యం కారణంగా తీవ్రమైన ఆవస్థలు పడుతు న్నారు. నా అన్నవారు లేక, ఆత్మీయ పలుకరింపులకు నోచుకోక, ఉన్న ఆస్తులు పరులపాలై అలో లక్ష్మణా అంటూ విలపిస్తున్నారు. కొందరు బిడ్డలు ఉద్దేశ పూర్వకంగానే తల్లిదండ్రులను వేధిస్తున్నారు. వారు చట్టాన్ని ఆశ్రయిస్తే నెల నెలా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వదిలించుకోవచ్చు అనే భావన బిడ్డల్లో పెరిగిపో యింది. ఇలాంటి కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నాయి. ఆవసాన దశలో ఉన్న వారికి డబ్బులు ఇస్తే సరిపోదని, వారి బాగోగుల మాటేమిటని ప్రశ్నిస్తున్నాయి. వయో భారం, ఒంటరి జీవితాలు గడుపుతున్న వారికి ఆదరణ కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.డాక్టర్ బొందగల చంద్రశేఖర్ను సన్మానిస్తున్న వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ప్రతి ఒక్కరూ ఏదో రోజు వృద్ధాప్యానికి చేరువ కావాల్సిందే. మనం తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు అందిస్తున్నామో భవిష్యత్లో మనకు అవే లభించే పరిస్థి తులు వస్తాయి. ప్రేమ, అప్యాయతల మధ్య వృద్ధుల జీవితం సాగాలి. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడే వారి సంక్షేమానికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం ఉంది. ఈ చట్టంపై అవగాహన పెంచాలి. ఈ చట్టం కింద వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. వృద్ధులను ఇబ్బంది పెట్టే వారిని చట్టం ఓ కంట కనిపెడుతుంది. కచ్చితంగా బాధితులకు రక్షణ కల్పిస్తుంది. – డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధులు మేక సూర్యనాయణ, విజయలక్ష్మి దంప తులు. వీరిది విస్సన్నపేట మండలం నరసాపురం. వారికి ఒక్కగానొక్క కొడుకు సంతానం. తండ్రికి వంశపారంపర్యంగా వచ్చిన రెండు ఎకరాలు, తల్లికి పుట్టింటి నుంచి వచ్చిన 10 ఎకరాలు కలిపి 12 ఎకరాల భూమిని ఆ కొడుకు తన పేర రాయించుకున్నాడు. ఆ తర్వాత తల్లి దండ్రుల ఆలనాపాలన పట్టించుకోవడం లేదు. సూర్య నారాయణ రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి. మోకాళ్ల ఆపరేషన్కు డబ్బులు లేవు. విజయలక్ష్మి మధుమేహం వ్యాధితో బాధపడుతోంది. వృద్ధులు ఇద్దరి మందులకే నెలనెలా వేల రూపాయల ఖర్చవుతోంది. ఆస్తులు ఎలాగూ రాయించుకు న్నారు. కనీసం మందులకై నా డబ్బులు ఇప్పించండంటూ కలెక్టర్ను కలిసి విన్నవించుకున్నారు. అంతకు ముందు తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. 7 -
రీ సర్వే పనుల పరిశీలన
మోపిదేవి: మండలంలోని పెదప్రోలు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను కృష్ణా జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి పి.లక్ష్మణరావు మంగళవారం పరిశీలించారు. రికార్డుల ఆధారంగా రీ సర్వే సక్రమంగా జరగాలని, రైతుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగా సమా చారం అందించాలని సూచించారు. తహసీ ల్దార్ ఎం.హరనాథ్, రీ సర్వే డీటీ ఎం.ప్రసాద్, మండల సర్వేయర్ డి.సుధీర్, వీఆర్వో నాగమల్లేశ్వరావు, గ్రామ సర్వేయర్ లోకేష్, పలువురు రైతులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మంగళవారం కార్నియల్ డొనేషన్ సెంటర్ను ప్రారంభించారు. కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఆశాలత ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేత్రదాన కార్యక్రమాలకు మద్దతుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి.భానుమూర్తి మాట్లాడుతూ.. భవిష్యత్తులో కార్నియల్ మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నేత్రదానం ప్రాముఖ్యతను డాక్టర్ నిరంజన్, డాక్టర్ శేషు కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లీలా ప్రసాద్ వివరించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ మేనేజర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళా చెస్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థినులు చక్కని ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచారని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తెలిపారు. ఇటీవల గుడివాడ ఏఎన్ఆర్ కాలే జీలో జరిగిన పోటీల్లో తమ విద్యార్థినులు జె.సాయిహర్షిత, జి.రాజరాజేశ్వరి, కె.పూర్విత అంజన రామచంద్ర, కె.హేమ విజేతలుగా నిలిచారని పేర్కొన్నారు. కళాశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సెక్రెటరీ అండ్ కర స్పాండెంట్ టి.శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, వ్యాయామ విభాగాధిపతి డి. హేమచంద్రరావు, చెస్ కోచ్ పి.జ్యోతి కిరణ్ విద్యార్థులను అభినందించారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): డ్రగ్స్పై దండయాత్ర నినాదంతో పోలీసులు చేపట్టిన 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర మంగళవారం విజయవాడలో కొనసాగింది. ఏడీసీపీ జి.రామకృష్ణ, పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్, సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డు, శారద కళాశాల జంక్షన్లో సెకిల్ ర్యాలీ జరిగింది. డ్రగ్స్ వద్దు యోగా ముద్దు నినాదంతో బ్రహ్మకుమారిస్ నుంచి బి.కె.పద్మజ, బి.కె.రాధిక ఆధ్వర్యంలో 400 మందితో ప్రాణాయామం, యోగా ట్రైనర్ నివారిక ఆధ్వర్యంలో యోగ సాధన నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, అడ్మిన్ డీసీపీ కె.వి.వి సరిత, డాక్టర్ సమరం తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం, రెడ్క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థలు, ఆటో యూనియన్ల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, మూడు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
గుర్తించకుంటే ప్రమాదకారి
నిశ్శబ్ద మహమ్మారి.. క్యాన్సర్పై అవగాహన ముఖ్యం అంటున్న వైద్యులుఅందుబాటులో అధునాతన చికిత్సలు..జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న కేసులు ప్లాస్టిక్ వినియోగం, పెస్టిసైడ్స్ అవశేషాలతోనూ క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చంటున్న వైద్యులు – డాక్టర్ ఎన్. సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు, విజయవాడ -
8న ఏపీ ఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఈనెల 8న జరగనున్నాయని జిల్లా అధ్యక్షుడు డీఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ ప్యానల్ పోటీ చేస్తోందన్నారు. ఈ నెల 8న నామినేషన్ల దాఖలు చేస్తారని, ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక, పెన్షనర్లు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో జిల్లా కార్యవర్గం అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. నగర అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా సేవలందించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ ద్వారా వాహనదారులకు అందించే సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏ శాఖలోనైనా అవినీతి జరుగుతున్నట్లు తేలితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్లను అతికించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఉయ్యూరు రూరల్: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన మానుకొండ పృధ్వీ తేజ(14), మానికొండ జానకి రామయ్య(14)తోపాటు తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామానికి చెందిన పిల్లం వెంకట్(17) బైక్పై మచిలీపట్నం నుంచి కంకిపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద జాతీయ రహదారిపైగల డివైడర్పై ఉన్న మొక్కలకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పోస్తుండగా యువకుల బైక్ అదుపుతప్పి వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టారు. దీంతో పృధ్వీ తేజ, పిల్లం వెంకట్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మానికొండ జానకి రామయ్యను స్థానికుల సాయంతో 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరి తెలిపారు. -
శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య కేసులో 12 మంది అరెస్టు
పెనమలూరు: కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీ శారదా భవన్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మృతి చెందిన ఘటనలో 12 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. కేసులో అరెస్టు అయిన వారిలో ప్రిన్సిపాల్ పగడాల పిచ్చయ్య, ఐదుగురు సిబ్బందితో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఉన్నారన్నారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జరిగిందిదీ.. అనకాపల్లి జిల్లా బంగారుమెట్ట గ్రామానికి చెందిన బి.పవన్కుమార్(17) పోరంకి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతను కాలేజీ హాస్టల్లో సహచర విద్యార్థులతో 405 నంబర్ రూమ్లో ఉంటున్నాడు. పవన్కుమార్ గత నెల 31న రాత్రి స్టడీ అవర్కు వెళ్లకుండా తన గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై తాము విచారణ చేయగా పవన్కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి గల సంచలన విషయాలు వెలుగు చూశాయని డీఎస్పీ చెప్పారు. పవన్కుమార్తో హేమంత్ అనే విద్యార్థి సన్నిహితంగా ఉండేవాడన్నారు. ఇద్దరికీ గొడవలు జరగటంతో హేమంత్తో మాట్లాడవద్దని సహచర విద్యార్థులకు పవన్కుమార్ చెప్పడంతో వీరి మధ్య గొడవలు ముదిరాయన్నారు. గత నెల 5న పవన్కుమార్పై పలువురు విద్యార్థులు గొడవపడి దాడి చేశారన్నారు. సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత హాస్టల్కు వచ్చిన తరువాత గత నెల 28, 29 తేదీల్లో కూడా గొడవలు జరిగాయని, దీంతో మనస్తాపానికి గురైన పవన్కుమార్ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడని చెప్పారు. గొడవపడిన ఆరుగురు విద్యార్థులు మైనర్లే అని తెలిపారు. సాక్ష్యాలు చెరిపిన సిబ్బందిపై కేసు.. పవన్కుమార్ గది తలుపు తెరవకపోవడంతో ప్రిన్సిపాల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్చార్జి రవీంద్ర, మెస్బాయ్ హేమంత్, అధ్యాపకులు రాజేష్, ఆనంద్, కృష్ణ బలవంతంగా హాస్టల్ గది తలుపు తెరిచారు. అప్పటికే ఉరేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న పవన్కుమార్ తన చేతిపై.. తనపై దాడి చేసిన విద్యార్థుల పేర్లు రాశాడు. ఇది గమనించిన సిబ్బంది చేతిపై రాసిన పేర్లు తుడిపేసి సాక్ష్యాలు మాయం చేశారని డీఎస్పీ చెప్పారు. విద్యార్థులు ఘటనను వీడియోలు తీయడం, కొన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. ఈ కేసులో దాడి చేసిన ఆరుగురు విద్యార్థులతో పాటు, సాక్ష్యాలు మాయం చేసిన కాలేజీ సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. -
పోరంకి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్ కేసులో ట్విస్ట్
సాక్షి, కృష్ణాజిల్లా: పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్కి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 5న పవన్పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. కొట్టిన దృశ్యాలను విద్యార్థులు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. హాస్టల్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లను పవన్ చేతిపై రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు గోప్యంగా ఉంచిన శ్రీచైతన్య యాజమాన్యం.. సాక్ష్యాలను తారుమారు చేసింది. చేతిపై ఉన్న పేర్లను శ్రీచైతన్య సిబ్బంది తుడిచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను జువెనైల్ కోర్టుకు తరలించారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జేఎల్లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపలేదు?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని మండిపడ్డారు.‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త...ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు. వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. -
‘ప్రశ్నిస్తానన్న పవన్ ఎమైపోయాడు’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో పడిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు,మారణాలయుధాలతో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జోగి రమేష్ కుటుంబాన్ని అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేశారు. తాను చేసింది అసత్య ప్రచారం అని తెలిసి పశ్చాత్తాపం పడకుండా దాడులు చేయిస్తున్నాడు.ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని. అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్ల పై వందల మంది గూండాలతో దాడి చేయించారు.జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయించారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య,కుమారుడు ఇంటిలోనే ఉన్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.మీ పార్టీలో ఉన్నవారే మహిళలా. మీ పార్టీలో ఉన్నవారే బిసిలు,కాపులా. ప్రశ్నిస్తాననేపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనపై ఫ్యాక్షన్ ముద్ర వేశారు. నిజంగా మీరు చెప్పినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏపీలో మీరు తిరగ గలిగేవారా. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలకు మంచి చేయమని. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయడానికి కాదు.ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు.టీడీపీ వాళ్లు ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు.మీరు రెచ్చగొట్టే కొద్దీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు.ప్రతీ ఒక్కరికీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మీ ప్రభుత్వానికి మరో మూడేళ్లే ఎక్స్ పైరీ డేట్.అన్నారో లేదో తెలియని మాటకు చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ఏడ్చారు.జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన సమయంలో వాళ్లింట్లో ఉన్నది కూడా మహిళలే. వెనక నుంచి దాడి చేయడం ..వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయలేదు. కేవలం జోగి రమేష్ నిరసన తెలియజేశారు.జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలెవరో, వారి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. -
తవ్వుకో... అమ్ముకో..!
●చంద్రయ్య డ్రైన్ను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్న నాయకులు ●చోద్యం చూస్తున్న డ్రైనేజీ అధికారులు ●మండిపడుతున్న రైతులు, పరిసర ప్రాంత ప్రజలు గుడివాడ రూరల్: టీడీపీ నేతలు బరితెగించారు. 24 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తూ, 55 వేల ఎకరాల మురుగునీటిని దిగువకు మళ్లిస్తూ రైతులకు అండగా నిలిచిన చంద్రయ్య డ్రైన్ కరకట్టను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారు. ఇంత అడ్డగోలుగా కరకట్టలనే తవ్వేస్తున్నా అటు డ్రైనేజీ అధికారులు కాని, ఇటు పాలకులు కాని పట్టించుకోకపోవడంపై పరిసర ప్రాంత రైతులు, ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నందివాడ, గుడివాడ రూరల్, మండవల్లి మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే చంద్రయ్య డ్రైన్ సాగునీరుతో పాటు మురుగునీటిని కూడా తీసుకుని వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. దాదాపు 36 సంవత్సరాల క్రితం చంద్రయ్య డ్రైన్ పూడిక తీత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ డ్రైన్ పూడిక తీసిన పాపాన పోలేదు. ఇటీవల రూ.22 కోట్లతో చంద్రయ్య డ్రైన్ పూడిక తీత పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే డ్రైన్ పూడిక తీత పనులు చేపడతామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోపక్క టీడీపీ నేతలే డ్రైన్ కరకట్టను అక్రమంగా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారు. పోలుకొండ రెగ్యులేటర్ సమీపంలోని గాజులపాడు గ్రామాన్ని ఆనుకుని ఉన్న చంద్రయ్య డ్రైన్ కరకట్టను స్థానిక టీడీపీ నేత రుద్రపాక సబ్స్టేషన్ మెరక వంక చూపి గత మూడు రోజులుగా మూడు పొక్లెయిన్లతో కరకట్టను అడ్డగోలుగా తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టిని సమీప గ్రామాల్లో అమ్ముకుంటున్నారు. ఒక్కో ట్రక్కు మట్టి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి అనుమతులు ఉన్నాయంటూ అందరినీ నమ్మబలికి యథేచ్ఛగా అక్రమ మట్టి దందాను కొనసాగిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం... చంద్రయ్య డ్రైన్ ఆనుకుని మూడు మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే రెగ్యులేటర్ వద్ద షట్టర్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. రెగ్యులేటర్ను పునః నిర్మిస్తారని అధికార కూటమి ప్రభుత్వానికి పట్టం గట్టిన స్థానిక ప్రజల నమ్మకాన్ని కూటమి నేతలు పక్కనబెట్టి ఏకంగా డ్రైన్నే కొల్లగొట్టే ప్రయత్నాలకు తెరలేపారు. భారీస్థాయిలో వరదలు వచ్చిన సమయంలో సైతం చంద్రయ్య డ్రైన్ రెగ్యులేటర్, కరకట్టలు పటిష్టంగా ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కరకట్టలను పటిష్టం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి నేతలు అడ్డగోలుగా మట్టి దందాకు తెరలేపి ఏకంగా కరకట్టనే తవ్వేసి సొమ్ము చేసుకుంటుండంతో భవిష్యత్తులో వరదలు వస్తే కరకట్టను ఆనుకుని ఉన్న గ్రామాలకు ముంపు ప్రమాదం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా నందివాడ మండలం గాజులపాడు, తమిరిస, పోలుకొండ, అనమనపూడి, దండిగానపూడి, గొంగళ్లమూడి, మండవల్లి మండలం పెనుమాకలంక, నందిగామలంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు... వాస్తవానికి డ్రైన్ కరకట్టలను తవ్వే అధికారం ఎవరికీ లేదు. కరకట్టలను పటిష్టం చేయడానికి నిధులు తీసుకురావాల్సిన అధికార పార్టీ నేతలు నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా డ్రైన్ కరకట్టను తవ్వేసుకుంటున్నా అటు డ్రైనేజీ అధికారులు కాని, ఇటు రెవెన్యూ అధికారులు కాని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సాక్షాత్తూ డ్రైనేజీ ఈఈకి స్థానిక గ్రామాల ప్రజలు ఆధారాలతో సహా అక్రమ మట్టి తవ్వకాలపై సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. తమకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, తమను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని స్థానిక టీడీపీ నేత బరితెగించి మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. చివరకు స్థానిక ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారంటే సదరు నేత బరితెగింపు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికై నా పాలకులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి దందాను అడ్డుకుని కరకట్టను పరిరక్షించాలని పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు. -
బోనాలమ్మా....బోనాలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు రెండవ రోజు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. దీక్ష విరమించిన స్వాములు తెల్లవారు జామునే మునేరులో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ఆదివారం రాత్రి కల్యాణం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామంలోని ఆలయాల్లో, ఇసుక తిన్నెల మీద సేద తీరారు. బుర్రకథల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కూర్చుని విన్నారు. అమ్మవారి కల్యాణ తలంబ్రాలను ఆలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు. –పెనుగంచిప్రోలు -
టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది టెక్నాలజీని ఉపయోగించేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. నగరంలోని ఏఆర్ గ్రౌండ్స్లో సోమవారం పోలీసు సిబ్బంది, అధికారులకు వృత్తి నైపుణ్యం మెరుగుపర్చుకునే పక్రియలో భాగంగా యాన్యువల్ మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ సరిత మాట్లాడుతూ ప్రస్తుతం నేరాలను ఛేదించేందుకు టెక్నాలజీ ఎంతో కీలకంగా మారినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. సిటీ ఏఆర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు శారీరకంగా, మానసికంగా, వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకుని, ఆధునిక కాలానికి అనుగుణంగా సంసిద్ధులయ్యేలా శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ పరంగా సైబర్ సెక్యూరిటీ, ఈ డిప్లాయ్మెంట్, సి.సి.కెమెరాలు, డ్రోన్, అస్త్రం యాప్ మొదలైన వాటిపై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో హెడ్ క్వార్టర్ ఏడీసీపీ కుంబా కోటేశ్వర రావు, ఏసీపీ ప్రేమ్ కుమార్, సీఎస్డబ్ల్యూ ఏసీపీ చిరంజీవి, ఆర్ఐలు శ్రీకాంత్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్ర, బాలసుబ్రమణ్యం, ఆర్.ఎస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ మొబిలైజేషన్ సదస్సులో డీసీపీ కేజీవీ సరిత -
నిజాయతీ చాటుకున్న గన్నవరం డిపో కండక్టర్
గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కె.ఉదయభాస్కర్ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి ఇచ్చి నిజాయతీని చాటుకున్నారు. వివరాలిలా వున్నాయి. గత నెల 31న ద్వారకాతిరుమల నుంచి విజయవాడ వెళ్తున్న గన్నవరం డిపోకు చెందిన బస్సులో మర్రిబందం గ్రామానికి చెందిన బాదం పెద్దింట్లమ్మ హనుమాన్జంక్షన్లో ఎక్కింది. అయితే ఆమె వద్ద ఉన్న నాలుగు కాసుల బంగారు గొలుసును బస్సులో పోగొట్టుకుంది. కండక్టర్ ఉదయభాస్కర్ సదరు గొలుసును గుర్తించి స్థానిక డిపోలో అప్పగించారు. ఈ నేపథ్యంలో పెద్దింట్లమ్మ సోమవారం స్థానిక డిపో అధికారులను సంప్రదించగా బంగారు గొలుసును డిపో మేనేజర్ పి.శివాజీ, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఆమెకు అందజేశారు. సదరు కండక్టర్ను డీఎం, సూపర్వైజర్లు, సహచర సిబ్బంది అభినందించారు. -
బాల్య వివాహాల రహిత సమాజానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలని అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు నిబద్ధతతో కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్లో సోమవారం వాసవ్య మహిళా మండలి (వీఎంఎం) – బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకం చేసి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరగకుండా కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలు పాటిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రచార రథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ (1098), ఉమెన్ హెల్ప్లైన్ (181) కూడా అందుబాటులో ఉన్నాయని.. ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చన్నారు. ఈ ప్రచార రథం ద్వారా లక్ష మందికి పైగా ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని మహిళా మండలి బృందానికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ప్రాజెక్టు డైరెక్టర్ రామానుజయ్య, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ ఎం.రాజేశ్వరరావు పాల్గొన్నారు. ప్రచార రథాన్ని ప్రారంభించినకలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
రాష్ట్రానికి రూ.10,134 కోట్లు కేటాయింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.10,134 కోట్లు కేటాయించినట్లు విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా విలేకరుల సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, పలు విభాగాల సీనియర్ అధికారులతో కలసి డీఆర్ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 10,134 కోట్లు బడ్జెట్లో కేటాంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.92,649 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. హై స్పీడ్ రైలు కారిడర్లు... దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడర్లను ప్రకటించారని డీఆర్ఎం తెలిపారు. అందులో హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రెండు హై స్పీడ్ రైలు కారిడర్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళతాయని వివరించారు. వీటి కారణంగా రాష్ట్ర ప్రజలకు అపారమైన ప్రయోజనం చేకురనున్నట్లు తెలిపారు. ఈ రెండు హై స్పీడ్ కారిడర్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటుగా విద్య, ఆరోగ్యం, వ్యాపారం తదితర రంగాల అభివృద్ధికి దోహదపడే ఆర్థిక కారిడర్గా పనిచేస్తాయని వెల్లడించారు. సమావేశంలో ఏడీఆర్ఎంలు పి.ఈ ఉడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం బి.ప్రశాంత్ కుమార్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 107 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ప్రజల నుంచి 107 ఫిర్యాదులు వచ్చాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. నడవలేని, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 64, కుటుంబ కలహాలపై 6, వివిధ మోసాలపై 8, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలపై 6, కొట్లాటలపై 2, ఇతర వివిధ సమస్యలపై 16 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన స్థానిక తంబరేణి గార్డెన్స్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేట క్రాస్రోడ్స్కు చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీపై పెనుగంచిప్రోలు నుంచి వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో బాణావతు దేవేంద్రనాయక్(24) ఘటనా స్థలంలో మృతి చెందగా మేడ నరేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరువూరు: అందమైన యువతుల ఫొటోలను ఎరగా చూపి ఒక వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు, బంగారం తస్కరించిన నిందితులను తిరువూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ గిరిబాబు తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు శివారు తంగిళ్ళబీడులో నివసించే రౌడీషీటర్ కనపర్తి రేణుక యువతుల ఫొటోలను వాట్సాప్లో పంపుతూ విటులను ఆకర్షించేది. ఇదే తరహాలో గత నెల 31న కె.మాధవరావు అనే వ్యక్తిని తన ఇంటికి పిలిచి తలుపులు వేసి నగలు, నగదు బలవంతంగా లాక్కుని మరో 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే తిరువూరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రేణుకను, ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని విచారించి వారినుంచి సొత్తు రికవరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు. విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో బెయిల్పై ఉన్న వైఎస్సార్ సీపీ పార్లమెంటు ఫ్లోర్లీడర్ మిధున్రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్నందున రెండు, నాలుగో శనివారాల్లో విచారణాధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన తరఫు హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటీషన్లు ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్పై ఉన్న గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాది గోలి నరసింహారావు ఏసీపీ న్యాయస్థానంలో సోమవారం పిటీషన్ దాఖలు చేశారు. కృష్ణమోహన్రెడ్డి తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్పై ప్రాసిక్యూషన్కు నోటీసులు జారీచేయాలని ఆదేశిస్తూ మంగళవారానికి, ధనుంజయ్రెడ్డి తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్పై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు ఈనెల ఆరో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో బెయిల్పై ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎకై ్సజ్ పోలీసులు 8వ అదనపు జిల్లా న్యాయసస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతుల ప్రకారం కేసుకు సంబంధించి మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా న్యాయస్థానం ఆదేశించినప్పటికీ అందుకు విరుద్ధంగా జోగి రమేష్ వ్యవహరిస్తున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో పీటీ వారెంటుకు అనుమతి విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో మదనపల్లి సబ్జైలులో రిమాండ్లో ఉన్న ఏ–22 నిందితుడు సి.పి.సెంథిల్ను పీటీ వారెంటు కోరుతూ విజయవాడ ఎకై ్సజ్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ను అనుమతిస్తూ ఎకై ్సజ్ న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 12 లోపు న్యాయస్థానంలో హాజరుపరచాలన్నారు.


