breaking news
NTR
-
చంద్రబాబు సర్కార్పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: డీఏ విడుదలపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను జీవోలో చేర్చడం దారుణమన్న ఉపాధ్యాయ సంఘాలు.. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి.. జీవోలో ప్రస్తావించకపోవడం సరికాదన్నాయి.‘‘ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిల చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నాం. 4 డీఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేసి దానిలో గందరగోళానికి గురిచేయమంటే మోసం చేయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 60,61లను సవరించి, సొమ్ము రూపంలో చెల్లించాలి’’ అని యూటీఫ్ డిమాండ్ చేసింది.చంద్రబాబు సర్కార్.. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ తిన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్–2025 పోటీలు ఆదివారంతో ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరై వారిలోని ప్రతిభను ప్రదర్శించారు. మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎల్.మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎల్.శాంతి, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ కోచ్ వై.రామమోహన్ హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విజేతల వివరాలు.. ● అండర్–12 గరల్స్ విభాగంలో ఏరోబిక్స్, భీమ్ బ్యాలన్స్, ఫ్లోర్ ఎక్స్ర్సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్లైన్ విభాగాల్లో పి.అనన్య మొదటి బహుమతిని గెలుపొందింది. ● అండర్–12 బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్ర్సైజ్లో ఎల్.శ్రీరామ్, ఏరోబిక్స్లో ఎం.హీమేష్ మొదటి స్థానంలో నిలిచారు. ● జూనియర్ గరల్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్ర్సైజ్, భీమ్ ఎక్స్ర్సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్లైన్ అంశాల్లో పి.ధనీషా, ఏరోబిక్స్ విభాగంలో కె.జాహ్నవి మొదటి బహుమతిని పొందారు. ● జూనియర్స్ బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఎల్.శ్రీరామ్, టేబుల్ వాల్ట్, హైబార్, రోమన్రింగ్స్లో ఎన్.మెహత మొదటి స్థానంలో నిలిచారు. ● సీనియర్స్ ఏరోబిక్స్ విభాగంలో ఎస్.ఐశ్వర్య, ట్రంప్లైన్ విభాగంలో ఎస్.ప్రజ్ఞ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు అతిథులు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. -
సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర 16వ మహాసభ తీర్మానించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి తెలిపారు. ఇటీవల జరిగిన 16వ రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలను ఆమె ఆదివారం గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సరళీకరణ ఆర్థిక విధానాల వలన మహిళా రంగంలో జరుగుతున్న మార్పులపై చర్చించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వలస మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోతున్నాయని చెప్పారు. డ్వాక్రా గ్రూపులలో అవినీతిని అరికట్టాలని, డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా రు.10 లక్షలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, మైక్రో ఫైనాన్స్ దోపిడీ నుంచి కుటుంబాలను రక్షించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని విన్నవించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత గ్యాస్ కొంతమందికే ఇస్తున్నారని, ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు రు.1500 ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి వి.సావిత్రి, కోశాధికారి డి.శ్రీనివాసకుమారి, ఉపాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): గొల్లపూడి పరిధిలోని రామరాజ్యనగర్లో ఆదివారం వేకువజామున మూడు గంటల సమయంలో ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామరాజ్యనగర్లో ఒక ఇంట్లో ఆకాష్ అనే వ్యక్తి ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పెయింట్స్లో కలిపే టిన్నర్ను లీటర్, రెండు లీటర్ల చొప్పున ప్యాకింగ్ చేస్తుంటారు. ఈ పనులను ఐదుగురు యువకులు చేస్తుంటారు. ఈ క్రమంలో జోరున వర్షం కురుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షణ్ముఖ శ్రీనివాస్ (16) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. రమణబాబు (19) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ యజమాని చైన్నె వెళ్లాడు. పీసా పవనసాయి మణికుమార్, మోహన్కృష్ణ ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ):కేటీరోడ్డు పరిధిలోని భీమనవారిపేటలో ఓ మెడికల్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు ఆదివారం గుర్తించారు. లంబాడీపేటలోని రాకేష్ మెడికల్ స్టోర్స్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మెడికల్ షాపు మెట్లపై ఓ యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. అయితే స్థానికులను ఆరా తీయగా ఆ వ్యక్తి ఏలూరుకు చెందిన కె. శేఖర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ధనత్రయోదశిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని నూతన యాగశాలలో ఆదివారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్, వైదిక కమిటీ పర్యవేక్షణలో తొలుత గణపతి పూజ, కలశస్థాపన, పూజా కార్యక్రమాల అనంతరం యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగంలో చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చ కులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరగ గా, పలువురు భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. నేడు ధనలక్ష్మి పూజ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పూజను జరిపిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ దీపాలను వెలగించిన అనంతరం రాజగోపురం ఎదుట దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. -
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మధురానగర్(విజయవాడసెంట్రల్):వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతోనే 60 పీజీ సీట్లు రాష్ట్రానికి లభించాయని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అసలు కట్టనే లేదు అని చెప్పిందనీ.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం 106 మెడికల్ పీజీ సీట్ల గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటుందన్నారు. వాటిలో 60 సీట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన కాలేజీల్లోనే ఉన్నాయన్నారు. ఈ కాలేజీలు మూడు సంవత్సరాల్లోనే 60 పీజీ సీట్లు పొందడం నిజంగా అద్భుతమని చెప్పారు. ప్రజలకు మంచి మెడికల్ విద్య అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించటం ద్వారా మరింత మెరుగైన వైద్యం అందుతుందన్నారు. పెనమలూరు: ఉరేసుకొని యనమలకుదురులో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... బోసుబొమ్మ సెంటర్కు చెందిన నాగం ప్రభావతి, రాంబాబు, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. తల్లి నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్గా పని చేస్తుంది. కాగా వారి పెద్ద కుమారుడు రవిప్రకాష్ (19) గంగూరులో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తల్లి, సోదరుడు తిరువూరు ప్రార్థనలకు వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న రవిప్రకాష్ ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణరానికి పాల్పడ్డాడు. రవిప్రకాష్ కోసం స్నేహితుడు సాయిరాం వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఈ సమాచారాన్ని రవిప్రకాష్ తల్లికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. ఈ ఘటన పై తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకుని యువకుడి.... కృష్ణలంక(విజయవాడతూర్పు):ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న చెందిన ఘటన చోటుచేసుకుంది. రాణిగారితోట, తమ్మిన పోతురాజు వీధిలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి ఏసుబాబు (20) కూలీ పనులకు వెళ్తుంటాడు. మద్యానికి బానిసవడంతో ఆరోగ్యం క్షీణించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సోదరి అంజలి కూడా అనారోగ్యంతో ఉంది. తనతో పాటు తన సోదరి కూడా అనారోగ్యానికి గురైందని తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు తల్లి రూమ్లోకి వెళ్లి చూడగా రేకుల షెడ్డు ఐరన్ రాడ్కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దీపోత్సవానికి వేళాయె
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే వేడుక దీపావళికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈ పర్వదినాన్ని సోమవారం ప్రజలు సంబరంగా నిర్వహించుకోనున్నారు. ఇంటింటా దీపాలు.. లోగిళ్లలో ప్రమిదల వెలుగులు.. వీధుల్లో పటాకుల మోతలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే క్రాకర్స్ విక్రయాలు ఊపందుకున్నాయి. మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే పటాకులు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
దళిత వ్యతిరేకి చంద్రబాబును గద్దె దింపుదాం
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలోని దళితులను అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ఐక్యంగా సన్నద్ధం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవే టీకరించడాన్ని, నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘మాట్లాడుకుందాం.. రండి..’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఎస్సీ సెల్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జి లు పేర్ని కిట్టు, ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్చార్జి జెట్టి గురునాథం పాల్గొని మాట్లాడారు. ఎవరిది సంపద సృష్టి.. రాష్ట్రంలోని పేద వర్గాలకు విద్యను, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. వాటిలో ఐదు కళాశాలలు ప్రారంభం కాగా, మరో రెండు ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. పులివెందుల కళాశాలకు ఎన్ఎంసీ ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం వద్దని లేఖ రాసి.. పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ ఆస్తులను పెంచితే వాటిని చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. 10 అంశాలపై తీర్మానం.. నకిలీ మద్యం వ్యవహారంపై నిజానిజాలు బయటకు వచ్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, నకిలీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 డిమాండ్లను ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్రామ్ చిత్రపటాలకు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ‘మాట్లాడుకుందాం.. రండి’ కార్యక్రమంలో వక్తలు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. అంబేడ్కర్ కలలుగన్న విధంగా విద్యతోనే సమాజ మార్పు జరుగుతుందన్న విషయాన్ని అమ్మఒడి, నాడు– నేడు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో జగన్ చేసి చూపించారన్నారు. మరోసారి జగన్ను సీఎంను చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. -
అభివృద్ధి పేరుతో విధ్వంసం
●కానూరులో పేదల ఇళ్లు తొలగిస్తే సహించం ●ప్రత్యామ్నాయం చూపాలని చక్రవర్తి డిమాండ్ పెనమలూరు:కానూరులో అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బోడెప్రసాద్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, పేదలకు ప్రత్యామ్నయం చూపకుండా ఇళ్లు తొలగిస్తే సహించేదిలేదని వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి తెలిపారు. ఆయన ఆదివారం కానూరులో పేదల సమక్షంలో విలేకర్లతో మాట్లాడారు. కానూరులో దాదాపు 40 మంది పేదలు కాలువ కట్టలపై చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. గతంలో వీరికి ప్రభుత్వం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తామని నివాసితులు స్పష్టం చేశారన్నారు. దరఖాస్తులు కూడా పెట్టారని పేర్కొన్నారు. అయితే దీని పై బోడెప్రసాద్ స్పందించలేదన్నారు. అధికారులు శనివారం అర్ధరాత్రి పొక్లెయిన్లతో వచ్చి ఇళ్లు కూల్చడానికి సిద్ధపడ్డారని తెలిపారు. పేదలతో కలిసి ఆందోళణకు దిగటంతో వెనక్కు తగ్గారన్నారు. నిబంధనల ప్రకారం కానూరు ప్రధాన రహదారి 60 అడుగులు ఉండాల్సి ఉండగా కేవలం 30 అడుగుల్లోనే డ్రెయినేజీలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం చేయటం తగదన్నారు. పేదలకు ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తారన్నారు. దందా చేసేందుకే బైక్పై పర్యటనలు.... ఎమ్మెల్యే బోడెప్రసాద్ దందా చేయటానికి బైక్ పై గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తున్నాడని చక్రవర్తి ఆరోపించారు. గ్రామాలలో బిల్డర్లు, భవన యజమయానులు ఎవరెవరు అదనపు ఫ్లోర్లు నిర్మిస్తుంది వివరాలు సేకరిస్తున్నాడని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పి.రాఘవరావు, వేమూరి బాలకృష్ణ, మండూరు కోటేశ్వరరావు, షుక్.అహ్మద్ అష్రప్, మల్లంపల్లి వెంకటేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చులకనగా మాట్లాడారు... ఎమ్మెల్యే బోడెప్రాద్మ పట్ల చులకనగా మాట్లాడారని బాధితులు ఆరోపించారు. బాధితులు విలేకరుతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శనివారం ఒక్కసాకిగా ఇళ్లలోకి రావటంతో భయాందోళన చెందామన్నారు. మురికివాడలో ఎలా ఉంటారని చులకనగా మాట్లాడరని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించినట్లు వాపోయారు. -
‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు
వ్యాపారస్తులతో ముఖాముఖీ.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీపావళి పండుగ సందర్భంగా విజయవాడలోని కలెక్టరేట్లో 20వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కంకిపాడు: భారీ వర్షంతో వరి పైర్లు నేలవాలాయి. అల్పపీడన ప్రభావంతో ముసురు కొనసాగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షం విడవకుండా కురుస్తోంది. ఆదివారం కూడా మోస్తరు వర్షం పడింది. వర్షానికితోడు తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో చిరుపొట్ట దశకు చేరిన వరిపైర్లు నేలవాలాయి. మండలంలోని కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు గ్రామాల్లో చాలా చోట్ల వరి పొలాలు నేలవాలి నీటిలో నానుతున్నాయి. వర్షం విడవకుండా కురుస్తుండటంతో చిరుపొట్ట దశలో, సుంకు దశలో ఉన్న పైర్లకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీడని ముసురు.. వర్షంతో పాటు ముసురు కొనసాగుతోంది. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నిలిచిన నీటిని పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకుని వరి కంకులు నీటిలో నానకుండా రైతులు జాగ్రత్త వహిస్తున్నారు. కంకి, చిరుపొట్ట దశలో వర్షంతో నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. జి.కొండూరు: సాగు నీరందించేందుకు తవ్విన కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులకు అడ్డంగా కాలువ తవ్వి, వాగులలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో రైతుల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ముంపు బారిన పడి రైతులు నష్టపోతుంటే ప్రభుత్వాలు, స్థానిక పాలకులు చూసీ చూడనట్లు వదిలేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని కవులూరు, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో తారకరామా ఎడమ కాలువకు ఆనుకొని ఉన్న రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సమస్యే ఇది.. ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్లో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నది లోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఈలప్రోలు గ్రామం వద్ద కుడి, ఎడమ కాలువకు మళ్లించి తారకరామా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందించడం లక్ష్యంగా 1982లో ప్రణాళిక రచించారు. కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడరూరల్, మైలవరం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాల పరిధిలోని 64 గ్రామాలకు చెందిన 56వేల ఎకరాలకు సాగునీరందించే విధంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో కుడికాలువ పొడవు 25.74కిలోమీటర్లు, ఎడమకాలువ పొడవు 51.27కిలోమీటర్లుగా నిర్ధారించారు. మొదటి దశ నిర్మాణంలో భాగంగా రూ.24.97కోట్ల అంచనాలతో.. కుడి కాలువు 6.250కిలోమీటర్ల తవ్వి రెండు పంపుహౌస్లు, ఎడమ కాలువ 8.079కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా కొత్తూరు తాడేపల్లి శివారులో 6.6కిలో మీటర్ల వరకు తవ్వి ఆపేశారు. ఈ మొదటి దశ పనులు 2004నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువ తవ్వకం, పంపుహౌస్ల నిర్మాణం కోసం రెండు దశల్లో పనులు జరిగినప్పటికీ ఎడమ కాలువ తవ్వకాన్ని మాత్రం చేపట్టలేదు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. వాగులకు అడ్డంగా ఎడమ కాల్వ జి.కొండూరు మండల పరిధిలోని కవులూరు, విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామాలకు ఎగువ నుంచి వచ్చే నల్లవాగు(బుడమేరువాగు), చిల్లవాగు, తాడేపల్లివాగు, తొమ్మండ్రంవాగుల ప్రవాహానికి అడ్డంగా తారకరామా ఎడమ కాలువను తవ్వారు. అయితే ఈ కాలువను ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే వాగులలో వరద ప్రవాహం తారకరామా ఎడమ కాలువలో కలిసి ముందుకు సాగే వీలుండేది. అలా కాకుండా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేయడంతో పాటు, ఎగువ నుంచి వచ్చే వాగులలో వరద దిగువకు పోయేందుకు అడ్డంగా ఉన్న కాలువకు సైపన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎడమ కాలువకు ఎగువన ఉన్న వరిపొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన 400ఎకరాల భూమిని సాగు చేసే రైతులు తారకరామా ఎడమ కాలువ తవ్విన నాటి నుంచి అంటే దాదాపు 20ఏళ్లుగా నష్టపోతున్నారు. వరద నీరు పోయే మార్గం లేక నోటికాడకు వచ్చిన పైరు కుళ్లిపోవడం వంటి ఘటనలతో ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తారకరామా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేసిన వైనం అది కూడా వాగుల ప్రవాహానికి అడ్డంగా తవ్వకం సైపన్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు వరద సమయంలో ముంపు బారిన పడుతున్న వరి పొలాలు కవులూరు, కొత్తూరు తాడేపల్లికి చెందిన రైతులకు తీవ్ర నష్టం ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి కొద్దిపాటి శ్రద్ధ చూపితే తమకు ముంపు కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులు కోరుతున్నారు. కొత్తూరు తాడేపల్లి గ్రామ శివారులో 6.6కిలోమీటరు వద్ద ఆపేసిన తారకరామా ఎడమ కాలువను ఒక కిలోమీటరు పొడగించి.. ఆ గ్రామ తుమ్మల చెరువులో కలిపితే, కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగి, ఎగువ నుంచి వచ్చే వరద తారకరామా ఎడమ కాలువ ద్వారా దిగువకు పోయే అవకాశం ఉంది. లేదంటే ఎగువ నుంచి వచ్చే వాగుల వరద పోయేందుకు తారకరామా ఎడమ కాలువకు కిందగా సైపన్లు ఏర్పాటు చేసినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తారకరామా ఎడమ కాలువలో తూడు కాడ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది. తారకరామా ఎడమ కాలువను కొంత తవ్వి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఎగువ వాగుల ద్వారా వచ్చే వరద దిగువకు పోయేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో పొలాలు మునిగిపోతున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇదే సమస్యతో తీవ్ర నష్టాలు వస్తుండడంతో నాకు ఉన్న తొమ్మిది ఎకరాలను ఇటుక బట్టీల ఏర్పాటుకు లీజుకిచ్చాను. – చెరుకూరి శ్రీనివాసరావు, రైతు, కవులూరు గ్రామం మా గ్రామ శివారులో నేను ఏడు ఎకరాలు కౌలుకి తీసుకొని వరి సాగు చేశాను. తారకరామా ఎడమ కాల్వ వల్ల వరద దిగువకు పోయే అవకాశం లేక పొలం అంతా మునిగిపోయింది. ఐదు ఎకరాలు ఎందుకూ పనికిరాకుండా పోయింది. పై నుంచి వాగులలో వచ్చే వరద పోయేలా చేస్తేనే పొలాలు సాగు చేయగలుగుతాం. – తమ్మెట శ్రీహరి, రైతు, కవులూరు గ్రామం -
బెట్టింగ్, మొబైల్ వ్యసనాల నుంచి బయటపడాలి
● 5కే రన్లో స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ ● రన్ ప్రారంభించిన నగర డీసీపీ కేవీజీ సరితగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆధునిక సమాజానికి బెట్టింగ్, జంక్ఫుడ్, మొబైల్ అడిక్షన్ వంటివి పంచ మహాపాథకాలుగా తయారయ్యాయని 5కే రన్లో వక్తలు పేర్కొన్నారు. సమాజ స్థితిగతులను మార్చి పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారద కళాశాల జంక్షన్ వద్ద స్లేట్, ది స్కూల్ ఆధ్వర్యంలో స్లేట్ స్మార్ట్ పేరిట 5కే రన్ నిర్వహించారు. ఈ రన్ను నగర డీసీపీ కేవీజే సరిత జెండా ఊపి ప్రారంభించారు. 1572 మంది రన్లో పాల్గొన్నారు. బెట్టింగ్, జంక్ ఫుడ్, రోట్ లెర్నింగ్, లోన్ యాప్స్, మొబైల్ అడిక్షన్ వంటి వాటికి వ్యతిరేకంగా స్లేట్ స్కూల్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించినట్లు వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కుటుంబ శ్రేయస్సునే కోరుకుంటే అది స్వార్థమవుతుందని, సమాజ సేవకు నడుబిగించాలని పిలుపునిచ్చారు. డీసీపీ కేవీజే సరిత మాట్లాడుతూ బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఆ అలవాట్లు ఉన్న వారు వాటి నుంచి బయటపడాలని కోరారు. స్వీయ తెలివితేటలు, హార్డ్ , స్మార్ట్ వర్క్తో ముందుకు సాగాలన్నారు. పొదుపు, సహజ రుచులు, సాంకేతిక పరిజ్ఞానం సక్రమ వాడకం, బట్టీ చదువుల్ని వదిలి, విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే చదువులపై దృష్టి పెట్టాలన్నారు. సామాజిక అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని కోరారు. 5కే రన్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నడకతో రోగాలు వెనకడుగు!
నడకతో అనేక ప్రయోజనాలు.... ● ప్రతిరోజూ 45 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ● కీళ్లకు మేలు చేస్తుంది. మోకీళ్లు చుట్టూ ఉన్న కండరాలు యాక్టివ్గా కదలికలు ఉంటే , కీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన గుజ్జును ఉత్పత్తి చేస్తాయి. ● ఎక్కువుగా వాకింగ్ చేస్తే కీళ్లు అరుగుతాయనేది అపోహ మాత్రమే. ● నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణకోశ సమస్యలున్న వారికి నడక మేలు చేస్తుంది. బీపీ, షుగర్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఎక్కడ నడవాలంటే.... ● నగరంలో చాలా మంది సిమెంటు, తారు రోడ్లుపై నడుస్తూ కనిపిస్తున్నారు. వాటిపై నడవడం కీళ్లకు ఆరోగ్యకరం కాదని వైద్యులు అంటున్నారు. ● మట్టి రోడ్డు, ఇసుకలో నడవడం కీళ్లకు మంచిదని పేర్కొన్నారు. ● తారు, సిమెంటు రోడ్డుపై నడిస్తే మోకీళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ● వాకింగ్ చేసేటప్పుడు మంచి షూస్ వేసుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు. ● ట్రెడ్మిల్పై వేగంగా పరుగెడుతుంటారని, గంటకు ఆరు కిలోమీటర్లు మాత్రమే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ● డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు ● మోకీళ్లు అరుగుదల మూడో స్టేజ్లో ఉన్న వారు ● స్మోకింగ్తో కాళ్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి వారు వాకింగ్ చేయరాదు. ● గుండె సమస్యలున్న వారు, ఆయాసం ఉన్న వా రు వైద్యుల సూచనల మేరకు మాత్రమే చేయాలి. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కీళ్లకు ప్రయోజనం మోకీళ్లలో గుజ్జు తయారయ్యేందుకు నడక అవసరం ఎక్కువ నడిస్తే కీళ్లు అరగడం అపోహే డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్కు చెందిన 2004 కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆటోనగర్లోని ఓ హోటల్లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సమయంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బ్యాచ్ సభ్యులకు నివాళులర్పించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రావిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ ట్రైనింగ్లో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దైనందన జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఉండే తాము తమ స్నేహాన్ని 20 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకునేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఆటపాటలతో గడిపారు. 2004 బ్యాచ్ కు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
AP: హోంమంత్రి స్టేట్మెంట్పై కాపు సంఘాల ఆగ్రహం
విజయవాడ: దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూర్చింది హోంమంత్రి అనిత ప్రకటన. ఆర్థిక లావాదేవీల కారణంగానే తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిని హత్య చేశారని అనిత వ్యాఖ్యానించడంపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాయి. హత్య జరిగిన 17 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అనిత.. ఆపై ఆర్థిక లావాదేవీలే కారణమని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై కాపు సంఘాలు భగ్గుమంటున్నాయి. హత్య జరిగిన 17 రోజులకి పరామర్శకి రావడమే కాకుండా ఈ తరహాలో వ్యాఖ్యానించడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కమ్మకొక న్యాయం.. కాపు బిడ్డకి మరొక న్యాయమా? అంటూ కాపు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా హోంమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ హత్య కేసుపై స్పందించకపోవడాన్ని కూడా వారు నిలదీస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టిని పంపి నగదు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ఇదొక మారణకాండ..నెల్లూరులో జరిగింది మారణకాండ అని కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ముగ్గురిపై ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రమాదం అని చిన్న కేసు నమోదు చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు అంబటిలక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర! -
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి
మచిలీపట్నంటౌన్: ప్రతి ఒక్కరూ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు, శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజలకు కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు, శబ్దకాలుష్య రహిత సమాజం నిర్మాణంపై శనివారం ఆయన మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా మూడు సంభాల సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలకు శబ్ద, వాయు కాలుష్యంపై అవగాహన కల్పించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేయించారు. అన్నా క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమ నాయుడు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, డ్వామా పీడీ ఎన్.వి.శివ ప్రసాద్ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, విద్యార్థులు పాల్గొన్నారు తొలుత సోలార్ విద్యుత్ (సూర్యఘర్) వాడకంపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ టౌన్ ఏడీఈ శ్రీనివాసరావు, రూరల్ ఏడీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
జియోడిటెక్ అసెట్తో కచ్చితమైన మ్యాపులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు అత్యంత కీలకమైన స్టాండర్డ్ బెంచ్ మార్కు(ఎస్బీఎం)లను సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని 1910 నాటి ఎస్బీఎం పునరుద్ధరణ శిలాఫలకాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలిసి కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ... రాష్ట్రంలో స్టాండర్డ్ బెంచ్ మార్కులు(ఎస్బీఎం) 89, బెంచ్ మార్కులు(బీఎం) వేయికి పైగా ఉన్నాయన్నారు. కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్కును సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా పునరుద్ధరించిందని చెప్పారు. ఈ బెంచ్ మార్కుల సహాయంతో అత్యంత కచ్చితత్వంతో(పొజిషన్) స్థానాన్ని చెప్పవచ్చన్నారు. సర్వేకు, మ్యాపుల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్ర పరిశోధనకు ఈ బెంచ్ మార్కులు దోహదం చేస్తాయని, విపత్తు నిర్వహణలో వీటి పాత్ర కీలకమని చెప్పారు. మైదాన ప్రాంతాల్లోని బెంచ్ మార్కులే కాక ఎత్తయిన కొండలపై ఉన్న బెంచ్ మార్కులను కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వే ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ.. జియోడెటిక్ రిజిస్టర్ను రూపొందిస్తున్నామని, ఎన్టీఆర్ జిల్లాలోని బెంచ్ మార్కుల సమాచారంతో కూడిన ఈ రిజిస్టర్ను త్వరలో జిల్లా యంత్రాంగానికి అందజేస్తామని చెప్పారు. సర్వేకు, మ్యాపులకు అత్యంత కీలకమైన ఈబెంచ్ మార్కు లు బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేశారని, వీటిని పునరుద్ధరిస్తున్నామన్నారు. దీనికై మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఎల్ఓ వై.మోహన్ రావు, సర్వే ఇన్స్పెక్టర్ ఏ.జగన్మోహన్, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్లు సమీరుద్దీన్ ఖాన్, పి.నిత్యానందం పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
పరిశ్రమలపై నిఘా
పరిశ్రమల నుంచి వ్యర్థాలను కాలువల్లోకి వదల కుండా నిఘా ఏర్పాటు చేశాం. రసాయన వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధి చేసేందుకు ప్రతి కంపెనీలో శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవల విశాఖ నుంచి ట్యాంకర్తో రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి జక్కంపూడి వద్ద పోస్తుంటే పట్టు కున్నాం. కొండపల్లి ఐడీఏలోని కంపెనీల్లో రసా యన వ్యర్థాల సీవేజ్ ట్యాంకర్లతో బయట పో స్తుండగా గుర్తించాం. నిరంతరం నిఘాతో రసాయనాలు కాలువల్లో కలవకుండా చూస్తున్నాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, పీసీబీ -
రైళ్లలో వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులను దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.6.10 లక్షల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. దృష్టిమరల్చి ఆభరణాల చోరీ.. విజయనగరం, హనుమాన్నగర్కు చెందిన గుల్లిపల్లి సరస్వతి తన భర్తతో కలసి ఈ నెల 16న విజయవాడ రైల్వేస్టేషన్లో దిగారు. ఉదయం 7 గంటల సమయంలో ఆమె ప్లాట్ఫాం నంబర్ – 1లోని సులభ కాంప్లెక్స్లో స్నానానికి వెళ్తూ బంగారు ఆభరణాలను భర్త తన ఫ్యాంట్ జేబులో ఉంచి భార్యకు అప్పగించి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి రెండు పది రూపాయల నోట్లు కిందపడ్డాయి అని చెప్పడంతో ఆమె వాటిని తీసుకునే క్రమంలో మహిళ చేతిలోని ఫ్యాంట్ను తీసుకుని పరారయ్యాడు. దీనిపై బాధితురాలు అదే రోజు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెంకు చెందిన గండ్రోతు సాయినాగలక్ష్మీ మౌనిక ఈ నెల 15న కృష్జార్జునపురం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు శేషాద్రి ఎక్స్ప్రెస్, ఎస్–4 కోచ్, బెర్త్ నంబర్ – 7లో ప్రయాణిస్తుంది. రైలు రాత్రి 12.15 గంటలకు విజయవాడ చేరుకున్నప్పడు ఆమె నిద్రలోంచి మేల్కోంది. రైలు తిరిగి బయలుదేరి విజయవాడ అవుటర్ సిగ్నల్ పాయింట్ వరకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 11 గ్రాముల సాయిబాబా లాకెట్ కలిగిన చైన్ను తెంచుకుని నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యడు. దీనిపై విజయవాడ జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్.. ఈ రెండు కేసులపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు జేవీ రమణ, ఫతే ఆలీబేగ్లు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటుగా పాత నేరస్తులను విచారణ చేయడం ద్వారా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో శనివారం రైల్వేస్టేషన్ మినీస్టేడియం బస్స్టేషన్ వద్ద వారు ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడిచేసి చిత్తురుజిల్లాకు చెందిన గోగుల జన నరసింహులు, పసుపులేటి సులోచన, పసుపులేటి బాబు, కె.జగన్నాథంలను అదుపులోకి తీసుకుని సులభ కాంప్లెక్స్ వద్ద చోరీ చేసిన రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రైలులో మహిళ మెడలో బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడింది ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన రావూరి సుబ్బారావుగా గుర్తించి గాలింపు చేపట్టారు. నిందితుడు శుక్రవారం ప్లాట్ఫాం నంబర్ – 9లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి స్నాచింగ్కు పాల్పడిన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. -
ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ జిల్లా స్థాయి టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): స్థానిక మొగల్రాజపురంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా జిమ్మాస్టిక్స్ టోర్నీ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. మినీ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ సంది రెడ్డి లక్ష్మీనారాయణ అతిథిగా హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. మినీ జూనియర్స్(బాలికలు) ప్లోర్ విభాగంలో పి. లహరి, ట్రంప్ లైన్ విభాగంలో పి.మౌల్య, బీమ్ విభాగంలో పి.లాస్య మొదటి స్థానాల్లో నిలిచారు. మినీ జూనియర్స్(బాలురు)– ప్లోర్ విభాగంలో జి.శశాంత్, ట్రంప్లైన్ విభాగంలో జి.కార్తికేయ మొదటి స్థానంలో ఉన్నారు. అండర్–9 బాలికల ఏరోబిక్స్ విభాగంలో దివ్య, ప్లోర్, బీమ్ విభాగాల్లో బస్వతా మొదటి బహుమతిని పొందారు. అండర్–10 బాయ్స్ ప్లోర్ విభాగంలో వి.సూర్య, ట్రంప్లైన్, ఏరోబిక్స్ విభాగాల్లో యు.సూర్య మొదటి స్థానంలో నిలిచారు. అండర్–12 బాలికల ప్లోర్, భీమ్, ఏరోబిక్స్ విభాగాల్లో వి.మౌనిక మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ట్రంప్లైన్లో ఎ.తాత్విక మొదటి, వి.మౌనిక ద్వితీయ బహుమతి పొందారు. విజేతలను అతిథులు అభినందించారు. -
కూచిపూడిలో పులకించిన మువ్వలు
కూచిపూడి(మొవ్వ): లెజెండరీ నృత్య కళాకారుడు డాక్టర్ వెంపటి చినసత్యం జయంతిని పురస్కరించుకుని కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళావేదికపై శనివారం వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్లు జరిగాయి. కళాకారుల నృత్య ప్రదర్శనలతో నాట్యక్షేత్రం పులకించింది. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ గంగాబాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో సాగిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో ఆయన శిష్య, ప్రశిష్యులు నృత్య ప్రదర్శనలతో వీక్షకులు మైమరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 21 మంది గురువుల పర్యవేక్షణలో 150 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం నట్టువాగం, సూత్రధారిగా కొనసాగిన భామాకలాపం నృత్య రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యభామగా అక్షర దేవెళ్ల, శ్రీ కష్ణుడిగా యశశ్రీ, మాధవిగా డేగల సాంబశివరావు తమ నృత్యాభినయంతో పాత్రలకు జీవం పోసి నృత్యరూపకాన్ని రక్తి కట్టించారు. తొలుత సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయ లక్ష్మి, ఎంపీడీఓ డి.సుహాసిని, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండర్ పెద్దప్రోలు భావన, పలువురు నాట్యాచార్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. నాట్యాచార్యులకు పురస్కారాల ప్రదానం సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఏటా అందించే అవార్డులు, మూడు జీవిత సాఫల్య పురస్కారాలు, ఒక సేవా పురస్కారాన్ని ఈ వేదికపై పెద్దప్రోలు భావన ప్రదానం చేశారు. పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జీవిత సాఫల్య పురస్కారాన్ని సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్కు, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూచిపూడి నాట్య పరిశోధన ఆచార్య డాక్టర్ పసుమర్తి శ్రీనివాస శర్మకు, లంక అన్నపూర్ణదేవి జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ నాట్యచార్యుడు గుంటూరు సంధ్యా మూర్తికి, వెంపటి వెంకట్ సేవా పురస్కారాన్ని వి.రమణ కుమారికి అందజేశారు. -
కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ
చిలకలపూడి(మచిలీపట్నం): బందరు ప్రజలతో మంత్రి కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారని, తన స్వార్థం కోసం రోడ్ల విస్తరణకు నోటిఫికేషన్ ఇప్పించారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. బెల్లంకొట్ల సందు, సామాస్ పక్క సందు విస్తరణ చేస్తామంటూ మునిసిపల్ కమిషనర్తో ఓ దినపత్రికలో నోటిఫికేషన్ ఇప్పించారని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అక్రమంగా రూ.30 కోట్లతో చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణం కోసమే అర్ధంతరంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనం వద్ద తక్కువ, మిగిలిన ఇళ్ల వద్ద ఎక్కువ విస్తరణ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చిన వైనాన్ని మ్యాప్ ద్వారా వివరించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనాలు అన్నింటికీ ప్లాన్లు లేవని స్పష్టంచేశారు. ప్లాన్ తీసుకునేందుకు రోడ్డు విస్తరణ చేయాల్సి రావటంతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. తాను 2004లోనే బెల్లంకొట్ల సందును లారీలు రాకపోకలు సాగించేలా విస్తరించామని గుర్తుచేశారు. ప్లాన్ లేకుండా రవీంద్ర చేపట్టిన నిర్మాణాలను మునిసిపల్, ఎంయూడీఏ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బడ్డీకొట్లను తొలగించేసి చిరువ్యాపారులను రోడ్డున పడేశారని, ఇప్పుడు ఈ నోటిఫికేషన్తో ఎంతో మంది అమాయకులు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మునిసిపల్ కమిషనర్ విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని, గుమ్మటాల చెరువుపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు 50, 60 గజాల చొప్పున విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కొల్లు రవీంద్ర కబ్జాలపై హైకోర్టుకు.. మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాల పర్వం, అక్రమ దందాలపై తాను హైకోర్టుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిటీషన్లు పంపుతానని పేర్ని నాని తెలిపారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. పోలీసు లను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తు లను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్యవైశ్యుల ఆస్తు లను కొట్టేసేందుకు ప్రయత్నించి, 200 మంది రౌడీలను పంపి సరుగుడు చెట్లను తొలగించి రూ.కోటికి విక్రయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించి, అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాలను ఎదుర్కో లేక తనను కొంత మంది ఆశ్రయించారని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో కొల్లు రవీంద్ర కబ్జాలను ఆధారాలతో వెల్లడిస్తామని పేర్ని నాని ప్రకటించారు. ఈ సమావేశంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ శీలం భారతి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్, నాయకులు చిటికిన నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.మచిలీపట్నంలో ఎవరైనా ఇంటి నిర్మాణానికి పునాది తీసిన వెంటనే టీడీపీ స్థానిక డివిజన్ ఇన్చార్జిని కలవాలని సచివాలయ సిబ్బందితో చెప్పిస్తున్నారని, అంతస్తుకు రూ.50 వేలు ఇస్తేకానీ పనులు జరిగే పరిస్థితి లేదని పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి సంబంధిత ఇన్చార్జ్లకు ఎంత చెల్లించారని సూటిగా ప్రశ్నించారు. బడ్డీకొట్లు తొలగించిన మంత్రి టీడీపీ ఇన్చార్జ్ల సిఫార్సులతో తిరిగి వారి వద్ద రూ.లక్షలు కాజేసి అదే స్థానంలో వారు కొట్లు ఏర్పాటు చేసుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో మంది కన్నీళ్లతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని బెదిరించి కబ్జా చేసి ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం నిజం కాదా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ టీడీపీకి చెందిన వారి వద్దే ఎంయూడీఏ చైర్మన్ పదవి ఇప్పిస్తానని నమ్మించి రూ.6.70 కోట్లు తీసుకున్నది వాస్తవమా, కాదా చెప్పాలని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. -
భూగర్భ గరళం
లబ్బీపేట(విజయవాడతూర్పు): భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. వాటిని నేరుగా తాగడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు నామమాత్రంగా శుద్ధిచేసి సరఫరా చేస్తున్న ఆర్ఓ ప్లాంట్ల నీరు కూడా ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో విజయవాడ సింగ్నగర్లో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు. అందుకు కారణం తెలుసుకునేందుకు అనేక మంది వివిధ రకాల సర్వేలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూగర్భ జలశాఖ కూడా సర్వేలు చేసింది. ఈ అధ్య యనాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో 60 నుంచి 80 అడుగుల లోతుల వేసిన బోర్లు నుంచి నైట్రేట్స్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటి వ్యాధికారిక లోహాలు, ఈకోలి, టైఫో బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి రాయనపాడు, కవులూరు నుంచి కొల్లేరు వరకూ బుడమేరుకు రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర ప్రభావం చూపుతున్నాయి. కలుషితానికి కారణాలివే.. భూగర్భ జలాల్లో గుర్తించిన నైట్రేట్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటివి ఉండాల్సిన మోతాదులో ఉంటే ప్రమాదం ఏమి లేదని, కాకుంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు చెపుతున్నారు. బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రాయనపాడు నుంచి కొల్లేరు వరకూ భూగర్భ జలాలు కలుషితమైనట్లు ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది. ఆ ప్రాంతంలో 60 నుచి 80 అడుగుల్లో ఉన్న బోర్లు ద్వారా వచ్చే నీటిలో నైట్రేట్స్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటివి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. వాటితో పాటు ఈకోలి, టైఫో బ్యాక్టీరి యాలు కూడా ఉన్నాయి. ప్రజలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి. లేకుంటే అనేక ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్,ఫిజిక్స్ హెచ్ఓడీ, ఆంధ్రా లయోల కళాశాల -
చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్లు, చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోవాలని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇదీ చదవండి:గూగుల్తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతీ
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో MLC పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంప్రదాయ సిద్దంగా భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరీ సమాజానికి అందించిన ఔషద సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తల ప్రసంగించారు.నాయీబ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ హయాంలోనే సముచిత గౌరవం-లేళ్ల అప్పిరెడ్డివైద్యనారాయణుడు ధన్వంతరీ భగవన్ జయంతిని వైఎస్సార్సీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. మానవుల ఆనారోగ్యాన్ని తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆధ్యుడు భగవాన్ ధన్వంతరీ. ఆయన అందించిన జ్క్షానాన్ని నాయీబ్రాహ్మణులు అందుకుని, ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయీబ్రాహ్మణులే తమ వైద్య విజ్క్షానంతో చికిత్సలు చేసేవారు. మానవ నాగరికతలో నాయీబ్రాహ్మణులది కీలకపాత్ర. తరువాత కాలంలో వారిలో అనేకులు ఆర్ఎంపీలు, పీఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో సీఎంగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి తన పాలనలో వీరి సేవలను గుర్తించి వారికి వృత్తిశిక్షణను అందించి, సర్టిఫికేట్లు ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడ్డారు. విద్యకు ప్రాధానత్య ఇచ్చి అణగారిన కులాలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. కులవృత్తుల్లో ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు, సెలూన్లకు నెలకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ను అంఆదించారు. పాలక మండళ్ళలో నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించారు. ఆలయాల ప్రతిష్టను మరింత పెంచే క్రమంలో నాయీబ్రాహ్మణుల పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారు. ధన్వంతరీ జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జీఓను జారీ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత భగవాన్ ధన్వంతరీ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు తప్పకుండా జారీ చేస్తారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయీబ్రాహ్మణులకు మేలు చేయకపోగా, తమ సమస్యలను చెప్పడానికి వెడితే 'తోకలు కట్ చేస్తాను' అంటూ బెదిరించిన సంఘటనలను చూశాం. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మళ్లీ బీసీలకు సముచిత గౌరవం ఇచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలి. సమాజానికి భగవాన్ ధన్వంతరీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు-టీటీడీ మాజీ సభ్యుడు యానాదయ్యధనత్రయోదశి నాడు ప్రతి ఏటా ప్రజలు భగవాన్ ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. నాయీబ్రాహ్మణులు తమ కులదైవంగా భగవాన్ ధన్వంతరీ ప్రసాదించిన ఔషదసేవలను తమ వృత్తిలో భాగంగా ప్రజలకు అందించారు. మన పురాణాల ప్రకారం పాలసముద్రంను చిలికిన సందర్భంగా ఆయుర్వేద ఔషద కలశంతో భగవాన్ ధన్వంతరీ ఆవిర్భవించారు. అప్పటి నుంచి ఆయన ప్రజల ఆరోగ్యాలను కాపాడే అపర వైద్య నారాయణుడుగా మానవాళికి మహోపకారం చేశారు. అలాగే మానసిక ఉల్లాసం, మానసిక రుగ్మతలను శబ్ధవాయిధ్యాలతో పారద్రోలో కళను కూడా నాయీబ్రాహ్మణులకు ప్రసాదించారు. చివరికి భగవంతుడిని మేల్కొలిపే అరుదైన అవకాశాన్ని కూడా వాయిద్యకారులైన నాయీబ్రాహ్మణులకు అనుగ్రహించాడానికి భగవాన్ ధన్వంతరీ ఆశీస్సులే కారణం.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సేవాసంఘం ఆనంద్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, RMP వైద్యులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రాజ్కుమార్, వెంకటసుబ్బయ్య, మాధవరావు, మురళీ తదితరులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణసంఘం కార్పోరేషన్ మాజీ డైరెక్టర్లు మల్కాపురం కనకారావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, ఆలయ పాలకమండలి మాజీ సభ్యురాళ్ళు రామలక్ష్మమ్మ, నందిని, AGL.నారాయణ, పొదిలి సత్యం, ద్రోణాదుల రామకృష్ణ ,గ్రీవెన్స్ సెల్ నారాయణ మూర్తి, పిల్లుట్ల మోహన్రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులను రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు.‘‘కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు?. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50 వేలు వసూలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్హౌస్ కడుతున్నాడు..కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు. చిన్నచిన్న వారి పై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా?. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ(ముడా) కళ్లు మూసుకుందా?. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్లకు కమిషన్ ఇస్తేనే అనుమతులిస్తున్నారు. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర?..బడ్డీ కొట్లు కూలగొట్టించి నీఇంఛార్జ్లకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటావ్. నీ స్వార్థం కోసం వ్యాపారుల ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్డు విస్తరణ చేయించా. ఈ రోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో కోటి 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా?..ఉచ్ఛనీచాలు ఆలోచించకుండా పాపాలు చేయడం దేనికి కొల్లు రవీంద్ర. నువ్వు, చంద్రబాబు కలిసి 650 ఎకరాల ముడా భూమి తవ్వింది నిజం కాదా?. నేను చెప్పింది నిజమో కాదో ముడా పదవికి రాజీనామా చేసిన బీజేపి నేతను అడగండి చెబుతాడు. బెజవాడలోనో.. హైదరాబాద్లోనో కట్టుకోవచ్చు కదా. మచిలీపట్నంలోనే నీ మల్టీ కాంప్లెక్స్ ఎందుకు కట్టడం?. తన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం స్వార్థంతో రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేడు. కొల్లు రవీంద్ర చేస్తున్న పాపం.. దగాపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చంద్రబాబుకి పిటిషన్లు పెడతాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం..పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తులు లాక్కోవాలని చూస్తే ఊరుకోం. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్య వైశ్యుల ఆస్తులను కొట్టేశావ్. బెంగుళూరులో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టావ్. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా నీ అక్రమ కేసుల సంగతి తేలుస్తాం. బీచ్లో ఫెస్టివల్ తప్ప బందరుకు నువ్వు చేసిందేంటి?. మచిలీపట్నంలో రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేకే... సామాన్యులు నన్ను ఆశ్రయించారు. నన్ను సాయం కోరిన వారికి కచ్చితంగా నేను అండగా ఉంటా’’ పేర్ని నాని పేర్కొన్నారు. -
నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ డెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యింది నకిలీ మద్యమేనని తేలింది. సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా.. ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగుతిన్నట్లు తెలుస్తోంది.మొత్తం 45 శాంపిల్స్ను పంపగా.. అన్నీ నకిలీ మద్యమేనని తేలింది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్ను రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది. అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోనూ కీలక వివరాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మద్యం తయారు చేసినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమ్మబలికి.. ఈ దందాను యధేచ్చగా నడిపించినట్లు తెలుస్తోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025‘సాక్షి’పై వేధింపులు అప్రజాస్వామికంఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 30,411 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,760 క్యూసెక్కులు వదులుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే.. పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులు బహిష్కరించి విజయవాడలోని ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ వివాహ సుముహుర్తాలు, చిన్నారులకు అన్న ప్రాసనలు, దీక్షలు స్వీకరించిన భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. సామాన్యులు, నిరుపేదలు నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దనే ఉద్దేశంతోనే సాక్షి వార్తలు రాస్తోంది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్న వైనాన్ని మాత్రమే సాక్షి బహిర్గతం చేస్తోంది. సారాతో ప్రాణాలకు ప్రమాదం అని దానిని నిషేధించారు. ఇప్పుడు నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయి అని రాస్తే కేసులు కడతారా? అంటే నకిలీ మద్యం తాగినా ఫర్వాలేదా? సమాజానికి మేలు చేసేందుకే జర్నలిస్టులు పనిచేస్తున్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటర్, విలేకరులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – బి. రాఘవరెడ్డి, నెట్వర్క్ ఇన్చార్జి, సాక్షి లబ్బీపేట(విజయవాడతూర్పు): కలంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు గళం విప్పారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పిడికిలి బిగించి నినదించారు. సాక్షి దినపత్రిక కార్యాలయాలు, ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ‘సాక్షి’పై పోలీసుల చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. నిజాలు రాస్తుంన్నందుకే.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహంకు వినతిపత్రం సమ ర్పించారు. సాక్షి పత్రికపై జరుగుతున్న వేధింపుల తీరును ఆయనకు వివరించారు. సత్యమేవ జయతే అంటూ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై కుట్ర పూరితంగా.. పోలీసులను అడ్డుపెట్టుకుని చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఆర్ఓకు ఇచ్చిన వినతిపత్రంలో జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నకిలీ మద్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిందని, అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని వివరించారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై అక్కసుతో అణచివేతే అక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నారు. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. నకిలీ మద్యం బహిర్గతమైన నాటి నుంచి.. నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన నాటి నుంచి వరుసగా ఐదో రోజులుగా ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు హల్ చల్ చేస్తున్నారని, ఎడిటర్ ధనంజయ రెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా విజయవాడ, నెల్లూరులోని కార్యాలయాలతో పాటు హైదరాబాద్లోని ఎడిటర్ను వేధింపులకు గురి చేస్తున్న పోలీసుల చర్యలు పూర్తిగా సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుల చర్యలను జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలుగా తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామకృష్ణ, అరుణోదయ సంఘం ప్రతినిధి శ్రీనివాస్, సాక్షి ఏపీ నెట్వర్క్ ఇన్చార్జి బి.రాఘవరెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి నాగవెంకటరెడ్డి, సాక్షి టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నిద్దన సతీష్, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి చందు శివాంజనేయులు, డీజీఎం కేఎస్ అప్పన్న, విజయవాడ బ్రాంచి మేనేజర్ ఆర్.యశోద్రాజ్, స్టేట్బ్యూరో సీనియర్ రిపోర్టర్స్ ఎ.రామ్ గోపాల్రెడ్డి, మాణిక్యాలరావు, సెంట్రల్ డెస్క్, మఫిసిల్ డెస్క్ సభ్యులు, సర్కులేషన్ ఏజీఎం వి.నరేంద్ర, టీయూసీనేత కోన సుధాకర్రెడ్డి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజలకూ ఇబ్బందే.. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని పత్రికలకు ఒకే విధమైన నియమనిబంధనలు ఉండాలి. కేవలం సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. ఇది ముమ్మాటికి రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికల్లో వచ్చే వార్తల్లో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ ఇవ్వడం మంచి పద్ధతి. అలా కాకుండా పోలీసులతో వేధింపులకు గురిచేస్తుండడం దారుణం. – ఎగ్గొని గాంధీ, దళిత బహుజన పరిరక్షణ సంఘ నేత ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందిస్తున్న జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మైలవరం తహసీల్దార్ అబ్దుల్ దరియాకు వినతిపత్రాన్ని అందజేస్తున్న జర్నలిస్టులు, వైఎస్సార్ సీపీ నాయకులు విజయవాడలో రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జర్నలిస్టులు, ఆయా సంఘాల నాయకులు9జిల్లాలోని ఇతర ప్రాంతాలలో..ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని కోరుతూ సాక్షి దినపత్రిక మైలవరం ఆర్సీ ఇన్చార్జ్ వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు మైలవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ అబ్దుల్ దరియాకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలో సాక్షి దినపత్రిక నందిగామ ఆర్సీ ఇన్చార్జ్ బొక్కా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సాక్షి ఆర్సీ ఇన్చార్జి ఈడే శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయం వద్ద పలువురు పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, పాత్రికేయులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. పలువురు నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం సాక్షి పత్రికపై 15 నెలల కాలంలో 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇక్కడి జర్నలిస్టులు ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారనే అక్కసుతోనే కేసులు పెడుతున్నారు. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బెదిరించి, భయపెట్టే ధోరణిలో హైదరాబాద్లోని కార్యాలయంలో మూడు రోజుల పాటు ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిని వేధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. ఇది దుర్మార్గమైన చర్య. – నిద్దన సతీష్, సాక్షి టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ -
సాంకేతికత సాయంతో రోడ్డు ప్రమాదాల నివారణ
రహదారి భద్రత కమిటీ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ పవర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అమర్చకపోవటం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం నగరంలోని ప్రధాన రహదారులపై యూ–టర్న్ తీసుకుని వచ్చే వాహనాలు ఆ వాహనాలకు ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు పరస్పరం ఢీకొని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బారీకేడ్లకు బదులుగా ఎత్తు తక్కువగా ఉండే సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక పరికరం.. వాహనం నడిపే సమయంలో వాహనచోదకుడు ఫోన్ మాట్లాడటం, స్టీరింగ్ సరిగ్గా పట్టుకోకుండా నడిపినా అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల కళాశాల విద్యార్థులు డెమో ద్వారా వారికి వివరించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2025 సెప్టెంబర్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిలో 32 మరణాలు, 47మందికి గాయాలయ్యాయన్నారు. సమావేశంలో ఏఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాధికారి ఎన్యూఎన్ఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలి
డీఈవో సుబ్బారావు వన్టౌన్(విజయవాడపశ్చిమ): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీ స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతిభ చూపిన విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. క్వాంటమ్ ప్రారంభం – అవకాశాలు– సవాళ్లు అంశంపై సెమినార్ పోటీలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతభ చూపిన విద్యార్థులను 18వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యాసంస్థకు చెందిన బి. ఉషాకిరణమై ప్రథమ, పటమట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి బి. రబిస్మిత ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. విద్యార్థులకు డీఈవో చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పిచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్ మొండి వైఖరి
విజయవాడ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో విద్యుత్ యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన జేఏసీకి ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్ మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. వారి హామీలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అంశంపై విద్యుత్ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో ఈరోజు ఒక దఫాలో జరిగిన చర్చలు పలప్రదం కాలేదు. దాంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే విద్యుత్ యాజమాన్యం.. మళ్లీ జేఏసీని చర్చలకు పిలిచింది. అయితే చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. విద్యుత్ సౌధాలో జేఏసీ నేతలు తమ నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం తప్పించి మిగతావి అడగాలని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతో జేఏసీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై క్లారిటీ ఇవ్వాలని అంటుంది. మళ్లీ కొనసాగుతున్న చర్చలుఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యుత్ యాజమాన్యంతో జరిగిన చర్చల విఫలమై.. ఉద్యోగులు సమ్మె బాటకు సిద్ధమైన తరుణంలో వెంటనే మళ్లీ చర్చలకు పిలిచారు. మరోసారి జేఏసీతో విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతుంది. ప్రధానంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్ను మాత్రమే పిలిచి విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నారు. మిగతా నేతలంతా విద్యుత్ యాజమాన్యం వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది..
ఎన్టీఆర్ జిల్లా: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్పై గొడవ పడతున్నావన్న కండక్టర్పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్లకు సర్ది చెప్పి పంపించి వేశారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ అటెండర్ ఒక దుకాణ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి విజయవాడ పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్లో కొండపల్లి శ్రీనివాసరావు అటెండర్గా పని చేస్తున్నాడు. అతను గురువారం రాత్రి పాతబస్తీ సుబ్బరామయ్యవీధిలోని జెండాచెట్టు వద్ద ఒక వాహనాన్ని ఆపి అందులో ఉన్న సరుకుకు బిల్లు చూపించాలని అడిగాడు. బిల్లు చూపించగా దానిని చింపేసి తనకు రూ.40 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దానికి వాహనదారుడు తన దుకాణ యజమాని జోగారావు చౌదరిని అక్కడకు పిలిపించాడు. జోగారావు చౌదరి అతనికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో రూ.16 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ రంగారావు అక్కడ దాడి చేశాడు. లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగంచిప్రోలు: గ్రామానికి చెందిన చిట్స్, గోల్డ్ స్కీం వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ అర్జున్ గురువారం తెలిపారు. గోల్డ్ స్కీం, చిట్స్, వడ్డీకి డబ్బులు తీసుకుని అతను పారిపోయాడన్నారు. అతనిపై చీటింగ్ కేసుతో పాటు చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రజలు లైసెన్స్ లేని చిట్స్, గోల్డ్ స్కీంలలో చేరవద్దని ఎస్ఐ సూచించారు. దుర్గారావు బాధితులు పోలీస్స్టేషన్కు క్యూ కడుతూనే ఉన్నారు. గురువారం సాయంత్రానికి 68 మంది ప్రామిసరీ నోట్లు, గోల్డ్ స్కీం రశీదులతో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముసిముక్కు కనకచింతయ్య, అతని భార్య సీతామహాలక్ష్మి(42) వ్యవసాయ సనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కపక్కనే నివాసిస్తున్న కనకచింతయ్యకు, అతని సోదరుడైన వడ్డీకాసులకు గత కొంత కాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై రెండు నెలలు క్రితం వీరి మధ్య జరిగిన గొడవలో సీతామహాలక్ష్మిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనపై అప్పట్లో ఉంగుటూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో సీతామహాలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకాసులు కుటుంబ సభ్యులే సీతామహాలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త కనకచింతయ్య, కుమారుడు రాజేష్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆమైపె దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. -
కమనీయ కార్తికానికి సంసిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రానున్న రెండు నెలల్లో జరిగే విశేష పూజలు, పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆవరణలోని మహా మండపం ఆరో అంతస్తులో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో దేవస్థానంలో నిర్వహించనున్న ఉత్సవాలు, విశేష పర్వదినాలు, భవానీ దీక్ష స్వీకరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత దేవస్థానం అమ్మవారి అలంకరణలు, ఆలయ బంగారు శిఖరం, రాజగోపురం ఫొటోలతో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 20న దీపావళి వేడుకలు.. 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8గంటలకు దేవస్థాన యాగశాలలో శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. ఈ యాగం దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, భక్తుల పరోక్ష సేవగా జరుగుతుందన్నారు. ఇక 20వ తేదీ దీపావళి పర్వదినాన ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మీపూజ, దీపాలంకరణ, దీపావళి వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు. కార్తికం.. ఆధ్యాత్మిక సంరంభం.. 21వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తామని, 22వ తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమవుతాయని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవాలలో ప్రతి నిత్యం స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు కార్తిక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో స్వామి వారికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపో త్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. దుర్గమ్మ గాజుల సంబరం.. దుర్గమ్మకు 23వ తేదీన గాజులతో విశేష అలంకరణ చేస్తారని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మూలవిరాట్కు గాజులతో విశేషంగా అలంకరిస్తామన్నారు. అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రత్యేక బిల్వార్చన జరిగే తేదీలు.. కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిథులలో బిల్వార్చన నిర్వహిస్తారు. 27వ తేదీ సోమవారం శుద్ధ చవితి, నవంబర్ 1వ తేదీ శనివారం శుద్ధ ఏకాదశి, 3వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి, 05వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి, 10వ తేదీ సోమవారం బహుళ పంచమి, 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి, 17వ తేదీ సోమవారం బహుళ త్రయోదశి 18వ తేదీ మంగళవారం మాస శివరాత్రిన ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి భవానీ దీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్ధమండల దీక్షలు నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీదీక్ష విరమణలు జరుగుతాయని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై 22 నుంచి కార్తిక మాసోత్సవాలు 23న దుర్గమ్మకు గాజుల అలంకరణ భక్తులకు ఇబ్బందుల్లేకుండా పక్కా ఏర్పాట్లు మీడియాతో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ -
తాను తవ్విన గోతిలోనే పడిన కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ తీసుకున్న సారా గోతిలోనే కూటమి ప్రభుత్వం పడిందని.. దాని నుంచి బయటపడేందుకు వైఎస్సార్ సీపీ నాయకులపై బురద చల్లుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విమర్శించారు. సత్యనారాయణపురం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సూపర్ లేబుల్స్కు పరిమితం అయ్యారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జోగి రమేష్ను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసులు సమగ్రంగా విచారణ చేయటం లేదన్నారు. జోగి రమేష్కు ఎలాంటి నిక్ నేమ్స్ లేవని.. కంప్లైంట్లో 1 రమేష్ అని పెట్టించారని ఫోన్లో చూపించారు. తద్వారా ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే అని తేలిపోయిందన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. 16 నెలలు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ పెట్టాం అని చెబుతున్నారని.. గతంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ క్యూ ఆర్ కోడ్ పద్ధతిని తెచ్చిందని గుర్తు చేశారు. జైలులో ఉన్న జనార్దన్ వీడియో బయటకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి -
జీఎస్టీ సంస్కరణలతో సుస్థిర ఆర్థిక ప్రగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీఎస్టీ 2.0 సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సంస్కరణల ఫలితంగా దేశ వ్యాప్తంగా 99శాతం వస్తువులు, సేవలు పన్ను రహితం కావడం లేదా 5 శాతం, 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయన్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పా టు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆతిథ్య రంగానికి ఊతం.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ. 8 వేల కోట్లు, జిల్లా ప్రజలకు రూ. 300 కోట్లు, ప్రతికుటుంబానికి నెలకు రూ. 6 వేలు నుంచి రూ.12 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీవోలు ఆర్. ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు వై. నాగేశ్వరరావు, వి.పద్మాకర్, అలీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి. ప్రియదర్శిని, కృష్ణాజిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్, విజయవాడ టాక్సీ ఓనర్ల అసోసియేషన్, ఎన్ఏఎంటీఏ అసోసియేషన్, టీఎన్ టీయూసీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బాబూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
రూ 2.96కోట్ల మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు గురువారంరూ.2,96,37,000 మెరిట్ స్కాలర్ షిప్పులు యాజ మాన్యం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీగా మార్చిన తర్వాత విద్యార్థులకు తాము పూర్తి అండగా ఉన్నామన్నారు. గతంలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ఉండేదని, యూనివర్సిటీ చేసిన తరువాత తామే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. చదువులో ప్రతిభ, హాజరు శాతం పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025–2026లో 624 మంది విద్యార్థులకు రూ.2.96కోట్లను స్కాలర్షిప్లుగా ఇచ్చామన్నారు. ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డాక్టర్ జీఎన్.స్వామి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సూత్రధారులు చంద్రబాబు, లోకేష్లే
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం మాఫియా వ్యవహారంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యం స్కాంలో జయచంద్రారెడ్డి, జనార్దన్లు కేవలం పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కావాలని కేసును పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్ పాత్ర ఉందని, ప్రధాన నిందితుడు జనార్దనరావుతో చెప్పించారని అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై జోగి రమేష్ పోరాటాలు చేస్తున్నారని, నకిలీ మద్యంపై తొలిసారిగా గళం విప్పింది ఆయనే అని అన్నారు. నకిలీ మద్యం రాకెట్పై సీబీఐ విచారణ కోరింది కూడా జోగి రమేష్ అని గుర్తు చేశారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడం కోసమే తప్పుడు కేసు పెట్టారని అన్నారు. జోగి రమేష్కు జిల్లా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తమ పార్టీ నాయకులు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పని చేసినవారు ఫిర్యాదు చేయడానికి వస్తే కలవని సీపీ టీడీపీ చోటామోటా నాయకులు వస్తే కలవడం చూస్తే ఏ విధంగా పని చేస్తున్నారో అర్ధమవుతోందన్నారు. ఏ పదవీ లేని బుద్ధా వెంకన్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తే తనను గుర్తిస్తారన్న తపనతో తమ నాయకులపై కారుకూతలు కూస్తున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి జోగి రమేష్తో ప్రస్తుత పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు. పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, కుంచం జయరాజును కూడా పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రధరరావు, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజా శ్రీనివాస్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు పోరంకి శ్రీనివాసరాజు, రెంటపల్లి నాగరాజు, నాయకులు జడ రాంబాబు, మిక్కిలి శరభయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం...ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న పీహెచ్సీ వైద్యుల ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వైద్యులు మాత్రమే రిలే దీక్షలు, నిరసనల్లో పాల్గొనగా, ఇప్పుడు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడంతో దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. మరోవైపు స్కిట్లు, పాటలతో యువ వైద్యులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీల్లో పనిచేసే 2700 మంది వైద్యులు విధులను బహిష్కరించినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. వైద్యులకు మద్దతుగా వైద్య సిబ్బంది వైద్యులకు మద్దతుగా పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సైతం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా విధులు బహిష్కరించేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు సెకండరీ హెల్త్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, టీచింగ్ వైద్యుల సంఘాలు సైతం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు సైతం పెద్ద సంఖ్యలో వైద్యులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం మాత్రం మొండిపట్టు వీడటం లేదు. ముఖ్యమైన డిమాండ్లు ఇవే... ఇన్సర్వీసు కోటా పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ కల్పించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్బాండ్ ఉద్యోగోన్నతులు, టైమ్ బాండ్ స్కేల్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రనాయక్, ఇతర నేతలు డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ జ్ఞానేష్లతో పాటు దాదాపు వెయ్యి మందికి పైగా వైద్యులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రిపై రానున్న కార్తిక మాసంలో జరిపే విశేష పూజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తెలిపారు. –IIలో విమానాశ్రయం(గన్నవరం): తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి విజయవాడ పర్యటన నిమిత్తం గురువారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మచిలీపట్నంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎండూరి శేష బాపనలాల్, పూర్ణచంద్రిక, రవీంద్రమూర్తి రక్త సంబంధీకులు. వారికి చిన్నగొల్లపాలెంలో తల్లి దండ్రుల నుంచి 167 ఎకరాలు సంక్రమించింది. 1941వ సంవత్సరం నుంచి ఎండూరి కుటుంబం స్వానుభవంలో ఉన్న 213, 217, 572/1 సర్వే నంబర్లలోని 52.76 ఎకరాల విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. తన బృందం ద్వారా కొల్లు రవీంద్ర 2014–19 మధ్య కాలంలోనూ, తాజాగా కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు ఈ భూమిని కాజేసే యత్నాలు కొనసాగిస్తున్నారు. ఎండూరి శేషబాపనలాల్ 2011 జూలైలో మరణించగానే 2012లో మచిలీపట్నానికే చెందిన గంపల కస్తూరి అనే మహిళను రంగప్రవేశం చేయించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల ద్వారా ఆమెను లాల్ భార్య అంటూ ఇంటి పేరును సైతం మార్పించి రెవెన్యూ కార్యాలయం నుంచి 39.70 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్ను ఇప్పించగలిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ తల్లి ఎండూరి సీతామహాలక్షుమమ్మ 2014 ఆగస్టులో రెవెన్యూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కుమారుడి ద్వారా పొందిన వీలునామా తదితరాలను సాక్ష్యాలుగా పొందుపరిచారు. కాలక్రమంలో చిన్న కుమారుడైన ఎండూరి రవీంద్రమూర్తికి తల్లి సీతామహా లక్షుమమ్మ వీలునామా రాశారు. ఆమె తదనంతరం రెవెన్యూ కోర్టులో మూర్తి ఇంప్లీడ్ అయ్యారు. ఈ కేసు కొనసాగుతున్న దశలోనే 2016 ఆగస్టులో గంపల కస్తూరి వివాదరహిత భూమిగా పేర్కొంటూ ఆరుగురికి సేల్ డీడ్ ద్వారా, మరొకరికి గిఫ్ట్ డీడ్ ద్వారా 38 ఎకరాలను విక్రయించారు. 1.70 ఎకరాలను పంచాయతీ దారి కోసం రాసిచ్చారు. అప్పుడు కొల్లు రవీంద్ర మంత్రిగా కొనసాగుతున్నందునే ఈ విక్రయ ప్రక్రియ సాధ్యమైందని బాధితవర్గం ఆరోపిస్తోంది. సరుగుడు తోటలు నరికేశారు... చిన్నగొల్లపాలెంకు చెందిన పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ 2011 నుంచి వివాదాస్పద భూమితో పాటు రవీంద్రమూర్తికి చెందిన మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని మొత్తం 53.76 ఎకరాలలో సరుగుడు తోటలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అండదండలతో భూ కొనుగోలుదారులమంటూ ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన, తాజాగా సెప్టెంబరు 22 నుంచి ఈనెల ఆరో తేదీ వరకు 19 ఎకరాల్లోని తోటలు నరికేశారు. నరికేసిన 900 టన్నులకు పైగా కలప విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని కౌలురైతులు వాపోతున్నారు. రైతులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు తమ తోటలు నరకొద్దని అడ్డుపడిన రవీంద్రమూర్తి తో పాటు 12 మంది రైతులపై ఫిబ్రవరిలో కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదుచేశారు. మచిలీ పట్నం నుంచి వెళ్లి దౌర్జన్యంగా కోర్టు పరిధిలో ఉన్న తోటలు నరికేసిన రౌడీల జోలికి పోలీసులు వెళ్లక పోవడం వెనుక ఎవరున్నారనేది విదితమే. ఆర్డీవో, డీఎస్పీలు గ్రామానికి వెళ్లి మీకు మేలు చేస్తామనడం వరకే పరిమితమయ్యారు. పది నెలలు అవుతున్నా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడం గమనార్హం. మంత్రి చెప్పినట్టు వినండి, ఆ భూముల వద్దకు వెళ్లకండి, లేదంటే మీ సంగతి తేలుస్తామనే పోలీసుల బెదిరింపులకు నెలల తరబడి గ్రామాన్ని వదిలి తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బాఽధిత రైతులు వాపోయారు. అక్రమంగా రెండు సారా కేసులు భూమి తనకు చెందుతుందని కోర్టుకు వెళ్లిన రవీంద్రమూర్తిపై గత టీడీపీ హయాంలో అక్రమంగా రెండు సారా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసుల నుంచి బయటపడినట్లు బాధితుడు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత హెచ్చరికలు... పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మంత్రి తరఫున మాట్లాడుకుందాం రండని చినగొల్లపాలెం బాధిత రైతులను ఫిబ్రవరి నుంచి పలుసార్లు పిలిపించి చెప్పినట్లు వింటే మీపై కేసులు లేకుండా చూస్తానని, ఎదురుచెపితే కటకటాలు తప్పవని హెచ్చరించినట్టు బాధితులు చెబుతున్నారు. సెటిల్మెంట్కు భీమవరం ఎమ్మెల్యే వద్దకు... భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు స్వగ్రామం చినగొల్లపాలెం. రైతులకు సర్ది చెప్పి సెటిల్ చేయాలని మంత్రి రవీంద్ర ఆయనకు సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా భూమిని తమకు వదిలేసి వెళ్లిపోవాలని కొల్లు బృందం కోరడాన్ని ఎమ్మెల్యే అంజిబాబు తప్పు పట్టి ఎటూ తేల్చకుండా పంపించేశారని సమాచారం. టీజీ వెంకటేష్, సోము వీర్రాజుల జోక్యం... తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం గురించి రవీంద్రమూర్తి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. చినగొల్లపాలెం రైతులకు అన్యాయం జరుగుతోందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు సోము వీర్రాజుకు వివరించగా ఆయన పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టప్రకారం వెళ్లాలని, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని అన్నారని సమాచారం.Iమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కొల్లు రవీంద్ర హద్దు లేని అరాచకాలకు పాల్పడుతున్నారనే తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. కుటుంబ తగాదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తిపాస్తులను కాజేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులు, బినామీల మాటున ఈ అడ్డగోలు వ్యవహారాలకు ఒడిగడుతున్నారని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సామ దాన భేద దండోపాయాల వినియోగానికి ఏమాత్రం వెనుకాడటంలేదని స్థానికులు అంటున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో రూ.11.50 కోట్లకు పైగా విలువ చేసే 38 ఎకరాల భూమిని కాజేయడానికి దశాబ్దకాలంగా కొనసాగిస్తున్న అరాచకపర్వం ఇందుకు తార్కాణమని ఉదహరిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెంగళూరు వెళ్లి నా కుమార్తె కుటుంబాన్ని బెదిరించారు. నా కుమారుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నా పైనా, రైతుల పైనా తప్పుడు కేసులు పెట్టారు. ఏంచేసినా సరే న్యాయం జరిగే వరకు పోరాడతా. – ఎండూరి రవీంద్రమూర్తి, మచిలీపట్నం మంత్రి కొల్లు అయినా.. మరెవరైనా సరే రైతుల భూములను లాగేసుకోవా లని చూస్తే ఊరుకోం. రవీంద్రమూర్తి విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడాం. – వల్లభనేని ఆశాకిరణ్, భారతీయ కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి భూమిని కొనుగోలు చేశామంటున్న వారందరూ మచిలీపట్నం వాసులే. వారిలో మంత్రి కొల్లు రవీంద్ర చినమామ నడకుదిటి అర్జున సర్వే నంబరు 213లో 11.30 ఎకరాలు, మంత్రి బాబాయ్ కుమారుడు కొల్లు రంగనాఽథ్ 571/1లో అయిదు ఎకరాలు, మంత్రి కొల్లు బినామీలుగా స్థానికంగా బాగా గుర్తింపు ఉన్న ఊకంటి రాంబాబు 572/1లో 5 ఎకరాలు, పైడిపాటి త్రినాథ్ 217లో 5 ఎకరాలు, కొల్లూరి సూర్య చంద్ర భగవాన్ గుప్త 217లో 5 ఎకరాలు, శ్రవణం పవన్కుమార్ 3.70 ఎకరాలు కొను గోలుదారులు. కాగా గిఫ్ట్ డీడ్ కింద పొన్నుగంటి చంద్రమౌళి 3 ఎకరాలు పొందారు. -
దుర్గమ్మకు వజ్రాభరణాలు
శుక్రవారం తెల్లవారుజామున అలంకరణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రముఖ జ్యూయలర్స్ సంస్థ కీర్తిలాల్ జ్యూయలర్స్ వారు గురువారం బంగారు, వజ్రాభరణాలను కానుకగా సమర్పించారు. సుమారు రూ.2కోట్ల విలువైన 531 గ్రాముల బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, మంగళ సూత్రాలు, బంగారు గొలుసు వంటి ఆభరణాలను దాతలు గురువారం రాత్రి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. శుక్రవారం ఈ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తిలాల్ జ్యూయలర్స్కు చెందిన సూరజ్ శాంతకుమార్, కీర్తిలాల్ కాళిదాస్, తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీరవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ తనిఖీల ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో మూడు రోజుల పాటు నిర్వహించిన టికెట్ తనిఖీల ప్రత్యేక డ్రైవ్ ద్వారా రూ.1.22 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఈ తనిఖీలలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బంది డివిజన్లోని రైళ్లు, స్టేషన్లలో చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో అనధికారిక ప్రయాణం చేస్తున్న వారిపై 17,017 కేసులు నమోదు చేయడం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో టికెట్ లేని ప్రయాణికులపై 7,928 కేసులు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిపై 9,034 కేసులు, అనధికారిక లగేజీలపై 55 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో మొదటి రోజు రూ.37.03 లక్షలు, రెండవ రోజు రూ.40.26 లక్షలు, మూడవ రోజు రూ.45.03 లక్షల పెనాల్టీలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం బి.ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రైళ్లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సరైన టికెట్తోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సజావుగా వారి ప్రయాణాన్ని కొనసాగించేందుకు డివిజన్లో ఇటువంటి డ్రైవ్లు తరచుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
జాబ్ మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం జాబ్ మార్కెట్కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్ పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఎస్డీసీ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రష్యా, జర్మనీ, ఖతార్ తదితర దేశాల్లో కూడా వివిధ ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా భాషల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు పొందేందుకు చేయూతనందిస్తోందన్నారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంట జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు ఉన్నారు. నవంబరు 22, 23 తేదీలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్యవేదిక సహకారంతో నవంబరు 22, 23 తేదీలలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రెండు రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కలిమిశ్రీ తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సంగీత, సాహిత్య, నాటక రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సాహితీ వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలుంటాయని తెలిపారు. సాంస్కృతిక ఉత్సవాల విజయవంతానికి కామ్రేడ్ జీఆర్కే, పోలవరపు సాహితీ సమితి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పోస్టర్ను అతిథులు ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన మీసాల రాజేశ్వరరావు, గొరిపర్తి హనుమంతరావు, ఉత్సవ కమిటీ బాధ్యులు చొప్పా రాఘవేంద్ర చంద్రశేఖర్, పి.చిదంబరం, వైడీ ఆనంద్ పాల్గొన్నారు. పున్నమిఘాట్లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక పున్నమి ఘాట్లో గురువారం రాత్రి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆదాయపు పన్ను కమిషనర్ ప్రకాష్, ఐసీడీఎస్ పీడీ ఎస్కే రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంశంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మనోజ్కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని 159 రైతు సేవా కేంద్రాల ద్వారా 17వ తేదీ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో మొత్తం 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో సుమారు 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తిరువూరు మండలంలోని మునకుళ్ల రైతు సేవా కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని, మద్దతు ధర పొందాలని డీఎం టీవీ సతీష్ ఆ ప్రకటనలో కోరారు. -
వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తీవ్రస్థాయిలో వేధిస్తున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో గురువారం వైఎస్సార్సీపీ సీనియర్ నేతలైన మేడపాటి నాగిరెడ్డి, మైలవరం నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు ఇంటికి సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు.ఇద్దరి ఇళ్లల్లో సోదాలు చేయడానికి ప్రయత్నించారు. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం వీరి ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకుని సీజ్ చేశారు. వాట్సాప్లో చాటింగ్ ఆధారంగా ఇద్దరి నేతలను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. -
సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జీ సీరియస్
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రాపై సీరియస్ అయిన ఏసీబీ కోర్టు జడ్జి.. కేసు విచారణ పూర్తయిందా? లేదా? సూటిగా చెప్పాలన్నారు. విచారణ కొనసాగుతుందని.. కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు లూథ్రా తెలిపారు.ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా ఆధారాలు కోర్టుకు తెలపలేదన్న ఏసీబీ జడ్జి.. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారన్నారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి.. కోర్టుని మిస్ గైడ్ చేస్తున్నారంటూ లుథ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
విజయవంతంగా ‘స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా విజయవాడ డివిజన్లో పక్షం రోజులుగా నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ–2025 విజయవంతంగా ముగిసిందని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు తెలిపారు. డీఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాంగణాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత డ్రైవ్లు విజయవంతంగా ముగిశాయన్నారు. అందులో స్వచ్ఛత అభియాన్, స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలతో విస్తృతమైన డ్రైవ్లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు 1,595 మంది అధికారులు, 2,243 మంది వలంటీర్లతో పరిశుభ్రత డ్రైవ్లు నిర్వహించడం ద్వారా 9,166 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు, 64.7 కి.మీ. ట్రాక్లు, 341 మీటర్ల డ్రెయిన్లు, 30 కార్యాలయాలను శుభ్రపర్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసిన వారిపై 114 కేసులు నమోదు చేయడం ద్వారా రూ.24,800 పెనాల్టీలు వసూలు, ఒక టన్ను వ్యర్థాలను తొలగించడం, 26 రైళ్లను శుభ్రపర్చడం, మొక్కలు నాటడంతో పాటు ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష కృషి చేసిన, స్వచ్ఛందంగా పాల్గొన్న వలంటీర్లు, ఉద్యోగులను వారు ప్రత్యేకంగా అభినందించారు. డివిజన్ పరిధిలో పరిశుభ్రత, ప్రయాణికుల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపర్చడంతో డివిజన్ అనుకున్న లక్షాలను సాధించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ డీఈ (పర్యావరణ, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్) వంశీకాంత్, పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
వించిపేట(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్మొహిద్దీన్ డిమాండ్ చేశారు. వించిపేటలోని తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పెద్దల అండదండలతో ఆ పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దనరావు ఒక పరిశ్రమలా పెద్దఎత్తున తయారు చేసిన నకిలీ మద్యం వ్యవహారంలో కుట్రపూరితంగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏడాదిన్నర టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని అమ్మి టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు పడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో దొంగే.. దొంగ అని అరిచిన చందంగా వైఎస్సార్ సీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పడు ఎలా వచ్చిందని, ఇది కుట్ర పూర్వక చర్యలు కాదా అని గౌస్ మొహిద్దీన్ ప్రశ్నించారు. నిందితుడి చేతికి ఫోన్ ఇచ్చి జోగి రమేష్ పేరు చెప్పిస్తూ చవకబారు వీడియో చేశారని ఎద్దేవా చేశారు. జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ గౌస్మొహిద్దీన్ -
లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం
జి.కొండూరు: రెండు లారీల మధ్య ప్రమాదవశాత్తూ ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు బైపాస్రోడ్డులో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ఒకే యజమానికి చెందిన రెండు లారీలు చత్తీస్ఘడ్లో అల్యూమినీయం రోల్స్ను లోడు చేసుకొని తమిళనాడు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జి.కొండూరు బైపాస్రోడ్డులోని ఆత్కూరు క్రాస్రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే మలుపు తీసుకునే సమయంలో ముందు వస్తున్న లారీ ఇంజిన్ ఆగిపోయింది. ఆగిపోయిన లారీకి సెల్ఫ్ స్టార్ట్ లేకపోవడంతో వెనుక ఉన్న లారీతో ముందు లారీని నెట్టేందుకు ముందు లారీలో ఉన్న డ్రైవర్ సుభాష్(42) రెండు లారీల మధ్య ఇనుప రాడ్ను సెట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇనుప రాడ్డు పక్కకి తప్పడంతో వెనుక లారీ ఒక్కసారిగా ముందుకు రావడంతో రెండు లారీల మధ్యలో సుభాష్ ఇరుక్కుపోయాడు. సుభాష్ తల రెండు లారీల మధ్యలో ఒత్తుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సతీష్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కంచికచర్ల: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్లకు చెందిన కూరపాటి సరస్వతి(65) బుధవారం ఉదయం స్థానిక శ్రీశివసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చే క్రమంలో నేషనల్ హైవే దాటుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఆమె తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బందరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం ఆటోనగర్(విజయవాడతూర్పు): పడవలరేవు సమీపంలోని బందరు కాలువ బ్రిడ్జి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కొట్టుకు వచ్చింది. మృతుడు సుమారు 45 ఏళ్ల మగ వ్యక్తిగా భావిస్తున్నారు. ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉంది. బ్రిడ్జి పక్కనే ఉన్న చెట్లకు ఆనుకొని మృతదేహం ఆగింది. కుటుంబ కలహాలతో అధ్యాపకుడు ఆత్మహత్య పెనమలూరు: కుటుంబ కలహాలతో పోరంకిలో అధ్యాపకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన బాణావత్ హరిచంద్(37) ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య అనిత పోరంకిలో ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తోంది. వీరు పోరంకిలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అనిత సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఉండటంతో రుణం కోసం బంగారు ఆభరణాలు ఇచ్చింది. అయితే అతను బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా మంగళవారం అనిత సోదరుడు ఇంటికి రాగా హరిచంద్ బంగారు ఆభరణాల విషయం అడిగాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన హరిచంద్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. భర్త గది నుంచి బయటకు రాక పోవటంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా హరిచంద్ ఫ్యాన్కు ఉరేసుకోని వేలాడుతూ కనిపించాడు. అతడిని వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్సకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న హరిచంద్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
నిమ్మకూరు(పామర్రు): గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించామన్నారు. ఇంకా గ్రామానికి అవసరమైన పనులను గ్రామస్తుల నుంచి తెలుసుకుని వాటి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, అంతర్గత డ్రెయినేజీ, చెరువుల కంచె ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు, పీహెచ్సీలో పరికరాల ఏర్పాటు, వసతుల కల్పనపై చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ గోకులం ఏర్పాటుకు రూ.10 లక్షల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. అనంతరం గ్రామంలోని గురుకుల వృత్తి విద్యా పాఠశాల, బాలుర, బాలికల డార్మిటరీలను పరిశీలించారు. గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.1.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నూతక్కి వెంకట సాంబశివరావు, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి 22 నుంచి బస్సు జాతా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్జీ తెలిపారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో బస్సు జాతా వాల్ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చర్యలు మానుకోవాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే బకాయిలు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కురుపాంలో 150 మంది విద్యార్థులు వ్యాధుల బారిన పడ్డారని, వీరిలో నలుగురు విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, నాయకులు ప్రణీత్, అమర్నాథ్, అజయ్ పాల్గొన్నారు. -
టిడ్కో గృహాలకు నోటీసులు జారీ చేసిన బ్యాంక్ అధికారులు
మచిలీపట్నంటౌన్: స్థానిక రుద్రవరంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులు బ్యాంక్కు రుణ వాయిదాలు(ఈఎంఐ)లు సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బుధవారం పలువురు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, ఇళ్లకు అతికించారు. కొంతమంది లబ్ధిదారులు రాజకీయ నాయకుల హామీలను నమ్మి, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే అపోహలో ఉండి ఈఎంఐ చెల్లింపులు నిలిపివేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు కేటాయించి, నివాసం ఉండకపోవడం రుణ చెల్లింపులు నిలిపివేయడానికి సరైన కారణం కాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, టిడ్కో సంస్థ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లుగా, ఒకసారి ఇల్లు కేటాయించబడిన తరువాత ఇకపై ఎటువంటి ఆర్థిక సహాయం, రుణమాఫీ ఉండదని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అధికారులు రుద్రవరంలోని లబ్ధిదారులకు, ఈఎంఐలు తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే ఖాతాలు ఎన్పీఏ స్థితిలోకి వెళ్లి సర్ఫేసీ(ఎస్ఎఆర్ఎఫ్ఎఈఎస్ఐ) చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఇళ్లు వేలం వేస్తామని హెచ్చరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డెప్యూటీ రీజినల్ హెడ్ కొవ్వూరి రామలింగారెడ్డి, రికవరీ చీఫ్ మేనేజర్ రాకేష్, జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ నవక్రాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
సిబ్బంది కృషి వల్లే సాధ్యమైంది
బస్టాండ్(విజయవాడపశ్చిమ): స్వీపింగ్, టాయిలెట్ సిబ్బంది కృషి ఫలితంగానే పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ హౌస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న అవార్డును ద్వారకాతిరుమలరావు సిబ్బందికి అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. బస్స్టేషన్ స్వీపింగ్, టాయిలెట్ సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవివర్మ, అప్పల రాజు, చెంగల్రెడ్డి, విజయరత్నం, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సూర్యపవన్కుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ -
జీజీహెచ్ సూపరింటెండెంట్కు బెదిరింపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును గుర్తు తెలియని అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లయోలా కళాశాల సమీపంలో నివసించే ఆయన ఇంటికి మంగళవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. మంగళవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మా క్యాంటీన్ లీజు ఒక ఏడాదే పొడిగించారు, రెండేళ్లు పొడిగించాలని డిమాండ్ చేశారు. నేను మూడు నెలల్లో రిటైర్ అవుతున్నానని చెప్పగా, అవన్నీ మాకు తెలియదు రేపు రెండేళ్లకు పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆఫీసులో మాట్లాడదామని చెప్పినా వినకుండా బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఫోన్ తీసుకు వచ్చి ఫొటో తీద్దామని ఇంట్లోకి వెళ్లి రాగా, అప్పటికే వాళ్లు వెళ్లిపోయారు. ఈ విషయమై సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశకు సమాచారం ఇవ్వడంతో పాటు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంటీన్ నిర్వాహకుల ఫిర్యాదు.. కాగా సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరించిన వారితో తమకు సంబంధం లేదంటూ క్యాంటీన్ నిర్వాహకులు మాచవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. అగంతకులను గుర్తించాలని ఆ ఫిర్యాదులో కోరారు. క్యాంటీన్ లీజు ఏడాది పొడిగించారని, బెదిరించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని కోరారు. అందుకు సంబంధించి అనుమానితుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులు దుర్మార్గం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని వైద్యుల సంఘం నేతలు డాక్టర్ సొంగా వినయ్కుమార్, డాక్టర్ కె.రవిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్దకు వెళ్లిన అగంతకులు ఎవరో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. గంజాయి నిందితుల అరెస్ట్ జి.కొండూరు: గంజాయి నిందితులను జి.కొండూరు పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే... ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్ అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామ శివారులో ఎనిమిది మంది వ్యక్తులకు విక్రయించేందుకు ఏలూరు నుంచి గంజాయిని తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్న జగదీష్తో పాటు కొనుగోలు చేసేందుకు ముందుగానే నిందితుడికి ఆన్లైన్ పేమెంట్ చేశారన్నారు. గంజాయిని తీసుకునేందుకు వచ్చిన మైలవరానికి చెందిన తమ్మిశెట్టి సాయి, విజయవాడకు చెందిన రామ్జలి కృష్ణ, బెజవాడ చందు, బొప్పూరి రవి, యలమర్తి కమలకేష్, జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డపాటి కార్తీక్, నూతక్కి ప్రసన్నకుమార్, చాట్ల విజ్ఞాన్ సాగర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.1 కేజీల గంజాయిని, రెండు స్కూటీలను, ఒక ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా జేసీ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా ఫుల్ అడిషనల్ చార్జ్ను నవీన్కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నాట్యాచార్యుడు చినసత్యంకు నృత్య నీరాజనం
విజయవాడకల్చరల్: దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో బుధవారం నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి సందర్భంగా గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహించిన నృత్య కార్యక్రమాలు మనోహరంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు నృత్య కళాశాల, అమరావతి నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. నగరానికి చెందిన 30 మంది నాట్యాచార్యులు తమ 500 మంది బృంద సభ్యులు నృత్యాంజలి ఘటించారు. చినసత్యం నృత్య దర్శకత్వం వహించిన బ్రహ్మాంజలి, జతిస్వరం, థిల్లానా అంశాలను ఒకే వేదికపై నృత్యాలను చేసి గురుభక్తిని చాటుకున్నారు. తెలుగు తేజం చినసత్యం.. తెలుగు తేజం వెంపటి చినసత్యమని వైస్ ప్రిన్సిపాల్ కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ చింతారవి బాల కృష్ణ అన్నారు. నృత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి నాట్యరంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో పాటలకు నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. కూచిపూడి నాట్యానికి దిశానిర్దేశం చేశారన్నారు. నేడు ప్రముఖ నాట్యాచార్యులు ఆయన వద్ద నృత్యంలో శిక్షణ తీసుకున్నారన్నారు నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. పద్మశ్రీ హేమంత్, ఉమామహేశ్వర పాత్రుడు, సీహెచ్ అజయ్కుమార్, రాయన శ్రీనివాసరావు, సప్తా శివకుమార్, ఉషామాధవి, యల్లాజోస్యుల అనూరాధ, చదలవాడ ఆనంద్, హిమాన్సీ చౌదరి, లలిత, వేణుగోపాల్ తదితరులు తమ బృందాలతో నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు నాట్యాచార్యుడు వెంపటి చినసత్యానికి పుష్పాంజలి సమర్పించారు. -
18న క్లీన్ ఎయిర్ థీమ్తో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 18న స్వచ్ఛమైన గాలి(క్లీన్ ఎయిర్) ఇతివృత్తంతో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల విజయవంతానికి ప్రణాళికాయుత కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పర్యావరణహిత దీపావళిని జరుపుకుందాం.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల క్లీన్ ఎయిర్ థీమ్తో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. గాలి కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ హరిత విస్తీర్ణం పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని ఐశ్వర్యంగా పొందవచ్చన్నారు. గాలి కాలుష్యం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ, సౌర విద్యుత్ వినియోగం వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. నిత్య జీవిత ప్రయాణాన్ని పర్యావరణహిత మార్గంలో సాగించేలా అవగాహన కల్పించాలన్నారు. హానికర టపాసులు కాకుండా దీపాల కాంతులతో పర్యావరణహిత దీపావళిని జరుపుకుందామని సూచించారు. అధికారులు, సిబ్బంది కూడా ఇదే బాటలో నడిచి భావితరాలకు స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను బహుమతిగా అందించడంలో భాగస్వాములమవుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సమావేశంలో డీపీవో పి.లావణ్యకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్లో స్టెరాయిడ్స్తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. -
చంద్రబాబు, లోకేష్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్లో ఉన్న జనార్థన్రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
రూ.12.48 లక్షల ఉపాధి నిధుల రికవరీకి ఆదేశాలు
మొవ్వ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల 17వ విడత సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా రూ.12.48 లక్షల రికవరీకి డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్ యాదవ్ ఆదేశించారని ఏపీఓ దేవానంద్ రాజు తెలిపారు. రూ.1.25 లక్షల జరిమానా విధించడంతోపాటు రూ.11 లక్షల పనులకు సంబంధించి మరో మారు విచారణ చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. పెదముత్తేవి గ్రామంలో పక్షవాతంతో ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స చేయించుకుంటున్న చిందా వెంకటరాజు, చనిపోయిన కంచర్ల వెంకటేశ్వరరావు, దాసరి మురళి ఇద్దరిజాబు పనులకు వచ్చినట్లు మస్టురు వేయటం, అంగన్వాడీ హెల్పర్ గండ్రపు దేవకుమారి, వెలుగు బుక్ కీపర్ మండా దివ్యభారతిని పనులకు తీసుకెళ్లడం వంటి ఘటనలు మండల స్థాయి సమావేశంలో వెలుగు చూడటంతో పెదముత్తేవి ఫీల్డ్ అసిస్టెంట్ వి.సీతారామదాసును సస్పెండ్ చేస్తూ, నిధులు రికవరీ చేయాల్సిందిగా వెలుగు చూడటంతో డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్ ప్రజా వేదికలో ఆదేశాలు జారీ చేశారు. వేములమడలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పొలాల్లో నిమ్మ మొక్కలు నాటిన రైతులు కొనకళ్ల శ్రీనివాసరావు, నారగం హరికృష్ణ ప్రసాద్కు 14 నెలలుగా మొక్కల కొనుగోలు బిల్లు చేయకపోవడంతో టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండు రోజుల్లో బిల్లు చేయాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండేటి ఇందిర, ఎస్ఎస్ఐఐటీ అడిష నల్ డైరెక్టర్ రామారావు, ఎంపీడీఓలు జె.విమాదేవి, డి.సుహాసిని, అంబుడ్స్మన్ కె.వి.శ్రీనివాసరావు, ఇన్చార్జి డీవీఓ సురేష్, ఎస్ఆర్పీ సుబ్బారావు, ఏపీఓ లక్ష్మీరెడ్డి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు
అవనిగడ్డ: జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి, మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సిమెంటుపై పది శాతం, వెదురు ఫ్లోరింగ్పై ఏడు శాతం, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకపై ఏడు శాతం జీఎస్టీ తగ్గిందని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు సంచలనాత్మక నిర్ణయమని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్, జాయింట్ కమిషనర్ జి.కల్పన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయూత పమిడిముక్కల: నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయాతనిస్తుందని కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీరంకిలాకులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. -
కలెక్టర్కు జగనన్న కాలనీల్లో సమస్యలు ఏకరవు
పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం పెడన పట్టణంలోని పలు జగనన్న కాలనీలను ఆకస్మింకంగా పరిశీలించారు. పైడమ్మ లే అవుట్ కాలనీలో వాసుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వర్షం వస్తే నడిచే పరిస్థితి లేదని, తాగునీరు సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి, ఏఈ సీతారామాంజనేయులు ఆయా సమస్యలను రాసుకుని, తాగునీటికి అదనంగా ట్యాంకులు పంపించేలా చూస్తామన్నారు. మొత్తం ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయో వివరాలను హౌసింగ్ ఏఈ మాధవి కలెక్టర్కు వివరించారు. అనంతరం సొంత స్థలాల్లో పీఎంజేఆర్ కింద నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించారు. నాలుగో వార్డు పాతపేటలో ఎ.కోటనాగేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పల్లోటి కాలనీలో పర్యటించగా, స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. పగలు పనులు నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసుకుని పెడన పట్టణానికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో నగదు, నగలు ఎత్తుకుపోతున్నారంటూ వాపోయారు. తాగునీరు రావడం లేదని, చెత్త కూడా తీసుకువెళ్లే వారు లేరని పేర్కొన్నారు. రోడ్లు కూడా లేవని, పల్లోటి ఎంట్రన్స్లో మట్టి రోడ్డు నుంచి రాలేని దుస్థితి ఏర్పడిందని, వాహ నాలు కూడా రావడం లేదని వాపోయారు. రాత్రి అయితే పాములకు భయపడుతున్నామని పేర్కొ న్నారు. తక్షణం మెయిన్ రోడ్డు నుంచి కాలనీకి వచ్చే మార్గంలో వీధిలైట్లు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యటనలో హౌసింగ్ పీడీ పోతురాజు, ఇన్చార్జి డీఈ బుచ్చిబాబు, ఏఈ మాధవి, ఇన్చార్జి తహసీల్దారు అనిల్కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
చిట్టీలు, గోల్డ్ స్కీం పేరుతో భారీ మోసం
పోలీస్స్టేషన్కు క్యూకట్టిన బాధితులు పెనుగంచిప్రోలు: పేద, మధ్య తరగతి ప్రజల ఆశను సొమ్ము చేసుకున్నాడు పెను గంచిప్రోలు గ్రామానికి చెందిన వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ వస్త్ర వ్యాపారం చేసేవాడు. ఆ తరువాత తిరుపతమ్మవారి ఆలయ సమీపంలో లక్ష్మీ దుర్గ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్ దుకాణం ప్రారంభించాడు. సమీపంలోనే అతని కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహిస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఈ క్రమంలో దుర్గారావు చిట్టీలతో పాటు గోల్డ్ స్కీం వ్యాపారం చేపట్టాడు. గ్రామాల్లో తనకు ఉన్న పరిచయాలతో బంగారం ఒక్కసారిగా కొనలేని వారు వాయిదా పద్ధతిలో నగదు కట్టి బంగారం పొందొచ్చని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన 175 మంది సభ్యులుగా చేరారు. ఒక్కొక్కరు నెలకు రూ.3 వేల చొప్పున 22 నెలలు పాటు చెల్లించాలి. ప్రతి నెలా లాటరీ తీసి విజేతలకు పది గ్రాముల బంగారం చెల్లించాలి. ఈస్కీం మే నెలతోనే పూర్తయింది. 22 మందికి లాటరీలో బంగారం ఇవ్వగా మిగిలిన వారికి 22 నెలలకు వారు చెల్లించిన రూ.66 వేలకు 10 గ్రాముల చొప్పున బంగారం ఇవ్వాలి. మరికొందరు భవిష్యత్కు ఆసరాగా ఉంటుందని అతని వద్ద రూ.లక్ష చిట్టీలు కట్టారు. మరికొందరు వడ్డీకి అప్పులు ఇచ్చారు. గడువు తీరినా డబ్బులు, బంగారం చెల్లించకపోవటంతో కొద్ది రోజులుగా దుర్గారావును బాధితులు నిలదీయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదో తేదీ రాత్రి కుటుంబంతో గ్రామం నుంచి పరారయ్యారు. దుకాణాలు మూసి వేయటంతో పాటు సెల్ఫోన్లు కూడా స్విచ్చాఫ్ కావటంతో బాధితులు రెండు రోజులుగా పోలీస్స్టేషన్కు క్యూ కడుతున్నారు. సుమారుగా రూ.5 కోట్ల వరకు అతను వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్నం చిన్నదుర్గారావుపై 32 ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అతని బాధితులు పెనుగంచిప్రోలుతో పాటు నవాబుపేట, ముండ్లపాడు, గౌరవరం, భీమ వరం గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల నుంచి గ్రామంలో వస్త్ర వ్యాపారం చేస్తూ ఎంతో నమ్మకంగా ఉన్నాడని, ఒక్కో కుటుంబంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చిన వారు ఉన్నారని, లాఖరికి పింఛన్ సొమ్ము మొత్తం ఇచ్చానని నవాబుపేట గ్రామానికి చెందిన తూమాటి విజయమ్మ వాపోయింది. తనకు రూ.4.50 లక్షలు రావాలని కన్నీటిపర్యంతమైంది. చిట్టీ పాటలు, గోల్డ్ స్కీం నుంచి తమ కుటుంబానికి రూ.8 లక్షలు రావాలని తుమాటి కృష్ణకుమారి తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
కంకిపాడు: ఇంటి నుంచి పరారైన చిన్నారులను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. విజయవాడ పటమటలోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంట్లో వాళ్ల మీద కోపంతో అలిగి స్కూల్ నుంచి నేరుగా బయటకు వచ్చేశారు. మచిలీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను కంకిపాడు పోలీసుల ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి గుర్తించారు. వారిని విచారించగా ఇంట్లో వాళ్లపై కోపంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి వారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలుకృష్ణలంక(విజయవాడతూర్పు): ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై మతోన్మాది బూటుతో దాడి, సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యలను నిరసిస్తూ జరిగిన ఈ సమావేశంలో దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. ప్రజలకు రక్షణగా ఉన్న న్యాయ, పోలీసు వ్యవస్థల్లో దళితులకు రక్షణ కరువైందన్నారు. సీజేఐ గవాయ్పై దాడి దేశ ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర పర్యటనలోనూ అవమానించారని గుర్తుచేశారు. ఐపీఎస్ పూరన్ కుమార్ సమర్థమైన పోలీసు అధికారి అని, కుల వివక్ష వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. దళితులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వివక్ష కొనసాగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి పూరన్కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత, తెలుగు రాష్ట్రాల్లోను దళిత, గిరిజనులపైన దాడులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని జాతీయ నేర గణాంక బ్యూరో నివేదిక వెల్లడిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, న్యాయవాదులు పిచ్చుక శ్రీనివాస్, అశోక్, జైభీమ్ జైభారత్ పార్టీ నాయకుడు కొండలరావు, ఆమ్ఆద్మీ నాయకుడు నేతి మహే శ్వరరావు, ఐఏఫ్టీయూ నాయకుడు రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.క్రాంతికుమార్ మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఎస్సీ, ఎస్టీ సంఘాలన్నీ గవర్నర్కు అర్జీ ఇవ్వాలని రౌండ్టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. -
పీఎం సభకు కమర్షియల్ టార్గెట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘వారి ప్రచారం మా చావుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేదు. రాజకీయ ప్రచార సభకు మమ్మల్ని జనాలను పోగేయమంటున్నారు. ఇదెక్కడి తలనొప్పి మాకు?’ అంటూ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కర్నూలులో సభ నిర్వహిం చనున్నారు. ఈ సభకు వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఈ టార్గెట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ప్రధాని సభకు తాము జనాలను పోగే యటం ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా అధికారులపై ఒత్తిడి ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రెండు వేల మంది వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ–1, విజయవాడ –2, విజయవాడ–3 డివిజన్లకు సంబంధించి 17 సర్కిళ్ల కార్యాలయ అధికారులకు ఈ మేరకు వాట్సాప్ గ్రూప్లతో పాటుగా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్లను నిర్వహించి మరీ టార్గెట్లు పెడుతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి సభకు వచ్చే వ్యాపారుల పేర్లు, వారి వివరాలను సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని నాలుగైదు రోజులుగా తమపై ఒత్తిడి పెట్టారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో అర్థంకాక ప్రభుత్వంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రచార బాధ్యతలు వారిపైనే సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేప ట్టింది. ఆ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవర్గాలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. ఆ వర్గాలకు అవసరమైన జీఎస్టీ తగ్గింపు, శ్లాబ్ల మార్పు తదితర సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇవ్వాలి. ఈ కార్యక్రమాల అనంతరం ఆ ఫొటోలను స్థానిక సచివాలయ సిబ్బంది ఆప్లోడ్ చేయాలి. అయితే ప్రభుత్వం నిర్దేశించినా ఆయా వర్గాలు ఈ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో నిర్వహించడం లేదు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ అధికారులే కార్యక్రమాలను చేపడుతున్నారు. వారే విద్యాసంస్థలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎవరో చేయాల్సిన కార్యక్రమాలను సైతం తమతో చేయించటం ఏమిటంటూ రాష్ట్ర స్థాయి అధికారుల తీరుపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో లేని అధికార యంత్రాంగం వాణిజ్య పన్నుల శాఖలో 15 రోజులుగా అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏ సర్కిల్ కార్యాలయానికి వెళ్లినా అధికారులు ఏదో ప్రచారంలో ఉన్నారని, లేదా పాఠశాలలో పోటీలు నిర్వహించటానికి వెళ్లారని ఆ కార్యాలయాల్లో ఉంటున్న ఒకరిద్దరు సిబ్బంది వ్యాపారులకు చెప్పి మళ్లీ రావాలంటూ తిప్పి పంపుతున్నారని పలువురు చెబుతున్నారు. 15 రోజులుగా తమను ఉన్నతాధికారులు ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, పోటీల పేరుతో కార్యాలయాలకు దూరంగా ఉండటంతో చాలా పనులు పెండింగ్లో పడిపోయాయంటూ వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్ల మార్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే దానిని తమ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం, ధరలన్నీ తగ్గిపోయాయని ఊదరగొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత ప్రచారం నిర్వహించినా ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా అధికారుల టెలికాన్ఫరెన్స్ సమావేశాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు వ్యాపారుల తరలింపు బాధ్యతలు అప్పగించడంతో ‘ఇదెక్కడి తలనొప్పి’ అంటూ ఉమ్మడిజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. -
చంద్రబాబువి కుట్రపూరిత రాజకీయాలు
● డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్న కూటమి నేతలు ● మాజీ మంత్రి వెలంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వెలం పల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ మద్యం కేసు బనాయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంగళవారం వారు జోగి రమేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు పాత ఏఎన్నార్ బార్, నూతన బార్ సమీపంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం, మద్యం డంపింగ్పై చర్చించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎకై ్సజ్ శాఖ దాడుల్లో టీడీపీ నేతలు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు నేరుగా దొరికినప్పటికీ ఆ నేరాన్ని జోగి రమేష్కు ఆపాదించాలని చూడటం దారుణమన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం పట్టుబడిన రోజునే జోగి రమేష్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. అక్రమ మద్యం తయారీ కేంద్రం పరిశీలించినందుకు జోగి రమేష్, మరికొంతమంది నాయకులపై ఆరోజు కేసులు నమోదు చేశారని, ఇప్పుడు తయారీ సూత్రధారి జోగి రమేష్గా జనార్దనరావుతో చెప్పించడమంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన గాలికొదిలేసిన కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్తో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
డిసెంబరు 27న కూచిపూడి కళావైభవం
గుడ్లవల్లేరు: పశువుల్లో వచ్చే వ్యాధులతో పాటు పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా పశు వైద్యాధికారి ఎన్.సి.హెచ్. నరసింహులు సూచించారు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుల వారి కార్యాలయంలోని మీటింగ్ హాల్లో మంగళవారం కృష్ణాజిల్లా పశు సంవర్ధక సహాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పశుసంవర్ధక సహాయకులకు శాఖాపరమైన విషయాలపై అవగాహన కలిగించారు. జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు జాబ్ చార్ట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలు, ప్రభుత్వ స్కీములు నిర్వహించే విధానం వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ గుడివాడ డివిజన్ ఉప సంచాలకుడు డాక్టర్ సి.శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ఎన్జీవో డాక్టర్ సాహిల్, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, వైద్యులు డాక్టర్ ఎం.జగన్నాధరావు, డాక్టర్ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నందిగామ రూరల్: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కాజ్వేపై వరద పోటెత్తినా ఓ వ్యక్తి కర్ర సాయంతో వైరా కట్టలేరును దాటేందుకు యత్నించాడు. అధికారులు స్పందించి రాకపోకలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీ ఘటనలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుంటూరుజిల్లా, చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్ను నిందితుడిగా గుర్తించారు. అతను గతంలో పలు మార్లు రైళ్లు, రైల్వేస్టేషన్ల అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. నిందితుడు ఫణేంద్రకుమార్ మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు చోరీ కేసులకు సంబంధించి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
ఆక్రమణ చెరలో బస్ షెల్టర్
మంగళగిరి టౌన్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని నిడమర్రులో ఓ ప్రభుత్వ స్థలంలో బంధువుల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. 1978లో పాములపాటి రంగారెడ్డి, వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన శివారెడ్డి దీన్ని నిర్మింపజేశారు. 2024 జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చాక బస్ షెల్టర్ ఏర్పాటు చేసిన వారి బంధువులు దానిని టీడీపీ కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని తొలగించి, మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు. -
‘కూటమి కల్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారు’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు. ‘ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధి రాదని అర్థమైంది’ -
విద్యార్థులను కొట్టిన ఘటనపై ఎంపీడీఓ విచారణ
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులపై టీచర్ దాడి చేసిన ఘటనపై ఎంపీడీవో శకుంతల విచారణ చేపట్టారు. ఈనెల 11న ‘విద్యార్థులను చితకబాదిన టీచర్’ కథనం ‘సాక్షి’లో వెలువడింది. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ సోమవారం పాఠశాలలో విచారించారు. విద్యార్థులను పిలిపించి టీచర్ కొట్టిన అంశంపై ఆరా తీశారు. టీచర్ చెప్పిన మాట వినలేదని లావు కర్రతో అందరినీ కొట్టిందని ఎంపీడీవోకు విద్యార్థులు తెలిపారు. ఆరోజు తరగతి గదిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయురాలు రజని మాత్రం తాను కొట్టలేదని, పిల్లలు చెప్పేది అంతా అబద్ధమని చెప్పారు. దెబ్బలు తిన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీలు తీసుకోవద్దని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఎంపీడీవో సూచించారు. పీజీఆర్ఎస్లో పెట్టిన ఫిర్యాదుపై మరో విచారణ జరగాల్సి ఉంది. ఎంఈఓ సీహెచ్ పుష్పలత, హెచ్ఎం బేబీరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సారూ...మా కాలనీ రోడ్లు బాగు చేయండి!
జి.కొండూరు: ‘‘సారూ...మా కాలనీలో రోడ్లు అధ్వానంగా మారి కాలు బయట పెట్టలేకపోతున్నాం. మురుగునీరు పోయే దారిలేక ఇళ్ల మధ్యలోనే నిలుస్తున్నాయి. ఈగలు, దోమలతో నరకయాతన పడుతున్నాం’’ అంటూ జి.కొండూరు జగనన్న కాలనీ వాసులు కలెక్టర్ లక్ష్మీశ వద్ద సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు కీస్ హ్యాండోవర్ ప్రోగ్రాం నిర్వహణ కోసం జి.కొండూరు జగనన్న కాలనీని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ సమస్యలను కలెక్టర్ వద్ద ఏకరువు పెట్టారు. వర్షం పడితే బయటకు రావాలంటే నరకం కనపడుతోందని, రోడ్లు బురదతో అధ్వానంగా ఉండడంతో పాఠశాల బస్సులు కాలనీలోకి రావడం లేదని వాపోయారు. జాతీయ రహదారి వరకు బురదలో నడిచి వెళ్లి పిల్లలను బస్సులు ఎక్కించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మురుగునీరు నిలిచి ఈగలు, దోమలతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు కరెంటు మీటర్ల ఏర్పాటుకు డబ్బులు చెల్లించలేదని, వీధి లైట్లు, పంచాయతీ బోర్లకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. అసలే ఊరికి దూరంగా ఉన్న కాలనీకి వీధిలైట్లు లేకపోతే రాత్రి సమయంలో మహిళలు బయటకు ఎలా రావాలని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలిపివేతపై విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. కాలనీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని, ఓపిక పట్టాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో రహదారులు బాగు చేయాలని కలెక్టర్కు వినతి -
18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జరగనున్న చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెకుముకి సైన్స్ సంబరాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసీ్త్రయ సమాజం ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన జేవీవీ గత 35 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సంబరాలు ఉపయోగపడతాయన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సంబరాలు నాలుగు స్థాయిల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న పాఠశాల స్థాయిలో, నవంబర్ 1న మండల స్థాయి, నవంబర్ 23న జిల్లా స్థాయి, డిసెంబర్ 12,13,14 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. ఈ సంబరాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావంతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి బోయి రవి, నాయకులు మురళీమోహన్, వెలగా శ్రీనివాస్, శోభన్ కుమార్, రాజశేఖర్, లెనిన్బాబు పాల్గొన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు అల్ట్రా సౌండ్, మామోగ్రామ్ వంటి పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్లో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ వైద్య పరీక్షలు ప్రతి సోమవారం, గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తారని, ప్రతి మంగళ, శుక్రవారం క్షేత్రస్థాయిలో సంచార వాహనం ద్వారా ౖచేస్తారని వివరించారు. జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వైద్యులు పాల్గొన్నారు. -
పట్టించుకోని పోలీసులు..
గ్రామాల్లో బెల్టు షాపులకు కల్తీ మద్యం సరఫరా అవుతోందని సాక్షాత్తూ మద్యం ప్రియులు అంటు న్నారు. ఆ మద్యం తాగుతుంటే నరాలు పనిచేయటం లేదని చెబుతున్నారు. కనీసం కల్తీ మద్యాన్ని పట్టుకునేందుకు అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. టీడీపీ నాయకులకు భయపడి ఉద్యోగాలు చేస్తున్నారు. రానున్న కాలంలో కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. – షేక్ షహనాజ్ బేగం, ముస్లిం మైనార్టీ నాయకురాలు, వీరులపాడు మండలం -
అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ... పీజీఆర్ఎస్ అర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని చెప్పారు. సరైన విధంగా ఎండార్స్మెంట్లు ఇవ్వాలని, అర్జీదారులతో అధికారుల ప్రవర్తన విషయంలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. మార్గదర్శకాలు పాటించడంలో ప్రవర్తన పరంగా కొందరు అధికారులలో లోపాలు కనిపిస్తున్నాయని.. వీటిని సరిదిద్దుకోవాలన్నారు. వీటిని సరిదిద్దుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల ఆడిటింగ్ సక్రమంగా పూర్తి చేయాలని, సమస్య పరిష్కార అధికారి (గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అథారిటీ) స్వయంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని చెప్పారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి ఫీడ్ బ్యాక్ను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారికి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 153 అర్జీలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం 153 అర్జీలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 52 అర్జీలు, విజయవాడ నగరపాలక సంస్థకు 19, పోలీస్ 18, డీఆర్డీఏ 10, పంచాయతీరాజ్ శాఖ 9, రవాణాశాఖకు 8, ఆరోగ్యశాఖకు ఏడు అర్జీలు వచ్చాయన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్ట్ ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈల్లో నూతన ఉత్తేజం వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. భవానీపురంలోని పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయన్నారు. జిల్లాలో 67 శాతం వాటా కలిగిన సేవా రంగం మరింత అభివృద్ధికి జీఎస్టీ సంస్కరణలు దోహదం చేస్తాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్లో రోజువారీ లక్కీ డ్రాలతో పాటు మెగా డ్రా తీస్తామని అన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయని చెప్పారు. స్థూల విలువ జోడింపు (జీవీఏ), తలసరి ఆదాయం పెరుగుదలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయని తెలిపారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఫుడ్ స్టాల్స్, ఫన్ గేమ్స్ వంటివి ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓ ఎం.లక్ష్మీనరసింహం, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల అధికారి పి.మధు, డీఈఓ యూవీ సుబ్బారావు, ఎల్డీఎం కె.ప్రియాంక పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 72 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఆస్తి తగాదాలు, భూవివాదాలకు సంబంధించి 41, కుటుంబ కలహాలపై 4, కొట్లాటలపై 1, వివిధ మోసాలపై 3, మహిళల సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 2, చిన్న వివాదాలపై 15 ఇలా మొత్తం 72 ఫిర్యాదులు అందాయి. -
ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం లక్ష్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే ప్రతి భక్తుడికి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూడాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ఇంజినీ రింగ్, ఏఈవోలు, సూపరింటెండెంట్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి ఆలయానికి చెందిన ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. దసరా ఉత్సవాలలో సిబ్బంది పని తీరు, సహనాన్ని ప్రతి ఒక్కరూ గమనించారని, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అదే తీరులో రానున్న కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలలో భక్తులకు మరింత సేవలు అందించాలని సూచించారు. రానున్న ఉత్సవాలలో ఎక్కడ అలక్ష్యం జరిగినా సహించేది లేదన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలన్నారు. 66 అంశాలపై చర్చ సమీక్ష సమావేశంలో ఆలయంలో చేపట్టాల్సిన మార్పులు, అభివృద్ధి పనులకు సంబంధించి 66 అంశాలను గుర్తించి, వాటి గురించి చర్చించారు. కనకదుర్గనగర్లో దేవస్థానానికి చెందిన భవనాలను కాటేజీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అన్నదానం, లడ్డూ పోటు, క్యూ కాంప్లెక్స్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కొండపై దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలను భక్తులందరికీ అందు బాటులో ఉండేలా కనకదుర్గనగర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి మొబైల్ ఫోన్లతో భక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి వచ్చే భక్తులు, ఆర్జిత సేవల్లో పాల్గొనే ఉభయదాతలందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఈఈ రాంబాబు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్బాబు, సుధారాణి, గంగాధర్, తిరుమలేశ్వరరావు, శ్రీనివాస్, వైదిక కమిటీ సభ్యులు ఆంజనేయ ఘనాపాటి, శ్రీధర్శర్మ తదితరులు పాల్గొన్నారు. దుర్గ గుడి ఈవో శీనానాయక్ కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
● జంక్షన్ జలమయం
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో హనుమాన్జంక్షన్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సుమారు మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. హనుమాన్జంక్షన్ ప్రధాన కూడలిలో వర్షపు నీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నూజివీడు రోడ్డు, గుడివాడ రోడ్డులో డ్రెయినేజీ పొంగిపొర్లటంతో దుకాణాల్లోకి నీళ్లు వచ్చాయి. విజయవాడ రోడ్డులో వేలేరు క్రాస్రోడ్డు నుంచి పాల శీతల కేంద్రం వరకు రహదారి కాలువను తలపించింది. బాపులపాడు, మహాత్మగాంధీ నగర్, తారకరామ కాలనీ, బండారుగూడెం, పెరికీడు గ్రామాల్లోనూ అంతర్గత రహదారులన్నీ జలమయమయ్యాయి. –హనుమాన్జంక్షన్ రూరల్ -
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జనార్ధన్తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం!
ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. ఉద్యోగాలు అయినా ఇప్పించండి, నగదు అయినా ఇవ్వండి అని బాధితులు మోసగాడిని నిలదీయడంతో వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.... యూ ట్యూబర్ కావడి కృష్ణ గతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అమరావతి సచివాలయం ప్రాంతంలో నివశిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు, బొకేలు అందించే ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 మందిని మాయలో పడేశాడు. వారి వద్ద సుమారు రూ.40 లక్షలు వరకు వసూలు చేశాడు. స్టేషన్కు వచ్చిన ఐదుగురి బాధితులు రూ.10.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు అడుగుతుంటే నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం):అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రమైన గాయాలయ్యాయి. మండలంలోని మూలపాడు గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు... కంచికచర్లకు చెందిన ఐలపోగు కాటయ్య, తిరుపతిరావు కలసి నున్న గ్రామంలో పాలాలకు సరిహద్దు రాళ్లు పాతే పనులకు వెళ్లారు. పనులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మూలపాడు వద్దకు చేరుకునే సమయానికి విజయవాడ వైపు నుంచి దూసుకొచ్చిన కారు వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఐలపోగు కాటయ్యకు తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహన సిబ్బంది బాధితులను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో సమీపంలోని ఓప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ రాజు బాధితులు, కారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అద్వితీయ ఉపాధ్యాయుల కార్ఖానా అవనిగడ్డ
అవనిగడ్డ:అద్వితీయ ఉపాధ్యాయులను తయారుచేసే కార్ఖానాగా అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందని తెలిపారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1208 మంది ఉద్యోగాలు సాధిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలోనే 275 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించటం గర్వకారణం అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడతూ డీఎస్సీ ఉపాధ్యాయులకు దీపావళి ముందే వచ్చిందన్నారు. ఎన్నొ నిద్రలేని రాత్రులు గడిపి ఏళ్ళ తరబడి శ్రమించి టీచర్ పోస్టులు సాధించిన వారు అదృష్టవంతులు అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, ప్రగతి డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పూర్ణచంద్రరావు, విద్యానికేతన్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంఈఓలు, జీఎన్బీ గోపాల్, టీవీఎం రామదాసు, శివశంకర్, నాంచారయ్య, శ్రీకాంత్, అన్నపరెడ్డి పిచ్చయ్య, పి.వెంకటేశ్వరరావు, ఏవీ రమణ, మోమిన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, డీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ పెరుమాళ్ళు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, పీఆర్టీయూ జిల్లా నాయకులు వి.వి.ఎస్.ఆర్.వర్మ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడిలో బాలుడి కిడ్నాప్ కలకలం!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తప్పిపోయిన బాలుడిని ఎవరో గుర్తుతెలియని యువకులు కిడ్నాప్ చేశారంటూ దుర్గగుడిలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరకు బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిపై ఆదివారం చోటు చేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య తన కుమారుడైన శశి వజ్ర ఆరూష్, మరి కొంత మంది బంధువులతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. మహా నివేదనకు ముందు బాలుడు తప్పిపోగా, తల్లి కుటుంబ సభ్యులు మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అయితే మహా మండపం లిప్టు వద్ద ఆ బాలుడిని ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళుతుండగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ఆర్వీ.సత్యనారాయణ గుర్తించి ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో ఆ బాలుడిని తీసుకుని సత్యనారాయణ నేరుగా ఈవో చాంబర్కు వెళ్లి శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు విషయం తెలియజేశారు. అయితే దర్శనానికి వచ్చిన బాలుడిని కిడ్నాప్ చేశారంటూ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అందరూ ఒక సారిగా ఉలిక్కిపడ్డారు. క్యూలైన్లో ఉన్న భక్తులు తమ బిడ్డలు పక్కనే ఉన్నారో లేదో పరిశీలించుకున్నారు. కొంత సమయం తర్వాత బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించామంటూ ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో భక్తుందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34) పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ తీసుకుని ఇద్దరూ అద్దెకు ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి -
సుబ్బారాయుడికి రూ. 8.26లక్షల ఆదాయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి ఒకరోజు ఆదాయం రూ.8,26,626 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.50,239, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.50,712, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 24,680, లడ్డూ, పులిహోర ద్వారా రూ. 1,12,225, దర్శన రుసుం ద్వారా రూ.63,100, సేవా టికెట్ల ద్వారా రూ. 5,18,380తో పాటు ఇతర సేవా టికెట్లతో కలిపి మొత్తం రూ.8,20,626 దేవస్థానానికి ఆదాయం వచ్చినట్లు వివరించారు. కిక్కిరిసిన ఆలయం.. తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆదివారం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పలు పారామెడికల్ పోస్టుల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ మెకానిక్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. ఎంపికలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుకోసం http://gdchvja.inను సంప్రదించవచ్చునని సూచించారు. పర్యాటకులతో సాగరతీరం కళకళ కోడూరు: హంసలదీవి సాగరతీరంలో పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ప్రత్యేక వాహనాల్లో తీరానికి తరలివచ్చారు. సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, విజయవాడ, గుడివాడకు చెందిన పర్యాటకులు తీరంలో కనిపించారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ చేపట్టారు. తిరుపతమ్మకు బంగారు కాసులపేరు పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి ఆదివారం బాపట్ల జిల్లా, రేపల్లె మండలం, నల్లూరిపాలెం గ్రామానికి చెందిన నలకుర్తి రాజేష్బాబు, లక్ష్మీతిరుపతమ్మ దంపతులు రూ.2లక్షలు విలువైన బంగారు కాసులపేరు ను ఆలయ ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘కె–ర్యాంప్’ లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కె–ర్యాంప్ అని ఆ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుండగా, చిత్ర పమోషన్లో భాగంగా కె–ర్యాంప్ యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఆదరించాలని కోరారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు కొండపల్లి ఎన్టీటీపీఎస్ బి కాలనీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరగనున్న మహాసభల్లో తొలిరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి నరసింహారావు పతాక ఆవిష్కరణ చేశారు. డేవిడ్ చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై చర్చించారు. భవిష్యత్తులో కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మామిడి శీతారామారావు, కార్యదర్శి యం.మహేష్, కోశాధికారి వాసుదేవన్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ మురళీమోహన్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ఎన్సీహెచ్ సుప్రజ, మైలవరం కార్యదర్శి సుధాకర్, ఇర్ల కొండలరావు పాల్గొన్నారు. సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు ప్రారంభం -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. హరిప్రసాద్, ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం తదితరులున్నారు.ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఇబ్రహీంపట్నం: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పరిసర గ్రామాల్లో యాచక వృత్తి చేసుకునే వ్యక్తి కాచవరం కరుణా హెల్త్ సెంటర్ సమీపంలో 65 నెంబర్ హైవే దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటాయి. ఎత్తు 5.5 అడుగులు, నలుపు రంగు ఫుల్హ్యాండ్ టీషర్ట్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.. వీఆర్వో జయదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్ సీఐ చంద్రశేఖర్, 9440627084, ఎస్ఐ రాజు 98661 14556 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీ ఢీకొని ముఠా కార్మికుడు.... గన్నవరం: లారీ ఢీకొని ముఠా కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన కొత్తపేట వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొండపావులూరు శివారు ముదిరాజుపాలెం గ్రామానికి చెందిన గోనేపల్లి రాధాకృష్ణ (47) గన్నవరంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఠా పని నిమిత్తం వెళ్లేందుకు సైకిల్పై కొత్తపేట వద్ద జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక టైర్లు కిందపడి రాధాకృష్ణ తల భాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. తూములో ఇరుక్కొని దివ్యాంగుడు... తిరువూరు: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి చెరువు తూము లాకులు ఎత్తుతుండగా నీటి ఉద్ధృతికి దివ్యాంగ రైతు ఆదివారం మృతి చెందిన సంఘటన ఏకొండూరు మండలం కొండూరు తండాలో జరిగింది. తండాకు చెందిన గిరిజన దివ్యాంగ రైతు భూక్యా గోపయ్య (43) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తూము గేటు లాకులు సరిగా లేకపోవడంతో తూములో ఇరుక్కుపోయాడు. ఊపిరాడక తూములోనే గోపయ్య మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుక్క అడ్డురావడంతో... షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (35) పట్టణం నుంచి ద్విచక్ర వాహనంపై షేర్మహ్మద్పేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో కుక్క అడ్డురావటంతో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవటంతో గమనించిన స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్నాయుడు
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్నాయుడు(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్) ఎన్నికయ్యారు. సొసైటీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్(జేపీ పబ్లికేషన్స్), కార్యదర్శిగా కె.లక్ష్మయ్య (ప్రజాశక్తి బుక్హౌస్), సహాయ కార్యదర్శిగా ఎ.బి.ఎస్.సాయిరామ్(సహస్ర బుక్స్), కోశాధికారిగా కొండపల్లి రవి (నవసాహితి బుక్ హౌస్).. సభ్యులుగా జి.లక్ష్మి, గోళ్ల నారాయణరావు, విశ్వేశ్వరరావు, శిరం రామారావు (వీజీఎస్), బి.రవికుమార్, బి.వి.బసవరాజు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాసరావు, ఎన్.ఎస్.నాగిరెడ్డి, పి.సుబ్రహ్మణ్యం, వల్లూరి శివప్రసాద్, కె.సత్యరంజన్, చలపాక ప్రకాష్ ఎన్నికయ్యారు. పల్లవి పబ్లికేషన్స్ అధినేత ఎస్.వెంకటనారాయణ, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. -
తూర్పు కాపులందరికీ ఓబీసీ వర్తింపజేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రాంతం మారినంత మాత్రాన కులం మారదని, తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్ అమలయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో తూర్పు కాపులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రమోహన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకుల అప్పల సూరినాయుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్గా గిరడా అప్పలస్వామి ఎన్నికయ్యారు. 17 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర మహిళా విభాగాన్ని, యువజన విభాగాలను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన మహంతి వాసుదేవరావును ఎన్నుకున్నారు. జాతీయ గౌరవాధ్యక్షుడు పి.గిరీశ్వరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ, చంద్రరావు, ఉమామహేశ్వరరావు, బలగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్లో యోగా చాంపియన్షిప్ పోటీలు
మొగల్రాజపురం/పటమట:(విజయవాడ తూర్పు): డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లాలో 6వ యోగాసన చాంపియన్ షిప్ 2025–26 (సబ్ జూనియర్స్) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. స్థానిక టీచర్స్ కాలనీలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 10 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు హాజరవుతారని చెప్పారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి 5, 6, 7, 8 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళతారని తెలిపారు. గత నెల 28, 29, 30 అక్టోబర్ 1 తేదీల్లో విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో జరిగిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు. హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి.ప్రసూనకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.సుజాతకు రజిత పతకం దక్కిందని చెప్పారు. 2032లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, 2036లో జరిగే ఒలింపింక్ గేమ్స్లో ఏపీ నుంచి క్రీడాకారులను పంపి స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. ఏపీ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, మేనేజర్ బెనర్జీ పాల్గొన్నారు. నేటి నుంచి యోగా పోటీలు... ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు– 2025–26 అమరావతిలో విట్ యూనివర్శిటీలో జరుగుతాని వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ గేమ్స్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో యోగాసనా భారత్ , యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయనిర్ణేతలు, టెక్నికల్ ఆఫీషియల్స్ను పంపించి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకట రామకృష్ణ ప్రసాద్ -
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేవాంగ సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందన్నారు. అటువంటి సామాజిక వర్గానికి వీలైనంత త్వరగా కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. చేనేతలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ.. దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నారు. సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయ లక్ష్మి, జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దాం
హెరిటేజ్ వాక్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ చరిత్రను ఇక్కడి యువత తెలుసుకోవడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాచ్) ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నగరంలో ఆదివారం జరిగింది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. అనంతరం మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్లో ఉన్న గుహలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం ఇలాంటి వాక్లను నిర్వహించి యువతను ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం చేయాలన్నారు. ‘సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ నినాదంతో.. చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ మొగల్ చక్రవర్తులు మచిలీపట్నం వెళ్తూ ఇక్కడ గుహలను నిర్మించారన్నారు. ఇన్టాచ్ సంస్థ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచంలోని అతి పెద్ద వారసత్వ పరిరక్షక సంస్థల్లో ఒకటిగా ఉందన్నారు. ఇన్టాచ్ విజయవాడ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ ‘ది సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద మొదలైన వాక్ మధుచౌక్ దగ్గర ఉన్న నటరాజ స్వామి గుహల వరకు సాగింది. అక్కడ నుంచి వాహనాల్లో నగరంలోని గాంధీ హిల్, అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లిలోని గుహలతో పాటుగా ప్రకాశం బ్యారేజ్, బందరు, ఏలూరు కాలువలను సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. -
వైద్యుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ముత్యాలంపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు చేపట్టిన సమ్మెను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. దీనివల్ల ప్రతి రోజు లక్షలాది మంది రోగులకు సకాలంలో వైద్యసేవలు అందటం లేదని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వైద్యసేవల కోసం ఎక్కువగా తీవ్ర అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంవల్ల అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కారయదర్శి డాక్టర్ ఎం.ప్రభుదాస్ మాట్లాడుతూ ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వైద్యుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ -
కొనసాగుతున్న పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటున్నారు. అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు.తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్బాండ్ పదోన్నతులు, స్కేల్స్ వర్తింపు వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిలే దీక్షల్లో అసోసియేషన్ నాయకులు డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ రవీంద్రనాయక్, డాక్టర్ గోపినాథ్, డాక్టర్ కిషోర్తో పాటు, వందలాది వైద్యులు పాల్గొన్నారు.నేటి నుంచి సిబ్బంది నిరసన..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, సెకండరీ హెల్త్ సెంటర్స్లోని వైద్య సిబ్బంది సోమవారం నుంచి వైద్యులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకానున్నారు. లంచ్ సమయంలో సమావేశాలు, నిరసనలు తెలిపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైద్యులతో పాటు, వైద్య సిబ్బంది కూడా నిరసనలో పాల్గొంటారని డాక్టర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. -
అద్దేపల్లి ఫోన్ అదృశ్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో కరకట్ట బంగ్లా డైరెక్షన్తో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావుకు టీడీపీ పెద్దలతో లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయోనని ముఖ్యనేతలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ తరహాలో విస్తరించిన నేపథ్యంలో జనార్దనరావు నోరు తిప్పితే తమ కొంప కొల్లేరు అవుతుందని ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు.నకిలీ మద్యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారు. జనార్దనరావు తమ డైరెక్షన్లో లొంగిపోయేలా డ్రామాకు తెర తీశారు. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంలో కరకట్ట బంగ్లాకు నెల వారీగా రూ.కోట్లాది ముడుపులు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావు ఫోన్ తాజాగా అదృశ్యమైంది. జనార్దనరావును అరెస్టు చేసిన తరువాత ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్పోర్టులో పోయిందని చెప్పినట్లు కట్టుకథ అల్లారు. లొంగిపోయే వరకు టచ్లోనే..! అద్దేపల్లె జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేశారు. అందులో వెల్లడైన విషయాలను వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారు. దీనినిబట్టి కరకట్ట బంగ్లాతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. జనార్దనరావు ఫోన్ దొరికితే పలువురు టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు, ఫోన్ సంభాషణలు వెలుగు చూస్తాయని ముందు జాగ్రత్తగా మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే వరకు టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే కేసును నీరుగార్చే కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లే సమయంలో మైలవరం ప్రజాప్రతినిధి బావ మరిదికి అద్దేపల్లి జనార్దనరావు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ
విజయవాడ తమ సమస్యలను పరిష్కరించకపోతే ‘పవర్’ ఏమిటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఏపీ విద్యుత్ జేఏసీ.. రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో ఉద్యమానికి సిద్ధమైంది విద్యుత్ సిబ్బంది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లు చేస్తుంది విద్యుత్ జేఏసీ. విద్యుత్తు యాజమాన్యాలు, ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా పరిష్కారం రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 15వ తేదీ నాటికి తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనడానికి అరవై వేలమంది విద్యుత్ సిబ్బంది సన్నద్ధమైంది. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి విద్యుత్ సిబ్బంది వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ» కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.» విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి.» జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్మెన్గా పదోన్నతి కల్పించాలి.» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.» పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి.» ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.» అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీలలో నియమించాలి. » 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.» పర్సనల్ ‘పే’ని ఎన్క్యాష్మెంట్ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవుతో కలిపి పేమెంట్ చేయాలి.» విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్లను నిర్వహించాలి.ఇదీ చదవండి: మా ‘పవర్’ ఏమిటో చూపిస్తాం! -
సౌత్జోన్ ఖోఖో పోటీలకు జట్లు ఎంపిక
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఖోఖో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే పురుషులు, మహిళల రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలక్షన్స్కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 120మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన పురుషులు, మహిళల జట్లకు 15మంది చొప్పున క్రీడాకారులను, స్టాండ్ బైగా మరో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు శిక్షణ అనంతరం కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో ఈ 24 నుండి 26వతేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టిఎస్ఆర్కె. ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ క్రీడాకారులను జాతికి అందించే దిశగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ గరటయ్య తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడక ప్రసాద్, సత్యప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఖాసీ, రవిబాబు, గిరిప్రసాద్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్ల వివరాలు.. పురుషుల జట్టు: ఆర్.సునీల్నాయుడు, కుంభా నరేష్, ఎన్ఎస్.రాజు, వై.సుధీర్కుమార్, ఎస్కె.మహమ్మద్, ఐ.ఎలియా(ప్రకాశం), ఎస్కె.మహబుబ్(కర్నూల్), కోడూరి కొండలరావు(కృష్ణా), బి. కిరణ్(వైజాగ్), జి.సంతోష్(అనంతపురం), వి.భానుప్రకాష్(విజయనగరం), కె.శివశంకర్(తూర్పుగోదావరి), కె.ప్రవీణ్(శ్రీకాకుళం), పి.వరుణ్(చిత్తూరు), వై.అశిష్(నెల్లూరు). మహిళల జట్టు: పి. చంద్రఅనూష, జి.పావని (పశ్చిమ గోదావరి), పి.హేమ, బి.శిరీష(విశాఖపట్నం), ఎస్.పావని, వి. శశికళ, ఆర్.యశోద, ఎం.సఖీయా, వి.నాగమల్లేశ్వరి(ప్రకాశం), కె. కుమారి, కె.ఉర్ధవ(కృష్ణా), బీ. గుణవతి, పి.అమృత(శ్రీకాకుళం), జె.శ్రావణి(విజయనగరం), కె.కీర్తన(చిత్తూరు). -
ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే
పామర్రు: పేదలకు మెరుగైన వైద్యసేవలను అందించే విషయంలో సీఎం చంద్రబాబుకు అడుగుముందుకు పడటం లేదనే విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారని మాజీఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం వాల్ పోస్టర్ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో తనపార్టీ శ్రేణులకు లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేపట్టి సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో ఐదు కళాశాలలు పూర్తి చేశారని గుర్తుచేశారు. మరో మూడు కళాశాలల పనులు తుదిదశకు చేరుకున్నాయని వివరించారు. ఈ మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేస్తే వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన సీఎం చంద్రబాబుకు ఆపనులను పూర్తి చేయడానికి మనస్సు రావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆ మూడు మెడికల్ కాలేజీల్లో అన్ని సదుపాయాలు సమకూర్చినా తుదిదశ పనులు చేసి ప్రారంభించేందుకు చంద్రబాబు భయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ఇష్టం లేకనే వాటిని పార్టీశ్రేణులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పునారాలోచించి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈనెల 25న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని అనిల్కుమార్ తెలిపారు. ఆయా ర్యాలీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజాసంఘాలతోపాటు ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వ అనుమాష చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, తాడిశెట్టి శ్రీనివాసరావు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, నడకుదురు రాజేంద్ర, కూసం పెద వెంకటరెడ్డి, గవాస్కరరాజు, నవుడు సింహాచలం, సజ్జా సుబ్రమణ్యం, నత్తా రవి, అజీజ్, తిరుమలశెట్టి వాసు, దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. కై లే అనిల్కుమార్ డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు పామర్రుకు చెందిన బాలిరెడ్డి మాణిక్యమ్మ(65) మరో ముగ్గురితో కలిసి వంట పనులు చేసేందుకు దుర్గాపురంలోని శివాలయం వద్దకు వచ్చారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్న మాణిక్యమ్మను విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్సనిమిత్తం అదే కారులో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రైతుల కష్టం నీటిపాలు
కంకిపాడు: ఖరీఫ్ సాగుచేపట్టిన రైతులను కష్టాలు వీడటం లేదు. వరుసగా వస్తున్న వరదలకు రైతులు కుదేలవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో స్పందించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరుస వరదలతో ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే కూడా చేపట్టలేదు. దీంతో పరిహారం అందుతుందా? లేదా? అన్న సందేహాలు రైతుల కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ వెంబడి ప్రధానంగా ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా పసుపు, అరటి, కంద, పూలతోటలు, కూరగాయల తోటలు, తమలపాలకు ఇతర పంటలు సాగవుతున్నాయి. లక్షలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సంరక్షించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద ముంచుకొచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి తిరిగి సాగుకు ఉపక్రమించారు. ఈ ఏడాది మేలో అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో 64.3 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. తాజాగా కృష్ణానదికి మరోమారు వరద వచ్చి పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న వివిధ రకాల ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఈ దఫా రోజుల తరబడి పంట పొలాల్లో వరదనీరు నిలిచిపోవటంతో మొక్క దశలో ఉన్న పసుపు, కంద, కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పంటపై పెట్టిన పెట్టుబడులు కోల్పోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాథమిక అంచనాలు సిద్ధం! వరదలతో ఏర్పడిన పంట నష్టంపై ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాలను రూపొందించింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, తోట్లవల్లూరు, పమిడిముక్కల, కోడూరు మండలాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లినట్లు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు, కంద, పూలతోటలు ప్రధానంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 2,863 మంది రైతులకు చెందిన 2244.63 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పొందుపరిచారు. దీన్ని బట్టి వరదలకు జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కృష్ణానదికి వరదలు, అధిక వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నా, ఈదురుగాలులకు పంటలు నేలవాలినా కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఒక్క రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేదు. తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదతో రైతులకు మునుపెన్నడూ లేని విధంగా భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక నష్టం అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే పంట నష్టం సర్వే పూర్తి చేసి నివేదికను పంపుతాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా సూచనలు అందించాం. మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం. – జె.జ్యోతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, కృష్ణాజిల్లా ఏటిపాయకు వచ్చిన వరదతో పంటలు దెబ్బతిన్నాయి. కుళ్లిపోయిన పంటలతో పెట్టుబడులు కోల్పోతున్నాం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ప్రతి ఎకరం నమోదు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలి. – వడుగు శ్రీనివాసరావు, రైతు, మద్దూరు ప్రస్తుతం ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా పంట నష్టం సర్వే ప్రక్రియను చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు ఇంకా శాఖాపరమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో పంట నష్టం సర్వే ప్రక్రియ ప్రారంభానికి నోచలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదనలకు తాజా చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ముంపునకు గురైన ప్రతి ఎకరాన్ని నమోదు చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ సర్వే ప్రారంభం కాకపోవటంతో ఎప్పటికి సర్వే జరుగుతుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
20న రాష్ట్రవ్యాప్త నిరసనలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం వారు మాట్లాడుతూ ట్రంప్ విఽధించిన సుంకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ సుంకాల టెర్రరిజాన్ని ప్రపంచదేశాలపై రుద్దుతున్నాడన్నారు. ప్రత్యేకించి భారత దేశంపై కక్షతో సుంకాలను ఇతర దేశాలతో పోలిస్తే మరింత ఎక్కువగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారంగంపై పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు 19.2శాతం, ఈక్విడార్పై 13శాతం సుంకాలు విధించిన అమెరికా మనదేశంపై సుమారు 60శాతం సుంకాన్ని విధించిందని మండిపడ్డారు. ట్రంప్ హుంకరింపులతో ప్రధాని మోడీ 11శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి పత్తి రైతులను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. పౌల్ట్రీ రంగాన్ని నాశనం చేసేలా అమెరికాకు సహకరిస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సుంకాల మోత కారణంగా ఎగుమతులపై సుమారు రూ.2.6లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ సుంకాలు, అమెరికా సామ్రాజ్యవాద చర్యలను మోడీ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం నాయకుడు వై.కేశవరావు, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
బైక్ దగ్ధం– నలుగురికి గాయాలు
తిరువూరు: తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయరహదారిపై శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఓ బైక్ దగ్ధం కాగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఆంజనేయపురంనకు చెందిన కల్యాణ్ ద్విచక్రవాహనంపై మరో ఇద్దరితో కలిసి తిరువూరు నుంచి ఇంటికి వెళ్తుండగా, కాకర్లకు చెందిన నరసింహ అనే వ్యక్తికి చెందిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈక్రమంలో నరసింహాకు చెందిన బైక్ నుంచి పెట్రోలు లీకై వాహనం పూర్తిగా దగ్ధమెంది. ఈ ఘటనలో నరసింహా, కల్యాణ్లతోపాటు బైక్పై ప్రయాణిస్తున్న ఆంజనేయపురంనకు చెందిన మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన యువకులు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం షాపుల నుంచి శాంపిల్స్ సేకరణ
కోనేరుసెంటర్: మచిలీపట్నంలోని మద్యం షాపుల్లో ఎకై ్సజ్ పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను సేకరించారు. ములకలచెరువు నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడిచిన నాలుగురోజులుగా ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో 21షాపులు, ఏడు బార్లు ఉండగా ఎకై ్సజ్ ఇన్చార్జ్ సీఐ, ఎస్సైలు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మద్యం అమ్మకాలను పరిశీలించారు. యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేసి ఏ డిస్టలరీ నుంచి సరఫరా అయినదీ తనిఖీ చేశారు. కిట్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించారు. షాపుల నిర్వహణ సమయపాలనపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ 21 మద్యం షాపులకు సంబంధించి 15మద్యం శాంపిల్స్, బార్ల నుంచి ఏడు శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ నిబంధనల మేరకే వ్యాపారులు మద్యం అమ్మకాలు సాగించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. రాజగోపురం ఎదుట కళావేదికపై జరిగిన ఈ కర్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ(గాంధీ), 15 మంది సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్అఫీ షియో సభ్యుడితో ఆలయ ఈఓ శీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యురాలు పద్మా వతి ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో హాజరుకావడంలేదని దేవస్థానానికి సమాచారమిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహా మండపంలోని చైర్మన్ చాంబర్లో ట్రస్ట్బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. చైర్మన్ దంపతులతో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే.. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయ్), బడేటి ధర్మారావు, గూడపాటి వెంకట సరోజినీదేవి, జి.వి.నాగేశ్వరరావు, జి.హరి కృష్ణ, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, పనబాక భూలక్ష్మి, మోరు శ్రావణి, పెనుమత్స రాఘవరాజు, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్, సుకాశి సరిత, తంబ ళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులుగా వెలగపూడి శంకరబాబు, మార్తి రామబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకుడు ఎల్.దుర్గాప్రసాద్ ఉన్నారు. కోడలి హత్య కేసులో నిందితురాలు తరిగొప్పల పార్వతితో బోర్డు సభ్యురాలిగా ప్రమాణం చేయడం, వేద ఆశీర్వచనం అందించడంపై విమర్శలు వచ్చాయి. తొలి రోజే వివాదాలు ప్రమాణ స్వీకారం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈఓ శీనానాయక్ అక్కడికి వచ్చారు. మీడిమా సమావేశం ఉందని ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే సుజనా చౌదరి అక్కడి నుంచి వెనుతిరగడంతో ఆయనను పంపేందుకు ఈఓ వెళ్లారు. ఈఓ అసంతృప్తిని ఆలయ సిబ్బంది చైర్మన్ గాంధీకి చెప్పడంతో ఆయన రాక కోసం పది నిమిషాలు ఎదురు చూశారు. ఈఓ వచ్చాక సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. ఈఓ, చైర్మన్ వెనుక చైర్మన్ కుమారుడు కుర్చీ వేసుకుని కూర్చో వడం వివాదాస్పదమైంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అమ్మవారి దర్శనానికి వెళ్లడంతో వీఐీపీ, రూ.500, రూ.300 టికెట్ల క్యూ లైన్లు గంట పాటు నిలిచాయి. ప్రమాణ స్వీకారం నేప థ్యంలో అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపి, వీఐపీలు, ట్రస్ట్బోర్డు కుటుంబ సభ్యులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. అంతరాలయ దర్శనం కల్పించకపోవడంపై హైదరాబాద్, బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఇబ్రహీంపట్నం: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి సమ్మె నిర్వహిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 129 కార్యాలయం వద్ద శనివారం సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, పీస్ రేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ పరిష్కరించని పక్షంలోణీ నెల 14వ తేదీన వర్కు రూల్ పాటించి 15 నుంచి సమ్మె బాట పడతామని చెప్పారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు పచ్చిగోళ్ల సుబ్బారావు, వి. రమేష్, కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షంషేర్వలి, తన్వికుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ డీఆర్వో లక్ష్మీనరసింహం
బాలికా సాధికారతకు సమష్టిగా కృషి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వివక్షకు తావులేకుండా బాలికలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అన్నారు. బాలికల విద్య, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషిచేయా ల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ (సీఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో భాగ స్వామ్య పక్షాలకు ప్రత్యేక వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథి, డీఆర్వో లక్ష్మీనరసింహం మాట్లాడుతూ.. బాలికల విద్య, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ, సామాజిక వివక్షను రూపు మాపడం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. గ్రామ స్థాయిలో బాలల సంక్షేమం, భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాలికల హక్కులతో పాటు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ పి.భానుమతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాధాకుమారి, డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, సీఆర్ఏఎఫ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, సమగ్రశిక్ష అధికారి శిరీష రాణి, ఎంఈఓ పుష్పలత, చిన్నారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. -
నకిలీ మద్యం కేసు: జనార్థన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
విజయవాడ: నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్రావును అక్టోబర్ 17వ తేదీ వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. లిక్కర్ బిజినెస్లో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిపారు టిడిపి నాయకుడు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 2025 జూన్ నుంచి ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ను తీసుకొని ఏఎన్ఆర్ బార్ లో జనార్ధన్ రావు అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. హైదరాబాద్లో E-7 అనే బార్ లో పార్టనర్ గా చేరిన జనార్ధన్ రావు.. అక్కడ చీప్ లిక్కర్ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్తో గోవా కి వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్లో కలిసి ఉన్న బాలాజీ తో చేతులు కలిపారు. బాలాజీ ద్వారా స్పిరిట్, హీల్స్, క్యాప్లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్ఆర్ బార్లో విక్రయించారు. ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు.. ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అనే ఇద్దరు సప్లయ్ చేసిన విషయం వెల్లడైంది. నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఇబ్రహీం పట్నంకి స్పిరిట్ తరలించేవారు. జనార్ధన్రావు సోదరుడు జగన్మోహనరావు ద్వారా నకిలి బ్రాండ్లను తయారు చేశారు.జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్..అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకలచెరువు కల్తీ మద్యం కేసులోఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్ను అరెస్టు చేశారు. అష్రఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఏ 21 నిందితుడుగా ఉన్న అష్రఫ్.. నకిలీ మద్యాన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు గ్రామాలకు తరలించినట్లు గుర్తించారు.రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అష్రప్ బయటపెట్టినట్లు సమాచారం. టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్ఫియో వాహనంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. మరొకవైపు టిడిపి నేతలు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది కోసం పోలీసుల బెంగళూరులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: పక్కావ్యూహం ప్రకారమే..! -
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
నకిలీ మద్యం కేసులో కదులుతున్న డొంక
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసు(AP Fake Liquor Case) దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అధికాలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ నేతల డొంక కదులుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్దెపల్లి జనార్దనరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ.. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ఫోర్స్ (ఈస్టీఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే.. విచారణలో జనార్దన్రావు ఇప్పటిదాకా కీలక వివరాలనుఏ వెల్లడించినట్లు తెలుస్తోంది. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, భవాని పురం, పరవాడ, తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం డెన్లు ఉన్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖలో పాత నేరస్తుడు వెంకట్కు చెందిన స్థావరంలోనూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. శ్రీకాకుళంలోని సారవకోట మండలంలో, ఇంకోవైపు అనకాపల్లి పాయకరావుపేట హైవేలోని పలు ట్రేడర్స్లోనూ తనిఖీలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ సోదాలతో నకిలీ మద్యం మాఫియా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందనేది స్పష్టమవుతోంది.జనార్ధన్ రావు నోరు విప్పితే టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తాయి. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీ ప్రధాన సూత్రదారులలో మొదలైన భయం మొదలైంది. జనార్ధన్ రావు నీ ఏ కోర్టులో హాజరుపరుస్తారో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడేయగా.. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని టీడీపీ బడా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం సొమ్ముతో..నకిలీ మద్యం అమ్మకాలలో వచ్చిన డబ్బులతో నిందితులు భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులో A12 నిందితుడైన కళ్యాణ్.. జనార్దన్ రావు పిన్ని కొడుకు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన ల్యాండ్ను కొనుగోలు చేశాడు. అది నకిలీ మద్యం సొమ్మేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఇబ్రహీంపట్నం డెన్లో తనిఖీల సమయంలో కళ్యాణ్ సుమారు 60 కేసుల నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. జనార్ధన్ రావు పూర్తిగా నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. స్కెచ్ ఎలా ఉందంటే..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. వాళ్లలో కొందరు కొందరు అధికార బలంతో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ యూనిట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. ములుకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్లను జనార్దన్ రావు(TDP Janardhan Rao) నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు తేలింది. బెల్ట్ షాపులుతో మొదలు పెట్టి.. వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో.. మరో టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకి మద్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో దొరికిన ప్రతి నకిలీ మద్యం డెన్ మూలాలు జనార్ధన్ రావు వైపు చూపిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు -
వాళ్లు పదవులోళ్లు.. మనం పనోళ్లం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పదవుల పంపిణీలో ఒక సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది తప్ప తక్కిన వారికి అన్యాయం కొనసాగుతోందనిఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలు, కూటమి పార్టీల నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘పదవులకు వాళ్లు, పనులకు మనమా’ అంటూ అంతర్గత చర్చల్లో పరస్పరం వాపోతున్నారు. ఆయా కుల కార్పొరేషన్లకు మాత్రమే మనం పరిమితమా అని మథనపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు దక్కిన పదవులను బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా దుర్గగుడి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ)ని ప్రకటించిన తరువాత టీడీపీలోని పాలకపక్ష సామాజికవర్గీయులు సైతం మండిపడుతున్నారు. పాలకమండలి సభ్యుల్లో ఏ వర్గం వారిది మెజారిటీనో కూడా పరిశీలించాలంటున్నారు. ఇదీ వరుస.. తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్సభ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యేగా యలమంచిలి సుజనాచౌదరి (బీజేపీ) ప్రాతినిధ్యం వహిసున్న సంగతి తెలిసిందే. నందిగామ, తిరువూరు రిజర్వుడు స్థానాలు అయినందున ఆ వర్గీయులైన కొలికపూడి శ్రీనివాస్, తంగిరాల సౌమ్యలు కాగా విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య ఉన్నారు. కుల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కాకుండా తక్కిన ప్రాధాన్యతా పోస్టులు మాత్రం దాదాపు చంద్రబాబు సామాజికవర్గీయులకే దక్కడం పరిశీలనాంశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభిరాం, కేడీసీసీబీ చైర్మన్గా నెట్టెం రఘురాం పదవుల్లో కొనసాగుతున్నారు. చివరకు జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీల చైర్మన్లు సైతం ఆ వర్గీయులకే మెజారిటీ దక్కాయి. దుర్గగుడి చైర్మన్ పదవి కూడా.. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ) నియామకం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు సన్నిహితుడు కావడం మినహా రాజకీయంగా గాం«దీకి ఉన్న అర్హతలు ఏంటని టీడీపీ వర్గాలే నిలదీస్తున్నాయి. బాలకృష్ణను అనుసరించడం తప్ప పార్టీలో బాధ్యత, కార్యక్రమాలలో భాగస్వామ్యం ఏపాటిదని ప్రశి్నస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారిగా, ఎల్ఐసీలో పనిచేసిన గాంధీ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)కు అనుచరునిగా కొనసాగారని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను ద్వితీయశ్రేణి నాయకులు ప్రశ్నించగా, ‘మాదేముంది అంతా అధిష్టానం నిర్ణయమేగా’ అని బదులిచ్చి మౌనం దాల్చారని సమాచారం. విజయవాడ పశి్చమ పరిధిలోని ముఖ్య పదవుల్లో సుజనాచౌదరి, గాంధీ, గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ నర్రా వాసు, దుర్గ గుడి సభ్యురాలు గూడపాటి వెంకట సరోజనిదేవి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. పశి్చమ పరిధిలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే టీడీపీకి చెందిన చలసాని ఆంజనేయులు కొనసాగుతున్నారు.నందిగామను పరిశీలిస్తే చాలు.. టీడీపీలో పదవుల పంపకం ఎలా ఉన్నాయనేది నందిగామ నియోజకవర్గాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది. పదవులన్నీ ఒక సామాజికవర్గానికేనా అనే చర్చ కూటమి పార్టీల వైపు నుంచి సోషల్మీడియాలో జోరుగానే కొనసాగుతోంది. కంచికచర్ల ఏఎంసీ చైర్మన్గా కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ చైర్మన్, చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు డి్రస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా పాలకపక్షం వర్గీయులే. తాజాగా దుర్గ గుడి సభ్యురాలిగా మన్నే కళావతికి అవకాశం దక్కింది. మునిసిపల్ చైర్మన్, ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఆ సామాజికవర్గం వారే. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)ల చైర్మన్ల సంగతి సరేసరి. చందర్లపాడు, చింతలపాడు, గుత్తావారిపాలెం, కాసరబాద, కొడవటికల్లు, కోనాయపాలెం, ముప్పాళ్ల, చెవిటికల్లు, గండేపల్లి, కంచికచర్ల, గనిఆత్కూరు, గొట్టుముక్కల, మోగులూరు, పరిటాల, సక్కలంపేట, పెరకలపాడు, అడవిరావులపాడు, కంచెల, ఐతవరం, చౌటపల్లి, పొన్నవరం, వీరులపాడు, వెల్లంకి, జమ్మవరం సొసైటీల చైర్మన్లుగా ఆ సామాజికవర్గీయులే కొనసాగుతుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉంది. మరో ఎనిమిది పీఏసీఎస్ల చైర్మన్లుగా మాత్రమే ఇతరులున్నారు. రూరల్ నియోజకవర్గాల్లో నీటి సంఘాల కమిటీలు, వ్యవసాయ కమిటీలకు అధిక ప్రాధాన్యతనేది తెలిసిందే.విజయవాడ పశ్చిమానికి చెందిన నాగుల్మీరాను రాష్ట్ర నూర్బాషా సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియమించగా ఆయన అప్పట్లోనే అధిష్టానం వద్దే అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం. శాసనసభా స్థానం నుంచి పోటీచేసిన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన తనను కుల సంఘానికి పరిమితం చేయడం ఇబ్బందికరమని అన్నట్లు తెలిసింది. నగరంలోని మరికొందరు నాయకులను కూడా కుల సంఘాల పోస్టులకు పరిమితం చేయడం గమనార్హం. జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించాలనే నిర్ణయం జరిగింది. జిల్లా కలెక్టర్ అయిదారు నెలల కిందట నోటిఫికేషన్ కూడా జారీచేశారు. ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుడైన గండ్రాయి గ్రామానికి చెందిన కొటారి సత్యనారాయణ ప్రసాద్ అడ్డంకులు సృష్టించారు. తమ వర్గానికే ఇవ్వాలనడంపై ఎస్సీ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు స్టే ఇచ్చింది. జిల్లా పరిధిలోని పలు దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరగలేదు. మరికొన్ని ఆలయాలకు పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇతర సామాజికవర్గాల వారికి పాలకమండలి పదవులు దక్కడం ఇష్టంలేక భర్తీచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
యువకుడి మోసంపై యువతి ఆందోళన
మక్కపేట(వత్సవాయి): ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు యండ్రాతి అరుణ్య, నూతక్కి సందీప్ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అయితే గతేడాది అరుణ్య గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు గమనించి వివరాలు తెలుసుకుని గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుడు సందీప్ తనకు వివాహం చేసుకోవడానికి ఏడాదిన్నర సమయం కావాలని అంతేకాకుండా గర్భం కూడా తీసేసుకుంటేనే వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని కాగితాలు రాసుకున్నారు. తరువాత యువతి గర్భం తొలగించుకుంది. ఇప్పుడు ఏడాదిన్నర సమయం రావడంతో యువతి కుటుంబసభ్యులు పెద్దల దగ్గరకు వెళ్లారు. దీంతో వాళ్లు యువకుడిని పిలిచి అడగ్గా పెళ్లి తనకు ఇష్టం లేదని తనని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంభసభ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు మక్కపేట గాంధీ సెంటర్లో ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ భవనానికి ఓసీ జారీపై తీర్పు రిజర్వ్ సాక్షి, అమరావతి: మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) జారీ చేసేలా పురపాలక శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ‘అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే భవన నిర్మాణం జరిగింది. తగిన ఫీజులనూ చెల్లించాం. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ సమాధానం ఇచ్చాం. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కేవలం రాజకీయ కారణాలతోనే ఇలా చేస్తున్నారు. భవన నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని మునిసిపల్ కార్పొరేషన్ చేస్తున్న వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు’ అని నాగిరెడ్డి వాదనలు వినిపించారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం
కంకిపాడు: అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి టపాసులను కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జె.మురళీకృష్ణ తెలిపిన కథనం మేరకు...మండలంలోని ఉప్పలూరు గ్రామంలో గురువారం రాత్రి అదనపు ఎస్ఐ తాతాచార్యులు, పీఎస్ఐ సత్యం సురేష్ నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని మెయిన్రోడ్డు పరిసరాల్లో ఉంటున్న నీలం దుర్గారావు ఇంటిని సోదా చేయగా రూ.74,700 విలువైన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వంగర రాధాకృష్ణమూర్తిని తనిఖీ చేయగా రూ.2,68,318 విలువైన దీపావళి టపాసులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయటంపై నీలం దుర్గారావు, వంగర రాధాకృష్ణమూర్తిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టపాసులను పోలీసుస్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ, అదనపు ఎస్ఐ తాతాచార్యులు తెలిపారు. -
కేడీీసీసీ బ్యాంక్తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
జగ్గయ్యపేట అర్బన్: కేడీసీసీ బ్యాంక్తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. కేడీసీసీ బ్యాంక్ జగ్గయ్యపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు, బ్యాంకు సిబ్బంది, ఇన్చార్జ్లతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం బ్యాంక్ బ్రాంచ్ టార్గెట్ రూ 361 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.310 కోట్లు సాధించామని చెప్పారు. అనంతరం ఆయన గోపాలకృష్ణ లార్జ్ సైజ్ కోపరేటివ్ సొసైటీ, కృష్ణాఫార్మర్స్ సొసైటీలను సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ పరిధిలో నడుస్తున్న జన ఔషది మెడికల్ స్టాల్స్ను సందర్శించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, గోపాలకృష్ణ, కృష్ణా ఫార్మర్స్ సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ -
త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానదిలో వరదలు తగ్గిన తర్వాత త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటలు, ట్రయల్స్ నిర్వహించనున్నట్లు శాప్ ఎండీ భరణికి ఖేలో ఇండియా సభ్యుడు, ఏపీ స్కల్లింగ్ –రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని తెలియచేశారు. ఆయన శుక్రవారం శాప్ ఎండీతో సమావేశమై 2025–26 సంవత్సరానికి గాను ఏపీ స్కల్లింగ్– రోయింగ్ అసోసియేషన్ వార్షిక గుర్తింపు సర్టిఫికెట్ను అందుకున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడానికి గిరిజన యువతను రోయింగ్కు సిద్ధం చేయవచ్చని తెలిపారు. భారత సైన్యం టాప్ 5 క్రీడల్లో కూడా రోయింగ్కు ప్రాధన్యం ఇచ్చిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. -
నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకాలు!
జి.కొండూరు: కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నీటి లభ్యత ఉండి కూడా ఎత్తిపోయలేని స్థితిలో ఎత్తిపోతల పథకాలు ఉండడంతో రైతులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికి చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలు సంవత్సరాల తరబడి నిరుపయోగంగా పడి ఉండడంతో నీటి ఎద్దడి సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. వెలగలేరు వద్ద పోలవరం కుడి కాల్వపై ఒకే ప్రదేశంలో నిర్మించిన వెల్లటూరు, కందులపాడు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపంతో ఏడాదిన్నరగా మూలనపడ్డాయి. వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని రూ.109.10 లక్షలతో ఆ గ్రామ శివారులో ఉన్న బంధు చెరువుకు నీటి సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 125.32ఎకరాలు కాగా ఈ చెరువు కింద గ్రామానికి చెందిన 312.92 ఎకరాలు ఆయకట్టుగా ఉంది. ఈ చెరువుకు సాగర్ జలాలు వస్తే తప్ప వర్షాధారం లేదా ఈ ఎత్తిపోతల పథకమే ఆధారంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో రెండు మోటార్లను నీటిలో ఉండి పని చేసే విధంగా అమర్చారు. అయితే ఈ రెండు మోటార్లు ఏడాదిన్నరగా పనిచేయడంలేదని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా కందులపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ.40.57లక్షలతో శివారు గ్రామం చేగిరెడ్డిపాడు వీరయ్య చెరువుకు నీటిని సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 67.53 ఎకరాలు కాగా గ్రామానికి చెందిన 138.95 ఎకరాలు ఆయకట్టు సాగుభూమిగా ఉంది. అయితే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు కూడా గత ఏడాదిన్నరకుపైగా నిరుపయోగంగా ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వరి నారుమళ్లకు నీరందక రైతులు నరకయాతన పడ్డారు. కొన్ని చోట్ల నారుమళ్లు ఎండిపోవడంతో రైతులు చేసేది లేక వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేపట్టారు. అధ్వానంగా పరికరాలు.. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ఏడాదిన్నరగా నిర్వహణా లోపంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఖరీదైన మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి కోసం నిర్మించిన షెడ్ల వద్ద భారీగా ముళ్ల కంప పెరిగి కనీసం దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ షెడ్లకు ఉన్న డోర్లకు తాళాలు కూడా లేకపోవడంతో ఎలక్ట్రికల్ బోర్డులు, మోటార్ల భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారింది. నీళ్లున్నా ఎత్తిపోయలేని పరిస్థితి... ఈ రెండు ఎత్తిపోతల పథకాలను వెలగలేరు గ్రామ శివారులో పోలవరం కుడి కాల్వపై నిర్మించారు. అయితే ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మించిన ప్రదేశంలో పోలవరం కాల్వపై రెగ్యులేటర్ కూడా ఉండడంతో ఇక్కడ నిత్యం నీటి లభ్యత ఉంటుంది. ఒక్కసారి ఈ కాల్వలో పట్టిసీమ నీళ్లు ప్రవాహం కొనసాగితే ప్రవాహం అపినప్పుడు రెగ్యులేటర్ లాకులు దించుతారు కాబట్టి ఆరు నెలలపాటు నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ పథకాలు రెండు కూడా నిరుపయోగంగా ఉండడంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. అదే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు వాడుకలో ఉంటే ఈ రెండు చెరువుల కింద ఖరీఫ్తో పాటు రబీలో ఆరుతడి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు. -
ఎన్టీటీపీఎస్ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో
ఇబ్రహీంపట్నం:ఎన్టీటీపీఎస్ బూడిద నీటి కాలుష్యంపై అధికారుల్లో చలనం వచ్చింది. ‘జలం.. గరళం’ శీర్శికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడింది. ఈనేపథ్యంలో ఆర్డీఓ కావూరి చైతన్య ఇతర అధికార యంత్రాంగం కదిలింది. ఎన్టీటీపీఎస్ నుంచి విడుదల అవుతున్న బూడిద నీరు బుడమేరు, చన్నీటి కాలువ, ఆర్డబ్ల్యూఎస్ ప్లాంటులో కలిసే ప్రాంతాలను ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ముందుగా ఆరడబ్ల్యూఎస్ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో చన్నీటి కాలువ నుంచి నీటిశుద్ధి ప్లాంటుకు నీరువచ్చే ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో మారిన నీటి రంగును గుర్తించారు. అనంతరం ఏకాలనీ వద్ద ఎన్టీటీపీఎస్ ప్లాంటు నుంచి బూడిద చెరువుకు నీటిని చేరవేసే పైపులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిత్యం బూడిద మాఫియా నేతలు పైపులు పగలగొట్టి లీకేజీలు సృష్టిస్తారని, కారిన బూడిద లారీలకు అక్రమ లోడింగ్ చేస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు గుంజా శ్రీనివాస్, మేడపాటి నాగిరెడ్డి ఆర్డీఓకు వివరించారు. ప్లాంటులో మిగులు వ్యర్థాలు కాలువ ద్వారా సెక్యూరిటీ కాలనీ సమీపంలో బుడమేరు కాలువలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో నీరంతా బూడిద మయంగా మారడాన్ని గుర్తించారు. ఎన్టీటీపీఎస్ ప్లాంటులోని సైలో ప్రాంతంలో పొడి బూడిద లారీలకు లోడింగ్ చేసే విధానం, అక్కడ కలుషిత నీరు లీకేజీ పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచే ఎక్కువ బూడిద నీరు తాగునీటితో కలిసే అవకాశం ఉందని గుర్తించారు. ఎన్టీటీపీఎస్ అధికారులపై ఆగ్రహం... సంస్థలో బూడిద నీటి నిర్వహణ తీరును ప్రశ్నించారు. తాగునీటిలో బూడిద నీరు కలవడంతో ఎన్టీటీపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్లైన్ల లీకేజీలతోనే బూడిద తాగునీటిలో కలుస్తుందని అధికారులు సర్థిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు ధీటుగా సమాధానం చెప్పాలని చూసిన టీడీపీ నాయకులపై మండిపడ్డారు. బూడిద నీటి కాలుష్యంపై ఆర్డీఓ చైతన్య స్పందిస్తూ బూడిద నీటిని తరలించే పైపులు లీకేజీ వలన తాగునీరు కలుషితం అవుతుందన్నారు. ఎక్కువగా వర్షం వచ్చిన సమయాల్లో నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు. వాటర్ పైప్లైన్లు, లీకేజీలు, చన్నీరు, వేడినీటి కాలువల్లో బూడిద నీరు కలిసే ప్రాంతాలు పరిశీలించామన్నారు. మైలవరం నియోజకవర్గం గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఇక్కడి నుంచే కావడం వలన సమస్య ఏర్పడిందన్నారు. దీని నివారణలో భాగంగా సుమారు 9 కిలో మీటర్ల పొడవైన పైప్లైన్ రీప్లేస్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు ఫిల్టర్ పాయింట్కు వెళ్లే పైప్లైన్ కూడా 15 మీటర్లు దూరం ముందుకు తీసుకువెళ్లే బూడిద నీటితో సంబంధం ఉందని గుర్తించారన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి సెంట్రలైజ్ పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. వాటర్ పంపింగ్ సిస్టమ్కు రూ.1.50 కోట్లు అవసరమవుతుందన్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద నీటి కాలుష్యం వ్యవహారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, వైస్ చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ప్లోర్ లీడర్ గుంజా శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాస్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను చితకబాదిన టీచర్
కిలేశపురం(ఇబ్రహీంపట్నం):విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను విచక్షణా రహితంగా చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం (కొత్తజూపూడి)లో గురువారం చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటికెళ్లిన విద్యార్థులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాల మేరకు.. కిలేశపురంలోని ఎంపీపీ పాఠశాలలో 17 మంది విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహించిన టీచర్ రజని అందరికీ భయం ఉండాలని భావించి తరగతిలోని మిగిలిన విద్యార్థులందరినీ చితకబాదినట్లు చెప్పారు. ఓ బాలికకు చేతి శరీరంపై ఎర్రగా కందిపోయింది. మరో బాలిక అరచేతిని టేబుల్పై పెట్టి వేళ్లపై కర్రతో కొట్టడంతో నొప్పిని భరించలేక పోయి ఏడ్చానని స్వయంగా చెప్పింది. హెచ్ఎం బేబీరాణి గాయపడిన బాలికను ఓదార్చారు. ఓబాలిక తండ్రి బాణావత్ జగన్నాథ్నాయక్ ఈఘటనపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఇక చదివించమని, డబ్బులు ఖర్చు అయినా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామని టీసీ ఇవ్వాలని కోరారు. పిల్లలను చితకబాదిన టీచర్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సామాజిక భద్రతే ఈఎస్ఐ లక్ష్యం
గన్నవరం రూరల్: ప్రజలకు సామాజిక భద్రత కల్పించటం ఈఎస్ఐ లక్ష్యమని విజయవాడ ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ తెలిపారు. చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఈఎస్ఐ ఆధ్వర్యంలో స్ప్రీ–2025 అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఉద్యోగులందరినీ నమోదు చేయటం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా స్వీయ నమోదు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో నడిచే కర్మాగారాలు, సంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులన్నీ ఈఎస్ఐ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన మొదటి రోజు నుంచే ఈఎస్ఐ చట్టం ద్వారా లభించే ప్రయోజనాలు పొందుతారని ఆటోనగర్ ఈఎస్ఐ బ్యాంక్ మేనేజర్ కె.హేమశ్రీ వివరించారు. వైద్య సంరక్షణ ఆయా కుటుంబాలకు రక్షణగా నిలుస్తుందన్నారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్ ఈఎస్ఐ పథకంపై చూపిన చొరవ అభినందనీయమని అధికారులు కొనియాడారు. జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ -
యువతకు హెచ్ఐవీపై అవగాహన అవసరం
ఏపీశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన పెంపొందించుకోవటంతో పాటు హెచ్ఐవీ సోకిన వారిని ఆదరించాలని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి 5కే మారథాన్ కార్యక్రమం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి 5కే మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ సోకిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏఆర్టీ చికిత్సతో వారి జీవన ప్రమాణం పెంచుకోవచ్చని అన్నారు. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిపై వివక్ష నివారణ గురించి అవగాహన కల్పించడానికి ఐఈసీ క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. బహుమతుల ప్రదానం.. 5కే మారథాన్ మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్ విభాగాలవారీగా పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఇక్కడ రాష్ట్రస్థాయి మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ పోటీలలో గెలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపించటంతో పాటు వరుసగా రూ. 35వేలు, రూ.25వేలు, రూ.10వేలు నగదు బహుమతి అందింస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీడీ డాక్టర్ కె. సుచిత్ర, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకినీడు ప్రసాద్, డాక్టర్ టి. మంజుల, ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి. భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తిరువూరు: పట్టణ శివారు పీటీకొత్తూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. చౌటపల్లి పాలసేకరణ కేంద్ర వేతన కార్యదర్శిగా పనిచేస్తున్న తేలె వెంకటేశ్వరరావు (60) తన స్వగ్రామమైన చిట్టేల నుంచి తిరువూరు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన వెంకటేశ్వరరావుకు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందడంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి తిరువూరు క్లస్టర్ పాలశీతల కేంద్ర సిబ్బంది సంతాపం తెలిపారు. దీర్ఘకాలం పాలసేకరణ కేంద్రంలో పనిచేస్తూ రైతులతో సత్సంబంధాలు కలిగిన వెంకటేశ్వరరావు మృతితో చిట్టేల, చౌటపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమేనా సుపరిపాలన అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసే కుటిల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఉద్యమంలా చేపడదాం.. అనంతరం అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే తమ పార్టీ నాయకుల వృద్ధి అని కొత్త నిర్వచనానికి చంద్రబాబు నాంది పలికారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైఎస్సార్ సీపీ నేతలు చూస్తూ ఊరుకోరన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లుగా.. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విద్య, వైద్యం రెండు కళ్లుగా సాగిందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు 50 సీట్లకు అనుమతి వస్తే, వద్దన్న నీచ చరిత్ర చంద్రబాబుది అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు దండుకోవాలనే చంద్రబాబు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొత్తం పది కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి అయ్యేవన్నారు. కోటి సంతకాలను సేకరించి గవర్నర్కు అందజేస్తామని, కూటమి నాయకులు చేసే కుటిల రాజకీయాలకు ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. కూటమి కుటిల రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ -
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి నిధులు విడుదల చేయకుండా సేవలు అందించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఆ పథకంలో వైద్య చికిత్సలను నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి తమకు బకాయిగా ఉన్న రూ.2,700 కోట్లను విడుదల చేస్తేనే ఆస్పత్రుల మనుగడ సాధ్యమవుతుందంటూ తేల్చి చెప్పాయి. విజయవాడలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల ఎదుట యాజమాన్యాలు బోర్డులు సైతం ఏర్పాటు చేశాయి. కొత్త కేసుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేసి.. కేవలం ఫాలోఅప్ కేసులకు మాత్రమే వైద్య సేవలు అందించాయి. బోర్డులు ఏర్పాటు.. ఆరోగ్యశ్రీలో తాము ఎందుకు సేవలు నిలిపివేశామో తెలియజేస్తూ ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.2,700 కోట్లు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతినెలా బిల్లు రూ.380కోట్ల నుంచి రూ.420 కోట్లు అవుతోందని, వాటిని ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు చెల్లించాలని, సర్జరీ ప్యాకేజీల్లో పెరుగుదల లేకపోవడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని కోరుతూ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ బకాయిలు విడుదల చేసే వరకూ సేవలు కొనసాగించలేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. జిల్లాలో 60 నెట్వర్క్ ఆస్పత్రులు.. ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు 60 ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు రూ.300 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయి ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల నిర్వహణ ఇప్పటికే కష్టంగా మారి, ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం బకాయి చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో బతుకు భారంగా మారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు, బయోమెడికల్, ఇతర పన్నులు సైతం చెల్లించలేని దుస్థితికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్యసేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవల కోఆర్డినేటర్ ఎస్.బి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో మొత్తం 28 నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్యసేవ కింద పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 9 ప్రభుత్వ, 19 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు. మచిలీపట్నంలోని ఆంధ్రా ఆస్పతి, గుడివాడలోని అన్నపూర్ణ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మినహాయించి, మిగతా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు నిధులివ్వకుండా సేవలు అందించలేమంటున్న ఆస్పత్రులు బోర్డులు ఏర్పాటు చేసి మరీ రోగులకు చెబుతున్న వైనం -
రూ.8.15 కోట్లకు దుర్గమ్మ చీరల టెండర్
● బహిరంగ వేలంలో దక్కించుకున్న పావనీ కలెక్షన్స్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించే చీరల సేకరణ కాంట్రాక్టు రికార్డు ధర పలికింది. ఏడాదికి రూ.8.15కోట్లు చెల్లించేందుకు విజయవాడకు చెందిన పావనీ కలెక్షన్స్ ముందుకొచ్చింది. ఇంద్రకీలాద్రిపై మహామండపం ఆరో అంతస్తులో శుక్రవారం చీరలకు బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్లను దేవస్థానం ఆహ్వానించింది. రూ.50 లక్షల ప్రథమ ధరావత్తును చెల్లించిన ఏబీఐ ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్, ఆదిత్య ఎంటర్ప్రైజర్, పావనీ కలెక్షన్స్ పేరిట ముగ్గురు కాంట్రాక్టర్లు బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దేవస్థాన పాటను రూ.10 కోట్లుగా నిర్ణయించి వేలం ప్రక్రియను ప్రారంభించారు. అక్టోబర్ 20తో ముగిసే ఈ ఏడాది పాట రూ.5.50కోట్లు కాగా, భక్తులు సమర్పించే చీరలు, ముక్క చీరలు, ఆషాఢ సారె మొత్తం కాంట్రాక్టరే సేకరించుకునేలా దేవస్థానం షరతులలో మార్పులు చేసింది. అయినప్పటికీ దేవస్థానం నిర్ణయించిన ధర అధిక మొత్తంలో ఉందని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆలయ వేలాన్ని రూ.8.05 కోట్ల నుంచి ప్రారంభించారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, అమ్మవారికి మొక్కుబడులు చెల్లించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆలయ ఈవో శీనానాయక్ వివరించారు. చివరకు పావనీ కలెక్షన్స్ రూ.8.15 కోట్లకు బహిరంగ వేలంలో కాంట్రాక్టు దక్కించుకుంది. సీల్డ్ టెండర్, ఈ–టెండర్కు కాంట్రాక్టర్లు ఎవరూ దాఖలు చేయలేదని దేవస్థాన అధికారులు ప్రకటించారు. టెండర్ ప్రక్రియను ఏసీ రంగారావు, సుజన్, ఏఈవో సుధారాణి, సూపరింటెండెంట్ హేమదుర్గాంబ, రాజు పర్యవేక్షించారు. -
నిత్యాన్నదానానికి రూ.7.91 లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు రూ.7.91 లక్షల విరాళాలు సమర్పించారు. విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన టి.ఈశ్వరదుర్గానాగేంద్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చి రూ.5,89,055 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. లంబాడీ పేటకు చెందిన డి.రంగారావు కుటుంబ సభ్యులు ఈఓ శీనానాయక్ను కలిసి రూ.2,02,116 విరాళం అందజేశారు. దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. పెడన: సహజ సిద్ధ కలంకారీకి పేరు గాంచిన పెడనకు గురువారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీనివాస కోరమండల్ కలంకారీ పరిశ్రమను సందర్శించారు. వస్త్రాల తయారీని పరిశీలించారు. మహారాష్ట్ర, రాజ స్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ఐటీ, హెచ్ఆర్ ఉద్యోగులు రాగా వారికి టూరిస్ట్ గైడ్లు నవల్దీప్, ఆశ్విత కలంకారీపై వివరాలు తెలిపారు. ప్రింటింగ్ వేయడం, రంగులు ఎలా వస్తున్నాయి తదితర విషయాలను పరిశ్రమ యజమాని పిచ్చుక వరుణ్ వివరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాల్లో ఈ నెల పదో తేదీ నుంచి బోధనేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ ఎ.సుంద రయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, డీఈఓ యు.వి.సుబ్బా రావును ఫ్యాప్టో నేతలు గురువారం వేరువే రుగా కలిసి బోధనేతర పనులను చేయబోమని మెమొరాండం సమర్పించారు. అనంతరం సుందరయ్య మాట్లాడుతూ.. ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా బోధనేతర విధులను బహిష్క రిస్తున్నామని తెలిపారు. బోధనకే పరిమితమై మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని నిర్ణయించామన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కో చైర్మన్ జి.రామారావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ వేముల భిక్షమయ్య, నాయకులు సయ్యద్ ఖాసీం, కుక్కడపు శ్రీనివాసరావు, జి.అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): దీపావళి పండు గను పురస్కరించుకుని బాణసంచా తయారీదారులు, వ్యాపారులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, హెచ్చరికలను పెడచెవినపెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిసూత గురువారం ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్ లేకుండా బాణ సంచా తయారీ, విక్రయాలు నేరమని స్పష్టంచేశారు. బాణసంచాను భద్రపరిచే గోదాములకు కూడా లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. లైసెన్స్ తీసుకునే ప్రతి వ్యాపారి తమ షాపులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చేయించా లని, నిబంధనలనను కచ్చితంగా పాటించా లని ఆదేశించారు. ఇళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమా చారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా బాణసంచా విక్రయిస్తున్నట్లు, తయారు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం రహదారి భద్రతా ఏర్పాట్లపై అధికారు లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా జాతీయ రహదారుల్లో జరిగే ప్రమాదాల్లోనే ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ వివరాలు తెలిసేలా చూస్తే వారు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. చెన్నయ్ ఐఐటీ సీనియర్ ఇంజినీర్ రాగుల్ రోడ్డు ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ రాడ్ అందించిన వివరాలను అనుసరించి ప్రమాదాలు అధికంగా జరిగే వంద జిల్లాలో కృష్ణా జిల్లా 75వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, 2023 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2,068 ప్రమాదాలు జరిగాయని, 734 మంది చనిపోగా 1887 మంది గాయపడ్డారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతోనే ప్రమాదా లను నివారించొచ్చని సూచించారు. ప్రమాదాల నివారణకు సంజయ్ యాప్, ఫీల్డ్ పర్సెప్షన్ సర్వే యాప్, ట్రామా కేర్ ప్రిపేర్డ్నెస్ లెవల్ యాప్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సాంకేతికత సాయంతో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగనున్న జిల్లా రహదారి భద్రత సమావేశంతో పాటు భవిష్యత్లో నిర్వహించే సమావేశాలకు చెన్నయ్ విద్యార్థులు తప్పనిసరిగా వచ్చి సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నయ్కు చెందిన సీనియర్ ఇంజినీర్ నవీన్కుమార్, రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, రహదారులు, భవనాలశాఖ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టిసారించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను అవలంబించి వినూత్న పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. ఇలా సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద నందివాడ మండలాన్ని ఓ క్లస్టర్గా తీసుకుని, ఆరు గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో చేసే సాగుపై అవగాహన కలిగించాలన్నారు. ఆక్వా ఎక్సేంజ్ లిమిటెడ్ సహాయ వ్యవస్థాపకుడు కిరణ్కుమార్.. ఆక్వా సాగును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
బాణసంచా నిల్వలు, విక్రయాలపై నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాణసంచా అక్రమ నిల్వలు, అమ్మకాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు, అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా నిల్వలు, అమ్మకాల పర్యవేక్షణపై గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర తనిఖీల అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పరిధిలో.. విజయవాడలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నివేదికలకు అనుగుణంగా ప్రాంతాలను గుర్తించాలన్నారు. బాణసంచా విక్రయించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ముందుగానే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో బాణసంచా విక్రయాలు జరిగిన జింఖానా మైదానంలో భద్రతాపరమైన లోపాల వల్ల అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ సిఫార్సులను కచ్చితంగా పాటించాలి ఏకసభ్య విచారణ కమిటీ చేసిన 23 సిఫార్సులను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఒక్కో దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. దుకాణాలు ఎదురెదురుగా ఉండకుండా చూడాలన్నారు. రెసిడెన్షియల్ ఏరియాకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలకు అనుమతివ్వాలని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్లో 50కి మించి దుకాణాలకు అనుమతివ్వకూడదన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్ఓ ఎం. లక్ష్మి నరసింహం, డీసీపీ కేజీవీ సరిత, అగ్నిమాపక అధికారి శంకర్రావు, వీఎంసీ అగ్నిమాపక అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని, వారు విద్యార్థుల సంక్షేమ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై జిల్లా సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టర్ గురువారం రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 సాంఘిక సంక్షేమ, 26 వెనుకబడిన తరగతులు, మూడు గిరిజన సంక్షేమ, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వసతి గృహ విద్యార్థుల భవిష్యత్ సంక్షేమ అధికారులపై ఉందన్నారు. చిన్నతనంలో తాను కూడా హాస్టల్లో ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రత్యేక అధికారులు వారానికి ఒక రోజు హాస్టళ్లను సందర్శించా లని, నిర్వహణలో ఏవైనా లోపాలను గుర్తిస్తే సరిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగేలా చూడా లని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరికీ కేర్ షీట్ నిర్వహించాలని స్పష్టంచేశారు. హాస్టళ్లకు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్లను, నీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు హాస్టళ్లలో ఆహారాన్ని తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో ఏటీఎం కిచెన్ గార్డెన్ నిర్వహించాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనర సింహం, జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి ఎ.మురళీకృష్ణ, వెనకబడిన సంక్షేమ అధికారి కె.లక్ష్మీదేవి, సహాయ సంక్షేమ అధికా రులు వి.గణేష్, టి.గాయత్రి, ఎం.ఇజ్రాయిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
23న దుర్గమ్మకు గాజుల ఉత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఈ నెల 23వ తేదీన గాజుల ఉత్సవం నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ విదియ, భగిని హస్త భోజనం, యమ ద్వితీయను పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అందంగా ముస్తాబు చేయనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ ఉత్సవానికి సంబంధించిన అంశాలపై గురువారం సమావేశమైంది. తెల్లవారుజామున అమ్మవారికి గాజు లతో విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన గాజులను భక్తులు, దాతల నుంచి సేకరించాలని దేవస్థానం నిర్ణయించింది. అమ్మవారికి వివిధ వర్ణాల గాజులను అలంకరణ నిమిత్తం వినియోగిస్తున్నారు. గాజులను దాతలు ఆలయ ప్రాంగణంలోని డోనేషన్ కౌంటర్లో సమర్పించొచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం అమ్మవారికి, ఆలయాన్ని అలంక రించిన గాజులను క్యూ లైన్లలో భక్తులకు పంపిణీ చేస్తారు. 20న దీపాలంకరణ ఈ నెల 20వ తేదీన దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో పంచహారతుల సేవ అనంతరం ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ జరుగుతాయి. అంతరాలయంలోని అమ్మవారి ప్రధాన మూర్తి వద్ద ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో బాణసంచా వెలిగిస్తారు. అనంతరం ఏడు గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం జరుగుతుంది. -
బోధనేతర పనిభారం తగ్గించాలి
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం తగ్గించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సచివాలయంలో కలిసి గురువారం వినతిపత్రం అందజేశామని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని, డీఏతో పాటుగా పీఆర్సీ, ఐఆర్ కూడా ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని, పీఎఫ్ లోన్స్ను వెంటనే జమ చేయాలనే అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అన్ను వెంకటరావుతో పాటుగా సభ్యులు లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు. గంజాయితో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ నాలుగు కేజీల గంజాయి స్వాధీనం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండియా రాజ్, విష్ణు ముత్తు కుమార్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి తిరుపూర్ కళాశాల ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు ఈ నెల 8న బరంపూర్లోని న్యూ బస్స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్కొక్కరు రూ.10వేలకు రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసుకున్నారు. అక్కడ నుంచి బిలాస్పూర్–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి ఈ నెల 9న మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్లో దిగారు. వీరిపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జీఆర్పీ సిబ్బంది నాలుగో నంబర్ ప్లాట్ఫాంపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా ఒక్కో బ్యాగులో రెండు కేజీల చొప్పున మొత్తం నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తూర్పు, గాజుల కాపు సంక్షేమానికి కృషి చిలకలపూడి(మచిలీపట్నం): తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్కు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించిందని ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా తూర్పు, గాజుల కాపు కులస్తులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వీరికి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం పొందటంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ఐఏఎస్, గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీసీ కులస్తులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ కె. రాజేంద్రబాబు, సంఘ నాయకులు పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారం బహూకరణ మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. -
రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దుర్గగుడిలో జరిగిన దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ సంస్థ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వలంటీర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో వృద్ధులు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వలంటీర్లు మంచి సేవలు అందించారని అభినందించారు. ఉత్సవాల విజయవంతంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. కేబీఎన్, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఒక షిఫ్ట్కు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో రోజుకు 60 మంది అమ్మవారి భక్తులకు సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
సీజేఐపై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేఐ తన ధర్మాసనంలో కూర్చుని ఉండగా, ఒక అడ్వకేట్ చెప్పు తీసి విసిరేశాడని ఇది అత్యంత అమానుషమని అన్నారు. ఎన్డీఏ పాలనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేటి పరిస్థితులకు తార్కాణమన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే, గ్రామాల్లో దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలన అతి భయంకరంగా ఉందన్నారు. దళితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులను కూటమి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఏపీకి చెందిన ఒక డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్ హరియాణాలో తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారని, ఆయన తొమ్మిది పేజీల నోట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాశా రని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత ఆఫీసర్లు, దళిత ఉద్యోగస్తులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని, చివరికి పండించిన ధాన్యాన్ని విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లర్లు లాభ పడ్డారని, రైతులు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోయారని వివరించారు. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ -
టపాసుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు
పెదపూడి(మొవ్వ): దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో మొవ్వ మండలం పెదపూడిలోని బాణ సంచా షాపులు, గోడౌన్లపై బందరు స్పెషల్ బ్రాంచ్ బృందం స్థానిక పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని పెడసనగల్లు రోడ్డులోని ఓ షాపులో అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు లేకుండా నిల్వ ఉంచిన టపాసుల ఉంచినట్లు గుర్తించారు. ఆ టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కూచిపూడి ఎస్ఐ కెఎస్ విశ్వనాథ్ తెలిపారు. కాగా నిల్వ ఉన్న టపాసుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై గ్రామ వీఆర్వో రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వెల్లడించారు. ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం తెల్లవారుజామున మండలంలోని అన్నవరం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ లారీని తనిఖీ చేసి ఇసుక ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా రాజమండ్రిలో బియ్యం దిగుమతి చేసి, అక్కడి నుంచి ఇసుక తీసుకువస్తున్న రెండు లారీలను మండలంలోని గండ్రాయి చెక్పోస్టు వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు లారీల డ్రైవర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వల్కి వెంకన్నం, వర్థం సురేష్, వంగర శ్రీశైలంను అదుపులోకి తీసుకుని వోల్టా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మండలంలోని మల్కాపురం మునేటి నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు తెలంగాణకు ఇసుక తరలిస్తుండగా చెక్పోస్టు సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమో దు చేసి, లారీలు సీజ్ చేశామని తెలిపారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మద్యం మత్తులో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు మధురానగర్లో వీరంగం సృష్టించాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజేష్ శ్యామ్(22) బెంగళూరు నుంచి తన సొంత నివాస ప్రాంతానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో విజయవాడలో ట్రైన్ దిగిన రాజేష్ పూటుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో స్పృహ తెలియక దారితప్పి బీఆర్టీఎస్ రోడ్డు మధురానగర్ చిన్న వంతెన వద్దకు చేరుకున్నాడు. మద్యం మత్తులో తూలుతూ వంతెన వద్ద ప్రమాదకరంగా నడుస్తుండటంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న రాజేష్ చెప్పిన మాట వినకుండా తూలుతూ రైవస్ కాలువలో పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన తాడు వేసి రైవస్ కాలువలోకి దూకి రాజేష్ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
13నుంచి విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జేసీ ఇలక్కియ.. జాయింట్ కమిషనర్(జీఎస్టీ) ఎస్.ప్రశాంత్ కుమార్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గుదల ప్రభావమున్న వస్తువుల స్టాళ్లతో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. డీఆర్డీఏ, యూసీడీ ద్వారా కూడా కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా పరిశ్రమల అధికారి పి.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
నేటి నుంచి ఈఎన్టీ వైద్యుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగో లాజిస్ట్స్ ఇండియా (ఏఓఐ) దక్షిణ భారత, రాష్ట్ర సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎంఏ రెహమాన్ తెలిపారు. అసోసియేషన్ దక్షిణ భారత, రాష్ట్రశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ నోవోటెల్లో ఈ సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. గురువారం సదస్సు నిర్వహించనున్న హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సదస్సు దక్షిణ భారత దేశంలోని 750 మందికి పైగా ఈఎన్టీ వైద్యులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన ఈఎన్టీ విభాగ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీగా రానున్నారన్నారు. ఈ నెల 11న జరిగే ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని, నిర్వహణ అధ్యక్షుడిగా డాక్టర్ కేవీఎస్ చౌదరి, డైరెక్టర్గా డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాగా డాక్టర్ అక్కినేని శివరామ్తో పాటు, నగరంలోని పలువురు వైద్యులు పర్యవేక్షిస్తారని రెహమాన్ వివరించారు. -
పాపం.. పసుపు రైతు!
చల్లపల్లి: ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా కరకట్ట దిగువున ఉన్న మెట్ట పొలాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా పుసుపు పంటపై వరద తీవ్ర ప్రభావం చూపింది. వరద తాకిడికి గురైన పసుపు పొలాలు క్రమంగా ఎండిపోతున్నాయి. చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు పంచాయతీ పరిధిలోని 194 ఎకరాలు, నిమ్మగడ్డలో, వెలివోలు ప్రాంతాల్లో మరో 80 ఎకరాలు మొత్తం 274 ఎకరాల వరకూ పసుపు సాగు చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు. భారీగా ఖర్చులు.. ఇప్పటివరకూ ఎకరా పసుపు సాగుచేసేందుకు విత్తనానికి రూ.37,500, ఎరువులకు రూ.30వేలు(మూడు కోటాలు), కూలీ ఖర్చులకు రూ.20వేలు మొత్తం ఎకరాకు రూ.90వేల నుంచి రూ.1లక్ష వరకూ పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వరదల వల్ల 150 ఎకరాలకు పైగా పసుపు నీట మునిగిందని అంచనా. అయితే వరదలో మునిగిన పంటలకు బీమా వర్తించదని అధికారులు చెబుతుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు. చల్లపల్లి మండలంలో ఇప్పటి వరకూ ఈ–క్రాప్ చేయించుకున్న దాని ప్రకారం 207 ఎకరాల్లో పసుపు పంట రైతులు సాగు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు నమోదు చేస్తాం. వరదల వల్ల మునిగి, పాడైపోయిన పంటలకు బీమా వర్తించదు. – జె.కీర్తి, ఏఓ, హార్టికల్చర్ -
12న మట్టి పాత్రల తయారీపై వర్క్ షాప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మట్టి పాత్రల తయారీపై వర్క్షాప్ను ఈ నెల 12వ తేదీ ఆదివారం తమ సెంటర్లో నిర్వహిస్తున్నామని ఆర్టీజో సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న సెంటర్ ఆవరణలో వర్క్షాప్నకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టితో బొమ్మలను తయారు చేసే ప్రాచీన కళకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) డిగ్రీ పూర్తి చేసిన ప్రముఖ పోటరీ ఆర్టిస్ట్ సురేష్ ఈ వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరై మట్టితో వివిధ రకాల పాత్రలు తయారుచేయడం, వాటికి అందంగా రంగులు అద్దడంపై శిక్షణ ఇస్తారన్నారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎవరైనా హాజరు కావచ్చని చెప్పారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. వివరాలకు 99499 99222లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పామర్రు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. కూటమి ప్రభుత్వం తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి.. ప్రజలను ఇబ్బందులు పాలు జేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్ కుమార్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్లను, ప్రజా ప్రతినిధులను బెదిరించి పంచాయతీల పాలన సజావుగా సాగనీయడం లేదన్నారు. సర్పంచ్ల విధులకు అడ్డు పడుతూ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సర్పంచ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం ఎక్కడ? ఇటీవల వచ్చిన వరదలకు తోట్లవల్లూరు మండలంలో ముంపునకు గురైన వాణిజ్య పంటలకు వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కై లే డిమాండ్ చేశారు. వరదలు తగ్గి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు జరిగిన నష్టాన్ని అంచనా కూడా సక్రమంగా వేయకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శమన్నారు. వాణిజ్య పంటలు ఒక్కొక్క ఎకరానికి రూ.లక్ష చొప్పన పెట్టుబడులు పెట్టిన రైతులు నష్ట పరిహారం అందక విలవిల్లాడుతున్నారన్నారు. మండలంలో 5,200 ఎకరాలలో పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, చెరకు తదితరాలను హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నారని దీనిలో సుమారు 2వేల ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మినుము పంట పూర్తిగా నీట మునిగి నష్టం ఏర్పడితే ఇంత వరకు జిల్లా స్థాయి అధికారులు పరిశీలన చేసిన దాఖలాలు లేవని అన్నారు. పసుపు పంట సాగుకు ఫసల్బీమా పథకంలో ఎకరానికి రూ.1100 చెల్లించి బీమా చేసినట్లు వివరించారు. కనీసం ఆ బీమా క్లయిమ్లను కూడా ప్రభుత్వం ఇప్పించలేక పోవడం దారుణమని అన్నారు. దోచుకోవడం.. దాచుకోవడమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని కై లే అనిల్ విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీటుగా తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ యాప్ను ప్రారంభించారని దీని ద్వారా కూటమి నేతలు, అధికారులు తమ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వారి పేర్లను యాప్లో నమోదు చేస్తామన్నారు. ఎంపీపీ దాసరి అశోక్కుమార్, ఐదు మండల అధ్యక్షులు కళ్లవ వెంటేశ్వరరెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, రాజుల పాటి రాఘవరావు, యలమంచిలి గణేష్, గోగం సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.