breaking news
NTR
-
లోకేష్ రాజీనామా కోసం పట్టు
నందిగామ గాంధీ సెంటర్లో మహాత్ముని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, యువత ఆంధ్రప్రభకాలనీలోని వైఎస్సార్ సీపీ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, సుధాకర్ బాబు, విద్యార్థి సంఘ నేత రవిచంద్ర తదితరులు వన్టౌన్లో పశ్చిమ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, యువతసాక్షి ప్రతినిధి, విజయవాడ: డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ర్యాలీలు జరిగాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆదివారమే దేవినేని అవినాష్కు నోటీసులు అందజేశారు. సోమవారం ఉదయం అవినాష్ ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి ర్యాలీకి బయలు దేరితే అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, యువతకు సమాచారం అందడంతో అందరూ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల్సాయి, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, పార్లమెంటు కార్యదర్శులు ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతిరావు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షుడు సయ్యద్ అలీం, చందా కిరణ్తేజ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 20267ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ మాచవరానికి చెందిన బీహెచ్ బాలకృష్ణారావు, సేతు మాధవి, కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు.రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెడన లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ హారిక సోమవారం నిరసన ర్యాలీ చేశారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిలద్వారా వెళుతుంది. -
ప్రజలకు భరోసాగా నిలవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు భరోసాగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ జరిగింది. జేసీ ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పెండింగ్లో ఉన్న, ఇప్పటికే పరిష్కరించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పరిష్కార పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గత వారం నుంచి పెండింగ్లో ఉన్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. ‘అంకుశం’ బాధితులు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు మోసపోయారు.. ఇంత డబ్బులు ఇస్తా అంటే నమ్మారు ? కేసు నమోదు చేశారు కదా.. చూద్దాం’ అంటూ కలెక్టర్ చెప్పడంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. కలెక్టర్ నుంచి ఆశించిన మేర భరోసా లభించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని కలెక్టర్ హెచ్చరించారు. మొత్తం 178 అర్జీలను స్వీకరించినట్లు లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అఫీఫాకు మైనారిటీ మంత్రి, డీజీపీ నివాళులు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డీసీపీ షిరీన్బేగం కుమార్తె ఎండీ అఫీఫా మృతదేహం వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా సోమవారం నివాళులర్పించారు. చీరాల బీచ్కు స్నేహితులతో కారులో వెళ్తుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం కుమార్తె మహ్మద్ అఫీఫా(24) ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. షిరీన్బేగం, మస్తాన్ దంపతులకు కుమారుడు రెహాన్, కుమార్తె అఫీఫా సంతానం. అఫీఫా ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఎంఏ సైకాలజీ చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అవుతుంది. అఫీఫా మరణవార్తను జీర్ణించుకోలేక డీసీపీ షీరీన్బేగం గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమార్తె జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ఆమె భౌతికకాయాన్ని చూస్తూ పలుమార్లు కుప్పకూలి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అఫీఫా భౌతికకాయాన్ని విజయవాడ న్యూఆర్ఆర్పేటలోని స్వగృహానికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్, డెప్యూటీ మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, అవుతు శ్రీశైలజతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు అఫీఫా మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. డీసీపీ షీరీన్బేగం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ టాకీస్ వద్ద ఉన్న కబర్స్తాన్లో ముస్లిం సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. విజయవాడలీగల్: విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ కేసులో డీజీపీ హరీష్కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఏసీపీ ఎం.మానసను ప్రతివాదులుగా చేర్చి, వారిని విచారించాలని కోరుతూ పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి విజయవాడలోని 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై ఆయన తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సోమవారం న్యాయవాది గవాస్కర్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఈ కేసులో వ్యక్తిని కనిపించకుండా చేయడమే కాకుండా, అతని తల్లికి బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితిలో కేసు విచారణ సాగుతోందన్నారు. 17వ తేదీకి వాయిదా మాజీ సీఐ నాగరాజుతోపాటు డీజీపీ, సీపీ, ఏసీపీ కూడా నిందితులేనని, సాక్ష్యాలు తారుమారు చేశారని, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 2026 మే 28వ తేదీన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, పిన్ని కనకదుర్గ కలసి ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా సమాచారం తెలియపర్చినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సాక్ష్యాధారాల ద్వారా న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. డీజీపీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎంపీ గురుమూర్తికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, పిటీషన్ విచారణకు అర్హత లేదని వాదించారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 21కు విరుద్ధంగా కేసు ఉందని స్పష్టంచేశారు. ఇలాంటి కేసుల్లో ఎవరైనా పిటీషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ గురుమూర్తి పిటీషన్ దాఖలు చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఈ కేసు సభ్యసమాజానికి సంబంధించిన విషయమని, సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తికి దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటీషన్ను ఎంపీ గురుమూర్తి స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని, ఆయన సాక్ష్యాన్ని రికార్డు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి ఎస్.శ్రీకాంత్ ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. దీంతో సాక్ష్యం రికార్డు అయిన పిదప న్యాయస్థానం అనుమతిస్తే డీజీపీ, సీపీ, ఏసీపీలు నిందితులుగా చేరే అవకాశముంది. వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నీటిని అధికారులు డెల్టాలోని కృష్ణా, తూర్పు ప్రధాన కాలువలతో పాటుగా గుంటూరు ప్రధాన కాలువలకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి సామర్థ్యం 12 అడుగులు కాగా ప్రస్తుతం 11.9 అడుగులు ఉంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా పంట పొలాలకు వదిలేస్తున్నారు. బ్యారేజీ నీటి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.04 టీఎంసీలుగా ఉంది. బ్యారేజీ సామర్థ్యానికి 99.25 శాతం నీరు చేరినట్లుగా అధికారులు తెలిపారు. ప్రధానంగా ఎగువన వస్తున్న నీటితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోందన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వం
నీరు ఉండి సాగుకు ఇవ్వని పెడన: కాలువల్లో సరిపడా నీరున్నా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వడం లేదని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రమేష్(రాము) చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్కొక్క రోజు చొప్పున నాలుగు రోజులు రిలేదీక్షలు చేపట్టారు. ఐదో రోజైన సోమవారం పెడనలో నియోజకవర్గ స్థాయి నిరసన ప్రదర్శన(ర్యాలీ) నిర్వహించారు. పెడనలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోగా, సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ కొనసాగించారు. పెడనలోని బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు అక్కడ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. ఎమ్మెల్యే ఇంటికే పరిమితమయ్యారు.. బంటుమిల్లి రోడ్డు సెంటర్లో రాము మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాలో చాలా మంది రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెడన నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా వీటిల్లో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో వరి సాగు వేశారని, మరో 30 వేల ఎకరాల్లో వరి సాగు వేయాల్సి ఉందని చెప్పారు. వీరంతా నీటి కోసం ఎదురు చూస్తున్నారని, వీరే కాదని కృష్ణాడెల్టా అంతా సాగునీటి విడుదల ఎప్పుడా అంటూ చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటికే పరిమితం కారాదని, నియోజకవర్గంలోని వారందరికీ జవాబుదారీగా ఉండాలని ధ్వజమెత్తారు. మొద్దు నిద్ర విడిచి పెట్టి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీరు విడుదల చేయలేని వారు పచ్చిరొట్ట విత్తనాలను, వరి విత్తనాలను ఎందుకు సబ్సిడీపై అందజేశారని నిలదీశారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎందుకు ఇస్తున్నారంటూ పేర్కొన్నారు. ఒక పక్క నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొంటూనే, మరో పక్క ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని, నీరు అందదని, పంటలు వేయొద్దని చెబుతన్నారని మండిపడ్డారు. నీరు ఇవ్వని పక్షంలో దశల వారీగా రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యచరణ వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు గరికపాటి రామానాయుడు, కొండవీటి నాగబాబు, తిరుమాని శ్రీనివాసరావు, మైలా రత్నకుమారి, మండల కన్వీనర్లు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతిరావు, పిచ్చిక సతీష్, దావు బైరవలింగం, కటకం ప్రసాద్, ఎండీ ఖాజా, వన్నం శ్రీలత, జన్యావుల ఝాన్సీ, కొల్లాటి గంగాధరరావు, ఎంపీపీ రాజులపాటి వాణి, సంగా మధుసూదనరావు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరికలు
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అమరబోయిన రవి, దుండగుల సత్యనారాయణ తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సోమవారం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. వారికి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కనపర్తి నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి మట్టా ప్రతాపరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. గండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షుడు దమ్మాలపాటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే నేను కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తాను చేయగలిగే ఒక మంచి పనిని లేదా కృషిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు తదితరులు తమ దేశభక్తి, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా 30 సెకన్ల ‘అనే నేను’ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెలిపారు. ‘అనే నేను’’ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో హ్యాష్ట్యాగ్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికాతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాలు విజయవాడలో సోమవారం జైల్ భరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి గవర్నర్పేట పోలీసుస్టేషన్కు వెళ్లి స్టేషన్ ఎదుట స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను అరెస్ట్ చేయాలని ఆయా సంఘాలు స్వచ్ఛందంగా పోలీసులను కోరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల భారత్లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు తదితరులు పాల్గొన్నారు. -
27 ఉత్తమ ఛాయా చిత్రాలు
మూడు విభాగాల్లో ఎంపిక చేసిన జ్యూరీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటోగ్రాఫర్ల నుంచి విశేష స్పందన లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ పోటీలకు మొత్తం 221 ఛాయాచిత్రాలు ఎంట్రీలు పంపగా, వాటిలో మూడు కేటగిరీలకు సంబంధించిన 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో ప్రదర్శించిన ఛాయాచిత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరీల వారీగా పరిశీలించిన జ్యూరీ సభ్యులు ప్రతిభ, సృజనాత్మకత, అంశ ప్రాధాన్యం, ఛాయాచిత్ర నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 27 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారని తెలిపారు. విశేష అనుభవం కలిగిన ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ టి.శ్రీనివాస రెడ్డి, ఎఫ్ఆర్పీఎస్ ది హిందూ రిటైర్డ్ ఫొటో జర్నలిస్ట్ సి.హెచ్.వి.ఎస్. విజయభాస్కరరావు, విజయవాడ స్టూడియో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవికుమార్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎస్.రామారావు (ఫ్లాష్ రామారావు), డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షబీనాలు జ్యూరీగా వ్యవహరించారన్నారు. నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను ఆగస్టు 19న అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, రిటైర్డ్ ఏవీ సూపర్వైజర్ వీవీ ప్రసాద్, ఏవీ సూపర్వైజర్ బి.బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలు ధరించి జూడాల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రుల్లో సోమవారం జూనియర్ వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తమకు స్టైపెండ్ పెంచే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. రెండేళ్లకు ఒకసారి జూడాలకు స్టైపెండ్ పెంచాల్సి ఉంది. అందులో భాగంగా గతేడాది డిసెంబరులో పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ స్టైపెండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఉంటే అన్నిప్రభుత్వ వైద్య కళాశాలలు, భోదనాస్పత్రిల్లో సమ్మెకు దిగనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు ఆధార్ సేవలను వేగంగా అందించడానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు వివరించారు. శిబిరాలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు, ఆ తర్వాత 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వీటిలో కొత్త ఆధార్ నమోదు, పేరును సరిచేయడం, నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల అప్డేషన్ చేస్తారని తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. ఆధార్ వివరాలను సక్రమంగా, తాజా సమాచారంతో ఉండటం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఇతర సేవలను పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భవానీపురం (విజయవాడ పశ్చిమ): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యరీతులను పరిరక్షించడంతోపాటు గిరిజన విద్యార్థుల విద్య, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యాన సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అవసరమైనవి అందజేస్తున్నామన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్ను సీపీఓకు వెంటనే పంపాలని సూచించారు. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో త్రివర్ణ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో లక్ష్మీనరసింహం వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రైళ్లలో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల దగ్గర సెల్ఫోన్లు చోరీ చేసే దొంగను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే జీఆర్పీ సీఐ రమణ ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ఆదివారం రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్లాట్ ఫాం నంబర్ 10, ఉత్తర దిక్కు వైపున ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి 45 ఏళ్ల షేక్ గౌసే అనే వ్యక్తి తారసపడ్డాడు. అతని నడవడికి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా అందులో 13 సెల్ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు షేక్ గౌసే విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని మసీదురోడ్డులో నివాసిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మాదల రామచంద్రరావు(69) సోమవారం మృతి చెందారు. పోరంకి ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకా రం పెదఓగిరాలకు చెందిన రామచంద్రరావు ఈ నెల 7న కానూరు 100 అడు గుల రోడ్డులోని అన్నే కల్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణకు బైక్పై బయలుదేరాడు. ఆయన కానూరు న్యూఆటోనగర్ నుంచి 100 అడుగుల రోడ్డులోని కల్యాణ మండపం వద్దకు రాగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రామచంద్రరావు తలకు తీవ్ర గాయాల య్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువు నరేంద్రబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాయన ఆదిబాబు, అధ్యక్షుడు చనుమోలు వెంకట రమణ.. మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. విజయవాడ నగర మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, జనరల్ ఫండ్ ద్వారా ఈ ఏడాది జూలై 31 వరకు రూ.350 కోట్లు, కంటింజెంట్ బిల్లులు (సీ–బిల్లులు) రూ.40 కోట్లు, ఇతరత్రా రూ.10 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించనందున సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపేయటంతోపాటు కొత్త పనులను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. -
అడ్రస్ లేని అంకుశం!
సాక్షి, విజయవాడ: అంట్లు తోమే స్క్రబ్ తయారీ, నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని కోట్ల రూపాయలు వసూలు చేసిన మాష్ అల్లాహ్ యజమాని పసుపులేటి అంకుశం బోర్డు తిప్పేసి, పరారయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన డబ్బులు చెల్లిస్తానని చెప్పిన ఆయన కొన్ని రోజులుగా ఫోన్ ఎత్తడం లేదని బాధితులు వాపోతున్నారు. శనివారం రాత్రి వరకు కూడా పసుపులేటి అంకుశం ఫోన్ వాట్సాప్ పని చేసింది. పోలీసులు మాత్రం అతను కనిపించడం లేదని చెప్పడంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా ప్లాన్ ప్రకారమే.. విజయవాడకు చెందిన మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థ నిర్వాహకుడు అంకుశం రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రచారం చేసుకున్నాడు. ఒకరిని చూసి మరొకరు ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 1800 మంది ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారిలో ఎక్కువ మంది మహిళలే. రూ.30వేలతో మొదలు పెట్టి రూ.3కోట్ల వరకు వసూలు చేశాడు. మొత్తంగా రూ.100 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో కడప, కర్నూలు వారే ఎక్కువ.. మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్కు ఇన్స్ట్రాగామ్లో యాడ్ చూసి ఆకర్షణకు లోనై కడప, కర్నూలు వారే ఎక్కువ మంది డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. డబ్బులు కట్టిన వారికి అగ్రిమెంట్ ఇస్తాం అని కూడా అంకుశం నమ్మించాడు. కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ఏకంగా రూ.3.50కోట్ల మేర డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. అంట్లు తోముకునే స్క్రబ్స్ తయారీకి మెటీరియల్ తామే ఇస్తామని, తయారు చేసిన వాటిని మళ్లీ తామే కొనుగోలు చేస్తామని వారిని నమ్మించారు. దీంతో పెద్దఎత్తున బాధితులు డబ్బులు చెల్లించారు. అధికార పార్టీ నేతల హస్తం.. సంస్థ ఎండీ అంకుశం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లుగా చేరిన వారికి మొదటి ఆరు నెలలు పూర్తిగా డబ్బులు ఇచ్చిన అంకుశం వారిలో నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత కోట్ల రూపాయల మేర డబ్బులు చేతికి రాగానే ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు అంకుశంకు కాల్స్, మెసేజులు పెట్టడం ప్రారంభించారు. అయితే అంకుశం ఆధార్, పాన్ కార్డు అన్నీ కూడా నకిలీవని బాధితులు ఆరోపిస్తున్నారు. అతనికి జీఎస్టీ నంబర్ ఉండడంతోనే తాము డబ్బులు కట్టామని చెబుతున్నారు. ఆగస్టు 10వ తేదీ అందరికీ డబ్బులు చెల్లిస్తానని చెప్పిన అంకుశం బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నిన్న, మొన్నటి వరకూ వాట్సాప్ చూసిన అంకుశం డబ్బులు ఇవ్వాలని.. ఎందుకు ఇలా మోసం చేశారని కొందరు అంకుశం ఫోన్కు మెసేజులు పెడితే చూస్తున్నాడని.. కానీ రిప్లయ్ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఫోన్ ఆన్లోనే ఉన్నా.. అంకుశం పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అయితే తాము ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని, తమకు డబ్బులు కట్టిన వారు తమ ఇళ్లపై దాడులు చేసేందుకు వస్తున్నారని పలువురు ఏజెంట్లు వాపోతున్నారు.మాషా అల్లా ఎంటర్ర్పైజెస్ సంస్థ నిర్వాహకుడు అంకుశం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్క్రబ్ తయారీ, నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పేరిట తమను నమ్మించి డబ్బులు కట్టించుకుని మోసం చేశాడంటూ ఆదివారం సాయంత్రం వరకు సత్యనారాయణపురం పోలీస్స్టేషన్కు బాధితులు వస్తూనే ఉన్నారు. మొత్తం 500 మంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టేషన్లో ప్రత్యేక కౌంటర్ పెట్టారు. కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నామని సత్యనారాయణపురం పోలీసులు చెబుతున్నారు. -
డబ్బుల్లేవ్.. బిల్లులు రావ్!
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026పటమట(విజయవాడతూర్పు): ‘రెండేళ్లుగా బిల్లులు రావడం లేదు.. అప్పులు తీసుకువచ్చి పనులు చేస్తున్నాం.. అత్యవసరమైన పనులని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.. బిల్లుల విషయం వచ్చే సరికి ముఖం చాటేస్తున్నారు’.. ఇది వన్టౌన్ ప్రాంతంలోని వీఎంసీ కాంట్రాక్టర్ వేదన. ‘సీఎం వస్తున్నారని రోడ్డు పనులు చేయించుకున్నారు. బిల్లులు అడిగితే మాటదాటేస్తున్నారు’ ఇది సెంట్రల్ నియోజకవర్గంలో ఓ కాంట్రాక్టర్ దుస్థితి. ‘రెండేళ్లుగా బిల్లులు ప్రాసెస్ చేయటంలేదు.. ఇంట్లో నగలు కుదువ పెట్టి పనులు చేశారు.. తీరా బిల్లుల వ్యవహారంలో కమిషనర్ కూడా సరిగ్గా స్పందించటం లేదు’ ఇది తూర్పులో మరో కాంట్రాక్టర్ ఆందోళన. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఒక్క బిల్లు కూడా ప్రాసెస్ చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఎంసీకి రావాల్సిన స్టాంప్డ్యూటీ ట్యాక్స్, ఆర్టీఏ నుంచి రావాల్సిన రోడ్ ట్యాక్స్ తదితర శాఖల నుంచి వచ్చే నిధులను ప్రభుత్వం ఖనాజాకు మళ్లిస్తోందని ఆరోపణ ఉంది. కేవలం బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) నిధులు, స్ట్రాం వాటర్ కోసం కేంద్ర ఇచ్చే నిధులను మాత్రమే వీఎంసీ వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపణ ఉంది. దీనికితోడు వీఎంసీకి వచ్చే ఆస్తి, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఖాళీ స్థలాల పన్నులు తదితర మొత్తాన్ని కూడా ప్రభుత్వం జమ చేసుకుంటోందని తెలుస్తోంది. గతంలో బిల్లుల చెల్లింపులో ఇలాంటి స్థితి లేదని, కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా వీఎంసీకి కేంద్ర ప్రభుత్వం స్ట్రాం వాటర్ నిర్మాణం కోసం విడుదల చేసిన రూ. 400 కోట్లలో 2014–18 మధ్య నాటి కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.200 కోట్లు నిధులు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. వీఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లు, రిటైనింగ్ వాల్స్, వీధి దీపాలు, పార్కులు, యూజీడీ తదితర పనులకు సంబందించి ఇప్పటి వరకు రూ. 400 కోట్లు బకాయిలను వీఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. సీఎఫ్ఎంఎస్ (కాంపెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) ఇప్పుడది నిధి పోర్టల్గా మారింది. దీనిద్వారా వీఎంసీ కాంట్రాక్టర్లకు 2025 డిసెంబర్ వరకు 200 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు సీ బిల్లులు రూ.40 కోట్లు, 2026 తర్వాత ఏర్పడిన నిధి పోర్టల్ల్లో రూ. 200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీఎంసీ సాధారణ నిధుల నుంచి బిల్లుల చెల్లింపులు చేయాలంటే ఇబ్బందిగా మారింది. నెలకు రూ.10 కోట్లు కూడా చెల్లించలేని దుస్థితి ఉంది. వీఎంసీ ఏప్రిల్ చివరికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మరోసారి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా అవి కూడా నెరవేరలేదు. నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటికే పూర్తైన పనులకు రూ.50 కోట్లు, నగరంలో పూర్తి దశకు చేరుకుంటున్న కొనసాగుతున్న పనులకు మరో రూ.50 కోట్లు బిల్లులు జరగాల్సి ఉంది. నగరంలోని కాంట్రాక్టర్లకు సీఎఫ్ఎంఎస్ స్థానంలో నిధి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి ఒక్క బిల్లు చెల్లింపు కూడా ప్రాసెస్ చేయలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేస్తున్నాం. రెండేళ్లుగా మాకు బిల్లులు రావడం లేదు. రూ. 350 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై మేం మున్సిపల్ మంత్రి నారాయణ, కమిషనర్ ధ్యానచంద్రను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. కాలయాపన చేస్తున్నారు తప్ప బిల్లులు ఇవ్వడం లేదు. అందుకే సోమవారం నుంచి సమ్మె చేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమ్మె నోటీసు కూడా ఇచ్చాం. – ఆదిబాబు, ప్రధాన కార్యదర్శి, ది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ -
నేరాల నియంత్రణపై ‘రైల్వే’ సమీక్ష
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఐజీ–పీసీపీసీ (ఇన్స్పెక్టర్ జనరల్–ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) అంజనీ కుమార్ సిన్హా ఆదివారం విజయవాడ డివిజన్లో పర్యటించి ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణపై ఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినం దించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ షణ్ముఖ వడివేల్ ప్రస్తుత ఏడాది ఆర్పీఎఫ్ సాధించిన ప్రధాన చర్యలను ఐజీ–పీసీఎస్సీ దృష్టికి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో సేవలందించామన్నారు. జన్ విశ్వాస్ చట్టం 2006 కింద వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 2,948 మందిపై కేసులు నమోదు చేసి రూ. 21,84, 700 జరిమానా విధించినట్లు తెలిపారు. ఆపరేషన్ అమానత్ పథకం ద్వారా రూ. 01,45,04, 437 విలువైన 355 లగేజీలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించామన్నారు. రైల్వే చోరీలపై 70 కేసుల్లో 61 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 61,85,600 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత ప్రమాణాలతో సేవలు -
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి
బూదవాడ(జగ్గయ్యపేట అర్బన్): రాష్ట్రంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సైదమ్మ భర్త గడ్డం శ్రీనివాసరావు జనసేన పార్టీని వీడి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు బూడిద నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ మీడియెట్ విద్యార్థి వారణాసి భరధ్వాజ్(16) దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో నింపింది. విద్యార్థి దుర్మరణంపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక ఐశ్వర్య గ్రాండ్స్లో నివాసం ఉంటున్న వారణాసి శ్రీనివాస కుమారస్వామి, సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమారులు. అర్చకత్వం చేసుకుంటూ కుమారులను చదివించుకుంటున్నారు. చిన్నకుమారుడు వారణాసి భరధ్వాజ్ భవానీపురంలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇబ్రహీంపట్నంకు స్కూటీపై వచ్చిన విద్యార్థి తిరుగు ప్రయాణంలో ఫెర్రీ నుంచి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ రింగ్ సెంటర్లో ఢీకొట్టింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని 108 సిబ్బంది హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి నేత్రదానం.. కన్నకుమారుడిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేత్రాలు సేకరించారు. తమ విషాదాన్ని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేలా మార్చేందుకు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది. పోలీసులు యువకుడి పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులు ప్రమాదానికి గురైన లారీని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్. రవివర్మ తెలిపారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్):ఖాతాదారుకు డెలివరీ కానీ క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్ష మేర సైబర్ నేరస్తులు కొట్టేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. అజిత్సింగ్నగర్ పోలీసుల కథనం మేరకు.. నందమూరినగర్ భారతమాత మందిరం రోడ్డులో నివసించే చిట్టినాడ శ్రావణి తన భర్తతో కలిసి శ్రీదేవి డ్రై క్లీనింగ్ షాపు నడుపుతోంది. ఆమెకు ఓ ప్రైవేట్ బ్యాంకు క్రెడిట్ కార్డును 2019 నుంచి వాడుతున్నారు. 2027తో కాల పరిమితి ముగిసే ఆ కార్డు గురించి ఈ ఏడాది జూన్ 30వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలి, వివరాలు చెప్పాలని కోరారు. అయితే శ్రావణి అందుకు నిరాకరించింది. ఆ తరువాత క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, పుట్టిన సంవత్సరం చెప్పాలని అడగడంతో ఆమె ఆ వివరాలు వెల్లడించింది. ఆ తరువాత ఆ బ్యాంక్ యాప్ సరిగ్గా పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి జూలై 20వ తేదీన టోల్ ఫ్రీ నంబర్కు ఫోను చేసి కార్డుకు బ్లాక్ చేయించింది. బ్లాక్ చేసిన తర్వాత కూడా కార్డు అప్డేట్ మెసేజ్ రావడంతో తిరిగి ఆగస్టు రెండో తేదీన మళ్లీ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి బ్లాక్ చేయాలని కోరగా, అదే ఐవీఆర్ఎస్ కాల్ లోనే కొత్త కార్డు కొరియర్ ద్వారా పంపిస్తామని చెప్పారు. శ్రావణి తనకు కార్డు వద్దని చెప్పినా కొత్త కార్డు జారీ చేసినట్లు ఆమెకు ఒక మెసేజ్ పంపారు. అయితే ఈ నెల ఆరో తేదీన క్రెడిట్ కార్డు నుంచి రూ.1.07,941 మేర వాడినట్లు మెసేజ్ రావడంతో నివ్వెరపోయిన ఆమె అసలు తనకు క్రెడిట్ కార్డు ఇంకా డెలివరీనే కాలేదని, డబ్బులు ఎలా వాడతానని బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించింది. ఈ డబ్బులు మీరే వాడినట్లు చూపుతోందని బ్యాంక్ సిబ్బంది బదులిచ్చారు. దీంతో ఆమె అజిత్సింగ్నగర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఎన్జీవో హోంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమపై ఆధారపడి అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారి జీవనోపాధికి బాటలు వేయాలన్నారు. ఉపాధ్యక్షుడు జంధ్యాల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణను కలసి త్వరాలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ.. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. స్టూడియోలు, రికార్డింగ్,రీ రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు కె.అప్పారావు, ఎస్.హరనాథ్, మల్లికార్జున చౌదరి, జె.సరోజిని, ముళ్లపూడి రాధ, షహనాజ్, పిల్లి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎంఏఏ) అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్ -
దుర్గమ్మ చెంత భక్తజన జాతర
● అంతరాలయ దర్శనం రద్దు.. ● టికెట్ల విక్రయాలు నిలిపివేత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే కొండపైకి కేవలం దేవస్థాన బస్సులు, ద్విచక్ర వాహనాలను మినహా ఇతర వాహనాలను అనుమతించలేదు ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం రెండు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. రద్దీ తాకిడితో వీఐపీ క్యూలైన్తో పాటు సీఎం గేట్ను సైతం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కనకదుర్గానగర్లో పండుగ వాతావరణం సారెతో ఆలయానికి బయలుదేరిన భక్తులు తొలుత కనకదుర్గానగర్లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమను సమర్పించారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఆటోలపై అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలిరావడం కనిపించింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులతో , భక్తుల పూనకాలతో సారె సంబరం అంబరాన్ని తాకింది. సారె సమర్పించిన వందకు పైగా బృందాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30 వేల మందికి పైగా సారె సమర్పించారని పేర్కొంటున్నారు. ఆషాఢ మాసంలో ఈ ఆదివారం అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం, సారె సమర్పించడం సరికొత్త రికార్డు అని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈవో, చైర్మన్లతో పాటు డీఈవో కిషోర్కుమార్, ఏసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్బాబు ఇతర అధికారులు క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
వైభవంగా సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరి గింది. లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పెనమలూరు: పోరంకిలో ఈ నెల 12వ తేదీ జాబ్మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.సురేష్కుమార్ తెలిపారు. ఆయన ఆదివారం వివరాలు తెలుపుతూ 12వ తేదీ ఉదయం 9.30 గంటలకు పోరంకి బందరు రోడ్డులోని వరుణ్మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్సా షోరూమ్లో వివిధ విభాగాల్లో మొత్తం 129 పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైన డిగ్రీ, ఇంజినీరింగ్ మెకానికల్ చదివిన వారు హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు. ఆధార్ లింకు ఉన్న ఫోన్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. ఎంపికైన వారికి కేటగిరీ ప్రకారం నెలకు జీతం రూ.12 వేల నుంచి రూ.28 వేల వరకు ఇస్తారన్నారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96767 08041, 99854 44333, 99892 31431 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) ఆధ్వర్యాన ఇంటర్జోన్ వాలీబాల్ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, సమయపాలన అవసరమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. విధుల్లో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. అనంతరం ఇంటర్ జోన్లో భాగంగా ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎన్టీటీపీఎస్, ఎయిర్పోర్ట్ యూనిట్, విజయవాడ గార్డ్స్, హెడ్ క్వార్టర్ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. టోర్న మెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్ కమాండెంట్ కె.రమేష్ తెలిపారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ భావన, సృజన పెంపొందించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థుల్లో జాతీయ భావన, సృజనాత్మకతను పెంపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రైట్ మైండ్స్ సంస్థ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని బాపు మ్యూజియంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి కలెక్టర్ లక్ష్మీశ చిత్రలేఖనం పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందిస్తున్న చిత్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో సృజనాత్మక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను చిత్రాల రూపంలో వ్యక్తీకరించడంతో విద్యార్థుల్లో జాతీయ భావన మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం, జాతీయ నాయకులు, స్వాతంత్య్ర స్ఫూర్తి తదితర అంశాలను చిత్రాల ద్వారా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పోటీల్లో సుమారు 250 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలను నాలుగు గ్రూపులుగా నిర్వహించారు. ప్రతి విభాగంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ -
వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అవతకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్కు పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నిర్వహించే ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కాలువలపై రియల్టర్ల కన్ను!
● పంట కాలువను పూడ్చి రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు ● నీరు వెళ్లే మార్గం లేక 100 ఎకరాల వరి మాగాణికి ముంపు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం ● బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం జి.కొండూరు: జిల్లాలో పలుచోట్ల కాలువలపై రియల్టర్ల కన్ను పడింది. దీనికి నిదర్శనం వెలగలేరు పంట కాలువలు. ఇక్కడ కాలువలు లేకుండా చేసి వెంచర్లు వేయడంతో 100 ఎకరాలకు పైగా వరి మాగాణి ముంపునకు గురై రైతులు లబోదిబో అంటున్నారు. ఆక్రమణ ఇలా.. వెలగలేరు గ్రామ రెవెన్యూ పరిధిలోని కవులూరు రోడ్డుకు ఆనుకొని సర్వే నంబర్లు 264, 265లో గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 24ఎకరాల వరకు భూమి ఉంది. దీనికి ఎగువన ఉన్న మాగాణి భూముల్లో అదనపు నీరు పోయేందుకు పూర్వం భూస్వామికి చెందిన భూమిలో నుంచి కాలువ ఉండేది. వెలగలేరు నుంచి కవులూరు రోడ్డు వరకు 2.5కిలోమీటర్లు మేర 45అడుగుల వెడల్పుతో బాడవ డొంక (పుంత) రోడ్డు ఉంది. ఇది కూడా సైతం సదరు భూస్వామి భూమి మధ్యలో నుంచి ఉంది. సదరు భూస్వామి ఈ భూమిలో కొంత మేర ఇటీవల రియల్టర్లకు విక్రయించారు. భూమి విక్రయించిన నేపథ్యంలో అదనపు నీరు పోయేందుకు కాలువ కింద వదిలిన భూమి కూడా రైతులకు లేదని, అది తన సొంత భూమి కనుక కాలువపై హక్కు లేదని చెప్పడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్వం నుంచి ఉన్న కాలువను పూడ్చి ప్రహరీ నిర్మించాడు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్లో ఉన్న బాడవ డొంక రోడ్డుకు రెండు వైపులా ఉన్న పంట కాలువలను సైతం పూడ్చి రోడ్డును మెరక చేసి తారురోడ్డుగా మార్చడంతో సమస్య ఉత్పన్నమైంది. అంతటితో ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్కు ముందు భాగాన అంటే వెలగలేరు, కవులూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పెద్ద కాలువను సైతం పూడ్చి చిన్న పైపు వేసి వదిలేయడం విస్మయానికి గురి చేసింది. రియల్టర్కు కొంత భూమిని విక్రయించిన సదరు భూస్వామి తన ఆధీనంలో దిగువన ఉన్న భూమిలో బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించడంతో రైతులు వెళ్లలేని పరిస్థితి. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు ఈ సమస్యపై వెలగలేరు గ్రామానికి చెందిన రైతు సుఖవాసి గోపాలరావుతో పాటు 40మంది రైతులు సంతకాలు చేసి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జూన్ 22వ తేదీన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన జి.కొండూరు తహసీల్దార్ జులై 9వ తేదీ సిబ్బందితో కలిసి సమస్య ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పొలాల్లో నీరు పోవడానికి కాలువ ఏర్పాటు చేసుకోవాలని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చెప్పినట్లు, వారు సైతం అందుకు ఒప్పుకున్నట్లు, సమస్య పరిష్కారమైనట్లు ఎండార్స్మెంట్ పంపారు. అక్కడ సమస్య అలానే ఉండటంతో మళ్లీ బాధిత రైతులు గత నెల 27న పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అధికారుల వైపు నుంచి స్పందన లేక వరి పొలాలు ముంపునకు గురై పైరు కుళ్లిపోతున్న నేపథ్యంలో రైతులు లబోదిబోమంటున్నారు. బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా భూస్వామి నిర్మించిన గోడను సైతం పూర్తిగా తొలగించి రైతుల రాకపోకలు సాగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. -
అన్నప్రాశనకు వెళ్లి అనంతలోకాలకు..
గండేపల్లి: కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందోత్సాహాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. అంత వరకు సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్న వారికి దుఃఖమే మిగిలింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, అంజనాపురానికి చెందిన అల్లాడి గోపాలకృష్ణ, రాజేశ్వరి దంపతుల ఆరు నెలల చిన్నారి అరణ్య అన్నప్రాశనం నిమిత్తం కమ్మంపాడు, విజయవాడ, సత్తెన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన బంధువులు శనివారం వ్యాన్లో కాకినాడ జిల్లా అన్నవరానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి ఆదివారం ఉదయం అన్నప్రాశన అనంతరం వారు తలుపులమ్మ తల్లిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా వారి వాహనం మండలంలోని బొర్రంపాలెం శివారు భారత్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వ్యాన్ వెనుకభాగం ఎడమ వైపు టైర్ పంచరై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి వరసకు తాత అయ్యే సత్తెన్నగూడెంకు చెందిన అల్లాడి చిన్నారావు (46) అక్కడిక్కడే మృతి చెందగా మేడిపల్లి నాగేంద్రమ్మ, అట్లూరి స్నేహ, అన్నాబత్తుల సామ్రాజ్యంకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుని భార్య అల్లాడి సరోజిని, బోగి అశోక్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే అంబులెన్స్లో జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి నీలిమ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు రిఫర్ చేశారు. చిన్నారావుకు కుమార్తె శిరీష, కుమారుడు సుధీర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గంపేట సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్ఐ యూవీ శివనాగబాబు ప్రమాదం వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
దళిత యువతికి న్యాయం చేయకపోతే ఉద్యమమే
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ అవనిగడ్డ: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దళిత యువతిపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక సీబీఎం బోర్డింగ్ స్కూల్ ప్రాంగణంలో దళిత నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ కొత్తపేటకు చెందిన ఎస్సీ యువతికి మోపిదేవికి చెందిన బీసీ యువకుడు కె. సందీప్ మాయ మాటలు చెప్పి మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అమానుషంగా దాడి చేసిన విషయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. దాడికి గురైన బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు తారుమారు చేసి కేసు నీరుగర్చారని దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తామని గోవర్ధన్ హెచ్చరించారు. దళిత నేతలు బట్టు జైపాల్, బత్తుల బిక్షం, జి. నాగశ్రీను, సీహెచ్ శ్యామ్, మద్దాల ధర్మారావు, సీహెచ్ రాకేష్, బొంతు ప్రకాష్, మేరుగు రణధీర్, గుంటూరు బాబూరావు, బెజవాడ రవి, గుంటూరు కుటుంబ రావు, లింగం అనీల్, మద్దాల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ చట్టం చేసి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్లోని ఆలపాటి ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ సమాజంలో బీసీలపై వివక్ష, దాడులు జరుగుతున్నాయన్నారు. వీటన్నిటికీ పరిష్కారం బీసీల రక్షణ చట్టం ఒక్కటేనన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం వజ్రాయుధం లాంటిది అన్నారు. భట్రాజు సంఘం అధ్యక్షుడు కోటంరాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బడిగించల చంద్రమౌళి, డాక్టర్ అలా వేంకటేశ్వరావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు చెల్లా అనుదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా విద్యార్థులు
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో సైతం ప్రతిభావంతులుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు వై. మదన్మోహన్రావు అన్నారు. ఆంధ్రలయోల కళాశాలలో తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో సైతం నైపుణ్యాలను పెంచుకోవాలని కాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు విద్యా సంస్థల నుంచీ 500మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో గోల్డ్మెడల్ సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 21, 22, 23 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి ఎం. అంకమరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి బి. కాశీనాథ్ రెడ్డి, ఇంటర్నేషనల్ యోగా మెడలిస్ట్ బి. శిరీష తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
పెడన: కృష్ణా జిల్లా పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలో ఉన్న ఓ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడం, వారిని గుర్తించిన పోలీసులు క్షేమంగా విద్యా సంస్థకు చేర్చడంతో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. పోలీసుల విచారణలో ఈ అదృశ్యం వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని, వారు బాలికలపై లైంగికదాడి చేసినట్లు తేలింది. దీంతో వారిపై పోక్సో, లైంగికదాడి కేసులను శనివారం నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు మచిలీపట్నంలోని కోనేరుసెంటరుకు చేరుకున్నారు. అనంతరం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్దాల శ్యామ్కిరణ్కు ఫోన్ చేశారు. బాలికల విషయం తెలుసుకున్న శ్యామ్కిరణ్ శారదానగర్కు చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సిద్దును వెంటతీసుకువెళ్లాడు. కోనేరుసెంటరులో ఉన్న ఇద్దరు బాలికలను వారిద్దరూ ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరం గ్రామంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లాట్లోకి బాలికలను తీసుకువెళ్లి ఇరువురు యువకులు వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను రుద్రవరం తీసుకెళ్లి ఒక బాలిక ఇంటి సమీపంలో వారిని విడిచిపెట్టారు. మరుసటి రోజు ఒక బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయగా ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికను తీసుకుని పోలీసులకు వద్దకు వెళ్లారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లపై పోక్సో, లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు పెడన పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వారు పేర్కొన్నారు.చదవండి: ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్ -
రేపు పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నగరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి రెండు విడతల కౌన్సెలింగ్లలో మిగిలిన సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్–2026 పరీక్ష రాసిన, రాయని వారు పాల్గొనవచ్చని సూచించారు. మచిలీపట్నం అర్బన్: క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్లో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు శనివారం మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 224 మంది బాలబాలికలు ఉత్సాహంగా ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17, అండర్–23 బాలురు, బాలికల విభాగాల్లో 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఐదు కిలోమీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, జావెలిన్త్రో, షాట్పుట్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది క్రీడాకారులను అండర్–17, 12 మంది క్రీడాకారులను అండర్–23 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఝాన్సీలక్ష్మి తెలిపారు. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
విద్యార్థులను మానసికంగా బలవంతులను చేయాలి.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ ఆ బాధ్యత తీసుకోవాలి. విద్యా రంగంలో ఒత్తిడిని తగ్గించాలి. విద్యార్థులపై తలకు మించిన భారం పెట్టకూడదు. నిబంధనల ప్రక్రారం వెయ్యి మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ప్రతి విద్యా సంస్థలోనూ కౌన్సెలింగ్ చేయటానికి సైకాలజిస్ట్ ఉండాలి. –డాక్టర్ బి.ప్రసాద్బాబు, రీజనల్ డైరెక్టర్, సైకాలజిస్ట్, ఇగ్నో విజయవాడమార్కులు, ర్యాంకులే కొలమానాలుగా ఉన్న నేటి విద్యా వ్యవస్థ చిన్నారులు, విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటోంది. తల్లిదండ్రులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను పిల్లల మీద బలవంతంగా రుద్దు తున్నారు. పెద్దలు తమ మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నామన్న మానసిక క్షోభతో పిల్లలు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. ఈ పాపంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ భాగస్వాములేనని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై అవిశ్రాంత పోరాటం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీ –2025లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆగదని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో శనివారం మూడో రోజు రిలేనిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన యువత, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీఎస్సీ అక్రమాలపై విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా నిరూపించినా సిగ్గులేని చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే కూటమిలో ఉన్న లోకేష్ మాత్రం మంత్రి పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్నారన్నారు. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు, యువత ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే పోలీసుల సహకారంతో వచ్చి దాడి చేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యే బొండాను ఉద్దేశించి టెంట్ పీకి, నాలుగు కుర్చీలు పగుల కొడితే హీరోయిజం అనుకుంటున్నావా? నీ అక్రమాలు బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బొండా ఉమాకు తగిన బుద్ది చెబుతామన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీని వాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే బొండా ఉమా ఒక రౌడీ లాగా తన అనుచరులతో వచ్చి పోలీసులను పక్కకు నెట్టేసి దాడి చేశారన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ నాయకులు బండి పుణ్యశీల, అడపా శేషు, వంగవీటి నరేంద్ర, షేక్ ఆసిఫ్, షేక్ గౌస్ మొహిద్దీన్, ఆళ్ల చెల్లారావు, ఎ. రవిచంద్ర, సుందర్పాల్, మెహబూబా, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అను బంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శత వసంతాల సంగీత యాత్ర
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణి అన్నారు. ఈ చరాచర సృష్టిలో సంగీతానికి సకల ప్రాణులు స్పందిస్తాయి. సంగీతానికి భాష, కులం, మతంతో నిమిత్తం లేదు. అది అనుభూతి పూర్వక మంత్రం. వీనుల విందు చేయడమే కాక మనసుకు ఆహ్లాదాన్నిచ్చేది సంగీతం. వాయులీనమే జీవన నాదంగా సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న నిత్య కృషీవలుడు అన్నవరపు రామస్వామి. గత 85 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఆయన సంగీత యాత్ర నిరాటంకంగా సాగుతోంది. నూరేళ్ల వయసులోనూ నిత్యనూతనంగా సంగీత సరస్వతికి పట్టాభిషేకం చేస్తున్న అన్నవరపు రామస్వామిపై ప్రత్యేక వ్యాసం. విజయవాడ కల్చరల్: సంగీతమే శ్వాసగా జీవిస్తున్న అన్నవరపు రామస్వామి 1926వ సంవత్సరం మార్చి 23 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా సోమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, నాదస్వర విద్వాంసుడు పెద్దయ్య. అన్న గోపాలం వద్ద వయోలిన్లో సంగీత శిక్షణ ప్రారంభించి 11 సంవత్సరాల వయసులో బెజవాడలో వయోలిన్లో శిక్షణ తీసుకోవడానికి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ య్య పంతులు వద్ద చేరారు. ఆయన శిష్యరికంలో వయోలిన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో అప్పట్లో ప్రారంభమైన స్నేహం కడ వరకు సాగింది. ఇద్దరి సంగీత ప్రయాణంలో వేలాది కార్యక్రమాలను నిర్వహించారు. మంగళంపల్లి గాత్రానికి అన్నవరపు వయోలిన్ సహకారం పూవుకు తావి అబ్బినట్టు ఉండేది. సంగీత దిగ్గజాలకు వాద్య సహకారం వయోలిన్ ఒక వాద్యమేకాదు అన్నవరపు చేతిలో నాద బ్రహ్మగా మారింది. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు( విద్యాభిక్షపెట్టిన గురువు), అరయ్యకుడి రామానుజ అయ్యంగార్, భీమ్సేన్ జోషి, టీఆర్ మహాలింగం, బాలమురళీ కృష్ణ లాంటి విద్వాంసులెందరికో వాద్యసహకారం అందించారు. గురు సంప్రదాయాన్ని పాటిస్తూ నగరంలో 75 సంవత్సరాలుగా సంగీత సద్గురువులు త్యాగరాజ స్వామి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు పేరిట సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వంద సంవత్సరాల వయస్సులోనూ ఆయన ఇప్పటికీ కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిలు అన్నవరపు రామస్వామికి వందకుపైగా పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1983), సంగీత నాటక అకాడమీ పుర స్కారం(1996), భారత ప్రభుత్వం పద్మశ్రీ (2021), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పురస్కారం, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు లభించాయి. ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 3 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు. ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్గా... విజయవాడ ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్గా దశాబ్దాల పాటు సేవలను అందించారు. రేడియో ద్వారా శాసీ్త్రయ సంగీతాన్ని వేలాదిమందికి చేరువ చేశారు. వందన, శ్రీదుర్గ వంటి రాగాలకు రూపకల్పన చేశారు. అన్నవరపు శిష్య పరంపర నేడు ప్రముఖ సంగీత విద్వాంసులుగా పేరొందిన మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, బీవీ దుర్గాభవాని, అన్నవరపు రాఘవేంద్ర, డి.శ్రీనివాస్, కొమాండూరి వెంకట కృష్ణ, ఎం.సత్యనారాయణ, డాక్టర్ ప్రపంచం సీతారాంతో పాటు అనేక వందలమందికి విద్యాదానం చేశారు. సంగీతంతో పాటు సంస్కారం ముఖ్యం నేటి తరం యువ సంగీత కళాకారులు సంగీతంతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని తమ గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు చెప్పేవారని అన్నవరపు రామస్వామి అన్నారు. సంగీతం భగవదత్తమైన వరమని, వేదంలా అధ్యయనం చేయాలని, చిత్త శుద్ధి, ఏకాగ్రత అవసరమన్నారు. సంగీతాన్ని భగవత్ సేవలా భావించాలన్నారు. విజయవాడలో తాను వారాలు చేసుకుని చదువుకున్నానని, గురువులు కుల మతాలకు అతీతంగా చూసుకునేవారన్నారు. -
కొమరగిరి దూరదృష్టి, నిబద్ధతే ‘శ్రీవాణి’ విజయానికి నాంది
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘శ్రీవాణి’ సాంస్కృతిక మాసపత్రిక నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతర సేవలు అందిస్తుందంటే దాని వ్యవస్థాపకుడు కొమరగిరి కృష్ణమోహన్రావు దూరదృష్టి, నిబద్ధతే కారణమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. మచిలీపట్నం కేంద్రంగా వెలువడుతున్న ‘శ్రీవాణి’ మాసపత్రిక తన 500వ సంచికతో పాటు ‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పుస్తక ఆవిష్కరణ వేడుకలు శనివారం విజయ వాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగాయి. సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహను పెంపొందిస్తున్న ‘శ్రీవాణి’ యాజమాన్యం, సంపాదకవర్గం, రచయితలు అభినందనీయలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కొమరగిరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్(చిన్ని), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ పాత్రికేయుడు మాశర్మ, ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడారు. ఆవిష్కరణ వేడుకలను ‘శ్రీవాణి’ సంపాదకుడు కొమరగిరి శ్యామ్ ప్రసాద్, మేనేజర్ కొమరగిరి చంద్రశేఖర్, గౌరవ సలహాదారు కొమరగిరి ఉదయ్ కుమార్ నిర్వహించారు. కంభంపాటి హరిబాబు -
అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కర్ణాటకకు చెందిన భక్తులు రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాయచూర్ ఎస్సార్ నగర్కు చెందిన కె.వెంకటరావు, పార్వతి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.2.50 లక్షలు విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈవో కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక(ఆడి కృత్తిక) పవిత్రోత్సవాలు శనివారంతో ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైదిక కార్యక్రమాల ననుసరించి శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు వివరించారు. మాజీ గవర్నర్, రిటైర్డ్ అధికారి కిరణ్బేడీ లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటం అత్యంత కీలకమని, తద్వారానే మహిళా సాధికారత సాధ్యమని పుదుచ్చేరి మాజీ లెె ఫ్ట్నెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కిరణ్బేడీ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని హోటల్ వివంతలో శనివారం ఫిక్కి ఫ్లో ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న కిరణ్బేడీ మాట్లాడుతూ సమాజంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుండాలని, వ్యాపార, ఆర్థిక నిర్వహణను ఇతరులకు అప్పగించకుండా మహిళలే స్వయంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఫిక్కీఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియ, పలువురు ప్రతినిధులు, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలలో ఆలయ అధికారులు కొత్త ప్రతిపాదన చేశారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ల వద్ద భక్తులు వేచి ఉండకుండా లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు గాను వారం రోజుల్లో ఆలయ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలని భావిస్తున్నారు. ఇటీవల దసరా ఉత్సవాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ముందుగా ఆన్లైన్లో లడ్డూలను బుక్ చేసుకుంటే వారి ఫోన్కు ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది. ఆలయ ప్రాంగణంలో 4 నుంచి 5 లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేసి వారికి అక్కడే లడ్డూలను ఇవ్వాలని భావిస్తున్నారు. మరో వైపున ఒక లడ్డూ నుంచి ఆరు లడ్డూల బాక్స్ వరకు ఈ ఏటీఎం మిషన్ ద్వారా భక్తులు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నూతన విధానం ద్వారా ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని టెక్నికల్ టీం చెబుతుండగా, ఇది ఏ స్థాయిలో అమలుకు సాధ్యమనే విషయాన్ని ఆలయ అధికారులు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. -
AP: ఆర్టీసీ జేఏసీకి ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు
విజయవాడ:: ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నెలలో వేల సంఖ్యలో సంతకాలు సేకరించిన జేఏసీ.. ఇప్పుడు తమ పోరుబాటను మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కార్యచరణ రూపొందిస్తున్న ఆర్టీసీ జేఏసీ.. తమ భవిష్యత్ ఉద్యమాలకు కార్మిక సంఘాల మద్దతు కోరుతుంది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. ఏపీజేఏసీ అమరావతి, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నేతలను కలిసి వారి మద్దతు కోరారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇస్తామని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు, ఎల్లుండి( ఆగస్టు9, 10వ తేదీల్లో) ఇతర సంఘాల నేతలను కలిసి మద్దతు కోరనుంది ఆర్టీసీ జేఏసీ. -
ఏపీ విద్యాశాఖలో రెడ్బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన మంత్రి కొల్లు అనుచరుడు
విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలి సొమ్ము రూ.1.54 కోట్లు ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పించి గోడు చెప్పుకొంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు తెలిపిన మేరకు.. పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ కాంట్రాక్టరు. అతడి వద్ద కట్టుబడిపాలేనికి చెందిన బాణావతు రాజునాయక్ సబ్ కాంట్రాక్టర్గా పలు ప్రాంతాల్లో హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులను నిరి్మంచారు. రాజునాయక్ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పనులు చేయించారు. దీనికి సంబంధించిన కూలి సొమ్ము, ఇతరత్రా రూ.1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు ఇవ్వమని 20 నెలల నుంచి రాజునాయక్, కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర, పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా తరువాత పట్టించుకోవడంలేదు. రూ.12 లక్షలు మాత్రమే ఇస్తామంటూ పామర్తి రాజా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది: సుగాలి మహిళలు రెండేళ్ల తమ కష్టార్జితం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి మంచి మనస్సు ప్రసాదించాలని సుగాలి మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. 24 గంటల్లో తమకు డబ్బులు చెల్లించకుంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. అదే సమయంలో ఓ సుగాలి మహిళ తీవ్ర ఆందోళనకు లోనై స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. -
చదవలేక.. తండ్రికి చెప్పలేక తనువు చాలించాడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎల్రక్టీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్రాజ్ చున్నీతో ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే +భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
‘ఏసీఏ’ సెంట్రల్ చాంపియన్గా కృష్ణా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ (అండర్–23) మహిళల అంతర్ జిల్లాల చివరి లీగ్ మ్యాచ్లు మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగాయి. తొలి మ్యాచ్ కృష్ణా జట్టు, పశ్చిమ గోదావరి మధ్య జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 (47.3 ఓవర్లు) స్కోర్ సాధించింది.అనంతరం బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు 32.5 ఓవర్లలోనే 151/3 స్కోర్ చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేరేచెర్లలోని క్రికెట్ మైదానంలో ప్రకాశం, గుంటూరు మధ్య రెండో మ్యాచ్ జరిగింది. గుంటూరు జట్టు 50 ఓవర్లలో 233/6 స్కోర్ చేసింది. ప్రకాశం జిల్లా జట్టు 45.1 ఓవర్లల్లో 171 పరుగులు మాత్రమే చేసింది. 62 పరుగుల తేడాతో గుంటూరు జట్టు విజయం సాధించింది. కృష్ణాజిల్లా జట్టు 12 పాయింట్లు సాధించి అండర్–23 మహిళల టోర్నమెంట్ సెంట్రల్ జోన్ చాంపియన్గా నిలిచింది. గుంటూరు జిల్లా జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
అమరావతి పికిల్బాల్ లీగ్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్రెడ్డి చెప్పారు. స్థానిక భారతీనగర్లోని నైట్రో పికిల్ బాల్ అండ్ కెఫేలో శుక్రవారం అమరావతి పికిల్బాల్ లీగ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పికిల్బాల్ వంటి నూతన క్రీడను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు, సినీ హీరో సుశాంత్ పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు పికిల్బాల్ పోటీలు జరుగుతాయన్నారు. -
పారాణి ఆరకముందే.. ప్రాణాలు తీసుకుంది
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువు నిండు జీవితం ముగిసిపోయింది.. కొత్త బంధంతో సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన నాలుగు నెలలకే ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తీర్ణురాలైన ఆమె తన గుండెబాధను అధిగమించలేకపోయింది. విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయోధ్యనగర్ బసవ తారక నగర్ ప్రాంతానికి చెందిన గోనోల్ల దేవేంద్రకు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన మారాని చంద్రకళ (24) తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఎంబీఏ చదువుకున్న చంద్రకళ ఇంటివద్దే ఉంటుండగా దేవేంద్ర హనుమాన్పేటలోని ప్రైయివేటు ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రోజూలానే శుక్రవారం ఉదయం దేవేంద్ర పనికి వెళ్లగా చంద్రకళ ఇంటిలోనే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయల్దేరుతుండగా చంద్రకళ స్నేహితుడు రమణ ఫోను చేసి అన్నా నాకు చాలా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది.. నువ్వు త్వరగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో హుటాహూటిన పని నుంచి ఇంటికి వెళ్లగా భార్య తలుపు వేసుకొని, గొళ్లెం పెట్టుకొని ఉంది. కిటికీ తెరచి చూడగా చంద్రకళ తన చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కలినిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో గొళ్లెం పగలగొట్టి లోపలకు వెళ్లి చంద్రకళను కిందకి దించాడు. అంబులెన్స్ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోనట్టు నిర్ధారించారు. చంద్రకళకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీఏ చదువుకున్న ఆమెకు బెంగళూరులో ఉంటున్న తన స్నేహితుడంటే ఇష్టమై ఉండొచ్చని.. ఆమె కాల్ లిస్ట్లో చివరిగా మాట్లాడిన కాల్ కూడా అతనిదేనని సమాచారం. మృతికి కారణాలు పూర్తిగా తెలియడం లేదని.. యువతి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, సమస్యలకు పరిష్కారాలను చూపించేలా బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. ఎన్సీఎస్సీ–2026, ఇన్స్పైర్ మనాక్ –2026పై జిల్లాలోని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సును ఆంధ్రా లయోల కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి చంద్రకళ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తక పరిజ్ఞానానికే పరిమితం చేయకుండా ప్యూర్ సైన్సెస్, పరిశోధన, ప్రయోగాత్మక అభ్యసన వైపు ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర అకడమిక్ కోఆర్డినేటర్ మైనం హుస్సేన్ ఉత్తమ ప్రాజెక్ట్కు అవసరమైన ముఖ్య లక్షణాలను వివరించారు. రిసోర్స్ పర్సన్లు శివకుమారి, బాలకరుణకుమార్, పి.నాగేశ్వరరావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యువత భవితకు ఎందాకై నా..
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యువత భవిత కోసం దేనికై నా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక బాప్టిస్ట్పాలెంలోని ఆ పార్టీ 35వ డివిజన్ కార్యాలయం వద్ద శుక్రవారం చేపట్టిన రిలేదీక్షలు ఉద్రిక్తంగా మారాయి. దాడికి తెగబడిన టీడీపీ శ్రేణులు శాంతియుతంగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన దీక్షలపై టీడీపీ దాడికి తెగబడింది. ఆ పార్టీ పశ్చిమ ఇన్చార్జిగా నియమితులైన బుద్ధా వెంకన్నను పోలీసు అధికారులు గృహనిర్బంధం చేయగా దాడి చేయాలని, శిబిరాన్ని తీసివేయాలని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి బాప్టిస్ట్పాలెం వద్దకు పంపించారు. దీంతో ఆ పార్టీ నేతలు కొట్టేటి హనుమంతరావు, గుర్రం కొండ, తుపాకుల రమణమ్మ తదితరుల నేతృత్వంలో టీడీపీ శ్రేణులు దీక్షా శిబిరాన్ని ముట్టడించి దాడికి ప్రయత్నించారు. వారిని సమీపంలోనే పోలీసులు అడ్డుకొని నిలువరించారు. బొండా ఉమా ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తాం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులు ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తామని వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బొండా ఉమా అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి వందలాది యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా దాడులకు పాల్పడటం వారి దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వారసత్వంలో పుట్టినవాడినని, ఉద్యమాలకు వెనుకాడబోనని వెలంపల్లి హెచ్చరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. -
సోకులేరులో మునిగి యువకుడి మృతి
స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి కానరాని లోకాలకు.. మోతుగూడెం: పోలవరం జిల్లా మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని తులసిపాక గ్రామ సమీపంలోని సోకులేరు వ్యూ పాయింట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒక యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన చెరుకూరి శివరామకృష్ణ (32) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి స్నేహితులు చేకూరి పార్థసారథి, చావా సురేష్, చావా విజయ్, చావా సాయిరాం, పరుపల్లి సాయికుమార్, చెరుకూరి సుధాకర్, చెరుకూరి చంద్రశేఖర్, చెరుకూరి రాజేష్, గొర్లంటా మోహిత్ కుమార్లతో కలిసి మారేడుమిల్లి సమీప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు సోకులేరు వ్యూ పాయింట్కు చేరుకుని వాగులోని రాళ్ల మధ్య ఫొటోలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతని స్నేహితులు నీటిలో నుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుడు అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాగులు, జలపాతాల్లో దిగొద్దు.. వర్షాకాలంలో ఏజెన్సీలో జలపాతాలు, వాగులు, ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే క్రమంలో నీటిలోకి దిగడం, జారుడుగా ఉండే రాళ్లపైకి వెళ్లడం, లోతు తెలియని ప్రాంతాల్లో ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించి, ప్రాణాలకు ముప్పు కలిగించే సాహసాలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో జరిగిన అక్రమాలపై, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, దాడులకు పాల్పడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డెప్యూటీ మేయర్ శైలజ రెడ్డి నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగింది. సమాధానం చెప్పలేక అసహనం.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారన్నారు. అక్రమాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డ నిధి ఏది అడిగినా సవాళ్లు, దాడులు చేస్తున్నారని, ప్రభుత్వానికి ఎందుకంత అసహనం అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకొని, అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రౌడీరాజ్యం.. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల తోలు తీస్తా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడి పార్టీలోనే రౌడీలు ఉన్నారనడానికి ఈ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో వచ్చి దీక్షా శిబిరంపై దాడి చేసి, టెంట్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు చూస్తుండగానే దాడులు జరుగుతుంటే వారు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. కేవలం విజయవాడలోనే కాకుండా తిరుపతి, కనిగిరిలలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వంటి నేతల దీక్షా శిబిరాలపై కూడా కూటమి శ్రేణులు కోడిగుడ్లు, టమోటాలతో దాడులు చేసి, టెంట్లు పీకివేశారని మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, మహిళలు, యువకులను గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అంటూ కించపరచడం దుర్మార్గమన్నారు. మోసపూరిత సర్కారు.. వైఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. విజయవాడ నడి బొడ్డున వైఎస్సార్ సీపీ చేపట్టిన శాంతియుత ధర్నా శిబిరంపై ముత్యాలంపాడులో టీడీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఒక్కో పోస్టుకు రూ.15లక్షల నుంచి రూ.30లక్షల వరకు అమ్ముకున్నారన్నారు. సీబీఐ విచారణ చేయాలి.. విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, షాహినా సుల్తానా, కుక్కల అనిత, కొండయ్యగుంట మల్లేశ్వరి, జనారెడ్డి, యర్రగొర్ల తిరుపతమ్మ, సుందర పాల్, ముసునూరు వెంకటేశ్వర రావు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి జ్వాలపూడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్పై యువతే ఉక్కుపాదం మోపాలి
సివిల్ జడ్జి వరలక్ష్మి కోనేరుసెంటర్: సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టటంలో యువత మరింత ముందుండాలని సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాల వినియోగం, వాటి పర్యావసానాలు’ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత చెడునడతకు అలవడుతుందన్నారు. తద్వారా అనేక అనర్థాలు చూడాల్సి వస్తోందన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై యువత ఉక్కుపాదం మోపాలన్నారు. బందరు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నియంత్రణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. వ్యసనాల జోలికి పోవద్దు.. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో యువత ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా భవిష్యత్తు మీద దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్, ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, న్యాయవాది సీహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. పొట్టకూటి కోసం వెళ్లి.. మృత్యు ఒడికి.. ట్రాక్టర్ బోల్తా పడడంతో కూలీ మృతి బోనకల్: రెక్కాడితే డొక్కాడని ఓ కూలీ కుటుంబ పోషణ కోసం రాష్ట్రం దాటి రాగా ప్రమాదంలో మృత్యు వాత పడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లికి చెందిన తేజావత్ రాము(40) జీవనోపాధి కోసం అత్త వారిల్లయిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట తండాకు వచ్చి రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. బోనకల్ మండలంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులకు బ్రాహ్మణ కుంట తండా నుంచి పది మంది కూలీలతో కలిసి ఆయన వెళ్లాడు. రావినూతల సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ ట్రాలీలో వేసుకుని వెళ్తుండగా ముష్టికుంట్ల సమీపాన మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాలీ పల్టీ కొట్టడంతో రాము కింద చిక్కుకోగా మిగతా వారు బయటపడ్డారు. స్థానికులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, రాముకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా.. కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిపించాడు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మాచినేని రవి తెలిపారు. -
క్లెయిమ్లను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అందిన ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు), వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వర్చువల్గా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శేషగిరిబాబు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతిరోజూ కనీసం 70 కేసులపై విచారణ చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఓటర్ల ఫొటోతో కలిగిన జాబితాలను వివిధ పార్టీల ప్రతినిధులకు ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ అందజేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, మున్సిపల్ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఈఆర్ఓ హెచ్.ఎం.ధాన్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో శవమై తేలిన వృద్ధుడు
భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే గోదావరిలో మృతదేహంగా తేలాడు. మృతుడిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గోద రాములు(75)గా పోలీసులు గుర్తించారు. ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ నెల 5న తిరువూరు బస్టాండ్ నుంచి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కాడు. అనంతరం ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీల్లో భద్రాచలం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో వారు గురువారం రాత్రి భద్రాచలం చేరుకుని గాలించినా ఫలితం దక్కలేదు. ఇంతలోనే శుక్రవారం ఉదయం భద్రాచలం వైకుంఠధామం సమీపాన గోదావరి ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు మృతుడి ఫొటో, దుస్తుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా కుటుంబ సభ్యులు పరిశీలించి మృతదేహం రాములుదేనని నిర్ధారించారు. ఘటనపై కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
నూతన అన్నదానం, లడ్డూపోటులు సిద్ధం
● 21న ప్రారంభోత్సవాలు ● అధికారులతో సమీక్షలో దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అన్నదానం, లడ్డూపోటులను ఈ నెల 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్నాయి. భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి దేవదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు రావడంతో సుముహూర్తాన్ని ఖరారు చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా నిర్మించిన ఈ రెండు భవానాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఆమోదం తెలపాల్సి ఉండగా, అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూపోటు ప్రారంభోత్సవం నాటికి యంత్రాలు, విద్యుదీకరణ, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలుగకుండా చూడాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, డీఈవో కిషోర్కుమార్, ఏఈవోలు ఎన్. రమేష్బాబు, చంద్రశేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్యం రవాణా కేసులో.. -
విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్నటి నుంచి చలసాని ఆంజనేయులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక చలసాని ఆంజనేయులు ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా రాజీనామా చేయాలని ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో మంత్రుల ఒత్తిళ్లతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు.రెండు గంటల పాటు ఆసుపత్రిలో చలసాని ఆంజనేయులతో చర్చించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారథి.. ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఆదేశాలతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే, బుధవారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్నా కానీ చలసాని ఆంజనేయులను మంత్రులు వదల్లేదు. రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో ఇవాళ ఆంజనేయులు.. విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: డిఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ రెండో రోజు రిలే నిరహార దీక్ష చేపట్టింది. ఆటోనగర్లో రిలే నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మోసపోయిన డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.‘‘యువతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల పర్మిషన్ తీసుకుని శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. రెండు రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 100 మంది పోలీసులు వచ్చి మా టెంట్ పీకేశారు.. గీత గీసి ముందుకు రాకూడదని ఏసీపీ అంటున్నారు. భారతదేశంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏపీలో నడవడం లేదు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది’’ అంటూ దేవినేని అవినాష్ మండిపడ్డారు...మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడి గుడ్లతో దాడి చేశారు. టమోటాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు బాటిల్లో యూరిన్ పోసి దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?. దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్పై స్పందించండి. రాత్రి అయిన తరువాత పగలు వస్తుంది.. మరో మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండేది. నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తాం’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.257 కోట్లు మంజూరు చేయాలని వార్షిక ప్రణాళిక కింద నేషన్ ఆయుష్ మిషన్కు ప్రతిపాదన పంపామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ద వైద్యులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లతో గుంటూరు సమీపంలో కేంద్ర యోగ, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించిందని తెలిపారు. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరం ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.15 కోట్ల చొప్పున వ్యయం చేసి ఆయుష్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ధర్మవరం, పిఠాపురం ప్రాంతాల్లో ఆయుర్వేదం, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.70 కోట్లు చొప్పున రూ.210 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. అలాగే విశాఖలో రూ.70కోట్లతో తలపెట్టిన నేచురోపతి వైద్య కళాశాల నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, రోణంకి గోపాలకృష్ణ, కేంద్ర ప్రభుత్వ హోమి యోపతి సలహాదారు డాక్టర్ ప్రీతా కిజక్కుట్టిల్, ఆయుష్ అదనపు డైరెక్టర్లు శేఖర్, సాయి సుధాకర్, డెప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
చైర్మన్ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి!
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులను రాజీనామా చేయాలని జిల్లా మంత్రులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. విజయ డెయిరీలో గురువారం 3 డైరెక్టర్ల ఖాళీలకు ఎన్నిక ప్రక్రియ జరిగింది. చలసాని ఆంజనేయులతో పాటు మరో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికవగా, సాయంత్రం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్గా చలసానిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన అర్ధగంటలోనే మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు, మరో టీడీపీ నేత విజయ డెయిరీకి చేరుకున్నారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు చాంబర్కు నేరుగా చేరుకున్నమంత్రులు ఆయనను రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ఈ దఫా ఎన్నికలలో చలసాని ఆంజనేయులను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకుండా చూడాలని జిల్లా టీడీపీ నేతలు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలించలేదు. విజయ డెయిరీ ఆవరణలోనే నందిగామకు చెందిన బోర్డు డైరెక్టర్.. ఎమ్మెల్యేల మధ్య ఫోన్లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. రాజీనామా ప్రసక్తే లేదు.. చైర్మన్ చాంబర్లో చలసానితో పాటు మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఓ దశలో చలసానిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సుమారు రెండు గంటలు చర్చ జరిగిన తర్వాత రాజీనామా చేసే ప్రసక్తి లేదని చలసాని తేల్చిచెప్పారు. ఇంతలో చలసాని మరోసారి అస్వస్థతకు గురవడంతో కుమార్తెతో ఆయన నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తీసుకుంటుందోనని అటు బోర్డు డైరెక్టర్లతో పాటు కృష్ణా మిల్క్ యూనియన్ అధికారులు, ఉద్యోగులలో చర్చ జరుగుతోది. -
నిరసన స్వరం.. రాజీనామా నినాదం
● డీఎస్సీ అవకతవకలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాల్సిందే ● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే.. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ● డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రాణీగారితోటలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీపార్వతి ప్రారంభించగా, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. సాయంత్రం వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం మర్రిచెట్టు సెంటర్లో ఉదయం 10.30 గంటలకు రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ● విజయవాడసెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై విచారణ, మంత్రి రాజీనామా కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్ష ప్రారంభించి నాయకులు ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన అనుచరులతో వచ్చి శిబిరం వద్ద టెంట్ పీకివేశారు. పోలీసులు మల్లాది విష్ణును అరెస్ట్ చేసి ధర్నా చౌక్కు తరలించారు. ● తాడిగడప మునిసిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు మరీదు వినయ్ ఆధ్వర్యంలో యనమలకుదురులో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నాయకులు పాల్గొన్నారు. ● గన్నవరం మూడు బొమ్మల సెంటర్లో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనగాని సుందరచైతన్య, పల్లి వీరయ్య నేతృత్వంలో దీక్ష శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి ప్రారంభించారు. -
ఎమ్మెల్యే బొండా తానే స్వయంగా..
వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలోకి చొరబడి, వేలు చూపిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమాసాక్షిప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: విజయవాడలో రౌడీరాజ్యం నడుస్తోంది. శాంతి యుతంగా నిరసన దీక్షలు చేస్తున్న వారిపై దాడి చేసి కొత్త సంస్కృతికి తెరలేపారు. ఈ దాడుల్లో ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేరుగా కార్యకర్తలతో దీక్షా శిబిరం వద్దకు చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఆయనే స్వయంగా షామియానా పీకేయడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. శిబిరంలో దీక్షకు కూర్చున్న మల్లాది విష్ణుతో పాటు కార్యకర్తలపై కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. కార్యకర్తలు, నాయకులపై కుర్చీలు విసిరారు. దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. శిబిరంపై దాడిచేస్తున్న సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా అక్కడే ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి శిబిరంపై దాడి చేస్తున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులను వదిలివేసి.. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను చెల్లా చెదురు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది కార్యకర్తలను శిబిరం నుంచి లాగిపడేశారు. శిబిరం వైపు దూసుకువస్తున్నా.. వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్న మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. వాహనంలో ఎక్కిన తర్వాత కూడా పోలీసు సిబ్బంది ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అక్కడ నుంచి మల్లాది విష్ణును అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్కు తరలించారు. అక్కడ వాహనంలోనే కూర్చుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడిని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, అవుతు శ్రీనివాసరెడ్డి, బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, ఎండీ గౌస్ మొహిద్దీన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ నిరాహార దీక్షా శిబిరంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే. ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని దాడికి ఉసిగొల్పిన సంఘటనలు విజయవాడలో ఇదే ప్రథమం. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న బ్రాహ్మణ సంఘం నాయకుడైన మల్లాది విష్ణుపై పోలీసులు సమక్షంలోనే గుడ్లు, మూత్రంతో దాడి చేయడం దారుణం. బ్రాహ్మణ సమాజానికి బొండా ఉమా క్షమాపణలు చెప్పాలి. – మొండితోక అరుణకుమార్, ఎమ్మెల్సీమెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలన్నీ బయటకు రావాలి. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మార్జిన్లు పెట్టుకుని దందా చేశారనే ప్రచారంపై స్పందించాలి. దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి లోకేష్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి.. వైఎస్ జగన్ చెప్పిన పిన్–టు–పిన్ పాయింట్లపై విద్యార్థులతో ముఖాముఖి చర్చించాలి. – రవిచంద్ర, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బొండా ఉమా శీల పరీక్షలో నెగ్గేందుకు మల్లాదిపై దాడి చేశారు. టీడీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉమా చిట్టా అంతా చంద్రబాబు ముందు పెట్టారు. తాను టీడీపీలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు ఇలాంటి చేతగాని పనులు చేస్తున్నారు. దమ్ముంటే మేం అడుగుతున్న డీఎస్సీ అక్రమాలపై మాట్లాడాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, నిరుద్యోగ భృతి అమలు చేయాలి. వీటికి సమాధానం చెప్పడం లేదు. వందలమందిని తీసుకొచ్చి, మందు పోయించి దాడి చేయిస్తే ఏమవుతుంది? అన్ని రోజులూ మీవీ కావు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రిలే నిరాహార దీక్షపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, టీడీపీ నియోజకవర్గ గ్యాంగ్ ముందస్తు ప్రణాళికతో దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్ని అనుమతులతో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, రక్షణగా ఉండాల్సిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను తోసేసి టీడీపీ శ్రేణులకు కొమ్ముకాస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులు ఖాకీ డ్రెస్సులు వేసుకోలేదు.. పచ్చ చొక్కాలు తొడుక్కుని పనిచేస్తున్నారు. – అవుతు శ్రీశైలజారెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లక్ష్యంగా కోడిగుడ్లతో దాడికి దిగడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. ప్రభుత్వ హామీలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ఈ భౌతిక దాడులు చేస్తున్నారు. యువత, విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్ సీపీ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే రౌడీయిజం చేయడం సరికాదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. వైఎస్సార్ సీపీ నేతలపై భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో జంగిల్రాజ్ను నడుపుతున్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. – వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి -
‘విజయ’ ఎన్నికలో నాటకీయ పరిణామాలు!
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమయ్యాయి. మూడు డైరెక్టర్ల ఖాళీలకు బుధవారం చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్రబరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. గడువు ముగియడానికి కచ్చితంగా మూడు నిమిషాలు ఉన్న తరుణంలో అనూహ్యంగా చలసాని చక్రపాణి తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారి గురునాథంకు తెలిపారు. బరిలో ముగ్గురు అభ్యర్థులే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబుకు డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. నరేంద్ర ఏకగ్రీవమైనా డిక్లరేషన్ పత్రాన్ని తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో అధికార పార్టీ నేతల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలపై ఉత్కంఠ! నామినేషన్ల దాఖలు చేసిన గొంది నరేంద్రతో నామినేషన్ ఉపసంహరించుకునేలా డెయిరీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించినా చివరి నిముషంలో బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం పాలప్రాజెక్టుకు విచ్చేస్తున్న నరేంద్రను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నరేంద్రతో నామినేషన్ వేయించి అతనికి మద్దతుగా ఉన్న అధికార పార్టీ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేకు చెందిన వారే అధికార పార్టీ కార్యాలయానికి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యే కొంతకాలంగా చైర్మన్ చలసాని ఆంజనేయులపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరో వైపున మూడు పోస్టులకు నాలుగురు నామినేషన్ల ఉండటంతో ఎన్నిక అనివ్యారమయ్యేలా కనిపించింది. చివరి నిమిషంలో చలసాని ఆంజనేయులు, బోర్డు డైరెక్టర్లు, తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత చక్రపాణి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వేసిన ఎత్తులు ఫలించలేదు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం చక్రపాణి కన్నీటి పర్యంతమయ్యారు. చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవ ఎన్నిక బోర్డు డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత బోర్డు సమావేశమైంది. సమావేశంలో చైర్మన్గా చలసాని అంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ బోర్డు సభ్యులు తీర్మానించారు. -
పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ మధురానగర్లో నివసించే బాలిక (13) సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి విద్యార్థి. ఇటీవల చదువులో కొంచెం వెనుకబడిందని, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయంటూ ఉపాధ్యాయులు బాలికను తరగతి గదిలోని విద్యార్థులు ఎదుటే అవమానకరంగా మాట్లాడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్ష రాసిన బాలిక ఇందులో కూడా తక్కువ మార్కులు వస్తాయని ఆవేదనకు గురైంది. మళ్లీ ఉపాధ్యాయులు అందరి ఎదుట అవమానిస్తారని భావించింది. జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక చావే శరణ్యమని భావించింది. పాఠశాలలోని నాలుగో అంతస్తులోని టాయిలెట్ల వెనుక నుంచి రోడ్డు మీదకు దూకింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు, పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను ఆటోలో సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఆమె కాళ్లు, చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఉపాధ్యాయులు ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని, బాలిక ప్రమాదవశాత్తూ పాఠశాల భవనం నుంచి జారిపడిందని దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం. యాజమాన్యమే కారణం.. తన కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాఠశాల యజమాన్యమే కారణం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం కూడా అందించలేదని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాతే తమకు తెలిసిందని వాపోయారు. దీనిపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.48కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.48కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు గురువారం మహామండపం ఆరో అంతస్తులో జరిగింది. 15రోజులకు గాను అమ్మవారి ఆలయంలోని హుండీల ద్వారా రూ.3,48,25,362 నగదుతో పాటు 318 గ్రాముల బంగారం, 3.800కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ భారీగానే లభ్య మైందని అధికారులు పేర్కొన్నారు. యుఎస్ఏకు చెందిన 590 డాలర్లు, యుఏఈకి చెందిన 320 దిర్హమ్స్, ఖతార్ 263 రియాల్స్, ఒమెన్కు చెందిన 100 బైంసాలు, హాంగ్కాంగ్ డాలర్లు 60, మలేషియాకు చెందిన 53 రింగట్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బంది పాల్గొనగా, వన్టౌన్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కృత్తివెన్ను: లెప్రసీ వ్యాధిపై సరైన అవగాహనతో పాటు అప్రమత్తత ఉంటే ఆ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించగలమని లెప్రసీ రాష్ట్ర అధికారి ఉషారాణి అన్నారు. గురువారం ఆమె తన బృందంతో మండలంలోని కృత్తివెన్ను, పీతలావ, వాలంక, గుడిదిబ్బ, సీతనపల్లి దళితవాడ, తాడివెన్ను, చందాల, గరిశపూడి, మాట్లాం గ్రామాల్లో పర్యటించి పలువురికి లెప్రసీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వ్యాధి కారకాలైన మచ్చలు, లక్షణాలను వివరించారు. వీరు జరిపిన పరీక్షల్లో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని కృత్తివెన్ను పీహెచ్సీ వైద్యులు సాయి సందీప్ తెలిపారు. పర్యటనలో వైద్యుడు జయ కృష్ణ, లెప్రసీ డీపీఎంవో సుబ్బారెడ్డి, ఏపీఎంవో శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ అధికారి వేణు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను, నాన్ జ్యూడీషియల్, రెవెన్యూ తదితర స్టాంప్ల నిల్వలను ఐజీ పరిశీలించారు. గత నాలుగు నెలలుగా జరిగిన రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం సాధించాలని చెప్పారు. గన్నవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం గత నాలుగు నెలలకుగాను రూ. 13కోట్లు ఆదాయ లక్ష్యానికిగాను 75 శాతం రెవెన్యూ మాత్రమే వచ్చినట్లు తెలిపారు. ఇన్చార్జ్ డీఐజీ కె. రామారావు, జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి, సబ్రిజిస్ట్రార్ వీవీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. -
వాణిజ్య పన్నుల శాఖలో పునర్అవస్థీకరణ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వం చేపడుతున్న జోన్ల పునర్ వ్యవస్థీకరణ చర్యలు ఆ శాఖ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జోన్ల పరిధికి సంబంధించి మార్పులు చేపట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు మాత్రమే పరిమితమై ఉన్న జోనల్ పరిధిని పెంచి ఇతర జిల్లాలను కలుపుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఉద్యోగులు అయోమయానికి గురవ్వటమే కాకుండా పలు కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. జోనల్ వ్యవస్థగా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా ఉమ్మడి కృష్ణాజిల్లా ఇప్పటి వరకూ విజయవాడ జోనల్ వ్యవస్థగా ఉంది. పశ్చిమ కృష్ణా నుంచి విజయవాడ పాతబస్తీ వరకూ డివిజన్–1 పరిధిలో ఉండేది. దీనిలో ఆరు సర్కిల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీ నుంచి బెంజిసర్కిల్, ఆటోనగర్ హద్దుగా డివిజన్–2 పరిధిలో మరో ఆరు సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. ఆటోనగర్ నుంచి మచిలీ పట్నం, నూజివీడు వరకూ డివిజన్–3 కార్యాలయం పరిధిలో ఐదు సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఈ 17 సర్కిల్ కార్యాలయాలను విజయవాడ నోడల్ కార్యాలయం పర్యవేక్షించేది. ఇకపై నాలుగు జిల్లాలు జోన్–3గా మార్పు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్యపన్నుల శాఖను ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు పరిమితమై ఉన్న జోనల్ కార్యాలయ పరిధిని విసు్తృత పరిచారు. పక్కన ఉన్న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపి జోన్–3 ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగు జిల్లాలు ఐదు డివిజన్ కార్యాలయాలు ఈ జోన్–3 పరిధిలోకి వస్తాయి. జోన్–3 కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తారని సమాచారం. జోన్ మార్పుతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతు న్నారు. జోన్లలో కొత్త జిల్లాలను కలపడం, కార్యాలయాల మార్పులు తదితర అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. జోన్ పరిధి, ఇతర ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చి, వీటిపై పూర్తి స్థాయి అవగాహన కలిగేవరకు విధుల నిర్వహణలో అయోమయ పరిస్థితులు ఉంటాయని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. తాజాగా చేపట్టిన జోన్ మార్పు నేపధ్యంలో విజయవాడలో పని చేసే ఉద్యోగులు పశ్చిమ గోదావరి జిల్లా వరకూ బదిలీ అయ్యే అవకాశముంది. దీంతో తమ పరిధి పెరగటం, బదిలీలకు ఎక్కువ దూరం వెళ్లాల్సిన పరిస్థితులు రావటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
రైతులను మోసం చేశారు
సాగునీరు ఇవ్వకుండా పాలకులు రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున అట్టహాసంగా ఏరువాక కార్య క్రమం నిర్వహించి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసి ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమంటున్నారు. నీటికి ఇబ్బందులు వస్తాయని ముందే తెలిస్తే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు. గతంలో దెబ్బతిన్న పంటలకు కూడా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. రైతుల తరఫున పోరాటం ఆపేది లేదు. – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి -
● సంగీత దృష్టి.. ‘గండూరి’ స్ఫూర్తి
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. కఠోర సాధనే విజయ రహస్యంగా.. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని ఎదిరించి నిలబడ్డారు.. తన గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించడంతో పాటు వయోలిన్పై సరిగమలు పలికిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటున్నారు.. మరోవైపు ఔత్సాహికులకు సంగీతంలో శిక్షణనిస్తూ.. శాసీ్త్రయ సంగీతంపై యువతలో ఆసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంధుడైనా.. తన సంగీత దృష్టితో వందలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనే విజయవాడకు చెందిన గండూరి శ్రీనివాసమూర్తి. వయోలిన్పై ప్రదర్శన ఇస్తున్న గండూరి శ్రీనివాసమూర్తి(ఫైల్)వాయులీనమై.. ఇదీ ప్రస్థానం.. జీవితం.. స్ఫూర్తి దాయకం.. విశేష పురస్కారాలు.. -
నిర్బంధ కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో కమిటీ సభ్యులు బంధిత కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టం–1976 నిబంధనలు, అమలు విధానం, బాధితులను గుర్తించే ప్రక్రియ, పునరావాస చర్యలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. వ్యత్యాసాన్ని గ్రహించాలి.. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ వలస కార్మికులు స్వచ్ఛందంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తారని, బంధిత కార్మికులు మాత్రం అప్పులు, బెదిరింపులు, బలవంతం లేదా ఇతర పరిస్థితుల కారణంగా యాజమాన్యానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితిలో ఉంటారని వివరించారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు స్పష్టంగా గుర్తించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమన్వయంతో పనిచేయాలి.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యాన్ని సమర్థంగా సాధించగలమని పేర్కొన్నారు. జిల్లా కార్మిక శాఖ అధికారి జి.ధనలక్ష్మి, వాసవ్య మహిళా మండలి సోషల్ వర్కర్ కె.విజయ, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ జామి రమాదేవిలు ఉన్నారు. -
కేడీసీసీబీకి రికగ్నేషన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)కు రికగ్నేషన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు వచ్చిందని చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం బుధవారం తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడి టోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) ఫార్మేషన్ డే వేడుకలు మంగ ళవారం రాత్రి జరిగాయి. ఈ వేడుకల్లో కేడీసీసీబీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లకు పైగా వ్యాపారంతో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేడీసీసీబీకి ఈ అవార్డు వచ్చిందన్నారు. రాష్ట్ర సహకార కార్యదర్శి రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ బాబు.ఎ, ఆప్కాబ్ చైర్మన్ గన్నే వీరాంజనే యులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణ చేతుల మీదుగా తాను, సీఈఓ శ్యామ్మనోహర్ అవార్డు అందుకున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పోలీస్ శాఖ తరఫున పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు బుధవారం ఆషాఢ సారె సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేసిన సీపీ రాజశేఖరబాబు దంపతులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజే శారు. అమ్మవారికి సారె సమర్పించిన వారిలో డీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావుతో పాటు వన్టౌన్ సీఐ గుణరామ్ ఉన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యం కోసం యూపీహెచ్సీకి వచ్చే ప్రతి రోగికి ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు ఆదేశించారు. ఆయన బుధవారం క్రీస్తురాజుపురం యూపీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే సిబ్బంది ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను పరిశీలించారు. అనంతరం వాక్సిన్ను భద్రపరిచే కోల్డ్చైన్ సిస్టమ్, ఫార్మసీని పరిశీలించారు. గర్భిణులు, తల్లులకు వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం ఆన్లైన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విజయ వాడ బందరు రోడ్డులోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కేంద్రంగా విజయవాడ – వాడపల్లి వన్ డే టూర్ ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్) టి.ఎస్.వి.నారాయణ బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఎనిమిదో తేదీ వేకువ జామున నాలుగు గంటలకు సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద బస్సు ప్రారంభమై అదే రోజు రాత్రి ఏడు గంటలకు తిరిగి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1000గా నిర్ణయించామని వివరించారు. ఈ రుసుంలో బస్సు చార్జీలతోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి ఉంటాయని, ఆలయ దర్శనం టికెట్ చార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని సూచించారు. ఆసక్తిగలవారు విజయవాడ బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్కు వచ్చి సీట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడీసీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని సూచించారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీచిలకలపూడి(మచిలీపట్నం): రాజీపడదగిన కేసుల్లో మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపీ సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 నినాదంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బందితో బందరులోని జిల్లా కోర్టు నుంచి సాయిబాబా గుడి సెంటరు వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం నిర్మించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కేసులను పరిష్కరించేందుకు ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సార్లు నిర్వహించిన మీడియేషన్ ఫర్ నేషన్ కార్య క్రమం విజయవంతమైందన్నారు. వేల కేసులను పరిష్కరించామని వివరించారు. జిల్లాలో 99 మంది ప్రత్యేక శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా వందల కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయసేవాసదన్లో మీడియేషన్ సెంటర్ నిరంతరం పనిచేస్తోందన్నారు. తొలుత కోర్టు ప్రాంగణంలోని మీడియేషన్ అవేర్నెస్ సెంటరును ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. సాయంత్రం మీడియేషన్ ఫర్ నేషన్ 3.0పై న్యాయసేవా సదన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 కార్యక్రమం డిసెంబరు 30వ తేదీ వరకు కొనసాగ నున్న నేపథ్యంలో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపీ సూచించారు. సెప్టెంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు జి.వెంకటేశ్వర్లు, దుర్గాపూర్ణిమ, టి.రాజావెంక టాద్రి, సీహెచ్.యుగంధర్, ఎండీ రహ్మతుల్లా, పి.సాయిసుధ, పర్మనెంట్ లోక్అదాలత్ చైర్మన్ ఓ.బి.నాగేశ్వరరావు, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎస్.వరలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.హరిబాబు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
విజయ డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం?
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తున్నాయి. విజయ డెయిరీ ఆవరణలోని క్షీరదర్శని హాల్లో అసి స్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ (రిటైర్డ్) ఎన్నికల అధికారి ఎల్.గురునాథం నామినేషన్లు స్వీకరించారు. మూడు డైరెక్టర్ల పోస్ట్లకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో నాలుగు నామినేషన్లు మిగి లాయి. గురువారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ప్రస్తుతానికి పోటీలో చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్ర మిగిలారు. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన మూడు స్థానాల్లో చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణిని ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. గొంది నరేంద్రను బుజ్జగించి గురువారం మధ్యాహ్ననికి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పక్రియ నేపథ్యంలో ఎటువంటి వివాదాలు జరగకుండా కొత్తపేట సీఐ చినకొండలరావు పర్యవేక్షణలో 30 మందికి పైగా సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ల నేపథ్యంలో ఇటీవల కృష్ణా మిల్క్ యూనియన్పై అనేక ఆరోపణలు చేసిన వ్యక్తి తనను లోపలకు అనుమతించాలని తమ మద్దతు దారులతో డెయిరీ వద్దకు చేరుకున్నారు. అయితే సంఘం గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పడంతో వారిపైన, అక్కడకు చేరుకున్న మీడియా సిబ్బందిపైన అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల తిరస్కరణకు కారణాలు ఇవీ... దాఖలైన ఏడు నామినేషన్లలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారి ఎల్.గురునాథం పేర్కొన్నారు. మూల్పూరు రామ్మోహన్, మర్రెడ్డి బసివిరెడ్డి, పాలడుగు వసంతకుమార్ సమర్పించిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ముగ్గురు ప్రాతి నిధ్యం వహిస్తున్న సంఘాలు, మద్దతుదారులు సమితికి బకాయిలు ఉన్నందున వారి నామినేషన్లను తిరస్కరించారు. -
బెజవాడ దుర్గమ్మకు తిరువూరు పోలీసుల సారె
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తల్లికి వందనం పథకంపై ఫిర్యాదుల స్వీకరణకు ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాలో అర్హుల పేరు లేకపోవడం, వివరాల్లో ఏవైనా తప్పులు ఉండడం, అనర్హులుగా చూపడం, ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని కోరారు. తమ అభ్యంతరాలపై ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. తమకు అందిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెనమలూరు: పెనమలూరు వంతెన వద్ద బందరు కాలువలో గల్లంతైన యువకుడు నూకరాజు మృత దేహం లభ్యమైంది. ఎస్డీఆర్ఎఫ్ తీవ్రంగా గాలించటంతో గంగూరు గ్రామ పరిధి బందరు కాలువలో మృతదేహం కనబడటంతో స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంగళవారం కాలువులో కొట్టుకు వచ్చిన మరో మృతదేహాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. బందరు కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావటంతో మృతదేహం వెలికి తీయటానికి పెనమలూరు గ్రామానికి చెందిన నూకరాజు కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాలువలో గుర్రపు డెక్క విపరీతంగా ఉండటంతో ఈత కొడుతూ నూకరాజు కాలువ లో అదృశ్యమయ్యాడు. దీంతో బుధవారం ఎస్డీ ఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి బందరు కాలువలో గాలింపు చేపట్టారు. కంకిపాడు లాకుల వద్ద నీరు పారుదల జరగకుండా లాకులు కట్టించి కాలువలో విస్తృతంగా గాలింపు చేశారు. చివరకు గంగూరు కరెంట్ ఆఫీస్ వెనుక బందరు కాలువలో నూకరాజు మృతదేహం కనబడింది.. ఎస్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని పోలీసులకు స్వాధీనం చేశారు. మరో మృతదేహం కూడా.. కాగా బందరు కాలువలో మంగళవారం నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహం పెనమలూరు వంతన వద్ద గుర్రపు డెక్కలో నిలిచిపోయింది. బుధవారం ఉదయం ఎస్ఐ తాతాచారి ఆధ్వర్యంలో కాలువలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 మధ్య ఉంటుందని, మృతుడు నీలం రంగు జీన్ప్యాంట్, తెలుపురంగు టీషర్ట్ వేసుకున్న మగ వ్యక్తి అని ఎస్ఐ తెలిపారు. సమాచారం తెలిసిన వారు 9618336684కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని ఎస్ఐ కోరారు. -
‘హ్యాండ్బుక్’ అత్యంత కీలకపత్రం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా రూపొందించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టికల్ అధికారులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మేక స్వాతి మాస్టర్ ట్రైనర్గా వ్యవహరించారు. -
సాగు నీరా.. పరిహారమా తేల్చండి
రైతులు ఇప్పటికే 15 నుంచి 20 శాతం సాగు కోసం ఖర్చు చేశారు. సాగునీరు అందిస్తా మని చెప్పి ఏరువాక పండుగ చేశారు. బ్యారేజీ వద్ద సాగునీరు వదిలేటప్పుడు ఘనంగా పూజలు నిర్వహించారు. సాగు నీరు ఇవ్వలేమని అప్పుడు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు వరిసాగు చేయొద్దని చెబితే రైతుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం సాగు నీరు ఇవ్వలేనప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. – ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త -
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం సర్వే
గన్నవరం: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్లో భాగంగా కారిడర్–1 కోసం మండలంలోని గన్నవరం, కేసరపల్లి గ్రామాల్లో బుధవారం సామాజిక ప్రభావ మదింపు కార్యక్రమం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) ప్రతినిధులతో కలిసి రెవెన్యూ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఈ సర్వే జరిపారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మెట్రోరైలు స్టేషన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయనున్న స్థలాల్లో ఈ మదింపు చేపట్టారు. తహసీల్దార్ కె. వెంకటశివయ్య పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి మార్కింగ్ చేశారు. భూముల వివరాలు, అనుభవదారుల సమాచారం, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలపై కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలను నమోదు చేశారు. 61.15 ఎకరాల సేకరణ.. తహసీల్దార్ వెంకట శివయ్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కోసం కేసరపల్లిలో ఏర్పాటు చేయనున్న మెట్రో డిపో కోసం 61.15 ఎకరాల భూములు సేకరించనున్నట్లు చెప్పారు. కేసరపల్లి, హెచ్సీఎల్, గన్నవరంలోని బుద్ధవరం బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్మించనున్న నాలుగు మెట్రో స్టేషన్ల కోసం మరో 1.35 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ప్రభావ మదింపు అనంతరం నివేదికతో పాటు ప్రణాళికను ఏఎస్సీఐ ప్రతినిధులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులను గాలికొదిలేసింది. ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సాగు కోసం డెల్టాకు నీరు విడుదల చేసిన ప్రభుత్వం ఆ తరవాత మాట మార్చింది. వరికి నీరు ఇవ్వలేమని చేతులెత్తేసింది. వరి వద్దు పెసర, మినుము సాగుచేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ సాగునీటి కోసం పోరుబాట పట్టింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్టీ అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని కిట్టు, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము దీక్షలు చేయనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి విజ యవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సింహాద్రి రమేష్బాబు పాదయాత్ర చేయనున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం తెలంగాణలో అన్ని లిఫ్ట్ స్కీంల నుంచి నీరు వాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కృష్ణాడెల్టాకు నీటి విషయంలో ప్రభుత్వం బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి రోజుకు సుమారు 22 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరుతోంది. అయినా నీరు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పట్టిసీమతో కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ నీటిని తాగు అవసరాల కోసమే నని ప్రకటించడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. అసలు కృష్ణాడెల్టాలో ఖరీఫ్లో వరి, చెరకు, ఆక్వా తప్ప మరే ఇతర పంటల సాగు సాధ్యం కాదు. వరి సాగు చెయ్యొద్దంటే 10.5 లక్షల ఎకరాల మాగాణిలో తీవ్ర సంక్షోభం తప్పదు. 1855లో బ్రిటీష్ పాలనలో విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట, 1957లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన నాటి నుంచి కృష్ణా డెల్టాలో వరి సాగు వద్దనడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో 29 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కృష్ణా, భీమా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో వైపు శ్రీశైలం జలాశయానికి వరద వస్తోంది. పట్టిసీమ, పులిచింతల నుంచి రోజుకు నాలుగువేల క్యూసెక్కుల నీరు ఇస్తే డెల్టా సాగుకు ఇబ్బంది ఉండదు. బుధవారం ప్రకాశం బ్యారేజికి 6,918 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. గతంలో నీరు తక్కువ ఉన్నా కాలువలకు నీరు వదిలారు. 2003లో 80 టీఎంసీలతో సాగు జరిగింది. పునరాలోచన చేయాలి ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా జిల్లాలో 6,79,500 ఎకరాలు, ఏలూరు జిల్లాలో 58,000 ఎకరాలు పశ్చిమ కృష్ణా డెల్టాలో 5,71,351 ఎకరాల ఆయ కట్టు ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల 170 సంవత్సరాల చరిత్ర ఉన్న కృష్ణాడెల్టా ఆయకట్టు తొలిసారి ప్రమాదంలో పడింది. ఇప్పటికే డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులు పొలాలను దుక్కి దున్ని, నారుమడులు పోసుకున్నారు. కొంత మంది వెదసాగు చేపట్టారు. సాగునీరు లేనప్పుడు సబ్సిడీపై వరి విత్తనాలు ఎందుకిచ్చారు, యాప్లో యూరియా అంటూ హడావిడి ఎందుకు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి దీక్షలు కృష్ణా జిల్లా రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం నుంచి మూడు రోజుల పాటు దీక్షలు చేయనున్నారు. అవనిగడ్డ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో పులిగడ్డలో ఒకరోజు దీక్ష, అనంతరం అవనిగడ్డలో ఆందోళ నలు చేసేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఆరో తేదీన మంగినపూడి శివారు కొత్తపూడి చర్చి సెంటర్లో, 8వ తేదీన చిన్నాపురం శివారు నెలకుర్రు రోడ్డులో నిరాహార దీక్ష చేయనున్నారు. పెడన సమన్వయకర్త ఉప్పాల రాము ఆధ్వర్యంలో ఆరో తేదీన గూడూరు, ఏడున పెడన, 8న బంటుమిల్లి, 9వ తేదీన కృత్తివెన్నులో నిరాహార దీక్ష చేస్తారు. పదో తేదీన ఈ మూడు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.వరి పంట సాగు చేయవద్దని రైతులకు స్పష్టం చేస్తున్న కలెక్టర్ బాలాజీ -
ప్రభుత్వ తీరు దారుణం
తెలంగాణలోని భీమా–1, భీమా–2, నెట్టెంపాడు, కోయిలసాగర్, కల్వకుర్తి లిఫ్ట్లు పని చేస్తున్నాయి. జూరాల కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలారు. శ్రీశైలం రిజర్వాయర్లోకి 2.42 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి నీటి మట్టం 864 అడుగులు దాటింది. అయినా డెల్టాకు నీరు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెప్పడం దారుణం. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నుంచి రోజుకు నాలుగువేల క్యూసెక్కులు విడుదల చేస్తే సాగుకు ఇబ్బంది ఉండదు. – ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ -
చేనేత రంగానికి చేయూతనిద్దాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశంలో వ్యవసాయం తరువాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చేనేత రంగానికి చేయూతనిచ్చి పరిరక్షించుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పేర్కొన్నారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఏపీ చేనేత విభాగం, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బుధ వారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చేనేత సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత బందరు రోడ్డులోని రాఘవయ్య పార్క్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాధవ్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో కష్టపడి తయారుచేసే చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సంద ర్భంగా ప్రతి చేనేత కుటుంబం ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆప్కోలో సొసైటీలు చేరి దోచుకుంటున్నాయి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలను విక్రయించే ఆప్కోలో సొసైటీలు ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నాయని విమర్శించారు. చేనేత కళాకారుడే నేరుగా ఆప్కోలో వస్త్రాలు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ రొంగల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూరాడ రాధాకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పోతుల సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్. దయాకర్రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్, చేనేత సెల్ కన్వీనర్ జగ్గరపు శ్రీనివాసరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీఎంఎస్ఐ డీసీ చైర్మన్ వీరాంజనేయ ప్రసాద్, వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు(బుధవారం) రాత్రికి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. -
ఫిజియోథెరపీ విద్యార్థులకు నాణ్యమైన విద్య
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించిన పాఠ్యాంశాన్ని ఫిజియో కళాశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ (ఎన్సీఏహెచ్పీ) రూపొందించిన సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశంపై హెల్త్ యూనివర్సిటీలో మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్తో కలిసి వీసీ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు ప్రారంభానికి విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏడీఎంఈ డాక్టర్ వి. రాధికారెడ్డి, సీఓఈ డాక్టర్ శ్రీకాంత్, ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ చైర్మన్ యలమంచిలి వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ భీమ సుమైల తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ -
విమర్శలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
సాక్షి, విజయవాడ/విజయవాడ లీగల్: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని, విమర్శలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన విజయవాడ కోర్టుకు తనపై నమోదైన పోక్సో కేసు విచారణ నిమిత్తం మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాట్లాడుతూ.. తనపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి వేధిస్తోందన్నారు. నేరస్తులను అరెస్టు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు, లాఠీచార్జీలు, పోలీసు నిర్బంధాలు ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలని స్పష్టం చేశారు. రైతుకు అన్యాయం చేస్తున్నారు.. ఉరవకొండలో ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలపై లాఠీ చార్జ్, కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ ఖండించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శీనప్ప భూవివాదంలో తలదూర్చుతున్నారని, కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ బాధిత రైతుకు న్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయడం సరికాదని, చట్టాన్ని అమలు చేయడమే ప్రభుత్వ బాధ్యత హితవుపలికారు. ఉరవకొండలో ప్రజలను, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బ్యారికేడ్లతో అడ్డుకోవడం పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందని, బీసీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలను ఈ ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్ సీపీ నేతలపై నమోదైన కేసులు రాజకీయ కక్షసాధింపే అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం మానేసి అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. పోక్సో కేసులో విజయవాడ కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ -
కొండలమ్మ సన్నిధిలో అన్నసమారాధనకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కర్నూలుకు చెందిన భక్తులు మంగళవారం బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ. 3.88లక్షలతో తయారు చేయించిన బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ, మధులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు ప్రారంభం
u8లో మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆషాఢ కృత్తిక(ఆడికృత్తిక) పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్టానాలు, మహా నివేదన, నీరాజన మంత్రపుష్పాలతో శాస్తోక్తంగా క్రతువులు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివార్లకు పట్టు పవిత్రాలు.. పవిత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో వాస్తు హోమం, పర్యగ్రీనకరణం, అంకురారోపణ, ప్రధాన దేవతా సహిత సర్వతో భద్ర మండపారాధన, పట్టు పవిత్రాలు ఆసాదన, ఆధివాసమాలు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వినియోగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు మండలి వెంకట కృష్ణారావు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. -
‘మండలి’ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గాంధేయ విలువలతో నిరాడంబర జీవితం సాగించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కొనియాడారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి మండలి చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజ సేవే జీవిత ధ్యేయంగా ఎంచుకున్న అరుదైన నాయకుడని పేర్కొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన అనంతరం సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా సమన్వయం చేసి వేలాది బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీ నరసింహ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
పశ్చిమం.. ప్రహసనం
టీడీపీకి ప్రాణసంకటం.. జనసేనకు అవకాశం● విజయవాడ పశ్చిమలో తారస్థాయికి ఆధిపత్య పోరు● పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్నకు కలసిరాని నేతలు ● మరోవైపు పాగా వేసేందుకు పావులు కదుపుతున్న జనసేన సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను నియోజకవర్గ ఇన్చార్జ్గా పార్టీ ప్రకటించడాన్ని ఇతర నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటి వరకూ పార్టీ పగ్గాలు తమకు దక్కుతాయని ఆశించిన వారు ఈ ప్రకటనతో నిరాశ చెందారు. బుద్ధా వెంకన్నకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరఫున సుజనాచౌదరి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఇన్చార్జిగా వ్యవహరించారు. జనసేన కన్ను.. తర్వాత కాలంలో పశ్చిమలో పాగా వేయడం కోసం జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. కొద్ది నెలల క్రితమే జనసేన కార్యాలయం ప్రారంభించింది. అనంతరం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పశ్చిమలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల జనసేన సమావేశం నిర్వహించి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుసాధించాలని నిర్ణయించింది. దీంతో తెలుగుదేశం పార్టీ హడావుడిగా బుద్ధా వెంకన్నను పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించింది. ఈ పరిణామాలు అక్కడి నేతలకు మింగుడుపడటం లేదు. ఎవరికి వారే.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న ఎంఎస్ బేగ్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, ఏపీ దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా పశ్చిమ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్నారు. అయితే డూండీ రాకేష్కు నారా లోకేష్ అండదండలు ఉన్నాయి. కానీ సొంత సామాజకవర్గంలోనే వ్యతిరేకత రావడంతో అతన్ని పక్కన పెట్టారు. మాజీ మంత్రి ఎంకే బేగ్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎంఎస్ బేగ్ కూడా నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని ఆశించారు. నాగుల్మీరా గతంలో పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అతను పార్టీ ఇన్చార్జ్గా కూడా పనిచేశారు. అయితే వీరిని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారిద్దరూ నిరాశ చెందారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ కూడా తనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన కూడా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ బుద్ధా వెంకన్నకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. బుద్ధా వెంకన్న ఒక్కరే స్థానిక నేతలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1983లో బీఎస్ జయరాజ్ తప్ప మరెప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపొందలేదు. బీజేపీ ఒక్కసారి గెలిచింది. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అంతర్గత కలహాలతో అడుగు ముందుకు పడటం లేదు. -
ఈఎస్జెడ్కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిస్థితులు, ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్జెడ్)ను శాసీ్త్రయ ప్రాతిపదికన ఖరారు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆయన చాంబర్లో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో జిల్లాలోని గుడివాడ మండలంలోని 12 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 5 గ్రామాలకు ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించే అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరితగతిన చేయకుంటే ఇబ్బంది.. కలెక్టర్ మాట్లాడుతూ ఈఎస్జెడ్ను త్వరితగతిన ఖరారు చేయకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అభయారణ్యం సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధి డిఫాల్ట్ ఎకో సెన్సిటివ్ జోన్గా పరిగణించే అవకాశం ఉందన్నారు. కాబట్టి సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనంతో త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏలూరు, భీమవరంలో రూపొందించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు స్వీకరించాలని తెలిపారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతించదగిన, నియంత్రిత, నిషేధిత కార్యకలాపాలపై సమగ్ర అవగాహనతో శాఖల వారీగా తమ అభిప్రాయాలు, సూచనలు సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య మేనేజ్మెంట్ డీఎఫ్వో డాక్టర్ ఏ త్రిమూర్తులురెడ్డి, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణా డీఎఫ్వో సునీత, డీపీవో ఎం. ధనలక్ష్మి, మత్స శాఖాధికారి అయ్యా నాగరాజా, వ్యవసాయ శాఖ జేడీ జ్యోతి రమణి, సర్వే ఏడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి అవమానం
ఎ.కొండూరు: తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల నడుమ నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎ.కొండూరు మండలం అట్లప్రగడలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గంటకు పైగా వేచిచూసినా అధికారులు రాలేదు. గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా 790 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనాలని రెవెన్యూ అధికారులు కోరడంతో ఎమ్మెల్యే మంగళవారం ఇక్కడికి వచ్చారు. ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమ వివరాలు ప్రకటించింది. ఈ మేరకు 150కి పైగా పాస్ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసిన అధికారులు కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. ఎంపీ వర్గీయుల ఒత్తిడి మేరకే అధికారులు ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. గంటసేపు ఎదురుచూసి.. అట్లప్రగడలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే గంటసేపు అధికారుల రాక కోసం ఎదురుచూశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అనుచరులు ఫోన్లో సంప్రదించగా, తహసీల్దార్ విజయవాడ వెళ్లారని, డెప్యూటీ తహసీల్దార్, వీఆర్వో వస్తారని సమాధానం వచ్చింది. వారు కూడా ఎమ్మెల్యే వెళ్లిపోయే సమయంలో హడావుడిగా వచ్చి ఆయనకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. గ్రామ సచివాలయం వద్ద టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసిన అధికారులు కార్యక్రమానికి రాక పోవడం గమనార్హం. కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు గైర్హాజరవడంపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, పాస్పుస్తకాలు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. పాస్పుస్తకాల కోసం పనులు మానుకుని వచ్చిన రైతులు సైతం నిరాశకు లోనయ్యారు. వివాదాస్పదమైన అట్లప్రగడలో పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం -
కొనసాగుతున్న సారె సంబురం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారెను సమర్పించారు. మంగళవారం దేవస్థాన శానిటేషన్ సిబ్బంది, కేశఖండనశాల సిబ్బంది సారెను సమర్పించారు. నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో... శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన కేశఖండనశాల నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశఖండనశాలలో అమ్మవారి చిత్రపటానికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులతోపాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారె సమర్పించారు. కార్యక్రమంలో నాయీబ్రహ్మణ సంఘం ఏపీ జేఎసీ అధ్యక్షులు గుంటుపల్లి రామదాసు దంపతులు, ఏజీఎల్ నారాయణ, ఆర్వీ రమణ, జి.హరికిరణ్, ఏ.పూర్ణ, కనకారావు, పి. సంతోష్, ఏ.రాంబాబు, ఆర్.రమణ తదితరులు పాల్గొన్నారు. జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శానిటేషన్ విధులు నిర్వహించే సిబ్బంది మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో రావిచెట్టు వద్ద అమ్మవారికి ఆలయ చైర్మన్, ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. శానిటేషన్ కార్మికులు కుటుంబసమేతంగా తరలివెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు తిరుమలరావు, ఎన్.రమేష్బాబు, చంద్రశేఖర్, ఈఈ రమాదేవి, సూపరిండెంటెంట్ మూర్తి, హేమ, బలరామ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు పోలీసు సారె.. అమ్మవారికి విజయవాడ పోలీసుల తరఫున బుధవారం ఆషాఢ సారెను సమర్పించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు దంపతులతోపాటు పలువురు పోలీసులు, జిల్లాకు చెందిన మహిళా సిబ్బంది సారె సమర్పించనున్నారు. 21వ రోజుకు చేరిన ఆషాఢ మాసోత్సవాలు మంగళవారం కూడా కొనసాగిన సారె రద్దీ భక్తబృందాలతోపాటు సారె అందజేసిన ఆలయ సిబ్బంది ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పెద్ద ఎత్తున భక్తులు సారెను సమర్పించారు. 21వ రోజైన మంగళవారం 39 బృందాలు, సుమారు 17వేల మంది భక్తులు బృందాలుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. సారె సమర్పించిన భక్త బృందాలకు అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు వారికి ప్రసాదాలను అందించారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ– 2025లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసినా స్పందన లేదని దగా పడిన అభ్యర్థులు విమర్శించారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులకు తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయా లన్న డిమాండ్లతో వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో సోమవారం టౌన్హాల్ సమావేశం జరిగింది. రామవరప్పాడులోని ఎం కన్వెన్షన్ సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొని ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు జరిగిన అన్యా యంపై కొన్ని నెలలుగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తోందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జెన్జీ యువత పోరాడుతోందన్నారు. యువతకు న్యాయం జరగా లంటే వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వస్తేనే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలను సాక్ష్యాలతో చూపించాం డీఎస్సీలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ చూపించారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడితే చర్చకు రమ్మంటున్నారని, ముందు అన్యాయం జరి గిన అభ్యర్థులతో మాట్లాడాలని హితవు పలికారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే అందరి భవిష్యత్ బాగుంటుందన్నారు. పరీక్ష రాయకుండానే పోస్టులు ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేయవచ్చో, డీఎస్సీలో అన్ని రకాలుగా చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పరీక్ష రాయకుండానే పోస్టులు ఇచ్చేలా జీఓలు తెచ్చి, అనుకున్న వారికి ఉద్యోగాలు రాగానే ఆ జీఓలను రద్దు చేశారని విమర్శించారు. కూటమి నిష్పక్షపాతంగా ఉంటే సీబీఐ విచారణకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్ రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి పాలనలో విద్యార్థులకు నష్టం వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. కూటమి పాలనలో విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు గళం విప్పితే కేంద్ర ప్రభుత్వం భయపడిందని, జెన్జీ యువత పోరాటం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 420 పోస్టులకు కనీస అర్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య(వర), రాష్ట్ర పెన్షన్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, సోషల్ మీడియా విభాగం అర్గనైజింగ్ ప్రెసిడెంట్ డి.అంజిరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఆషాఢ సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మకు అశేష భక్తజనం, భక్త బృందాలు ఆషాఢ సారె సమర్పిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సారె సమర్పించారు. ఏపీసీపీడీసీఎల్ తరఫున సంస్థ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, టి.వి.ఎస్.ఎన్.మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్ఈ హనుమయ్య, ఈఈ ఏడుకొండలరావు, పలువురు అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారె సమర్పించారు. సారె సమర్పించిన 48 బృందాలు ఆషాఢ మాసం 20వ రోజైన సోమవారం సుమారు 48 భక్త బృందాలు, 18,432 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. సారె సమ ర్పించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. దుర్గగుడిలో శానిటేషన్ సిబ్బంది మంగళవారం అమ్మవారికి సారె సమర్పించనున్నారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణ నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా బయలుదేరి, కనకదుర్గనగర్లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని కొండపైకి చేరుకుని సారె సమర్పిస్తారు. -
లడ్డూపోటు, అన్నదాన భవనాలను సిద్ధం చేయండి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రావణ మాసంలో నూతన లడ్డూపోటు, అన్నదాన భవనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో నిర్మిస్తున్న అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాలను సోమవారం రామచంద్రమోహన్ పరిశీలించారు. తొలుత ఆ భవనాల లోపల జరుగుతున్న పలు పనులను పరిశీలించిన ఆయన దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 15 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నదాన భవనంలో భక్తులు కూర్చునే హాల్, వంటశాల, భక్తులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంతో పాటు అన్నదానం హాల్లోకి భక్తులు ప్రవేశించే మార్గం, బయటకు వచ్చే మార్గాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. తుది పనులు పూర్తి చేయండి అనంతరం కమిషనర్ రామచంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ నూతన అన్నదాన, లడ్డూ పోటు భవనం పనుల పురోగతి సంతృప్తికరంగానే జరుగుతున్నాయన్నారు. మరో పక్షం రోజుల్లో రెండు భవనాలకు సంబంధించి అన్ని సివిల్, ఇంజినీరింగ్, తుది మెరుగులు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జీవీఆర్ శేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుబజార్లో సబ్సిడీ బియ్యం కేంద్రం ప్రారంభం
మచిలీపట్నంటౌన్: స్థానిక జిల్లా కోర్టు సెంటర్ సెంటర్ సమీపంలోని రైతు బజార్లో సోమ వారం సబ్సిడీ బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టీమ్డ్ బీపీటీ బియ్యం కిలో రూ.52, రా బియ్యం రూ.50 చొప్పున విక్రయిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులకు సబ్సిడీ బియ్యం అందజేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఎస్ఓ జి.మోహన్బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, సెక్రటరీ భాస్కర్, మార్కిటింగ్ శాఖ ఏడీ నిత్యానందం, పీడీఎస్ డెప్యూటీ తహసీల్దార్ సీహెచ్.దుర్గాంజనేయులు, రైతుబజారు ఎస్టేట్ అధికారి ఎల్.బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.ఫణికుమార్రెడ్డి ఆరోపించారు. అవకతవకలను అరికట్టి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ డి.కె.బాలాజీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫణికుమార్రెడ్డి మాట్లాడుతూ.. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవి జనల్ మెరిట్ లిస్టులో ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై అసిస్టెంట్ డైరెక్టర్, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఆ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీఓ 34 ప్రకారం లోపా లను సరిదిద్దాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని నిజాయితీ గల అధికారితో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పరిశీలించి పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్ర మంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎ.త్రిమూర్తులు, కార్యదర్శి కె.నాగసాయి, కోశాధికారి ఎండీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తల్లిపాలే శిశువు ఆరోగ్యకర జీవితానికి అమృతం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. శిశువుకు తొలి ఆరునెలలు తల్లిపాలే అందించా లని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియాతో కలిసి ఆదివారం వాల్ పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు ఇతివృత్తంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాల విశిష్టతపై క్షేత్ర స్థాయి ఆరోగ్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణబాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శరత్బాబు, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఐ.విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా పనిచేసిన ఎం.ఎన్.రాణి ఉద్యోగ విరమణ చేశారు. ఆమె స్థానంలో శ్రీకాకుళం జిల్లా పీడీగా పనిచేస్తూ సెలవుపై ఉన్న ఐ.విమలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమ వారం కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. -
యథేచ్ఛగా ఇసుక, మట్టి, బియ్యం రవాణా
● కూటమి నేతలే మాఫియాగా మారారు ● కార్పొరేషన్లో స్థలాలు ఆక్రమించి అమ్మేసుకుంటున్నారు ● కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఇసుక, మట్టి, బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అవినాష్ మాట్లాడుతూ కూటమి నేతలు మాఫియాగా తయారై కార్పొరేషన్ స్థలాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారుల సహకారంతో జేఎన్యూఆర్ఎం ఇళ్లను టీడీపీ కార్యకర్తలు, వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు అమ్ముకుంటున్నారన్నారు. కూటమి నేతల మాఫియా ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. దీనిపై అనేక పర్యాయాలు కలెక్టర్కు, అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. మాఫియాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామన్నారు. లేని పక్షంలో అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న దోపిడీని వివరించాం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జిల్లాతో పాటు విజయవాడలో జరుగుతున్న దోపిడీని కలెక్టర్కు చెప్పామన్నారు. ఒక్క నెలలోనే నున్న పోలీసు స్టేషన్ పరిధిలో రెండు బియ్యం లారీలను పట్టుకున్నారని దీని వెనక ఉన్న వ్యక్తులను వదిలి పెడుతున్నారు. వీటి వెనక ఉన్నదెవరో యంత్రాంగం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సాక్షాత్తు తిరువూరు ఎమ్మెల్యే మట్టి దోపిడీ జరుగుతోందని స్టేటస్ పెట్టారన్నారు. ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు.. కార్పొరేషన్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను కూటమి నేతలు అక్రమంగా అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. సెంట్రల్లో 10 చోట్ల ప్రభుత్వ స్థలాల్ని అమ్మేశారన్నారు. వీటన్నిటిపై ఆధారాలతో సహా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, మాఫియాపై చర్యలు తీసుకోకపోతే 15 రోజుల తర్వాత వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామన్నారు. కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కలెక్టర్ను కోరారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 22–ఏ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జరిగిన కార్యక్రమంలో 22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించిన ఏడు కేసులకు సంబంధించి 75.41 ఎకరాల భూమికి విముక్తి కల్పించి కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన పట్టా భూముల తొలగింపు అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారులకు బదలాయించడంతో మరింత వేగంగా అర్జీల పరిష్కారం జరుగుతుందన్నారు. -
దుర్గమ్మకు రూ.17 లక్షల కాసుల హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.17 లక్షల విలు వైన లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. దొండేటి ఐశ్వర్యజ్యోతి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి 108 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కాసుల హారం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దాతలకు వేద పండితుల ఆశీర్వచనం, ఆలయ డీఈఓ కిషోర్కుమార్, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మ చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. చిలకలపూడి(మచిలీపట్నం): వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొ న్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వ హించనున్న ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమం’ పోస్టర్ను జేసీ ఎం.నవీన్తో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆరు నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. డీఆర్వో కె.శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలకు బూజు
ఫొటోలో ఉన్న మిరియాల రమేష్, గీతాంజలి దంపతులు మూడేళ్ల క్రితం రూ.25 లక్షల రుణం తీసుకుని మైలవరంలో ఇస్తరాకుల కంపెనీ ప్రారంభించారు. మే 25వ తేదీన పెనుగాలులతో కూడిన భారీ వర్షానికి కంపెనీ షెడ్డు కూలి మెటీరియల్ పూర్తిగా ధ్వంసమైంది. పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువైంది. మరో రూ.10 లక్షలు అప్పు చేసి కంపెనీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. చేసిన అప్పులే భారమైతే మళ్లీ అప్పు చేయాల్సి వచ్చిందని, ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ దంపతులు వేడుకుంటున్నారు. ఫొటోలకు ఫోజు..జి.కొండూరు: అకాల వర్షం పేదల జీవితాలను కష్టాలపాలు చేసింది. మండు వేసవిలో పెను గాలు లతో విరుచుకుపడి 521 ఇళ్లను నేలకూల్చింది. మరుసటిరోజే ప్రజాప్రతినిధులు వచ్చారు. త్వరలో పరిహారం ఇస్తామని గొప్పలు చెప్పి ఫొటోలకు ఫోజులిచ్చారు. అధికారులు నష్టాలపై ప్రతిపాద నలు సిద్ధం చేశారు. రెండు నెలలు గడిచినా పరిహారం అందలేదు. హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధుల జాడలేదు. పట్టించుకున్న అధికారులూ లేరు. పట్టించుకోని ప్రజాప్రతినిధి మైలవరం మండలంలో మే 25న సాయంత్రం సమయంలో అరగంటపాటు పెనుగాలులతో కూడి భారీ వర్షం ఏడు గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. రేకుల ఇళ్లు, పూరిళ్లు, కోళ్ల ఫారాలు, పశువుల పాకలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. భారీ హోర్డింగ్లు విరిగిపడ్డాయి. మరుసటి రోజే నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆయా గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామంటూ గొప్పలు చెప్పారు. రెండు నెలలైనా పరిహారం మాట మరిచారు. నష్టం ఇలా... మే 25 న సాయంత్రం జరిగిన నష్టంపై అధికారులు అదే నెల 26, 27 తేదీల్లో అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అధికారుల అంచనా ప్రకారం మైలవరం గ్రామంలో 12 ఇళ్లు పూర్తిగా నేలమట్టమవగా మరో 46 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పొందుగలలో 87 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 8 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా 75 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు కోళ్ల ఫారాలు, రెండు చర్చిలకు నష్టంవాటిల్లింది. చండ్రగూడెంలో 245 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 232 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా ఐదు కోళ్ల ఫారాలు, ఒక చర్చి, పశువులు, మామిడికాయల పాకలు ఏడు ధ్వసమయ్యాయి. సబ్జపాడులో నాలుగు ఇళ్లు పూర్తిగా నేలమట్టమవగా 45 ఇళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. జంగాలపల్లిలో 59 ఇళ్లకు నష్టం వాటిల్లగా మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పుల్లూరులో ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమవగా 19 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్వడంలో ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమగా మరో రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏడు గ్రామాల్లో 521 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 29 ఇళ్లు పూర్తిగా నేలకూలగా 475 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏడు కోళ్ల ఫారాలు, మూడు చర్చిలు, ఏడు పశువులు, మామిడికాయల పాకలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి నా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు వచ్చి ఆధార్కార్డు, అకౌంట్ వివరాలు తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఎమ్మెల్యే వచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందించలేదు. దయచేసి పరిహారం అందించి ఆదుకోవాలి. – మత్తి భాస్కరరావు, బాధితుడు, జంగాలపల్లి గ్రామం -
అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందే అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో 189 వినతులు నమోదయ్యాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 78 అర్జీలు అందాయి. జిల్లాలో భూ వివాదాలు, సర్వే సమస్యలు, రెవెన్యూ అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నందున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీ ఆర్ఎస్ పోర్టల్ను నిరంతరం పరిశీలిస్తూ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను సక్రమంగా పరిష్కరించకపోవడం వల్ల ఒకే సమస్యపై పలుమార్లు అర్జీలు వస్తున్నాయని వివరించారు. నాణ్యమైన పరిష్కారాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. గత నవంబర్, డిసెంబర్ నెలల నుంచి పెండింగ్లో ఉన్న భూ సర్వేలను వాతావరణం అనుకూలించిన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూమి సరిహద్దులు, రికార్డులు లేదా భూ హక్కులకు సంబంధించిన ప్రతి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, సమస్య చిన్నదైనా అత్యున్నత ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. డివిజనల్ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు ఎరువుల విక్రయాలను నిత్యం పర్యవేక్షిస్తూ అక్రమాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగుదారు హక్కు కార్డుల మంజూరులో ఎలాంటి ఆలస్యం ఉండదని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీటీ.. ఏమిటిది!
● జీజీహెచ్లో సీటీ స్కాన్కు.. పదేపదే మరమ్మతులు ● నిర్వహణ లోపమేనా? ● రోగులకు ఇబ్బందులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రి సూపర్స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ స్కాన్ యంత్రం నిర్వహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతోంది. రిపేరు చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి రెండు, మూడు వారాలు సమయం పడుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రం మూలన పడటంతో రోగులకు పలు పరీక్షలు నిలిచి పోతున్నాయి . గత ప్రభుత్వంలో ఏదైనా యంత్రం మరమ్మతులకు గురైతే, వెంటనే రిపేరు చేసి అందుబాటులోకి తెచ్చేవారు. కానీ నేడు రెండు మూడు వారాలు పడుతుండటంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. జీజీహెచ్లో రెండు సీటీ స్కాన్ యంత్రాలు విజయవాడ జీజీహెచ్లో రెండు సీటీ స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏ బ్లాక్లో పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తుండగా, రెండో స్కానింగ్ యంత్రం సూపర్స్పెషాలిటీ బ్లాక్ మొదటి అంతస్తులో ఉంది. వీటిలో పీపీపీ పద్ధతిలో నిర్వహించే స్కానింగ్యంత్రంపై నిత్యం 150 మంది వరకూ స్కానింగ్లు చేస్తుంటారు. సూపర్స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ స్కానింగ్ యంత్రంపై 50 నుంచి 60 మందికి స్కాన్లు చేస్తుంటారు. వారం రోజులుగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని సీటీ మరమ్మతులకు గురవడంతో, అన్ని స్కాన్లు ఏ బ్లాక్లోనే తీయాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక స్కాన్పై నిర్లక్ష్యం సూపర్స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని రోగులకు అవసరమైన స్కాన్లు తీసేందుకు 128 స్లైస్ కెపాసిటీ కలిగిన సీటీ స్కాన్ యంత్రాన్ని గత ప్రభుత్వంలో సమకూర్చారు. దీనిపై గుండె, మెదడు రక్తనాళాల్లోని పూడికలు గుర్తించడమే కాకుండా, కిడ్నీల పనితీరు, కిడ్నీ రక్తనాళాలు స్కాన్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి అత్యాధునిక సీటీ స్కాన్ యంత్రం నిర్వాహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
వందకు పైగా భక్తి బృందాలు
ఆదివారం రికార్డు స్థాయిలో వందకు పైగా భక్తి బృందాలు, సుమారు 35వేల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసోత్సవాలలో ఇంత భారీ స్థాయిలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా రద్దీనే కనిపించింది. మహామండపం, రాజగోపురం, లక్ష్మీ గణపతి ప్రాంగణం, ఘాట్రోడ్డు ఇలా ఎక్కడ చూసినా బృందాలు, బృందాలుగా భక్తులు కనిపించారు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. వెస్ట్ ఎసీపీ దుర్గారావు, వన్టౌన్ సీఐ గుణారామ్ స్కానింగ్ పాయింట్లో రద్దీని పర్యవేక్షించి ఆలయ సిబ్బందితో పాటు పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. -
విద్యారంగం అస్తవ్యస్తం
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. జూన్లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం చాలా కోర్సులకు సంబంధించి అక్టోబర్, నవంబర్ మాసాలు దాటినా కావటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు కళాశాలలు ఇవ్వటం లేదు. –అజయ్, రీసెర్చ్ స్కాలర్ ఇంటర్మీడియెట్ పూర్తైంది. కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ సీటు వస్తే ఆ కళాశాలకు వెళ్లాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రావటం లేదు. ఫీజు కడితేనే సీటు ఇస్తామంటూ ఆ యజమాన్యం చెప్పింది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. –వైష్ణవి, విద్యార్థిని మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మెగా స్కామ్కు పాల్పడింది. ఎటువంటి అర్హత లేకపోయినా పరీక్ష రాకపోయినా, టెట్ క్వాలిఫై అవ్వకపోయినా లక్షలాది రూపాయాలకు డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వమే ఈ విధమైన దారుణాలకు పాల్పడితే మా లాంటి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? –హృజని, విద్యార్థి రాష్ట్రంలో విద్యార్థులు యువతకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలేమి అమలు కావడం లేదు. మరోవైపు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడటం లేదు. –ప్రణతి, విద్యార్ధి -
ఆటలకు వెళ్లి.. విగతజీవిగా..
కంచికచర్ల: సరదా.. విషాదంగా మారింది. పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చి తన స్నేహితుడితో ఇళ్ల సమీపంలో ఉన్న కంచిలమ్మ చెరువులోకి ఆటలాడేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఎస్ఐ విశ్వనాఽథ్ తెలిపిన వివరాల ప్రకారం కంచికచర్ల చెరువుకట్ట సమీపంలో నివసిస్తున్న వేముల నరసింహం(8) స్థానిక ఎంపీపీ(సత్రం)పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి. శని వారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆటలాడేందుకు తన తోటి స్నేహితుడితో కలసి సమీపంలో ఉన్న కంచిలమ్మ చెరువులోకి వెళ్లారు. అధికార పార్టీ నేతలు తవ్విన గోతుల్లో పడి.. ఇటీవల చెరువులో అధికారపార్టీ నాయకులు అక్రమంగా తవ్వకాలు జరిపిన గోతులు ఉన్నాయి. వాటిలో వర్షం నీరు చేరింది. వీటి లోతు ఎక్కువగా ఉంది. వాటిలో నరసింహం పడి మృతి చెందారు. నరసింహం వెంట వచ్చిన మరో విద్యార్థి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భయంగా ఇంటికి వెళ్లిపోయాడు. నరసింహం తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాలేదని పలు చోట్ల వెదికారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో తన కుమారుడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆదివారం ఉదయం చెరువుకట్టతో పాటు వారు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఏర్పాటుచేసిన సీపీ కెమెరా పుటేజిలను పరిశీలించారు. ఇద్దరు విద్యార్థులు శనివారం సాయంత్రం సమయంలో చెరువులోకి వెళ్లారని గుర్తించారు. ఆ తర్వాత మరో విద్యార్థి వద్దకు వెళ్లి నరసింహం ఆచూకీ గురించి అడిగారు. కంగారుపడిన ఆ విద్యార్థి.. అతను చెరువులో పడిపోయాడని పోలీసులకు చెప్పాడు. వెంటనే అగ్నిమాపక కేంద్ర సిబ్బందితో పాటు పోలీసులు, కుటుంబసభ్యులు చెరువులోకి వెళ్లి వెతికారు. పెద్ద గోతిలోపడిన నరసింహాన్ని చూసి బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నరసింహం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కంచిలమ్మ చెరువులో పడి ఒక విద్యార్థి మృతి.. మరొకరు సురక్షితం -
ప్రసూతి సేవలకు గ్రహణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చంద్ర బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అందుకు విజయవాడలోని నాలుగు ప్రసూతి కేంద్రాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్లుగా వాటిలో వైద్యులు లేక, ఆ భవనాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. దీంతో నగరంలోని 12లక్షల మంది జనాభాకు ప్రసూతి సేవలకు జీజీహెచ్ పెద్దదిక్కుగా మారింది. అందరూ అక్కడికే వెళ్లడంతో అక్కడ పడకలు చాలక ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు ఉండాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రాజధానికి సమీప నగరమైన విజయవాడలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నివాస ప్రాంతాలకు చేరువలో ప్రసూతి సేవలు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శలు వస్తున్నాయి. శిలావిగ్రహాలే.. ● రాణీగారితోట సిమెంట్ గోడౌన్ ప్రాంతంలో కొన్నేళ్ల కిందట వంగవీటి మోహనరంగా ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది కొంతకాలంగా మూతపడి ఉంది. ● కృష్ణలంకలో యూపీహెచ్సీ పక్కనే ప్రసూతి ఆస్పత్రి ఉంది. అక్కడ ఏఎన్ఎంలు, హెచ్వీ ఇతర సిబ్బంది ఉన్నారు. కానీ వైద్యులు లేక పోవడంతో వాళ్లు ఏమీ చేయలేని దయనీయ స్థితి నెలకొంది. ఎవరైనా గర్భిణులు వస్తే పక్కనే ఉన్న యూపీహెచ్సీకి పంపుతున్నారు. అలాంటప్పుడు ఈ ఆస్పత్రి ఉపయోగం ఏమిటో అధికారులకే తెలియాలి. ● రామరాజ్యనగర్, రాజీవ్నగర్ ఆస్పత్రుల పరి స్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు రాజీవ్ నగర్ ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రద్ధ చూపని అధికారులు.. ప్రసూతి సేవల కోసం గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఖర్చుతో కూడుకోవడంతో అన్ని ప్రాంతాలకు చెందిన వారు జీజీహెచ్లోని ప్రసూతి విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఎక్కువ మంది రావడంతో సేవల్లో కూడా జాప్యం ఏర్పడుతోంది. అదే నగరంలోని ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటే క్లిష్టమైన కేసులను అక్కడకు పంపించవచ్చు. కానీ ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. సిబ్బందికి పనిలేదు.. ఇప్పుడు నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచివాలయ హెల్త్ సెక్రటరీలు అందు బాటులోకి వచ్చారు. హెల్త్ సర్వేలు కూడా వాళ్లే చేస్తున్నారు. దీంతో వీఎంసీ ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది పనిలేక ఖాళీగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సుమారు 12మంది ఏఎన్ఎంలు, నలుగురు హెచ్వీలు, ఒక హెల్త్ ఎడ్యుకేటర్, నలుగురు వాచ్మ్యాన్లు, నలుగురు అటెండర్లు ప్రసూతి ఆస్పత్రుల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వారు వ్యాక్సినేషన్, పల్స్పోలియో వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటున్నారు. ఒకవైపు వైద్య శాఖలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంటే, అక్కడ మాత్రం వారిని ఖాళీగా ఉంచి జీతాలు చెల్లిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నగరంలో నిరుపయో గంగా ఉన్న ప్రసూతి కేంద్రాల్లో వైద్యులను నియమించాలి. ప్రజల నివాస ప్రాంతాలకు చేరువలో ప్రసూతి సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ప్రసూతి కేంద్రాల్లో వసతులు కల్పించి, వైద్యులను నియమించాలి. గర్భిణులకు అవసరమైన స్కానింగ్లను కూడా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. – యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజాకాపునాడు -
న్యాయస్థానాలపై నమ్మకం ఉంది
నందిగామటౌన్: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహనరావు, శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం వారు మరో 12 మందితో కలిసి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు, అరుణకుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అధికార అహంకారంతో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ స్థానాలపై నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులు, అధికార పార్టీ వేధింపులను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. గడిచిన రెండేళ్లుగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రెండేళ్లలో తమపై 14 అక్రమ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గ్రామాల్లో టీడీపీ గూండాలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసుల నమోదులో రాష్ట్రంలోనే నందిగామ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. సామాన్యులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కూటమి నేతలు పోలీసుల సహకారంతో కేసులు నమోదు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు గమనిస్తున్నారని వారే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఈశ్వరప్రగడ రంగారావు, వెలది సాయి శ్రీ హర్ష, మంగళపూడి కోటి, సన్ని, నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ కరీముల్లా, షేక్ యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
తాళాలు పగలకొట్టి బంగారం, నగదు చోరీ
మోపిదేవి: పట్టపగలు ఇంటితాళాలు పగలకొట్టి బంగారం, నగదు దోచుకుపోయిన ఘటన మోపిదేవి కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ ఆర్టీసీ డీపోలో బొర్రా వేణుబాబు డ్రైవర్. గత నెల 28వ తేదీ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి బస్సు డ్రైవర్గా డ్యూటీలో వెళ్లారు. ఆదివారం సుమారు 11 గంటల సమయంలో డ్యూటీ దిగి ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు సమీపంలోని చర్చికి వెళ్లారు. ఆయన ఇంటి లోపలకు వెళ్లేందుకు గడియతీయబోగా పగలగొట్టినట్లు గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేనయులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళం గడియ పగలకొట్టినట్లు గుర్తించి, క్లూస్ టీంకు సమాచారం అందించారు. వారు వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇంటి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు హారం, చెయిన్, చెవిదిద్దులు, మ్యాటీలతో పాటు సుమారు రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌతమ్కుమార్ తెలిపారు. -
అంతకంతకూ ఆలస్యం!
డిగ్రీ అడ్మిషన్లపై ఎడతెగని జాప్యం వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల కాకపోవటంపై విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి అడ్మిషన్ల నోటిఫికేషన్ను విడుదల చేసి కౌన్సెలింగ్ చేపడుతోంది. అయితే ఈ పాటికే విద్యా సంవత్సరం ప్రారంభమై మిడ్ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ నోటిఫికేషనే రాకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు నెలలు గడిచినా నిర్లక్ష్యమే.. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ రెండేళ్ల కోర్సుకు సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలో ఇంటర్బోర్డు పరీక్షలను నిర్వహించింది. ఇంటర్మీడియెట్ ఫలితాలు ఏప్రిల్ మాసంలో వెలువడ్డాయి. ఫలితాలు ప్రకటించి నాలుగు నెలలు గడిచినా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటివరకు డిగ్రీ కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఏటా ఏప్రిల్, మే మాసాలలో ఇంటర్ ఫలితాలు వెలువడితే, మే మాసంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో కళాశాలల తరగతులు ప్రారంభించడం పరిపాటి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్తో ముడి.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏటా ఇంటర్మీడియెట్ ఫలితాల తరువాత, ఏపీఈఏపీ సెట్ నిర్వహించి ఆ తరువాత వచ్చే వాటి ఫలితాలతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. అయితే గడిచిన రెండుమూడేళ్లగా ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తరువాత డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ గురించి ఆలోచన చేస్తోంది. ఆగస్టు వరకూ ఆ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు పూర్తయిన తరువాత డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు వస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తిగా ముగిసిన తరువాత ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుండటంతో డిగ్రీ కళాశాల విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. దెబ్బతింటున్న విద్యా సంవత్సరం.. ఏటా డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేయడం డిసెంబర్ మాసాంతం వరకు కొనసాగించడం వల్ల డిగ్రీ విద్యార్థుల విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. డిసెంబర్ లేదా జనవరి మాసాలలో అడ్మిషన్లు పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తున్నారు. దాని వల్ల మొదటి సెమిస్టర్ పూర్తి చేయడానికి ఏప్రిల్ లేదా మే మాసం వరకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఇంకొక సెమిస్టర్ పెండింగ్ ఉండటం.. అది పూర్తి చేయడానికి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల వరకు సమయం పడుతూ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మే నెలలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించి జూన్ మాసంలో తరగతులు ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవటం దారుణం. కోర్సులు ముగిసినా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇటీవల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఇతర ప్రాంతాల్లో సీట్లు పొందటానికి ఇక్కడి విద్యార్థులకు అవకాశం ఉండటం లేదు. దీనిపై ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి. – సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు పీజీ, తదితర కోర్సులకు సంబంధించి మంచి అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీ కోర్సులతో సెమిస్టర్ పూర్తి కావడానికి జూన్ లేదా జూలై మాసాలు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల కావడం తదితర చర్యలతో ఇతర రాష్ట్రాలు, దేశాలలో ఉన్నత విద్యా కోర్సులు చేయడానికి అడ్మిషన్ల ప్రక్రియ సమయం ముగిసిపోతుంది. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధమైన పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యా మండలి తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు -
లోకేష్ రాజీనామా చేయాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): డీఎస్సీ అక్రమాలతో పాటుగా విద్యాశాఖను పూర్తిగా దిగజార్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి మూడు వేలు తక్షణం మంజూరు చేయాలని కోరుతూ జెన్జీ వార్ పేరుతో వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పాలప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. యువత ఉద్యమించాలి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై యువత ఉద్యమించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారపు వస్తువులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన కె. సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. రూ.2.50లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలందించిన మహానటుడు బళ్లారి రాఘవ కళా వైభవానికి ప్రతీక అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బళ్లారి రాఘవ జయంతి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాఘవ నటించిన అనేక నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండేవని.. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశాలను అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. బళ్లారి రాఘవ ఆశయాలు, కళా వారసత్వం నేటి కళాకారులు, భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. 5న మెగా జాబ్ మేళా గుడివాడ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 5న గుడివాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులోని ముగ్గుబజారు సెంటర్ నందుగల రెడ్సన్ ఫౌండేషన్ నందు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించవలసినదిగా కోరారు. ఇంద్రకీలాద్రిపై సంకట హర చతుర్థి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఆదివారం గణపతికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ, గరికెతో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో గణపతి హోమాన్ని నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శివాలయంలో శాకంబరీ ఉత్సవాలు పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రైప్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. అంత్రాలయం, ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద పండ్లు, ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో శాకంబరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మిద్దె తోటల సంస్కృతి భావితరాలకు నేర్పాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశభవానీపురం(విజయవాడపశ్చిమ): మిద్దైపె కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచుతూ పోషకాహారాన్ని అందిస్తున్న నేటి తరం అభినందనీయులని, ఈ సంస్కృతిని భావి తరాలకు నేర్పాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్(సీటీజీ) విజయవాడ ఐదో వార్షికోత్సవం ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మిద్దె తోటలతో ఆరోగ్యకర హరిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని, అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయన్నారు. అవకాశం ఉన్న ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దైపె తోటలను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువులతో కూరలను పండించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని తెలిపారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి పెంపొందించడంతో ప్రకృతిపట్ల బాధ్యత ఏర్పడటంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్కు బాటలు వేయవచ్చని అన్నారు. వేదికపై వ్యర్థ వస్తువులతో రూపొందించిన ఆకర్షణీయమైన కళాకృతులను చూసిన ఆయన వాటిని తయారుచేసిన హసీనాను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వృద్ధ గార్డెనర్స్, సీటీజీ సభ్యులు బలిజేపల్లి వేణుగోపాలరావు–వరలక్ష్మి, పగడాల సుభాష్బాబు–ముత్యాల ఈశ్వరి, అబ్బూరి వెంకటేశ్వరరావు–విజయలక్ష్మి దంపతులు, యువగార్డెనర్ కె శ్రీనివాస్ తదితరులను సత్కరించారు. అనంతరం కలెక్టర్ను సైతం సీజీజీ అడ్మిన్లు ఆత్మీయంగా సన్మానించారు. -
దివ్యాంగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
చిలకలపూడి(మచిలీపట్నం): దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో జీవించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఏపీడీఏఎస్) ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాకు చెందిన 43 మంది శారీరక దివ్యాంగులకు హోండా 125 సీసీ పెట్రోల్ స్కూటర్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ నారాయణస్వామి, ఏడీ కామరాజు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా డెల్టాకు సాగు నీరు విడుదల చేయాలి
గుడివాడటౌన్: కృష్ణా డెల్టాకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను తెలంగాణలోని అన్ని లిఫ్ట్ స్కీమ్ల నుంచి సాగునీటిని విడుదల చేసి వాడుకుంటుంటే ఏపీలో మాత్రం సాగునీటి విడుదల విషయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఉదయానికే జూరాల నుంచి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందన్నారు. 1.74 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయాలకు వస్తుందన్నారు. శ్రీశైలం జలాశయంలో కూడా 846 అడుగులకు నీరు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. జంక్షన్ సెంటర్లో క్రేన్, ఆర్టీసీ బస్సు ఢీ హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్ ప్రధాన కూడలి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూజివీడు రోడ్డు వైపు నుంచి సెంటర్కు వస్తున్న క్రేన్ను ఏలూరు వెళ్లుతున్న మచిలీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఢీకొట్టడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనటంతో క్రేన్ ప్రధాన కూడలి వద్ద పల్టీ కొట్టింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగినప్పుడు క్రేన్ పక్కనే ఉన్న ఓ ద్విచక్ర వాహనచోదకుడు సమయస్ఫూర్తితో బైక్ వదిలి పరుగులు తీయటంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనతో కూడలిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. జంక్షన్ పోలీసులు బొల్తా కొట్టిన క్రేన్, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును సంఘటాస్థలి నుంచి పక్కకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత గుణదల(విజయవాడ తూర్పు): పేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న ఘటన మాచవరం పీఎస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంజిసర్కిల్ ఫ్లైవర్ దిగువన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ వ్యానుతో సహా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో మాచవరం పోలీసులు అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. వ్యానును తనిఖీ చేసి చూడగా రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. దీంతో సదరు బియ్యం తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పీఎస్కు తరలించారు. 50బస్తాలు ఉన్న వ్యానును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయి అధికారులకు అప్పగించారు. -
శిశువును కొనుగోలు చేసిన దంపతులు అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కొన్నేళ్లుగా సంతాన సాఫల్య చికిత్సలు పొందినా పిల్లలు పుట్టని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు ఢిల్లీలో శిశువును అక్రమంగా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి శిశువును తీసుకుని సొంతూరుకు వెళ్తున్న పరిస్థితిలో ఆదివారం విజయవాడలో పోలీసులకు చిక్కారు. రాజీవ్గాంధీ పార్కు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వద్ద నవజాత శిశువు ఉండటంతో అనుమానం వచ్చి విచారణ చేయగా అక్రమంగా కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఆ దంపతులతో పాటు, వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి మానవ అక్రమ రవాణా, శిశువు కొనుగోలు– అమ్మకం యాక్ట్లపై కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా పోలవరానికి చెందిన కొనతం వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులకు పిల్లలు లేక పోవడంతో అనేక ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు పొందారు. చివరికి ఢిల్లీలో ఉన్న ఓ ఐవీఎఫ్ సెంటర్కు వెళ్లగా అక్కడ ఇక పిల్లలు జన్మించరని నిర్ధారించారు. అదే ఆస్పత్రిలో పనిచేసే అమ్రిన్తో వారికి పరిచయం ఏర్పడింది. డబ్బులకు శిశువును విక్రయించేలా ఆమెతో దంపతులు మాట్లాడుకున్నారు. అమ్రీన్ సూచన మేరకు విడతల వారీగా రూ.6.59 లక్షలు ఆ దంపతులు చెల్లించారు. పాపను తీసుకోవడానికి రావాలని చెప్పడంతో వెంకట కృష్ణరెడ్డి, శివపార్వతి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఒక ఆడ శిశువును వారికి ఇచ్చి, తోడుగా తన భర్త సయ్యద్ ఆలంను పంపించింది. తనిఖీల్లో పట్టుబడింది ఇలా.. వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులు నవజాత శిశువును తీసుకుని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న తరుణంలో రాజీవ్గాంధీ పార్క్ వద్ద మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి తన సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తుండగా చిక్కారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, టాస్క్ఫోర్స్ ఏడీసీపీ కె.లతాకుమారి, సౌత్ ఏసీపీ మానసల సూచన మేరకు వారిని విచారణ చేయగా అక్రమంగా శిశువును కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలని.. బిహార్లోని న్యూకరీమ్గంజ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆలం, అమ్రీన్ ఢిల్లీకి వలస వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఓ ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లలు లేని వారిని కలిసి డబ్బులకు పిల్లలను విక్రయించాలనుకున్నారు. అలా శిశువును విక్రయించి పోలీసులకు చిక్కారు. వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన ఆలం అరెస్టు -
మనసారె అర్పించి..
భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రగిరి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. ఆలయానికి చేరుకునే కుమ్మరి పాలెం, బ్రాహ్మణ వీధి, కెనాల్రోడ్డు, ప్రకాశం బ్యారేజీ ఇలా ఏ రోడ్డు చూసినా అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలే దర్శనమిచ్చాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు కుటుంబ సమేతంగా తరలి రావడం కనిపించింది. 8 గంటలకే క్యూలైన్లు కిటకిట.. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సారె సంబరాలు రాత్రి 9 గంటల వరకు ఏకధాటిన కొనసాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామునే నగరానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో దుర్గాఘాట్ భక్తులతో కిటకిటలాడింది. దుర్గగుడి ఈవో శీనానాయక్ దుర్గాఘాట్, కేశఖండనశాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటలకే భక్తుల వాహనాలతో హెడ్ వాటర్ వర్క్స్, సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం, పది గంటల నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. అన్ని క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. మహామండపం మొదటి అంతస్తుకు క్యూ.. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో అటు ఘాట్రోడ్డులోని క్యూలైన్లు ఓం టర్నింగ్ వరకు కిటకిటలాడాయి. ఇక మహామండపం 7వ అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడం విశేషం. గతంలో భక్తుల క్యూ లైన్ మహా మండపం మొదటి అంతస్తుకు చేరిన సందర్భాలు లేవని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అటు ఘాట్రోడ్డు, ఇటు మహా మండపం మొదటి అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడంతో భక్తులు అమ్మవారి పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడం కనిపించింది. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి పాత మెట్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాత మెట్లపై వచ్చిన వారికి గాలిగోపురం మెట్ల మార్గం ద్వారా స్కానింగ్ పాయింట్కు మళ్లించారు. -
దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఆలయ అధికారులు ఆదివారం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 7న గుంటూరుకు చెందిన ఓ యువతి రాజగోపురం ఎదుట డ్యాన్స్ చేసింది. సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వ్యవహారం ఆలయ అధికారుల దృష్టికి ఆదివారం రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి సోషల్ మీడియాలో ఈ ఒక్క వీడియోనే కాకుండా గతంలోనూ అనేక సార్లు ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం లోపల కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దుర్గగుడిలో వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆలయ భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశం లేదని దేవస్థానం పదే పదే ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సాయికృష్ణ కేసు.. సిట్ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. -
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మహిళ ‘రీల్స్’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళ పోస్ట్ చేసింది. సెల్ఫోన్పై నిషేధం ఉన్నా కొందరు దర్జాగా రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కార్యాలయం ఎదురుగా రీల్స్ చేస్తున్నా గుర్తించకుండా చోద్యం చూస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.గతంలోనూ కొందరు పలుమార్లు అమ్మవారి మూల విరాట్ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాలతో దుర్గగుడి ప్రతిష్ట దెబ్బతింటుంది. మహిళ ఇన్ స్టా రీల్తో ఆలయ భద్రత లోపం మరోసారి బయటపడింది. -
ఐటీఐలో ప్రవేశాలకు అడ్మిషన్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 2026––27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు రెండవ విడత అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 10వ తేదీలోగా ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 0866–2475575 నంబరులో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. నవోదయ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పెంపు హనుమాన్జంక్షన్రూరల్: బాపులపాడు మండలం వేలేరులోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఎన్వీఎస్ టెస్ట్– 2027కు దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ సి.రాజశేఖర్ శనివారం తెలిపారు. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని రాజశేఖర్ చెప్పారు. దరఖాస్తుకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే వేలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. హుండీ కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను ఈనెల 6వ తేదీ గురువారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో జరిగే కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందుపల్లి వద్ద రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గుడివాడ రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం...ఇందుపల్లి గ్రామానికి చెందిన ఉయ్యూరు చంద్రశేఖర్ ప్రసాద్(72) మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వేకువజామున ఇందుపల్లి రైల్వేగేట్ వద్ద ట్రాక్ దాటుతున్న అతనిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం ట్రాక్ పక్కన పడివున్న వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించిన గేట్మెన్ గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ సొత్తు స్వాధీనం వన్టౌన్(విజయవాడపశ్చిమ): వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గత నెలలో జరగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఉన్న ముగ్గురు నిందితులను, చోరీ చేసిన నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్జోన్ ఏసీపీ ఎన్.దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా వన్టౌన్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దుర్గారావు సీఐ గుణరాముతో కలిసి కేసు వివరాలను వివరించారు. వివరాల్లోకి వెళితే పాతబస్తీ తారాపేటలోని శేష్మహాల్ సెంటర్ వద్ద వన్టౌన్కు చెందిన ప్రవీణ్జైన్ పూనం కలెక్షన్స్ పేరుతో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గత నెల 23న తన ఇంటి మరమ్మతుల నిమిత్తం వ్యాపార లావాదేవీల్లో వచ్చిన రూ.22 లక్షల నగదును, 350 గ్రాముల బంగారం, వెండిని దుకాణంలో భద్రపరిచాడు. ఈ సొత్తు, బంగారం దాచి పెట్టిన విషయాన్ని దుకాణంలో పని చేస్తున్న దిలీప్ సింగ్, మింటూసింగ్ గమనించారు. దానిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు పరిచయం ఉన్న చరణ్సింగ్, గణపతి సింగ్తో కలిసి వాటిని అపహరించారు. అనంతరం వారు గుజరాత్, అహ్మదాబాద్కు పరారయ్యారు. చోరీపై ప్రవీణ్జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల బంధువులు, వారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుజరాత్, రాజస్థాన్లలో ఉన్నట్లు గుర్తించారు. వన్టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లి వారు ముగ్గురిని విజయవాడకు తీసుకొచ్చారు. వారిలో ఇద్దరు చోరీలో పాల్గొనగా, మిగిలిన ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. గణపతిసింగ్, ఇంద్రసింగ్ వాగెల, దిలీప్సింగ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.14.35 లక్షల నగదు, 302 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు. కేసును ఛేదించటంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. -
వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.1.15 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పరిరక్షణ ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన భక్తులు శని వారం రూ.1.15 లక్షల విరాళం సమర్పించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన పలగుమ్మి అఖిల్ విశ్వేస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి వేద పరిరక్షణ కోసం విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈఓ కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. శ్రావణ్బాబు మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలు నిర్దేశిత లక్ష్యాల ప్రగతి సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల అమలు, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నవీన్, డీఐఓ డాక్టర్ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి (మచిలీ పట్నం): రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహిం చనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని న్యాయ స్థానాల పరిధిలో ఈ జాతీయ లోక్అదాలత్ జరుగుతుందని పేర్కొన్నారు. సివిల్, ఎకై ్సజ్ కేసులు తదితర రకాల కేసులు పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తమ న్యాయవాదులతో లోక్అదాలత్కు సిఫార్సు చేయించుకోవాని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు విస్తృత అవకాశాలు ఇబ్రహీంపట్నం: పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రొసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక సాధికారతకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా–రైజ్, నేటివ్ టేబుల్, ఫిక్కీ, ఎఫ్ఎల్ఓ విజయ వాడ సంస్థల భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం స్వయం సహాయ సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా పండించే ధాన్యాలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయాలు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధ్దిగా అందించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతాయని పేర్కొన్నారు. సమృదిగా విటమిన్ డీ, బీ 12తో మరింత పోషకాల గనిగా గుడ్లను మార్చేందుకు నేటివ్ టేబుల్ కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్కు అందించడం ద్వారా మహిళలు విజయవంతమై పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచార రావు, సుమబిందు అట్లూరి (ప్రమాణ్ ఫౌల్టిస్), నేటివ్ టేబుల్ మేనేజింగ్ పార్టనర్ చరిత మూల్పూరి పాల్గొన్నారు. -
విజయవాడ, గుంటూరు డివిజన్లలో జీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్లలోని కీలక రైల్వేస్టేష న్లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. స్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ డీఆర్ఎంతో కలసి రాయనపాడు ఆర్ఓబీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. గంగినేని స్టేషన్ను తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎర్రుపాలెం స్టేషన్లో యార్డు ప్రణాళిక, ప్రతిపాదిత నంబూరు కొత్త లైన్ల పనులను అధికారులతో సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాక్, స్టేషన్ అలైన్మెంట్ను పరిశీలించారు. అనంతరం మధిర స్టేషన్ను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని అంచనా వేసి పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. జీఎంను కలిసిన ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ విజయవాడ డివిజన్ పర్యటన సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ కమిటీ నేతలు శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షుడు బి.వినా యక్ డివిజన్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రం సమర్పించారు. జీఎం సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు నాయక్ తెలిపారు. జీఎంను కలసినవారిలో అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ గుజ్జల కృష్ణ, బాలకృష్ణ బైర్వా, నావల్ కిషోర్మీనా, జి.యోహను, వి.వి.రత్నం, ఇందర్సింగ్ మీనా, పలు విభాగాల బ్రాంచ్ నాయకులు ఉన్నారు. -
ఉపనిషత్తులు జ్ఞాన సంపదకు ప్రతీకలు
పద్మశ్రీ డాక్టర్ శోభారాజువన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపనిషత్తులు జ్ఞాననిలయాలని ప్రముఖ గాయని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ కోదాటి వియ్యన్నరావు రచించిన ‘ఉపనిషత్ ఉద్యానవనమ్’ గ్రంథావిష్కరణ సభ శనివారం కేబీఎన్ కళాశాలలో శనివారం జరి గింది. ముఖ్య అతిథి డాక్టర్ శోభారాజు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం వంటి మహోన్నత విలువలను యువతలో పెంపొందించే అపూర్వ శక్తి ఉపనిషత్తులకు ఉందన్నారు.ఆధునిక యువత సులభంగా గ్రహించే శైలిలో ఉపనిషత్తుల సారాన్ని అందించిన డాక్టర్ వియ్యన్నరావు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ చేశారని ప్రశంసించారు. హిందూ హైస్కూల్స్ పరిపాలనాధి కారి డాక్టర్ వి. నారాయణరావు మాట్లాడుతూ.. ఉపనిషత్తులు జాతి, మత, కుల, ప్రాంత పరిమితులను అధిగమించి విశ్వమానవ, సర్వజన హితాన్ని ప్రతిపాదించే మహోన్నత గ్రంథాలుగా పేర్కొన్నారు. కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో పెరుగుతున్న నిరాశ, భయం, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అధిగమించేందుకు ఉపనిషత్తులు అందించే సానుకూల జీవన దృక్పథం అత్యంత అవసరమన్నారు. గ్రంథ రచయిత డాక్టర్ కోదాటి వియ్యన్నరావు మాట్లాడుతూ.. యువతలో భారతీయ తాత్విక సంపదపై అవగాహన పెంపొందించి, నైతిక విలువల పునరుద్ధరణ లక్ష్యంతోనే ’ఉపనిషత్ ఉద్యానవనమ్’ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్ పి.ఎల్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మావిగన్తో చంద్రబాబుకు షాక్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మావిగన్తో ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ తగిలిందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అందుకే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు అని కొత్తపాట అందుకున్నారని ఎద్దేవాచేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. తమకు దూరంగా ఉన్న ప్రాంతం కాకుండా తాము నివసించే ప్రాంతంలో రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్పోర్టు గురించి ఏనాడూ మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు ఆ రెండూ రాజధానిలో భాగం అంటున్నాడని పేర్కొన్నారు. అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, భూమి ధరలు పెరిగితే విక్రయించి అప్పులు తీరుస్తా మని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే అమరావతి పేరులో రూ.47 వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ అప్పునకు సంబంధించి తొలి ఇన్స్టాల్మెంట్గా రూ.200 కోట్లు చెల్లించారని వివరించారు. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలపై పడుతోందని అవినాష్ ఆందోళన వ్యక్తంచేశారు. అమరావతిలో పేదలు ఉండకూడదా? పేదలు అమరావతిలో ఉండకూడదని చంద్ర బాబు చెబుతున్నారని అవినాష్ విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో 51 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, 1,400 ఎకరాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన గొప్ప నాయకు డని పేర్కొన్నారు. అక్కడ బడుగు, బలహీన వర్గాలు ఉండకూడదని ఆ ఇళ్ల స్థలాలను చంద్రబాబు రద్దు చేశాడని గుర్త్తుచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులు, తన బినామీలు ఉండేలా చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో అమరావతిలో ఒక్కరికీ ఆమోదం లభించలేదన్నారు. అమరా వతి అందరిదీ అయితే ఎందుకు ప్రతిపాదన పంప లేదని ప్రశ్నించారు. మహిళలకు చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రతి రాయిపై జగన్ పేరు భోగాపురం ఎయిర్పోర్టులో ప్రతి రాయిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉంటుందని దేవినేని అవినాష్ అన్నారు. ఆ ఎయిర్ పోర్టు పనులు మొదలు పెట్టిందే వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో మావిగన్ ప్రతిపాదన చేశారన్నారు. 2029లో ఈ ప్రతిపాదనకు ప్రజలు మద్దతు ఇస్తారని, గుంటూరు, విజయవాడ ప్రాంత ప్రజలు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. పాలన ఏ విధంగా చేయాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. -
సౌత్కోస్ట్ రైల్వే జీఎంను కలసిన ఎంపీ కేశినేని శివనాథ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా ఎనిమిది ఆర్ఓబీల నిర్మాణాలపై దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యుర్ను కలసి పలు రైల్వే ప్రాజెక్ట్లపై చర్చించినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ డివిజన్లో శనివారం పర్యటించిన జీఎంను కలసిన ఆయన పలు రైల్వే ప్రాజెక్ట్లకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎనిమిది రైల్వే ఆర్ఓబీల నిర్మాణాలపై జీఎంతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలను కలిపే ఎర్రకట్ట వంతెన, గుణదల ఎల్సీ గేటు నంబర్ 8 వద్ద ఆర్వోబీ నిర్మాణం ఎంతో అత్యవసరమని జీఎంకు స్పష్టం చేసినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు ప్రాజెక్ట్ వేగవంతం అయ్యేలా కేంద్ర రైల్వే శాఖతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్రంలోని ఎంపీలందరం కలసి కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. విజయవాడ–బెంగళూరు మధ్య కొత్త రైలు ఏర్పాటు చేస్తే రాజధానికి వచ్చే విద్యార్థులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లపై జీఎంకు వినతిపత్రం -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా...
చిలుకూరు: బైక్పై దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామ పరిధిలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాలు...సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గడ్డం లోకేష్ (19) ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటకు చెందిన చల్లా అనిల్(20) దగ్గర బంధువులు. గడ్డం లోకేష్ షేర్మహ్మద్పేటలో అనిల్ ఇంట్లో ఉంటూ వైద్యశాలలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం వారిద్దరూ షేర్మహ్మద్పేట నుంచి బైక్పై సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనమైన తర్వాత తిరిగి షేర్మహ్మద్పేటకు వెళ్తుండగా...చిలుకూరు గ్రామ పరిధిలోని లారీ అసోసియేషన్ వద్దకు రాగానే వారి బైక్ వెనుక టైరుకు ఇనుప సీల గుచ్చుకుంది. దీంతో టైరు పంక్చర్ అయినట్లు గుర్తించి సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు గడ్డం లోకేష్ తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి ఇద్దరు యువకులు దుర్మరణం -
దుర్గమ్మ సేవలో ఆస్ట్రేలియా సహాయ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దివ్య మంగళ రూపాన్ని చూసిన జూలియన్ హిల్ దంపతులు తన్మయత్వం చెందారు. ఆలయంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న సారె గురించి అడిగి మరీ తెలుసుకు న్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలు వైన దుర్గమ్మను ఆస్ట్రేలియా పౌరసత్వ, కస్టమ్స్, బహుళ సంస్కృతుల వ్యవహారాలు, అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ దంపతులు, బృంద సభ్యులు శనివారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన జూలియన్ హిల్ దంపతులను ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాశస్త్యాన్ని, మహిమలను, ఆలయంలో జరుగుతన్న ఆషాఢ సారె ఉత్సవ విశేషాలను ఆలయ వేద పండితులు వివరించారు. అనంతరం జూలియన్ హిల్ దంపతులకు ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి అంతర్జాతీయ ప్రతినిధులు విచ్చేయడంతో ఆలయ అధికారులతో పాటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎల్.డి.ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అర్చకుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, డీఈఓ కిషోర్కుమార్, ఏఈఓ ఎన్.రమేష్బాబు పాల్గొన్నారు. -
బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి
లబ్బీపేట(విజయవాడతూర్పు): బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు తెలిపారు. పాత ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్బాబు మాట్లాడుతూ ఉద్యోగం చేసే మహిళలు సైతం బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. పుట్టిన గంటలోపు ఇచ్చే ముర్రుపాలు శిశువులో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనిల్కుమార్, డీఐఓ డాక్టర్ శరత్బాబు, డెప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ ఝాన్సీ, పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు -
అంబరాన్ని తాకుతున్న సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ సారె సంబరాలు కొనసాగుతున్నాయి. శనివారం కూడా భక్త బృందాలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో కొండ దిగువన కనకదుర్గనగర్లో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసే భక్తులు తొలుత కనకదుర్గనగర్లోని బలిపీఠం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం మహామండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని మూలవిరాట్ను దర్శించుకుని సారెను సమర్పిస్తున్నారు. భక్త బృందాలకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద సారె సమర్పణ, ఆశీర్వచన కార్యక్రమాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. సారె సమర్పించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో సేద తీరి పసుపు, కుంకుమ, గాజులతో పాటు ఇతర పూజా సామగ్రి, మిఠాయిలను వాయినాలుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. నేడు ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలు రద్దు ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలనే భావనతో వీఐపీ దర్శనాలను, అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొండపైకి ఎటువంటి కార్లు, ఇతర వాహనాలను అనుమతించలేది లేదని, కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం కొండ దిగువ నుంచి బస్సులను నడుపుతుందన్నారు. -
ఉద్దండుల స్థానంలో నేనుండటం అదృష్టం
చిలకలపూడి(మచిలీపట్నం): ఎంతో మంది ఉద్దండులు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన ఈ స్థానంలో తాను భాగస్వామిని కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. రూ.98 లక్షలతో ఆధునీకరించిన జెడ్పీ సమావేశ మందిరాన్ని శనివారం ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ప్రారంభించారు. అనంతరం హారిక మాట్లాడుతూ 1962లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి తిరిగి పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆధునీకరించినట్లు చెప్పారు. 25 మండలాలతో కృష్ణాజిల్లా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో పరిపాలనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశ మందిరాన్ని మంచి సౌకర్యాలతో రూపొందించామన్నారు. జిల్లా నుంచి దేశానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల చిత్రపటాలను సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి ఈ సమావేశ మందిరానికి ప్రత్యేకతను తీసుకొచ్చామన్నారు. దీంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదిని, చిన్నారుల సంరక్షణ కోసం చైల్డ్ కేర్ సెంటరును రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించుకున్నామన్నారు. వీటితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ చాంబర్, సీఈవో చాంబర్ను కూడా ఆధునీకరించి ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. తొలుత సమావేశ మందిరానికి సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నూజివీడు సబ్కలెక్టర్ గొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, జెడ్పీ వైస్చైర్పర్సన్లు గరికిపాటి శ్రీదేవి, గదిమళ్ల కృష్ణంరాజు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
వారసత్వ సంపదను అందిపుచ్చుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతి, ఆలయ వాస్తు శిల్ప సంపద, ఆధ్యా త్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు యువత కీలక పాత్ర పోషించాలని పలువురు వక్తలు సూచించారు. ఏఈ ఫౌండేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ), విశ్వబంధు ట్రస్ట్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం విజయవాడ లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)లో సప్త సింధు–2026 పేరుతో పోటీలను శనివారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు, అధ్యాపకులు, వాస్తుశిల్పులు, కళాకారులు, పరిశోధకులు, సాంస్కృతిక రంగ నిపుణులు పోటీల్లో పాల్గొన్నారు. ఆలోచనల మేధోమథనం, సృజనాత్మకత, వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే యలమంచిలి సుజనాచౌదరి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ప్రముఖ స్థపతి, యాదాద్రి ఆలయ సలహాదారు డాక్టర్ ఎస్.సుందరరాజన్, శ్రీరామానుజ సహస్రాబ్ది స్టాట్యూ ఆఫ్ ఈక్వాల్టీ ముఖ్య స్థపతి డి.ఎన్.వి.ప్రసాద్ స్థపతి, ఏఈ ఫౌండేషన్ డైరెక్టర్ సంగీత మిశ్రా, ఎస్పీఏ (విజయవాడ) డైరెక్టర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ, విశ్వబంధు ట్రస్ట్ ఫౌండర్ యమునా పాఠక్, ఐజీఎన్సీఏ రీజనల్ సెంటర్ – తిరుపతి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.టి.వి.రాఘవన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. అనాదిగా భారతీయ సంస్కృతిలో భాగమైన ఆలయ శిల్ప కళా వైభవాన్ని కాపాడుకోవటం అవసరమన్నారు. ఆ బాధ్యతలను నేటి యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టెంపుల్ డిజైన్, మురల్ ఆర్ట్, పల్లకీ మేకింగ్, రంగోళి, టెంపుల్ ఆర్చ్ డిజైన్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహించారు. ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ సప్తసింధు – 2026లో భాగంగా విద్యార్థులు, యువత తయారు చేసిన వివిధ ఆలయ నమూనాలు, ప్రదర్శనాంశాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం సాయంత్రం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువ వాస్తుశిల్పులు, అధ్యాపకులు, కళాకారులు, పరిశోధకులు పరస్పర అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆలోచనలు, సృజనాత్మక దృక్పథాలు వెలుగులోకి వస్తాయన్నారు. వాస్తుశిల్పం, వారసత్వ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో యువత సృజనాత్మకత దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. -
భద్రాచలం: స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోదావరి
సాక్షి, విజయవాడ: భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. రేపు రాత్రి నుంచి ధవళేశ్వరం వద్ద వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54.3 అడుగుల నీటి మట్టం ఉంది.కూనవరం 21.40 మీటర్లు, పోలవరం 13.19 మీటర్ల కాగా, ధవళేశ్వరం బ్యారేజి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్వేలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల నుండి 1,80,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ఇన్ ఫ్లో 1,80,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో.. నిల్. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 842.30 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 65.3203 టీఎంసీలు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. -
‘పార్లమెంట్ సాక్షిగా కూటమి కుట్రలు బహిర్గతం’
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా వెన్నుపోటు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కనీసం ఒక్క ఇంటి స్థలం కూడా కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయని విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 51 వేల మంది పేద మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయిస్తే, వెన్నుపోటు కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్వంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని దేవినేని అవినాశ్ ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఇచ్చిన 51 వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారుకేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ద్వారా ఈ కూటమి ప్రభుత్వ నైజం బయటపడింది. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY - అర్బన్ 2.0)' కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ, అమరావతి ప్రాంతంలో నివసించే పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లు లేదా స్థలం ప్రతిపాదన కూడా పంపలేదు. జూన్ 2026 నాటికి 107 పట్టణాల్లో 12 వేల ఇళ్లకు ఆమోదం లభిస్తే, అమరావతిలో ఒక్క పేద కుటుంబానికి కూడా ఇల్లు కేటాయించకపోవడం దారుణం.అమరావతి అందరిదీ, ప్రపంచ రాజధాని అని గొప్పలు చెప్పే చంద్రబాబు.. అక్కడ పేదవాళ్లు నివసించడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? గతంలో వైఎస్ జగన్ హయాంలో సీఆర్డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. 51 వేల మంది మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయించాం. కానీ మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బినామీల కోసమే తపన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు.. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, తన సొంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు-తెనాలి) అర్బన్ కారిడార్ అభివృద్ధిపై వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతిపాదనతో షాక్కు గురైన చంద్రబాబు, చివరకు అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదని, విజయవాడ-గుంటూరు కూడా అమరావతిలో భాగమేనంటూ ఒప్పుకోక తప్పలేదు. అమరావతి కోసం తెచ్చిన రూ.47 వేల కోట్ల అప్పులకు, అసలు-వడ్డీలు కట్టడానికి ప్రజల ఖజానా సొమ్మునే వాడుతూ, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ప్రజలను మోసం చేస్తున్నారు.చంద్రబాబు, మీరందరూ వైఎస్ జగన్ పాలనా అనుభవాన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన ప్రతిపాదించి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్టులో ప్రతి ఇటుకపైనా వైఎస్ జగన్ పేరే ఉంటుంది. అమరావతిలో ఇళ్లు రద్దు చేసిన ఆ 50 వేల మంది మహిళలకు, పేదలకు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని దేవినేని అవినాశ్ హెచ్చరించారు. -
స్కీం వర్కర్లకు కనీస వేతనాలివ్వండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతోందని, ప్రభుత్వ స్కీం లలో పని చేస్తున్న వారంతా మహిళలేనని, వారికి మాత్రం కనీసం వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కీమ్ల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే స్కీం వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిం దని, ఒక్క మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చించలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రవేశాన్ని విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ, ఆశ, వీఓఏ, ఆర్పీ, మధ్యాహ్న భోజన పఽథకం, ఉపాధి హామీ పథకం వంటి వాటిల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు రూ. 26వేలు కనీసం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లకు కనీసం వేతనాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ. కమల మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఆశ వర్కర్ల పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీలకు 5 నెలల నుంచి వేతన బకాయిలు పెట్టడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్.సిహెచ్.సుప్రజ మాట్లాడుతూ మెనూ చార్జీలను పెంచాల్సింది పోయి స్మార్ట్ కిచెన్ల పేరుతో ఉన్న పనిని లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహంకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్కుమార్, గజలక్ష్మి, పి.జ్యోతి, ఎ.సుశీల, ఎ.ఉమాదేవి, కె. సుస్మిత, సైదమ్మ, ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరావు, డి.వి.కృష్ణ, డి. కాశీనాధ్, పిల్లి నరసింహారావు, కె.గోపాల్, ిసీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ -
ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ’ వైభవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాధారణ భక్తులతో పాటు సారె సమర్పణకు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ట్రాక్టర్లు, ఆటోలపై ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ ఎదుట పార్కింగ్తో పాటు హెడ్ వాటర్ వర్క్స్ పరిసరాలు రదీగ్దా కనిపించాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపుగా కనకదుర్గనగర్కు చేరుకున్నారు. అక్కడ బలిపీఠం వద్ద అమ్మవారికి నమస్కరించి మహామండపం మీదగా కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీతో మహా మండపం నాలుగో అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. మరో వైపున ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులతో క్యూ దేవస్థాన సమాచార కేంద్రం వరకు చేరింది. రద్దీ పెరగడంతో అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. శుక్రవారం అయినా మహా నివేదన ముందు వరకు భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. మధ్యాహ్న సమయానికి మహా మండపం లిప్టు, మెట్ల మార్గాల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేక భక్తులు పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మరో వైపున సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ మరింత పెరిగింది. క్యూలో భక్తుల సందడిఏడో అంతస్తులో భక్త బృందాల తాకిడి -
ముసాయిదా జాబితా విడుదల
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,71,648 మంది, మహిళా ఓటర్లు 8,17,936 మంది, థర్డ్ జెండర్ 147 ఉన్నాయి. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. సీ్త్ర, పురుష నిష్పత్తి 1060 కాగా, ప్రతి వెయ్యి మంది జనాభాకు 650 మంది ఓటర్లుగా ఉన్నారు. జిల్లాలో 13,755 మంది పీడబ్ల్యూడీ, సర్వీస్ ఓటర్లుగా, 367 మంది సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. క్లయిమ్స్, అభ్యంతరాలకు గడువు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైతే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు విధించారు. నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. సవరణల ప్రక్రియలో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన,విచారణ,పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. సర్లో అవసరమైన వివరాలు సమర్పించని వారు లేదా సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తారు. వాటికి నిర్ణీత గడువులోపు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటంది. తగ్గిన ఓట్లు 2026 మే ఓటర్ల జాబితాతో పోలిస్తే 1,23,714 ఓట్లు తగ్గిపోయాయి. మరణాలు, శాశ్వత వలసలు, డబుల్ ఎంట్రీలు తొలగించగా జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లకు 15,89, 731 ఓట్లు తేలాయి. ఏడు నియోజకవర్గాల్లో 13 వేల నుంచి 21వేల వరకు ఓట్లు తగ్గాయి. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాలో 15.89 లక్షల మంది ఓటర్లు పురుషులు 7,71,648 మంది సీ్త్రలు 8,17,936 మంది నేటి నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా -
పదవీ విరమణ సన్మానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం, సహాయం అందించే అధికారం, సమాజాన్ని చదివే, ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుత అవకాశం ఒక్క పోలీస్ శాఖలోనే లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన పలువురు అధికారులు, సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో నిరంతర ఆందోళన, భయాలు అనేక సవాళ్లు ఉంటాయని, ఎన్ని ఉన్నా, ఒక మంచి పని చేసి బాధితుడికి న్యాయం చేసినప్పుడు వచ్చే ఆత్మ సంతృప్తి మరెక్కడా లభించదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన టెక్నికల్ వింగ్ డీసీపీ ఏవీఆర్పీబీ ప్రసాద్, సీసీఎస్ అడిషనల్ డీసీపీ రాజారావు, సీపీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పి.సునీత, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ సువర్ణరాజు, ఎస్ఐ జి. లాచిరాం, ఆర్ఎస్ఐ వి.వీరరాజు, ఏఎస్ఐలు రామకృష్ణ, జె.మన్మథరావు, రిజర్వ్ హెచ్సీ టి.వీరరావు, హోంగార్డు పి భాస్కరరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, సీఎస్ డబ్ల్యూ డీసీపీ బి.సత్యనారాయణ, ఏఆర్ ఏసీపీ ప్రేమకుమార్, ఆర్ఐలు శ్రీనివాసరావు, సుధాకరరెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మధురై మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాన్పూర్ సెంట్రల్–మధురై (01925) ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం ఉదయం 8.10 గంటలకు కాన్పూర్ సెంట్రల్లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (01926) ఆగస్టు 8, 15, 22, 29 తేదీల్లో ప్రతి శనివారం మధ్యరాత్రి 2.30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 4.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో రైళ్లు నాగ్పూర్, చంద్రాపూర్, బల్హార్ష, కాగజ్నగర్, రామగుండం, వరంగల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పట్టాయ్, సెలాం స్టేషన్లలో ఆగుతుంది. జిల్లాలో 14 రైతుబజార్లు, 30 రైస్ మిల్లుల్లో కౌంటర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో రైతుబజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల కార్యాలయ డి.ఎస్.ఒ, ఏఎస్ఓలు, డీటీలు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెలతో పోలిస్తే ప్రస్తుతం బియ్యం బీపీటీ, సోనా మసూరి రకాలు క్వింటాల్ రూ. వెయ్యి నుంచి రూ.1400కు చేరిందన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 14 రైతు బజార్లలో, 30 రైస్ మిల్స్లో కౌంటర్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వీటి ద్వారా స్టీమ్ రైస్ కిలో రూ. 52, రా రైస్ రూ. 50కే విక్రయిస్తారన్నారు. ఈ కౌంటర్లకు బియ్యం ఏఏ మిల్లుల నుంచి సరఫరా చేయాలి? రైస్ మిల్లర్స్ ఎక్కడెక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించారు. బియ్యం కొనుగోలు చేసేందుకు కౌంటర్లకు వెళ్లే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు. -
వేతన వేదన
కూటమి పాలనలో కార్మికుల ఆకలి కేకలు జీజీహెచ్లో శానిటేషన్, సెక్యూరిటీ వంటి బిల్లులు ఎనిమిది నెలలుగా పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కుతున్న పారిశుద్ధ్య కార్మికులు చంద్రబాబు సర్కార్ తీరుపై కార్మిక సంఘ నేతల ఆగ్రహం – పుప్పాల కృష్ణ, సీఐటీయూ నేత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ సీసీఎల్ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి శుక్రవారం దర్శించుకున్నారు.జీజీహెచ్లో ప్రతి ఉదయం వార్డులను శుభ్రం చేస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించే చేతులే.. ఇంటికి వెళ్లాక తమ పిల్లలకు ఒక్క పూట భోజనం ఎలా పెట్టాలా అని ఆవేదన చెందుతున్నాయి. నెలలు గడుస్తున్నా జీతాలు అందక అద్దె చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వందలాది కార్మికుల జీవితం దయనీయంగా మారింది. ఆస్పత్రి సేవలు ఆగకుండా కష్టపడుతున్న వారికి మాత్రం జీతాలు అందడం లేదు. ఎనిమిది నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టు సంస్థలు కూడా చేతులెత్తేయగా, చివరకు తమ కష్టానికి ప్రతిఫలం అడగడానికి కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
విజయవాడ డివిజన్లో ఈ–పాస్ రిజిస్ట్రేషన్ శిబిరం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్, పర్సనల్ బ్రాంచ్ ఆధ్వర్యాన రైల్వే ఆడిటోరియంలో శుక్రవారం పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల కోసం ఈ–పాస్ రిజిస్ట్రేషన్ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు డిజిటల్ ఈ–పాస్ వ్యవస్థపై అధికారులు అవగాహన కల్పించారు. వారికి అర్హత ఉన్న పాస్ సౌకర్యాలు పొందేందుకు హెచ్ఆర్ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్లో నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించి వయోవృద్ధులు సులభంగా డిజిటల్ రైల్వే పాస్ విధానంలోకి మారేందుకు సహాయపడ్డారు. ఈ–పాస్ వ్యవస్థ ప్రాముఖ్యత, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ దశలను వివరిస్తూ అధికారులు పీపీటీ ద్వారా వివరించారు. సీనియర్ డీపీఓ ప్రేమ్కుమార్ లకావత్ మాట్లాడుతూ మొత్తం 299 మంది పెన్షనర్లు హాజరవ్వగా వారి ఖాతా యాక్టివేషన్ పత్రాల ధ్రువీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి 105 రిజిస్ట్రేషన్లు అక్కడికక్కడే విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. -
డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో నిర్వహించిన డీఎస్సీ 2025 అక్రమాల పుట్టగా మారిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో లక్ష్మీనరసింహంకు నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు నేతలు మీడియాతో మాట్లాడారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాను గంటి చైతన్య మాట్లాడుతూ పేకాట, టగ్ ఆఫ్ వార్ ఆడిన వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నంబర్ 77 ప్రకారం డీఎస్సీ పరీక్ష రాయాలి.. కానీ జీవోను మార్చి డీఎస్సీతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, లోకేష్ తోడల్లుడు భరత్రామ్ క్రీడా అసోసియేషన్ల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. జరిగిన అవినీతిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో నిరూపించారన్నారు. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. యువతకిచ్చిన హామీలు ఏమయ్యాయి ● పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని, కమీషన్ల కోసం కక్కుర్తిపడి భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలోని యువత తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నారన్నారు. లోకేష్ రాజీనామా చేయాలని యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోందన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో టౌన్ హాలు సమావేశాలు, 6 నుంచి 9వరకు రిలే దీక్షలు, 10న ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. కూటమి నేతలకు పరిపాలన చేతకాకపోతే వైఎస్ జగన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ● మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అంతా పారదర్శకంగా జరిగిందని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ● మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ డీఎస్సీని మెగా స్కామ్గా మార్చేశారన్నారు. జెన్ జీ తలచుకుంటే ఈ ప్రభుత్వం మెడలు వంచుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్కు ఉద్యమించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి జెన్ జీకి పిలుపునిచ్చారన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ డీఎస్సీ మొత్తం స్కామ్లతో నిండిపోయిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో వారికి కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు ఆదేశించాలన్నారు. ● తిరువూరు సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల చెల్లారావు, గౌస్ మొహిద్దీన్, కర్నాటి రాంబాబు, వేములకొండ తిరుపతిరావు, విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల సాయి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ మంత్రి పదవి నుంచి వైదొలగాలి డీఎస్సీలో అంతులేని అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలి కలెక్టరేట్లో డీఆర్వోకు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు -
కోలాహలం.. సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు, భక్తబృందాల సభ్యులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ ఏడాది సారె సంబరానికి బంధువులు, చుట్టాలను సారె సంబరానికి ఆహ్వా నించడంతో భక్తుల ఇంట పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్రామదేవతలకు ఏడాదికి ఒక సారి ఊరు పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అదే రీతిలో ఈ ఏడాది ఆషాఢ సారె ఉత్సవాన్ని ఊరి పండుగలా భక్తులు జరుపుకోవడం విశేషం. ఉత్తరాంధ్ర నుంచి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో కళకళలాడుతూ కనిపించింది. ఉచితంగా రూ.100 క్యూలోకి.. గురువారం సాయంత్రం వరకు 39 భక్త బృందాలతో పాటు మొత్తం 17 వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. మహామండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్రోడ్డులో కొండపైకి విచ్చేసిన సారె బృందాలకు రూ.100 టికెట్ క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు మహామండపం ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తిని దర్శించుకుని సారె సమర్పిస్తున్నారు. అక్కడే ఉన్న చీరల కౌంటర్లో అమ్మవారికి చీర సమర్పించిన అనంతరం భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమ్మవారికి సమ ర్పించిన పసుపు, కుంకుమ, గాజులు, మిఠాయిలను తాంబూలంగా ఇచ్చి పుచ్చుకున్నారు. బాలాజీ కోలాట బృందం ఆధ్వర్యంలో... భవానీపురంలోని టెలిఫోన్ కాలనీ, బాలాజీ టవ ర్స్కు చెందిన శ్రీ బాలాజీ కోలాట భక్త బృందం సభ్యులు గురువారం అమ్మవారికి సారెను సమ ర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి నామస్మరణతో, భక్తి కీర్తనలతో కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కేఎల్రావు పార్కు లోని అబ్దుల్ కలామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. కేఎల్రావు నగర్ నుంచి సారెతో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఊరేగింపుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
దుర్గగుడికి రూ.2.50 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనులు, ఉచిత ప్రసాద వితరణకు భీమవరానికి చెందిన భక్తులు గురువారం రూ.2.50 లక్షల విరాళం సమర్పించారు. భీమవరం ఏఎస్ఆర్నగర్కు చెందిన వెంకట దుర్గాశిరీష కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2.50 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వ లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్య, పరిశోధనలను ఈ–రీసోర్సులు మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పులాల చంద్ర శేఖర్ అన్నారు. వర్సిటీ పరిధిలోని ఎన్టీఆర్ మెడ్ నెట్ కన్సార్టియం– డిజిటల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థల సహకారంతో గురువారం ఈ–రీసోర్సులపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమాన్ని వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వీసీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆధునిక వైద్య విద్య, పరిశోధన, సాక్ష్యాధార ఆధారిత వైద్య సేవలకు నాణ్యమైన ఈ–రీసోర్సులు ఎంతో కీలకమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెడ్నెట్ ఈ–రీసోర్సులను సమర్థంగా వినియోగించిన కళాశాలలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.లక్ష్మీసూర్యప్రభ, సీఓఈ శ్రీకాంత్, కన్సార్టియం కోఆర్డినేటర్ డాక్టర్ కె.సుధ పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈ ఏపీసెట్ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ నెల 26వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనను చేపట్టారు. సాధారణ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆన్లైన్లోనే పూర్తి చేశారు. స్పెషల్ కేటగిరికి చెందిన సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్, ఎన్సీసీ, దివ్యాంగ విద్యార్థులు ఈ హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా హాజరై సర్టిపికెట్ల పరిశీలన చేయించుకున్నారు. ఎన్సీసీ 179, దివ్యాంగ 143, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 71 మంది చొప్పున మొత్తం 393 మంది సర్టిఫికెట్లను గురువారం పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తాగునీటికే తొలి ప్రాధాన్యమని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహా మండలి చైర్మన్, డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన ఐదో సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక కృష్ణా నదిపై ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జలాశయాలకు వచ్చే నీటిని తొలి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నదిలోనూ నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పట్టిసీమలోని 24 పంపులను పూర్తిస్థాయిలో వినియోగించే పరిస్థితి లేదన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వేసిన ప్రతి పంటకూ బీమా చేయాల్సిందే’ పోస్టర్ను జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ జి.గుణకరరావు, కేఈ డివిజన్ ఈఈ బి.ఆంజనేయప్రసాద్, కేసీ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, స్పెషల్ డివిజన్ ఈఈ కె.బాబు తదితరులు పాల్గొన్నారు. -
నవభారత నిర్మాణంలో యువత కంకణబద్ధులు కావాలి
ఆత్కూరు (గన్నవరం): నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను, దేశభక్తి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో గురువారం మన్నె శ్రీనివాసరావు రచించిన ‘కర్మవీరులారా కదలి రండి’ దేశభక్తి ప్రబోధాత్మక గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న యువతతో ముఖాముఖాలో ప్రసంగించారు. నైపుణ్యం కలిగిన యువత మాత్రమే నవభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని చెప్పారు. ముఖ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక ప్రగతికి అనుగుణంగా యువత నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడం తప్పనిసరిగా పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన నైపుణ్యాలే కాకుండా జీవితంలో క్రమశిక్షణ, మానవీయ విలువలు చాలా ముఖ్యమన్నారు. -
పొలం ఎండి..
కంచికచర్ల/కోడూరు: సాగు కాలం పూర్తికావస్తున్నా నీటి తడి అందక ఎండుముఖం పట్టిన అపరాల పైర్లను చూసి రైతులకు గుండె మండింది. ట్రాక్టర్లతో పంటను గురువారం దున్నించారు. కంచికర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. నందిగామ నియోజకవర్గంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 17,900 ఎకరాల్లో వరి, 6,552 ఎకరాల్లో పెసర, 2,218 ఎకరాల్లో మినుము సాగవుతాయి. ఈ ఖరీఫ్లో సుమారు 300 ఎకరాల్లో వరి, 3,920 ఎకరాల్లో పెసర, 3,590 ఎకరాల్లో మినుము సాగయ్యాయి. మినుము, పెసర పంటకాలం రెండు నెలలు. ఇప్పటికే అపరాల సాగు చేపట్టి 45 రోజులు గడిచాయి. వర్షాలు కురవకపోవడంతో పైర్లు అన్నీ ఎండుముఖం పట్టాయి. పొలం ఎండి గుండె మండిన రైతులు కంచికచర్ల మండలంలోని మోగులూరు, ఎస్.అమరవరం, కంచికచర్ల, పరిటాల గనిఆత్కూరు తదితర గ్రామాల్లో పంటలను ట్రాక్టర్తో దున్నుతున్నారు. చెరువులు సైతం అడుగంటడంతో వాటి కింద సాగు చేపట్టిన వరికి సైతం నీటి తడులు అందక పైర్లు ఎండు ముఖం పట్టాయి. పశువుల మేతగా.. ఒకవైపు నారుమళ్లు ఎండకుండా ఆయిల్ ఇంజిన్లతో నీరు తోడుతున్న రైతులు.. మరోవైపు నీటి కోసం ఎదురుచూస్తూ ఖాళీ ఉన్న పొలాలు.. కోడూరు మండలంలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఖరీఫ్ సీజన్ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఏటా జూలై చివరి నాటికి కోడూరు మండలంలోని పొలాలు పచ్చని నారుమళ్లు, వరి నాట్లతో కళకళలాడుతాయి. ఈ సారి సాగు నీరు లేక బీడువారిన పొలాల్లో పశువులు, గొర్రెలు, మేకలు మేతకు వెళ్తున్నాయి. సాగు చేపట్టింది 20 శాతం రైతులే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా మండలంలో వరి సాగు ముందుకు కదలడం లేదు. సాగునీరు అందక రైతులు నారుమడి కూడా వేయలేని దుస్థితి నెలకొంది. మండలంలో దాదాపు 80 శాతం మంది రైతులు ఇంకా సాగు ప్రారంభించలేదు. 20 శాతం మంది రైతులు నారుమడులు పోయగలిగారు. నీరు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఆశగా కాలువల వైపు చూస్తూ రోజులు గడుపుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని వి.కొత్తపాలెం, మాచవరం, జయపురం, లింగారెడ్డిపాలెం, కోడూరు గ్రామాలకు చెందిన కొద్దిమంది రైతులు కాలువల్లో వస్తున్న అరకొర నీటి ఆధారంగా నారుమడులు పోశారు. వర్షాలు కురవక, కాలువల్లో నీరు లేక నారుమడులు ఎండిపో కుండా ఉండేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలువల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల సహాయంతో పొలాలకు ట్యూపుల ద్వారా తోడుకుని నారుమడిని రక్షించుకుంటున్నారు. ఖర్చులు పెరిగిన పంటను కాపాడుకొనేందుకు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. దిగువ కాలువకు చుక్క నీరు చేరలేదు దిగువ ప్రాంతాలైన రామకృష్ణాపురం, ఇరాలి, ఊటగుండం, ఉల్లిపాలెం, హంసలదీవి, మందపాకల, పోటుమీద, పిట్టల్లంక, సాలెంపాలెం, విశ్వనాథపల్లి, వేణుగోపాలపురం గ్రామాలకు సంబంధించిన పంట కాలువల్లో ఇప్పటి వరకు చుక్క నీరు కూడా చేరలేదు. దీంతో ఆ గ్రామాల రైతులు నారుమడులు వేయలేక పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. నీరు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కొందరు రైతులు ఈ ఏడాది సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ నీరు విడుదల చేయడం సాధ్యం కాకపోతే పంట సాగు చేయలేక నష్టపోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. -
సమస్యలుంటే ‘కాల్ టు కలెక్టర్’
తిరువూరు: జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఏవైనా సమస్యలుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. గురువారం తిరువూరులో ఎరువుల దుకాణాల్లో స్టాకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువులకు ఎటువంటి ఇబ్బందీ లేదని, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే 91549 70454 నంబరుకు నేరుగా ఫోన్ చేస్తే తాను పరిశీలిస్తానన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా 3,319టన్నులు, ప్రైవేటు డీలర్ల ద్వారా 4,866టన్నుల యూరియా అందుబా టులో ఉందని కలెక్టర్ తెలిపారు. పీఏసీఎస్లలో 816 టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 773 టన్నుల డీఏపీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వరి పైర్ల పరిశీలన.. వామకుంట్ల(తిరువూరురూరల్): మండలంలోని వామకుంట్లలో గురువారం కలెక్టర్ లక్ష్మీశ ఖరీఫ్ వరి పైర్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆరుతడి పంటలు, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నానో యూరియాకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో కుమార్, తహసీల్దారు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశఎరువుల సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా మండల వ్యవసాయాధికారులు ప్రతి రోజూ రెండు మూడు దుకాణాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తిరువూరు సమీపంలో తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎరువుల అక్రమ రవాణా నిరోధానికి వ్యవ సాయ మార్కెటింగ్ శాఖ నిర్వహిస్తున్న తనిఖీలను ఆయన పరిశీలించారు. రైతులు కూడా అవసరం మేరకే యూరియా, డీఏపీ కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేయాల్సిన పంటలపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రైతులతో కూడా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట తిరువూరు ఆర్డీవో ఏ కుమార్, తహసీల్దార్ చంద్రమౌళి, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
సకల శుభాల మాసం శ్రావణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, శ్రీకృష్ణా ష్టమి వేడుకలు జరుగునున్నాయి. సకల శుభాల మాసం శ్రావణంలో అమ్మవారి ఆల యంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఆగస్టు 21న మూలవిరాట్ను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. 27వ తేదీ నుంచి పవిత్రోత్స వాలు ప్రారంభం కానున్నాయి. శ్రావణ మాసం నాల్గో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు. 21న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం శ్రావణ మాసం రెండో శుక్రవారమైన ఆగస్టు 21వ తేదీన ఆలయంలో మూలవిరాట్ను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాల నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. పవిత్రోత్సవాల మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. సెప్టెంబర్ నాలుగో తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి ఎదుట భక్తులు ఆచరించొచ్చు. తొలుత ఆర్జిత సేవగా, అనంతరం ఉచితంగా వ్రతాలకు భక్తులను అనుమతిస్తారు. సెప్టెంబర్ నాలుగో తేదీన దుర్గగుడిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. -
నువ్వెంత.. నీ స్థాయెంత
కృష్ణాజిల్లా: టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరుపై ఆధిపత్యం కోసం తమ్ముళ్లు తన్నుకునే వరకూ వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎదుటే ఒకరిపై ఒకరు వాదులాటకు దిగి దుర్భాషలాడుకున్నారు. నువ్వెంత...నీ స్థాయెంత అంటూ తోపులాటకు దిగారు. మంగళవారం రాత్రి టీడీపీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం వేదికగా తమ్ముళ్ల మధ్య పోరు నెలకొంది. ఉయ్యూరు టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం, కాంట్రాక్టులు, ఆదాయ వనరుల అజెండాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తమ్ముళ్ల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కార్యక్రమాలు కూడా ఒంటెత్తు పోకడలుగా సాగుతుండటంతో శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపాలిటీ వేదికగా సాగుతున్న ఈ తంతు ఇంటింటికీ తెలుగుదేశంలో బహిర్గతమైంది. కాపుల రామాలయం సెంటరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సమక్షంలోనే పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాసప్రసాద్, కూనపరెడ్డి వాసు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగి తోపులాట వరకూ వెళ్లారు. అధికారం, పదవులు, కాంట్రాక్టులు అన్నీ ఒకరిద్దరికే ఎలా కట్టబెడతారంటూ వంగవీటి ఆరోపించారు. ఆరోపణలపై వాసు అదే స్థాయిలో స్పందించి పార్టీలో కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అదుపుతప్పే పరిస్థితి నెలకొనటంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జోక్యం చేసుకుని ఇరువురికీ సర్దిచెప్పి కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు. జనసేన గళం టీడీపీ నేతల వ్యవహార తీరుపై జనసేన నేతలూ తమ అసంతృప్తి వెళ్లగక్కారు. జనసేన నేత బొప్పన శివప్రసాద్ తమ పార్టీకి సరైన ప్రాధాన్యం లేదని ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతలను నిలదీయటంపై చర్చ జరుగుతోంది. జనసేనకు సముచిత స్థానం కలి్పంచటం లేదని బొప్పన ఆరోపించటం గమనార్హం. -
సాయికృష్ణ కేసు.. సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
సాక్షి, విజయవాడ: సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజును విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించే అవకాశం ఉంది. అనంతరం సీట్ కార్యాలయంలో సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది.కాగా, సాయికృష్ణ లాకప్డెత్పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
నిబద్ధతతో పని చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధుల పట్ల ఉదాసీనత లేకుండా, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు అన్నారు. ఆయన బుధవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నం పీహెచ్సీ, ముత్యాలం చెరువు యూపీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది ముఖ హాజరును పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పీహెచ్సీలో జరుగుతున్న ప్రసవాలను పరిశీలించి, గర్భిణులు, మాతాశిశు సంరక్షణ సేవలను అడిగి తెలుసుకున్నారు. మరింత నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలన్నారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ను సందర్శించి, అక్కడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీపీఎంఓ డాక్టర్ నవీన్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీం, సీహెచ్ఓ నారాయణరావు పాల్గొన్నారు. తిరువూరు: ‘బెల్టు బేరం.. రాబడి అధనం’ శీర్షికన సాక్షి దిన పత్రికలో బుధవారం వచ్చిన వార్తకు తిరువూరు ఎకై ్సజ్ సర్కిల్ అధికారులు స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 330 బెల్టు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు వాటి నిర్వాహకులను అరెస్టు చేసి 3,919 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు మండలంలో 62 మందిని, గంపలగూడెంలో 129 మందిని, ఏకొండూరు మండలంలో 51 మందిని, విస్సన్నపేట మండలంలో 52 మంది బెల్టు దుకాణాల నిర్వాహకులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ నిక్సన్ తెలిపారు. -
టూరిజం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): జిల్లాలో ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్టులు డీపీఆర్లకే పరిమితం కాకూడదని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. భవానీ ఐల్యాండ్ కోసం.. భవానీ ఐల్యాండ్ వద్ద రూ.75కోట్ల అంచనా వ్యయంతో పదెకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, 500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ తదితర ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జూలై–2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంబేడ్కర్ స్మృతివనంలో.. స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 75మంది సామర్థ్యంతో మినీ థియేటర్ను పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యా, వైజ్ఞానిక, అవగాహన చిత్రాల ప్రదర్శనకు వినియోగించాలన్నారు. నదిహారతి ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ -
గాలిలో దీపంలా సాగు!
ప్రతి రైతుకూ బీమా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్బీమా యోజన పథకం నూరు శాతం నమోదు లక్ష్యంగా కార్యచరణ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును తప్పనిసరిగా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పంట మార్పిడిపై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో పంట మార్పిడి చేపట్టారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎరువుల సమస్యలపై కాల్ సెంటర్.. ఎరువుల విషయంలో రైతులకు సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్ (91549 70454)ను సంప్రదించే విధంగా అన్ని ఎరువుల దుకాణాల వద్ద హెల్ప్లైన్ నంబర్ను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. సాక్షి, విజయవాడ: ఎల్నినో ప్రభావం ఒకవైపు.. ప్రభుత్వ సహాయ నిరాకరణ మరోవైపు.. వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్తింపజేసే పంటల బీమాకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం నగదు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాల్సి ఉండగా.. రైతులే ప్రీమియం కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. అసలే కష్టనష్టాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాత ఇప్పుడు ప్రీమియం చెల్లించడానికి మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ అధికశాతం వరి సాగు అవుతోంది. అయితే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వరి సాగు చేయొద్దని ప్రభుత్వం రైతులకు చెబుతోంది. ఏదీ నాటి భరోసా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. తద్వారా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని చెబుతోంది. గత్యంతరం లేక కొందరు ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొందరు మాత్రం కనీసం ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బస్తా యూరియా కోసం తాము అగచాట్లు పడుతున్నామని, ఇంక పంట నష్టపోతే పరిహారం ఇస్తారన్న నమ్మకం లేదని రైతులు చెబుతున్న పరిస్థితి. అసలే ఎల్నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన తరుణంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రేపటితో ఆఖరు.. వాతావరణ ఆధారిత, పీఎం ఫసల్ బీమా పథకాల కింద ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేసిన పంటను పరిశీలించి బీమా ప్రీమియం కట్టించేలా అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లోనే నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2022 అధికారిక గణాంకాల ప్రకారం 3.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ఇందులో సాగు నీరు కింద 2.42లక్షల హెక్టార్లు ఉంది. కొన్ని పంటలకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని రైతులు కోరుతున్నా.. చంద్రబాబు సర్కారు నుంచి కనీస స్పందన లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పీఎంఎఫ్బీవై కింద వరి(అత్యధిక విస్తీర్ణం)కి ఎకరాకు రూ.850(ఆగస్టు 15 వరకు గడువు ఉంది), ఎర్రమిరపకు రూ.1800, మొక్కజొన్నకు ఎకరాకు రూ.370, పత్తికి రూ.1900(ఈ నెల 24వ తేదీకి గడువు ముగిసింది), పెసలుకు రూ.360 చొప్పున బీమా కట్టాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో బీమా నమోదు శాతం చాలా తక్కువగా ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయించేందుకు నగదు చెల్లించేది. పంట నష్టపోయినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ నగదు అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఎత్తి వేయడంతో రైతులకు ఇన్సూరెన్స్ చేయించడం ఆర్థిక భారంగా మారి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలి. – చెరుకూరి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకుడు, కవులూరు -
సంగీతం, సాహిత్యం.. జ్ఞానాన్ని పెంచే సాధనాలు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వన్టౌన్(విజయవాడపశ్చిమ): సంగీత, సాహిత్యాలు జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప సాధానాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. యువత పాశ్చాత్య పొకడల వైపు అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతికి దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భాషా–సాంస్కృతిక శాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావనా వాహిని సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన ‘జగద్గురు అన్నమాచార్య’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత అన్నమయ్య కీర్తనల అంతరార్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించాలని సూచించారు. మానవ విలువలకు ప్రతీకలు.. రాష్ట్ర సృజనాత్మకత–సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ సంగీతం, సాహిత్య సమ్మేళనంతో అన్నమయ్య పదకవిత్వానికి చిరస్థాయితనం లభించిందన్నారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు మానవ విలువలకు ప్రతీకలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సెక్రటరీ డాక్టర్ టి. శ్రీనివాసు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు సాహిత్యానికి అమూల్య వారసత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ‘పదకవితా వసంతం అన్నమయ్య’ గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం వందలాది మంది విద్యార్థులు సామూహికంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, పరిపాలనాధికారి డాక్టర్ వి. నారాయణరావు, కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి మాతా ప్రణామం
పూర్ణాహుతితో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తజనం వివిధ ఫలాలతో ఉత్సవమూర్తిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో అలంకరించగా, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కాయలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరో వైపున ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజామున దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. 45 టన్నుల కూరగాయలు, 2.5 లక్షల మంది భక్తులు శాకంబరీ ఉత్సవాలలో మూడు రోజులలో 45 టన్నుల కూరగాయలను ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం, ఇతర ఉపాలయాల అలంకరణకు వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 2.50 లక్షల మంది భక్తులు అమ్మవారికి శాకంబరీగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలలో మొదటి రెండు రోజులు ఆకు కూరలు, కాయగూరలతోనూ, మూడో రోజున డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. బంగారు గోపుర ప్రాకారం చుట్టూ బత్తాయిలు, కమలాలు, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్, ఆల్బక్రా, ద్రాక్షలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరిగిన కదంబ ప్రసాద వితరణపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు నిర్విరామంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందించామని ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. రాజగోపురం ఎదుట మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైభవంగా గిరి ప్రదక్షిణ.. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ప్రచార రథానికి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆషాఢ మాసం, గురు పౌర్ణమి వేళ ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తమ ఇంటి ముంగిటకు విచ్చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ భక్తులు పూజా సామగ్రి సమర్పించి పూజలు జరిపించుకున్నారు. పౌర్ణమి వేళ.. ఆర్జిత సేవా భాగ్యం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ పౌర్ణమి, శాకంబరీగా దుర్గమ్మ దర్శనం, ఆషాఢ సారె ఉత్సవాల నేపథ్యంలో బుధవారం ఆదిదంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ, మూలవిరాట్కు నిర్వహించే ఖడ్గమాలార్చనకు పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో 27 మంది ఉభయదాతలు రెండు షిఫ్టులలో పూజను జరిపించుకున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 17 మంది, యాగశాలలో చండీహోమంలో 174 టికెట్లకు విక్రయించారు. దీంతో సుమారు మూడువందల మంది భక్తులు యాగశాలలో ప్రత్యక్షంగా పాల్గొని తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఇక సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలో పాల్గొనేందుకు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. శాకంబరీ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ, ప్రసాద్, ఇతర వేద పండితులు పాల్గొన్నారు. -
విజయవాడ డివిజన్ ఉద్యోగికి జీఎం సేఫ్టీ అవార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషి చేసిన విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎం.రమేష్ బాబు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యర్ చేతుల మీదుగా ‘మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందు కున్నారు. జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జోన్ వ్యాప్తంగా విధుల్లో అప్రమత్తత చూపించిన ఉద్యోగులకు అవార్డులను అందించారు. అందులో విజయవాడ డివిజన్కు చెందిన ఎం.రమేష్బాబు జూన్ 2న మధ్యాహ్నం 12.05 గంటల సమయలో గూడ్స్ రైలు చీరాల స్టేషన్ దాటుతుండగా అందులోని రెండు వ్యాగన్లలో ఐరన్ కాయిల్స్ను పట్టి ఉంచే ఇనుప పట్టీలు విరిగిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్పందించి.. లోకోపైలెట్, స్టేషన్ మాస్టర్, సంబంధిత కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు అనంతరం రైలును వేటపాలెంలో నిలిపి సత్వర చర్యలు చేపట్టారు. ఐటీఐలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీలోగా ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. అనుమతులు లేని భవనాల కూల్చివేత పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై బుధవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీ కమిషనర్ షేక్ నజీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు డాక్టర్స్ కాలనీ, తాడిగడప డొంక రోడ్డులో అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం చేశారన్నారు. మునిసిపాలిటీ చట్టానికి విరుద్ధంగా భవనాలు నిర్మాణం చేసినందున నోటీసులు జారీ చేశామని అన్నారు. నిర్ణీత సమయంలో యజమానులు అక్రమ కట్టడాలు తొలగించకపోవటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాలను కూల్చారని అన్నారు. తాడిగడప మునిసి పాలిటీలో నిర్మాణాలు చేపట్టే యజమానులు ముందస్తుగా ప్లాన్లు మంజూరు చేసుకోవాలని తెలిపారు. మంజూరైన ప్లాన్ల ప్రకారం భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలకు విరాళంగా గోల్డ్ మెడల్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆ కళాశాల పూర్వ విద్యార్థి(1987 బ్యాచ్), రేడియాలజిస్ట్ డాక్టర్ వీఎన్ వరప్రసాద్ గోల్డ్మెడల్ విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఏటా బెస్ట్ అవుట్గోయింగ్ విద్యార్థికి ఈ గోల్డ్మెడల్ను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థుల ప్రతిభను మరింత ప్రోత్సహించేలా గోల్డ్మెడల్ విరాళం అందజేయడం అభినందనీయం అన్నారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ విరాళం మరెందరో పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.హెబియస్ కార్పస్ పిటిషన్పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది. -
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
ప్రయోగాలతో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాల ద్వారా ఆయా అంశాలపై నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్, ఎస్సీఈఆర్టీ, జెనీ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 100 పాఠశాలలకు సైన్స్ జెనీ బాక్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నగరంలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక రసాయన జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తితో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ట్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. జెని బాక్స్ కిట్ల ద్వారా 40 రకాల ప్రయోగాలు చేసేందుకు వీలవుతుందని ఆప్కాస్ట్ సభ్య కార్యదర్శి డాక్టర్ కె.శరత్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2026 పోస్టర్లను ఆవిష్కరించారు. 10 నుంచి 17 ఏళ్ల వయసు గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి, డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్రశిక్ష ఏపీసీ ఆర్.రమేష్ బాబు, జెనీసైన్స్ వ్యవస్థాపకుడు ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.20.40 లక్షల బీమా చెక్కు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.20.40 లక్షల బీమా చెక్కును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అందజేశారు. వివరాల ప్రకారం వీరులపాడు పోలీస్స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ మొగిలి ప్రభుకుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 26న విధులు ముగించుకుని ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. దీంతో రాష్ట్రంలోని హోంగార్డులతో పాటు అన్ని కేడర్ పోలీసు సిబ్బందికి వర్తించే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం రూ.20.40 లక్షలు చెక్కురూపంలో ప్రభుకుమార్ కుమారుడు అఖిల్బాబుకు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ది న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ ఎస్వీ సుబ్బారావు, స్థానిక డివిజనల్ కార్యాలయ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రికి హరిత శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా నివేదన అనంతరం రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అన్ని క్యూలైన్లలోనూ భక్తులను ఉచి తంగా అనుమతించారు. రూ.500 టికెట్ల విక్రయా లను నిలిపివేసిన దేవస్థాన అధికారులు బంగారు వాకిలి ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఆకట్టుకున్న ప్రధాన ఆలయ అలంకరణ శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయానికి చేసిన కూరగాయల అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. కరివేపాకు, వంకాయలు, దొండ, బెండ, కాకర, టమాట, క్యారెట్, క్యాప్సికమ్లతో ఆలయ ప్రాంగణాన్ని హరిత వనంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆకుకూరలు, కాయ గూరలతో విశేషంగా అలంకరించారు. వేద విద్యార్థులకు దివ్య దర్శనం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులకు ఇకపై అమ్మవారి దివ్య దర్శనం కలగనుంది. ఈ మేరకు మంగళవారం పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. ఈ నూతన పాలసీకి ఆలయ ఈఓ శీనానాయక్ సోమ వారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి పండుగ దినాలు, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో అమ్మవారి దర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉందని వేద విద్యార్థులు పేర్కొన్నారు. నేడు పూర్ణాహుతి సోమవారం ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సప్తశతీ పారాయణం, మహా విద్యా పారాయణం, హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటప పూజలను నిర్వహిస్తారు. అనంతరం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. అమ్మవారి ఆలయ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
హోరెత్తిన నిరసన గళం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026దగా డీఎస్సీపై గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగం, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. నీట్ అవకతవకలపై ఢిల్లీలో జెన్ జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆందోళనల తరహాలో విజయవాడను నిరసనలతో హోరెత్తించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని, మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల సాయి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బావాజీపేటలోని కూర్మయ్య వంతెన నుంచి ధర్నా చౌక్ వరకు ఈ ర్యాలీ సాగింది. డీఎస్సీ అభ్యర్థులు గంగదేవిపాడుకు చెందిన రోశిబాబు, నూజివీడుకు చెందిన రాణి పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. విద్యార్థులు, యువత ప్లకార్డులతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీలో కమీషన్ల పర్వం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యువత, విద్యార్థులే ఎక్కువగా నష్టపో యారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయడంలేదని విమర్శించారు. యువగళం పాద్రయాత్రలో యువతకు అన్నగా ఉంటానన్న నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలో లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర యువత, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. యువతకు న్యాయం చేయగలిగే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్ సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ లోకేష్ చాలెంజ్లు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. మెగా పేరుతో దగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో యువతను దగా చేసిన ప్రభుత్వాన్ని యువత, విద్యార్థులు రోడ్డెక్కి నిలదీస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు నారా లోకేష్ బాధ్యతవహిస్తూ రాజీనామా చేసేవరకు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందంటే తప్పు జరిగినట్టే కదా అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు జరిగాయని విమర్శించారు. నకిలీ పత్రాలతో, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై విద్యార్థి, యువత రగిలిపోతోందని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టంచేశారు. మీ ఉద్యోగికి జాబ్ ఎందుకివ్వలేదు? మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ‘డీఎస్సీలో మీ ఉద్యోగికి ర్యాంకు వచ్చినా జాబ్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే తప్పు చేసినట్టే కదా? అతడి నుంచి పేపర్ ఎవరికి లీక్ అయ్యిందో తేల్చాలి కదా? జీవోలు ఎందుకు మార్చారు? వీటన్నింటికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. లోకేష్ సవాల్ను స్వీకరిస్తున్నామని, ప్లేస్, టైం చెప్పాలని సూచించారు. తప్పు చేశారు కాబట్టే విచారణకు ఒప్పుకోవడం లేదన్నారు. కూటమి ధర్మం పాటిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగ్గయ్య పేట, తిరువూరు నియోజకవర్గాల ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, నలగట్ల స్వామిదాసు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లా డుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్దే బాధ్యతని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, షేక్ ఆసిఫ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నారా లోకేష్ అధికారంలోకి రాకముందు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి యువతలో ఆశలు కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. పద్ధతిగా మెగా డీఎస్సీ నిర్వహించామని లోకేష్ చెబుతున్నారు కానీ చాలా పద్ధతిగా అవినీతికి పాల్పడ్డారు. ఆయనకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు. – కొరివి చైతన్య, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూటమి నాయకులు ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డీఎస్సీ అని పేరుపెట్టారు. దానిని కూడా దగా డీఎస్సీ చేసి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగిస్తాం. – కోమల సాయి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో టెట్ అర్హత, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా క్రీడా సంఘాల సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి. లేని పక్షంలో నీట్పై జెన్ జీ చేపట్టిన ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం. – రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
బీఎస్సీ నర్సింగ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్లో వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడిన ఘటనలను తీవ్రంగా పరిగణించిన హెల్త్ యూనివర్సిటీ నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్స్తో వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని వారు వివరించారు. నర్సింగ్ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచించిన పాఠ్య ప్రణాళికను సమర్థంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన క్లినికల్ శిక్షణను తప్పనిసరిగా అందించాలని ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, వృత్తి బాధ్యత పెంపొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. మాల్ప్రాక్టీస్ జరగకూడదు పరీక్షల్లో ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా చూడాలని ప్రిన్సిపాల్స్ను వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ ఆదేశించారు. రానున్న రోజుల్లో పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలు, మాల్ప్రాక్టీస్ జరిగినా సంబంధిత విద్యార్థులతో పాటు ఆయా కళాశాలల పైనా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మాల్ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థులను పరీక్షల నుంచి డీబార్ చేయడంతో పాటు, సంబంధిత నర్సింగ్ కళాశాలలపై జరిమానాలు విధించే చర్యలు కూడా చేపడతామని వారు స్పష్టం చేశారు. నాణ్యమైన నర్సింగ్ విద్య, పారదర్శక పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల పెంపుదలే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
బస్సు ఢీకొని కార్మికుడు మృతి
కంకిపాడు: బస్సు ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవై దాసు తెలిపిన కథనం మేరకు...కంకిపాడు పట్టణంలోని పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న గుడివాడ విష్ణువర్థన్రావు (62) పట్టణంలోని పొగాకు కొట్టులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు స్థానికంగా ఉన్న అపార్టుమెంట్ వద్ద నిలబడ్డాడు. రవీంద్ర భారతి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా బస్సును వెనక్కి రివర్స్ చేయటంతో విష్ణువర్థన్రావును బస్సు ఢీకొని కిందపడ్డాడు. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే విష్ణువర్థన్రావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దాసు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల 10వ స్నాతకోత్సవం కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాగర్ ఆడిటోరియంలో బుధవారం జరుగనుంది. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ సంస్థ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ డాక్టర్ ఆమోఘ్కుమార్ గుప్తాతో పాటుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. 2026వ విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన 262 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. -
ఉపకారంలో కోతలు .. విద్యార్థుల వెతలు
బీసీ విద్యార్థులకు మొండిచేయి చదువులపై ఆర్థిక భారం బీసీ విద్యార్థులకు : రూ.27.68 కోట్లు ముస్లిం మైనార్టీలకు : రూ.5.32 కోట్లు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు : రూ.0.76 కోట్లు ఈబీసీ విద్యార్థులకు : రూ.4.47 కోట్లు కాపు విద్యార్థులకు : రూ.1.34 కోట్లు ఎస్టీ విద్యార్థులకు : రూ.0.77 కోట్లు


