breaking news
NTR
-
పోరాట ఉధృతికి ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సన్నద్ధం..!
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. సానుకూలం అంటూ పోరాటం వరకూ తీసుకొచ్చారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చర్చలు విఫలమైతే మాత్రం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం ఖాయమని అంటున్నారు. ఈనెల 23వ తేదీన సచివాలయ ఉద్యోగులను మంత్రి చర్చలకు రావాలని పిలిచిన నేపథ్యంలో వారు తమ కార్యాచరణను ముందుగానే ప్రకటించారు. చర్చలు విఫలమైన పక్షంలో పోరాటాన్ని మరింత తారాస్థాయికి తీసుకెళతామని, ఈనెల 25న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని గ్రామ,వార్డు సచివాయ ఉద్యోగుల జేఎసి హెచ్చరించింది. అదే సమయంలో ఈనెల 27వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటించింది ఇదీ చదవండి: బాబు సర్కారుపై ‘మహా’గ్రహం -
విద్యుత్ తీగెలు తగిలి గ్రావెల్ లారీ దగ్ధం
విజయవాడరూరల్: మండలంలోని కొత్తూరు తాడేపల్లి పరిధిలో ఉన్న అస్సైన్డ్ భూముల నుంచి గ్రావెల్ రవాణా చేసే లారీ విద్యుత్ తీగెలు తగిలి బుధవారం దగ్ధమైంది. కొత్తూరు క్వారీ నుంచి తాడేపల్లి మెయిన్ రోడ్డులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మార్ బాక్స్ వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగెలు లారీకి తగిలాయి. విద్యుత్ షార్క్ సర్క్యూటై మంటలు ఎగసిపడ్డాయి. డీజిల్ ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో లారీ దగ్ధమైంది. దాదాపు గంట సమయం మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి అధికారి ఎండీ సలావుల్లా సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ పరారయ్యాడని స్థానికులు తెలిపారు. లారీలో దాదాపు 40 టన్నుల గ్రావెల్ లోడు ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన లారీ టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరుడిదని, అతనికి సంబంధించిన లారీలే అస్సైన్డ్ భూముల్లో గ్రావెల్ను రవాణా చేస్తున్నాయని వివరించారు. -
ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే..
ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల సంఖ్యను పెంచడానికే ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం ప్రమాణాలను తగ్గిస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్ రాకపోతే బడి ఉండదు. తల్లిదండ్రులు అప్పు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేరుస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవంగా ఐదు లక్షల మంది తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్లో సంఖ్య పెరిగింది. – రవిచంద్ర, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
వీఎంసీ ఏసీపీ, టీపీఓ సస్పెన్షన్
పటమట(విజయవాడతూర్పు): అక్రమ లే అవుట్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టణ ప్రణాళిక విభాగం ఉద్యోగులు ఇద్దని సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సర్వే నంబర్ 37, 78ఏ/ఏలోని 3.5 ఎకరాల స్థలంలో అక్రమ లే అవుట్ వ్యవహారంలో వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల తొమ్మిదో తేదీన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథ నంపై స్పందించిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏసీపీ – 2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వై.రాంబాబు, స్థానిక టీపీఓ షేక్ రిజ్వానాను బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీపై మరో ఆరోపణ ఇటీవల ఏలూరు కాలువ గట్టుపై లెనిన్ సెంటర్ లోని పలు దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ డీఈకి నగరపాలక సంస్థ కమిషనర్ అప్రూవల్ లేకుండా వీఎంసీ సర్కిల్–2 ఏసీపీ వై.రాంబాబు లేఖ రాశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర అతడిపై చర్యలు తీసుకోవాలని డీటీసీపీని ఆదేశించారు. ఏసీపీ రాంబా బును ఈ ఆరోపణలో కూడా సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ విద్యుల్లత తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పథకం ప్రకారమే క్రైస్తవులపై దాడులు ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధి పాస్టర్ అరుల్ అరసుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా అధికారుల ద్వారా చర్చిలను కూలగొడుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధి, పాస్టర్ అరుల్ అరసు ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు చర్చిలను సీజ్ చేశారన్నారు. పోలవరం, పాతపాడు గ్రామాల్లో రెండు చర్చిలను కూల్చివేశారన్నారు. వీటిని చూస్తే పథకం ప్రకారమే కూల్చివేతలు జరుగుతున్నాయని భావించాల్సి వస్తోందన్నారు. పాస్టర జేమ్స్ కుంపట్ల మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను వక్రీకరించడం, మత మార్పిడిని నేరంగా చూపి హిందువుల్లో ద్వేషం కలిగేలా ప్రణాళిక రచిస్తున్నారని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను ప్రపంచ వ్యాప్తంగా తెలిపేందుకు అక్టోబర్ ఆరో తేదీ నుంచి శాంతియుతంగా నిరసన, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. -
ఏకోపాధ్యాయ.. పాఠం గయా
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. జిల్లాలో ఏకోపా ధ్యాయ పాఠశాలలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్పై దుష్ప్రభావం చూపుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కళకళలాడాయి. మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునికతను సంతరించకున్నాయి. ఇంగ్లిష్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, కూర్చునేందుకు టేబుళ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు, మంచినీటి సరఫరాకు ఆర్వో ప్లాంట్లు, నీటి వసతితో కూడి మరుగుదొడ్లు, చుట్టూ ప్రహరీలు వంటి వసతులతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచాయి. విద్యార్థులకు షూ, టై, బెల్టు, బ్యాగ్, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను ఉచి తంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమ్మఒడి పథకం అమలుచేశారు. 8వ తరగతి నుంచే ట్యాబ్లు ఇచ్చి సాంకేతిక విద్యను పేద విద్యార్థుల చెంతకు చేర్చారు. ఫలితంగా డ్రాప్ఔట్లు తగ్గి, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 426 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ, మునిసిపల్ యాజమాన్యాల్లో మొత్తం 930 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 87,249 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 5,041 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉండగా, మరో 426 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్లు సెలవు పెడితే క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు (సీఆర్పీ) డ్యూటీలు వేస్తున్నారు. వారు కూడా సెలవులో ఉన్నప్పుడు ఆ రోజు ఆయా స్కూళ్లకు అనధికారికంగా సెలవు ఇవ్వక తప్పని పరిస్థితి. -
నవంబర్ 21, 22 తేదీల్లో అయ్యప్ప మహా సంకల్పం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ ఏడాది నవంబర్ 21, 22 తేదీల్లో విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అయ్యప్ప మహా సంకల్పం – మహా పడిపూజ, భజన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఏ అక్కయ్యనాయుడు మాట్లాడుతూ.. శబరిమల ఆలయ మాజీ మేల్శాంతి చేతుల మీదుగా మహా పడిపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ, ‘శుభారంభ శంఖారావం – గురుస్వామి సమ్మేళనం’ కార్యక్రమం అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు గవర్నర్ పేటలోని ఐవీ ప్యాలెస్లో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శబరిమల మాజీ మేల్శాంతి దామోదరన్ పొట్టి, అక్షయపాత్ర అధ్యక్షుడు వంశీధర దాస్, ఏబీఏపీ జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్ హాజరవుతారని పేర్కొన్నారు. ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు సీతారాం గురుస్వామి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం మొత్తం నుంచి గురుస్వాములు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కన్వీనర్ కృష్ణ ప్రసన్న, కో చైర్మన్ ఎ. గురునాథ్, కోశాధికారి తొండెపు ప్రసాద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి పట్టణం ఆశ్రమం రోడ్డులో రెడ్ల సత్రం వద్ద సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. సీఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలి ఆ మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో మృతిచెందిన మహిళ ఫోన్, బంగారు నగలు లభించాయి. మృతురాలిని విజయవాడ కండ్రికకు చెందిన మాలకొండ మహేశ్వరి (44)గా గుర్తించారు. బంధువులు పోలీసులకు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం మహేశ్వరి సింగ్నగర్లో తను పనిచేస్తున్న కూరగా యల మార్కెట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్తె సింధూర లక్ష్మికి ఫోన్ చేసి స్విచ్చాఫ్ చేసింది. కుమార్తె వెంటనే బంధువుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో నున్న పోలీస్స్టేషన్తో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సగం కాలిన మహిళ మృతదేహం సమాచారం తెలిసిన డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పదంగానే.. మల్లేశ్వరి ఆశ్రమం రోడ్డులోకి ఎలా వచ్చింది, పెట్రోల్ ఎక్కడ కొన్నది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం రోడ్డులో క్రిస్టియన్ శ్మశాన వాటిక గోడపక్కనే కంకర గుట్టపై తగలబడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె చెప్పులు అదే ప్రాంతంలో విడివిడిగా దూరంగా ఉన్నాయి. మంగళసూత్రం, తాడు, చెవి దుద్దులు, ఫోన్ ఒక కవరులో పక్కన పెట్టిన ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే ఎవరైనా వేధించి పెట్రోల్ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె లభించలేదు. తన కుమార్తెతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాను, శరీరం అంతా మంటగా ఉందని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని నున్న పోలీసులు తెలిపారు. పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకున్న తరువాత కుమార్తెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్, నగలు క్యారీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? ఆ వస్తువులు కాలినట్లు కనిపించడం లేదు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే మద్యం మత్తులో ఉన్న వారు ఏమైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల వేళ దేవస్థాన అధికారులు ట్రస్ట్ బోర్డు ముందు ఉంచిన 25 అంశాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం బుధవారం మహా మండపం నాల్గో అంతస్తులోని సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన ఈవో శీనానాయక్ సమక్షంలో ట్రస్ట్ బోర్డు సమావేశానికి బోర్డు సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ బోర్డు నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 25 అంశాలు చర్చకు రాగా, దాదాపు అన్ని అంశాలు దసరా ఉత్సవాలకు సంబంధించి కావడంతో వాటిని ఆమోదించామన్నారు. ఉత్సవాలలో ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఒక పనిని పర్యవేక్షించేలా డ్యూటీలు వేసుకోవాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు డీఈవో కిషోర్కుమార్, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన ప్రతిపాదనల్లో కొన్ని.. ● దసరా ఉత్సవాలలో భక్తుల రద్దీ సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత భక్తుల పర్యవేక్షణ, ముఖ గుర్తింపు, దర్శనానికి పట్టే సమయం అంచనా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఈ– ప్రోక్యూర్మెంట్ ద్వారా అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ. 13.39లక్షలకు అప్పగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ● భక్తులకు లడ్డూలను పంపిణీ చేసేందుకు అవసరమైన ఏటీఎం మిషన్ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఒక్కో లడ్డూ ఏటీఎం మిషన్ ధర రూ. 6.95లక్షలు కాగా, ఇటీవల సీపీ కార్యాలయంలో నిర్వహించిన ట్రయల్ రన్పై అధికారులు సంతృప్తిని చెందగా, ఆ మిషన్లను ఉత్సవాలలో ఏర్పాటుకు బోర్డు ఆమోదించింది. ● తాత్కాలిక క్యూలైన్లు, ఎంఎస్ ఆర్చ్ ఫ్రేమ్లు, తాత్కాలిక సీసీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ షెడ్డు, వంటి పనులకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ● పాత లడ్డూ పోటులో వంటగదికి సంబంధించి పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భవన నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ● మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ప్రాకార మండపంలో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్లతో రక్షణ, యాగశాల చుట్టూ వర్షం నుంచి రక్షణ కలిగించేలా పనులు చేపట్టేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ● ఉత్సవాలలో అమ్మవారి అన్నప్రసాదం, ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి సరఫరా చేసేందుకు ఆరు నెలల పాటు టెండర్ను బోర్డు ఆమోదించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో ట్రస్ట్ బోర్డు నిర్ణయం -
డూండీ గణపతికి ప్రపంచ రికార్డు
భవానీపురం(విజయవాడపశ్చిమ): వినాయక చవితి సందర్భంగా విజయవాడ విద్యాధరపురం లేబర్కాలనీ గ్రౌండ్లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన 72 అడుగుల ఎత్తయిన పంచముఖ వరసిద్ధి మహా మట్టి గణపతి విగ్రహానికి ప్రపంచ రికార్డు లభించింది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన పర్యావరణ హిత గణేష్ విగ్రహంగా ఇంజీనియస్ చార్మ్ వరల్డ్ రికార్డ్స్ (ఐసీడబ్ల్యూఆర్) సంస్థ గుర్తించి ధ్రువీకరించింది. బుధవారం సాయంత్రం సంస్థ ప్రతినిధులు సమితి కమిటీ సభ్యులకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను అందజేశారు. కాగా ఉదయం మహిళలతో సంకటహర గణేష్ స్త్రోత్ర పారాయణ, వీణా వాయిద్య కచేరి జరిగాయి. రాత్రి మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చిన పండితులు శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, డూండీ గణేష్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ టీచర్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయుల మిగులు సిబ్బందికి సంబంధించి విద్యాశాఖ 2023 జూన్ 22న నిర్ధేశించిన ఉత్తర్వుల ప్రకారం పారదర్శకంగా కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ‘సాక్షి’లో ఎయిడెడ్కు సర్దు ‘పోటు’ శీర్షికన ప్రచురించిన కథనంపై ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 44 మంది ఎయిడెడ్ మిగులు ఉపాధ్యాయులను వారి ఆప్షన్ ప్రకారం అవసరమన్న ఎయిడెడ్ పాఠశాలలకు కౌన్సెలింగ్ ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే శారదా విద్యాలయం హైస్కూల్ను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూసివేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో అందులో పని చేసే ఉపాద్యాయులను 2022 మే 20 ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం.. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం విద్యాశాఖ క్యాడర్ స్ట్రెంత్ను పంపామని, తదుపరి వచ్చే ఆదేశానుసారం ఆ సిబ్బంది సర్దుబాటు చేస్తామని డీఈవో సుబ్బారావు తెలిపారు. అలాగే పాతబస్తీలో జరిగిన కొత్త పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం ఆనాటి డీఈవో ఆదేశాలు ఇచ్చారని, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను బట్టి నలుగురు ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఉత్సాహంగా పికిల్ బాల్ టోర్నీ
కోనేరుసెంటర్: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్సీసీ క్యాడెట్లు ఓజోన్ పరిరక్షణపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు. పెడన: కలంకారీ పరిశ్రమలో రంగుల నిమిత్తం క్యాన్సర్ కారకమైన, ప్రమాదకరమైన రసాయనాల వాడకంపై ఆర్టీఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస్గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, శిరివెళ్ల గౌరి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లోకాయుక్త విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జంపాన శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మెంబర్ సెక్రటరీని విచారణకు ఆదేశిస్తూ పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీకాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రంగుల నిమిత్తం కలంకారీ పరిశ్రమలలో వాడుతున్న క్యాన్సర్ కారకమైన ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మెంబర్ సెక్రటరీ, ఐఎఫ్ఎస్ విజయవాడకు చెందిన ఎస్. శ్రీశరవణన్ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్ 20న చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. రజని ఆదేశాల మేరకు పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. -
ఏపీ సీపీడీసీఎల్లో కారుణ్య నియామకాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. గుణదలలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) కార్యాలయంలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమం బుధవారం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరై 25 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన వారి ఉద్యోగుల కుటుంబాల్లోని 25 మందికి నియామక పత్రాలను అందించామన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు మెరుగైన శిక్షణ అందించేందుకు విశాఖ పట్నంలో రూ. 30కోట్లతో ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్ను నిర్మించామన్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ, భక్తుల సౌకర్యార్థం తిరుపతి – విజయవాడ – తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి–విజయవాడ(07606) స్పెషల్ ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 1.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఉదయం 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ – తిరుపతి(07605) స్పెషల్ అదే రోజు ఉదయం 9గంటలకు విజయవాడలో బయల్దేరి సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి వెళ్తుంది. -
డబ్బులు ఊరికే వెళ్లవు!
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● రూ.2000 దాటిన లావాదేవీలపై చార్జీలు ● అక్టోబర్ 15 నుంచి ప్రారంభం ● రైల్వే, టెలికం లావాదేవీలపైనా వడ్డన ● ఉమ్మడి జిల్లాలో 15 లక్షల కుటుంబాలపై భారం ● ఇలా ప్రసాద్ కుటుంబం మాత్రమే కాదు.. దాదాపు ప్రతి కుటుంబం కూడా ప్రతి చిన్న, పెద్ద లావాదేవీ ఏదైనా యూపీఐనే అధికంగా వాడుతున్నారు. అయితే వీటిపై చార్జీలు విధిస్తారన్న అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన అంశాల్లో కొన్ని రకాల లావాదేవీలపైన మాత్రమే చార్జీలు అని భావిస్తున్నా, రానున్న కాలంలో అన్నింటిపైనా ఈ భారాలు వడ్డించే ప్రమాదం లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): సగటు వ్యక్తి జీవితంలో యూపీఐ లావాదేవీలు చాలా కీలకంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ ఖర్చు చేయాలన్నా, ఎక్కడికి నగదు పంపాలన్నా.. తీసుకోవాలన్నా యూపీఐనే ఆశ్రయిస్తున్నారు. దాంతో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ డిజిటల్ లావాదేవీలు భాగమైపోయాయి. అయితే ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అదనపు చార్జీలు లేవు. కానీ వచ్చే అక్టోబర్ 15 నుంచి రెండు వేల దాటిన లావాదేవీలపై చార్జీలు పడటంపై సామాన్యులు భయపడుతున్నారు. దానితో పాటుగా రూ.75వేలు కన్నా అధికంగా చేసే వాటిపై గరిష్టంగా రూ.300 వరకూ భారం పడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా టెలికాం, రైల్వే టికెట్ వంటి లావాదేవీలపైనా చార్జీలు భారీగానే ఉండనున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోనే 56 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనాభా కన్నా ఖాతాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఒక్కొక్కరికీ రెండు కన్నా అధికంగా ఉండటమే. గడిచిన దశాబ్ద కాలంగా బ్యాంకులు ఏటీఎంలపైనా ఖాతాదారులపై అనేక రూపాల్లో భారాలను మోపుతున్నాయి. నెలకు ఐదు పర్యాయాలు మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవటానికి లేదా మినీ స్టేట్మెంట్ తీసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాయి. అంతకుమించిన లావాదేవీలపై భారీగా వడ్డన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యూపీఐ లావాదేవీలను ఆశ్రయిస్తున్నారు. వాటి ద్వారానే ఎంతటి నగదు మొత్తానైనా చెల్లింపు చేస్తున్నారు. వాటి ద్వారానే మొత్తం వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వాణిజ్య రాజధానిగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో రానున్న కాలంలో యూపీఐ లావాదేవీలపై వ్యాపారులపై వడ్డన పడనుంది. తద్వారా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాపారులపై యూపీఐ లావాదేవీలకు జరిగే అదనపు చెల్లింపులు భారం కాక తప్పదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ వడ్డింపులు ప్రారంభమవుతాయని ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో వ్యాపారులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు. ● విజయవాడలోని కొత్తపేటకు చెందిన ప్రసాద్బాబు ఉదయం బయటకు వచ్చి పాలప్యాకెట్ తీసుకొని యూపీఐ ద్వారా నగదు చెల్లించాడు. అనంతరం అక్కడి నుంచి టిఫిన్ సెంటర్కు వెళ్లి అక్కడా యూపీఐ ద్వారానే డబ్బులు చెల్లించాడు. మళ్లీ ఇంటి నుంచి తన కార్యాలయానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. తన గమ్యస్థానం వచ్చిన తరువాత ఆటోడ్రైవర్కు సైతం ఇదే విధంగా నగదు చెల్లింపు చేశాడు. అలాగే ఉదయం నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకూ తాను చెల్లించే ప్రతి రూపాయి యుపీఏ ద్వారానే చెల్లింపు చేస్తూ వచ్చాడు. అతనే కాదు కుటుంబ సభ్యులు సైతం ఇదే తరహాలో చెల్లింపులు చేస్తున్నారు. మొత్తం మీద ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి రోజూ కనీసం 10 నుంచి 20 వరకూ యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారుగా 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ కృష్ణాజిల్లాలో 12.5 లక్షల కుటుంబాలు కాగా ఆ సంఖ్య నేడు 15 లక్షలకుపైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా మారాయి. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్దిష్టంగా ఇంతమంది యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లుగా ఎక్కడా అధికారిక గణాంకాలు లేకపోయినా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 43 లక్షల జనాభా ఉన్నారు. అందులో 35 లక్షలకు పైగా యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు అంచనా. వీరందరిపైనా ఈ భారం పడనున్నట్లు ఆయా కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
19 నుంచి ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళా క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తమ అసోసియేషన్ తరఫున ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు నిర్వహిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చెప్పారు. స్థానిక పటమటలోని ఏసీఏ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. శివనాథ్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. ప్రాంచైజీ విధానంలో తొలిసారిగా మహిళల క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు జట్లు.. నాలుగు జట్లు పోటీపడనున్న ఈ లీగ్లో అన్ని మ్యాచ్లను గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఏసీఏ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహిస్తున్నామని, ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. మహిళా క్రికెట్ను యువతకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని మహిళా కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థినులను మ్యాచ్లు జరిగే స్టేడియంకు తీసుకురావడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శివనాథ్ చెప్పారు. విద్యార్థినులను స్టేడియానికి తీసుకొచ్చి, మ్యాచ్ అనంతరం తిరిగి కళాశాలలకు చేర్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 19వ తేదీ శనివారం మధ్యాహ్నం జరిగే తొలి మ్యాచ్కు నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరై లీగ్ను ప్రారంభిస్తారని చెప్పారు. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం.. విద్యార్థినులకు ఉచిత బస్సులు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -
రమా నందన కేసులో అసలేం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్, నందూస్ వరల్డ్ చానల్ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదు. రెండుసార్లు విచారించినా పురోగతి కనిపించలేదు. ఈ నెల 8న తొలిసారి ఇబ్రహీంపట్నం పీఎస్లో విచారణ జరిపారు.నిన్న(మంగళవారం) మరోమారు అర్ధగంట పాటు మాత్రమే విచారణకు రమానందన హాజరయ్యారు. రమానందన నుంచి పోలీసులు వాస్తవాలను రాబట్టలేకపోయారు. తూతూమంత్రంగానే పోలీసులు రమానందనను విచారిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రమా నందన మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.వీసా స్కామ్లో ఈ నెల ఎనిమిదో తేదీన ఆమె విచారణకు హాజరైన సమయంలో ఈ నెల 16న మరో సారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఆమె ఒకరోజు ముందుగానే వచ్చి వెళ్లిపోయింది. ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు ఇబ్రహీంపట్నం వచ్చేందుకు సిద్ధమవడంతో ఒకరోజు ముందుగానే ఆమె హాజరైనట్లు తెలుస్తోంది. మీడియా, బాధితుల కంట పడకుండా పోలీసులు ఆమెకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ‘రమానందన తన భర్తను దాచేసేది’ -
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
సాక్షి, విజయవాడ: నందూస్ స్కామ్ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. వీసా రెన్యువల్తో పాటు ఉద్యోగాల పేరుతోనూ రమానందన దంపతులు భారీ మోసాలకు పాల్పడ్డారు. యూకేలోని 'నందూస్ కిచెన్' స్పాన్సర్షిప్ స్కామ్ వల్ల తమిళనాడుకు చెందిన అన్బరాసన్ శేఖర్ ఉద్యోగం కోల్పోయారు. మూడేళ్లకు డబ్బులు చెల్లిస్తే ఏడాదిలోనే ఉద్యోగం నుంచి అన్బరాసన్ శేఖర్ను రమానందన తీసేసింది.‘‘రమానందన దంపతులు చాలా స్కామ్లు చేశారు. నందూస్ కిచెన్లో నేను ఫ్లోర్ మేనేజర్గా చేశా.. వారి తప్పుల వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయాను’’ అని అన్బరాసన్ శేఖర్ చెబుతున్నారు. ‘‘జీతం సరిగా ఇవ్వకపోవడం వల్ల నా ఉద్యోగం పోయింది. నేను పనిచేసిన సమయంలో నందూస్ కిచెన్కు చాలా మంది బాధితులు డబ్బుల కోసం వచ్చేవారు. ఎవరికంటా పడకుండా రమానందన తన భర్త మధుకర్ను 2-3 గంటలు టాయిలెట్లో దాచేసేది..ఒక్కోసారి రోజంతా బాత్ రూమ్లోనే మధుకర్ దాక్కునేవారు. సరైన పత్రాలు, ఉద్యోగాలు లేక ఇప్పటికీ చాలా మంది యూకేలోనే చిక్కుకుపోయారు. వారంతా ఇండియా రాలేక ఇబ్బంది పడుతున్నారు. వారి స్కామ్ల వల్ల నాలాంటి వారు చాలా మంది తమ జీవితాలను, కలలను, తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు. నాకు రావాల్సిన పెండింగ్ జీతం, పి 45 ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని కోరుతున్నాను. కానీ రమానందన నాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదురమానందన దంపతులు తప్పులు చేసి తాము ఏ తప్పు చేయలేదని తప్పించుకుంటున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాంట్రాక్టు కోసం చేసిన సంతకాలు ఉన్నాయి. వాటిని చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రమానందన దంపతులు ఇతరుల డబ్బుతో జీవిస్తున్నారు. వారు తినే తిండి వేసుకునే బట్టలు అన్నీ ఇతరుల డబ్బుతో వచ్చినవే. ఇప్పటికైనా ఏపీ పోలీసులు మా బాధితుల బాధలను అర్థం చేసుకోవాలి. నా దగ్గరున్న ఆధారాలతో ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్బరాసన్ శేఖర్ తెలిపారు.ఇదీ చదవండి: గుట్టు చప్పుడు కాకుండా విచారణకు.. -
విశ్వేశ్వరయ్యకు ఘన నివాళి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వవిద్యాలయంఉపకులపతి ఆచార్య కె.రాంజీ కేకు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య అనేక రంగాల్లో విశేషంగా రాణించారని కొనియాడారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూని వర్సిటీ ఆయన పేరిట స్థాపించారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎన్.ఉష మాట్లాడుతూ.. దేశా నికే తలమానికమైన వ్యవసాయ, సాగునీటి రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. కృష్ణా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.కె.సుందరకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య ఆర్.కిరణ్కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.బాబురెడ్డి, డాక్టర్ ఆర్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన 44వ అంతర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కృష్ణాజిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సత్తాచాటి 70 పతకాలను సొంతం చేసుకున్నారు. వివిధ క్రీడాంశాలు, పలు విభాగాల్లో 21 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. తమ్ము కస్తూరిబాయి, కె.గీతాంజలి, వలివర్తి నాగమణి, సోమ శేఖర్, కె.ఉమామహేశ్వరి, పి.రామకృష్ణ, పి. జ్యోతిప్రకాశ్, కోటేశ్వరరావు, ఎం.అరుణ, ఎన్. కుముదవతి, ఎస్.పురుషోత్తం స్వర్ణ పతకాలు సాధించారు. తోట యర్రన్న, ఎస్కే మహబూబ్ సుభానీ, టి.జమాల్ బాబు, పి.విజయ సువర్ణ రాజు, పి.మహేష్ బాబు, అప్పారి శివదుర్గా ప్రసాదరావు, వి.నాగేంద్రరావు, యు.లక్ష్మీనారాయణ, ఎల్. నెల్సన్, గోరిపర్తి వెంకట విజయకుమారి, సుంకర మాధవి, కె.జయ కృష్ణ రజత, కాంస్య పతకాలు పొందిన వారిలో ఉన్నారు. పతకాలు పొందిన మాస్టర్స్ క్రీడాకారులను కృష్ణాజిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.జ్యోతి ప్రకాశ్, కార్యదర్శి ఎ. శివ గణేష్ బాబు అభినందించారు. రేపు విశ్వకర్మ జయంతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 17వ తేదీన విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. ప్రెస్క్లబ్లో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి విశ్వబ్రాహ్మణులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, దనాలకోట వాసు, ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి.సాయికిరణ్, జిల్లా అధికార ప్రతినిధి తుంపాల వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కెల్లా శివ, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం సెక్రటరీ వెంకటేశ్వరరావు, జవ్వాది కూర్మాచారి పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్ జరుగు తుందని జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు మంగళవారం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికచేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16న పాఠశాల స్థాయి, 17న మండల స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. మండల విద్యాశాఖ అధికారులు మండల స్థాయి పోటీలు నిర్వహించి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించాలని సూచించారు. సీవీఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు, సెమినార్ జరుగుతాని వెల్లడించారు. ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2027 : ప్రాస్పెక్ట్స్ అండ్ చాలెంజెస్’ అంశంపై సెమినార్ ఉంటుందని తెలిపారు. -
ఓటు హక్కు పరిరక్షణకు ఐక్య కార్యాచరణ
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైన ఓటు హక్కు పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై విజయవాడలోని దాసరి భవన్లో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మి తదితరులు ప్రసంగిస్తూ... ఓట్లు తొల గించే ప్రయత్నాలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు గల్లంతైన అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 42 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి ఓటరూ తన ఓటుహక్కు కోసం పదేపదే తాను అర్హుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితి రావడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కాంగ్రెస్ నాయకులు మస్తాన్వలి, కొలనుకొండ శివాజీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
●కొండపల్లి బొమ్మకొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మలు తరతరాల సాంస్కృతిక వారసత్వం, కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచాయి. దేశానికి వన్నె తెచ్చిన ఎన్నో ప్రాచీన కళలు అంతరించినా 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కొయ్యి బొమ్మలకు హస్తకళాకారులు నేటికీ జీవంపోస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ బొమ్మలు వాస్తవిక దృక్పథాన్ని కలిగిస్తాయి. వివిధ రకాల పండ్ల తొక్కలు, ఆకులతో తయారు చేసే సహజ సిద్ధ రంగులతో ఈ బొమ్మలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. బొమ్మల పరిశ్రమలో కళాకారుల నైపుణ్యం, తయారీ మెటీరియల్, ముడి సరుకు, తదితర అవసరాలకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కొంతమేర సహకారం అందిస్తున్నాయి. ఏటా ఆఫ్లైన్, ఆన్లైన్లో సుమారు రూ.2.50 కోట్ల మేర బొమ్మల వ్యాపారం జరుగుతోంది. బొమ్మల చారిత్రక నేపథ్యం 14వ శతాబ్దంలో కొండపల్లి కోట నిర్మాణానికి పునాది పడింది. 16వ శతాబ్దంలో నిర్మించిన రాజ భవనాలకు నగిషీలు అద్దేందుకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన రాజవంశీకులు కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రాణం పోశారు. బ్రిటీష్ పాలనలో రాజస్థాన్ నుంచి వచ్చిన వారు బొమ్మల తయారీ పరిశ్రమను తమ జీవనోపాధిగా చేసుకున్నారు. కొండపల్లి అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలను కళాత్మకంగా తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల వద్ద పనిచేసిన స్థానికులు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. అనతి కాలంలో బొమ్మల తయారీని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 150 కుటుంబాలు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నైపుణ్యంతో కళాత్మక బొమ్మలు కొండపల్లి కొయ్యి బొమ్మలను హిందూ పురాణాలు, గ్రామీణ నేపథ్యం, జానపద కళల నుంచి ప్రేరణ పొంది తయారు చేస్తారు. దశావతారాలు, సీతారామలక్ష్మణులు, ఏనుగు అంబారీ, విష్ణు మూర్తి, బ్రహ్మదేవుడు, పల్లకిలో పెళ్లికొడుకు, ఎడ్లబండితో రైతు, తలలు ఊపే బొమ్మలతో పాటు మార్కెట్లో ఆదరణ కలిగిన అంశాలను ఎంచుకుని బొమ్మలు తయారు చేస్తారు. అడవుల్లో లభించే తేలికగా ఉండే తెల్లపొనికి చెక్కతో ఎంచుకున్న ఆకృతితో బొమ్మలు చెక్కి వాటికి చింతగింజల పొడి, రంపపు పొట్టు పేస్ట్తో అతికించి సున్నం పూసి ఎండబెడతారు. ఆకర్షణీయంగా రంగులు అద్ది విక్రయాలకు సిద్ధం చేస్తారు. కొండపల్లి బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవాన్ని పురష్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొండపల్లి బొమ్మల వేడుకలు నిర్వహించారు. తెల్లపొనికి కలప కొరత బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్లపొనికి చెట్లు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అంతరించాయి. శతాబ్దాలుగా బొమ్మల తయారీలో వినియోగించడం వల్ల చెట్లు తరిగి పోయాయి. దీంతో బొమ్మల తయారీకి చేతివృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీశాఖ అధికారులు తెల్లపొనికి మొక్కలు పెంచి అడవిలో నాటుతున్నప్పటికి జంతుజాలం సంచారంతో అవి నశిస్తున్నాయి. పొరుగు మండ లాలు తిరువూరు, ఎ.కొండూరు ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలతో తెల్లపొనికి కలప తెచ్చుకోవల్సి వస్తోంది. కొంతమంది మార్కెట్లో లభించే న్యూఉడ్్, కొన్ని రకాలు టేకు కలపతో బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారు. అక్కరకు రాని ఉడ్ బ్యాంక్ సేవలు బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశ ఎక్స్పీరియన్స్ సెంటర్, బొమ్మల ఉత్సవాలు నిర్వహించి ప్రోత్సాహం అందిస్తున్నారు. తెల్లపొనికి కలప కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో కొండపల్లిలో ఉడ్ బ్యాంక్ ఏర్పాటు చేయించారు. అయితే తెల్లపొనికి బదులు బూరుగు, పనస, నల్లమద్ది కలప పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ రకాల కలప తమకు వద్దని, బొమ్మల తయారీకి పనికిరాదని కళాకారులు తేల్చి చెప్పారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా కొండపల్లి బొమ్మ ముంచెత్తుతున్న ప్లాస్టిక్400 ఏళ్లకు పైగా అనేక ఒడిదోడుకులతో నెట్టుకొచ్చిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ భవిష్యత్కు గడ్డుకాలం ఎదురుకానుంది. గతంలో 250 కుటుంబాల వరకు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం 150 కుటుంబాలు మాత్రమే బొమ్మలు తయారు చేస్తున్నాయి. ఇటీవల కలప పంపిణీలో అధికారులు చేపట్టిన సర్వేలో 80 కుటుంబాలు మాత్రమే పూర్తిగా బొమ్మల పరిశ్రమలో ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుత తరం తమ బిడ్డలను చదివించి ఉద్యోగస్తులుగా చూడాలని ఆశపడటం, తెల్లపొనికి చెట్లు అంతరించడం, కూలీల కొరత, మార్కెటింగ్లో పోటీతత్వంతో అనేక మందిలో బొమ్మల తయారీ పరిశ్రమపై ఆసక్తి సన్నగిల్లుతోంది. కళాకారులను ప్రోత్సహించి బొమ్మల పరిశ్రమ అంతరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో ఎన్నో వారసత్వ కళలు అంతరిస్తున్నప్పటికీ కొండ పల్లి బొమ్మలకు ఆద రణ ఉంది. ఈ బొమ్మలు ఆకర్షణీయంగా ఉండాలంటే సహజ సిద్ధ రంగులు వాడాలి. గ్రామీణ వాతావరణం, కుటుంబ నేపథ్యాలతో గతంలో సుమారు 80 రకాల బొమ్మలు తయారు చేసేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య పూర్తిగా తగ్గించారు. ఇటీవల అడవిలో దొరికే ఆకులు, కూరగాయలతో సహజ సిద్ధ రంగుల తయారీలో బొమ్మల కళాకారులకు శిక్షణ ఇచ్చాను. కొంతమందే పాటిస్తున్నారు. దుకాణాలు లేని వారికి ట్రైనింగ్ సెంటర్లో దుకాణాలు ఇస్తే బాగుంటుంది. – రమేష్ రామనాథం, హస్తకళల డిజైనర్ -
కళ్లకు గంతలతో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.సౌమ్యరేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్సీజేఏసీ) ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త శాంతియుత పోరాటంలో భాగంగా మంగళవారం మచిలీప ట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సౌమ్య రేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 30 రోజుల శాంతియుత కార్యాచరణలో భాగంగా విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేసి తొలి దశ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు ఆకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.దయాకర్కు కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. -
వైభవంగా సహస్ర గళ భగవద్గీత పారాయణం
మైలవరం: మైలవరంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర గళ భగవద్గీత పారాయణ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ గణపతి సచ్ఛిదానందస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ప్రోత్సాహంతో కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు వి.బాలాజీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి 800 మంది పారాయణ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానాల వంశపారంపర్య ధర్మకర్త ఎస్వీ నివృతరావు ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మైలవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బయన శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సభ్యులు జాస్తి వెంకటేశ్వరరావు, అలమూరు చంద్రశేఖరరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వినాయకుని దేవాలయం నుంచి శోభాయాత్ర జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైద్య కళాశాలకు ఐద్వా నేత మృతదేహం దానం తిరువూరు: అనారోగ్యంతో మృతిచెందిన మహిళా సంఘ నాయకురాలు మేకల రవికుమారి(56) మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు శనివారం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యకళాశాలకు దానమిచ్చారు. ఈ మేరకు ఆమె భర్త, సీనియర్ న్యాయవాది, సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్ సమ్మతితో వైద్యులు రవికుమారి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, సీపీఎం రాష్ట్ర నాయకులు బీఆర్ తులసీరావు, స్థానిక నాయకులు రవికుమారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు కోర్టు న్యాయమూర్తి సింధూర, పలువురు న్యాయవాదులు రవికుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
అద్దాలు పడి లారీ డ్రైవర్ మృతి
లక్ష్మీపురం(గుంటూరు): భవనంపైకి అద్దాలు చేరవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అద్దాలు పడి లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటనపై శనివారం అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రాణిగారితోటకి చెందిన గుంజి రాజేష్(33) లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు నగరంలోని నాయుడుపేట 2వ లైన్లో నిర్మాణంలో ఉన్న భవనం కోసం అద్దాలు లారీలో తీసుకువచ్చారు. అద్దాలు భవనం పైఅంతస్తుకు చేరవేస్తుండగా తాడు తెగి లారీ డ్రైవర్ రాజేష్పై పడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న భార్య గుంజి జ్యోతి గుంటూరుకు చేరుకుని భర్త మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైంది. అరండల్పేట పోలీసులు ఘటనా ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి అరండల్పేట పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వర్ ఏడిపింఛెన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపటంతో గ్రామ/వార్డు సచివాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల మాటెత్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పెన్షన్లు మంజూరు అంటూ తేదీలను ప్రకటించింది. ఈ నెల ఏడు నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించింది. గడువు తక్కువగా ఉండటంతో అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు సచివాలయాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే సర్వర్ పనిచేయక దరఖాస్తులను అప్లోడ్ చేయడం కష్టంగా మారింది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. లక్ష మంది ఎదురు చూపులు ఎన్టీఆర్ జిల్లాలో సుమారు లక్ష మంది వరకూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరులు 2,29,393 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించటంతో సచివాలయాల వద్ద రద్దీ నెలకొంది. జిల్లాలో 605 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 286 వరకూ సచివాలయాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు ఈ సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆంక్షలతో సతమతం రెండున్నరేళ్లగా కళ్లు కాయలు కాచినట్లుగా ఎదురు చూసిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు లక్ష మంది వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోన్నారు. వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, అడుగుతున్న పత్రాలు అర్హులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుల ధ్రువీకరణతో పాటు ఐటీ, గ్యాస్ బిల్లు, ఇంటి పన్ను రశీదు తదితర పత్రాలు కావాలంటూ సిబ్బంది స్పష్టంచేస్తున్నారు. వితంతువులకు వారి భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ రేషన్కార్డులో అతని పేరు ఉంటే దరఖాస్తు తీసుకోవటం లేదు. ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులో భర్త పేరు ఎలా తొలగించాలి, అవసరమైన పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వితంతువులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్ కాలేదంటూ తిప్పి పంపుతున్నారు. రెండు మూడు రోజుల్లో కొత్త సర్టిఫికెట్లు ఎవరు మంజూరు చేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం ఉత్తుత్తి హడావుడే తప్పా పింఛన్లు మంజూరు చేసే ఉద్దేశం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరాయిస్తున్న సర్వర్ గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను నమోదు చేస్తున్న సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో అటు సిబ్బంది, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ సర్వర్ పని చేయకపోవటంతో దరఖాస్తుదారులను సచివాలయాల్లో కూర్చోపెడుతున్నారు. దానికి తోడు రెండు సార్లు ఓటీపీ చెప్పాల్సి రావటంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావటానికి గంటల సమయం వేచి చూడాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజు మొత్తం మీద పది దరఖాస్తులు కూడా పూర్తికావటం లేదని సిబ్బంది చెబుతున్నారు. దానికి తోడు చాలా మంది పనులు మానుకొని రావటం, ‘సర్వర్ పని చేయటం లేదు రేపు రండి’ అంటూ సచివాలయ సిబ్బంది చెబుతుండటంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ లోపు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవటానికి గడువుగా నిర్ణయించింది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండుగ కావటంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో దరఖాస్తు చేసుకునేవారిలో టెన్షన్ పెరిగింది. సెలవులు ముగిశాక కేవలం రెండు రోజుల గడువే ఉంటుంది. దీనికి తోడు సర్వర్ పనిచేయని నేపథ్యంలో దరఖాస్తులు ఎలా ఆన్లైన్ అవుతాయని అర్హులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఆంక్షలు, సమస్యల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇచ్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రం
పెనమలూరు: సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రమేనని కేంద్ర ప్రభుత్వ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ రామజోగారావు కాశీభట్ల అన్నారు. సిద్ధార్థ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లా మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విద్యార్థులు సంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ విధానం ద్వారా చట్టాల్లో వస్తున్న మార్పులను గమనించాలన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి డాక్టర్ సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ న్యాయ శాస్త్రం ప్రధాన ఉద్దేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రా తృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలు అమలు చేయట మేనన్నారు. ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్వీడీ సిద్ధార్థ లా కాలేజీ సిద్ధార్థ యూనివర్సిటీలో విలీనమైందన్నారు. బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులతో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించామన్నారు. లా స్కూల్ డీన్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు, ప్రో ఉప కులపతి డాక్టర్ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ రవిచంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కృష్ణపట్నం పోర్టులో పీసీఓఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్ కుమార్ శనివారం కృష్ణపట్నం పోర్టుతో పాటు కీలక రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత పోర్టులో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలపై ఆదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్తో సమీక్షించారు. సరుకు రవాణా సమర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఉమ్మడి అభివృద్ధి కార్యాచరణపై చర్చలు జరిపారు. ఇటీవల చేపట్టిన ఆధునికీకరణ పనుల్లో భాగంగా పోర్టు సైలో–లోడింగ్ సదుపాయాలను మెరుగుపర్చడం, అదనంగా ఫీడింగ్ కన్వెయర్ను జోడించడం ద్వారా రెండు సైలోలు ఏకకాలంలో పనిచేసే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఒక్కొక్క నౌకలో లక్ష టన్నులకు పైగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు మెకనైజ్డ్ బెర్త్ను పరిశీలించారు. ఈ మౌలిక సదుపాయాలు, కార్యాచరణ మెరుగుదలతో గత ఆర్థిక సంవత్సరం సాధించిన 22.7 మిలియన్ టన్నులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం పోర్టు సమీపంలోని మనుబోలు, కృష్ణపట్నం, నిడుగుంటపాలెం, రావూర్ రైల్వేస్టేషన్లతో పాటు గూడ్స్ షెడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సరుకు రవాణా కార్యకలాపాల కోసం ఉన్న సౌకర్యాలు, పనుల పురోగతి, సరుకు రవాణ, నిర్వహణను మెరుగుపర్చేందుకు అక్కడి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పీసీఓఎంతో పాటు సినియర్ డీఓఎం ఎ.సురేష్రెడ్డి, డీసీఎం జి.మోహన కృష్ణ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
మార్కాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)లో 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా శనివారం రెండో రోజు లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. బాలుర విభాగం లీగ్ దశలో శ్రీకాకుళం జట్టు గుంటూరు జట్టుపై, ఈస్ట్ గోదావరి జట్టు అనంతపురం జట్టుపై, కృష్ణా జట్టు కడప జట్టుపై విజయం సాధించినట్లు హెచ్ఎం తెలిపారు. విశాఖపట్నం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై, కర్నూలు జట్టు విజయనగరంపై, చిత్తూరు జట్టు తూర్పు గోదావరిపై, నెల్లూరు జట్టు కడప జట్టుపై గెలుపొందాయి. గుంటూరు జట్టు ప్రకాశంపై, అనంతపురం జట్టు కృష్ణాపై, శ్రీకాకుళం జట్టు కర్నూలుపై, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై, గుంటూరు జట్టు కృష్ణాపై, గుంటూరు జట్టు కర్నూలుపై, ఈస్ట్ గోదావరి జట్టు కృష్ణాపై, విశాఖపట్నం జట్టు విజయనగరంపై గెలుపొందాయి. బాలికల విభాగంలో.. శ్రీకాకుళం జట్టు కడపపై, అనంతపురం జట్టు కృష్ణా పై, నెల్లూరు జట్టు పశ్చిమగోదావరిపై, ఈస్ట్ గోదావరి జట్టు కర్నూలుపై, గుంటూరు జట్టు చిత్తూరుపై, విశా ఖపట్నం జట్టు కృష్ణాపై, నెల్లూరు జట్టు విజయనగరంపై, ప్రకాశం జట్టు కడపపై, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై, శ్రీకాకుళం జట్టు చిత్తూరుపై, గుంటూరు జట్టు కర్నూలు జట్టుపై, అనంతపురం విజయనగరంపై, చిత్తూరు జట్టు కడపపై, కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై, గుంటూరు జట్టు ఈస్ట్ గోదావరిపై విజయాన్ని సాధించాయి. ఈ చాంపియన్షిప్ పోటీ లు రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ జట్టు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు మురళి పర్యవేక్షణలో జరిగాయి. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.దామోదర్రెడ్డి తెలిపారు. పీవీ కృష్ణారావు, వై.శీనయ్య, శంకర్, చెంచయ్య నాయుడు, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, కె.ఓబులేసు, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, 13 జిల్లాల క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు -
కార్తికేయుడికి బంగారు నాగపడగ సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి కొడాలి గ్రామానికి చెందిన ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సోదరి తుమ్మల లక్ష్మీసుజాత బంగారు నాగపడగ సమర్పించారు. రూ.30 లక్షలు వెచ్చించి 220 గ్రాముల బంగారంతో నాగపడగ చేయించారు. శనివారం ఉదయం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం దాత లక్ష్మీసుజాత కుమారులు శ్రీనివాస కిరణ్, శివతరుణ్ పేరిట బంగారు నాగపడగను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరావు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ప్రతి రూపాయి వారి సొత్తేనని, దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్వస్తి చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిథి కనినిక ఘోష్ బోస్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టే హక్కు ప్రభుత్వాలకు లేదని, ఇది మోదీ, అమిత్షా సొమ్ము కాదని స్పష్టం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అసమానతలు, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఐద్వా పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, సీనియర్ నాయకులు ఎస్.పుణ్యవతి, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో రూ.600 కోట్లతో యూజీడీ పనులుపటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో రూ.600 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచి, వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపడుతున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ తెలిపారు. నిర్మలా కాన్వెంట్ సిగ్నల్స్ వద్ద జరుగుతున్న ఔట్ఫాల్ డ్రెయిన్ పూడికతీత పనులను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు డ్రెయిన్లలో పూడిక పేరుకు పోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు శనివారం నుంచి 70 యంత్రాలతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. ఈ పర్యటనలో ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఇన్చార్జి కమిషనర్ ఎ.రవీంద్రరావు, వీఎంసీ చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని ఆయా ప్రాంతాల్లో వీఎంసీ కల్పించే మౌలిక వసతుల కల్పనలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమ వారం వినాయక చవితి పర్వదినం సంద ర్భంగా రద్దు చేసినట్లు వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరవాసులు తర్వాత వచ్చే సోమవారం తమ వినతులను అధికారులకు సమర్పించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. -
అన్నప్రసాద భవనం వద్ద గందరగోళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగ ణంలో నిర్మించిన అన్నదాన భవనంలో శనివారం నుంచి భక్తులకు అన్న ప్రసాద పంపిణీ జరిగింది. ఈ భవనం వద్ద క్యూలైన్లు లేకపోవడం, ఉదయం నుంచి భారీ వర్షం పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది మంది మాత్రమే కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అన్నదానం ప్రారంభమైన వెంటనే లోపలకు భక్తులను అనుమతించడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యపడక భవనం తలుపులు మూసేందుకు ప్రయత్నించారు. తోపు లాట సమాచారం అందడంతో ఆలయ ఈఓ శీనానాయక్, ఈఈ రమాదేవి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్టౌన్ సీఐ గుణ రామ్, ఇతర పోలీసులు కూడా వచ్చి నూతన భవనంలో అన్న ప్రసాదం పంపిణీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. అర్ధగంట తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్రోడ్డు మూసివేత శనివారం వేకువ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ఘాట్రోడ్డును మూసేశారు. కొండపైకి వాహనాలను అనుమతించలేదు. దేవస్థానం బస్సులను సైతం నిలిపివేసిన ఆలయ అధికారులు భక్తులను కనకదుర్గనగర్ మీదగా మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం వైపు మళ్లించారు. ప్రసాదాల కౌంటర్, లిఫ్టు వద్ద క్యూ పెరగడటంతో పోలీసులు, ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం నుంచి ఘాట్రోడ్డును తెరిచారు. -
దంచికొట్టిన వాన
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో వాన దంచికొట్టింది. ఏకధాటిగా మూగు గంటలపాటు కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు నీటితో నిండి వాగులను తలపించాయి. రోడ్లపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభా వంతో శనివారం విజయవాడలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలుతో మూడు గంటలపాటు వర్షం పడింది. 70.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి వీధుల నుంచి ప్రధాన రోడ్ల వరకు వాగులను తలపించేలా ఉప్పాంగి ప్రవహించాయి. నడుములోతు నీళ్లు రోడ్లపైకి చేరటంతో నగరవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు.. మరో వైపు విరిగిపడిన చెట్ల కొమ్మలతో ఎక్కడికీ వెళ్లలేని స్థితి నెలకొంది. దీనికితోడు వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ట్రాిఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ రోడ్లలో రాకపోకలంటే నరకమే.. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన బెంజిసర్కిల్ చినుకు పడితే చాలు రోడ్డన్నీ నీటమునిగి ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఎంజీ రోడ్డుకు రెండు వైపులా పశువుల ఆస్పత్రి వరకు నీరు చేరుతోంది. బెంజిసర్కిల్ నుంచి ఎన్టీయార్ సర్కిల్ వరకు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, మొగల్రాజపురం, గాయత్రీ నగర్ లోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఆటోనగర్ గేటు నుంచి ఆటోనగర్ బస్ టెర్మినల్ వరకు కొద్దిపాటి వర్షానికే రోడ్లు నీటమునుగుతున్నాయి. తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్ లోబ్రిడ్జి వరకు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజీవ్గాంధీ పార్కు లోబ్రిడ్జి వరకు నీరు భారీగా చేరుతోంది. మరో వైపు డాబా కొట్లు సెంటర్ నుంచి పాయకాపురం వరకు, కండ్రిక రోడ్డులో నున్న వరకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఆయా రోడ్లలో పాదచారుల నుంచి భారీ వాహనాలు సైతం వర్షం పడితే రాకపోకలు సాగించలేని పరిస్థితి. కానూరు, తాడిగడప వద్ద మచిలీ పట్నం – పూణే జాతీయ రహదారి వెంబడి వర్షపు నీరు చేరటంతో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోతాయి. చైన్నె – కోల్కతా జాతీయ రహదారి 16 కూడా ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రసాదంపాడు నుంచి నిడమానూరు వరకు రోడ్డుపై మొకాళ్లలోతు నీరు చేయటంతో వాహనాలు ముందుకు కదల్లేని స్థితి నెలకొంది. విఫలమైన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ విజయవాడ నగరపాలక సంస్థ వర్షాలను తట్టుకునేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసినప్పటికీ ఫలితం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, వీఎంసీ సాధారణ నిధులు, అమృత్ పథకం ద్వారా వచ్చిన రూ.30 కోట్లుతో ఆయా ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, డ్రెయిన్లలో పూడికతీత, నూతన అవుట్ ఫాల్ డ్రెయిన్ల నిర్మాణం చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అమలుకాకపోవటంతో నగరంలో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. వన్టౌన్ జెండా చెట్టు సెంటర్, నిర్మలా కాన్వెంట్రోడ్డు, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవటంతో రోడ్లపైకి చేరిన వర్షం నీటితో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. శివారు ప్రాంతాలకు కష్టమే నగర శివారులోని అజిత్సింగ్నగర్, డాబాకొట్లు, పాయకాపురం, రాజీవ్నగర్ కండ్రిక, వాంబేకాలనీ, భవానీపురం, విద్యాధరపురం, చిట్టినగర్ ప్రాంతాలతోపాటు పటమట, ఆటోనగర్ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడితే చాలు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కొండ దిగువ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. కొండపై నుంచి వచ్చే వర్షం నీరు రోడ్లపైకి, నివాసాల్లోకి చేర టంతో ఇంటి నుంచి కాలు కూడా బయటకు పెట్టలేని దుస్థితి నెలకొంటోంది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో శనివారం 22.68 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయవాడ సెంట్రల్ మండలంలో 72.3 మిల్లీమీటర్లు వర్షం పడింది. విజయవాడ నార్త్లో 69.7 మిల్లీమీటర్లు, వెస్ట్లో 65.0, ఈస్ట్లో 64.6, తిరువూరులో 37.6, ఇబ్రహీంపట్నంలో 26.4, వత్సవాయిలో 19.5, గంపలగూడెంలో 12.4, వీరులపాడులో 9.2, జి.కొండూరులో 4.0, చందర్లపాడులో 2.3, జగ్గయ్యపేటలో 1.3, నందిగామ, మైలవరంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో ఎప్పుడు వర్షం వచ్చిన రోడ్లపై నిలిచిన నీటిని తోడేండుకు వీఎంసీ ప్రత్యేకంగా మాన్సూన్ రెస్సాన్స్ టీం (ఎంఆర్టీ)ల వ్యవస్థను అమలు చేస్తోంది. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 286 సచివాలయాల ప్రాంతాల్లో అధికంగా నీరు నిలిచే 42 ప్రాంతాలను గుర్తించారు. సచివాలయ సిబ్బంది, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం సమన్వయంతో పనిచేసే ఎంఆర్టీ బృందాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలను, మోటర్లు పెట్టి నీటిని తోడాల్సి ఉంది. అయితే ఈ వ్యవస్థ నిద్రావస్థలో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్లు 30కు పైగా ఏర్పాటు చేశారు. వీఎంసీ సాధారణ నిధులు ఒక్కో ట్యాంకర్కు రోజుకు రూ.3 వేల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ఇన్ని వాహనాలు ఉన్నా నగరంలో రోడ్లన్నీ జలమయం అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి కె.రమేష్బాబు అన్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఏకపక్ష, వివక్షపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం అఖిల భారత సమ్మెను చేపట్టారు. అందులో భాగంగా వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఐదు రోజుల బ్యాంకింగ్ను అమలు చేయడం, ప్రభుత్వ ఏకపక్ష పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకుని, దాని అమలును నిలిపివేయడం వంటివి ప్రధాన డిమాండ్లలో ఉన్నాయన్నారు. సంఘ అధ్యక్షుడు ఎన్.సుబ్బారావు వివిధ సంఘాల నేతలు జగన్మోహన్రావు, ప్రభు కిరణ్, గణేష్, పి.ఆంజనేయులు, కె.రాధాకృష్ణ, వై. శ్రీనివాసరావు, కేవీఎస్ రవికుమార్, బి.వడయవార్లు, సందీప్, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
పార్సిల్.. పరేషాన్!
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో వస్తువులు పార్సిల్ చేయడానికి, డెలివరీ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కౌంటర్ల వద్ద వారు పడిగాపులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్లో మూడు కంప్యూటర్లు ఉండగా.. కేవలం ఒక మహిళా ఆపరేటర్ మాత్రమే పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం వినియోగదారులు వివిధ ప్రాంతాలకు పార్సిళ్లు పంపడానికి బస్టాండ్కు వస్తుంటారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం తమ సహనాన్ని పరీక్షిస్తోందని పలువురు వాపోతున్నారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్లో ఒక ఆపరేటరే ఉండడంతో పార్సిల్ బుకింగ్కు ఎక్కువ సమయం పడుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహణలో.. పండిట్ నెహ్రూ బస్టాండ్లో కార్గో సర్వీసు సెంటర్ను గుంటూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ప్లాట్ ఫాం 58, 59లలో పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. పార్సిల్ డెలివరీ, ఎంకై ్వరీకి బస్టాండ్లోని మినీ థియేటర్ వెనుకవైపు ప్రత్యేక గదులు కేటాయించారు. ఇక్కడి నుంచి రోజువారీ పార్సిళ్లు బుకింగ్ 600 నుంచి 700 వరకు.. వీకెండ్స్లో ఆ సంఖ్య కొంచెం పెరుగుతుంది. అలాగే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్సిళ్లు 2వేల వరకు డెలివరీ ఉంటాయి. అలాగే ట్రాన్షిప్మెంట్(వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తే.. వాటిని మరో ప్రాంతానికి పంపే)పార్సిళ్లు 1000 వరకు ఉంటాయి. కార్గో సర్వీసుల ద్వారా రోజువారీ రూ.లక్షపైనే ఆదాయం వస్తోంది. వచ్చిన దాంట్లో హమాలీలకు వారు చేసే పనిని బట్టి 30 శాతం, నిర్వహణ ఖర్చులు తీసేసి.. మిగిలిన నెట్ అమౌంట్లో కార్గో సర్వీసు నిర్వహిస్తున్న ఏజెన్సీకి 13 శాతం కమిషన్ పోతోంది. మిగిలినది ఆర్టీసీకి జమ అవుతుంది. డోర్ డెలివరీ విధానం నిలిపివేత.. ఆర్టీసీ బస్టాండ్కు పార్సిళ్లను గతంలో డోర్ డెలివరీ చేసే విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం అనుకున్నంత మేర సక్సెస్ కాలేదు. వరుస నష్టాలు రావడంతో ఆర్టీసీ యాజమాన్యం డోర్ డెలివరీ ఆపేసింది. విజయవాడ నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బెంగళూరు, సింధనూరు, గంగావతి, బళ్లారి హోసపేట తదితర ప్రాంతాలకు, చైన్నె నగరం, ఒడిశాలోని పర్లాకిమిడి వరకు పార్సిల్ సర్వీసు ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లోని డెలివరీ కౌంటర్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో కస్టమర్లు బారులు తీరుతున్నారు. డెలివరీ విభాగంలో మూడు కౌంటర్లు ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఒకరు తెలిసిన వాళ్లకు పార్సిల్ ఇచ్చి పంపుతుండగా.. ఒక మహిళా ఆపరేటర్ మాత్రమే అందరికీ పార్సిల్ డెలివరీ కొట్టి ఇస్తున్నారు. దీంతో పార్సిల్ డెలివరీ తీసుకోవడానికి వచ్చిన వేచి ఉండలేక సహనం కోల్పోతున్నారు. పార్సిల్ వెతికి ఇవ్వడానికి టైం పడుతుందని కంప్యూటర్ ఆపరేటర్ చెబుతుండగా.. గంట పాటు వేచి ఉండాల్సి వస్తోందని పలువురు కస్టమర్లు వాపోతున్నారు. బుధవారం సాయంత్రం సైతం బస్టాండ్లోని పార్సిల్.. డెలివరీ కౌంటర్ వద్ద జనం బారులు తీరారు. డెలివరీ కౌంటర్ వద్ద సిబ్బంది ఆలస్యంగా స్పందిస్తుండడంపై కొందరు కస్టమర్లు ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భూంఫట్!
ఫేక్ పత్రాలతో రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన విలువైన భూములు కూటమి పెద్దల సహకారంతో దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. తమకు చెందిన వారి భూమిగా మార్చేందుకు అటు రెవెన్యూ–ఇటు వీఎంసీ పట్టణ ప్రణాళికపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో గద్దలా వాలిన కబ్జా రాయుళ్లు ప్రభుత్వ స్థలం కనబడితే రాత్రికిరాత్రే సర్వే నంబర్లు మార్చేసి తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించేస్తున్నారు. ఇలాంటి ఓ స్థల కబ్జా వ్యవహారమే ఇది. వీఎంసీ రెవెన్యూ విభాగం భాగస్వామ్యం.. ఈ తతంగానికి వీఎంసీ రెవెన్యూ విభాగం పూర్తిస్థాయిలో సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. పాత సర్వే నంబరు ప్రకారం 2025లో మార్చి నుంచి ఆస్తిపన్ను విధించారు. దీని ఆధారంగా తనకు ప్లాను మంజూరు చేయాలని వీఎంసీ ప్రణాళిక విభాగంపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. దీనికి స్థానిక ఎంపీ అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల అభ్యంతరం.. వివేకానంద కాలనీ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్థలం వ్యవహారంపై కాలనీ పెద్దలు పలు మార్లు వీఎంసీ ఉన్నతాధికారులను సంప్రదించారు. 2022 నుంచి స్థలం వ్యవహారంలో కాలనీ వాసులు ఓపెన్సైట్ కోసం పోరాడుతున్నారు. అప్పటికే స్థలంలో రేకుల షెడ్డు వేయటంతో స్థానికులు ప్రభుత్వ పెద్దల దృష్టికి, వీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థలం వీఎంసీదేనని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రణాళిక విభాగం అధికారులను కూడా ఆదేశించారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు భవన నిర్మాణ ప్లాన్ కోసం సంబంధిత వ్యక్తులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరం నడిబొడ్డులో ఉండే పటమట ప్రాంతంలోని లక్ష్మీపతి–అప్పారావు మున్సిపల్ పార్కు పక్కనే 582 గజాల మునిసిపల్ కార్పొరేషన్ ఓపెన్సైట్ ఉంది. దాదాపు 30 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై విజయవాడ కూటమి పెద్దలు కన్నేశారు. ఇంకేముంది.. క్షణాల్లో పత్రాలు సిద్ధం.. ఇదే పత్రాలు పెట్టి బ్యాంకులో రూ. 1.85కోట్లు రుణాన్ని కూడా పొందా రు. దీనిపై గతంలో వీఎంసీ కౌన్సిల్లో కూడా పెద్ద దుమారమే రేగింది. వీఎంసీ స్థలాలకు రక్షణ కరువయ్యిందని, దీన్ని పరిరక్షించాలని తీర్మానం చేసినప్పటికీ వీఎంసీ ఉన్నతాధికారి ఉదాసీనంగా ఉండ టంతో.. పట్టణ ప్రణాళిక విభాగం–రెవె న్యూ విభాగం రూ.లక్షల్లో లంచాలు తీసు కుని ఓపెన్ సైట్ను సైతం ప్రైవేటు స్థలంగా చూపుతూ పన్నులు కూడా వేసేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ. 10కోట్లు కంటే ఎక్కువగా విలువైన ఈ స్థలం వ్యవహారంలో డివిజన్ టీడీపీ స్థాయి నాయకులు, స్థానిక టీడీపీ మాజీ కార్పొరేటర్ నుంచి ఎంపీ వరకు భాగస్వాములుగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పటమట 10వ డివిజన్(ప్రస్తుతం) హైస్కూలు రోడ్డులోని వివేకానంద కాలనీలోని వీఎంసీ ఓపెన్ సైట్ 166/2లో ఉన్న 582 గజాల స్థలాన్ని పటమటకు చెందిన నల్లూరి పున్నమ్మ నుంచి భవానీపురానికి చెందిన మధుపల్లి మోహనగుప్త 1986లో కొనుగోలు చేసినట్లు దస్తావేజులు తయారు చేశారు. మధుపల్లి మోహనగుప్తా నుంచి 2022లో హైదరాబాద్కు చెందిన అరవపల్లి విజయశాంతి, నగిలి ప్రకాష్ రెడ్డి పేరుతో కొనుగోలు చేసినట్లు అదే ఏడాది జనవరిలో పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం 2025లో తాము కొనుగోలు చేసిన స్థలం తాలూక సర్వే నంబరు తప్పుగా పడిందని, సర్వే నంబరు 165/6కు బదులుగా 166/2గా నమోదయ్యిందని దీన్ని సరిచేయాలని విజయవాడ సబ్కలెక్టర్కు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకోగా ఈ ఏదాది జనవరిలో ఈ ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం సర్వే నంబరును సరిచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
దుర్గమ్మ సేవలో కంచర్ల గోపన్న వారసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భక్త రామదాసు(కంచర్ల గోపన్న) వారసులు శుక్రవారం దర్శించుకున్నారు. కంచర్ల గోపన్న పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్ లోని ఐచి–నగోయాలో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరుగనున్న 20వ ఆసియా క్రీడలకు తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న యలమంచిలి శ్రీకాంత్ సాంకేతిక అధికారిగా ఎంపిక అయ్యారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కల అర్జునరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కబడ్డీ క్రీడను ప్రోత్సహించడంలోనూ, అభివృద్ధి చేయడంలోనూ విశేష కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్యతో పాటుగా అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ను అభినందించారు. వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై నిర్వహించిన తనిఖీలపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వివరణ కోరింది. ఈ మేరకు విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 జాయింట్ కమిషనర్లను ఆయా అంశంపై నివేదికలను కోరినట్లు తెలిసింది. సాక్షి దినపత్రిక ‘తనిఖీలకూ ఉందో లెక్క!’ శీర్షికతో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దానిపై ఆ శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించి.. ఎందుకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. దానిపై మూడు డివిజన్ల పరిధుల్లో రెస్టారెంట్లు, హోటల్స్పై ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు? ఎంత జరిమానాలు విధించారు? ఎంత వసూళ్లు జరిగాయనే విషయాలను తెలియజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా 2022 నుంచి ఆయా సంస్థల నుంచి రావాల్సిన బకాయి నాలుగైదు కోట్ల మేర ఉన్నట్లు సమాచారం. -
మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం
ఐద్వా ఆల్ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్ఆటోనగర్(విజయవాడతూర్పు): బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న మనువాద భావజాలం, మహిళా వ్యతిరేక భావజాలం, ద్వేషప్రచారానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్ అన్నారు. శుక్రవారం ఆటోనగర్లోని ప్రయివేట్ రెసిడెన్సీలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనినిగా ఘోష్ బోస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీజేపీకి చెందిన నాయకులు మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా సమస్యను లేవ నెత్తినా, బయటకు వచ్చి పోరాడినా సమాజం మొత్తం నాశనమైపోతుందన్నట్టుగా వారు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోరాటాలు కొనసాగుతాయి.. ఐద్వా ఆలిండియా అధ్యక్షురాలు పీకే శ్రీమతి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఐద్వా ప్యాట్రన్ నాయకురాలు సుభాషిణి ఆలీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విషయంలో కూడా మార్పులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి మాట్లాడుతూ మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలలో 33 శాతం రిజర్వేషన్ విషయంలో పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామన్నారు. -
‘రియల్’ దందాపై కార్పొరేషన్ కొరడా
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో అడ్డగోలుగా వేస్తున్న అక్రమ ‘లే అవుట్ల’పై ఈ నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో వెలువడిన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ అనే కథనానికి కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర స్పందించారు. అక్రమ లే అవుట్లపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టౌన్ప్లానింగ్ టీపీఓ రిజ్వానా, అజిత్సింగ్నగర్ సీఐ చంద్రశేఖర్ సహకారంతో శుక్రవారం న్యూఆర్ఆర్పేటలోని అక్రమ లేఅవుట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు పోసి, ప్లాట్లు వేయడాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని వీఎంసీ కార్యాలయం సమీపంలో పుట్ఫాత్పై అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభించిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వీఎంసీ కటింగ్ వద్ద ఉన్న ఫుట్పాత్పై గురువారం ఉదయం సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన ఒక మగ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని వద్ద పేరు, ఊరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుని ఎడమ చేతిపై దుర్గమ్మ అని, కుడి మోచేతిపై అంజి అని, కుడిచేతి మడమపై డి లవ్ సింబల్తో పచ్చ బొట్లు ఉన్నాయని చెప్పారు. అలాగే ఎడమవైపు బొడ్డు కింద, కుడివైపు నాభి కింద, ఎడమ మోచేతిపై పుట్టుమచ్చలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆరు వేల కోసం నిండు ప్రాణం బలి
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కంచికచర్ల: మండలంలోని పరిటాల సమీపంలో హెచ్పీ పెట్రోలు బంక్లో చోటు చేసుకున్న దోపిడీ, బంక్ ఉద్యోగి ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన సయ్యద్ ఆరీఫ్(30) హత్యకు కారణమైన ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కంచికచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం విజయవాడ రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ సీఐ వైవీఎల్ నాయుడుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఏం జరిగిందంటే.. మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామంలో ఓ వ్యక్తి తన కారును ఇంటి ముందు ఉంచి రాత్రి సమయంలో నిద్రపోయాడు. ఆ కారు నంబర్ను తీసుకున్న నిందితులు.. వారు ఉపయోగించిన కారుకు దానిని పెట్టుకొని కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని హెచ్పీ పెట్రోలు బంకుకు వచ్చారు. తమకు అత్యవసరంగా నగదు అవసరం ఉందని, ఫోన్పే చేస్తాం డబ్బులు కావాలని ప్రాథేయపడటంతో బంకులో పనిచేసే ఆరీఫ్(30) నగదును లెక్కిస్తుండగా.. ఆ నగదును లాక్కొని కారు వేగంగా పోనిచ్చారు. కారును ఆపే ప్రయత్నం చేసిన ఆరిఫ్.. ఈక్రమంలో రోడ్డుపై పడిపోవడం.. కారు అతనిని 150 మీటర్ల వరకు లాక్కెళ్లటంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. 48 గంటల్లోనే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బందాలుగా ఏర్పడి, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో 48 గంటల్లోనే కేసును ఛేదించారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ వెస్ట్ బైపాస్ అండర్ పాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పీఓఎస్ మిషన్తో పాటు దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీరే.. నిందితుల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్రిస్టియన్పేటకు చెందిన గుజ్జర్లపూడి మహేష్(గతంలో గొర్రెల దొంగతనంపై మూడు కేసులున్నాయి), నరసారావుపేటకు చెందిన చుండి మనోజ్కుమార్, కామసాని ఆదిత్య, కూడిపూడి అరవింద్, పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన మంద రోహిత్, సత్తెనపల్లికి చెందిన మైనర్ బాలుడు(ఈ మైనర్పై గొర్రెల దొంగతనంపై మూడు కేసులున్నాయి)లను అదుపులోకి తీసుకొని విలేకరుల ఎదుట హాజరు పర్చారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన రూరల్ సీఐ వైవీఎల్నాయుడు, కంచికచర్ల ఎస్ఐలు పి. విశ్వనాథ్, జి. నానినరేందర్, వీరులపాడు ఎస్ఐ అభిమన్యు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన డీసీపీ, నగదు రివార్డులు అందజేశారు. -
మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ
డీఎస్ఎంఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మనువాద, మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తోందని డీఎస్ఎఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ విమర్శించారు. కుల, లింగ వివక్షలను కొనసాగించడమే బీజేపీ పాలన అజెండాగా ఉందన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని పూలే అంబేడ్కర్ భవన్లో కేవీపీఎస్, అంబేడ్కర్ పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘కులం, మతం, సామాజిక న్యాయం’ అంశంపై కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన గురువారం సెమినార్ జరిగింది. సుభాషిణి ఆలీ మాట్లాడుతూ.. ఆర్థిక సమానత్వం లేకుండా సామాజిక న్యాయం, లింగ సమానత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దళితులకు భూమి, ఇళ్లు, సామాజిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం, డి.రమాదేవి, నల్లప్ప, జి.క్రాంతి కుమార్, ఎం.డి.ఆనంద్ బాబు, బి.రఘురామ్, కె.క్రాంతి బాబు, తిరుపాల్, జి.రంగమ్మ, చీకటి రాజేష్, చింతల శ్రీనివాస్, టి.వెంకటేష్, ప్రాన్సిస్, చిరంజీవి, రమణ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి తాపీ మేసీ్త్ర మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణలంక, రణదీవె నగర్ కట్ట ప్రాంతానికి చెందిన బలుగూరి దుర్గారావు(43) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఖాళీ సమయంలో అప్పుడప్పుడు కృష్ణానదికి చేపల వేటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పద్మావతి ఘాట్ వద్ద చేపలు పట్టడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఉదయం 10.30 గంటల సమయంలో పద్మావతి ఘాట్ రైల్వే బ్రిడ్జి పిల్లర్ నంబర్–1 వద్ద చేపలు పడుతుండగా దుర్గారావు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించిన తోటి మత్స్యకారులు మృతుని సోదరుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించగా వెంటనే మృతుని కుమారుడైన వెంకటేశ్వరరావుకు ఫోన్ ద్వారా విషయం తెలిపాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పద్మావతి ఘాట్ వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అపహరించిన సొత్తు స్వాధీనం జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాల గ్రామంలోని భవానీ ముక్తేశ్వేర స్వామి వారి దత్తత ఆలయం చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవార్లకు చెందిన 6.5 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగాం చోరీ చేశారన్నారు. సోమవారం జిల్లా ఏసీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంతో.. ఆలయంలో చోరీ జరగటానికి ముందు నంబర్ ప్లేట్ లేని కారు ఆలయం చుట్టు పక్కల సంచరించగా, ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి వచ్చి రెక్కీ చేసినట్లు సీసీ ఫుటేజీలలో గుర్తించామని తెలిపారు. దీంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల కోటయ్య అలియాస్ కోటేశ్వరరావు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన అల్లుడు కావటంతో తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లోని ఆలయాల పూర్తి సమాచారం సేకరించి పాత నేరస్తులు నాగర్కర్నూలు జిల్లా తిమ్మయ్యపల్లికి చెందిన డేరంగుల మల్లేష్, ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలానికి చెందిన కారం సాంబయ్యలతో కలిసి ఆలయంలోకి వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు కోదాడ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించి, వారి వద్ద నుంచి రూ. 15లక్షల విలువ చేసే పూర్తి చోరీ సొత్తు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. అనంతరం చోరీ కేసును ఛేదించిన జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ఎస్ఐలు రాజు, తోట సూర్య శ్రీనివాస్, శంకర్, మణికంఠ, అర్జున్లతో పాటు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
మహాగణపతికి 630 కేజీల బందరు లడ్డూ
మచిలీపట్నంటౌన్: మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్టించే 63 అడుగుల మహాగణపతికి ప్రసాదంగా 630 కిలోల భారీ లడ్డూ తయారు చేస్తున్నట్లు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌర వెంకటేశ్వర్లు తెలిపారు. ఈడేపల్లిలోని మల్లయ్య స్వీట్స్ తయారీ కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి కోరిన మేరకు ఈ భారీ బందరు లడ్డూను అత్యంత భక్తిశ్రద్ధలతో, నాణ్యమైన పదార్థాలతో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ లడ్డూ తయారీకి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. లడ్డూను ఉంచేందుకు ఇత్తడి రేకుతో ప్రత్యేక పాత్ర, తరలించేందుకు ప్రత్యేక ట్రాలీని తయారు చేశామన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నెల 12వ తేదీన వివిధ కోర్టులలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు బకాయిలు చెల్లించాలని సంస్థ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఇప్పటికే క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులకు న్యాయసేవాధికార సంస్థల ద్వారా నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు అందుకున్న వారు కోర్టుకి హాజరుకాకుండా ముందుగానే బకాయిలు చెల్లించొచ్చని తెలిపారు. ఈ సదావకాశాన్ని క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 11వ తేదీలోపు వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించుకోవటంతో పాటు సమస్య పూర్వాపరాలు పరిశీలించిన మీదట తగిన రాయితీ పొందొచ్చని తెలి పారు. మరింత సమాచారం కోసం 0866– 2444420, 0866 –2444588, 83338 98997, 94911 19556 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 120 సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఆర్.జి.జయసూర్య ఈ వివరాలు వెల్ల డించారు. విజయవాడ సబ్ డివిజన్లయిన విజయవాడ, ఏలూరు, గుడివాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024–2026 మధ్య కాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్ఐ ఎం.షరీఫ్, సిబ్బంది జి.ఎ.నర్సయ్య, షేక్ సూరుద్దీన్, ఎం.భాస్కర్, రాంబాబు, ఐటీ కోర్ బృంద సభ్యులు పి.శివాజి గణేష్, ఎన్. హర్షవర్ధన్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సుమారు రూ. 25 లక్షల విలువైన 120 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. వాటిని చట్టపరమైన ప్రక్రియను పూర్తిచేసి పోగొట్టుకున్న వారికి అప్పగిస్తామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం.అశోక్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతేఅలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): చెఫ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్.కె, ఉపాధ్యక్షుడు రామకృష్ణరాజు, జనరల్ సెక్రటరీ యాదగిరి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కంటే, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అమరావతి రీజియన్కు నూతన కమిటీని ఎంపిక చేశారు. -
స్వప్రయోజనాలే ‘గురి’!
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి, పతకాలు సాధించేలా చేయాల్సిన క్రీడా సంఘాలు వారి సొంత ప్రయోజనాల కోసం క్రీడాకారులతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు కూటమి ప్రభుత్వంలో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారం కాస్త శృతి మించిందంటూ షూటర్లు వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే రెండు రాష్ట్రాల్లోని షూటర్లు వివిధ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్కు హాజరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన అసోసియేషన్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్కే షూటర్లు వారి ఫీజులన్నీ(కాంపిటేషన్, మేనేజర్, మెంబర్షిప్ ఫీజులు) జమ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మే నుంచి అకౌంట్ నంబరుతో పాటుగా రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ‘ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా మారింది. ఈ విధంగా అకస్మాత్తుగా అసోసియేషన్ పేరు మార్చడంలో ఉన్న మతలబు ఏమిటనేది అసోసియేషన్లో ఉన్న సభ్యులకు సైతం అంతపట్టడం లేదు. పేరు మార్పుపై సభ్యులు అడిగితే స్పెల్లింగ్ మిస్టేక్ అని, పొర పాటున పడిందంటూ సంఘం నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సభ్యులు చెప్పారు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని బ్యాలె న్స్ జీరో అయినట్లుగా ఆన్లైన్లో చూపిస్తోందని కొంత మంది సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరపాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న శాప్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024లోనే శాప్ దగ్గర రెన్యూవల్ చేయించుకోవాలి. అయితే రెన్యూవల్ చేసుకోకుండానే రెండు రాష్ట్రాల నుంచి టోర్నమెంట్కు షూటర్లను పంపుతున్నా.. శాప్ ఏవిధమైన స్పందన లేకుండా చోద్యం చూస్తోంది. అదేమంటే క్రీడా సంఘాలు అన్ని తమ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ను తమకు సమర్పించి రెన్యూవల్ చేసుకోవాలని కేవలం పేపర్ ప్రకటనలు జారీ చేసి మిన్నకున్నారు. అసలు ఎన్ని క్రీడాసంఘాలకు గుర్తింపు ఉందనే పూర్తి సమాచారం ఇప్పటి వరకు శాప్ దగ్గర లేదంటే వారు పనితీరును అర్థం చేసుకోవచ్చు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన విషయం కూడా శాప్ దృష్టిలో లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఈ సంఘానికి గుర్తింపు లేదని సమాచారం. నాయకులంతా తెలంగాణలోనే.. ది రైపిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఇటీవలే తాడేపల్లిలోని ఒక క్లబ్లో జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక చాలా గోప్యంగా జరిగింది. ఈ సమావేశానికి అబ్జర్వర్ను పంపాలని శాప్కు అసోసియేషన్ నాయకులు లేఖను ఈ–మెయిల్ ద్వారా పంపారు. మీ అసోసియేషన్ పూర్తి వివరాలను పంపితే, వాటిని పరిశీలించి అప్పుడు చూస్తామంటూ శాప్ నుంచి రిప్లయ్ వచ్చింది. తీరా శాప్ నుంచి అబ్జర్వర్ లేకుండానే ఎన్నిక ప్రక్రియను అసోసియేషన్ సభ్యులు పూర్తి చేశారు. ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధితో పాటుగా తెలంగాణకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యుడిని ఈ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించి, వారి సమక్షంలో ఎన్నిక ప్రక్రియను ముగించారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి.లలిత్ను అధ్యక్షుడిగా, కార్యదర్శిగా రాజ్కుమార్ను ఎన్నుకున్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. మరి ఆంధ్రప్రదేశ్లోని షూటర్లు, కోచ్లు ట్రైనింగ్ క్యాంపుల గురించి, వారికి ఏమైనా సందేహాలు, ఇబ్బందుల గురించి అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా అంటూ క్రీడాకారులు, కోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఈట్స్ట్రీట్లో ఉన్న వెంకటేశ్వర గన్హౌస్లో జూన్ 17వ తేదీన గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో.. గుంటూరు జిల్లాకు చెందిన విజయహర్ష అనే వ్యక్తి నకిలీ అస్పైరింగ్ సర్టిఫికెట్లతో గన్లను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని వద్ద మూడు గన్లు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే అసలు విజయహర్షకు ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? దీనిలో అసోసియేషన్లోని సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? ఇలా ఎంత మందికి ఈ విధంగా అస్పైరింగ్ సర్టిఫికెట్లు ఇప్పించాడు? అనే విషయాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఇంత పెద్ద ఘటనపై అసోసియేషన్ కాని, శాప్ కాని, ఒలింపిక్ అసోసియేషన్ గాని స్పందించలేదు. నకిలీ సర్టిఫికెట్లు చూపించి విజయహర్ష తిరుపతిలో శాప్లో షూటింగ్ కోచ్గా జాయిన్ అయినా విచారణ జరపలేదు. -
నీళ్లున్నా.. కన్నీళ్లే..!
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా బెట్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. జలాలతో కళకళలాడాల్సిన చెరువులు వానలు లేక, ఎత్తిపోతల పథకాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సాగు చేసిన వరిపైరు నీరు లేక ఎండుముఖం పడుతోంది. పట్టిసీమ జలాలు అందుబాటులో ఉన్నా, ఎత్తిపోతల పథకాలను అధికార పార్టీ నిర్వీర్యం చేసింది. వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో ఉన్న 542 సాగునీటి చెరువుల్లో 90 శాతం చెరువులు ఎండిపోవడంతో పాటు వాగుల్లో నీరు అందుబాటులో ఉన్న చోట్ల ఎత్తిపోతల పథకాలు పని చేయక మాగాణి భూములు బీడు బారుతున్నాయి. నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు జి.కొండూరు మండలంలో హెచ్.ముత్యాలంపాడు గ్రామ పరిధిలోని 15.36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, 11.95 ఎకరాల అక్కుల చెరువు, 3.81 ఎకరాల కురివిడి చెరువుకు నీరు నింపేందుకు ఇదే గ్రామం వద్ద బుడమేరుపై రూ.51.48 లక్షలతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఇక్కడే రూ.190 లక్షలతో ఆత్కూరు గ్రామం 58.35 ఎకరాల ఊర చెరువు, 33 ఎకరాల కురివిడి చెరువు, 16.80 ఎకరాల సావరాల చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 125.32 ఎకరాల వెల్లటూరు బంధు చెరువును నింపేందుకు పోలవరం కుడికాలువపై వెలగలేరు వద్ద రూ.109.10 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడే రూ.40.57 లక్షలతో చేగిరెడ్డిపాడులో 67.53 ఎకరాల వీరయ్య చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నీళ్లున్నా ఎత్తిపోయక.. జూలై ఎనిమిదో తేదీన పట్టిసీమ ఎత్తపోతల నుంచి పోలవరం కుడి కాలువలోకి నీరు విడుదలవగా అదే నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలోకి జలాలు ప్రవేశించాయి. పోలవరం కుడి కాలువ మీద ఉన్న వెల్లటూరు, చేగిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయక నీటిని తోడి చెరువులను నింపలేదు. దీంతో ఈ చెరువుల కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చెరువుల కింద ఇప్పటికే వెద పద్ధతిలో సాగుచేస్తున్న వరిపైరు సైతం నీటి తడి అందక ఎండుముఖం పట్టింది. హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు పోలవరం కుడి కాలువలో ప్రవహిస్తున్న పట్టిసీమ నీరు ఎగదన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఆ రెండు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపం కారణంగా చెరువులు వెలవెలబోతున్నాయి. ఆత్కూరు సావరాల చెరువు కింద ఇప్పటికే సాగు చేపట్టిన రైతులు నీరు లేక లబోదిబోమంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ నాయ కులు, పైరు ఎండుతున్నా మోటార్లను ఆడించకుండా వేధించడం వల్లే పొలాలు నెర్రెబారుతున్నాయని రైతులు వాపోతు న్నారు. చెరువులో ఉన్న నీరు తూముల్లోకి రాకపోవడంతో ఇంజిన్లతో నీటిని సరఫరా చేసుకొని పైరును బతికిస్తున్నారు. వీటీపీఎస్ బ్యాక్ వాటర్తో నడిచే తారకరామా ఎత్తిపోతల పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఈ పథకంలోని కుడికాలువ కింద 4,820 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. -
ఒడిశా నుంచి గంజాయి రవాణా
ముగ్గురు యువకులు అరెస్ట్చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు చేసి వారి నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ గుణ్ణం రామకృష్ణ పేర్కొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడారు. ఇస్లాంపేటలోని దళాయి వారి వీధిలో పాడుపడిన బిల్డింగ్ వద్ద ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిపై పోలీసులకు సమాచారం రావడంతో సీఐ, ఇతర పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ అస్ఘర్(21), ఆటోనగర్లో పని చేసే షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్(20)కు, రామరాజ్యనగర్కు చెందిన ఆటోడ్రైవర్ కట్టా ప్రసాద్లకు పరిచయం ఉంది. కట్టా ప్రసాద్ భవానీపురంలో 2020లో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న కేసులో నిందితుడు. ఈ క్రమంలో ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. రైలులో ఒడిశాలోని రాయగడకు వెళ్లి మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత వినియోగించుకున్న తర్వాత మిగిలిన దానిని పంచుకునేందుకు పాడుబడ్డ బిల్డింగ్ వద్దకు వచ్చారు. అక్కడ అనుమానాస్పదంగా పోలీసుల కంట పడటంతో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట సీఐ కొండలరావు, స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్పై కారు దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్పై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. సమయానికి వెనకాల వస్తున్న వాహనదారుడు అప్రమత్తం చేయడంతో మెకానిక్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సేకరించిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఒక వ్యక్తి తన కారును రిపేర్ నిమిత్తం మహానాడు రోడ్డులోని అంబికా డీజిల్ వర్క్స్ మెకానిక్ షాప్నకు ఇచ్చాడు. రిపేర్ పనులు పూర్తయిన తర్వాత కారును మెకానిక్ గుడిసె అభినవ్ టెస్ట్ డ్రైవ్కు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా మంటలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో స్క్రూబ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకుని షాపునకు వెళ్లే క్రమంలో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కి జ్యోతి కన్వెన్షన్ ఎదురుకు చేరుకోగానే కారు వెనుక భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దానిని గమనించిన ఒక ద్విచక్ర వాహనదారుడు కేకలు వేసి డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. వెంటనే డ్రైవర్ కారును ఫ్లైఓవర్పై ఆపి బయటకు దిగిపోయాడు. అతను దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారును నడుపుతున్న మెకానిక్ సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో సంభవించిన సాంకేతిక లోపం లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్యల నివా రణపై అవగాహన కల్పిస్తూ విజయవాడలో గురువారం ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మెంటల్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం భారీ వర్షం పడింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 40 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం పడటంతో పలు రోడ్లు నీటమునిగాయి.కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. ఈ సీజన్లో 3,28,072 ఎకరాల్లో వరి సాగు చేశారని, 9,84,216 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యని తెలిపారు. కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,461, సాధారణ రకం రూ.2,441గా నిర్ణయించారని పేర్కొన్నారు. ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించేందుకు 312 రైతు సేవా కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పౌర సరఫరాల సిబ్బంది రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు వాట్సాప్ నంబరు 73373 59375కు హాయ్ మెసేజ్ పెడితే నేరుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు కావాల్సిన షెడ్యూలు బుకింగ్ జరుగుతుందని, ఈ అంశంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించిన వివరాలను ధాన్యం కొనుగోలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం రవాణా చేసేందుకు గోనెసంచులు, జీపీఎస్తో అనుసంధానం చేసిన వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు కావాల్సిన బ్యాంకు గ్యారెంటీలను అక్టోబర్ 15వ తేదీలోపు సమ ర్పించాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సిబ్బందికి మండలాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ (నంబరు 82476 93551) ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు అప్పగించి ధాన్యం కొనుగోలులో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ టి.శివరామప్రసాద్, సివిల్ సప్లయీస్ డీఎం వరలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జ్యోతిరమణి, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: రెండేళ్ల క్రితం బుడమేరు సృష్టించిన బీభత్సం ఇంకా విజయవాడ ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఆ విలయంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యు వాత పడగా.. వేల మంది సర్వం కోల్పోయారు. ప్రజలను ఆదుకోవడంలో, ముందస్తుగా బుడమేరు వరద హెచ్చరికలను జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విపత్తు సంభవించిన అనంతరం బుడమేరును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. ఆపరేషన్ బుడమేరు కాగితాలకే పరిమితమైంది. దుఃఖదాయనిగా బుడమేరు వాగు ఆక్రమణలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బుడమేరు సహజ ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోయింది. ఒకప్పుడు వర్షపు నీటిని పంటపొలాలకు అందించడంతోపాటు సులభంగా కొల్లేరుకు తరలించిన బుడ మేరు ఇప్పుడు భారీ వర్షం కురిస్తే ప్రజల గుండెల్లో భయం పుట్టిస్తూ దుఃఖదాయనిగా మారింది. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు సుమారు 40 గ్రామాల పరిధిలో 42 కిలోమీటర్ల మేర బుడమేరు పరీవాహక ప్రాంతం ఉంది. విజయవాడలో ఈ వాగు వెడల్పు ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 అడుగుల వరకు ఉండేది. ఆక్రమణల కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కిపోయింది. ఒక్క విజయవాడ పరిధిలోనే 380 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అంచనా. 2024 ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్ చానల్కు పలు ప్రాంతాల్లో గండ్లు పడటంతో విజయవాడ నగరం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరద ముంపును చవిచూసింది. 2,400 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న చోట ఏకంగా 33 వేల క్యూసెక్కుల వరద రావడం, ప్రభుత్వం సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోవడం, డైవర్షన్ కెనాల్కు గండ్లు పడడం, చివరి క్షణాల్లో వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తివేయడంతో విజయవాడలోని 32 డివిజన్లలో సుమారు 2.62 లక్షల మంది ప్రజలు వరద ముంపులో చిక్కి విలవిల్లాడారు. డీపీఆర్ తయారీకే పరిమితం బుడమేరులో ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం స్థలం కేటాయించడం, లేనిపక్షంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం, కాలువ గట్లను పటిష్టం చేయడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం వంటి పనులు చేపట్టేందుకు రూ.5,222 కోట్లతో ప్రభుత్వం డీపీఆర్ రూపొందించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్ల తర్వాత కూడా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. బలహీనమైన గట్లు, 2,400 క్యూసెక్కుల సామర్థ్యంతో 70 ఏళ్ల క్రితం నిర్మించిన వెలగలేరు రెగ్యులేటర్, గండిపడిన ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తికాని పనులే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి బుడమేరుకు వరద వస్తే నష్టం మరింత భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్లో బుడమేరు ఆక్రమణలకు గురికాకుండా చూడటం, విజయవాడ నగరంతోపాటు ఎ.కొండూరు నుంచి కొల్లేరు వరకు పరీవాహక ప్రాంత గ్రామాలు, రైతులు, ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2024లో బుడమేరుకు భారీ వరద వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.5,222 కోట్లతో ఆపరేషన్ బుడమేరు అంటూ ప్రకటించింది. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేపట్టి వదిలేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరులో కలిసే వరకు బుడమేరులో ఆక్రమణలను తొల గించాలి. డైవర్షన్ కెనాల్ సామర్థ్యం పెంచాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే మరో సారి బుడమేరు ఉపద్రవం తప్పదు. – పటాపంచల జమలయ్య, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి బుడమేరుకు 2024 ఆగస్టులో వచ్చిన వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆ తరువాత పనులు చేపట్టకుండా వదిలేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువన విజయవాడ రూరల్ ప్రాంతంలో బుడమేరు కనుమరుగైంది. ఆక్రమణలు తొలగించి వాగును పునరుద్ధరించకపోతే భవిష్యత్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. – బొర్రా నరేంద్రబాబు, రైతు, కవులూరు గ్రామం, జి.కొండూరు మండలం బుడమేరుకు వరద రాకముందు వరకు ఎకరం భూమి ధర రోడ్డు పక్కన అయితే రూ.1.5 కోట్లు, లోపల అయితే రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలికేది. ప్రస్తుతం కొనేవారే లేరు. బుడమేరు వరద వల్ల నేను ఆరు ఎకరాల్లో వరి పంట నష్టపోయాను. బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే రైతులు ధైర్యంగా సాగు చేయగలుగుతారు. – దొడ్డా విష్ణువర్ధన్రావు, రైతు, ఆత్కూరు, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది. బుడమేరు డైవర్షన్ చానల్ ప్రస్తుత సామర్థ్యం సుమారు 15 వేల క్యూసెక్కులు. దీనిని 37,555 క్యూసెక్కులకు పెంచాలనే ప్రతిపాదన వచ్చినా అమలుకు నోచలేదు. 1964లో నిర్మించిన వెలగ లేరు రెగ్యులేటర్ను ఆ తర్వాత ఆధునికీకరించలేదు. అవసరమైన చోట రిటైనింగ్ వాల్స్ నిర్మించడం, బుడమేరు ప్రవాహాన్ని విజయవాడకు దూరంగా మళ్లించేందుకు కొత్తగా కాలువ తవ్వకం, బలహీనమైన గట్లను పటిష్టం చేయడం వంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన తర్వాత కూడా వాటిలో చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. సింగ్నగర్ వంతెన సమీపంలో ఆక్రమణలు ప్రమాదకర స్థాయికి చేరాయి. కాలువలో సగం వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. సుమారు 3,051 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంచనా. న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరును పూడ్చి చిన్న రేకుల ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు నిర్మించారు. నగరంలో బుడమేరును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తుంటే, గ్రామాల్లో ఆక్ర మించి సాగు భూమిగా మారుస్తున్నారు. వీటి వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. విజయవాడ పరిధిలో ఏడు నుంచి పది వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉంటేనే భారీ వర్షాల సమయంలో ముంపు ముప్పు ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
నాణ్యమైన విద్యుత్, నిరంతర సరఫరానే లక్ష్యం
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయం సరఫరా చేయడమే లక్ష్యంగా సంస్థలోని సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి. పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకురావాలని, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముంద స్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. వేగంగా డిజిటలైజేషన్.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచు కుని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 నంబరు ద్వారా సేవలను సమర్థంగా అందిస్తున్నామని సీఎండీ చెప్పారు. నూతన విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను కూడా 1912 ద్వారా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏపీసీపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ యు.హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు విశ్వేశ్వర ప్రసాద్, రాజమోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో వార్డు సచివాలయ ఉద్యోగి
● రూ.7 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ● గతంలోనూ ఆ ఉద్యోగిది అదేతీరు పటమట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో పేరు చేర్చేందుకు, తనకు సంబంధం లేని డిపార్ట్ మెంట్లోకి కూడా చొరబడి లబ్ధిదారుల నుంచి డబ్బులు దండుకోవటం ఆ సచివాలయ ఉద్యోగి ప్రత్యేకత. అయితే ఈ ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో అర్హతా ప్రమాణాలను పరిశీలించి వారికి పథకం వర్తింప చేయటానికి ఓ సచివాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. పటమట రామలింగేశ్వరనగర్కు చెందిన పాండ్రాజు దుర్గారావు ఫీజు రీయింర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తును పరిశీలించాలని వార్డు సచివాలయ సెక్రటరీ సాంబశివరావును పదేపదే కోరినా పట్టించుకోలేదు. రూ.20 వేల లంచం ఇస్తేనే చేస్తానని కరాఖండీగా చెప్పటంతో దుర్గారావు అతనితో బేరం మాట్లాడుకుని రూ.7 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దుర్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం ఏసీబీ ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు, అదనపు ఎస్పీ కె.శ్రవంతిరాయ్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిఘా పెట్టి బాధితుడు లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా సాంబశివరావును పట్టుకున్నారు. ఫైళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుంచీ అదేతీరు.. సచివాలయ వార్డు సంక్షేమ సెక్రటరీ సాంబశివరావుకు తొలుత రాజరాజేశ్వరిపేట వార్డు సచివాలయంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ టిడ్కో ఇళ్ల వ్యవ హారంలో లబ్ధిదారులు కానివారికి ఇళ్లను ఇప్పిస్తా మని లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు తెలియటంతో అక్కడి నుంచి సర్కిల్–3 పరిధిలోని 17వ డివిజన్కు బదిలీ చేశారు. అక్కడ కృష్ణా రివర్ రిటైనింగ్వాల్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించే క్రమంలో స్థానికులను లబ్ధిదారులుగా చేర్చాలంటే భారీ మొత్తంలో డిమాండ్ చేసి వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియటంతో అతడిని అక్కడి నుంచి రామలింగేశ్వరనగర్ సచివాలయానికి బదిలీ చేశారు. ఇటీవలే ఓ తండ్రీ కొడుకుల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ధ్రువీకరణకు రూ.10 వేలు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరా ళాలు సమర్పించారు. తాడిగడప రామానగర్కు చెందిన చిగురుపాటి శ్రీనివాసరావు, సాయిమిత్ర దంపతులు అమ్మవారి అన్నదానానికి రూ.1,01,111 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన శరధి వల్లభజోష్యుల రూ.లక్ష విరాళం సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెదిన పి.నాగఆదిత్య రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు, మధు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
నిండు ప్రాణం!
క్షణికావేశం.. ఆత్మహత్యల నివారణకు అవగాహనే మార్గంలబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్య గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి నిజంగా జీవితాన్ని ముగించాలనుకోడు. చాలాసార్లు వారు తమ బాధను, నిస్సహాయతను, ఒంటరితనాన్ని ముగించాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎదుటి వారు వారికి తీర్పు చెప్పడం కాదు.. అర్థం చేసుకోవడం అవసరం. ఒక మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ‘ఏం జరిగింది?’ కంటే ‘నీకు ఎలా అనిపిస్తోంది?’ అని అడగాలి. ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. అది కుటుంబాన్ని, స్నేహితులను, సమాజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక మానసిక ఆరోగ్య సమస్య. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబరు 10వ తేదీని ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రజల్లో ఆత్మహత్యను ఎదుర్కోవడంపై అన్ని వర్గాల్లో అవగాహన పెంచుతున్నారు. పెరుగుతున్న ఆత్మహత్యలు.. ఇటీవల కాలంలో విద్యార్థులు, వ్యాపారులు, గృహిణిలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రమైన ఒత్తిడి, నిరాదారణకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాం. ఏటా ఉమ్మడి జిల్లాలో 200మందికి పైగా వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగా గుర్తించవచ్చు.. ఆత్మహత్య ఆలోచన చేసే వారిని ముందుగా గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు అకస్మాత్తుగా మౌనంగా మారడం, అందరినీ దూరం పెట్టడం.. నాకు ఇక ఏమీ అవసరం లేదు.. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. నేను లేకపోతే అందరికీ మంచిది.. వంటి మాటలు మాట్లాడటం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం వంటి సంకేతాలను చూపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అలా ఆలోచించకు.. నీకు అన్నీ ఉన్నాయి కదా.. ఇది చిన్న సమస్య అని చెప్పడం వారి బాధను కాస్త తగ్గించవచ్చు. ఒక వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నట్లు అనిపిస్తే, వారిని ఒంటరిగా వదిలేయకుండా వెంటనే కుటుంబ సభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు, అత్యవసర సేవలను సంప్రదించాలి. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని టెలీమానస్ కేంద్రంలో టోల్ఫ్రీ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్, సంక్షోభ సమయంలో సహాయం, ప్రమాదాన్ని గుర్తించడం, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలకు రిఫర్ చేయడం వంటి సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో టెలీ–మానస్ సేవలకు స్పందన క్రమంగా పెరుగుతోంది. ఈ కేంద్రం 2022లో ఏర్పాటు కాగా, ఆ ఏడాది 523 కాల్స్ రాగా 2023లో 18వేలు, 2024లో 20వేలు, 2025లో 17వేలు, 2026లో ఇప్పటివరకు 31వేల కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అందిన 86,529 టెలీ–మానస్ కాల్స్లో 2.16 శాతం ఆత్మహత్య ఆందోళనలకు సంబంధించినవే ఉన్నాయి. యువతలో విద్యా ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ సంబంధాల్లో సమస్యలు, కుటుంబ విభేదాలు, సోషల్ మీడియా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వైఫల్య భయం వంటి అంశాలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. పరీక్షలో విఫలం అయితే జీవితం విఫలం కాదని తెలుసుకోవాలి. ఒక ఉద్యోగం రాకపోవడం భవిష్యత్తు ముగిసినట్లు కాదన్నది గ్రహించాలి. ఆయా సమయాల్లో ఇతరులను సహాయం కోరడం బలహీనతగా భావించవద్దు. – గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించినట్లే, మనసులో బాధ, నిరాశ, ఆందోళన ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక వైద్యులను సంప్రదించడం ఆరోగ్యకరమైన నిర్ణయం. సమయానికి ఇచ్చే కౌన్సెలింగ్, మానసిక చికిత్స తీసుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యను సమర్థంగా నిర్వహించవచ్చు. ఆత్మహత్య నివారణ ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ, కార్యాలయం, ప్రతి స్నేహితుడు భాగస్వామి కావాలి. – డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు -
భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యవర్గం ఏకగ్రీవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. బీహెచ్ఆర్ఎస్ సెంట్రల్ కమిటీ హాల్లో బుధవారం భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ రాష్ట్ర బోర్డు సభ్యుడిగా విజయవాడ బాప్టిస్ట్నగర్కు చెందిన సిరివెళ్ల సంతోష్కుమార్ను, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాటి సంపత్కుమార్, ఉపాధ్యక్షుడిగా మల్లుల మోహన్కుమార్, ప్రధాన కార్యద ర్శిగా వెలితోటి డానియేలు, కో ఆర్డినేటర్గా పొలిమెట్ల జోసఫ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీహెచ్ఆర్ఎస్ నాయకులు మాట్లా డుతూ.. మానవ హక్కుల పరిరక్షణకు కమిషన్ కృషి చేస్తోందన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ జబహర్లాల్ ఓజా, జాతీయ అధ్యక్షుడు పుల్లెల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శి జాన్ పాల్గొన్నారు. -
ఉద్యోగోన్నతుల నిలిపివేత.. ఆందోళనలో ఏఎన్ఎంలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగోన్నతులు జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 50 మంది సచివాలయ గ్రేడ్–3లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు అంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత జూలై 11న సర్వీసు రిజిస్టర్లతో పాటు, మచిలీపట్నం డీఎంహెచ్ఓ కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, మరుసటి రోజు ఆదివారం కావడంతో సర్వీస్ రిజిస్టర్లు, సంబంధిత ధ్రువ పత్రాలు సేకరించి సమర్పించడానికి సమయం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ సోమవారం జూలై 13న సుమారు 40మంది ఏఎన్ఎంలు ఎస్ఆర్లు సమర్పించినట్లు తెలిపారు. అయితే అప్పటికే ప్రభుత్వం ఉద్యోగోన్నతులపై ఫ్రీజింగ్ వచ్చిందని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్కు మాత్రమే.. మరలా ప్రభుత్వం తాత్కాలికంగా పోయిననెల ఆగస్టు చివరి తేదీ వరకు ఫ్రీజింగ్ ఎత్తివేయగా, అందులో రాష్ట్ర స్థాయి కేడర్లకు మాత్రమే మినహాయింపును ఇవ్వడంతో తమ వంటి చిన్న కేడర్లకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. అసోసియేషన్ జిల్లా నాయకుడు కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీడీకే సాగర్, దుర్గాప్రసాద్, వీవీ సత్యనారాయణ బాబు ఉన్నారు. -
సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట
● డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ● కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(సీ4) ప్రారంభంకృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (సీ4)ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ 3వ అంతస్తులో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని బుధవారం ఆయన పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. త్వరలో సైబర్ గార్డ్ పాలసీ.. ఈ సందర్భంగా డీజీపీ హరీష్కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాదిరిగానే సైబర్ కేసులు తీవ్రంగా ఉన్నాయన్నారు. సీఎం చంద్ర బాబు దిశానిర్దేశంతో ఇప్పటికే డ్రగ్స్ను నియంత్రణలోకి తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా సైబర్ కేసులు నియంత్రించడానికి త్వరలోనే రాష్ట్రంలో సైబర్ గార్డ్ పాలసీని తీసుకురావడంతో పాటు రాష్ట్రస్థాయిలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు 20 మంది సైబర్ కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేగంగా న్యాయం.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సీ4 ద్వారా ఫిర్యాదు నుంచి నిందితుల ఆనవాళ్ల వరకు ప్రతి సమాచారాన్ని ఆధునిక పరిజ్ఞానంతో విశ్లేషించి బాధితులకు వేగంగా న్యాయం అందిస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక సైబర్ ఎస్ఐని నియమించి వారికి ఆధునిక సాంకేతిక దర్యాప్తు పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాష్, సైబర్ క్రైమ్ డీసీపీ కె.కృష్ణ ప్రసన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గురువే.. బరువా?
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● మూడేళ్లుగా జిల్లాలో గురుపూజోత్సవం నిర్వహించని విద్యాశాఖ ● పురస్కారాలు అందుకోవటానికి ఎదురు చూస్తున్న గురువులు ● నిధులు లేక గురుపూజోత్సవాన్ని నిర్వహించటం లేదని ప్రచారం ● ఇది తమను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం ● బతికి సాధించాలంటున్న మానసిక నిపుణులు ● సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదని సూచన ● ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే చాలంటూ వివరణ ● నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కృష్ణలంక(విజయవాడతూర్పు): ఓ హెడ్ కానిస్టేబుల్ కనిపించకుండా పోయిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 14వ బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం ఎ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా హెడ్ కానిస్టేబుల్ ఆర్.మధుబాబు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఈ నెల 6వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మరో సిబ్బంది సుధాకర్ గౌడ్తో కలిసి భోజనం చేయడానికి నగరంలోని ఓల్డ్ క్వార్టర్స్, మెస్ డార్మెటరీకి బైక్పై వెళ్లాడు. భోజనం అనంతరం ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిన మధుబాబు తిరిగిరాలేదు. 7వ తేదీ ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉన్నా హాజరు కాలేదు. సెల్ఫోన్కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతని సొంత ఊరిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆయన భార్య వసుంధర కూడా మధుబాబు ఇంటికి రాలేదని స్పష్టం చేశారు. మధుబాబు కనిపించడం లేదని ఆర్ఎస్ఐ కె.వెంకటేశ్వర్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏటా ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపికై న గురువులు సత్కారాన్ని పొందటం పరిపాటి. కానీ ఎన్టీఆర్ జిల్లా మాత్రం అందుకు విరుద్ధం. జిల్లాలో ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కూటమి ప్రభుత్వం అందించటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లలో మూడు సార్లు ఉపాధ్యాయ దినోత్సవాలు వచ్చాయి. కానీ ఒక్క ఏడాది కూడా జిల్లా విద్యాశాఖ ఈ జిల్లాలో వేడుకలు నిర్వహించలేదు. అలాగే జిల్లా స్థాయిలో పురస్కారాలను ప్రదానం చేయలేదు. ఇది ముమ్మాటికీ గురువులను అవమానించటమేనంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ఎదురుచూపులు.. రాష్ట్రంలో 2024 మే మాసంలో ఎన్నికలు జరిగాయి. జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ తరువాత 2024, 2025, తాజాగా 2026 సెప్టెంబర్ ఐదో తేదీ మొత్తం మూడు సార్లు నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగలేదు. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేసి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. కనీసం పదేళ్ల అనుభవం కలిగిన సర్కార్ బడుల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఎటువంటి క్రిమినల్ కేసులు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. కానీ ఉపాధ్యాయ దినోత్సవ తేదీ దాటి ఐదు రోజులైనా ఇప్పటి వరకూ దాని ఊసు ఎత్తకపోవటంపై ఈ ఏడాది సైతం ఉపాధ్యాయ దినోత్సవం జరగదనే నిర్ణయానికి ఉపాధ్యాయులు వచ్చినట్లు సమాచారం. నిధులు లేవంటూ వంకలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ జిల్లాలోని పాఠశాలల అభ్యున్నతికి ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఉపాధ్యాయలు చెబుతున్నారు. దానివల్ల విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని మార్లు ప్రతిపాదనలు పంపినా కూటమి ప్రభుత్వం స్పందించటం లేదు. ఆఖరికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించటానికి సైతం నిధులు లేక కార్యక్రమాన్ని నిర్వహించటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువులను గౌరవించే కార్యక్రమాన్ని సైతం నిధుల కొరతతో నిలుపుదల చేయటం తమను అవమానించటమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు సైతం ముందుకు రావడం లేదు.. ఈ ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పత్రికా ముఖంగా ప్రకటన చేశారు. వివిధ కేటగిరీల్లో సుమారుగా 50 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తారు. జిల్లా విద్యాశాఖ రెండు సార్లు ప్రకటన చేసినా ఇప్పటి వరకూ పట్టుమని 25 మంది సైతం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. గత సంవత్సరాలు అంతకు లోపే దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. జిల్లా విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఉపాధ్యాయులు సైతం ముందు కు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని ఆపరేషన్ థియేటర్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఆత్మహత్యతో ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. ఎన్టీఆర్ జిల్లాలో వివిధ యజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,451 కొనసాగుతున్నాయి. అందులో 942 ప్రభుత్వ యాజమాన్య పరిధి అయిన ప్రభుత్వం, జెడ్పీ, మునిసిపల్, ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 5,091 మంది వివిధ క్యాడర్లలో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏటా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజైన సెప్టెంబర్ ఐదో తేదీన జరిగే గురుపూజోత్సవం రోజున జిల్లాలోని ఎంపికై న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించాలి. కానీ ఈ సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో పూర్తిగా పక్కన పెట్టింది. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గడచిన మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం ముగిశాయి.కారణాలు ఏమైనా 2024 నుంచి జిల్లాలో గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూసే ఉత్సవం ఇది. ఒక వేళ రాష్ట్ర స్థాయి వేడుకలు ఇక్కడ జరిగితే ముందో, వెనుక ఒక తేదీన నిర్వహిస్తే బాగుంటుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది నిర్వహిస్తామని చెప్పి సమావేశాన్ని సైతం నిర్వహించారు. కానీ ఎందుకనో ఇప్పటి వరకూ చర్యలు చేపట్టిన దాఖలాలు కనపడటటం లేదు. – ఎ. సుందరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాలిక మృతి
గన్నవరం: మండలంలోని అల్లాపురం గ్రామానికి చెందిన బాలిక జ్వరం, మెదడువాపు వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాటూరి రామారావు కుమారై సుస్మిత (14) దావాజిగూడెం జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. వారం రోజులుగా జ్వరంతో తీవ్ర అస్వస్తతకు గురైన సుస్మితను మూడు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరి స్థితి విషమించి బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. సుస్మిత తీవ్ర జ్వరంతో పాటు మెదడు వాపు లక్షణాలతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం గ్రామానికి తీసుకొచ్చిన అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమార్తె సుస్మిత అకాల మృతితో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు భోరున విలపించారు. -
లోక్భవన్ వద్ద భద్రతా వైఫల్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ వైపు డీజీపీ క్యాంపు, సీపీ కార్యాలయాలు, మరో వైపు సూర్యారావుపేట పోలీసు స్టేషన్, టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇంకో వైపు కోర్టుల సముదాయం, ఆ సమీపంలో ఉన్న లోక్భవన్ వద్ద భద్రతా వైఫల్యం బట్టబయ లైంది. పోలీసులు కళ్లు గప్పి వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు బుధవారం లోక్భవన్ను ముట్ట డించారు. జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఏకంగా లోక్భవన్ ప్రధాన గేటు వద్దకు దూసుకెళ్లారు. గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దళితులపై దాడులు, హత్యల విషయంలో గవర్నర్ స్పందించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లైంగికదాడులు, హత్యలు, మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలపై గవర్నర్ స్పందించాలంటూ బీఎస్సీ ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. తొలుత దళితులు పెద్ద సంఖ్యలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్న దళితులు అంబేడ్కర్ కళావేదిక పక్క నుంచి ఒక్కసారిగా లోక్భవన్ను ముట్టడించారు. 300 మందికి పైగా ఆందోళనకారులు రాష్ట్రంలోని దళితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ లోక్భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి పంపే ప్రయత్నం చేశారు. గవర్నర్ స్పందించే వరకు అక్కడ నుంచి వెనక్కు వెళ్లేది లేదంటూ ఆందో ళన కారులు పట్టుబట్టారు. లోక్భవన్ అధికారులు గవర్నర్కు సమాచారం ఇవ్వడంతో.. బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్తో పాటు మరికొందరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. శాసన సభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై చేసిన వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరిగిన దళితుల హత్యలపై గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం లోక్భవన్ వద్ద గౌతమ్కుమార్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, హత్యలపై సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చిత్రసేన్, నాగరాజు, తెనాలి ప్రకాష్ తదితరులు ఉన్నారు. -
జలహారతి పనులను పర్యవేక్షించాలి
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జలహారతి పనులను పర్యవేక్షించాలని, పీజీఆర్ఎస్ తోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఇతర మార్గాల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, అవసరమైన విచారణ చేపట్టి తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నుంచి కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా స్థాయి అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వర్చువల్గా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. జలధార–జలహారతి 2.0 కింద పనులకు అవసరమైన అనుమతులను వేగంగా పొందడంతో పాటు పనులను పటిష్టంగా పర్యవేక్షించాలని సూచించారు. నెట్ జీరోలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో సోలార్ ప్యానెళ్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాంటేషన్ పనులను వేగవంతం చేసి, వేప, టేకు వంటి నాణ్యమైన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్డీవోలు, సంబంధిత అధికారులు ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లోని స్టాక్ను ప్రతి వారం తనిఖీ చేయాలని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాల వద్ద ధరలు, ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయ కాల్ సెంటర్ వివరాలతో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కాలుష్య నియంత్రణ మండలి, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీడలు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకూ జరిగిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని బుధవారం సీపీ రాజశేఖరబాబు అభినందించారు. ఈ సంద ర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తి గతంగా కలిసి వారి పతకాలను, ప్రశంసా పత్రాలను పరిశీలించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొని గొప్ప ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో వివిధ విభాగాల్లో 74 పతకాలు సాధించి జిల్లా పోలీస్ కమిషనరేట్ పేరును నిలబెట్టిన ప్రతి క్రీడాకారునికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఇతర డీసీపీలు కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి, కె.కృష్ణప్రసన్న, సత్యనారాయణ, ఏడీసీపీ ఎన్.వి.రమణ, ప్రేమ్కుమార్, ఆర్ఐలు శ్రీనివాస్ శ్రీకాంత్, సుధాకర్రెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు -
ఏఐ రంగంలో మహిళలు పురోభివృద్ధి సాధించాలి
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రతిభకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు ఏఐ వంటి రంగంలో పురోభివృద్ధి సాధించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఆఫ్లైన్, ఆన్లైన్లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లను మంగళవారం ఆయన అందజేశారు. రైజ్ కేంద్రంలో ఏఐ 4 అష్యూర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, తొలి విడతగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన 31 మందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీ4 స్ఫూర్తితో మార్గదర్శిగా ముందుకొచ్చిన సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈవో కెంబూరు సతీష్ కుమార్ సహకారంతో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న 31 మందికి సినిమాటిక్ ఏఐ విభాగంలో హైదరాబాద్లో ఫుల్టైమ్ ఉద్యోగాలు లభించగా మిగిలిన వారికి ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభించాయన్నారు. ఏఐ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఇమేజ్ జనరేషన్, ఏఐ వీడియో క్రియేషన్, ఏఐ వాయిస్ అండ్ ఆడియో, సోషల్ మీడియా మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ తదితర నైపుణ్యాలను శిక్షణలో నేర్పించామన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ ల్యాబ్ను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. నూతన మార్కెటింగ్ విధానం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందని స్పష్టం చేశారు. సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈఓ కె.సతీష్ కుమార్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేసిన కలెక్టర్ జి.లక్ష్మీశ -
ముగిసిన ఎఫ్సీఐ సాంస్కృతిక పోటీలు
విజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఎంబీ భవన్లో మంగళవారం ముగిశాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందీ, తెలుగు చిత్ర గీతాలు ఆలపించారు. లఘు నాటికలు, సోలో, బృంద నృత్యాలను ప్రదర్శించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఉద్యోగులలో సృజనాత్మకతను వెలికి తీసే ఇటువంటి పోటీలు అవసరమన్నారు. తమిళనాడు జట్టు పలు విభాగాలలో విజేతగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్ యాదవ్, ప్రాంతీయ రీజియన్ జీఎం సమీర్కుమార్ వర్మ, సంస్థ అధికారులు విజయ్కుమార్ యాదవ్, సమీర్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయి మండలం మంగొల్లు గ్రామాలకు చెందిన పలువురు కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ సంస్థాగత సన్నాహక సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు ఆళ్ల చల్లారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిల్లకల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు సుంకర వేణు, సుంకర ఆంజనేయులు, సంపత్ సైదేశ్వరరావు, వారితో పాటు 8 కుటుంబాలు వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు దొంగల సింహాద్రి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే వత్సవాయి మండలం మంగొల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చరణం కృష్ణారావు ఆ గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొల్లం కిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆహ్వానించిన అవినాష్, తన్నీరు -
ఆయన చెబితే అంతా సక్రమమే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో అంతా ఆయన చెప్పిందే వేదం. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ వేయాలన్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాలన్నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి చెబితే సక్రమం అయిపోతుంది. అడ్డ గోలుగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లకు స్థానిక నేతలు అండదండగా నిలుస్తున్నారు. మామూళ్లు అందుకుంటున్న నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా అక్రమ లేఅవుట్లు వేసేస్తున్నారు. పైగా అర్బన్ ల్యాండ్ సీలింగ్లోనో, లేక వివాదాల్లో ఉన్న భూముల్లో సైతం లేఅవుట్లు వేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయమంతా స్థానిక ప్రజాప్రతి’నిధి‘కి చేరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూఆర్ఆర్పేటలో ఐదున్నర ఎకరాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిలో లేఅవుట్ వేశారు. దీనికి స్థానిక తెలుగుదేశం నాయకులు అండదండగా నిలిచారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు అందితే లేఅవుట్ ధ్వంసం చేసినట్లు రోడ్లకు చిన్నచిన్న గోతులు తవ్వి పత్రికలకు నోట్ పంపి ఊరుకుంటున్నారు. మరోవైపు ఎక్స్టెన్షన్ ఏరియాలలో అక్రమ లేఅవుట్లతో పాటు, అక్రమ నిర్మాణాలు కూడా తార స్థాయికి చేరుతున్నాయి. సింగ్నగర్, పాయకాపురం, గుణదల ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిబంధనలు గాలికి వదిలిపెట్టి స్థానిక రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మంజూరు అయిన ప్లాన్కు విరుద్ధంగా అదనపు యూనిట్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. కనీసం సెట్బ్యాక్స్ కాని, పార్కింగ్ నిబంధనలు కాని పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. జీవో 119 ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా అనుమతులకు మించి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం, ఈ కట్టడాలకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. భవిష్యత్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికై నా టౌన్ప్లానింగ్ అధికారులు కళ్లుతెరిచి అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్వే నంబర్ 37 లో రెండు ఎకరాలు, సర్వే నంబర్ 78/ఎ1ఎ లోని 3.23 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండి కేట్గా అక్రమ లేఅవుట్లు వేసి విక్రయాలు చేపట్టారు. రోడ్ రోలర్లతో రోడ్లు వేసి, ప్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. -
గడువులోపే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తి చేయాలి
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తిచేసే విధంగా పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అధి కారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను మంగళవారం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. ట్రాన్సిట్ టెర్మినల్ భవనంలో ఎయిర్పోర్ట్ అధికారులు, టెర్మినల్ కాంట్రాక్ట్ సంస్థ్ధ ప్రతినిధులతో ఆయన సమీక్ష జరిపారు. టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. టెర్మినల్ నిర్మాణ పనులను దసరా నవరాత్రుల నాటికి పూర్తి చేయాలని సూచించారు. తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, కృష్ణానది, ఇంద్రకీలాద్రి ఆలయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా టెర్మినల్ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలు విభాగాల అధి పతులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు -
భూముల రీసర్వేలో రైతుల భాగస్వామ్యం తప్పనిసరి
గన్నవరం: భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులను భాగస్వాములను చేయడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. మండలంలోని కేసరపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భూముల సర్వే ప్రక్రియ ప్రారంభం నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం వరకు రైతుల సమక్షంలోనే నిర్వహించాలని చెప్పారు. రైతుల చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం అందజేసే వరకు వారికి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. రీసర్వే నిర్వహించిన తర్వాత నోటీసుల రూపంలో రైతులకు చూపించిన భూహద్దులు ప్రకారం భూవివాదాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్తో రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో రీసర్వేలో సమస్యలు ఎదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లా సర్వే సహాయ సంచాలకుడు పూజారి లక్ష్మణరావు, తహసీల్దారు కె.వెంకటశివయ్య, గుడివాడ డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్, మండల సర్వేయర్ మాధవరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. బీఎడ్, స్పెషల్ బీఎడ్ ఫలితాలు విడుదల కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బీఎడ్, స్పెషల్ బీఎడ్లకు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించి దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యులపై నిర్లక్ష్యం తగదు లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరుపేద రోగులకు వైద్యం చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం– ఆంధ్రప్రదేశ్(జీడీఏ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఐ.బాబ్జి శ్యామ్కుమార్ అన్నారు. ప్రభుత్వ వైద్యుల నిరసన 8వ రోజు మంగళవారం కూడా కొనసాగింది. తమకు 2016 యూజీసీ పీఆర్సీ జీతభత్యాల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కాలేజీ ఫ్యాకల్టీలకు యూజీసీ పీఆర్సీ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు టీచింగ్ వైద్యులు పాల్గొన్నారు. -
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినాయక చవితి ఉత్స వాలకు ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. మండపాల్లో తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వినియోగించాలని, మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ వైరింగ్, ఇతర పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్, రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షాల సమయంలో విద్యుత్ పరికరాలు, వైర్లు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. -
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: యూకే వీసా రెన్యువల్, ఉద్యోగాల మోసం కేసుకు సంబంధించి ఏపీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నందూస్ వరల్డ్ అలియాస్ రమానందన విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణపై ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం పలు కీలక విషయాలు వెల్లడించారు.బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు రమానందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, తాము విచారణకు హాజరవుతామని, లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేయాలని రమానందన మెయిల్ ద్వారా కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు.పోలీసుల విచారణలో వీసా రెన్యువల్ లావాదేవీలతో తనకేం సంబంధం లేదని రమానందన తెలిపినట్లు సీఐ తెలిపారు. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’తో తనకెలాంటి సంబంధం లేదని, ఆ వ్యవహారమంతా తన భర్త మధుకరే చూసుకుంటాడని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. తనకు ఏమీ తెలియదని, తన భర్తనే అడగాలని రమానందన విచారణలో పేర్కొన్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.విచారణ నిమిత్తం రమానందన మూడు వారాల సెలవుపై ప్రస్తుతం ఇండియాకు వచ్చారు. ఆమె తిరిగి యూకే వెళ్లిన తర్వాత ఆమె భర్త మధుకర్ విచారణకు వస్తారని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 16న రమానందనను మరోసారి విచారించనున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.యూకే వీసా రెన్యువల్స్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరుతో డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ రమానందనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్తో పాటు మరికొన్ని చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇబ్రహీంపట్నం తరలించి ఈ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమెను పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం విచారిస్తున్నారు. 👉ఇదీ చదవండి : పోలీసుల అదుపులో నందూస్ వరల్డ్ -
ఇబ్రహీంపట్నం పీఎస్కు యూట్యూబర్ రమా నందన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రముఖ యూట్యూబ్ చానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో గతంలోనే నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై కేసు నమోదు చేయ డంతో పాటు లుక్ఔట్ నోటీసును కూడా జారీ చేశారు. ఇవాళ ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడరంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీలకు రమా నందన మెయిల్ చేశారు. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్లో ఆమె కోరారు. లుక్ఔట్ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో రమా నందన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీసులిచ్చారు. రమా నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరుకానున్నారు.ఇదీ చదవండి: 'డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేశ్ హస్తం' -
పింఛన్ల దరఖాస్తుకు 16వతేదీ తుదిగడువు
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్ పింఛన్ కోసం అర్హులైనవారు ఈనెల 16వ తేదీలోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను ఏడు పనిదినాల్లో పూర్తిచేయాలని కాలపరిమితిని నిర్ణయించినట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లుకు ఆధార్, రైస్కార్డు/ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు సంబంధిత వర్గానికి అవసరమైన ధ్రువీకరణపత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే పింఛన్ కోసం అర్జీని సమర్పించిన వారు కూడా తమ పరిధిలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఎఫ్సీఐ ఆధ్వర్యంలో దక్షిణ భారత సాంస్కృతిక పోటీలు విజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ పోటీలకు విజయవాడ వేదికై ంది. రెండు రోజులపాటు సాగే ఈ పోటీలు విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో, గ్రూప్ నృత్యాలను, హిందీ, తెలుగు, చిత్రగీతాలను, లఘునాటికలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్మినితా లాజరస్ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడంలో భారత ఆహార సంస్థ ముందుందన్నారు. శాఖకు సంబంధిన ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ అభినందించారు. పోటీల సహజమని, ప్రతీ అపజయం విజయానికి తొలి మేలికొలుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్యాదవ్, ప్రాంతీయ రీజయన్ జీఎం సమీర్కుమార్వర్మ పాల్గొన్నారు. గుణదల(విజయవాడతూర్పు): గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పలువురు నిందితులను మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు..నర్సీపట్నంకు చెందిన షేక్ సిద్దిక్ (27) ఆ ప్రాంతంలో మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. విజయవాడలోని అతని స్నేహితులతో కలసి ఈ గంజాయిని అమ్మేందుకు ఇక్కడికి తరలించాడు. మాచవరం స్మశానవాటిక వద్ద గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు సిద్ధంకాగా, స్థానికుల సమాచారం మేరకు మాచవరం ఎస్ఐ సంధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి విక్రయానికి సహకరించిన గుమ్మలంపాటి నాగతేజ (21), గుమ్మలంపాటి అఖిల్ (22), ఉజ్జి సాగర్ (20), షేక్ దీన్ షాద్ (26), శృంగారపాటి ప్రవీణ్(25), మురికిపూటి మహేష్ కుమార్(26)లను అరెస్ట్ చేశారు. వీరు ఉపయోగించిన సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
అధునాతన విధానంతో మేలు..
ఫిజియోథెరపీలోని అధునాతన వైద్యవిధానంతో ఎంతో మేలుకలుగుతుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న నేపథ్యంలో మెడ, వెన్ను తదితర నొప్పులు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే కచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా కొన్ని పద్ధతులు అవలంభించి నివారించవచ్చు. ముందస్తు చికిత్స చేయించుకుంటే పెరాలసిస్ రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఎల్. ప్రభాకర్, ఎంపీటీ (న్యూరో), మచిలీపట్నం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026చివరి దశ ‘నాడు–నేడు’కు మంగళం.. వైద్య రంగంలో కీలకంగా ఫిజియోథెరపీ 7రొయ్యలసాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ పోరంకి లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు.భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడలో సోమవారం ప్రారంభమయ్యాయి.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్, అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమవుతుందని సంఘ సంస్కర్తల ఉవాచ. అక్షరాస్యత కలిగిన సమాజం త్వరగా ప్రగతి బాట పడుతుందని పలువురు మేధావులు నిరూపించిన సత్యం. కానీ ఆ విద్యను అందించే విద్యాలయాలను కూటమి ప్రభుత్వం నిధానంగా నిర్వీర్యం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పేదలందరూ విద్యావంతులు కావాలని, అప్పుడు నిజమైన ప్రగతి సాధ్యమని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో అపూర్వమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తత్ఫలితంగా జిల్లాలో సర్కారు బడి ప్రగతి పరుగులు తీసింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని విద్యారంగంలో దర్శనమిస్తున్నాయని విమర్శలొస్తున్నాయి. సర్కారు విద్య ‘అవస్థలు..’ జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఎదురవుతున్న సమస్యల కారణంగా విద్యార్థులు సర్కార్ బడులకు దూరమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 20 మండలాలు కొనసాగుతుండగా అందులో సుమారుగా 926 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్నాయి. అందులో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 88,432గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరం ఆ సంఖ్య 96,711గా ఉంది. సుమారుగా 8,279 మంది విద్యార్థులు ఈ ఏడాది తగ్గినట్లుగా అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత.. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ప్రధానంగా జిల్లాలోని 926 విద్యాసంస్థల్లో 5,691 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసినా ఇంకా 426 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇటీవల సుమారుగా 80మంది తాత్కాలిక ఉపాధ్యాయుల కోసం జిల్లా విద్యాశాఖ ప్రకటన ఇచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో చేపట్టలేదు. మౌలిక వసతులకూ నిధుల్లేవ్.. జిల్లాలో రోజువారి సమస్యలతో పాటుగా నిర్వహణ లేకపోవటంతో విద్యాసంస్థల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, మెట్లు ఇలా పలు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులు పనులను గుర్తించి అంచనాలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సుమారుగా రూ.200 కోట్లు అవసరమవుతాయని ఆ అంచనాలను సర్వశిక్ష అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటి వరకూ ఆ నిధులు రాకపోవటంతో పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పాఠశాలలకు దూరంగా.. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు దూరంగా 18వేల మంది పిల్లలు ఉన్నట్లుగా అధికార నివేదికలు చెబుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులు నిర్వహించే సర్వేలో పాఠశాలను మానివేసినవారు, అసలు పాఠశాలకు రానటువంటి వారు సుమారుగా 17,890మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు ఎక్కడ ఏ పాఠశాలలోనూ చేరలేదని అధికార నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది పనులకు వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కార్పొరేట్ కోసమేనా? కూటమి పార్టీల్లో ఉన్న పెద్దలు నిర్వహించే కార్పొరేట్ విద్యాసంస్థల కోసమే సర్కార్ బడులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను మౌలిక సదుపాయాలు లేని కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు పంపటానికి వెనుకంజు వేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో చేర్పిస్తే ఆర్థిక భారాలతో మధ్యలోనే నిలిపివేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఈ పరిస్థితులు అక్షరాస్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపు తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏవీ నాటి వెలుగులు.. గత ప్రభుత్వంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలు విద్యారంగ వికాసానికి అండగా నిలిచాయని నిపుణులు సైతం చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా జిల్లాలో విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరగటమే కాకుండా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలకు విద్యార్థులు వలస బాట పట్టారు. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. మొండి నొప్పులకు థెరపీ మంత్ర! ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ లక్ష్మీశపీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పాఠశాలలు : 926 ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య : 88,432 గతేడాది విద్యార్థుల సంఖ్య : 96,711 ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు : 8,279 ఈ ఏడాది డ్రాప్ అవుట్లు : 17,890విద్యారంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పంతో నాడు–నేడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లతో సర్కార్ బడులకు కొత్త రూపు తీసుకొచ్చారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో రెండు విడతలుగా ఎన్టీఆర్ జిల్లాలో మొదటి విడత రూ.95.32 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను విస్తృతం చేశారు. అలాగే రెండో విడతగా 596 విద్యాసంస్థల్లో రూ.240.35కోట్లను విడుదల చేసి అభివృద్ధి చేశారు. అయితే జిల్లాలో ఆ పనులు చివరి దశలో ఉండగా వాటికి పది కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు నివేదికలు పంపారు. అయితే గడిచిన రెండున్నరేళ్లగా ఆ నిధులు ఇవ్వకపోవటంతో సుమారుగా 365 తరగతి గదులను చివరి దశ పనులు చేయక మూలన పెట్టారు. -
మచిలీపట్నానికి చెందిన రాజు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏడాదిగా స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు. అనేక చోట్ల వైద్యుల సూచనలతో మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు. ఓ స్నేహితుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తే ప్రయత్నించారు. దీంతో నెల రోజుల
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/మచిలీపట్నంటౌన్: వైద్య రంగంలో ఫిజియోథెరపీ నేడు అత్యంత కీలకంగా మారింది. మొండి నొప్పులకు థెరపీలతో ఉపశమనం కలిగించడమే కాక.. సుఖ ప్రసవం కోసం, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం రోగుల చికిత్సలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కండరాలు సాధారణ స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు నగరంలో దాదాపు వందకు పైగా ఫిజియోథెరపీ క్లినిక్లు ఏర్పాటయ్యాయంటే దాని ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘హృదయ సంబంధ వ్యాధులు, పక్షవాతం నిర్వహణ, పునరావాసంలో ఫిజియోథెరపీ, శారీరక కార్యకలాపాల పాత్ర’ అనే నినాదంతో జరుపుకొంటున్నారు. మొండి నొప్పులకు చెక్.. వెన్నుముక నొప్పి, మెడనొప్పి వంటి వాటికి శస్త్ర చికిత్సలతో సంబంధం లేకుండా ఫిజియోథెరపిస్టులు విముక్తి కలిగిస్తున్నారు. ముఖ్యంగా మోకీలు మార్పిడి, తుంటికీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సల తర్వాత మరలా కండరాలు సాధారణ స్థితికి రావడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. బైపాస్ సర్జరీలు, ఇతర మేజర్ శస్త్ర చికిత్సలు తర్వాత కూడా ఫిజియో థెరపీ అవసరం ఉంటుంది. అంతేకాదు శ్వాసకోశ సమస్యలకు బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా థెరపీలతో విముక్తి కలిగిస్తున్నారు. ఇలా వైద్య పరంగా అనేక సమస్యలకు ఫిజియోథెరపిస్టులు పరిష్కారం చూపుతున్నారు. -
వ్యాధుల నుంచి విముక్తి..
గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ శ్వాసకోశ సమస్యల వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఫిజియోథెరపిస్టు సూచనలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. పక్షవాతానికి గురైన వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేయడంతో ఫిజియోథెరపీ కీలకం. అంతేకాదు పుట్టుకతో జన్యుపరమైన లోపాలతో వైకల్యాలకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం. – డాక్టర్ ఎం. ప్రభుదాస్, ఫిజియోథెరపిస్టు, విజయవాడ -
విజయవాడకు జాతీయ స్థాయి గుర్తింపు
ఢిల్లీలో అవార్డు అందుకున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రపటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్ జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డివిజన్గా ద్వితీయ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 31వ డివిజన్ స్టేట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డ్ సాధించింది. ఈ మేరకు సోమవారం జాతీయ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పర్యావరణ భవన్లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర మంత్రి కృతి వర్థన్ సింగ్, కార్యదర్శి తన్మయ్ కుమార్ చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిధులు 60వ డివిజన్కు సంబంధించిన జాతీయ స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డును స్వీకరించారు. రూ.30 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. అలాగే 31వ డివిజన్కు రాష్ట్ర స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డుతో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సాగాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు.జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో ఉత్సవాల నిర్వహణ, వినాయక ప్రతిమల ఏర్పాటు, పందిళ్లకు అనుమతులు, విద్యుత్ భద్రత, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఐదు లక్షల మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించడంతోపాటు గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి, నిర్వాహకులు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేసేలా పందిళ్లను ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. డీజేలు పరిమితులకు లోబడి ఏర్పాటు చేసుకోవాలని, పందిళ్ల వద్ద శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలి.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను అధికారులు ముందుగానే గుర్తించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఇగ్నైట్ సెల్లో మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా విద్యుత్ శాఖ అధికారి యు.హనుమయ్య, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బిట్ర వెంకటేష్, వై. కిషోర్, లోయ బాలకృష్ణ, జీవీఎస్ రమణమూర్తి, వి.పల్లవరాజు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ.4లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ, భీమవరంనకు చెందిన భక్తులు రూ.4లక్షలను విరాళాలుగా సోమవారం అందజేశారు. విజయవాడ రామచంద్రనగర్కు చెందిన వై.శివకుమారి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది.శివకుమారి పేరిట రూ.లక్ష, నాగార్జుననగర్కు చెందిన జి.రామకృష్ణ పేరిట రూ. లక్ష, భీమవరంనకు చెందిన వి.శ్రీకాంత్వర్మ పేరిట రూ. లక్ష విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. విజయవాడ గుణదలకు చెందిన పరిటాల దుర్గాప్రసాద్ కుటుంబం రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..కాజా గౌరీశంకర్(26) అనే యువకుడు కేదారేశ్వరపేటలోని పండ్లమార్కెట్లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని తనఅక్క రౌతు లక్ష్మీ కుటుంబంతో ఉంటున్నాడు. జీతం డబ్బుల విషయంలో అక్క నిలదీయడంతో మనస్థాపానికి గురైన శంకర్ ఆదివారం మధ్యాహ్నం మీసాల రాజారావు వంతెన మీద నుంచి ఏలూరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఎస్ఎన్పురం పోలీసులు సోమవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి ఏలూరు కాలువలో గాలించగా జీఎస్ రాజురోడ్డు, పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగాన కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి 10నఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లూరు నీరజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కామర్స్, కంప్యూటర్ విభాగాలలో అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆమె సూచించారు. -
రొయ్యల సాగు రైతుల ఆందోళన
పెనమలూరు: తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ రొయ్యల సాగు రైతులు పోరంకిలోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ రొయ్యల రైతుల సమైఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుగ్గినేని గోపీనాధ్ విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగు ద్వారా దేశానికి విదేశాల నుంచి ఆదాయం సమకూరుతుండగా, రొయ్యలసాగు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆందోళణ వ్యక్తం చేశారు. ఆరునెలల్లో టైగర్ రొయ్య ఫీడ్ కేజీకి రూ.26, వేనామయ ఫీడ్ కేజీకి రూ 21 పెంచారన్నారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షించే పద్ధతిని రద్దు చేసి, ఏడాదికి ఒకసారి ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పవర్ ఫ్యాక్టర్ షరతులతో సంబంధం లేకుండా రొయ్యల రైతులందరికీ యూనిట్ రూ.1.50 సబ్సిడీ అందచేయాలని కోరారు. టైగర్ రొయ్యల ధరలు 30 కౌంట్ కేజీ రూ.150, 20 కౌంట్ కేజీ ధర రూ.100 చొప్పున పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టైగర్ రొయ్యల ధరలను స్థిరీకరణ చేయాలన్నారు. రొయ్యల రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆరునెలలు రొయ్యల పంట విరామానికి అనుమతించాలని కోరారు. కమిషనర్కు వినతి... ధర్నా అనంతరం రొయ్యలసాగు రైతులు మత్య్సశాఖ కమిషనర్ శంకర్నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫీడ్ ముడిపదార్థాల ధరలు పెరిగినందునే ఫీడ్ ధరలు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా రొయ్యల ధరలు తగ్గాయన్నారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని కమిషనర్ను రైతులు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీరంతా నిజమైన రైతులేనా? అని కమిషనర్ ప్రశ్నించడంతో ఆయన తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పంటకాలువలో వరినాట్లు
కృత్తివెన్ను: పంట భూములకు సాగునీరందించాల్సిన కాలువలు నీటి జాడ లేక ఎండిపోవడంతో రైతులు వినూత్న నిరసనకు దిగారు. కాలువలో నీరు లేకపోవడంతో ఏకంగా దానిలోనే వరినాట్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం యండపల్లి పంచాయతీ పరిధిలోని యండపల్లి, గాంధీనగరం రైతులు పార్టీలకతీతంగా ఆదివారం బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. నీరున్నా.. చేరడం లేదు గుడ్లవల్లేరు లాకుల నుంచి వంతులవారీగా బంటుమిల్లి కెనాల్కు 250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నప్పటికీ నెల రోజులుగా కృత్తివెన్నుకు చుక్కనీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని, పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 150 ఏళ్లలో ఇదే దుస్థితి బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఇంతటి దుర్భర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని రైతులు తెలిపారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటితో కళకళలాడాల్సిన కాలువలు ఎండిపోవడం దారుణమన్నారు. నాట్లు వేసిన పంటలూ ఎండిపోయాయి మండలంలో ఈ ఏడాది సుమారు 7 వేల ఎకరాల్లో ఖరీఫ్ నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. అందులో దాదాపు 90 శాతం పంట నీరు లేక ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే కృత్తివెన్నుకు కాలువల ద్వారా సాగునీరు అందించా లని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గెజిట్లో హామీ.. నీరెక్కడ? కృత్తివెన్ను శివారు ప్రాంతంతో పాటు సముద్రతీరానికి సమీపంలో ఉండటంతో రెండో పంట రబీకి కూడా సాగునీరు అందించేలా గతంలో అప్పటి మల్లేశ్వరం ఎమ్మెల్యే పిన్నెంటి పమిడేశ్వరరావు ప్రభుత్వాన్ని ఒప్పించి గెజిట్లో పొందుపరిచేలా జీవో తీసుకొచ్చినట్లు రైతులు గుర్తుచేశారు. రెండో పంట సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క పంటకై నా సాగునీరు అందించకపోవడంపై వారు ప్రశ్నించారు. -
కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక
గుడ్లవల్లేరు: వేమవరం కొండలమ్మను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థాన కమిటీ చైర్మన్ ఈడె విష్ణు వెంకట మోహన్రావు, ఈఓ ఆకుల కొండలరావు స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందించారు. 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలి మధురానగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి శతాధిక వృద్ధులు ఈ నెల 15వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి వారికి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 93475 72766, 98481 11138 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ సొంత ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేసి తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బెంగళూరులో జరిగిన 80వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ మహిళల టీమ్ చాంపియన్ షిప్ టైటిల్ను ఏపీ సీనియర్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్లో తెలంగాణపై 3–1 స్కోర్తో ఏపీ జట్టు ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఫైనల్లో తమిళనాడు జట్టుతో పోటీ పడి ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 3–2 స్కోర్తో ఏపీ జట్టు విజయం సాధించింది. ఇదే చాంపియన్ షిప్లో ఏపీ జూనియర్ బాలుర జట్టు ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిభ చూపిన జట్లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి అభినందించారు. పామర్రు: పామర్రు మండలం కురుమద్దాలి రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9గంటలకు జాబ్మేళా నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిలో బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్సు కో లిమిటెడ్, కురకు పైనాన్సియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో ఇండియా పైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ పైవేట్ లిమిటెడ్, టీమ్ రెడ్ మేనేజ్మెంట్ పొల్యూషన్ పైవేట్ లిమిటెడ్ (డీబీఎస్ బ్యాంక్), పీటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 11కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి నరేష్కుమార్ మాట్లాడుతూ టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని తెలిపారు. అభ్యర్థులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయుఎన్వైఏఎం.ఏపీ.జీవోవి.ఐఎన్/ వెబ్సైట్లో పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతో పాటు, జాబ్ మేళాకు రెజ్యూమ్లతో లేదా బయోడేటా ఫారమ్లతో పాటు, ఆధార్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల్ జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96187 13243 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనచోదకుడు దుర్మరణం
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలం పరిధిలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. సెక్టార్ ఎస్ఐ బోనగిరి రాజు తెలిపిన వివరాల మేరకు నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మండ్రు కృష్ణంరాజు(37) వ్యక్తిగత పనులపై తన బైక్పై విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కిలేశపురం వద్దకు చేరుకునే సమయానికి వెనుక నుంచి దూసుకు వచ్చి న టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. ఈఘటనలో రోడ్డుపై పడిన కృష్ణరాజు మీదుగా లారీ దూసుకెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి ప్రాణాలు విడిచా డు. సంఘటన జరిగిన అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి లారీని వెంబడిస్తూనే ఎస్ఐ రాజుకు ఫోన్ ద్వారా సమాచా రం అందించాడు. హుటాహుటినా పోలీస్ వాహనంలో వెళ్లిన ఎస్ఐ దొనబండ క్వారీల రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కార్ల షోరూమ్పై పిడుగుపాటు
● రూ.30 లక్షల ఆస్తినష్టం ● ఆదివారం కావడంతో తప్పిన ప్రాణనష్టం ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ బస్డిపో పక్కన ఉన్న హ్యూండాయ్ కార్ల షోరూమ్పై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో షోరూమ్ మొదటి అంతస్తుపై పిడుగు పడటంతో రెండు క్యాబిన్లు దగ్ధం అయ్యాయి. ఇందులో అడ్మినిష్ట్రేషన్ గది, కంప్యూటర్లు కాలిపోయాయి. ఏసీలు, ఫర్నిచర్ సర్వర్ గదితో పాటు కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో షోరూమ్పై పిడుగు పడటంతో మంటలు వచ్చాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కన ఉన్న కార్లకు నిప్పు అంటుకోకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం కావడంతో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. తప్పిన పెనుప్రమాదం.. ఆదివారం కావడం వల్ల షోరూమ్లో పనిచేసేవారు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సోమవారం నుంచి శనివారం వరకు వారంలో సుమారు 100 నుంచి 120 మందికి పైగా ఇక్కడ పనిచేస్తారని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. స్పేర్పార్ట్లు, కార్లు సర్వీస్ చేస్తుంటారు. ఆదివారం కావడం వల్ల కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, పిడుగు పడిన సమయంలో వారంతా వేరే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కార్లు ఉన్న ప్రాంతంలో పిడుగు పడి ఉంటే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని సమాచారం. -
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. జగనన్న విద్యాకానుక పేరును మార్చి వాటి నాణ్యతను పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరచి మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కిట్లు అందలేదు. అందిన వాటి నాణ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ, విద్యార్థి విభాగం -
వస్త్ర దుకాణంలో రూ.11 లక్షలు కాజేసిన క్యాషియర్
కృష్ణలంక(విజయవాడతూర్పు): పని చేసే చోటనే ఓ క్యాషియర్ తన చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.11 లక్షల సంస్థ సొమ్మును కాజేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సారపరెడ్డి సాయికుమార్ నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలో ఉన్న ఓ వస్త్ర షోరూంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ కస్టమర్ తమ క్రెడిట్ బిల్లును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ బ్రాంచ్కు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆ బిల్లును వెరిఫై చేయగా ఆ క్రెడిట్ బిల్లును విజయవాడ బ్రాంచ్లోనే వినియోగించినట్లు చూపిస్తుందని చెప్పారు. అనుమానం వచ్చిన మేనేజర్ పి.బాలకృష్ణ విజయవాడ బ్రాంచ్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా సాయికుమార్ స్వయంగా ఆ క్యాష్ను విత్డ్రా చేసినట్లు కనిపించింది. ఫుటేజీ ఆధారంగా అతడిని పిలిచి ప్రశ్నించగా తాను రూ.31,449లను సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. అంతటా ఆ మొత్తాన్ని షోరూమ్కు చెల్లించి రాతపూర్వకంగా రాసిచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఘటన తర్వాత షోరూం యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా రూ.11 లక్షలకు సంబంధించిన బిల్లులను అదేవిధంగా మోసం చేసి నగదు తీసుకున్నట్లు తేలింది. సంస్థను మోసం చేసిన సాయికుమార్పై చర్యలు తీసుకోవాలని షోరూం మేనేజర్ బాలకృష్ణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగాయలంక: వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడు కరుణించాలని సంకల్పంతో స్థానిక కృష్ణానది తీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్లో కొలువైన శ్రీరామలింగేశ్వర శివలింగానికి ఆదివారం సహస్ర ఘటాల(1008)తో కృష్ణానదిలోని సముద్రపు జలాలతో భక్తులు విశేష అభిషేకం నిర్వహించారు. ప్రసన్న గణ పతి దేవస్థానం అర్చకుడు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం, భక్తుల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘటాలతో తెచ్చిన నదీ జలం నేరుగా శివలింగంపై కాకుండా పైపులో పోసిన నీరు శివలింగంపై పడేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం శివలింగాన్ని పూర్తిగా మూసివేస్తూ ఇటుకలతో చతురస్రం గది నిర్మించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు జలాభిషేకం కొనసాగింది. అనంత రం స్వామికి నవహారతులు సమర్పించారు. సాయంత్రం అభిషేకం పూర్తయ్యే సమయానికి రోజూ మాదిరిగానే వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన మార్కాపురం వెంకటరమణ, వెంకటేశ్వరరావు(55)లు భార్యాభర్తలు. వెంకటేశ్వరరావు బార్బర్ షాపు నడుపుతుంటాడు. ఈ నెల 3న షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న వెంకటేశ్వరరావును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేశ్వరరావును అజిత్సింగ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఘటనపై వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరపాలక సంస్థకు ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయమని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్.. పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి పాలనలో ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రోడ్లు, పార్క్లు, వాటర్ట్యాంకులు ప్రారంభిస్తే కూటమి నేతలు సిగ్గు లేకుండా సొంత పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారన్నారు. మనం ప్రజల కోసం పనిచేస్తే.. కూటమి ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా గెలిచేది మరోసారి వైఎస్సార్ సీపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంత మంది పోలీసులు వచ్చినా, గుండాలు, రౌడీలు వచ్చినా పార్టీ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని పేర్కొన్నారు. వెన్నుపోటు పాలనకు రెండున్నరేళ్లు.. వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ప్రజానీకానికి కూటమి వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఈ నెల 23 నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. పాంప్లెట్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ప్రజానీకానికి తెలియజేయాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గానికి సుమారు ఏడు వేల మందికి పార్టీ పదవులు ఇచ్చారని, వారంతా అప్రమత్తంగా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని 28 డివిజన్లలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇంటింటికీ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడిస్తారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును ఇస్తారన్నారు. అనంతరం పార్టీల్లో వివిధ పదవుల్లో నియమితులైన ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, మనోజ్ కొఠారి, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
రుణాల పేరుతో వల
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరగాళ్లు పోలీసుల అంచనాలకు సైతం అందకుండా కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. అసలు ఏ రూపంలో మోసగాళ్లు వస్తున్నారో తెలుసుకోవడం ఇప్పుడు పోలీసులకు పెద్ద చాలెంజ్గా మారింది. రుణాలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగతున్న సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇటీవల సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసు మాషా అల్లా కూడా ఇన్స్టా వేదికగా చేసిన ప్రచారంతోనే ప్రజలు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ● మీ ఓటీపీ, సీవీవీ, పిన్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత కాల పొదుపులను క్షణాల్లో కోల్పోయేలా చేస్తుంది. ● ఆన్లైన్లో అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, తెలియని ఏపీకె ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ● ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. ● లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్షణ లోన్ పేరుతో వచ్చే అనధికారిక యాప్స్ను నమ్మవద్దు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు అంటూ ముందుగా చెల్లింపులు చేయవద్దు. ● ఒక్క క్లిక్ మీ ఫోన్ మొత్తం ప్రమాదంలో పడవచ్చు. ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చే నకిలీ లింకులు, ఏపీకే ఫైల్స్ను నమ్మవద్దు. ● మొబైల్ పోయిన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించి, సీఈఐఆర్ ద్వారా ఐఎంఈఐని బ్లాక్ చేయించాలి. ● కేవలం 15 నిమిషాల ఆలస్యం కూడా నష్టాన్ని పెంచవచ్చు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఇన్స్ట్రాగామ్లో అన్వేషించడం మొదలు పెట్టింది. దానిలో ఉద్యోగ అవకాశాలు అనే ప్రకటన చూసి, వివరాలు తెలుసుకుంది. ఆమెకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తానని నమ్మించి దాదాపు రూ.2 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశారు. ఇలా మోసగాళ్లు ఈజీమనీ కోసం కొత్త కొత్త ఎత్తులను ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఏదో రూపంలో వారిని దోపిడీ చేస్తూ, మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కంచికచర్ల ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తకు గుండె వైద్యం కోసం రూ.10 లక్షల వరకూ అప్పుచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు కూడా చదువు పూర్తయినా ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద రూ.50 లక్షల వరకూ రుణ మంజూరు అవుతుందని చెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె.. అంత మొత్తం అవసరం లేదు. సగం ఇప్పించినా చాలని చెప్పి, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చింది. అప్పుడే అసలు కథ మొదలైంది. టీడీఎస్ ముందుగా చెల్లించాలని, ప్రాసెసింగ్ చార్జీలంటూ దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆమె నుంచి వసూలు చేశారు. అనంతరం ఫోన్ కలవడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తెలియని వ్యక్తి నుంచి పంపిన లింక్లను క్లిక్ చేయకూడదు. అంతేకాదు తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోన్కాల్స్తో మాట్లాడటం కూడా సురక్షితం కాదు. వీడియో కాల్స్ అసలు మాట్లాడవద్దు. ఇటీవల కాలంలో ఇన్స్టా, ఫేస్బుక్ వంటి వాటిలో ఆకర్షణీయమైన ప్రకటనలు వస్తున్నాయి. వాటిని క్లిక్ చేసే మీ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం, ఓటీపీ చెప్పమని ఫోన్ చేస్తుంటారు. అలాంటి వాటిని నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. ఏదైనా మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి సమాచారం ఇవ్వండి. – డి.చవాన్, ఇన్స్పెక్టర్, ఎస్ఆర్ పేట -
అన్నప్రసాదానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ ఎస్బీఐ కాలనీకి చెందిన బొప్పన దుర్గా వెంకట్రామ్ కుటుంబం రూ.1,00,005, ప్రజాశక్తినగర్కు చెందిన దావూలూరి ప్రభాకరావు కుటుంబం రూ.1,00,005, మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టి.తారక రామారావు కుటుంబం రూ. 1.16 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. -
సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8,28,687లు ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా టికెట్ల ద్వారా రూ.7,16,051లు, డొనేషన్లు రూ.1,12,636 మొత్తం రూ.8,28,687 ఆదాయం సమకూరిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బాల్య వివాహాల నిర్మూలనపై భారతదేశం నుంచి వినిపించిన గళం నేడు ప్రపంచ స్థాయి సంకల్పంగా మారిందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి.కీర్తి అన్నారు. దేశంలోని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థ చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించి, నవంబర్ 27న బాల్య వివాహాల నిర్మూలన దినంగా ప్రకటించడం గొప్ప విషయమని ఆమె పేర్కొనారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ భాగస్వాములతో కలిసి ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (బాల్య వివాహ రహిత భారత్) ప్రచారాన్ని 2024 సెప్టెంబర్లో ప్రారంభించామన్నారు. జిల్లాల్లోని ఏదో ఒక గ్రామంలో కనీసం ఒక్క బిడ్డ అయినా బాల్య వివాహం ముప్పులో ఉన్నంత కాలం, మా పోరాటం అసంపూర్ణంగానే ఉంటుందని చెప్పారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేమని ఆమె పేర్కొన్నారు. అందుకే పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఏపీ కో ఆర్డినేటర్ బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి యువకుడు గల్లంతైన ఘటనపై ఆదివారం ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. కాజా గౌరీ శంకర్(26) కేదారేశ్వరపేట పండ్లమార్కెట్లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని అక్క రౌతు లక్ష్మి కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి ఇంటో డబ్బులు ఇవ్వకపోవడంతో అక్క నిలదీసింది. డబ్బులు తీసుకొస్తానని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గౌరీశంకర్ అక్క అతను పనిచేసే మేస్త్రికి ఫోన్ చేయగా ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం తమ్ముడికి రౌతు లక్ష్మి ఫోన్ చేయగా సాయంత్రం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గౌరీ శంకర్ మీసాల రాజారావు వంతెనపై నుంచి ఏలూరు కాలువలో దూకినట్లు తెలిసిన వారు ఫోన్ చేసి తెలపగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఎన్పురం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి గౌరీశంకర్ కోసం గాలింపు చేపట్టారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
తమ్ముడి పిల్లలను చూసేందుకు వెళ్తూ..
● బైక్ను మోపెడ్ ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయిన ప్రైవేట్ టీచర్ ● అతనిపై నుంచి వెళ్లిన ట్రాక్టర్.. చికిత్స పొందుతూ మృతి కంచికచర్ల: ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తన తమ్ముడి పిల్లలను చూసేందుకు విజయవాడ వెళ్తుండగా కీసర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు జగ్గయ్యపేట హయత్నగర్లో నివాసముంటున్న దాసరి అనిల్ సుందర్(41) జగ్గయ్యపేట సమీపంలోని బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో విజయవాడలో ఉన్న తన తమ్ముడి పిల్లలను చూసేందుకు బైక్పై బయలుదేరాడు. కంచికచర్ల మండలం కీసర సమీపంలోకి రాగానే టీవీఎస్ మోపెడ్ను అడ్డదిడ్డంగా నడుపుతున్న వ్యక్తి బైక్ను ఢీ కొట్టాడు. దీంతో బైక్పై ఉన్న అనిల్ సుందర్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో విజయవాడ వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అనిల్ సుందర్పై నుంచి వెళ్లింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ సుందర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాల వివరాలపై దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు. -
నందమూరినగర్లో రెచ్చిపోయిన దొంగలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందమూరినగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే ఇంటి తాళాలు పగలకొట్టి ఆ ఇల్లును కొల్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరినగర్ ఏడో లైన్లో మొండి రేవతి, వెంకట రమణ దంపతులు నివసిస్తున్నారు. భర్త మహేంద్ర కంపెనీలో పనిచేస్తుండగా రేవతి ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 5వ తేదీన వెంకటరమణ తన పనులకు వెళ్లిపోగా ఉదయం 10 గంటలు దాటిన తరువాత రేవతి తన ఇంటికి తాళాలు వేసి వారి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలకొట్టి కనిపించాయి. బెడ్రూమ్లోని అలమరలో దాచుకున్న 97 గ్రాముల బంగారపు వస్తువులతో పాటు రూ.74 వేల నగదు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకూ అజిత్సింగ్నగర్ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన ఐదు గంటల వ్యవధిలోనే ఇంట్లో దొంగతనం జరగడంతో పోలీసులు ఇది పాత నేరస్తుల పనా.. లేక బాధితులకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఛోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల వివరాలను రాబడుతున్నారు. 97 గ్రాముల బంగారం, రూ.74 వేలు నగదు చోరీ -
వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ జోన్–2 తొలిదశ ఉద్యమ కార్యాచరణ సమాయత్త సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.660 విలువ కలిగిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం (ఏఏఎస్) ప్రయోజనాన్ని అమలు చేయడానికి సంవత్సర కాలంగా తాత్సారం చేయటం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.. బీఎల్ఓ విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించిన నిధులను సంవత్సర కాలంగా పెండింగ్లో ఉంచారన్నారు. మరో వైపు మూడు నెలలుగా సర్ పేరుతో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం కూడా సెలవు లేకుండా నిరంతరం విధులు చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, జేఏసీ నేతలు హరీష్, చవెంకటేశ్వర్లు, రవితేజ, సిద్దేశ్వరరెడ్డి, పి.అపర్ణ, రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూడే చంద్రకుమార్, కృష్ణాజిల్లా చైర్మన్ పువ్వల కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక ( పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. వారికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ఖడ్గమాలార్చనను రెండు షిఫ్టులలో నిర్వహించారు. ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో సైతం ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అరగంట తర్వాత తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో రద్దీ మరింత అధికం కావడంతో మహా నివేదన అనంతరం అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి రూ. 500 టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. దీంతో వీఐపీలు, సిఫార్సులపై విచ్చేసిన వారికి సైతం అంతరాలయ దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్కార్ బడుల్లో చిన్నారుల భుజాలపై పుస్తకాల బరువుతోపాటు.. చిరిగిన బ్యాగుల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన ‘విద్యార్థి మిత్ర’ కిట్లలోని బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పుస్తకాలు కింద పడిపోకుండా చేతులతో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు. నాడు నాణ్యతతో కూడిన కిట్లు రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్కార్ బడుల్లో చిన్నారులకు అన్ని రకాలుగా అండగా ఉండే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ క్రమంలో పుస్తకాలు, వర్క్బుక్, యూనిఫామ్, బూట్లు, బెల్టు, సాక్సులు ఇలా నాణ్యమైన పలు వస్తువులతో కూడిన బ్యాగ్ను విద్యార్థులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విద్యార్థులు వాపోతున్నారు. పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టుగా పేరు మార్చి నాణ్యత లేని వస్తువులను ఇస్తున్నారని మండిపడుతున్నారు. అంతంత మాత్రంగా పంపిణీ ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 920 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 88,432 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారందరికీ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయాల్సి ఉంది. 2025–2026 విద్యా సంవత్సరంలో ఉన్న సంఖ్యలో పదో తరగతి విద్యార్థులను తీసివేసి ఇండెంట్ను అధికారులు పంపించారు. కొత్తగా చేరిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన కిట్లు రాకపోవడం, పాఠశాలలు మానివేసిన పాత విద్యార్థుల కిట్లను కొత్తవారికి అందించారు. పాఠశాలలు తెరిచి మూడు మాసాలైనా ఇంకా చాలా మందికి పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు అందలేదని విద్యార్థులు వివరిస్తున్నారు. బ్యాగులు, బూట్లు ఇప్పటికీ చాలా మందికి పెండింగ్లో ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. నాసిరకంతో అవస్థలు విద్యార్థులకు అందిన బ్యాగులు ఇతర వస్తువులు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాగులు విద్యార్థులకు అందించిన నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం ప్రారంభమైంది. పుస్తకాలతో బడికి వెళ్తున్న విద్యార్థులు వాటిని తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూట్ల విషయంలోనూ అదే నాణ్యత వెంటాడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల సీపీఎం నేతల బృందం ఎ.కొండూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో సమావేశమైనప్పుడు వారి స్కూల్ బ్యాగులు చూసి అవాక్కయ్యారు. చిరిగిన బ్యాగులతో విద్యార్థులు అవస్థలు పడటంపై వారు నాణ్యతపై ప్రశ్నించారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చిరిగిన బ్యాగులతో కుస్తీ పడుతున్నారు. మండిపడుతున్న తల్లిదండ్రులు చిన్నారుల అవస్థలను చూసి తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే కిట్లు గతంలో చక్కగా ఉండటమే కాకుండా మా పిల్లలు ఇబ్బందులు లేకుండా బడులకు వెళ్లే వారని ఇప్పుడు పుస్తకాలు బ్యాగ్లో నుంచి ఎక్కడ పడిపోతాయోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అందించే బ్యాగులు, బూట్లు నాణ్యమైనవి ఇస్తే బాగుం టుంది. పిల్లలను ఎందుకు కష్టాలపాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.8716 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.కాగా, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమా వేశం జరిగింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, విద్యుత్ సబ్స్టేషన్లలో ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ మొదలైనఅంశాలపై చర్చించారు. అనంతరం పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తరచూ ట్రిప్పింగ్కు గురయ్యే ఫీడర్లు, ఓవర్ లోడ్ అవు తున్న ట్రాన్స్ఫార్మర్లు, బలహీనంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. పీక్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎల్నినో ప్రభావం నేప థ్యంలో డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితులు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు ,సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న శేషుకుమార్
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాధిపతి డాక్టర్ కె.ఆర్.జి.శేషు కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శనివారం అవార్డు అందుకున్నారు. శేషుకుమార్కు శాలువా, జ్ఞాపిక, సర్టిఫికెట్, మెడల్తోపాటు, రూ.20 వేల నగదు పారితోషకం అందజేశారు. ఈ సందర్భంగా శేషుకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందు కోవడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, అధ్యాపక సిబ్బంది, పలువురు విద్యార్థులు శేషుకుమార్, మరో అవార్డు గ్రహీత ముప్పా పద్మనాభంను అభినందించారు. -
అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంధ క్రికెటర్లకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య పాలసీని కల్పిస్తున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశి నేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఏసీఏ కార్యాలయంలో అంధ క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ.. ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పు ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను అందజేశామన్నారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ క్రికెట్ అభివృద్థికి ఏసీఏ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇ.అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు, క్రీడాకారులు వెంకటేష్, రవి, దున్నా వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి పాలసీ పత్రాలను అందుకున్నారు. డెఫ్ క్రికె టర్ యశ్వంత్ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నారెడ్డిని సత్కరించారు. భారత అండర్–19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై న కాట్రగడ్డ దీక్షను శివనాథ్ అభినందించారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ ఎనికేపాడు కేవీఆర్ కాల నీకి చెందిన పి.రవిశంకర్ దంపతులు అమ్మవారిని దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన చుండూరి శ్రీనివాసరావు దంపతులు అన్నదా నానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీ ర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్బాబు, ఆలయ అధికారి శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. యువకుడు ఆత్మహత్య గన్నవరం: కుటుంబ సభ్యులు మందలించా రని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముస్తాబాదలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముస్తాబాదకు చెందిన నర్రా నాగసాయిరామ్(30) గ్రామంలో షామియానా దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య ప్రసవం నిమిత్తం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను రోజు మద్యం తాగుతున్నాడు. నాగసాయిరామ్ను తండ్రి, సోదరుడు గట్టిగా మందలించారు. మనస్తాపా నికి గురైన నాగసాయిరామ్ ఉదయం 11 గంట లకు ఇంటిలో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ ఎస్ఐ అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్: పోలీస్ సబ్ ఇన్స్పె క్టర్ను అంటూ ద్విచక్ర వాహనదారుడి నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కున్న ఓ నకిలీ ఎస్ఐని హనుమాన్జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హనుమాన్జంక్షన్ సీఐ ఎల్. రమణ, ఎస్ఐ ఎం.శ్రీవివాస్తో కలిసి శనివారం వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వేలేరుకు చెందిన మాధవరపు సాంబయ్య తన బావమరిది సత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై హనుమాన్జంక్షన్కు బయలుదేరాడు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో నకిలీ ఎస్ఐ సరిహద్దు దుర్గాంజనేయులు వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. వాహనానికి నంబర్ ప్లేట్ లేనందున జరిమానా చెల్లించాలని బెదిరించాడు. నగదు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతామంటూ హెచ్చరించాడు. సాంబయ్య జేబులోని రూ.6 వేలను బలవంతంగా లాక్కున్నాడు. పోలీస్ యూనిఫాం లేకుండా ఓ వ్యక్తి రోడ్డుపై దౌర్జన్యం చేయటంపై అనుమానం వచ్చిన సాంబయ్య, సత్యనారాయణ తమ వద్ద డబ్బు లాక్కున్న దుర్గాంజనేయులను నిలదీశారు. దీంతో అతను వారిద్దరిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన సాంబయ్య హనుమాన్జంక్షన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టిన హనుమాన్జంక్షన్ ఎస్ఐ ఎం.శ్రీనివాస్ గన్నవరం రాయనగర్కు చెందిన సరిహద్దు దుర్గాంజనేయులు నకిలీ ఎస్ఐగా చెలామణీ అవుతూ వాహనదారులను బెదిరించి, డబ్బులు లాక్కుంటున్నట్లుగా గుర్తించారు. హనుమాన్జంక్షన్ శివారులోని వేలేరు క్రాస్రోడ్డు వద్ద శనివారం దుర్గాంజనేయులు ఉన్నట్లుగా సమాచారం అందటంతో తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు సీఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
ఉయ్యూరు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఉయ్యూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధర్మేంద్ర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పెద ఓగిరాలలో కొంత మంది యువకులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎస్ఐ సురేష్బాబు తన సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. నిందితులు పోలిమెట్ల సందీప్, కట్టా నాగబాబు, చాగంటిపాటి ఆకాశ్, చీలి భార్గవ్, తలకంటి షణ్ముఖ్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో కంకిపాడు సీఐ బి.బి. రవికుమార్, ఎస్ఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
హోల్సేల్ కాంప్లెక్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఫుడ్ (ఐపీఎం) డైరెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్లం, తేనె నమూనాల సేకరణపై ఫుడ్ సేీఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా శని వారం గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ హోల్సేల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఇద్దరు ప్రముఖ బెల్లం వ్యాపారుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రంగు కలిపిన బెల్లం ఉన్నదన్న అనుమానంతో దాదాపు 3,500 కేజీల స్టాక్ను సీజ్ చేశారు. ఈ బెల్లం శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం చైన్నెలోని ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదనంతర చర్యలు తీసుకోనున్నారు. ఈ సంద ర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజులుగా హోల్సేల్ కాంప్లె క్స్లో 15 వరకు బెల్లం శ్యాంపిల్స్ తీశామని, వాటిల్లో కేసు నమోదు చేయగలిగే విధంగా మూడు ఉన్నాయని తెలిపారు. ఈ మూడు రోజుల్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే ఐదు వేల కేజీల బెల్లాన్ని సీజ్ చేశామని చెప్పారు. తాము సేకరించిన శ్యాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని, వాటిల్లో రంగు కలిసినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వలాభంతో బెల్లంలో సల్ఫర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. సల్ఫర్ 100 పీపీఎం మించి వాడితే ప్రాణాలకు ప్రమాదమని, రంగు వేసిన బెల్లంతో క్యాన్సర్ (కార్సినోజెనిక్) వచ్చే ప్రమాదం ఉందని, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం రంగులు వాడట నిషేధమని వ్యాపారులను హెచ్చరించారు. -
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
యూపీహెచ్సీలో తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని భవానీపురం 3వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు మంగళవారం సందర్శించారు. సిబ్బంది ముఖ ఆధారిత హాజరు, వారి పనితీరు, ప్రగతి నివేదికలను పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ప్రగతి, అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. అక్కడి ఫార్మసీని పరిశీలించి, త్వరలో కాలం చెల్లనున్న మందులు, అత్యవసర మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాల లభ్యత, వాటి భద్రత, ఐఎల్ఆర్ మెయింటేన్ చేయు విధానం, ఓపెన్ వయోల్ పాలసీ, కోల్డ్ చైన్ సిస్టమ్ నమోదు వంటి అంశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని, తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల సమయ పాలనలో విజయవాడ డివిజన్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఉన్న 90.80శాతం నెలవారి సమయపాలనను అధిగమించి ఆగస్టు నెలలో 91.28 శాతం నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించడం పట్ల డీఆర్ఎం మోహిత్ సోనాకియా విజయవాడ డివిజన్ అధికారులు, సిబ్బందిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషి, సమన్వయ ప్రయత్నాల వల్లే అద్భుతమైన సమయపాలన సాధ్యమైందన్నారు. అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో సురక్షితమైన కార్యకలాపాలతో ప్రయాణికులకు సకాలంలో సేవలు అందించడంలో డివిజన్ నిబద్దత ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మెరుగైన ఫలితాలను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని భవానీపురం పున్నమీఘాట్లో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్, సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ(సరస్) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పున్నమీఘాట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడంతోపాటు గ్రామీణ కళాకారులు, చేతి వృత్తిదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం కల్పించడమే విజయవాడ ఉత్సవ్, సరస్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు 2016 యూజీసీ పీఆర్సీ బకాయిలు చెల్లింపుతో పాటు మరిన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. అంతేకాకుండా 30 నిమిషాల పాట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి 2021 వరకూ తమకు పనిచేసిన కాలానికి రావాల్సిన జీతభత్యాలు ప్రభుత్వం వద్ద బకాయి ఉన్నట్లు తెలిపారు. వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఎస్ఎంసీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జ్వలిత, కార్యదర్శి డాక్టర్ పి. అనీల్కుమార్, కోశాధికారి డాక్టర్ దుర్గారాణి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
మెరక పేరిట మేసేస్తున్నారు!
బుడమేరులో బుసక బూచోళ్లను అడ్డుకునేదెవరు?జి.కొండూరు: బుడమేరు ఉప్పెన గాయాలు ఇంకా మానకముందే టీడీపీ నాయకులు బుడమేరును చెరబడుతున్నారు. తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ బుడమేరునే ఆదాయ వనరుగా మార్చుకొని.. అడ్డూ అదుపూ లేని తవ్వేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం మనదే.. ప్రజా ప్రతినిధి మనోడే.. అధికారీ మనోడే.. ఇక మనకి అడ్డేముంది అన్నట్లు సాగుతోంది బుడమేరులో బుసక, ఇసుక దందా. దీనిని అడ్డుకోవడానికి అధికారులకు మనసొప్పకపోవడంతో దందాలో అధికారుల పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. యథేచ్ఛగా తవ్వకాలు.. బుడమేరులో ఇసుక, మట్టి కలిసి మెత్తటి బుసకగా ఏర్పడడమే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ బుసకను రియల్ ఎస్టేట్ వెంచర్లలో మెరక కోసం ఎక్కువగా వినియోగిస్తుండడంతో అక్రమార్కుల పంట పండింది. మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ శివారులోని బుడమేరులో గత మూడు రోజులుగా రెండు పొక్లయిన్లతో బుసక తవ్వకాలు జరుపుతూ ముప్పై ట్రాక్టర్లతో సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కోసం మెరక చేసేందుకు తరలిస్తున్నారు. కట్టల వెంబడి, స్థానిక వంతెనకు సమీపంలో తవ్వకాలు చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బుసకను ట్రాక్టరు ట్రక్కు దూరాన్ని బట్టి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా వెలగలేరు హెడ్రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు 42కిలోమీటర్లు మేర విస్తరించి ఉండడంతో ఈ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలలో వెంచర్లతో పాటు ఎటువంటి వాణిజ్య అవసరాలున్నా టీడీపీ నాయకులు వెంటనే వాలిపోయి గత రెండేళ్లుగా తవ్వకాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. నిత్యం ఇసుక తవ్వకాలు.. బుడమేరులో ఎటువంటి ఇసుక రీచ్లకు అనుమతి లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఇసుక తవ్వకాలను నిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. సీసీ రోడ్లు, పక్కా డ్రెయిన్ల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు వంటి నిర్మాణాల్లో కృష్ణానది ఇసుకను వాడాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బుడమేరు ఇసుకనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లు, ఇసుక రవాణాదారులు టీడీపీ నాయకులే కావడంతో నాణ్యతలేని బుడమేరు ఇసుక వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ విధంగా పుల్లూరు, చండ్రగూడెం, మైలవరం, చిన్ననందిగామ, కుంటముక్కల, వెల్లటూరు గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ట్రాక్టరు ఇసుక దూరాన్ని బట్టి రూ.1500నుంచి రూ.2వేల వరకు కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు.ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరులో బుసక, ఇసుక తవ్వకాలతో విధ్వంసం సృష్టిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం దుర్మార్గం. గత చేదు అనుభవాలతోనైనా అధికారుల బుద్ధి మార్చుకోకపోతే రైతులే పోరాటానికి దిగుతారు. బుడమేరులో ఇదే తీరు కొనసాగితే కట్టలు కోతకు గురై ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. – పీవీ ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండల పరిధి దుర్గం కొండల్లోని జమ్ములవోలు ప్రాంతంలో ప్రారంభమైన బుడమేరు వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వరకు 42కిలోమీటర్లు మేర ఎగువన ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే బుడమేరు ఆక్రమణకు గురై వాగు వెడల్పు తగ్గిపోవడంతో పాటు గతంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడం వల్ల కట్టలు బలహీనపడి 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు 80కిపైగా గండ్లు పడి తీవ్ర నష్టం వాటిల్లింది. మరలా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బుడమేరులో తవ్వకాలు జరపడం ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కట్టల వెంబడి పొక్లయిన్లతో భారీ గోతులు పెట్టి తవ్వకాలు జరపడం వల్ల కట్టలు కోతకు గురై వరదల సమయంలో మరలా గండ్లు పడితే తీవ్ర నష్టం జరుగుతుందని పరీవాహక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి
న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మిచిలకలపూడి(మచిలీపట్నం): జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి అన్నారు. జీవిత బీమా సంస్థ డివిజన్ కార్యాలయంలో మంగళవారం సంస్థ 70వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేద వారికి, ప్రజలకు ఉచిత న్యాయసేవా కార్యక్రమాలను అందిస్తోందన్నారు. ఎల్ఐసీ కార్పొరేట్ పథకం ప్రారంభం.. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ నున్న నాగేశ్వరరావు ఎల్ఐసీ కార్పొరేట్ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాలసీల అంశంలో 65.16 శాతం, ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం మార్కెట్ వాటాను కై వసం చేసుకుని జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో లీడర్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. వారోత్సవాల సందర్భంగా 7వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎల్ఐసీ డివిజనల్ అధికారి మహమ్మద్ఖాజా, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, కేడీవీఎస్ కృష్ణ, సీహెచ్ వెంకటరమణ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి ప్రదాత
మరపురాని మహానేత..సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతన్న బాగుండాలని కలలు కన్నారు.. ఆ కలలను సాకారం చేసి చూపించారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం పులిచింతల ప్రాజెక్టు కట్టారు. 150ఏళ్ల డెల్టాను ఆధునికీకరించాలని తలపెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం విడదీయరానిది. ఆయన ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం చేపట్టి రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను నిలిపి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆయన చేసిన మేలును మనసారా స్మరించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాపై చెరగని సంతకం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు రెండింటినీ ఒకేసారి అమలుచేసి అన్ని వర్గాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణా జిల్లాలో రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, అధికారులుగా తీర్చిదిద్దారు. అభివృద్ధిపై ‘రాజన్న’ ముద్ర ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఆయన వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. -
డేగ కన్ను కప్పి..
బరితెగిస్తున్న గంజాయి మాఫియాసాక్షి ప్రతినిధి, విజయవాడ: గంజాయి నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం.. గంజాయి రవాణాపై సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం, పోలీసులు ఊదరగొడుతున్నా.. వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. గంజాయి మాఫియా తెగబడుతోంది. ఆఖరికి పోలీసు కానిస్టేబుళ్ల మీదే కత్తితో దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే గంజాయి మాఫియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర యర్నగూడెం గ్రామం వద్ద ఎన్హెచ్ సర్వీస్రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బైక్లను ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి పారిపోయారు. ఆ నిందితులు కంకిపాడు సమీపంలో ఉన్నట్లు వచ్చిన సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు కంకిపాడు మండలం కోమటికుంట లాకులు డొంకరోడ్డు వద్ద పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అఖిదాసరి అవినాథ్ అనే నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద కత్తితో ఛాతీపై దాడి చేశాడు. దీంతో కంకిపాడు సీఐ నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యం.. ఒకవైపు వందల కిలోల గంజాయి రవాణా చేస్తూ ముఠాలు పట్టుబడుతుంటే.. మరోవైపు వాటి వెనుక ఉన్న అసలు నెట్వర్క్ను ఛేదించడంలో పోలీసుల దర్యాప్తు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ నెలలో పట్టుబడిన 140 కిలోల గంజాయి రవాణా కేసులో మహమ్మద్ సొహైల్ పేరు ప్రధానంగా తెరపైకి రావడం, అతడు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పటమట పోలీసు కస్టడీ నుంచి పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల 9న తెల్లవారుజామున విజయవాడ శివారు నిడమానూరులో ఈగల్ బృందం ఓ లారీని తనిఖీ చేయగా, అందులో 140 కిలోల గంజాయి దొరికింది. లారీ డ్రైవర్లను విచారించగా తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఈగల్ బృందం లారీని, ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారణ నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించింది. ఈ నిందితులు ఇచ్చిన సమాచారంతో గంజాయి రవాణాకు కీలక సూత్రధారులైన కేరళకు చెందిన మహ్మద్ సొహైల్, ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్కుమార్ సింగ్ను కూడా ఈగల్ అధికారులు విశాఖపట్నంలో పట్టుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే వీరిలో కింగ్పిన్ అయిన సొహైల్ జూన్ నెల 11న తెల్లవారుజామున పటమట పోలీసుల కళ్లు గప్పి వారి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. సొహైల్ను ప్రవేశపెట్టకముందే పరారవడంతో పోలీసులు కంగుతిన్నారు. విషయం బయటకు పొక్కకుండా దాచారు. ఈ ఉదంతంపై సీపీ రాజశేఖర బాబు పటమట పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ సొహైల్ను పట్టుకోలేకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిలోల కొద్దీ గంజాయి.. నగరానికి ఎలా చేరుతోంది? ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలను కలుపుతూ గంజాయి రవాణా నెట్వర్క్ పనిచేస్తున్నట్లు కేసు వివరాల్లో ప్రస్తావించారు. నిడమానూరు వద్ద పట్టుబడిన 140 కిలోల గంజాయి కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు సమాచారం. ఇంత భారీ పరిమాణంలో గంజాయి నగర పరిధిలోకి వస్తుంటే పోలీసుల నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోంది? వాహనాలు నగరంలోకి ప్రవేశించే మార్గాలు, జాతీయ రహదారులు, బైపాస్లు, లాడ్జీలు, గోదాములు, రవాణా కేంద్రాలపై నిరంతర నిఘా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఇలాంటి భారీ సరుకులు పట్టుబడుతున్న సందర్భాలు మాత్రం ఆ నిఘా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. విజయవాడ భౌగోళికంగా కీలక రవాణా కేంద్రం. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలు ఉండటంతో అక్రమ రవాణా ముఠాలకు నగరం ట్రాన్సిట్ పాయింట్గా ఉపయోగపడుతుందన్న వాదన వినపడుతోంది. గతంలోనూ విజయవాడ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనలు నమోదయ్యాయి. 2025లో కృష్ణలంక పోలీసుల పరిధిలో ఈగల్ బృందంతో కలిసి పోలీసులు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా గంజాయిని లేకుండా చేస్తామని చెబుతున్నా వాస్తవంలోకి వచ్చేసరికి అంత చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది. -
గ్రేటర్ లేనట్టే!
● ఊరించి.. ఉసూరుమనిపించారు!సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడకు గ్రేటర్ యోగం ఇప్పట్లో లేనట్టే! మొన్నటివరకూ గ్రేటర్ అంటూ ఊరించిన ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 64 డివిజన్ల స్థానంలో 86 డివిజన్లకు పెంచుతూ శుక్రవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ మూడు సర్కిళ్లు పరిధిలో ప్రస్తుతం 64 డివిజన్లుగా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్ విజయవాడగా మార్చేందుకు 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనికిగాను విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలను కలుపుకుని గ్రేటర్గా రూపాంతరం చేయటానికి కొంతమేర కసరత్తు కూడా చేసింది. 61.88 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడను పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాలు, మైలవరం మండలాల్లో ఉన్న 46 గ్రామాలతో తొలుత 330 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అప్పటి మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ కూడా గ్రేటర్ ప్రతిపాదనపై చురుగ్గా వ్యవహరించి గ్రామాలతో కూడా చర్చలు జరిపారు. అయితే తర్వాత ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. మళ్లీ ఎన్నికల ముందు గ్రేటర్ అంటూ హామీలు ఇచ్చారు. 2025లో మళ్లీ గ్రేటర్ ప్రతిపాదన రాగా ఆయా మండలాల్లో 75 గ్రామాలను విలీనం చేయాలని, 500 కిలో మీటర్లు విస్తీర్ణంలో గ్రేటర్గా మార్చాలని ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిపై గత ఏడాది డిసెంబర్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ప్రతిపాదన చేశారు. ఇక అంతా అయిపోతున్నట్లు ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేవలం విజయవాడకు మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, డివిజన్ల పునర్వవస్థీకరణతో 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డివిజన్ సరిహద్దులు కూడా మార్చారు. తాజాగా 86 డివిజన్లకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నగర ఏరియల్ వ్యూనోటిఫికేషన్ విడుదల.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా పెంచుతూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డివిజన్లు పునర్విభజన శాసీ్త్రయంగా జరగలేదని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు గురువారం ఆ పిల్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర డివిజన్ల పునర్విభజనపై, డివిజన్ సరిహద్దులపై నోటిఫికేషన్ను విడుదల చేశారు. విజయవాడ నగరంలో 86 డివిజన్లుగా మారుస్తున్నందున దీనిపై నగరవాసులకు సమాచారం నిమిత్తం ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్లోని సర్కిల్–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్–2 కార్యాలయంలో, పటమటలోని సర్కిల్–3 కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలుంటే ప్రజలు రాతపూర్వకంగా అధికారులకు అందించాలని సూచించారు. 2017లో వచ్చిన గ్రేటర్ ప్రతిపాదన సమయంలో విజయవాడ నగర జనాభా కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే. విలీన ప్రతిపాదన పంచాయతీల జనాభా నాలుగు లక్షలు. అయితే గ్రేటర్ చేయాలంటే ఆ నగర జనాభా 15 లక్షలకు మించి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహకల్ప శాఖ నిబంధన ఉంది. ఈ మేరకు 2026 నాటికి విజయవాడ నగర జనాభా 13లక్షలుగా ఉండగా, పరిసర ప్రాంత గ్రామాల జనాభా మరో నాలుగున్నర లక్షలు ఉంది. ఆయా గ్రామాల విలీనం కలుపుకుని గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ జనాభా 17.5లక్షలు అవుతుంది. గతంలో విలీనం చేయాలని ప్రతిపాదించిన గ్రామాల్లో ఒకటైన తాడిగడప ఇప్పుడు మునిసిపాలిటీగా మారింది. కొండపల్లి గ్రామం కూడా మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ గ్రేటర్ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. -
పలు హోటళ్లకు నోటీసులు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని హోటళ్లలో శుభ్రతపై జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం ‘తనిఖీల్లో తిరకాసు’ శీర్షికన ప్రచురించిన కథనంపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది పంపే నివేదికల్లో డొల్లతనంపై ఈ కథనం రాగా.. శుక్రవారం జరిగిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, వసతులు సరిగా లేని హోటళ్లపై చర్యలు చేపట్టారు. ఆయా హోటళ్లకు జరిమానా విధించటంతోపాటు లోపాలను సరిచేసుకునేందుకు నిర్ణీత గడువుతో నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే తనిఖీలు జరిగిన హోటళ్లలో 50 హోటళ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న అధికారు తీరుపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హోటళ్లకు రూ.15వేలు జరిమానా.. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. సర్కిల్–1 శానిటరీ సూపర్వైజర్ డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వందే.. వరదాయినీ
ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ చెంతన మహిళలు సామూహిక వర లక్ష్మీవ్రతాలను ఆచరించారు. దేవస్థానం మహామండపం ఆరో అంతస్తు సామూహిక వరలక్ష్మీవ్రతాలకు వేదికై ంది. ఆరో అంతస్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతంతో పాటు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో, ప్రధాన ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరలక్ష్మిగా దుర్గమ్మ.. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. రూ. 1500 టికెట్పై సుమారు వంద మంది మహిళలు ప్రత్యేక ఆర్జిత సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించగా, 600మందికి పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రి, గాజులు, రవికలతో పాటు అమ్మవారికి నివేదనగా సమర్పించేందుకు పూర్ణాలు, చక్రెర పొంగలి, పులిహోరలను దేవస్థానమే అందజేసింది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ. 100, రూ. 300టికెట్ క్యూలైన్లో ఉచితంగా అనుమతించారు. కృష్ణునికి విశేష అభిషేకాలు, పూజలు.. కృష్ణాష్టమిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తొలుత కృష్ణుని విగ్రహానికి ఆలయ ఈవో శీనా నాయక్ అభిషేకాలు నిర్వహించారు. చైర్మన్ రాధా కృష్ణ పాల్గొన్నారు. సాయంత్రం రాజగోపురం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. బారులు తీరిన భక్తులు.. శ్రావణ మాసం నాల్గో శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రం వరకు, ఇటు మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. భక్తులతో పాటు గత రెండు రోజులుగా శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నవ దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. -
జయ కృష్ణా.. ముకుందా.. మురారి
విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉట్టి కొడుతూ సందడి చేస్తున్న యువతబాల గోపాలా.. ముకుందా.. మురళీగానలోలా.. మురారీ.. రారా.. మము దీవించ మా ఇంటికి.. అంటూ భక్తలోకం ప్రార్థించింది. ముద్దులు మూటగట్టిన మురిపాల కన్నయ్యను చూసి పరవశించిపోయింది. గోకులంలో కేరింతలు కొట్టిన లీలా వినోదుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సుగంధాలు గుబాళింపగా.. కొన్నిచోట్ల బాలకృష్ణులు, బుల్లి గోపికమ్మల రూపాలలో చిన్నారులు చూడముచ్చటగా అలరించారు. యువత, చిన్నారులు ఉట్టి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
రైతన్నపై అధనపు భారం!
నందిగామరూరల్: ఒకవైపు విత్తనాలు ధర.. మరోవైపు ఎరువుల ఖర్చు.. రోజురోజుకు పెరుగుతున్న కూలీ రేట్లు.. పెట్రోల్, డీజిల్ సంగతి సరేసరి.. పెరిగిన సాగు ఖర్చులకు వెనుకాడకుండా ప్రకృతి విపత్తులను తట్టుకుని.. పంట సాగు చేస్తున్న అన్నదాతలపై కూటమి సర్కారు మోపిన ట్యాక్సుల భారం వారి పాలిట గుదిబండగా మారుతోంది. వ్యవసాయ భూములు దున్ని నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొచ్చే రైతన్న బండి(ట్రాక్టర్)పై కూటమి ప్రభుత్వం ట్యాక్సులు విధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్యాక్సులు లేకుండా దర్జాగా తిరిగిన తమ రథాలు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ట్యాకులు, పెనాల్టీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదీ సంపద సృష్టేనా.. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా.. ట్రాక్టర్లపై ట్యాక్సులు వసూలు చేసి సంపద సృష్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. ట్రాక్టర్ ప్రభుత్వం దృష్టిలో యంత్రం అయినప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు మాత్రం కుటుంబ జీవనాధారమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లపై పలు రకాల పన్నులు విధించటమేంటని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ భారం.. ట్యాక్సులు అదనం.. నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలోని 69 గ్రామ పంచాయతీలలో సుమారు 750కు పైగా ట్రాక్టర్లున్నాయి. పెరిగిన సాగు ఖర్చులకు తోడు రుణాల వాయిదాలు, ఇంధనం, మరమ్మతులు, టైర్లు, డ్రైవర్ ఖర్చులతో ట్రాక్టర్ నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం మూడేళ్ల పన్నులు, జరిమానాలు విధించటం మరింత అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్లపై వసూలు చేస్తున్న మూడు రకాల పన్నులను రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా మోటార్ వెహికల్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్కు సంబంధించి రవాణా శాఖాధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్లపై పన్నులు వసూలు చేయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2023 వరకు ట్రాక్టర్లపై ఒక్క రూపాయి కూడా పన్నులు విధించలేదని చెబుతున్నారు. 2023 సెప్టెంబర్లో పన్నులు వసూలుకు ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ రైతుల వద్ద నుంచి మాత్రం పన్నులు కూడా వసూలు చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం 2023 సెప్టెంబర్ నుంచి పన్నులను పెనాల్టీలతో పాటు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు ఇలా.. ఏడేళ్ల లోపు ట్రాక్టర్కు ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ. 8,970, లేబర్ ట్యాక్స్ రూ.1,480, ఏడేళ్లు దాటిన ట్రాక్టర్లకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ రూ.2,960 చొప్పున వసూలు చేస్తుండటంతో అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. లేబర్, గ్రీన్ ట్యాక్స్ను ఏడాదికొకసారి రూ. 460కాగా మోటార్ వెహికిల్ ట్యాక్స్ మాత్రం మూడు నెలలకొకసారి రూ.460 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యవసాయ ట్రాక్టర్లకు మూడు రకాల ట్యాక్స్లు విధించటం సరికాదు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో పాటు ట్రాక్టర్ల నిర్వహణ కష్టంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు ట్రాక్టర్లకు మోటార్ వెహికిల్, లేబర్, గ్రీన్ ట్యాక్సులను ప్రభుత్వాలు వసూలు చేయలేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మూడు రకాల పన్నులు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాక్సుల వసూలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – డి. శేషయ్య, రైతు -
దుర్గమ్మకు స్వర్ణాభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం స్వర్ణాభరణాలను సమర్పించారు. విజయవాడ బ్యాంక్ కాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీప్రణవి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సుమారు 22.8 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు బొట్టు(నవరత్నాలు, డైమండ్స్ పొదిగినది), బంగారు నత్తు(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగినవి, బంగారు బులాకీ(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యం పొదిగినది)లను తయారు చేయించి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం బహూకరించారు. అందరి సహకారంతోనే ప్లాస్లిక్ నిర్మూలన సాధ్యం చల్లపల్లి: ప్రాణాంతకమైన క్యాన్సర్కు కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని డెప్యూటీ ట్రైనీ కలెక్టర్ బి.నిఖిల చల్లపల్లి ప్రజలను కోరారు. ఈనెల ఒకటో తేదీ నుంచి చల్లపల్లిలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, గ్లాసులు, అలాగే పేపర్ గ్లాసులు, టీ కప్పులు వంటి వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అదేరోజు అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసు కుని మొదటి విడతగా హెచ్చరించి వదిలేశారు. కాగా అవే షాపులకు ట్రైనీ కలెక్టర్ నిఖిల అధికారులతో కలిసి శుక్రవారం మరలా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పేపర్, ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో వ్యాపారులు గాజు గ్లాసులను వినియోగించటం, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకం ఆపివేయటంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట డెప్యూటీ ఎంపీడీవో పేర్ని మాధవేంద్రరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సూర్యరావు, కానిస్టేబుల్ రవి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ బోలెం నాగమణి ఉన్నారు. రైస్ కౌంటర్లలో తనిఖీలు మచిలీపట్నంటౌన్: వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైస్కౌంటర్లను శుక్రవారం కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్ తనిఖీ చేశారు. మచిలీపట్నం నగరంలోని రెండు రైతుబజార్లలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతిరోజు జరిగిన విక్రయ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటంతో పాటు సంబంధిత రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని పౌరసరఫరాలశాఖకు సంబంధించిన డెప్యూటీ తహసీల్దార్లకు సూచించారు. బియ్యం కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కౌంటర్ల వద్ద బియ్యం నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. మచిలీపట్నం–తిరుచానూరు(07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారుజామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా?
విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వార్తా ఛానళ్లు, ప్రతిపక్ష స్వరాలు, డిజిటల్ మీడియా ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్సీపీ ఆరోపించింది.ప్రభుత్వంపై విమర్శలు చేసే మీడియా సంస్థల ఖాతాలను పరిమితం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని పేర్కొంది. ఆరోపణల్లో నిజం లేదంటే వాస్తవాలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఖాతాలను బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలను, అసమ్మతిని అణచివేయలేరని.. డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. -
రేపు రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని జిల్లాల నుంచి ఎంపిౖకైన 183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అవార్డులు అందుకోనున్న వారి జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, వరుస క్రమంలో ఉపాధ్యాయులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, రాజమండ్రి ఆర్జేడీ నాగమణి, డీఆర్వో వెన్నెల శ్రీను, డీఈఓ ఎల్.చంద్రకళ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బోధనలో ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఎ.కొండూరు మండలం కోడూరు మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మందడపు రాంప్రదీప్, విజయవాడ రాజీవ్నగర్ ఉపాధ్యాయిని కె.గంగ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల ఐదో తేదీన విజయవాడలో జరిగే గురుపూజోత్సవాల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు. గత ఏడాది కోడూరు పాఠశా లకు బదిలీపై వచ్చిన రాంప్రదీప్ ఇంటింటి ప్రచా రంతో విద్యార్థుల సంఖ్యను 63 నుంచి 86కు పెంచారు. గతంలో పనిచేసిన గానుగపాడు ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా వర్గో న్నతి కల్పించడంలో, పాఠశాలకు దాతల ద్వారా రూ.50 లక్షల విలువ చేసే స్థలం, రూ.5 లక్షల విరాళాల సేకరణకు కృషిచేశారు. కొర్రా గంగ విజ యవాడ రాజీవ్నగర్లో రాజీవ్గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. గతంలో కండ్రికలో పాఠశాలలో హిందీలో నూరు శాతం ఫలితాలు సాధించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ పది విశేష అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. గురువారం జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో దసరా విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఈ మేరకు 11వ తేదీ నుంచి అమ్మవారు పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల తొలి రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇక విజయ దశమి మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంసవాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసి ఉపాధి, స్వయం ఉపాఽధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్లో కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్లను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ యువతకు ఉపాధి కల్పించే వేదికగా నిలుస్తాయన్నారు. జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్ రూపంలో డాక్యుమెంట్ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీపీఆర్ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో విజయవాడ షూటర్ల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేరళంలోని త్రివేండ్రంలో ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్–2026లో నగరానికి చెందిన షూటర్లు ప్రతిభ చూపి వివిధ విభాగాల్లో 8 పతకాలు పొందారు. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్కు చెందిన నాగిశెట్టి జాహ్నవి ప్రతిభ కనపరచి 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ఫైర్ ఆర్మ్స్, సీనియర్, జూనియర్, యూత్ మహిళల విభాగాల్లో మూడు కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. కొసన పూర్ణిమ శ్రీనివాస్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో మూడు రజత పతకాలు సొంతం చేసుకుంది. ఏడూరు శ్రీకర జయంత్ రెడ్డి 25 మీటర్ల జూనియర్, యూత్ మెన్ విభాగాల్లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. పతకాలు పొందిన షూటర్లను ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు. ఆగస్టు 31వ తేదీన మొదలైన ఈ చాంపియన్షిప్ ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతుంది. -
మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడి
గన్నవరం: స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్పై కొంత మంది యువకులు దాడిచేసి కొట్టిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు రాత్రి 10గంటలకు మూసివేసిన తర్వాత జానీ అనే వ్యక్తితో అధిక ధరలకు దొడ్డిదారిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సతీష్కుమార్ మద్యం కోసం అర్ధరాత్రి 12 గంటలకు వైన్షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు చేసి గేటు వద్దకు వచ్చిన అతనిపై బైక్పై వచ్చిన కొంత మంది యువకులు ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి పరారయ్యారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేరే వ్యక్తి అనుకొని.. అయితే ఈ ఘటనకు ముందు వైన్షాపు వద్ద కొంత మంది యువకుల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సదరు యువకులు పొరబడి గొడవ పడ్డ వ్యక్తి అనుకుని డ్రైవర్పై అకారణంగా దాడిచేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వైన్షాపు వద్ద గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికి ఎకై ్సజ్, పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు కారణంగా వైన్షాపు ఉన్న వీఎన్. పురం రోడ్డులో ప్రయాణించలంటేనే మహిళలు, ఆడపిల్లలు భయపడే పరిస్థితి నెలకొంది. -
మా డబ్బులు.. మాకివ్వండి
జీజీహెచ్లో ప్రభుత్వ వైద్యుల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగుల నాడిచూసి వైద్యం చేయాల్సిన డాక్టర్లు ప్లకార్డులు చేబూని ఆందోళన బాటపట్టారు. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఆంధ్రప్రదేశ్ (జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా నిరసన బాటపట్టారు. తొలుత పది రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మూడు రోజులుగా రోజూ అర్ధగంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. జీడీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ.. తమకు రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాస్తే ఇవ్వలేమని సమాధానం ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వైద్యులపై ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఎన్నో సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫె సర్లు లేక ప్రొఫెసర్లే నైట్ డ్యూటీకి రావాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన ఏపీ డీ–ఫార్మసీ (ఎంపీసీ, బైపీసీ)లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి గురువారం తెలిపారు. దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఆరో తేదీ రాత్రిలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈ నెల ఏడో తేదీ రాత్రి వరకు అవకాశం ఉందని తెలిపారు. -
రూ.25 కోట్లతో దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు రూ.25 కోట్లతో అంచనాలను రూపొందించామని దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ఈఓ, ఏఈఓలు, సూపరిండెంటెంట్లు, ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలు చర్చకు రాగా, 50 అంశాలకు ఆమోదం లభించింది. వీటిలో ఎక్కువ ప్రతిపాదనలు దసరా ఉత్సవాలకు సంబంధించినవే. ఈ సమావేశానికి ముందే సుమారు రూ.25 కోట్ల మేర బిల్లులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పనులకు బోర్డు సభ్యులు ఆమోదం తెలపడం గమనార్హం. ఆమోదం తెలిపిన కీలక అంశాలివే... ఆస్ట్రేలియాలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం, కుంకుమార్చన నిర్వహించేందుకు ఆరుగురు వైదిక సిబ్బందిని డెప్యుటేషన్పై పంపేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. క్లోక్రూమ్, చెప్పులస్టాండ్లో పని వారిని నియమించి, వారి ద్వారా ఆయా కౌంటర్లు దేవస్థానం నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కును బహిరంగ వేలంలో సంకాబత్లు నాగవైష్ణవి రూ.1.36 కోట్లకు హెచ్చపాటను పాడింది. ఈ వేలానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఉత్సవాల్లో కాయలు, పండ్లను సరఫరా చేసే టెండర్ను సీహెచ్.నాగ విజయ, శ్రీవిజయ ట్రేడింగ్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూల సరఫరా టెండర్ను ఎం. గంగాధర్రెడ్డికి కేటాయించింది. నూతన లడ్డూ పోటు భవనం పక్కనే వంటశాల కోసం రూ.40 లక్షలతో షెడ్డు నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఉత్సవాల్లో తాత్కలికంగా డ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకానికి రూ.6.20 లక్షల అంచనాలకు, భక్తులను కొండపైకి, దిగువకు తీసుకెళ్లేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుకు రూ.32 లక్షలతో చేసిన అంచనాలకు, డీఈఈగా ఉద్యోగ విమరణ చేసిన వి.కోటేశ్వరరావును కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం. దసరా ఉత్సవాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదాలను కొరత లేకుండా అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆరు లడ్డూల బాక్స్ను రూ.100 చొప్పున విక్రయిస్తుండగా, దసరా నుంచి మూడు లడ్డూలను బాక్స్ రూపంలో రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. సాక్షి కథనాలపై చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వరసగా చోటు చేసుకుంటున్న వివాదాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ వరస కథనాలుగా ప్రచురిస్తోంది. ఈ కథనాలపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి చేసే విశేష అలంకారాలు, ఇటీవల ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య చోటు చేసుకున్న వివాదం, అన్నదాన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి పార్టీకి చెందిన కొంత మంది సభ్యులు దూరంగా ఉండటంతో పాటు ‘సాక్షి’ గురువారం ప్రచురించిన ‘అమీతుమీ తేలుస్తారా... మౌనం పాటిస్తారా’ కథనంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరో వైపు ఆలయ వ్యవహారాలు ‘సాక్షి’కి చేరడంపైన కొంత మంది సభ్యులు చర్చను లేవనెత్తారు. అయితే అవన్నీ వాస్తవం కావడంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారని తెలిసింది. -
రామ్జీ పథకం పనుల్లో నాణ్యత పాటించాలి
జయంతిపురం(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. పథకం ద్వారా చేపడుతున్న పనులు రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చటంతో పాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యాన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని అర్హులైన రైతులు ఆ పంటల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనిల్కుమార్, తహసీల్దార్ శిరీష, డ్వామా ఏపీవో రామ కృష్ణ, డీఎల్డీవో లక్ష్మీకుమారి, ఎంపీడీవో అరుణ కుమారి, ఆర్ఐ ఆనందబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఏపీఐఐసీ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
జల్ జీవనంపై నిర్లక్ష్యం
తిరువూరు: ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న తాగునీటి కారణంగా కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఎ.కొండూరు మండలంలోని గిరిజనులకు రక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఉదాసీనవైఖరి అవలంబిస్తు న్నాయి. ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ మండలంలో జలజీవన్మిషన్ పథకంలో భాగంగా 854 కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు గోపాలపురం, మాధవరంలో మూడు సంపులు, 21 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. వాటి నుంచి అన్ని పంచాయతీలు, శివారు గ్రామాలు, తండాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేయాలన్నది లక్ష్యం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాలను ఎ.కొండూరు మండలానికి సరఫరా చేసేందుకు 2023లో రూ.49.44 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టు పనులు గతంలోనే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి అన్ని గ్రామాలకు కృష్ణా నదీ జలాలను అందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖల నడుమ సమన్వయం లోపించింది. ఫలితంగా రక్షిత తాగునీరు అందక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. పేదలు రోజుకు రూ.50 ఖర్చు చేసి ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో మంచి నీరు కొనుక్కుని తాగాల్సివస్తోంది. పాత పైపులైన్లతోనే నీటిసరఫరా ఎ.కొండూరు మండలంలోని గ్రామాల్లో పంచాయతీలు బోరు నీటిని విడుదల చేసే పైపులైన్లలోనే కృష్ణా నదీ జలాలను కూడా సరఫరా చేస్తున్నారు. దీనితో కృష్ణా నదీ జలాలను శుద్ధి చేసినప్పటికీ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న సాధారణ నీటితో కలసి ఆశించిన ప్రయోజనం నెరవేరడంలేదు. కృష్ణా నదీ జలాలను సరఫరా చేయడానికి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ఆరు నెలల్లో ఈ మండలంలోని కృష్ణారావుపాలెం, రామచంద్రాపురం, కోడూరు, కంభంపాడు, ఎ.కొండూరు, ఎ.కొండూరు తండా, గోపాలపురం, చీమలపాడు, మాధవరం గ్రామాల్లో 15 మంది కిడ్నీరోగులు మృత్యువాత పడ్డారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి తీవ్రతరం అవడంతో డయాలసిస్ చేసినా ఫలితం లేక గిరిజనులు, పేద రోగులు మృత్యు ఒడి చేరుతున్నారు. ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు రాష్ట్రంలో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులున్న ఎ.కొండూరు మండలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తిరువూరు, ఎ.కొండూరులో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మండలంలోని భూగర్భ జలాల్లో కిడ్నీవ్యాధికి కారణమైన అంశాలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత కృష్ణా నదీ జలాల సరఫరాకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాలను త్వరలో సరఫరా చేస్తామంటూ జిల్లా అధికారులు ప్రకటించడం మినహా పూర్తిస్థాయిలో అమలుకు నోచడం లేదు. -
తనిఖీలకూ ఉందో లెక్క!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లాను వాణిజ్య రాజధానిగా పేర్కొనటం పరిపాటి. అత్యధిక ఆదాయం ఇక్కడ ఉన్న డివిజన్ల నుంచే ప్రభుత్వానికి లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి వ్యవహార శైలి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యాపారులతో అధికారులు కుమ్మకై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఆ శాఖ ఉద్యోగుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు.. వాణిజ్య పన్నుల శాఖకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పేరుతో మూడు డివిజన్లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. మూడు డివిజన్లకు సంబంధించిన పరిధి దాదాపుగా విజయవాడల ఉంటుంది. వివిధ అంశాలపై కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా తరచుగా ఆయా వ్యాపార వర్గాలపై తనిఖీలు, ప్రత్యేక దాడులు నిర్వహిస్తుంటారు. కానీ అవన్నీ తుతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లగా చేసిన తనిఖీల్లో గట్టిగా వాణిజ్య పన్నుల శాఖకు కట్టించిన దాఖలాలు లేవని ఉద్యోగులే వివరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులతో అధికారులతో కుమ్మకై ్క తమ చేతివాటంతో ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. ఇదో ఉదాహరణ.. విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్పై డివిజన్–3 అధికారులు ఇటీవల ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. స్థానిక సర్కిల్ అధికారులు కాకుండా పక్క సర్కిల్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల వ్యవహారం జరిగేటప్పుడు హోటల్ వద్ద పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. ఒక రాత్రంతా అధికారులు కాపలా కాసి తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. హోటల్ నుంచి రికార్డులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది జరిగి 20 రోజులైనా ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు ఇవ్వలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. దాడులు చేసిన తరువాత వారితో ఏదైనా పంచాయతీ జరిగి ఉంటుందని, అందువల్లే నోటీసు సైతం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇదేతీరు.. గత డిసెంబర్ మాసాంతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబు అహ్మద్ సెలవులో ఉన్న సమయంలో స్పెషల్ కమిషనర్గా ఉన్న ఎన్. సౌమ్య ఆదేశాలతో విజయవాడ నగరంలోని సుమారు 20 నుంచి 25 రెస్టారెంట్లపై బృందాలుగా వెళ్లి ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అధికారులు, సిబ్బంది అక్కడ ఉండి ఆ రెస్టారెంట్లో జరుగుతున్న వ్యాపారం, వాస్తవంగా కడుతున్న పన్ను, ఆన్లైన్ పేమెంట్ లేని రెస్టారెంట్ల తీరు తదితర పలు అంశాలను గమనించి ఆయా రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్క దానికి నాలుగు నుంచి రూ.40 లక్షల వరకూ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం మీద రెండు నుంచి మూడు కోట్ల వరకూ తేడాగా ఉన్న పన్ను, జరిమానాలు విధించినట్లు తెలిసింది. అయితే అందులో కొద్దిమంది మాత్రమే స్పందించారని, అది కూడా చాలా స్వల్పంగా చెల్లింపు చేశారని, మిగిలిన వారు పంచాయితీలతో సరి చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్వో కార్యాలయంపైనా విమర్శలు.. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటుగా మరో రెండు జిల్లాల్లో టర్నోవర్ను బట్టి అధికంగా ఉన్న కేసులను విజయవాడలోని రీజనల్ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఆ శాఖ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ కార్యాలయం పని చేస్తుంది. అయితే రెస్టారెంట్ల వ్యవహారంలోనూ పలు అంశాలను ఈ కార్యాలయం అధికారులు పరిశీలించారనే వాదనలు ఉన్నాయి. అలాగే ఈ కార్యాలయం ఇప్పటి వరకూ పెద్దగా ఎటువంటి కేసులు ఛేదించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. అటు సర్కిల్ కార్యాలయాల నుంచి ఇటు ఆర్వో కార్యాలయాల వరకూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ పేమెంట్లలో ప్రభుత్వానికి మస్కా కొడుతున్నాయనే అంశాలు ఈ దాడుల్లో బయటపడ్డాయి. సాధారణంగా ఒక వ్యాపార సంస్థ అధికారికంగా ఒక బ్యాంక్ ఖాతాను నిర్వహించటం దానికి ఆన్లైన్ పేమెంట్లు చేయించటం జరగాలి. కానీ ఒక రెస్టారెంట్ ఐదారు ఖాతాలకు యూపీఏ పేమెంట్లు చేయించటాన్ని అధికారులు కనుగొన్నారు. అలాగే ఒక రెస్టారెంట్ అయితే అసలు ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం నగదు చెల్లింపులను మాత్రమే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరికీ భారీగా పన్ను తేడాలు, జరిమానాలు విధించారు. అయితే వారి నుంచి ఎంత మేర చెల్లింపు చేశారనే విషయం ఇప్పటి వరకూ తేలలేదు. -
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తీవ్ర అన్యాయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన 2026 మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే జీవో 102ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఎన్యూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 71,547 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించిన 43మంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించారన్నారు. ఎస్వీయూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94,966 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు వచ్చిన 27 మంది రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ సీట్లు ఇవ్వకుండా రిజర్వేషన్ సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ కంటే మంచి మార్కులు లేదా ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్క్రబ్బర్ వ్యాపారం పేరుతో వందల మంది నుంచి రూ. కోట్లు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ‘మాషా అల్లా ఎంటర్ప్రైజెస్’ కేసులో ప్రధాన నిందితులైన సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం, అతని భార్య సుమలను విచారణ నిమిత్తం ఎస్ఎన్పురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజుల పాటు నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్దు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు గురువారం విజయవాడ సబ్ జైలు నుంచి నిందితులను ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో కోట్ల రూపాయలు మోసపోయినట్లు వెయ్యి మందికి పైగా బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ డబ్బుకు సంబంధించి లావాదేవీల గురించి విడివిడిగా నిందితులను విచారించగా వీటిపై కొన్నింటికీ సమాధానాలు చెప్పినా కొన్ని ప్రశ్నలకు మౌనంగా దాట వేస్తున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 8వ తేదీ వరకు పూర్తిస్తాయిలో పోలీసులు విచారించనున్నారు. -
డ్రైవర్ను హత్య చేసిన క్లీనర్ అరెస్ట్
పెనమలూరు: కానూరులో లారీ డ్రైవర్ను హత్య చేసిన ఘటనలో లారీ క్లీనర్ను అరెస్ట్ చేశామని డీఎస్పీ కె.ధర్మేంద్ర తెలిపారు. ఆయన పెనమలూరు పోలీస్స్టేషనల్లో గురువారం వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ ఆనంద్సర్కార్(50) లారీ మరమ్మతుల కోసం కానూరు నవతారోడ్డులో ఉన్న రమణ షెడ్డుకు గత నెల 5వ తేదీన వచ్చాడు. అతను లారీ మరమ్మతులు చేయించుకుంటూ అక్కడే ఉంటు న్నాడు. అయితే అదే లారీకి క్లీనర్గా బెంగాల్ రాష్ట్రానికి చెందిన సంజయ్హల్దార్ (36) ఆగస్టు 19వ తేదీన వచ్చాడు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి ఇద్దరు మద్యం తాగారు. అనంతరం వారి మధ్య గొడవ మొదలయింది. దీంతో లారీ క్లీనర్ సంజయ్హల్దార్ ఇనుప రాడ్తో డ్రైవర్ ఆనంద్ సర్కార్పై విచక్షణా రహితంగా దాడి చేయటంతో అతని మృతి చెందాడు. లారీ షెడ్డు యజమాని రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజయ్హల్దార్ను అరెస్టు చేశారు. యజమానుల వద్ద వివరాలుండాలి.. మద్యం తాగిన వారు విచక్షణ కోల్పోరాదని డీఎస్సీ ధర్మేంద్ర తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం సేవించిన తరువాత చిన్న వివాదం కారణంగానే హత్య జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసే వారి వివరాలు యజమానుల వద్ద ఉండాలన్నారు. ఆధార్కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు యజమానులు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ఉంచుకోవాలని సూచించారు. బెంగాల్కు చెందిన నిందితుడు సంజయ్హల్దార్ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసినందుకు సీఐ వెంకటనారాయణ, ఎస్ఐలు సత్యసుధాకర్, రమేష్, వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు.వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధర్మేంద్ర -
తనిఖీల్లో తిరకాసు
పటమట(విజయవాడతూర్పు): ఇటీవల విజయవాడలోని పలు హోటల్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల్లో నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంతా బాగుందంటూ నివేదిక ఇచ్చారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల నిర్వాహకుల నుంచి కాసులు దండుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మునిసిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని 64 డివిజన్లలో 286 సచివాలయ పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 624 హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా అవన్నీ శుభ్రంగా ఉన్నాయని, ఎక్కడా సమస్య లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో చికెన్, మటన్, బీఫ్, చేపల దుకాణాలు 353 వరకు, ఆర్వోప్లాంట్లు 241 వరకు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నివేదించారు. అధికారుల నివేదికలపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి పలువురు అధికారులు డబ్బులు తీసుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇలా.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో వంట గదులు శుభ్రంగా ఉండేందుకు ప్రజారోగ్య విభాగం పలు నిబంధనలను సూచిస్తోంది. ఆయా వ్యాపార సంస్థలు సొంతగా ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. భోజన టేబుల్పై మూత ఉన్న తాగునీటి జగ్లు ఉంచాలి. కిచెన్ నిత్యం శుభ్రంగా ఉండాలి. మాంసం ఒక్క రోజుకంటే కూడా ఎక్కువ నిల్వ వుండకూడదు. అక్కడ పనిచేసే వర్కర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు హెయిర్ క్యాప్స్ ధరించాలి. అయితే నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇవేమీ కన్పించవు. మాంసం దుకాణాల గోడలకు ఐదు అడుగుల వరకు టైల్స్ వేయాలి. ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నగరంలోని చాలా దుకాణాల్లో ఇలాంటి వాతావరణం కన్పించదు. ఆర్వోప్లాంట్ల వ్యవహారంలో కూడా నిబంధనలు కఠి నంగా ఉన్నాయి. ఫిల్టర్లను ప్రతినెలా శుభ్రం చేయాలి, నీటి శాంపిల్ను ప్రతివారం ప్రజారోగ్య అధికారులు పరిశీలించాలి. నీరుపట్టే ప్రాంతంలో నీటి పారుదల సక్రమంగా ఉండాలి. అక్కడ టైల్స్ ఉండాలి. కానీ చాలా ప్లాంట్ల వద్ద ఇవేవీ కన్పించటంలేదు. పేరుకే నోటీసులు తనిఖీల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు డొల్లతనం ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 42 రెస్టారెంట్లకు, 11 ఆర్వోప్లాంట్లకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. తమ తనిఖీల్లో కేవలం రూ.55 వేల జరిమానా విధించారు. హోటళ్లకు నోటీసులు జారీచేసిన తరువాత తాము సూచించిన అంశాలను సరిచేసుకున్నదీ లేనిదీ తిరిగి పరిశీలించడం లేదు. ఆయా సంస్థల నిర్వాహకులతో హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా బేరాలాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఒక్కో రెస్టారెంట్, హోటల్ రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. -
తూతూమంత్రంగా తనిఖీలు
కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో విజయవాడ నగరంలో పలుమార్లు డయేరియా వ్యాధి ప్రబలింది. వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. గిరిపురం, ఉడ్పేట, భవానీపురం, అజిత్సింగ్ నగర్, నందమూరి నగర్, పటమట ప్రాంతాల్లో తరచూ డయే రియా ప్రబలుతోంది. గత ఏడాది అజిత్సింగ్ నగర్లో డయే రియా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధానంగా ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నీరు తాగడమే కారణమని జిల్లా వైద్య విభాగం, నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు వాటర్ బబుళ్లలో తాగునీరు సరఫరా చేశారు. మరో వైపు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతపై తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బందరు రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఎక్కువ రోజులు నిల్వవున్న మాంసాన్ని అధికా రులు గుర్తించారు. పటమటలోని మరో రెస్టారెంట్లో కూడా నిల్వ ఉన్న మాంసంతోపాటు ఆహార పదార్థాలు తయారు చేసే వంటగది శుభ్రతపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలు, ఆర్వోప్లాంట్ల పనితీరు, అక్కడ నెలకొన్న శుభ్రతపై నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్వాహకులకు జరిమానా విధించాలని, అప్పటికీ ఫలితం లేకుండా ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీలు చేపట్టి, అంతా బాగుందంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా నివేదకలు ఇవ్వడంపై ఆరోపణలు వస్తున్నాయి. -
దుర్గమ్మ భక్తురాలి మృతి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తురాలు మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61), తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు మహామండపం రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందికి కోరింది. అయితే గ్రౌండ్ప్లోర్లో దింపిన సిబ్బంది.. అక్కడి నుంచి మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అయితే మెట్లు ఎక్కే క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది వెంటనే పద్మను గ్రౌండ్ ఫ్లోర్లో దింపి, అక్కడి నుంచి దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పద్మ మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఘటనపై వన్టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకిలా? కనీసం వృద్ధులు, వికలాంగులను అన్నదానం జరిగే ఫ్లోర్లో లిఫ్టు ద్వారా దింపాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో అన్న ప్రసాద వితరణను ప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మరి కొంత మంది భక్తులు పేర్కొంటున్నారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
మచిలీపట్నంఅర్బన్: గ్రామాల పారిశుద్ధ్యం, తడి–పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, కార్మికులను స్వర్ణ పంచాయతీ పోర్టల్లో నమోదు చేసి నేరుగా విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఒక్కరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు జారీ చేసిన జీవోలను అమలు చేయాలని, కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఒకే పని చేస్తున్న కార్మికులకు రూ.1,500 నుంచి రూ.14,500 వరకు వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారని, ఈ వ్యత్యాసాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని జీఓ నంబర్ 680లో ఉన్నప్పటికీ అనేక పంచాయతీల్లో అమలు కావడం లేదన్నారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. జగన్, ఎం. గణేష్, కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు, నాగమణి, సభ్యులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో నిలిచిపోయిన పంటు
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన కంకరు, బూడిద, గ్రావెల్ జల రవాణా ద్వారా సరఫరా చేసే పంటు ఇసుక మేటలు అడ్డొచ్చి నిలిచిపోయింది. పది లారీలు బూడిద, కంకర సామగ్రితో సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం వద్దకు బయలు దేరింది. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీటితో నదిలో ఇసుక మేటలు మధ్య పంటు నీటిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. రెండు రోజులుగా పంటు రవాణా నిలిచి పోవడంతో లారీల రాకపోకలు వెస్ట్ బైపాస్ మీదుగా అమరావతి ప్రాంతానికి మెటీరియల్ రవాణా చేపట్టారు. నదిలో చిక్కుకున్న పంటును డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా తీసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక రమేష్ ఆస్పత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా) కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈ–డీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ గ్రోత్పై వర్క్షాప్ బుధవారం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంఎస్ఎంఈ ఈడీ సుధాకర్తో పాటుగా జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించే చర్యలో భాగంగా ఎక్కువ డిమాండ్ ఉన్న లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లో పెరగనున్న రద్దీని తగ్గించే దిశగా హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ కల్పిస్తూ రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు (15 రోజులు), అదే విధంగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సీజన్లు డిసెంబర్ 18 నుంచి 2027 జనవరి 19 వరకు (33 రోజులు) హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందన్నారు. హైటెక్ సిటీలో ఆగే రైళ్లు ఇవే.. ●నర్సాపూర్–లింగంపల్లి (17255) ఆయా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 4.45కి హైటెక్ సిటీ చేరుకుని 4.46కి బయలుదేరుతుంది. అదే విధంగా లింగంపల్లి–నర్సాపూర్(17256) రాత్రి 9.08కి చేరుకుని 9.09కి బయలుదేరుతుంది. ● కాకినాడ టౌన్–లింగంపల్లి(12775) ఉదయం 7.10కి చేరుకుని 7.11కి బయలుదేరుతుంది. లింగంపల్లి–కాకినాడ టౌన్(12776) రాత్రి 7.08కి హైటెక్ సిటీ చేరుకుని 7.09కి బయలుదేరుతుంది. -
సభ్యులకు సమాచారం ఇవ్వరా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనపడుతోంది. దసరా ఉత్సవాలకు ముందు జరిగే ఈ కీలక ఈ సమావేశం అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుర్గగుడి చైర్మన్తో పాటు ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య వ్యవహారాలు గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా మారాయి. ట్రస్ట్ బోర్డు సమావేశానికి వచ్చే అజెండాలను ఆమోదించాలని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, బుధవారం సాయంత్రం ట్రస్ట్ బోర్డు సభ్యులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఏదైనా బోర్డు సమావేశంలోనే తేల్చుకుందామని బోర్డు సభ్యులు కరాకండిగా తేల్చి చెప్పేశారు. దేవస్థానానికి చెందిన కొంత మంది అధికారుల తీరే దీనికి కారణమని ట్రస్ట్ బోర్డు సభ్యులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులంటే కేవలం ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఏ అంశాన్నైనా ప్రశ్నిస్తే వారికి నచ్చడం లేదని తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయానికి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తించి ఆ విభాగం అధికారికి తెలిపినా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. మరో వైపు గత నెల 21వ తేదీన జరిగిన నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటు భవనాల ప్రారంభోత్సవం, అంతకు ముందు అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కూటమి పక్షాలకు చెందిన కొందరు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై బుధవారం తమ పశ్చిమ నియోజకవర్గ ప్రజా ప్రతినిధితో సైతం బోర్డు సభ్యులు చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదనల ఆమోదానికేనా? ట్రస్ట్ బోర్డు కేవలం దేవస్థానం చేసిన ఖర్చులు, ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉందా అని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యుల ముందు ఉంచారు. అయితే వాటికి సంబంధించి ఏయే పనులకు ఖర్చు ఎంత మొత్తం చేస్తున్నారని వారు ఆరా తీస్తారు. తాము కేవలం ఆలయ ఈవోకు మాత్రమే ప్రతిపాదనల గురించి చెప్పుకుంటామని, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏదైనా అడగాల్సి ఉంటే నేరుగా ఈవోను అడిగి తెలుసుకోవాలని బహిరంగంగా చెప్పడంతో ఆ సమావేశంలో ఉన్న సభ్యులు అవాక్కయ్యారు. ముందు చర్చ.. ఆ తర్వాతే అజెండా గురువారం జరిగే సమావేశంలో ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే అజెండాపై చర్చించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కొంత మంది ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కనీసం బోర్డు సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. నేటి సమావేశంలో దసరా ఉత్సవాల ప్రతిపాదనలను ఆలయ అధికారులు సభ్యుల ముందు ఉంచుతున్నారు. తమకు సంతృప్తికరమైన సమాధానం వచ్చిన తర్వాతే అజెండాను ముందుకు తీసుకువెళ్లామని, అవసరమయితే రాత్రి 10 గంటలైనా బోర్డు సమావేశం కొనసాగిస్తామని సభ్యులు పేర్కొంటున్నారు. మహామండపం నాల్గో అంతస్తులో దేవస్థానం గత నెల 27వ తేదీన నూతనంగా సమావేశ మందిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆహ్వానం లేదు. ఆ రోజు ఉదయం 10.30గంటల సమయంలో ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. అదీ కూడా ప్రారంభోత్సవానికి పది నిమిషాల ముందు సమాచారం ఇవ్వడంపై వివాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై గురువారం జరిగే సమావేశంలో మిగిలిన సభ్యులు ఆలయ అధికారులను నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నిపుణులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారనే సమా చారం కూడా ఇవ్వడం లేదనేది ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆరోపణ. అధికారులకు ఒక రోజు ముందే ఆయా అధికారుల పర్యటన, పనుల పరిశీలన సమాచారం ఉన్నా.. ఎందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఇవ్వడం లేదో ఈ సమావేశంలో నిగ్గు తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. గత నెల 21న ఆలయ ప్రాంగణంలోని రూ.కోట్లతో నిర్మించిన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు ప్రారంభోత్సవానికి కనీసం డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కు ఆహ్వాన పత్రికను అందజేయకపోవడంపై ఆ పార్టీకి చెందిన సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 28వ తేదీన నూతన సమావేశ మందిరంలో దేవస్థాన ఈవో, ఆలయ అధికారులతో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ట్రస్ట్ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశానికి హాజరైన సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిని ఆలయ అధికారి సిబ్బంది ముందే బయటకు పంపడాన్ని ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఇదే అంశాన్ని తోటి సభ్యులకు వాట్సాప్ ద్వారా పంచుకొని ఆవేదన చెందిన ఘటన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
ఆత్మీయ నివాళి
ఆత్మ బంధువుకువాడవాడలా మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలుసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి ● దివంగత నేత సేవలను స్మరించుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఉత్సాహంగా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు ● పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు మౌనం పాటిస్తారా? ఉయ్యూరు బస్టాండు సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దేవభక్తుని చక్రవర్తి, పార్టీ శ్రేణులు చిట్టినగర్ జంక్షన్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న వెలంపల్లి, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు అమీతుమీ తేలుస్తారా.. ఏపీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి -
ముగిసిన ఫుట్బాల్ చాంపియన్ షిప్
మైలవరం: ఏపీ ఎఫ్ఏ సీనియర్ మెన్– 2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాపియన్షిప్ సోమవారం ముగిసింది. విశాఖపట్నం చాంపియన్షిప్ దక్కించుకోగాగా, తిరుపతి రన్నరప్, విజయనగరం మూడవ స్థానం కై వసం చేసుకుంది. ఫైనల్లో తిరుపతిపై విశాఖపట్నం 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం ఈస్ట్ గోదావరి, విజయనగరం జట్టు తలపడగా విజయనగరం 4–2గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. జిల్లా స్థాయి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎఫ్ఏ లక్ష్యం అని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ తెలిపారు. -
జాబితా అడిగితే సమాధానం లేదు
నేతన్న సేవలో పథకం అమలులో నేత కార్మికు లకు తీరని అన్యాయం జరిగింది. లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించాం. అసలు అర్హుల జాబితాలను ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శక పాటించలేదు. అధికారులు నిష్పక్షపాతంగా నడుచుకుని జాబితాలను ప్రదర్శిస్తే అనర్హులను గుర్తించి, వివరాలు అందజేస్తాం. లేదా అధికారులే విచారణ చేసి అనర్హులను తొలగించాలి. – కటకం ప్రసాద్, సీనియర్ మాజీ కౌన్సిలర్, పెడన -
పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): బాధితులకు తక్షణ న్యాయం, సహాయం అందించే అధికారం, ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుత అవకాశం ఒక్క పోలీస్ శాఖలోనే లభిస్తుందని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తూ సోమవారం ఉద్యోగ విరమణ పొందిన 13 మంది అధికారులు, సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శాలువాలు కప్పి సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో సీఏఓ ఐవీఆర్ నాగవర్ధన్, ఎస్ఐలు జె.జ్ఞానదేవ్, ఎస్.సాయిబాబా, పీఎస్ఎస్ రెడ్డి, ఎం.శ్రీనివాసప్రసాద్, ఎం.శ్రీధర్, రిజర్వ్ ఏఎస్ఐ జీఎస్ఎన్మూర్తి, బి.ప్రసాద్, సీహెచ్ శివాజీ, హెడ్ కానిస్టేబుల్ బీఎన్వీకేడీ ప్రసాద్, ఎస్.పాండురంగయ్య, హోంగార్డులు కె.లక్ష్మీనారాయణ, పి.రమణ ఉన్నారు. వారి సత్కార కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రేమ్కుమార్, ఆర్ఐలు శ్రీనివాసరావు, సుధాకర్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్న దానానికి గన్నవరం మండలం ముస్తాబాదకు చెందిన జి.రాఘవేంద్ర ప్రసాద్, పద్మజ సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధా నంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం కన్నబాబు, రామచంద్రమోహన్ పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశాల, మహామండపం వద్ద వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను తనిఖీచేశారు. తొలుత ప్రతిపాదించిన విధంగా ఆలయ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ చేయగా, వాటి ప్రకారం పనులు జరిగితే తలెత్తే ఇబ్బందులను చర్చించారు. ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ను మహామండపానికి, నూతన అన్నదాన భవనానికి అనుసంధానంగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు చైన్నెకి చెందిన ప్లానర్లతో ఉన్నతాధికా రులు చర్చలు జరిపారు. మహామండపం క్యూ లైన్లలో అధికారులు స్వయంగా నడిచి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. తొలుత రామచంద్రమోహన్ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, దుర్గగుడి ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఎఈఈలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం ఎడమ కాలువపై పాయకరావుపేట వద్ద సెప్టెంబర్ రెండో తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగే జలహారతి కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ వెయ్యి బస్సులు నడపనుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 100 బస్సులు పాయకరావుపేటకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండు, మూడు తేదీల్లో జిల్లాలోని ప్రయాణికులకు అసౌకర్యం కలగనుంది. ఈ అసౌకర్యాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి నీలిమ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రణాళిక వేసు కుని రెండు రోజులపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
● ఒత్తిళ్లకు తలొగ్గి నేత కార్మికులకు అన్యాయం చేసిన అధికారులు
● అర్హులందరికీ న్యాయం చేయాలని చేనేత కార్మికుల డిమాండ్ పెడన: ‘నేతన్నకు సేవలో’ పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపింది. తెలుగు తమ్ముళ్ల సిఫార్సులకే పెద్దపీట వేసి అనర్హులకు లబ్ధి చేకూర్చింది. ఎన్నికల సమయంలో నేత కార్మికుల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్ర బాబుతో పాటు కూటమి పార్టీల నాయకులంతా ‘నేతన్న నేస్తం’ పథకానికి మించి సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించారు. రెండేళ్లు ఎదురు చూసిన చేనేత కార్మికులు కడుపుమండి రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ‘నేతన్న సేవలో’ అంటూ పథకం పేరు మార్చి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పింది. అయితే అరకొరగా నిధులు విడుదల చేసింది. ఆ నిధుల్లోనూ అర్హులకు అరకొరగా ఇచ్చి, తమ పార్టీ నాయకులు సూచించిన వారికి మగ్గం లేకున్నా, ఇతర వృత్తుల్లో ఉన్నా లబ్ధిచేకూర్చింది. దీంతో అర్హులైన చేనేత కార్మికులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శకంగా.. చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకం తీసుకొచ్చారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబా నికి ఏడాదికి రూ.24 వేల చొప్పున క్రమం తప్ప కుండా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 4,832 మంది కుటుంబాలకు మేలు జరిగింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పథకం అమలుచేసి ఆదుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగింది. సచివాలయ సిబ్బంది చేనేతల ఇళ్ల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ చేసి ఆ తర్వాత అర్హుల పేర్లు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసి జాబితా రూపొందించారు. ఈ జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఫలితంగా అర్హులు అందరికీ ఈ పథకం కింద లబ్ధిచేకూరింది. ఇప్పుడు సిఫార్సులు ఉంటేనే.. చంద్రబాబు ప్రభుత్వంలో నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు హడా వుడిగా పూర్తి చేశారు. చేనేత, జౌళి శాఖ అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి గప్చిప్గా దరఖాస్తులను స్వీకరించారు. ఎటువంటి విచారణ లేకుండానే కూటమి నాయకులు చెప్పిన పేర్లతో జాబితాలక రూపొందించారు. ఈ జాబితాలను ఎక్కడా వెల్లడించలేదు. మగ్గం లేని, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి సైతం లబ్ధిచేకూర్చారు. 4,393 మందితో జాబితా రూపొందించారు. వీరిలో 215 మందికి వివిధ కారణాలతో పథకం వర్తింప జేయలేదు. మిగిలిన వారికి ఆగస్టు ఏడో తేదీన రూ.25 వేల చొప్పున సాయం అందించారు. అయితే ఒకే ఇంటిలో ముగ్గురికి పథకం వర్తింపజేయడం, మెకానిక్లను కూడా అర్హులుగా గుర్తించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కూటమి నాయకులు అనర్హులకు లబ్ధి చేకూర్చి, వారి వద్ద వాటాలు దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 1,072 మందికి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. నేను పుట్టి పెరిగింది పెడనలోనే. బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం చీరాల వెళ్లాం. అక్కడ కూడా పరిస్థితి బాగోలేక తిరిగి పెడన వచ్చి ఆరేళ్లు గడిచాయి. ఆధార్కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడకు మార్పించుకున్నాం. మగ్గంపైనే ఆధారపడి బతుకుతున్నాం. నేనూ, నా భార్య నాగేశ్వరకుమారి మగ్గం నేస్తున్నాం. దరఖాస్తు చేసినా పథకం వర్తింపజేయలేదు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని రోజూ బ్యాంక్కు వెళ్లి ఆరాతీస్తున్నాం. – ఉటుకూరి నాగవెంకటేశ్వరరావు, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకం వర్తించలేదు. 50 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. నాకు చేనేత గుర్తింపు కార్డు కూడా ఉంది. అయినా పథకం వర్తింపజేయలేదు. అర్హత ఉన్నా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారొచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. అయినా పథకం రాలేదు. అద్దె ఇంట్లో ఉంటూ నేత నేసుకుంటున్నాం. పథకం వర్తింపజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – పేరిశెట్టి రుక్మిణి, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకంలో మొదట 4,393 మంది అర్హులను గుర్తించాం. వారిలో 215 మందికి ఆధార్, సాంకేతిక కారణాలతో లబ్ధిచేకూరలేదు. రెండో సారి మరో 1,072 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 215 మందితో పాటు 1,072 మందికి కూడా త్వరలోనే నగదు జమ అవుతుంది. ఇంకా వీరి నగదు విడుదల కాలేదు. అనర్హులు ఉన్నారని లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ విజయ్బాబు, చేనేత, జౌళిశాఖ ఏడీ, మచిలీపట్నం -
దుర్గమ్మకు బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.1.20 లక్షల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సత్యనారాయణపురానికి చెందిన ఉపద్రష్ట శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, డీఈఓ కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఐసెట్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం మొదలైంది. ఎన్సీసీ–22, దివ్యాంగులు–20, సీఏపీ–11, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–5, స్కౌట్స్ అండ్ గైడ్స్–1 చొప్పున మొత్తం 59 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్–10001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరి శీలిస్తామని వివరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి సంస్కృతిని సమూలంగా నిర్మూలించడంతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల భయాలను తొలగించి ఎన్టీఆర్ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చడమే ధ్యేయమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి సమూల నిర్మూలనకు తీసుకొచ్చిన మూడు ప్రత్యేక ప్రచార రథాలు, ప్రచార గుర్రాలను తన కార్యాలయం వద్ద ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఈగల్ చాలెంజ్లపై వినూత్నరీతిలో అవగాహన కోసం డిజిటల్ స్క్రీన్లు కలిగిన మూడు ప్రచార రథాలు వారం రోజులు నగర వ్యాప్తంగా తిరుగుతాయన్నారు. గుట్టలు, కొండ ప్రాంతాల్లో అవగాహన కోసం గుర్రాలను, మెక్ అనౌన్స్ మెంట్ సౌకర్యం ఉన్న అత్యాధునిక మాట్రిస్ 4టీ డ్రోన్ల ద్వారా విస్తృత ప్రచారంచేస్తామ న్నారు. గంజాయి విక్రేతల సమాచారమందిస్తే రూ.5 వేలు, వినియోగదారుల సమాచారం తెలిపితే రూ.1500 బహుమతిగా ఇస్తామన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయదారులపై తీవ్ర చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 32 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. 15 వేల మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించి, 1,287 మంది వినియోగదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, కె.కృష్ణ ప్రసన్న, జి.రామకృష్ణ, ఏసీపీ దామోదర్, ఇన్స్పెక్టర్ గుణరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం గన్నవరం: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి సోమవారం నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన ఐఎక్స్ 2875 విమానం షెడ్యూల్ ప్రకారం రోజూ బెంగళూరు నుంచి ఉదయం 6.15గంట లకు బయలుదేరి 7.35లకు ఇక్కడికి చేరుకుంటుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానం సుమారు ఐదు గంటల ఆలస్యంగా బయలుదేరి 12.38 గంటలకు ఇక్కడికి చేరు కుంది. విమానం ఆలస్యం కావడంతో బెంగ ళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఇళ్ల స్థలాలపై మాట తప్పారు
● రెండున్నరేళ్లలో ఏ ఒక్కరికై నా స్థలాలు ఇచ్చారా? ● సెప్టెంబర్ 15వ తేదీ లోపు స్పందించకపోతే ఖాళీ ఇళ్ల స్వాధీనం, గృహప్రవేశాలు చేస్తాం ● ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇళ్ల పట్టాల విషయంలో మాట తప్పిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్, టిడ్కో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల తక్షణ పంపిణీ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యాన పేదలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేశారు. మ్యూజియం రోడ్డులో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన పేదలు, సీపీఎం నేతలు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లి బైఠాయించారు. కార్యాలయం గేట్లు ఎక్కి నిరసన తెలియజేశారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్లోకి వెళ్లి జేసీ ఎస్.ఇలక్కియకు సామూహిక అర్జీలు అందించారు. సమస్యలు తెలియజేశారు. డీఆర్వో లక్ష్మీ నరసింహం ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్లు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు, పెద్ద కంపెనీలకు లక్షల ఎకరాల భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం.. పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలు వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఐదేళ్లు, పదేళ్లుగా మొండి గోడలతో, ఖాళీ స్థలాలుగా పెండింగ్లో ఉండటం అన్యాయమన్నారు. ప్రభుత్వం దొంగాట టిడ్కో ఇళ్ల కోసం యాభై వేల నుంచి రూ. రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేసి పదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పేదల ఇళ్లను అమ్ముకుంటున్నారన్నారు. 2025 నుంచి ప్రజలు పీజీఆర్ఎస్ ద్వారా వందలాది దరఖాస్తులు ఇస్తున్నా కనీసం రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం దొంగాట ఆడుతోందని మండిపడ్డారు. కలెక్టర్ ఇచ్చే హామీని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని, ౖపైపె మాటలు చెబితే కలెక్టరేట్ కార్యాలయాన్ని వంటా వార్పుతో పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయాలని డెడ్లైన్ విధించారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించకపోతే లబ్ధిదారులతో తామే నేరుగా గృహప్రవేశాలు చేస్తామని, ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణరావు, పి.కృష్ణ, కె.దుర్గారావు, ఈవీ నారాయణ, ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
బుడమేరు కన్నీళ్లకు రెండేళ్లు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరాన్ని బుడమేరు వరదలు ముంచెత్తి సరిగ్గా నేటి రెండేళ్లు. 2024 సెప్టెంబర్ 1వ తేదీ బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కొందరైతే.. మరికొందరు ఇళ్లు, విలువైన వస్తువులు, వాహనాలు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఆది నుంచి నిర్లక్ష్యమే బుడమేరు వరదలు సంభవించిన దగ్గర నుంచి నేటి వరకూ కూటమి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. ఆగస్టు 31వ తేదీ 2024వ తేదీనే బుడమేరు కట్ట తెగి వరద నీరు బెజవాడ నగరానికి చేరుతోందని తెలిసినప్పటికి నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఇంకా కళ్లు తెరిచి నిద్రలేవకముందే వరద నీరు వందల ఇళ్లను ముంచెత్తేశాయి. దీంతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ఆ వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ప్రభుత్వం ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా చాలా వరకూ తగ్గడంతో పాటు బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరేవారు. నాడు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో.. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు బుడమేరును పరిరక్షించడంలో కూడా నేటికి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. విచ్చలవిడిగా బుడమేరు ఆక్రమణలు ఇంత పెద్ద ఎత్తున్న విపత్తు నెలకొన్నా.. లక్షలమంది ప్రజల జీవితాలు రోడ్డున పడినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా పోయిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాడు వరదల సమయంలో బుడమేరు ప్రక్షాళన చేస్తామని.. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేటికి వాటిని ఆచరణలో పెట్టలేదు. బుడమేరు పరిరక్షణకు చర్యలు కాదు కదా కనీసం కొత్తగా బుడమేరులో ఆక్రమణలను కూడా అడ్డుకోవడంలో విఫలమవుతుంది. బుడమేరు వరదల తర్వాత న్యూఆర్ఆర్పేట, సన్సిటీ కాలనీ, ఇందిరానాయక్నగర్, రామకృష్ణాపురం, దేవినగర్, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ఆక్రమణలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం బుడమేరు విషయంలో మొద్దునిద్రను వీడి.. బుడమేరు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. ఇరువైపులా వారధి మాదిరిగా రిటైనింగ్ వాల్ను నిర్మించాలని నగర ప్రజలు, నాయకులు కోరుతున్నారు. బుడమేరు ముంపు నివారణలో కూటమి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. బుడమేరు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని స్వయాన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికి శూన్యంగానే ఉండటం సిగ్గుచేటు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం బుడమేరు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి. – కె.దుర్గారావు, సీపీఎం నేత -
సంరప్రదాయ సారథి
నృత్యానికి సొబగులద్దిన వేదాంతం పార్థసారథివిజయవాడ కల్చరల్: కూచిపూడి నృత్యమంటే కేవలం అడుగులు, అభినయం కాదు. తరతరాలుగా వస్తున్న తెలుగు సంస్కృతికి సజీవ రూపం అంటూ ఆ నృత్య సంప్రదాయానికి సరి కొత్త సొబగులు అద్దిన నాట్యాచార్యుడు వేదాంతం పార్థసారథి. ఆ సంప్రదాయాన్ని భుజాన వేసుకొని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వందలాది మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. నగరానికి నృత్యాన్ని వృత్తిలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తూ, శాసీ్త్రయతకు పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో పార్థసారథి అర్ధ శతాబ్దంగా కూచిపూడికి నృత్య సేవలు అందిస్తున్నారు. పార్థసారథి సోదరులు వేదాంతం రాధేశ్యాం, వేదాతం రామలింగశాస్త్రి, వేదాంతం పాండు రంగ శర్మ, వారి కుమారులు అందరూ కూచిపూడి నృత్యనికే అంకితమయ్యారు. గురువుల చెంత నేర్చుకొని.. వేదాంతం పార్థసారథి చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. వేదాంతం కుటుంబంలో కొనసాగుతున్న నృత్య సంప్రదాయాన్ని అందిపుచ్చుకొని కఠోర శ్రమతో సాధన సాగించారు. తండ్రి వేదాంతం సూర్యనారాయణ శర్మ వద్ద తొలి అడుగులు నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం, వేదాంతం పార్వతీశం వంటి గురువుల శిక్షణ ఆయనకు బలమైన పునాదిగా మారింది. వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి సంప్రదాయ కూచిపూడిలో శిక్షణ నిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలు భారతీయ ఆత్మ సంప్రదాయ నృత్యాలను భారతీయ ఆత్మగా భావించాలని వేదాంతం పార్థసారథి సూచించారు. కూచిపూడి నృత్యం, భరతనాట్యం, కథక్, కథాకళీ, ఒడిస్సీ వంటి సంప్రదాయాలు ఏవైనా గురుముఖంగానే పరిపక్వత కలుగుతాయని పేర్కొన్నారు. కూచిపూడి నృత్యాన్ని సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయాలంటే నృత్య రూపకాలది ప్రత్యేక స్థానం. బృందావనం, భక్త ప్రహ్లాద, గిరిజా కల్యాణం, వాగ్గేయకార రచనా వైభవం, అన్నమయ్య, రామదాసు వంటి నృత్య రూపకాలను పార్థసారథి రూపొందించారు. పురాణ భక్తి సాహిత్య ఇతివృత్తాలను నృత్యభాషలో అందంగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. కళలకు స రిహద్దులు లేనట్లుగా తన బృందంతో శ్రీలంక, మలేషియా వంటి దేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెండువేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం తగదు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం తగదని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యను వాస్తవంగా పరిష్కరించారా? వారు సంతృప్తి చెందారా? అనేదే కీలకమన్నారు. ఆర్డీఓలు, తహసీ ల్దార్లు, సర్వేయర్లు అర్జీలను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై ఆరా తీయాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలు సుకుని, నిబంధనల మేరకు న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రత్యేకించి జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 161 అర్జీలు జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో వివిధ సమస్యల పరిష్కారం కోసం 161 అర్జీలు వచ్చాయని అధికా రులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 46, పోలీస్ 23, పురపాలక పట్టణ అభివృద్ధి 23, పంచాయతీరాజ్ శాఖకు 10, మిగిలిన శాఖలకు సంబంధించి అర్జీలు వచ్చాయని వివరించారు. స్వచ్ఛాంధ్రలో జిల్లా మెరవాలి స్వచ్ఛాంధ్ర–2026లో ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువ అవార్డులు వచ్చేలా అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రతి శాఖ, స్థానిక సంస్థ తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వాటి ఫలితాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముంపు సమస్య
బుడమేరు వరదల్లో విజయవాడ నగరం ముంపునకు గురికావడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణం. వరద నీరు వస్తుందని లోతట్టు ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో విఫలమైంది. వరద బాధితుల ఎన్యూమరేషన్లోనూ అనేక లోపాలు జరిగాయి. ప్రచార ఆర్భాటమే తప్ప సహాయ చర్యలు నామమాత్రంగానే చేపట్టి చేతులు దులుపుకున్నారు. వారధి వద్ద గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన విధంగా బుడమేరుకు రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. – కేవీ భాస్కరరావు, సీపీఐ నేత -
వరించిన పురస్కారాలు
పార్థసారథి సేవలను గుర్తించి మద్రాస్ తెలుగు అకాడమీ, ముంబాయ్ తెలుగు సమతి, ఖరగ్పూర్ సాహిత్య సమితి, కళానిలయం వారి జాతీయ స్థాయి పురస్కారం, రాష్ట్ర సాంస్కృతిక సమితి పురస్కారం, అమ్మా కల్చరల్ ఆర్ట్స్ పురస్కారం, మువ్వగోపాల సాంస్కృతిక సమితి పురస్కారం లభించాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వేదాంతం సత్యనారాయణ శర్మ వంటి మహనీయులు ఆశీస్సులు లభించడం విశేషం. కూచిపూడి కేవలం నృత్యకళకాదు, అది తెలుగు నేల మీద సంస్కృతికి ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని తరతరాలకు అందిచేందుకు తన వంతు కృషి చేస్తున్న వేదాంతం పార్థసారథి వంటి కళాకారులు చిరస్మరణీయులు -
పోలీస్ పీజీఆర్ఎస్లో 98 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 98 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందకున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి తగాదాలపై 41, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 22, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 4, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 17 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు, పలువురుసిబ్బంది పాల్గొన్నారు. నిమ్మకూరు(పామర్రు): తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు తెలుగు సంస్కృతి అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఏపీలో జరిగాయి. దీనిలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఎస్ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర జరిగింది. టీటీడీ కమ్యూనిటీ హాల్ విద్యార్థులు సంస్కృత భాష గొప్పదనాన్ని వివరించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఏపీఆర్జెసీ కళాశాల ప్రధానాచార్యులు సాంబశివరావు, ఏపీ గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు మండలి బ్రహ్మణేశ్వరమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు భవానీపురం(విజయవాడపశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్తోపాటు క్యారెట్కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ సేల్ను నగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పీఆర్సీ కమిషనర్ను నియమించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్ను నియమించేలోపు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీజేఏసీ, అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం ఎన్టీఆర్ జిల్లా యూనిట్ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఉద్యోగుల సమస్యలతో కూడిన నోటీసు/వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మొత్తం 29 డిమాండ్లతో కూడిన నోటీసు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, మంగళవారం నల్లబ్యాడ్జ్లు ధరించడం, 3, 5వ తేదీలు భోజన విరామ సమయం లో ప్రదర్శనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ వైఎస్ రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు పి.లక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్. శ్రీనివాసరావు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు సంపత్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అమరావతి చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారుల సత్తా
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి స్టేట్లెవల్ చాంపియన్షిప్లో జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, కోచ్లు భాస్కర్ (బ్యాడ్మింటన్), నవీన్ కుమార్ (ఆర్చరీ), స్వామి (వెయిట్ లిఫ్టింగ్), ఇషాక్, చిరంజీవి (బాక్సింగ్), సంతోష్ (బాస్కెట్బాల్), ఆంజనేయులు, శిరీష (యోగా), క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో టాప్లో నిలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి టాప్లో నిలిచారు. ఏపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీల్లో మేడా రఘునాథరెడ్డి ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో అగ్రస్థానాన్ని సాధించారుతనకు కేటాయించిన నిధుల్లో 55.17 శాతం అభివృద్ధి పనులకు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఖర్చు పెట్టారు. గ్రామాలలో సిసి రోడ్ల పనులకు అత్యధికంగా నిధులను ఖర్చుపెట్టారు. 14.7 కోట్ల రూపాయల నియోజకవర్గ నిధుల కేటాయింపులలో 8.10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 139 ప్రాజెక్టులకు సిఫారసు చేయగా 110 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 29 పనులు కొనసాగుతున్నాయి. ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు. ఇక తను కేటాయించిన ఎంపీ నిధుల్లో 35.71 శాతం ఖర్చుపెట్టిన ఏడో స్థానంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి నిలిచారు. ఈ జాబితాలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అట్టడుగు స్థానంలో నిలిచారు. తనకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వర్మ. ఎంపీ ల్యాడ్స్ నిధులపై ఎంపవర్డ్ ఇండియన్ నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. సీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం -
అక్కాచెల్లెళ్ల పసుపు, కుంకుమ తుడిచేసిన ట్రాక్టర్
● అతివేగంగా బైక్ను ఢీకొట్టిన వైనం ● పెళ్లికి వచ్చి వెళ్తున్న తోడల్లుళ్లు దుర్మరణం గంపలగూడెం/ఎర్రుపాలెం: ఒక ప్రమాదం అక్కా చెల్లెళ్ల పసుపు, కుంకుమను తుడిచేసింది. అతి వేగంగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ బైక్ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ తోడల్లుళ్లు కావడంతో వారి కుటుంబంలో తీర్చలేని విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ముల్లంగి లాజర్, జవ్వాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెసరమల్లి నాగరాజు వివాహం చేసుకున్నాడు. మరో కుమార్తెకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల రమేష్తో వివాహం జరిగింది. నాగరాజు బతుకుదెరువు నిమిత్తం ఇటీ వల హైదరాబాద్ వెళ్లగా, రమేష్ ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. వారిద్దరు ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలోని తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా రామాలయం వెనకాల మెయిన్ రోడ్డుపై మలుపు వద్ద గ్రావెల్ లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. ఆపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడగా నాగరాజు, రమేష్ దాని కిందపడి తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తోడల్లుళ్లు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలిసి వారి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం. రమేష్కుమార్ జేసీబీ సాయంతో ట్రాక్టర్ను తొల గించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె, రమేష్కు భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెసరమల్లి నాగరాజు (ఫైల్) కొరకొప్పుల రమేష్ (ఫైల్) -
ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
మచిలీపట్నంఅర్బన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రీఆర్గనైజ్డ్ టీచర్స్ యూనియన్ (డీపీఆర్టీయూ) రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ డి.శ్రీను డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపుతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ డీపీఆర్టీయూ (ఆంధ్రప్రదేశ్) కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. పీఆర్సీ కాలపరిమితి పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం సరికాదన్నారు. వెంటనే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జి.వి. ఎస్.పెరుమాళ్లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యా యులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రాంబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ను రూపొందించి, తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు బి.విజయలక్ష్మి, కె.గౌరీ, గౌరవ అధ్యక్షుడు డి.సత్యనారాయణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే డిమాండ్ల సాధన
చల్లపల్లి: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు, కొత్త పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి వంటి అంశాలు ప్రభుత్వాన్ని బతిమిలాడితే రావని పోరాటాలు చేసి సాధించుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మాజీ ఎమ్మెల్సీలు కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఆదివారం జరిగింది. తొలుత జాతీయ పతాకాన్ని యూటీఎఫ్ జిల్లా పూర్వ గౌర వాధ్యక్షుడు జి.వి.తాతారావు, ఎస్టీఎఫ్ఐ పతా కాన్ని సీనియర్ నాయకుడు పాగోలు రమేష్, యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా మాజీ ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.ఎస్.ఆర్.మూర్తి ఆవిష్కరించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ షాకత్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన సభలో కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు ప్రసంగించారు. అనుకు న్నది సాధించే వరకూ అలుపెరుగని పోరాటం చేసే సంస్థ యూటీఎఫ్ అని పేర్కొన్నారు. 2027 మర్చిలో జరగనున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఎం.హనుమంతరావును సభకు పరిచయం చేశారు. హనుమంతరావు విజయానికి యూటీఎఫ్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హనుమంతరావు మట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టెట్ విషయంలో లోకేష్ జోక్యం చేసుకోవాలి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని కోరారు. టెట్కు వ్యతిరేకంగా సెప్టెంబర్ మూడో తేదీన నిర్వహిచే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకరావు కార్యదర్శి నివేదికను, కోశాధికారి ఎం.వరప్రసాద్ ఆర్థిక నివేదికలను, సహ అధ్యక్షురాలు టి.ఝాన్సీ మహిళా నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ.ఉమామహేశ్వరరావు, ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర రావు, ఎన్.నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు పి.వినోద్బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు -
ఘనంగా నవదిన ప్రార్థనలు ప్రారంభం
పెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్న ఫాతిమా మాత మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నవదిన ప్రార్థనలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గన్నవరం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జపమాల, దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. మరియతల్లి విధేయతపై వ్యాక్యోపదేశం చేశారు. ఆమె ఎంతో వినయంతో విధేయతతో దేవుని ప్రణాళిక, రక్షణ చరిత్రకు నాంది పలికారని వివరించారు. రెక్టార్ రెవరెండ్ ఫాదర్ జ్వాన్నేస్ నీలూరి మాట్లాడుతూ.. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ ఆరో తేదీ వరకు రోజూ సాయంత్రం నవదిన ప్రార్థనలు, జపమాల, దివ్యబలిపూజ జరుగుతా యని తెలిపారు. ఏడో తేదీన ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఆశీర్వాదం, ఫాతిమా మాత స్వరూప ప్రదక్షిణ ఊరేగింపు, ఎనిమిదో తేదీన ఎనికేపాడు మేరిమాత ప్రోవిన్సుకు చెందిన రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ కాసు నేతృత్వంలో సమష్టి దివ్యబలిపూజ జరుగుతాయని వివరించారు. క్రీస్తు విశ్వాసులు పాల్గొని ఈ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుండా శ్రీనివాసరావు (49), మల్లేశ్వరి దంపతులు భవానీపురం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అతను గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని విశ్వనాథ శర్మ, మల్లేశ్వరితో కలిసి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఉన్న మామిడిచెట్టు కాయలు కోస్తున్నాడు. కొద్దిసేపటికి మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లిపోయింది. శ్రీనివాసరావు తన చేతిలో ఉన్న స్టీల్ రాడ్తో చెట్టుకొమ్మ చివరి భాగంలో ఉన్న కాయను కోసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఆ స్టీల్ రాడ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతను కదలకపోవడంతో మల్లేశ్వరి, ఇంటి యజమాని విశ్వనాథ శర్మ 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి శ్రీనివాసరావు చనిపోయాడని నిర్ధారించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14న పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని అర్చకులు అధికారులకు చెప్పారు. ఆ వారం రోజులు విధులు నిర్వహించిన అర్చకులకు 19న షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 26న ఐదుగుర్ని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు మాయమై దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెత్త వేసే ప్రదేశంలో వెతడం ప్రారంభించారు. ఇన్ని రోజుల తరువాత ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకొచ్చిన కారు
ఇబ్రహీంపట్నం: స్థానిక రింగ్ సెంటర్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్త్ను ట్రాఫిక్ పోలీసులపైకి ఓ కారు ప్రమాదవశాత్తూ దూసుకొచ్చింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. టైర్ ఊడిపోయి డివైడర్ను ఢీకొట్టి పోలీసుల సమీపంలో కారు ఆగిపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆర్ఎస్ఐ శివరామకృష్ణ కథనం మేరకు.. హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ హైవే మధ్యన ఉన్న రింగ్ను గుర్తించడంలో విఫలమయ్యాడు. రింగ్ సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కారు టైర్ విరిగిపోయి డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్కు రెండు మీటర్ల దూరంలో ఆర్ఎస్ఐ శివరామకృష్ణ, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి సమీపంలోకి వచ్చి కారు ఆగిపోవ డంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు టైర్ విరిగి పోకుండా ఉంటే పోలీసులపైకి కారు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కారును యాక్షి డెంట్ టోయింగ్ వ్యాన్తో పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


