NTR
-
వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
కంచికచర్ల: ఇటీవల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, బొప్పాయి, అరటితోటలు పూర్తిగా నేలవాలి దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. మండలంలోని కీసర నేషనల్ హైవే పక్కన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, బొప్పాయి, అరటి తోటలను రైతులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న సాగుచేసిన 150 ఎకరాలను పరిశీలించగా కేవలం పదెకరాలు మాత్రమే బాగుందని, 140 ఎకరాల్లో పంట పూర్తిగా నేలవాలిందని వివరించారు. క్వింటా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400గా ప్రకటించినా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని విమర్శించారు. దళారులు క్వింటా మొక్క జొన్న రూ.1500లోపు మాత్రమే కొంటున్నారని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యాప్ పనిచేయక రైతులు బీమా చేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో రైతులు సాగుచేసిన అన్నిరకాల పంటలకు ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్స్ చేయించిందని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పెసరను మార్క్ఫెడ్ ద్వారా విక్రయించాలంటే క్వింటాకు రూ.650 చొప్పున రైతుల నుంచి అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వసూలు పర్వంలో ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందని రైతులు తమ వద్ద మొరపెట్టుకున్నారని వివరించారు. రైతులను నిర్లక్ష్యం చేసే ఏ ప్రభుత్వమూ సుఖంగా ఉండదని, రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, చలమల ప్రభాకర్, మద్దుకూరు సాయిబాబు, వేమవరపు పురుషోత్తం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు -
రైల్వే వైర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్
60 కిలోల రాగి తీగలు స్వాధీనం తెనాలిరూరల్: ౖరెల్వేకు సంబంధించిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితులు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వ కట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నారు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. నందివెలుగు అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు, సిబ్బంది ఉన్నారు. -
నున్నలో గుర్తు తెలియని మృతదేహం
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రామంలో చెప్పుల కంపెనీ ఎదురు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. నున్న ఎస్ఐ విమల కథనం మేరకు.. నూజివీడు వెళ్లే రోడ్డులో చెప్పుల తయారీ కంపెనీకి ఎదురుగా ఖాళీగా ఉన్న పొలాల్లో గుర్తు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వంటిపై తెలుపు రంగు చొక్కా, కండువా ఉన్నాయి. నార్త్ ఏసీపీ పి.సత్యానందం, నున్న సీఐ పి.కృష్ణమోహన్, ఎస్ఐ విమల, పోలీసు సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కోర్టులో తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు
● అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కేసులు ఎలా కొట్టివేస్తారు? ● జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తనపై నమోదైన కేసులను కొట్టివేయించు కోవడం లోనూ, రెండెకరాలతో రాజకీయం మొదలు పెట్టి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదగడంలోనూ సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ విమర్శించారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండెకరాలతో రాజకీయం ప్రారంభించి దేశంలోనే అత్యంత ధనికుడైనా సీఎంగా చంద్రబాబు ఘనత సాధించారన్నారు. ఆయన అధికారికంగా ప్రకటించిన ఆస్తుల విలువే రూ.981 కోట్లని వివరించారు. భూమి అంతరించే వరకూ రాష్ట్రం మొత్తాన్ని పోషించగల సత్తా ఆయనకు ఉందని, అంతగా ఆస్తులు సంపాదించారని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నాలుగు కేసులను కొట్టేసిన చరిత్ర ఏపీ సీఐడీకి దక్కుతుందని విమర్శించారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న కేసుల్లో ఒక్క కేసు అయినా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేశారా? అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను తన చేతుల్లోకి తీసు కుంటే రాజ్యాంగానికి ఉన్న విలువ ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారని హోంమంత్రి అనితకు లోకేష్ పబ్లిక్ మీటింగ్లో డైరెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. లోకేష్ డైరెక్షన్ను హోంమంత్రి అనిత తూ.చ. తప్పక పాటించారన్నారు. చంద్రబాబు న్యాయస్థానాల్లో తప్పించుకో వచ్చు కానీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీశ పటమట(విజయవాడతూర్పు): ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక సంస్థల గడువు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల బాధ్యతల్లో భాగంగా ఆయన విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు ‘గేట్ వే టు అమరావతి’గా పేర్కొంటారని, అందుకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయన వీఎంసీ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి, నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలను సందర్శించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈఓ శీనా నాయక్, అడిషనల్ కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎ.రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ (ఇన్చార్జ్) పి.సత్యకుమారి, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీకి అదనంగా సహాయకులు, సలహాదారులను నియమిస్తూ ఈఓ శీనానాయక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దేవస్థాన వైదిక కమిటీలో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. దేవస్థాన స్థానాచార్యతో పాటు వేద పండితులు, ప్రధాన అర్చకులు, అర్చకులు ఈ కమిటీలో సభ్యుగా ఉంటారు. ప్రస్తుతం కమిటీలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు ఆంజనేయ ఘనాపాటి, శ్యావస్య మహర్షి, ప్రధాన అర్చకులు వై.మల్లేశ్వరశాస్త్రి, ఎల్.దుర్గాప్రసాద్తో పాటు ఉప ప్రధాన అర్చకుడు కె.ఎన్.వి.డి.ఎంప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. వారికి సమన్వయ సహాయకులు, సలహాదారులుగా వేద పండితుడు షణ్ముఖేశ శాస్త్రి, ఉప ప్రధాన అర్చకుడు బి.శంకరశాండిల్య, ముఖ్య అర్చక రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చక వి.శ్రీధర్శర్మను నియమించారు. ఈ నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలు, పూజలు, నివేదనలను పర్యవేక్షించేందుకు ఈ అదనపు బృందం దోహపడుతుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. -
నేరస్తుడిని చేసిన అనుమానం
ఎ.కొండూరు: తన భార్యపై ఉన్న అనుమానం ఒక వ్యక్తిని నేరస్తుడిని చేసింది. ఓ వ్యక్తిపై హత్యాయత్నా నికి కారణమైంది. ఎ.కొండూరు ఎస్ఐ మహాలక్ష్మణడు కథనం మేరకు.. మండలంలోని పెద్ద తండా గ్రామంలో లావూరి సీతారాం నివసిస్తున్నాడు. తన భార్యకు చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే తన పరువు పోతుందని సీతారాం భావించాడు. జమలయ్యపై ద్వేషం పెంచుకున్నాడు. అతడిని అంత మొందించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో జమలయ్య కదలికలపై నిఘా ఉంచాడు. జమలయ్య నిత్యం పొలం వెళ్లొస్తున్నాడని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జమలయ్య పెద్దతండా సమీపంలో మొక్క జొన్న చేను నుంచి వస్తుండగా అప్పటికే అతని కోసం పొంచివున్న సీతారాం ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సీతారాం తన నేరాన్ని అంగీకరించాడు. కుటుంబ సమస్యలు, భార్య ప్రవర్తనపై కలిగిన అనుమానమే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తిరువూరు కోర్టులోని హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ మహాలక్ష్మణుడు తెలిపారు. నిందితుడిని నూజివీడు సబ్జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీమన్నారాయణ, యు.తిరపతిరావు పాల్గొన్నారు. -
ఈద్ ముబారక్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాసదీక్షలు పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. గురువారం సౌదీ ఆరేబియాలో నెలవంక కనిపించడంతో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం రంజాన్ను జరుపుకొన్నారు. మన దేశంలో శనివారం పండుగను జరుపుకోవాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. దాంతో అన్నిచోట్లా ఈద్ సందడి కనిపించింది. ముస్లింలు ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఉదయం ఏడు నుంచి ప్రార్థనలు.. ఒక్కొక్క మసీదు, ఈద్గాలలో ఆయా నిర్వాహకుల నిర్ణయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం ఏడు గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అలాగే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎనిమిది గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా పదకొండు గంటల వరకూ వివిధ సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. నమాజ్లకు ముందు కొద్దిసేపుమత పెద్దల ప్రసంగాలు ఉంటాయి. కళకళలాడుతున్న మసీదులు.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదు ప్రాంగణాలు విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ఆదివారం ఉపవాసాలకు చివరి రోజు కావటంతో ముస్లింలు రాత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాతబస్తీ, వించిపేట, చిట్టినగర్, భవానీపురం, అరండల్పేట, లబ్బీపేట తదితర ప్రాంతాల్లోని మసీదులన్నీ పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మసీదు కమిటీల ఆధ్వర్యంలో శనివారం పండుగ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మసీదుల వద్ద కంటే ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించేందుకే ఎక్కువ మంది భక్తులు రానున్నారు. విజయవాడలో ప్రధానంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, చిట్టినగర్ ఈద్గాతో పాటుగా అన్ని మసీదుల్లోనూ పండుగ ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనికోసం నగర పాలకసంస్థ ఆయా మైదానాలు, ఈద్గాల్లో ఏర్పాట్లు చేసింది -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మత సామరస్యాన్ని పెంపొందించి, ఐక్యతను చాటే పర్వ దినం పవిత్ర రంజాన్ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా అల్లా అనుగ్రహించాలని అవినాష్ ఆకాంక్షించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వివిధ పంటలకు సంబంధించి పారదర్శకంగా పంట నష్టాలను అంచనా వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. తుది నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అకాల వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిగించిన నష్టంపై శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వల్ల వివిధ పంటలకు జరిగిన నష్టాల వివరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాలు, గాలుల వల్ల వరి, మొక్కజొన్నతో పాటు స్వల్పంగా జొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, అరటి, బొప్పాయి పంటలు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని వివరించారు. తుది నివేదికల ఆధారంగా నష్ట పోయిన ప్రతిరైతుకు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. వివిధ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చేసే సూచనలను అన్నదాతలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షలు మనస్సును పరిశుభ్రం చేయడమే కాకుండా, అవసరంలో ఉన్నవారిపై సానుభూతి కలిగించే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనా లని కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. రెడ్డిగూడెం: ఆస్తి వివాదం నేపథ్యంలో మండలంలోని కొత్తనాగులూరులో గత నెల 25న రెండు వర్గాల వారు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరు వర్గాల ఫిర్యా దుల మేరకు పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర కేసుల్లో మొత్తం పది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు మట్టకొయ్య డేవిడ్రాజు, మట్టకొయ్య రుషారావు, కట్ట అబ్రహాం, మట్టకొయ్య పద్మ, కట్ట ఎస్తేరు, కట్ట సౌజన్య, కట్ట జమలయ్య, కట్ట శ్రీను, కట్ట దేవసహాయం, కట్ట హర్షవర్ధన్ను జేఎఫ్సీఎం మైలవరం కోర్టులో హాజరు పర్చినట్లు రెడ్డిగూడెం ఎస్ఐ ఎస్.శ్రీను తెలిపారు. పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని వీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమ ర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. -
ప్రక్షాళన కథ.. అంతులేని వ్యథ!
సగం సగం పనులతో ఆపరేషన్ బుడమేరు మమ! జి.కొండూరు: బుడమేరు తన ఉగ్ర రూప ప్రదర్శనతో జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఏడాదిన్నర కావస్తున్నా ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లి రాష్ట్ర ప్రభుత్వం తన మానస పుత్రికగా చెప్పుకునే అమరావతి ప్రతిష్టకు భంగం వాటిల్లినా మొద్దు నిద్ర వీడడం లేదు. వరదలొచ్చి పోయిన నాటి నుంచి బుడమేరు పరీవాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చినుకుపడితే కంటి మీద కునుకులేక విజయవాడ నగర ప్రజలు అల్లాడుతుంటే ప్రక్షాళన చేస్తామంటూ, సమాంతరంగా మరో కాల్వ తవ్వుతామంటూ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరలా వానా కాలం వచ్చేలోపు అయినా ప్రభుత్వం ప్రక్షాళనపై దృష్టి సారిస్తే బుడమేరు మరోసారి జల ప్రళయాన్ని సృష్టించకుండా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసంపూర్తిగా రిటైనింగ్ వాల్ బుడమేరుకు 2024, ఆగస్టు 31వ తేదీన వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. అయితే ఎడమ వైపున శాంతినగర్ వద్ద పడిన మూడు గండ్ల నుంచి వరద ప్రవాహం విజయవాడ వైపు మళ్లీ విజయవాడ ప్రజలు రోజుల తరబడి నీటి ముంపులో గడపాల్సి వచ్చింది. దీని వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తా మంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు ఊదరగొట్టారు. ఆ తర్వాత డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం అంటూ వరద లొచ్చిపోయిన ఏడు నెలల తర్వాత 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓని విడుదల చేసింది. ఈ పనులకు జీఓ ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులలో భాగంగా శాంతినగర్ వద్ద డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్ వాల్ 8.65మీటర్ల ఎత్తు, 1.4మీటర్ల వెడల్పు 500మీటర్ల పొడవునా, అదేవిధంగా కుడి వైపు అంటే శాంతినగర్ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించాల్సి ఉండగా పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ని నిర్మించి జూన్ 9వ తేదీతో పనులను ఆపేశారు. రెగ్యులేటర్ గేట్లకు సైతం హడావుడిగా మరమ్మతులు చేసి, రంగులు వేసి వదిలేశారు. ఇంకా ఎడమ వైపున 140మీటర్లు పొడవు, కుడి వైపున యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. అయినప్పటికీ వాల్ నిర్మాణం పూర్తయ్యిందంటూ, ఇక గండ్లు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ సాక్షాత్తూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ బ్యాలెన్స్ పనులు మరలా తిరిగి ప్రారంభించకపోవడంతో గోడ నిర్మాణాన్ని ఆపేసినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు ప్రక్షాళనకు రూ.500కోట్ల ఖర్చవుతుందని అంచనాలు వేసి ఒక్కరూపాయి కూడా విడుదల చేయకుండా వదిలేయడంతో బుడమేరు హెడ్ రెగ్యులేటర్కి దిగువన విజయవాడ నగరంలో ఆక్రమణలను తొలగించలేదు. కాల్వ సామర్థ్యం పెంచలేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నది వరకు 11.90కిలోమీటర్లు మేర ఉన్న డైవర్షన్ కెనాల్కు కాంక్రీటు లైనింగ్ వేయలేదు. అంతే కాకుండా బుడమేరు హెడ్రెగ్యులేటర్కు ఎగువన ఏ.కొండూరు వరకు ఉన్న 42కిలోమీటర్ల బుడమేరు కాల్వలో ఉన్న కంప చెట్లు, మట్టి దిబ్బలను తొలగించలేదు. హెడ్రెగ్యులేటర్ నుంచి ఎగువన బుడమేరులో పోలవరం కుడి కాల్వ కలిసే ప్రదేశం వరకు వరద ప్రవాహానికి భారీగా మట్టి దిబ్బలు పేరుకపోవడం, వాటిని తొలగించకపోవడంతో మరింత ప్రమాదకరంగా మారింది. వానా కాలంలో భారీగా వరదొస్తే ఈ మట్టిదిబ్బల పోటు వల్ల బుడమేరు కట్టకు ఇరువైపులా గండ్లు పడి వెలగలేరు, హెచ్.ముత్యాలంపాడు, కవులూరు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు విజయవాడ నగర ప్రజలకు మరో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. -
పన్నుల చెల్లింపుపై 50శాతం వడ్డీ రాయితీ
మచిలీపట్నంటౌన్: బందరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి తదితర పన్నులపై ఉన్న వడ్డీ 50శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్, మచిలీ పట్నం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి డీకే బాలాజీ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆస్తి, ఖాళీస్థలాలు, తాగునీటి పన్నులు చెల్లించే వారికి వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లిస్తే నగరపాలక సంస్థ ఆర్థికంగా బలోపేతమవుతుందని తద్వారా పౌర సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సదుపాయాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయ వాడ చలసాని నగర్కు చెందిన వై.శ్రీరామ్, మేఘన దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్కు చెందిన సూర్యకుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. ఆలయ అభివృద్ధి నిమిత్తం తమిళనాడు మధురైలోని సౌత్ మాశీ వీధికి చెందిన విశ్వనాథన్ రూ.లక్ష విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
జగన్మాతకు గులాబీలు, కనకాంబరాలతో అర్చన
రెండో రోజు కొనసాగిన వసంత నవరాత్రోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతో అర్చన జరిగింది. తొలుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దుర్గగుడి ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అమ్మవారి పూజ కోసం సేకరించిన పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజా మండపానికి చేరుకుని పూలగంపలను అర్చకులకు అందజేశారు. రెండో రోజు పుష్పార్చనలో 10 మంది ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక క్యూలైన్ మార్గంలో ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. పుష్పార్చన అనంతరం భక్తులకు ఆ పుష్పాలను పంపిణీ చేశారు. దుర్గమ్మకు కలెక్టర్ ప్రత్యేక పూజలు.. విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరణకు ముందు కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాలను అందించారు. -
దుర్గమ్మకు బంగారు మంగళసూత్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కర్నూలు జిల్లా మునగాలపాడుకు చెందిన బోయే వెంకటేష్ కుటుంబం రూ.4లక్షల విలువైన 30 గ్రాముల బంగారంతో చేసిన మంగళ సూత్రాలను శుక్రవారం కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మచిలీపట్నంఅర్బన్: రంజాన్ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్మీడియెట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వ్యాల్యుయేషన్) మార్చి 22 ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఫస్ట్ స్పెల్ వ్యాల్యుయేషన్ నిర్వహణకు 10 మంది అసిస్టెంట్ క్యాంప్ అధికారులు, 40 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 225 మంది ఎగ్జామినర్లు పాల్గొననున్నట్లు తెలిపారు. మిగతా స్పాట్ వ్యాల్యుయేషన్ షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారాంతంలో మూల్యాంకనం పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే సుమారు రెండు లక్షల అయిదు వేల జవాబు పత్రాలు చేరుకున్నా యని తెలిపారు. ఇదిలా ఉండగా, మార్చి 24న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పరీక్ష నిర్వహణతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయని చెప్పారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యతో పాటుగా క్రీడలకు యువత సమప్రాధాన్యం ఇవ్వాలని పీబీ సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు చెప్పారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల ఖో–ఖో (పురుషుల) పోటీలు ఫైనల్స్ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని మైదానంలో శుక్రవారం జరిగాయి. ఫైనల్స్లో సిద్ధార్థ కళాశాల జట్టు మొదటి బహుమతిని, ఆంధ్రా లయోలా కళాశాల జట్టు రెండో, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మూడో, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నాలుగో బహుమతిని సొంతం చేసుకున్నాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వేమూరి బాబూరావు అతిథిగా హాజరై విజేతలకు బహుతులను అందజేశారు. సిద్ధార్థ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ టీవీబీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎస్ఎస్ ప్రసాద్ అభినందించారు. చిట్టేల(వత్సవాయి): స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం కేజీ వెండితో వక్షస్థల లక్ష్మీదేవి విగ్రహాన్ని అందజేశారు. మండలంలోని లింగాల గ్రామానికి చెందిన పసుపుల నర సింహారావు ఈ విగ్రహాన్ని తయారుచేయించి అందించారు. ఆలయ అర్చకులు సిరికొండ సాయికృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను పూలమాల, శాలువాతో సత్కరించారు. -
తాడిగడపలో దొంగల హల్చల్
పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. తాడిగడప గ్రామంలో తాళం వేసివున్న టి.తాపేశ్వరరావు ఇంటిలో అర్ధరాత్రి దొంగల చొరబడ్డారు. ఇంటి కిటికీలు ధ్వసం చేసి, లోపలికి ప్రవేశించిన వారు బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, సొమ్ము చోరీ చేశారు. ఇంటి యజమాని బెంగళూరుకు వెళ్లిన సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగ తనం జరిగిన విషయాన్ని సీసీ కెమెరాలో ఇంటి యజమాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మరో ఇంట్లో కూడా దొంగతనానికి ఆగంతకులు విఫల యత్నం చేశారు. దొంగల అలికిడి విని ఇంట్లో వారు బిగ్గరగా అరవటంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరా పుటేజీ పరిశీలించారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. చోరీ జరిగిన ఇంటి యజమాని అందుబాటులో లేకపోవటంతో ఎంత మేరకు సొత్తు చోరీ జరిగిందో తేలాల్సి ఉంది. అయితే దొంగలు పెద్ద ఎత్తున ఆభరణాలు చోరీ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో దొంగలు హల్చల్ చేయటంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నాగాయలంక: మండలంలోని దిండి గ్రామానికి చెందిన జన్ను బసవదేవుడు (40) ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాగాయలంక ఎస్ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. ఆయన కథనం మేరకు బసవదేవుడు భార్య నాగమణి, పిల్లలతో కొంత కాలంగా విజయవాడలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతని కుమారుడు దిండిలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. కుమారుడిని తీసుకెళ్లడానికి బసవదేవుడు దిండి గ్రామానికి వచ్చాడు. ఎలుకల మందు బిళ్లలు తిని గ్రామంలోని చెరువు గట్టు మీద పడి ఉండటాన్ని బంధువులు గురువారం మధ్యాహ్నం గమనించి అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. భార్యాభర్తల నడుమ తగవులే అతని మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
కన్నీటి సుడులు
గోదారమ్మ ఒడిలో.. విషాదం మిగిల్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర ఉయ్యూరు: సరదా.. సంతోషాలు.. ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తమ బిడ్డలు భద్రాది రామయ్య దర్శనానికి వెళ్లి సంతోషంగా గడిపి ఇంటికి వస్తున్నారనుకున్న తరుణంలో గోదారమ్మ తనలో కలిపేసుకుందన్న హృదయ విదారక ఘటన ఆ కుటుంబాల్లో శోకాన్ని నింపింది. ఉన్నత విద్య పూర్తయితే తమకు చేదోడుగా ఉంటారని ఆశిస్తే విధి వక్రించి తమ బిడ్డలను అనంతలోకాలకు తీసుకెళ్లిపోవటంతో ఆ కుటుంబాల రోదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం, భద్రాచలం సమీపంలోని ఏటిపాక మండలం పురుషోత్తమపట్నం పక్కన కొల్లిగూడెం వద్ద గోదావరి పాయలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఉయ్యూరుకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక్కగానొక్కడూ.. పామర్రు మండలం కనుమూరుకు చెందిన దగ్గుబాటి ఫణీంద్రనాథ్, ఉష దంపతులు ఉయ్యూరు పట్టణంలోని శ్రీనివాసా కాలేజ్ రోడ్డులో అవంతి అపార్టుమెంట్స్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నెలల వయస్సులోనే ఒకబిడ్డను కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ దగ్గుబాటి నవదీప్ (19)ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నవదీప్ కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవులు రావటంతో తమ స్నేహితులతో చదువుతున్న విద్యార్థి భద్రాచలంలో ఉండటంతో స్నేహితులు అంతా కలిసి భద్రాచలం వెళ్లారు. విషయం తెలుసుకున్న నవదీప్ ఈనెల 19న భద్రాచలం వెళ్లాడు. శుక్రవారం స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కొల్లిగూడెంలో గోదావరి పాయలో స్నానాలకు దిగారు. స్నానం చేసే సమయంలో గల్లంతవ్వటంతో గజ ఈతగాళ్లు ఏటిపాయలో వెతగ్గా నవదీప్ మృతదేహం లభ్యమైంది. వద్దని వారించినా.. విషయం తెలుసుకున్న ఫణీంద్రనాథ్ కుటుంబం తల్లడిల్లింది. భద్రాచలం వెళ్లొద్దని తండ్రి వారించినా తల్లిదండ్రులను ఒప్పించి స్నేహితులతో సరదగా గడిపి వస్తానని చెప్పి వెళ్లి విగత జీవుడ య్యా డు. ఉన్న ఒక్కబిడ్డను పై చదువులకు ఇతర దేశాలకు పంపకుండా కళ్లముందే చదివించుకుంటుంటే బిడ్డను దూరం చేసి విధి తమను దిక్కులేని వాళ్లను చేసిందంటూ బాధిత కుటుంబం రోధించింది. తల్లి ఉష సొమ్మసిల్లిపడిపోయింది. యుద్ధ భయం.. మరో వైపు పుత్రశోకం తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్ సౌతాఫ్రికాలో ఉంటున్నాడు. పుత్రుడి విషయం తెలిసి విమానటికెట్లు బుక్ చేసుకున్నారు. హుటాహుటిన బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో విమానం బయలుదేరు వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమని అధికారులు చెబుతుండటంతో ఆ తండ్రి వేదన వర్ణనాతీతంగా ఉంది. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతవ్వటంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. అదే అవంతి అపార్టుమెంటులో నివాసం ఉంటున్న గోక శ్రీనివాస్, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు ఇంటర్ పరీక్షలు రాశాడు. పెద్ద కొడుకు తేజజ్ఞసాయి (20) ఎస్ఎఆర్ఎంలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్ సౌతాఫ్రికాలోని మడ్గాస్కర్లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాస్ సతీమణి అరుణ ఉయ్యూరులో పిల్లలతో ఉంటోంది. తేజజ్ఞ స్నేహితులతో కలిసి ఈ నెల 18న భద్రాచలం వెళ్లాడు. ఈ క్రమంలోనే తన అపార్టుమెంటులో ఉంటున్న నవదీప్ను కూడా రమ్మని పిలవటంతో అతను కూడా వెళ్లా డు. కొల్లిగూడెం చేరుకున్న స్నేహితులు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా ఏటిపాయలో స్నానానికి దిగారు. అయితే తేజజ్ఞసాయి, నవదీప్లకు ఈత రాకున్నా, స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ఇంతలో ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు. -
విజయకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పరాభవ నామ సంవత్సర ఉగాది వసంత నవరాత్రోత్స వాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయపేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
గొడ్డలితో నరికి హత్యాయత్నం!
ఎ.కొండూరు: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి పథకం ప్రకారం దారికాచి మరో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేసేందుకు యత్నించిన ఘటన మండ లంలోని పెద్ద తండా సమీపాన మైలవరం బ్రాంచి నాగార్జున సాగర్ కాలువ కట్టపై గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య, అదే గ్రామానికి చెందిన లావూరి సీతారాం మధ్య పాత కక్షలు ఉన్నాయి. జమలయ్య గురువారం పెద్ద తండా సమీపంలోని మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే అతని రాకకోసం ఎన్ఎస్పీ కాలువ కట్టపై లావూరి సీతారాం మాటు వేసి ఉన్నాడు. జమలయ్య బైక్పై తన సమీపంలోకి రాగానే సీతారాం గొడ్డలితో అతడిపై దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జమలయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని చీమలపాడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ పరిశీలించి, గొడ్డలితో దాడిచేయడం వల్ల జమలయ్య తలకు తీవ్రగాయమైందని, వెంటనే విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ఎ.కొండూరు ఎస్ఐ జి.మహాలక్ష్మణుడును వివరణ కోరగా.. గొడ్డలితో దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఘటనా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారని, బాధితుడి వాంగ్మూలం తీసుకోవడానికి సిబ్బందిని పంపించానని పేర్కొన్నారు. -
మచిలీపట్నంలో కీచక అర్చకుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై యువకుడి లైంగికదాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని కళ్లు ఆ బాలికపై పడ్డాయి. బాలికతో మాట్లాడుతూ చనువుగా ఉండటమే కాకుండా ప్రేమిస్తున్నాని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయం బాలిక తల్లికి చెప్పింది. బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అకాల కష్టం
వత్సవాయి మండలం మక్కపేటలో నేలవాలిన మొక్కజొన్న పంట పెడన మండలం ఉరివి వద్ద మినుము కుప్పలు లంకలకలువగుంట వద్ద మినుము పంటపై పరదాలు కప్పుతున్న రైతులు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలులు, వర్షం ధాటికి పలు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పైరు పూర్తిగా నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, నూర్పిడికి సిద్ధంగా ఉన్న మినుము పైర్లు వర్షానికి తడిశాయి. అరటి, మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాల్లో గింజ అంతా రాలిపోయి కేవలం వరి కంకులు మిగిలాయి. – సాక్షి నెట్వర్క్ పెనుగంచిప్రోలులో కాపుదశలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో నేలవాలిన మొక్కజొన్న చేను ఘంటసాలలో వర్షానికి తడిసిన మినుము పంట -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
చల్లపలి: ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి చీకట్లో రోడ్డు కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెదకళ్లేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. మండలంలోని మంగళాపురం గ్రామానికి చెందిన రైతు పరుచూరి ప్రభాకరరావు (66) అదే గ్రామానికి చెందిన చండ్ర సుబ్బారావు పొలం పనులు ముగించుకుని, పురుగు మందుల కోసం ద్విచక్రవాహనంపై చల్లపల్లి సెంటర్కు వచ్చారు. తిరిగి మంగళాపురం వెళ్లేందుకు పెదకళ్లే పల్లి రోడ్డులో బయలుదేరారు. ఇంకొంత దూరంలో హైవే ఎక్కుతామనే లోపు ఎదురుగా వచ్చే వాహ నాన్ని తప్పించబోయి అప్పటికే చీకటి పడటంతో రోడ్డు కనిపించక వారి వాహనం అదుపుతప్పింది. వాహనం నడుపుతున్న ప్రభాకరరావు, వెనుక కూర్చున్న సుబ్బారావు ఇద్దరూ కింద పడిపోయారు. సుబ్బారావు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడగా, ప్రభాకరరావు ఎడమచేతి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అటుగా వస్తున్న ఆటోలో ప్రభాకరరావును చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రభాకరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకరరావుకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బాగానే ఉన్నానని కంగారు పడవద్దని ప్రభాకరరావు తనతో చెప్పాడని, ఆస్పత్రికి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడని చెబుతూ సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురు వారం జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ.. బందరు ఓడరేవు నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. ఉగాది పచ్చడిలో తీపి, చేదు కలయికలను సమానంగా అంగీకరించాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. తొలుత విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం నవగ్రహాలలో ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయన్నారు. సకా లంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు. దేవదాయ శాఖలో విశిష్టంగా సేవలు అందించిన పది మంది వేద పండితులు, అర్చక స్వాములను రూ.10,116 చొప్పున నగదు పురస్కారాలు, శాలువా, నూతన వస్త్రాలతో మంత్రి, కలెక్టర్ సత్కరించారు. అలరించిన కవి సమ్మేళనం రచయిత ముదిగొండ శాస్త్రి నేతృత్వంలో కవులు రచయితలు చింతలపాటి మురళీకృష్ణ, మేరీకృపాబాయి, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి, వక్కలంక రామకృష్ణ, సింహాద్రి పద్మ, బత్తిన అగస్తీశ్వరరావుతో కలిసి నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బందరు ఆర్డీఓ సాంబశివరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, బందరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.26 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రిటైర్మెంట్ బెనిఫిట్లతోపాటు పెన్షనర్లకు రావల్సిన రూ.26 వేల కోట్లను తక్షణమే విడుదల చేసి వారిని ఆదుకోవా లని ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.దాలినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెన్షర్లకు గతంలో ఇచ్చిన విధంగానే అడిషనల్ క్వాంటమ్ చెల్లించాలన్నారు. పెన్షనర్ల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తొలుత విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు ఆవంచ వేణుగోపాల రాధాకృష్ణమూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కె.వీరబాబు, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మదేవర విష్ణువర్ధన్, ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి.నారాయణరావు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సూరిశెట్టి రామయ్య, వరలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యారమ్స్, చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్యారమ్స, చెస్ పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతాప శ్రీనివాసరావుకు రోలింగ్ షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యేమినేని వెంకటేశ్వర్లు, యెనిగళ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పమిడిపాటి పట్టాభి రామారావు, గౌరవ సలహాదారు సాలి ఆంజనేయరావు, కొత్తపల్లి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శి బర్రె శశాంక బాబు, సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాలినాయుడు -
దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మచిలీపట్నంటౌన్: స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఏప్రిల్ రెండో తేదీతో ముగుస్తుందని విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు https:// machilipatnam. kvs.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి https:// admission.kvs.gov.in లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరు ఏళ్లు ఉండాలని అన్ని తరగతులకు సంబం ధించి వయస్సు నిర్ధారణను 31.03.2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటామని తెలి పారు. సీట్ల రిజర్వేషన్ అనేది కేవీఎస్ ప్రవేశ మార్గదర్శకాలు 2026–27 ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నాగిరెడ్డికి మాతృవియోగం నందివాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాతృ మూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ (89) గురువారం మరణించారు. మణిమ్మకు ఇద్దరు కుమారులు. వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ నాయకులు పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నందివాడ మండలం జనార్దనపురంలో నాగసుందర మణిమ్మ అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం
రెండకరాల్లో మునగ, నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఈదురు గాలులు, అకాల వర్షాలతో ఎకరన్నర మునగ, మూడెకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. మునగకు రూ.80వేలు వరకు, మొక్కజొన్న రూ.2.50 లక్షలు మొత్తం రూ.3.30లక్షలు వరకు పెట్టుబడి పెట్టా. ఈసారి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. కౌలు మరో రూ.1.50లక్షలు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి గతేడాది రబీ సీజన్లో రెంకరాల్లో మినుము పైరు సాగుచేశా. మోంథా తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయా. ఈసారి ఖరీఫ్లో మొక్క జొన్న సాగు చేశా. అకాల వర్షం, ఈదురు గాలులతో నేలమట్టం అయ్యింది. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందనే తరుణంలో అకాల వర్షం నిండా ముంచింది. ఇప్పటికే రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టా. చేతికి చిల్లిగవ్వ వచ్చేలా కనిపించడంలేదు. – గోలుల సాంబశివరావు, రైతు, కొటికలపూడి కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నేలవాలిన పంట పొలాలను కొటికలపూడిలో గురువారం రైతులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు అర్జా బాబూరావు మాట్లాడుతూ మరో 20, 30 రోజుల్లో పంట చేతికొచ్చేదని, ఈ దశలో పంట నేలపాలు అయ్యిందని వాపోయారు. ఇప్పటికే పంటకు పెట్టుబడిగా రూ.50వేలు నుంచి రూ.60వేలు వరకు అయిందన్నారు. కౌలు మరో రూ.30వేలు కలుపుకొంటే ఎకరానికి ఇప్పటికే రూ.90వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు జోగి రమేష్కు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. మరో రైతు బోళ్ల మునియ్య మాట్లాడుతూ ప్రస్తుతం యూరియా కట్ట రూ.2,500 వరకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో అన్ని ధరలు పెరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర మాత్రం పెరగటం లేదని వాపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు నష్టపోతే పరిహారం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే.. జోగి రమేష్ మాట్లాడుతూ అకాల వర్షం రైతుల నడ్డి విరిచిన పరిస్థితి చూశామన్నారు. క్వింటా సుమారు రూ.2వేలు చొప్పున ఎకరాకు 50 క్వింటాలు అయితే ఎకరాకు రూ.లక్ష వరకు వచ్చేవన్నారు. గతంలో మోంథా తుపాను ప్రభుత్వంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంచనాలు వేసినా పరిహారం అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను పలకరించే దిక్కు లేదని విమర్శించారు. ఎరువులు లేవు, విత్తనాలు లేవన్నారు. కృష్ణానది అవతల సీఎం చంద్రబాబు ఉన్నారని, ఇవతల రైతులు ఉన్నారన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, మునగ, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు అధికారులు రైతులు, పంట పొలాల వైపు తిరిగి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో వరదకు పసుపు పంట కోల్పోతే వైఎస్ జగన్ ఎకరాకు రూ.లక్ష ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు, ౖ వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పరాభవ.. విజయీభవ
భక్తితో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికిన ప్రజానీకంఅమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా వస్తున్న ఆలయ ఈవో, చైర్మన్ తదితరులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మకు తెల్లవారుజామున స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాల వద్ద విశేష పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాల వద్ద అరటి చెట్టు, మామిడి ఆకులతో ముస్తాబు చేశారు. వసంత నవరాత్రులు ప్రారంభం.. తొలుత ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధా కృష్ణ, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై నూతన పూజా మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తితో ఆలయ ఈవో, చైర్మన్ ముందుకు సాగారు. నూతన పూజా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మల్లెలు, మరువంతో పుష్పార్చన చేసి వసంత నవరాత్రులకు అంకురార్పణ చేశారు. తొలి రోజున 13 మంది ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. రూ. 2,500 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు పుష్పార్చనలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఇక సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నూతన పూజా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. అంతకు ముందు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వేదపఠనంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి, పంచాంగాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. చల్లా శ్రీనివాసశర్మకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పుష్పమాలను సమర్పించారు. పంచాంగ పఠనంలో 12 రాశుల స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు, గ్రహ స్థితుల గురించి చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, నూతన యాగశాల దాత సంగా నరసింహరావు దంపతులను ఘనంగా సత్కరించారు. చైర్మన్, ఈవోలు వారికి నూతన వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
కనికుట్టు స్కీమ్!
జి.కొండూరు: ప్రభుత్వం మాటలు కోటలు దాటడం తప్ప చేతలు గడప కూడా దాటడం లేదనేది ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. స్కిల్ డెవలెప్ మెంట్లో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. శిక్షణ అయితే ఇచ్చారు కానీ ఏడు నెలలు గడిచినా మిషన్లను పంపిణీ చేయకపోవడంతో మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మిషన్లు ఇచ్చే లోపు నేర్చుకున్నది కూడా మరచిపోయేలా ఉన్నామని వాపోతున్నారు. శిక్షణ ఇలా.. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ ట్రైనింగ్ పార్టనర్గా కర్డ్ అనే సంస్థకి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 29సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క సెంటర్కి రెండు బ్యాచ్లలో 144మంది చొప్పున 4,176మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 2025, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 90రోజులపాటు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు నైపుణ్య పరీక్షను నిర్వహించి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాల్సి ఉంది. శిక్షణ పూర్తయ్యి ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో స్పందన లేకపోవడంతో సదరు సంస్థ పరీక్షను నిర్వహించలేదు. మిషన్లను పంపిణీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొనడంతో లక్షల మంది మహిళల మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో.. ఏడు నెలలుగా ఎదురు చూపులు.. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ప్రభుత్వం మిషన్లు ఎప్పుడు పంపిణీ చేస్తుందో తెలియక నరకయాతన పడుతున్నారు. శిక్షణ కాలంలో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న సెంటర్లకు వచ్చేందుకు 90రోజుల పాటు ప్రతి రోజూ రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10వేల వరకు సొంత డబ్బులు ఖర్చు చేశారు. అంతే కాకుండా ఇతర ఆదాయ మార్గాలను సైతం వదులుకొని శిక్షణ పొందామని. మిషన్లు పంపిణీ చేయకపోతే తామెలా బతకాలను వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కుట్టు మిషన్లను పంపిణీ చేయకపోతే నేర్చుకున్నది కూడా మరిచిపోయాలా ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కవి, శతావధాని మాడుగుల నాగఫణిశర్మ గురువారం దర్శించుకున్నారు. 7ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఇతర నాయకులు పాల్గొని, కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మునిసిపల్, పంచాయతీ శాఖలు డ్రెయినేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని కల్లాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరచుకునేలా చేయూతనివ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్బీ శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. సమాచారం ఇవ్వండి.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454 )అందుబాటులో ఉందని.. ఈ నంబర్కి కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
ఈద్ నమాజ్కు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించనున్నట్లు ముస్లిం ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలీ, మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఈద్నమాజు నిర్వహించే ప్రాంగణంలో గురువారం నమాజు పోస్టర్ను వారు ఆవిష్కరించారు. డాక్టర్ కాలేషావలి, మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ రంజాన్ రోజు ఉదయం 7. 30 గంటలకు ఈద్ సందేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నమాజు ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. వజూ కోసం శుభ్రమైన నీరు అందుబాటులో ఉంటుందని, నమాజు నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రతినిధులు ఎండీ అన్వర్ పాష, ఎండీ ఇర్ఫాన్, ముఖ్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్ పాల్గొన్నారు. తిరువూరు ఆర్డీవోగా కుమార్ తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో పౌరసరఫరాల విజిలెన్స్లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై తిరువూరుకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కె. మాధురి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో కుమార్ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హెచ్సీ శ్రీమన్నారాయణకు ఉత్కృష్ట సేవ పతకం ఎ.కొండూరు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బి.శ్రీమన్నారాయణ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రజలతో సత్సంబంధాలు వంటి లక్షణాలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో సేవలందిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే అధికారిగా శ్రీమన్నారాయణ స్థానికంగా మంచిపేరు ఉంది. శ్రీమన్నారాయణకు అవార్డు లభించడం పట్ల ఎ.కొండూ రు పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు
కోనేరుసెంటర్: లారీ ఢీకొనటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు వదలగా ఓ మహిళ తన పిల్లలను మోపెడ్పై ఎక్కించుకుని ఇంటికి వెళుతోంది. సరిగ్గా పరాసుపేట సెంటర్ సర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో కరగ్రహారం నుంచి పరాసుపేటకు చేరుకున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారులు వెళుతున్న మోపెడ్ను ఢీకొన్నాడు. తల్లి పిల్లలు రోడ్డుపై పడిపోగా రెండు అడుగుల దూరం వరకు మోపెడ్ను లారీ దూసుకుంటూ ఈడ్చుకు వెళ్లింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి వాహనదారులు లారీడ్రైవర్ నిర్లక్ష్యాన్ని మందలిస్తూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని రివర్స్ చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు లారీ చక్రాల కింద పడి నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పరారీలో డ్రైవర్! గాయాలపాలైన పిల్లలను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన లారీడ్రైవర్ వాహనాన్ని పక్కకు పెడుతున్నట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు, బందరు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి లారీ ఘంటశాలకు చెందినదిగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్తో పాటు వాహన యజమానిని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. పెడన: పెడన– బంటుమిల్లి 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కట్లపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పెడన పట్టణంలోని శ్రీకృష్ణతులసీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే పెయింటర్ యాళ్ల సాయి(24) తమ సమీప బంధువుల పిల్లలు గూట్ల మేఘశ్రీ(5), పుట్టి వైష్ణవి(12)లతో కలిసి సాయి తల్లిదండ్రులుంటున్న శింగరాయపాలెంకు సుమారు రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయల్దేరాడు. ఈక్రమంలో నరసాపురం నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, మేఘశ్రీ, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టండి
పామర్రు: రైతులు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి, అధిక ఆదాయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో కలెక్టర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం సందర్శించి రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒక వైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పొలం గమనించామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంట నిటారుగా నిలిచిందని, మంచి దిగుబడి వచ్చిందని చెప్పారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్ట పోయారని అన్నారు. గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సందర్శన.. అనంతరం కలెక్టర్ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడీ సక్షం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామర్రులోకి చాట్లవానిపురంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం.. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పామ ర్రు సచివాలయం–1లో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఉయ్యూరు ఆర్డీవో శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఈ రాజన్న, తహసీల్దార్ రవికాంత్, డెప్యూటీ ఎంపీడీవో గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి శివ నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
రైతులతో వాతావరణం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు నియోజకవర్గంలో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షంతో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ లక్ష్మణ్రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్ఐ అర్జున్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. -
పూల ధరలకు రెక్కలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా మెయిన్ కెనాల్ సమీపంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిటకిటలాడింది. గురువారం పండుగను పురస్కరించుకొని పూజలకు, ఇతర అలంకరణ నిమిత్తం పూలను తీసుకెళ్లేందుకు నగర వాసులు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. అందుకనుగుణంగా రైతులు కూడా భారీగా పూలను మార్కెట్కు తరలించారు. బంతి, చామంతి, మల్లి, లిల్లీ, గులాబీ పువ్వులు భారీగా వచ్చాయి. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం రోడ్డు మొత్తం వినియోగదారులు, వాహన చోదకులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేయటానికి వచ్చిన వినియోగదారులు ముందుకు సాగటానికి దారి లేక తోపులాటలు చోటు చేసుకున్నాయి. ధరలు.. భారీగా పెంచేశారు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం ఉన్న ధరలు రెట్టింపయ్యాయి. ఆ ధరలను విని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకూ కనకాంబరాలు కిలో రూ.200 నుంచి రూ.400 పలుకగా బుధవారం ఉదయం రూ.800, సాయంత్రం రూ.1000 మేర ధర పలికింది. అదేవిధంగా మల్లెపూలు మొన్నటి వరకూ కిలో రూ.200 మాత్రమే ఉండగా బుధవారం రూ.600 దాటింది. వాటితో పాటుగా చామంతి, గులాబీ ధరలు సైతం నాలుగు రెట్లు పెరిగి మూడు వందల నుంచి నాలుగు వందల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే లిల్లీ మొన్నటి వరకూ వంద నుంచి మూడు వందల రూపాయలు పలుకగా, బుధవారం రెండు రెట్లు పెరిగాయి. ఈ ధరలు గత ఏడాది రెట్టింపుగా ఉన్నాయని వ్యాపారులు వివరించారు. పూల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఈ విధంగా పలుకుతుంటే రిటైల్గా ఇళ్ల వద్ద ఆ ధరలు మరింత పెరిగి వినియోగదారులకు మరింత భారమయ్యాయి. మార్కెట్లో పూలదండలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆలయాలు, ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటుగా అలంకరణకు దండలు వినియోగిస్తారు. అదే విధంగా దస్త్రాలు ఉన్న దుకాణాదారులు సైతం భారీగా పూలదండలను తీసుకెళ్లారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వివిధ సభా కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సైతం దండలకు ఆర్డర్లు ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటి ధరలు రూ.200 నుంచి రూ.1000 వరకూ పలుకుతున్నాయి. -
రూ.30లక్షల డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో తొమ్మిది డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు రూ. 30లక్షలు స్వాహా అయిన సంఘటనపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చనపల్లి గ్రామంలో 9 గ్రూపులకు సంబంధించిన నగదును విస్సన్నపేటలోని ఇండియన్ బ్యాంకులో జమ చేస్తుంటారు. అయితే బుక్ కీపర్ అయిన బత్తుల మౌనిక మహిళ మండలి ప్రిసిడెంట్, సెక్రటరీ, గ్రూపు సభ్యులకు తెలియకుండా పలు దఫాలుగా సుమారు రూ. 30లక్షల వరకూ డ్రా చేసింది. దీనిని గుర్తించిన గ్రూపు సభ్యులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఏపీఎం, సీసీల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలా ఎలా? గ్రూపు సభ్యుల సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు సిబ్బంది.. బుక్ కీపర్కు అంత మొత్తం ఎలా ఇచ్చారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే ఇండియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది, బుక్ కీపర్, ఏపీఎంలు కుమ్మకై డబ్బులు స్వాహా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. నగదు మాయం నిజమే.. కాగా ఈ విషయమై ఏపీఎం రామకృష్ణను అడుగగా గ్రూపు సభ్యుల నగదు స్వాహా అయిన మాట నిజమేనని, దీనిపై విస్సన్నపేట ఇండియన్ బ్యాంకులో అడిట్ జరుగుతున్నట్లు తెలిపారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది డ్వాక్రా గ్రూపు సభ్యులు -
సజావుగా ‘పది’ పరీక్షలు
98.91 శాతం హాజరు నమోదు మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎస్ఎస్సీ హిందీ, ఏపీఓఎస్ఎస్ ఇంగ్లిష్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఎస్ఎస్సీ పరీక్షలకు 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది హాజరవగా, 98.91 శాతం, ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరవడంతో 73.08 శాతం హాజరు నమోదైందన్నారు. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ ఎస్ఎస్సీ పరీక్షలకు 21,257 మందికి గాను 21,063 మంది హాజరై 99.09 శాతం హాజరు నమోదైందని డీఈఓ తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల్లో 55 మందికి గాను 16 మంది హాజరై 29.09 శాతం హాజరు నమోదవగా, 39 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరై 73.08 శాతం హాజరు నమోదవగా, 161 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు అందివ్వడం ద్వారా మత సామరస్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత వున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ’రోజా’(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందన్నారు. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షరీన్బేగం, కేజీవీ సరిత, కె. కృష్ణ ప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, బి. లక్ష్మీనారాయణ, ఎస్వీడీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొనారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీ పరాభవ నామ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త విజయాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల సంస్కృతిలో ఉగాది పండుగకు విశిష్ట స్థానం ఉందని, ఇది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా ఆలోచనలు, ఆశయాలను పునర్నించుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన మాస్టర్స్ (వెటరన్స్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, జావెలిన్త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్త్రో, హైజంప్ల్లో మహిళ లు, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 30, 31వ తేదీల్లో గుంటూ రు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఎ.కొండూరు: మండలం పరిధిలోని చీమలపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన 33వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో గత మూడేళ్లుగా చేసిన పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు, డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని విన్నవించారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతులు పాల్గొన్నారు. పెనమలూరు: కానూరులో ఇంటర్ చదువుతున్న బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు నాగార్జున ఆస్పత్రి సమీపంలో యశ్విని(16) కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమె విజయవాడ మోగల్రాజపురంలో ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది ఎంఈసీ పరీక్ష రాసింది. అయితే ఆమె ఇంట్లో ఉదయం చున్నీతో ఉరేసుకొని మృతి చెందింది. చదువుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేటి నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష సుగంధ పుష్పాలతో అర్చన జరగనుంది. నూతన పూజా మండపంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి గురువారం తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కళావేదికపై పంచాంగ పఠనం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది నేపధ్యంలో అమ్మ వారి ఆలయాన్ని పూలతో విశేషంగా అలకరించారు. మల్లెలు, మరువంతో అర్చన వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన గురువారం అమ్మవారికి మల్లెపూలు, మరువంతో విశేషంగా అర్చన జరుగుతుంది. తొలుత అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా పూజామండపానికి చేరుకుంటారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.2500 టికెట్ కొనుగోలు చేయాలి. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రమణయ్య కూల్డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్, వీల్షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచి చూసింది. జననేత కనిపించిన ఆనం దంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధ వారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ కన్వెన్ష న్లో నిర్వహించిన విందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పొంగిన అభిమాన తరంగం ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇఫ్తార్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు ముందే నిండిపోయింది. వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ అభిమాన నేత కోసం తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. ఇఫ్తార్ విందు ముగిశాక బయటకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండి తోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజి రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి -
పీజీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్ బ్రాండ్ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ‘సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డాక్టర్ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. -
విజయవాడలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
సాక్షి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.ముస్లిం సోదరులకు వైఎస్ జగన్.. ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షలు విరమింపచేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. -
బీఆర్ నాయుడిని తప్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తప్పించండి..మీకు చేతకాకపోతే సీఎం పదవి నుంచి మీరు తప్పుకోండి’’ అని వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాస్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్సార్ సీపీకి చెందిన మహిళలపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటమే కాకుండా తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి, మహిళలపై లాఠీచార్జ్ చేసిన పోలీసులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబుకు శ్రీవారిపై నిజమైన భక్తి ఉంటే బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తన కులదైవం శ్రీవేంకటేశ్వరస్వామి అని చెప్పుకునే చంద్రబాబు, టీటీడీలో జరుగుతున్న ఘటనలకు కారణభూతుడైన బీఆర్ నాయుడిని ఎందుకు తప్పించటం లేదని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ కండువా కప్పుకుని పని చేస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోగా వెనకేసుకురావడం చంద్రబాబు నైజానికి తార్కాణమన్నారు. జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలి టీటీడీ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా మచ్చ తీసుకువచ్చిన బీఆర్ నాయుడిని జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చిన మరునాడే పార్లమెంట్కు వెళ్లటం పార్లమెంట్ వ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానిపక్షంలో మీరు తప్పుకోండి చంద్రబాబును డిమాండ్ చేసిన అవినాష్, మల్లాది, స్వామిదాస్ తిరుపతిలో మహిళలపై దాడిని ఖండిస్తూ నిరసన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియోలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు ఇకనైనా వారి తీరు మార్చుకోకపోతే భవిష్యత్లో తీవ్రపరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. -
తెలుగు తమ్ముళ్లలో
● పార్లమెంటు, నియోజకవర్గ ప్రజాప్రతినిధుల మధ్య పొరపొచ్చాలు ● బీజేపీ నేతలకూ పొసగని వైనం ● పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయం లో పనిచేసే వ్యక్తి పలువురి కాల్లిస్టులు తెప్పిస్తున్నట్లు అనుమానం ● తిరువూరులో రగులుతూనే ఉన్న రావణకాష్ఠం ● మైలవరంలో భగ్గుమంటూనే ఉన్న వివాదం సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ముఖ్యనేతకు, నియోజక వర్గ ప్రజాప్రతినిధులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఇటీవల మైలవరంలో జరిగిన సీఐల బదిలీల విషయంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధి సిఫారసులు చెల్లుబాటు కాలేదు. ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి హస్తం ఉందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఏకంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయానికి వెళ్లి నిలదీయటం, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశఽంగా మారింది, ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి హస్తం ఉన్నట్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మట్టితో పాటు పలు విషయాల్లో వీరి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ● తిరువూరులో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజాప్రతినిధి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. అధిష్టానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య మాటల మంటలు ఏమాత్రం ఆరటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య బహిరంగంగానే వార్ నడుస్తోంది. ఇటీవల నెమలి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కల్యాణంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధికి ఘోర అవమానం చేశారు. అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం నియోజకవర్గ ప్రజాప్రతినిధిది అయినప్పటికీ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వీరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగానే ప్రెస్మీట్లు పెట్టుకుని తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రెస్మీట్ పెట్టి షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. నన్ను చంపేస్తారేమో అనే అనుమానం సైతం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ లపై వేధింపులు అధికమయ్యామని, రౌడీయిజం, పేకాట క్లబులు, రేషన్ మాఫియా పెచ్చరిల్లుతున్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్ముళ్ల అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేశాయి. పార్లమెంటు ముఖ్యనేతకు, కూటమి నేతలకు మధ్య సఖ్యత కొరవడింది. ఈ విషయం ఇటీవల వన్ టౌన్లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా బట్టబయ లైంది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్లమెంటు ముఖ్యనేత ఉన్నప్పటికీ, నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ సామాజిక వర్గం సమావేశానికి రాకపోవడం వీరి మధ్య అంతరాన్ని తేటతెల్లం చేసింది. దీనికితోడు బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కాల్డేటాను పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయంలో పనిచేసే వ్యక్తి తెప్పిస్తు న్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు నియో జకవర్గ ప్రజాప్రతినిధులు, వారి పీఏల కాల్ లిస్టు డేటాలు కూడా తెప్పిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీనికి కృష్ణాజిల్లాలో పనిచేసే ఓ పోలీసు అధికారి సహకరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.పార్లమెంటు ముఖ్యనేతకు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సఖ్యత పూర్తిగా కొరవడింది. పైకి కౌగిలించుకున్నట్లు కనిపిస్తున్నా... లోలోన మాత్రం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే బహిరంగంగా చర్చ సాగుతోంది. పార్లమెంటు ముఖ్యనేత ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులంతా దూరం జరిగినట్లు పార్టీ వర్గాలే పేర్కొనడం గమనార్హం. -
సేంద్రియ సాగుకు చేయూతనివ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను సేంద్రియ వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించేలా బ్యాంకులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించి 555 బ్రాంచ్ల ద్వారా అందుతున్న సేవలు, వివిధ బ్యాంకింగ్ సూచికల్లో ప్రగతి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన తదితరాలపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.83,500 కోట్లు లక్ష్యం కాగా డిసెంబర్ 31 నాటికి 88,269 కోట్లు పంపిణీతో 106 శాతం మేర లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రకృతి సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని, భవిష్యత్ అంతా ఆర్గానిక్ ఉత్పత్తులదేనని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగు తోందన్నారు. మరో రెండేళ్లలో లక్ష ఎకరాలకు పైగా ఈ విధానం అమలు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకు రుణ మద్దతు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు భాగస్వాములుగా వ్యవహరించి అర్హులైన వారికి సమయానికి రుణాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ యూబీఐ రీజినల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ మేనేజర్ రాజేష్కుమార్ కుంద్, నాబార్డు డీడీఎం పృథ్వి, ఎల్డీఎం ప్రియాంక, అమరేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ప్రభుత్వ పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
మైలవరం(జి.కొండూరు): ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి నారా లోకేశ్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ ఈ నెల 10న విద్యార్థులు తమ ప్లేట్లలోని భోజనాన్ని బకెట్లో పడేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యాశాఖ అధికారులు 11వ తేదీన పాఠశాలను తనిఖీ చేసి భోజనంలో లోపాలను గుర్తించి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించడంతోపాటు హెచ్ఎం జాన్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేశ్... మధ్యాహ్న భోజనం విషయంలో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా లోపం తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్ వస్తున్న విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. -
50 వసంతాల వేడుకకు సిద్ధం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): దేశంలోని రైల్వే వ్యాగన్ వర్క్షాపుల్లో ఒకటైన గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకకు సిద్ధమైంది. వర్క్షాపులో బుధవారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపేందుకు ముస్తాబు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చీఫ్ వర్క్షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్ మంగళవారం వర్క్షాపులో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. 2,400 మంది ఉద్యోగులకు ఆసరా రైల్వే వ్యాగన్ వర్క్షాపు ప్రతి ఏడాది భారీగా ఆదాయం గడిస్తోంది. సంస్థలో 2 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 400మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి వేతనాలు, ఇతర ఖర్చులు మొత్తం ఏడాదికి రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. కార్మికులు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలతో పాటు ప్రతి ఉద్యోగి, కార్మికుడు తమకు తోచిన సహాయం అందించడం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కాలుష్య నివారణకు సుమారు 10 వేల మొక్కలు నాటారు. నూతన పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా పనిభారం తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రైల్వే వ్యాగన్ వర్క్షాపు గతంలో కంటే ఇప్పుడు పురోభివృద్ధి సాధించింది. ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 8,200 రైలు వ్యాగన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. రూ.200 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. పూర్తిగా వినియోగించుకుంటే ఏడాదికి 10వేల వ్యాగన్లు మరమ్మతులు జరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వర్క్షాపు రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. వచ్చే వేసవి నాటికి రూ.కోటి వ్యయంతో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తాం. –ఎస్.శ్రీనివాస్, చీఫ్ వర్క్షాపు మేనేజర్ నేడు గుంటుపల్లి వ్యాగన్ వర్క్షాపు గోల్డెన్ జూబ్లీ -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్సీపీ నిర్వహించే ఇఫ్తార్ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన విద్యార్థులు.. ఏం జరిగిందంటే..!
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు షాకిచ్చారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గురించి డబ్బా కొట్టడానికి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడ్డంగా బుక్కయ్యారు. గొల్లపూడిలో ఎంపీపీ పాఠశాల తనిఖీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. మీ కోసమే మధ్యాహ్నభోజనంలో మంచి ఆహారాన్ని అందిస్తున్నామంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం నాసికరంగా ఉందన్న విద్యార్థులు.. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే మైలవరంలోని తారకరామా నగర్ ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు రాగా, స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్ను మార్చింది. తాజాగా మరో స్కూల్లో చిక్కీలపై ఫిర్యాదు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 71 ఫిర్యాదులు
ఏపీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణమాచారి ఆల్ ఇండియా ఖోఖో టోర్నమెంట్కు రాజ్కుమార్ ఎంపిక పోలంపల్లి(వత్సవాయి): ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో టోర్నమెంట్కు మండలంలోని పోలంపల్లి జెడ్పీ హైస్కూలు వ్యాయామోపాధ్యాయుడు ధనాల రాజ్కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పుణేలో జరగనున్న టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో కూడా రాజ్కుమార్ ఆల్ ఇండియా టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ను సాధించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల హెచ్ఎం కొక్కిరగడ్డ జ్యోతి, రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు మడక ప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ కార్యదర్శి మద్దినేని సత్యప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. 1 నుంచి 30ఎక్కాలు అనర్గళంగా చెబుతున్న నాలుగేళ్ల చిన్నారి -
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి దుర్మరణం
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనురెప్పపాటులో లారీ చక్రాల కింద పడి చిన్నారి తల భాగం నుజ్జునుజ్జు కావటం చూపరులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్పీహెచ్ కాలనీకి చెందిన గుణపు సునీల్ తన ముద్దుల మేనకోడలు పాగోలు రియాల్షి (3)ని బైక్పై ఎక్కించుకుని సరదాగా తిప్పేందుకు బయటకు తీసుకువచ్చాడు. గ్రామ ప్రధాన కూడలిలోని తిరుపతమ్మ తల్లి గుడి సెంటర్ నుంచి జాతీయ రహదారి వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి వీరి బైక్ను ఢీకొట్టింది. బైక్ లారీ కింద ఇరుక్కుపోగా బండిపై కూర్చున్న మూడేళ్ల చిన్నారి పాగోలు రియాల్షి పైకి ముందు టైర్లు ఎక్కటంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. చిన్నారి తలపైకి లారీ చక్రాలు ఎక్కటంతో నుజ్జునుజ్జు అయి, మెదడు, ఇతర భాగాలు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంతో చిన్నారి కుటుంబంతో పాటుగా ఆర్పీహెచ్ కాలనీలో రోదనలు మిన్నంటాయి. నిర్లక్ష్యంగా లారీ నడిపి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు హరించిన లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. బైక్ నడుపుతున్న మృతురాలి మేనమామ సునీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హనుమాన్జంక్షన్ సీఐ ఎల్.రమే ష్, ఎస్ఐ వి.సురేష్, వీరవల్లి ఎస్ఐ సత్యం ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. ప్రమాద ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆల్ ఇండియా జూనియర్ లాన్ టెన్నిస్ చాంపియన్షిప్–2026 ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆల్ ఇండియా జూనియర్ (అండర్–16, బాలురు, బాలికల) లాన్ టెన్నిస్ చాంపియన్ షిప్–2026 పోటీలను సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గమనించి తల్లిదండ్రులు ఆ క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తే వారు రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై.బాబూరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఈ.లలిత్కుమార్, కోశాధికారి శ్రీనివాసరావుతో పాటుగా సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆకివీడులో మత కల్లోలాలకు కుట్ర నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో మతకల్లోలాలకు కుట్ర జరుగుతోందని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్ లోని ఒక హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకివీడులో గత మూడు నెలలుగా అశాంతి నెలకొందన్నారు. డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైఖరి వల్ల హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని జాన్ మస్క్ మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించకుండా, ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు పాల్పడటం శోచనీయమన్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకే రఘురామకృష్ణంరాజు రాష్ట్రాన్ని మణిపూర్ తరహాలో మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.సమావేశంలో ఏపీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షుడు పాస్టర్ ఎండీ ఇస్మాయిల్, జి.రాజేష్ ఖన్నా, పీతల రాజు, యోసేబు, విజయ శేఖర్, ప్రకాష్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి, భాషా–సాంస్కృతిక స్వాభిమానానికి నిలువెత్తు ప్రతీక అని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగ నిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అజ రామరం అన్నారు. అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వర్చువల్గా హాజరయ్యారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ -
బార్ అనుమతులు రద్దు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ను పరిశీలించిన ఎకై ్సజ్ శాఖ డీసీ చిలకలపూడి(మచిలీపట్నం): నిబంధనలకు విరుద్ధంగా మంగిన పూడిబీచ్ రోడ్డులో బార్ షాపును నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన అనంతరం అమ్మకాలను నిలిపివేసి, సస్పెండ్ చేస్తున్నట్లు ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘కిక్కు’రుమనడం లేదు! శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, మచిలీపట్నంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన లాటరీ పద్ధతిలో నిర్వహించిన ప్రక్రియలో ఎంపికై న లైసెన్సుదారుడికి ప్రొవిజినల్ లైసెన్సు అందజేశామని తెలిపారు. అయితే 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు అన్ని సదుపాయాలతో బార్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా అమ్మకాలు జరుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఎకై ్సజ్ అధికారులు పరిశీలించి, నిబంధనలకు లోబడి లేకపోవటంతో వెంటనే అమ్మకాలను నిలిపివేసి, అనుమతులు సస్పెండ్ చేశామన్నారు. లైసెన్సుదారుడికి నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం 77 మంది కార్యదర్శులకు గ్రేడ్–4 నుంచి గ్రేడ్–3గా సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కలెక్టర్ ఆయన చాంబర్లో అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పాల్గొన్నారు. -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రాధాన్యతతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 88 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
తొలి రోజు ప్రశాంతం
జిల్లాలో ప్రారంభమైన ‘పది’ పరీక్షలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 149 కేంద్రాల్లో కేటాయించిన 27,249మంది రెగ్యులర్ విద్యార్థులకు గానూ, 27,043 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 206 మంది గైర్జాజరైనట్లు అధికారులు ప్రకటించారు. హాజరు శాతం 99.24శాతంగా నమోదైంది. తొలి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పరీక్షను నిర్వహించారు. అదేవిధంగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పరీక్షలకు 671 మందికి 16 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 546 మంది హాజరుకాగా 125 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద ఆయా స్థానిక పోలీసుస్టేషన్ల పరిధి అధికారులు బందో బస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రానికి సకాలంలో విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి పరీక్షకు అరగంట ముందుగా విద్యార్థులను అనుమతించారు. జిల్లాలోని ఏ కేంద్రంలోనూ ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. జిల్లాలో పదో తరగతి తొలిరోజు పరీక్షల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గవర్నర్పేట సీవీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని డీఈవో ఎల్.చంద్రకళతో కలిసి తనిఖీ చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లాలో అమలుచేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: డీఈవో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈవో ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా కేంద్రాల వద్ద పర్యవేక్షిస్తున్నామన్నారు. -
ఆడిందే ఆటగా..
సాక్షి టాస్క్ఫోర్స్: పామర్రులో పేకాట మూడు ముక్కలు.. ఆరు పేకలు అన్న చందంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలోనే ఈ నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట డెన్లు ఏర్పాటు చేసి జోరుగా జూదాన్ని సాగిస్తున్నారు. ఆట మోజులో పడి అనేకమంది పేకాట రాయుళ్లు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పుల పాలై పలు కుంటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇదే అదునుగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తూ, నిర్వాహకుల నుంచి రోజువారీ, నెలవారీ మామూళ్లు పెట్టి భారీగా దండుకొంటున్నారు. పేకాటను అరికట్టాల్సిన పోలీసులు సైతం సందట్లో సడేమియా అన్నట్లుగా.. పేకాట శిబిరాలపై దాడి మాట దేవుడెరుగు, ఆ శిబిరాలకు వీరే రక్షణ కవచంలా వ్యవహరిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. పమిడిముక్కల, పామర్రు ప్రాంతాల్లోని పోలీసు బాస్లు, సైతం అక్కడ జరిగే ఆటను బట్టి పర్సంటేజీ పెట్టుకోవడంతో పాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రోజువారీ, నెలవారీ మామూళ్లు వసూలు చేసే బాధ్యతను తీసుకున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా స్థానిక పోలీసులే, నియోజకవర్గ ప్రజాప్రతినిధితో కుమ్మక్కై జోరుగా పేకాటను నడుపుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంత ధీమాగా ఆట నడుపుతున్నారంటే, పై స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ తంతు నడుస్తుందా అనే భావన సైతం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇక్కడ జరుగుతున్న పేకాటకు సంబంధించి నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి స్పెషల్ పార్టీలతో ఆకస్మిక దాడులు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. పేకాట జరిగే ప్రాంతాలు ఇవే.. ప్రధానంగా పామర్రు నియోజకవర్గం, మొవ్వ మండలంలోని క్రోసూరు, కాజ, పామర్రు మండ లంలో పామర్రు, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు, పెదపారుపూడి మండలంలోని మహేశ్వరపురం, పమిడిముక్కల మండలంలోని హనుమంతపురం, పమిడిముక్కల, తోట్లవల్లూరులోని లంక గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట సాగుతోంది. దీంతో పాటు పామర్రులో చిత్తుల ఆట నిర్వహిస్తున్నారు. ఈ ఆటకు సైతం రోజువారీ మామూలు రూ.10 వేలుగా పోలీసులు నిర్ణయించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. పర్మినెంట్ పేకాట క్లబ్కు యత్నం.. పెదపారుపూడి మండలం దోసపాడులో పర్మినెంట్ పేకాట క్లబ్ ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ వెంటనే స్పందించి పామర్రులో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని, ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. దీంతో అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. తాత్కాలికంగా క్లబ్ ప్రతిపాదన ఆగిపోయింది. పామర్రు తరువాత పెనమలూరు నియోజకవర్గంలోనే పేకాట జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అంతా సాగుతోందని తెలుస్తోంది. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటంతో వారు నోరు మెదపడం లేదు. ప్రధానంగా పోరంకి, పద్మావతి కాలనీ, వణుకూరు, పెనమలూరు, కంకిపాడులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో, ఉయ్యూరులోని పలు ప్రాంతాల్లో పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోరంకి–నిడమానూరు రోడ్డులో గన్నవరం నియోజకవర్గం వారు వచ్చి ఆడుకొనేలా అధికార పార్టీనేతలే ఏర్పాట్లు చేశారు. గతంలో పోరంకి సమీపంలో పోలీసుల దాడుల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరుడు పట్టుపడిన విషయం విదితమే. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, పోలీసులకు ముడుపులు అందుతుండటంతో, ఈ పేకాట డెన్ల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
Viveka Case: ‘సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు’
న్యూఢిల్లీ: వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్సింగ్ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారుఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్ డైవర్షన్ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.వాటికి సునీత సమాధానం చెప్పలేదు..సీబీఐ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో సునీతను లెటర్ గురించి అడిగారు. లెటర్ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉందిదస్తగిరి బెయిల్ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారుసునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు. దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్మెంట్లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్. ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్ ప్రసాద్, రాజశేఖ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్మెంట్లో రాజశేఖర్ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్ ఫర్ ది గెయిన్ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి లేఖ రాశాను’ అని అవినాష్ స్పష్టం చేశారు. -
మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతిలోనే మహిళలను గౌరవించే విధానం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను సత్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ప్రధాని మోదీ చేతల మనిషి అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనిదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మనమందరం సంతోషంగా, సుఖంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులే కారణమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందరికంటే మహానుభావులన్న ప్రధాని మోదీ వారి కాళ్లు కడిగారని గుర్తు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నా పెద్ద కుమారుని పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్ పుట్టినరోజు వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పార్టీ నేతలు కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా దేవినేని అవినాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 (పురుషుల) జట్టు ఎంపికలు ఈ నెల 19వ తేదీ నిర్వహిస్తున్నామని సంఘం కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో సెలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. 1.9.2007 తర్వాత జన్మించిన వారు పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, తెల్లటి దుస్తులు(వైట్ డ్రస్), స్పోర్ట్స్ షూ, సొంత క్రికెట్ కిట్, రెడ్ కలర్ బాల్తో ఈ ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పెనమలూరు: పోరంకి వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు సుగాలీ కాలనీకి చెందిన ఎన్.రాంబాబు (45) బోరింగ్ పనులు చేస్తాడు. అతను శనివారం అర్ధరాత్రి రసనా బార్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఘటనలో రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. మృతుడి కుమారుడు సాయినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ గణిత సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి.పార్థసార ట వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు అంశంపై జరగనున్న అంతర్జాతీయ గణిత సదస్సుకు అతిథులుగా వర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాథరావు, జేఎన్టీయూ హైదరాబాద్ అకడమిక్స్ డైరెక్టర్, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు డాక్టర్ వి.కామాక్షి ప్రసాద్ హాజరు కానున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గణిత సదస్సులో దేశ విదేశాల నుంచి రీసోర్స్ పర్సన్స్, ఔత్సాహికులు పాల్గొని తాము రూపొందించిన పరిశోధనా పత్రాలను ప్రదర్శించనున్నారన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. -
అలరించిన కూచిపూడి నృత్యాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో యువ కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలోనిని కళావేదికపై నాట్య గురువు మద్దాలి సత్యవాణి శిష్య బృందం కణ్వల, విజయ, నందిత, ప్రసన్న, అనిత, హేమ, వీణ, సరయు, మన్విత, చార్వి, జుహిత, నిష్కళలు పలు అంశాలకు చక్కని అభినయం, ఆహార్యంతో నర్తించి పలువురిరి ప్రశంసలు అందుకున్నారు. వారు ప్రదర్శించిన నృత్యాంశాల్లో నర్తన గణపతిం, బాల కనకమయ, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన, కులుకక నడవరో, కాలభైరవాష్టకం, శివ పంచాక్షరి, శివాష్టకం, ఒక పరికొక పరి, శివస్తుతి, భావములోన, పలుకే బంగారమాయెనా, లింగాష్టకం చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా నాట్య గురువు సత్యవాణి మాట్లాడుతూ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
ప్రభుత్వ విద్య నిర్వీర్యం!
జి.కొండూరు: గత వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన ప్రభుత్వ విద్యారంగం.. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. ‘నాడు–నేడు’తో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తే, చంద్రబాబు సర్కార్ గవర్నమెంట్ స్కూళ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్రయివేటు రంగానికి ఊతమిస్తోంది. సరిపోనూ లేని ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించి, విద్యా నాణ్యతపై భరోసా కలిగించేలా ప్రచారం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకుండా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. జి.కొండూరు మండల పరిధిలో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి బాలురు 1,352, బాలికలు 1,308 మంది కలిపి 2,660 మాత్రమే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ సంఖ్య 3,500కి పైగా ఉండేది. వీటిలో 23 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కోడూరు, వెల్లటూరు, వెలగలేరు, కవులూరు, కట్టుబడిపాలెం, గంగినేని, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు, చెవుటూరు, కుంటముక్కల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీలుగా మార్చారు. ఒక్కొక్క పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించారు. మిగిలిన 11ప్రాథమిక పాఠశాలలను బేసిక్ ప్రైమరీలుగా మార్చి ఇక్కడ కూడా ఐదు తరగతులు ఉన్నా పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించారు. చంద్రబాబు సర్కార్ వెల్లటూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయిందనే నెపంతో ఇటీవల స్కూల్ను మూసివేసింది. దీనిలో గత విద్యాసంవత్సరంలో పది మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు జి.కొండూరు శివారు గొల్లగూడెం, పినపాక శివారు విద్యానగరం ప్రాథమిక పాఠశాలలను సైతం వచ్చే విద్యా సంవత్సరానికి మూసేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని తెలిసి ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తరగతులను మెర్జ్ చేయడంతో సమస్య జి.కొండూరు పంచాయతీలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఎక్కడా లేని విధంగా జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో మెర్జ్ చేసి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడుని కేటాయించి దీన్ని ఫౌండేషన్ పాఠశాలగా మార్చారు. దీనితో ఈ స్కూల్లోవిద్యార్థుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది. వచ్చే ఏడాది ముగ్గురు కూడా ఉండే అవకాశం లేకపోవడంతో ఈ పాఠశాలను మూసేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద ఈ పాఠశాలను ఆధునికీకరించారు. ఈ పాఠశాలను మూసి వేసి జెడ్పీ హైస్కూల్లో తరగతులను కలపడంతో తమ పిల్లలు రోజూ కిలోమీటరుపైగా నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తమ గ్రామంలోనే ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగి, పిల్లలు నడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. జి.కొండూరుకు, గొల్లగూడెంకు మద్యలో పులివాగు కూడా ఉండటంతో వానాకాలంలో పిల్లలు వంతెన దాటి వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. గొల్లగూడెం ఫౌండేషన్ పాఠశాలను తొలగిస్తామనే అపోహ వద్దు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను ఒకటవ తరగతిలో ఫౌండేషన్ స్కూల్లో చేర్చేలా అవగాహన కల్పిస్తున్నాం. పినపాక పాఠశాల బేసిక్ ప్రైమరీగా కొనసాగుతుండటంతో మూసివేయడం జరగదు. –వీరాస్వామి, మండల విద్యాశాఖ అధికారి, జి.కొండూరు -
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెనమలూరు: వినియోగదారులకు హక్కులపై అవగాహన కల్పించాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కానూరులో ఆదివారం సిద్ధార్థ లా కాలేజీ, ఏపీ కన్స్యూమర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన, సాధికారతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా హక్కులపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారని తెలిపారు. నేడు సమాజంలో నిబద్ధత, పారదర్శకత లోపిస్తోందని, అవినీతి, కల్తీ పెరిగిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్, విద్యా, వైద్యరంగంపై వినియోగదారులకు అవగాహన లేక పోవడంతో మోసాలకు గురవుతున్నారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి మాట్లాడుతూ విద్య, వైద్యం వ్యాపారంగా మారాయన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు ఎం.రాజయ్య, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు, ప్రో ఉపకులపతి డాక్టర్ రత్నప్రసాద్, బార్ అధ్యక్షుడు మన్నే హరిబాబు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భర్త హత్యలో భార్య ప్రమేయం
సహకరించిన మరో ఇద్దరి అరెస్టు గూడూరు: రామరాజుపాలెంలో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరసా నాగరాజు కేసులో అతని భార్య పరసా జ్యోతి ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమెకు సహకరించిన కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులు, పుల్లేటి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మృతుడు పరసా నాగరాజు భార్య జ్యోతి, కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులుతో కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ఇది నచ్చని నాగరాజుకు భార్యను పద్ధతి మార్చుకోవాలని వారిస్తున్నాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలిసిన నాగరాజు సోదరులు పద్ధతి మార్చుకోవాలని జ్యోతిని మందలించారు. దీంతో నాగరాజును ఎలాగైనా చంపేయాలని తటవర్తి ఆంజనేయులుతో కలసి పథకం రచించింది. 10 తేదీ రాత్రి వేళ మద్యం సేవించి వచ్చిన పరసా నాగరాజు ఇంట్లో మంచంపై మత్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతి.. ఆంజనేయులకు సమాచారం ఇచ్చింది. అతను తనకు తోడుగా పుల్లేటి నాగరాజు అనే యువకుడిని కూడా తీసుకువచ్చాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న నాగరాజు కాళ్లను పుల్లేటి నాగరాజు గట్టిగా పట్టుకోగా ఆంజనేయులు, జ్యోతి కలిసి మెడకు తుండు చుట్టి ఊపిరాడనీయకుండా చేసి హతమార్చారు. నాగరాజు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న ఆంజనేయులు, తనతో వచ్చిన పుల్లేటి నాగరాజును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జ్యోతి తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ... నిద్రపోతున్న తన కుమారుడిని లేపి తండ్రి చనిపోయిన విషయం చెప్పి బంధువులకు సమాచారం ఇచ్చింది. అయితే పరసా నాగరాజు మృతిపై తమకు అనుమానం ఉందని అతని సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హంతకులను సాక్ష్యాధారాలతో పట్టుకుని, కోర్టుకు హాజరుపర్చారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై సీహెచ్ దివ్య ప్రకాష్, ఏఎస్సై స్వాములు, సిబ్బందిని సీఐ అభినందించారు. పెదపాలెం(నాగాయలంక): గ్రామంలోని పేద దళితుడి ఇల్లును ఆదివారం కూల్చేశారు. 40 ఏళ్ల క్రితం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెదపాలెం కాలువ గట్టుపై సిమెంట్ రేకులతో ఇల్లు నిర్మించుకుని జీవిస్తుంటే దౌర్జన్యంగా పొక్లెయినర్తో కూల్చేసి వీధిపాలు చేశారని నాంచారయ్య కుటుంబం గగ్గోలు పెట్టింది. ఆదివారం ఉదయాన్నే తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్, ఎస్.ఐ కలిదిండి రాజేష్ సమక్షంలో పంచాయతీ అధికారులు గృహాన్ని పడగొట్టారు. గ్రామం పరిధిలోని సౌత్చానల్ డైరెక్ట్ పంట కాలువ గట్టుపై ఆక్రమణలో ఉన్న ఈ గృహాన్ని తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పంచాయతీని కోరిన మీదట ఈ చర్య చేపట్టినట్లు కార్యదర్శి సునీల్కుమార్ చెప్పారు. పెద నాంచారయ్య ఇంటిని కూల్చి వేసిన ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు దళితులపై ఉన్న అసలు వైఖరిని బహిర్గతం చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ విమర్శించారు. కోర్టు స్టే ఆర్డర్ కేసు పెండింగ్లో ఉన్నా కూల్చేయడం దారుణమని రమేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు నిలయమైన పెద్దల విగ్రహాలు అధికార యంత్రాంగానికి కనిపించవని మారుమూల ప్రాంతంలో జీవనం సాగిస్తున్న పేద దళితుడు మాత్రం ఆక్రమణ దారుడిగా కనిపిస్తాడని ఆయన విమర్శించారు. -
నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం
వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా కంకిపాడు: నూరుశాతం అక్షరాస్యత సాధనే ప్రభుత్వ లక్ష్యమని వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రంజిత్బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా 20 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ అంశాలపై అవగాహన కలిగి ఉండేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఉల్లాస్ కార్యక్రమం కింద వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 100 గంటల పాటు అవసరమైన శిక్షణ అందించామన్నారు. 2029 నాటికి దశల వారీగా అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.బసవయ్య, పరీక్ష కేంద్రం పర్యవేక్షకురాలు యార్లగడ్డ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని రంజిత్బాషా సందర్శించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 73,327 మంది అభ్యాసకులకు 980 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసంచాలకులు ఎండీ.హాజీబేగ్, ఎంపీడీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నూతన తెలుగు సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని ఏపీ ముదిరాజ్ మహాసభ రూపొందించిన ముదిరాజ్ –2026 డైరీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. ఏపీ ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్న వెంకట నారాయణ ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో నూతన డైరీని విడుదల చేశారు. కార్యక్రమంలో పీవీఎల్ఎన్ రాజు ముదిరాజు, మద్దం కోటేశ్వరరావు ముదిరాజు, వెంకటేశ్వరరావు ముదిరాజు, మహిళా నాయకురాలు బోడి మాధవి ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): శ్రీరాముని భక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు చేపట్టిన గంగోత్రి–రామేశ్వరం యాత్ర ఆదివారం కొండపల్లి గ్రామానికి చేరుకుంది. 2023 జూన్ 2 వ తేదీన ఆయన గంగోత్రిలో భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తూ గంగోత్రి–రామేశ్వరం యాత్ర చేపట్టారు. యాత్ర కొండపల్లి చేరిన సందర్భంగా స్థానిక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, షాబూఖారీ దర్గా పీఠాధిపతి మహ్మద్ అల్తాఫ్ రజాతో పాటు పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. యాత్రికుడు ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ గంగోత్రి నుంచి రామేశ్వరానికి భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, లోక కల్యాణమన్నారు. అవనిగడ్డ: స్థానిక లంకమ్మ అమ్మవారిని జిల్లా జడ్జి బాబు నాయక్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు బాబు నాయక్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. పలువురు న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిఽధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో వైపున అంతరాలయ రద్దీ తగ్గడంతో రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు రూ. 100 క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రద్దీ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధలతో జరిగింది. సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
యనమలకుదురు ఆలయ ఈవో సస్పెండ్
పెనమలూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై వచ్చిన వరుస కథనాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురు ఆలయంలో హుండీలో సొమ్ము స్వాహా చేసిన ఘటనపై ఎండోమెంట్ జాయింట్కమిషనర్ జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఘటనపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక అందించారన్నారు. ఆలయంలో హుండీల లెక్కింపులో సరైన చర్యలు తీసుకోలేదని, సీసీ కెమెరాలు ఆపి బయట వ్యక్తులు ప్రవేశించి, హుండీలలో సొమ్ము కాజేశారని, అంతరాలయంలో హుండీ నకిలీ తాళంతో తెరిచి సొమ్ము స్వాహా చేశారని, స్వామివారి ఆభరణాలు, సొమ్ము భద్రపర్చడంలో విఫలమయ్యారని, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారన్న అభియోగాలు మోపుతూ ఈవో ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ వీడరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కానూరు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యంకు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచూకీ ఎక్కడ? ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన యనమలకుదురు ఆలయం ఈవో భవానీ ఇప్పటికై నా బయటకు వస్తారనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమె హెడ్క్వార్టర్స్ అనుమతి లేకుండా వీడరాదని పేర్కొన్నారు. వాస్తవానికి ఈవో భవానీ గత వారం రోజులుగా అదృశ్యమయ్యారు. పైగా ఆలయంలో ఎండోమెంట్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేసిన సమయంలో ఆమె హాజరుకాలేదు. పోలీసులు కూడా భవానీ కోసం గాలిస్తున్నారు. -
రెడ్ క్రాస్ సేవలు భేష్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పీ4 కార్యక్రమానికి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) జిల్లా శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో ఆదివారం పీ4 లో భాగంగా మార్గదర్శుల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. అనంతరం భవనంలో కొత్తగా లిఫ్ట్ను ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమం బాగా జరుగుతోందన్నారు. పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి తదితరుల పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా
● జనావాసాల్లోనే బార్, వైన్షాపులు ● ప్రజలు తిరగబడినా ఫలితం శూన్యం ● నెలలు గడుస్తున్నా ప్రొవిజినల్ లైసెన్సుతోనే బార్ నిర్వహణ ● విచ్చలవిడిగా బెల్టుషాపులు ● నిబంధనల అమలును గాలికొదిలేసిన ఎకై ్సజ్ అధికారులు గతంలో ఇలా.. నిబంధనలకు నీళ్లు.. విచ్చలవిడి ‘గొలుసు’.. నిబంధనలంటే అలుసు.. -
దుర్గమ్మ సేవలో జస్టిస్ బాలాజీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడపల్లి బాలాజీ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోమరిగిరిపట్నంకు చెందిన కొప్పాడి రమేష్ కుటుంబం రూ. 2.50లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచొద్దని నిరుద్యోగ వ్యవసాయ యువ శాస్త్రవేత్తల బృందం డిమాండ్ చేసింది. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని వివిధ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో దశాబ్ద కాలంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. దీంతో వ్యవసాయ, అనుబంధ అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారి నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 65 ఏళ్ల ఉద్యోగ విరమణ అంశమే లేదని, మరి మన రాష్ట్రంలో పెంచడం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో యువ శాస్త్రవేత్తలు రాజేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిరక్షరాస్యు లైన మహిళల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ పరీక్షకు 97,047మంది అభ్యర్థులు అక్షర ఆంధ్ర యాప్లో రిజిస్టర్ అయ్యారన్నారని, వారిలో 95,598 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆదివారం వాంబే కాలనీలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదవడం, రాయడం, ప్రాథమిక గణితం మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీలపై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. ప్రసాదరావు, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మడతెట్టేస్తున్నారు!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026తీరంలో తమ్ముళ్ల భూదందా● 100 ఎకరాల మడ భూములపై కూటమి నేతల కన్ను ● ఇష్టానుసారంగా నరికేస్తున్న వైనం ● ఇప్పటికే సుమారు 20 ఎకరాలు నరికివేత ● ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు కృత్తివెన్ను: అది ప్రభుత్వ అసైన్డ్ భూమి.. మడ అడవులతో నిండి ఉంది.. తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి ప్రజలను రక్షించే రక్షణ కవచం.. కానీ కూటమి నేతల కన్ను ఆ భూములపై పడింది.. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వందల మందితో ఇష్టానుసారంగా మడ అడవులను నిర్ధాక్షిణ్యంగా నరికేయడం ప్రారంభించారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ గోగిలేరు పరీవాహక ప్రాంతంలోని ఆర్ఎస్ నంబర్ 105లో సుమారు 120పై చిలుకు ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నరికేసి చెరువులుగా మార్చేందుకుగాను ఇప్పటికే సుమారు 20 ఎకరాల వరకూ చెట్లను నరికేశారు. నిడమర్రు దళితవాడ, గోగిలేరు పాయకు మధ్యలో దాదాపు 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూముల్లో విస్తారంగా మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. సముద్రానికి అత్యంత చేరువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి రక్షించడంలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. మడ చెట్లను నరికేసి మొత్తం ఈ భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు సుమారు 100 మందికి పైగా కూలీలను మడచెట్లు నరికే పనికి పురమాయించారు. ఇప్పటి వరకు సుమారు 20 ఎకరాలకు పైగా భూముల్లో మడ చెట్లను నరికేశారు. దీనిపై స్థానికులు కొందరు తమ ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కూటమి నాయకులు ఈ విధంగా దోచుకునేందుకు పాల్పడుతుండటంపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై కనీసం స్పందించని అధికారుల తీరును వారు తప్పు పడుతున్నారు. మడ అడవుల నరికేతవేతపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. సర్వే నంబర్ 105లో ఉన్నవన్నీ ప్రభుత్వ భూములేనని, వాటిలో మడచెట్లను నరకడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని చెప్పారు. 7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.గుడ్లవల్లేరు:వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి చిత్రపటం అందించారు. తీరప్రాంత పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి తీరం వెంబడి మడ మొక్కలను నాటి సంరక్షిస్తుంటే.. కృత్తివెన్ను మండలంలో మాత్రం ప్రభుత్వ భూముల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ అడవులను ధ్వంసం చేసి కబ్జా చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
విజయవాడ: ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ) నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం గం. 9.30 ని.లు నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం ఉంటుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. 6,22,074 మంది రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాస్తుండగా,, 18,842 మంది ప్రైవేటు విధానంలో పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షలు రాసేవారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరిని లోనికి అనుమతించబోమని పరీక్షల విభాగం పేర్కొంది. పరీక్షల నిర్వహణ కి 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీసు అరికట్టేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లను పరీక్షా హాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. -
‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’
తిరుపతి: డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్రెడ్డి. టీడీపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయిటిటిడి చైర్మన్గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం హేయమైన చర్యవిజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి ఈ తరహా పనులు చేయడమేంటి?, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది. టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. -
‘రోల్ మోడల్’ కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: నాలుగో తరగతి చదువుతున్న తన కుమారుడికి వైద్యం చేయించేందుకు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి అందరికీ ‘రోల్ మోడల్’గా నిలిచారు. కలెక్టర్ బాలాజీ శనివారం సాధారణ పౌరుడిలా తన బిడ్డకు వైద్యం చేయించడానికి మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం ఉంచుతూ స్వయంగా ఆస్పత్రిని ఆశ్రయించడంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు.మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 45 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ సివిక్స్ పేపర్–1 పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 1,923 మంది విద్యార్థులు నమోదు కాగా, 1,726 మంది హాజరయ్యారన్నారు. 197 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ మేరకు మొత్తం హాజరు 90 శాతంగా నమోదైందన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, సెట్–3 పేరును వినియోగించినట్లు డీఐఈఓ తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అధికారులకు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్గిరికి ృచెందిన ఎస్. సంధ్యారాణి కుటుంబం అమ్మవారి గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు చందు శ్రీనివాస్, డీవీవీ సత్యనారాయణలు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. రేపు ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు వేదిక మార్పు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో కాకుండా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇఫ్తార్ విందులో పాల్గొనే మత పెద్దలు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు వేదిక మార్పును అంశాన్ని గమనించాలన్నారు. ఇఫ్తార్ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, వసతులు, ట్రాఫిక్ వంటి విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో యాకూబ్ బాషా, విజయవాడ ఆర్డీవో టి.వి.సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, ప్రొటోకాల్ డైరెక్టర్ టి.మోహన్రావు, వక్ఫ్ బోర్డు అధికారులు ఆదం షఫీ, మస్తాన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇరాన్ యుద్ధ నేపథ్యంలో నిత్యావసర వస్తువైన గ్యాస్ కొరత భయం వినియోగదారులను వెంటాడుతోంది. దీంతో ప్రజలు సిలిండర్ల కోసం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో నెలకు 1.50 లక్షల సిలిండర్ల సరఫరా ఎన్టీఆర్ జిల్లాలో సరాసరి నెలకు 1.50 లక్షల సిలిం డర్లను సరఫరా చేస్తారని అధికార నివేదికలు వివరిస్తున్నాయి. జిల్లాలో సుమారుగా 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏజెన్సీ 200 నుంచి గరిష్టంగా వారివారి సామర్థ్యం, సీనియార్టీ మేరకు రోజుకు 500 వరకూ గృహావసరాలకు సిలిండర్లు సరఫరా చేస్తారు. యుద్ధ నేపథ్యంలో బుకింగ్లు రెట్టింపు కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయని ఏజెన్సీల నిర్వాహకులు వివరిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ జరగకపోవడం, సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. బ్లాక్ మార్కెట్కు.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్స్ తమ వినియోగానికి గృహావసర సిలిండర్లను భారీగా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాయి. రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు హోటల్స్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా హోటల్స్ సంఘ ప్రతినిధులు ఇటీవల ఆర్థిక మంత్రి కేశవ్ను కలిసి వారి ఇబ్బందులను వివరించారు. జిల్లాలో చాలా హోటల్స్ కట్టెల పొయ్యిల వంటి ప్రత్యామ్నాయాల వైపు మరలుతున్నాయి. రేట్లు పెంచిన రెస్టారెంట్లు సిలిండర్లను బ్లాక్లో కొనుగోలు చేయడంతో రెస్టా రెంట్ల నిర్వాహకులు పదార్థాల ధరలను రూ.5 నుంచి రూ.50 వరకు పెంచారు. దాంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 -
బసవయ్యకుంట పరిశీలించిన అడ్వకేట్ కమిషనర్
గన్నవరం రూరల్: ముస్తాబాదలో నిర్మాణంలో ఉన్న రైల్ వోవర్ రైల్ ప్రాజెక్టును శనివారం హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ శ్రీహరి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో 5.89 ఎకరాల్లో బసవయ్యకుంట చెరువు ఉంది. ఆర్వోఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో 2 ఎకరాలు పోయింది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు బసవయ్య కుంటలో చేరుతూ రైతులకు ఇంతకాలం ఆలంబనగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 2 ఎకరాలు పోవటంతో వరదనీరు పంటలపై పడి నష్ట పరుస్తుందని స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం బసవయ్యకుంటను ఆనుకుని 2ఎకరాల భూమిని కొనుగోలు చేసి రైతులకు అప్పగించింది. హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన కోసం హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను నియమించగా ఆయన ఇక్కడకు వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి బసవయ్య కుంటకు దగ్గరగానే ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. పలువురు రైతులు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు శివయ్య, మండల సర్వేయర్ మాధవరావు, ఆర్ఐ రవి, వీఆర్వో నళినీకుమార్, రైతులు శ్రీకాంత్, కోటయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 411 హైస్కూళ్లకు చెందిన 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదై ఉన్నారన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 21,296 మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది ఉన్నారని, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు డివిజన్లలో... జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డివిజన్లో 7,692 మంది రెగ్యులర్ విద్యార్థులు, 264 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 7,956 మంది పరీక్షలకు హాజరవుతారు. ఈ డివిజన్లో 13 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్లో 118 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్, 341 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 6,803 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ డివిజన్లో 9 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు డివిజన్లో 120 పరీక్ష కేంద్రాల్లో 7,142 మంది రెగ్యులర్, 331 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 7,473 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక్కడ 7 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లాలో మచిలీపట్నం డివిజన్లో 173 పాఠశాలలు, గుడివాడ డివిజన్లో 118, ఉయ్యూరు డివిజన్లో 120 పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాల పంపిణీ కోసం 10 రూట్లను గుర్తించి 20 మంది రూట్ అధికారులను నియమించారు. ఎనిమిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 205 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 205 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్ కస్టోడియన్లను నియమించారు. మొత్తం 1,562 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పరీక్ష సమయం ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు కనీసం 50 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను కూడా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తానని డీఈవో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం, సందేహాలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కాలంలో కంట్రోల్ రూమ్లో కె. గణేష్ (9491505378), వై.ప్రసాదరావు (9441665999), కె.నాగరాజు (7702427788), బి.నాగమల్లేశ్వరరావు (9849501067) 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తారు. -
సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు ఉచిత శిక్షణ
కేతనకొండ(ఇబ్రహీంపట్నం): సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంఽధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. మండలంలోని కేతనకొండ గ్రామంలో ఉన్న సీబీఆర్ అకాడమీలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మయ్య ఏఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహిస్తున్న వెంకటపతి విద్యా దీవెన పథకం కింద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 23 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సమావేశంలో సీబీఆర్ అకాడమి చైర్మన్ చలసాని బలరామప్రసాద్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరిగిన హత్యాచారాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు చూపకపోవడం వలన న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయన్నారు. దోషులకు కఠిన శిక్షలు విధించకపోవడంతో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడుల విషయంలో కొన్ని చోట్ల కేసులు నమోదు కావడం లేదన్నారు. ఈ కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళా న్యాయమూర్తులను నియమించాలన్నారు. వివక్ష లేకుండా చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయాలన్నారు. మహిళలు, బాలికలు, గర్భిణులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న పోషకాహారంలో నాణ్యత లేని కారణంగా దానిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారన్నారు. పోషకాహారం స్థానంలో గర్భిణిగా నమోదైన వారికి డీబీటీ ద్వారా నెలకు రూ.6వేల నుంచి రూ. 10వేల వరకు బ్యాంకు ఖాతాకు జమచేయాలని కోరారు. ఒకే రేషన్ కార్డులో వృద్ధులు, వితంతువులు ఉంటే వారిలో ఒకరికి మాత్రమే పెన్షన్ అందుతోందని, ఈ విధానం సరికాదని.. కార్డులో భర్తను కోల్పోయిన భార్య వితంతు పెన్షన్ పొందుతుంటే అదే కార్డులో వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వారికి పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కె.రాధ, సుజాత, కవిత, రాణి, ప్రశాంతి, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, డప్పు కళాకారుల సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది విద్య ఒక్కటేనని, దానిని అందించే గురువులు కూడా అంతే శక్తివంతమైనవారని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. శనివారం పోరంకి భాష్యం బ్లూమ్స్లో బ్లూమ్స్ బ్లూమ్రాంగ్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డ ఏ విధంగా గురువుల చేతిలో తీర్చిదిద్దబడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ పిల్లలు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీయాలని సూచించారు. మరో అతిథి డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ తరన్నుమ్ మాట్లాడుతూ పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం జెడ్ఈఓ జోషి, పోరంకి భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, గుంటూరు భాష్యం బ్లూమ్స్ జెడ్ఈఓ అండ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ అక్రమ వినియోగంపై కేసులు నమోదు
41 సిలిండర్లు స్వాధీనం పెనమలూరు: గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ అక్రమ వినియోగంపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మండల పరిధిలోని పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెనమలూరు, మొవ్వ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన డెప్యూటీ తహసీల్దార్ల బృందం శనివారం దాడులు చేశారు. గృహావసరాలకు ఉపయోగించాల్సిన వంట గ్యాస్ను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపులు, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు. రేపటి నుంచి రైతన్న మీకోసం వారోత్సవాలు కంకిపాడు /గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా రైతులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలో తిరిగి ఇదే నెలలో 23 నుంచి 25వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ ఉద్యాన సహాయకులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపించిన లేఖలోని సందేశాన్ని అందించాలని తెలిపారు. -
భౌతికశాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్డీ.రత్నరాజు చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల క్వాంటమ్ సమిట్ నగరంలోని హోటల్లో శనివారం జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ భౌతిక శాస్త్రం రిటైర్డ్ ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు ఈ సమిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ రంగంలోనే కాకుండా వ్యవసాయం, వైద్యం, జలవనరుల వినియోగం తదితర రంగాల్లో అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ తో భౌతిక శాస్త్ర విభాగం నిర్వహణ జరుగుతోందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన రీతిలో క్వాంటమ్ వ్యాలీలో ఫలప్రదమైన ఫలితాలు వస్తాయన్నారు. సమిట్లో ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె.సమత, వి.భాస్కరరావు, వి.వీరయ్య, కె.హనుమంతరావు, డీఎల్.శాస్త్రి, ఎం.పూర్ణచంద్రరావు, కె.చంద్రమౌళి పాల్గొన్నారు -
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం పది గంటల తర్వాత మరింత పెరిగింది. సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి మహానివేదనకు మధ్యాహ్నం గంట సేపు దర్శనాలు నిలిపేశారు. ఆ తర్వాత అన్ని లైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. అనంతరం దర్బారు సేవ, పల్లకీ సేవలను నిర్వహించగా, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది. -
వంట గ్యాస్ కొరత లేదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో వంట గ్యాస్కు కొరత లేదని.. బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. వినియోగదారులు వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా సంస్థలు వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454కు కాల్ చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఆకస్మిక తనిఖీ.. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) బాట్లింగ్ ప్లాంట్ను శుక్రవారం కలెక్టర్ జి. లక్ష్మీశ ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంటు అధికారులతో సమావేశం నిర్వహించి ప్లాంటు కార్యకలాపాలు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో వంట గ్యాస్ కొరత ఉన్నట్లు కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. 27,360మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించామని.. 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి మీటర్లలోపు జిరాక్సు షాపులు తెరిచి ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చన్నారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. పూర్తి పారదర్శకంగా.. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరును ఆన్సర్ స్క్రిప్ట్ లేదా ఓఎంఆర్ షీట్పై ఎక్కడా రాయకూడదన్నారు. ప్రత్యేక అవసరాలున్న (సీడబ్ల్యూఎస్ఎన్) 193 మంది విద్యార్థులకు స్కైబ్లను ఏర్పాటు చేశామనిని.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. -
● ‘బండ’ కోసం బారులు
మిడిల్ ఈస్ట్లో యుద్ధ సెగ జిల్లాను తాకింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజల ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. ఆన్లైన్ సేవలు సైతం నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయంతో ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ తక్షణం స్పందించి పరిస్థితి సరిదిద్దాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. విజయవాడ మిల్క్ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఓ గ్యాస్ కంపెని వద్ద పరిస్థితిని చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు
చిల్లకల్లు(జగ్గయ్యపేట): విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమారి హెచ్చరించారు. చిల్లకల్లు సెక్షన్ పరిధిలోని 20 గ్రామాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం పాలశీతలీకరణ కేంద్ర భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్షన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో 41 బృందాలుగా ఏర్పడి 2,522 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశామన్నారు. వీటిలో 359 సర్వీసులు అదనపు విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి వారికి రూ. 7.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీఈ రవిచంద్ర, విజిలెన్స్ డీఈలు శ్రీనివాసరావు, శివకుమార్, గురుకిషోర్, సుధాకర్, ఏఈ రమేష్బాబు, అకౌంట్స్ అదికారి రవికుమార్, డివిజన్లోని సిబ్బంది పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను శుక్రవారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరిశీలించారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా, కదిరి ఇన్చార్జి మక్బుల్లతో కలిసి దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లిం మైనార్టీలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వారి వెంట మైనారిటీ నేత మీర్హుస్సేన్ కూడా ఉన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి మొల్లమాంబ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న నాన్–టీచింగ్ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై సంయుక్త సంచాలకులను కలిసి వివరించామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, కళాశాలల పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి సంఘం సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఎం. దశరథ రామారావు, ఇందిర అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ. 2,01,116 అందించారు. చీరాల వైకుంఠపురానికి చెందిన వైబీవీ నాయుడు కుటుంబం ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
రైతన్న దగా!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026● చంద్రమామ కథ సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. విపత్తులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఫామెక్స్లో భాగంగా మాక్డ్రిల్ నిర్వహించారు.I రెండు జిల్లాల్లోనూ భారీగా తగ్గిన లబ్ధిదారులు కౌలు రైతులకు ఎగనామం భరోసా లేక అవస్థలు పడుతున్న అన్నదాతలు -
అటెన్షన్!
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధంవన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 28,142 మంది విద్యార్థులు 149 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బాలురు 14,425 మంది, బాలికలు, 13,717 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 27,359 మంది రెగ్యులర్ విద్యార్థులు. పరీక్షల కాలం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఇప్పటికే ‘టెన్’షన్ మొదలైంది. తొలిసారి పబ్లిక్ పరీక్షలు అనగానే తెలియని ఆందోళన. తెలిసిన సమాధానాలే అయినా వాటిని పేపరుపై ఎలా రాయాలో తెలియక కొందరు సతమతమవుతారు. తరగతి గదిలో ఠకీమని జవాబు చెప్పే కొందరు విద్యార్థులు పరీక్షలలో మాత్రం వెనుకబడుతూంటారు. వచ్చిన సమాధానాలను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఆ చిన్న అవరోధాన్ని అధిగమిస్తే విజయం వారి పాదాక్రాంతమవుతుంది. రెండు వేల మంది సిబ్బంది.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలకు సుమారుగా రెండు వేల నుంచి 2100 మంది ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. అందులో డిపార్ట్మెంటల్ అధికారులుగా 149 మందిని, చీఫ్ సూపరింటెండెంట్లుగా 149 మందిని, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లుగా 1700 మంది సేవలందిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగే రోజున విధులను మార్పు చేస్తారు. జిల్లాలోని సుమారుగా 26 పోలీసుస్టేషన్ల పరిధిల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో అర్బన్లోని ఎనిమిది, రూరల్లోని 18 పోలీసుస్టేషన్లు ఈ పరీక్షలకు బందోబస్తును అందిస్తున్నాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు జరుగుతుంది. 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు జిల్లాలోని 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,122 మంది విద్యార్థులు (5085 మంది బాలురు, 6037 మంది బాలికలు) ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 16237 మంది (8824 మంది బాలురు, 7413 మంది బాలికలు) ఉన్నారు. అలాగే ఒకసారి పరీక్ష తప్పి పరీక్షకు హాజరవుతున్న వారు 783 మంది(519 మంది బాలురు, 267 మంది బాలికలు) ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పరిశీలించనున్నాయి. ఈ బృందంలో తహసీల్దార్ లేదా డెప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ స్థాయి పోలీసు అధికారి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పోలీసు ఎస్కార్ట్ ఉంటారని అధికారులు తెలిపారు. జిల్లా స్టోరేజీ పాయింట్గా బిషప్ అజరయ్య హైస్కూల్.. ఎన్టీఆర్ జిల్లా పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజీ పాయింట్గా నగరంలోని బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్ను ఏర్పాటు చేశారు. విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా పరీక్ష కేంద్రాల సమీప పోలీసుస్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరుకోనున్నాయి. ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నో మొబైల్ జోన్గా పరీక్ష కేంద్రాలను ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలో 92, నందిగామ డివిజన్ పరిధిలో 38, తిరువూరు డివిజన్ పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ఇండ్రస్టియల్ ఏరియాలో... డ్రగ్ రాకెట్
కొండపల్లి (ఇబ్రహీంపట్నం): చంద్రబాబు ప్రభుత్వ నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, ఏరులైపారుతున్న మద్యం ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తుపదార్థాల భారీ రాకెట్ బయటపడ్డం ఆందోళనకు గురిచేస్తోంది. అదికూడా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లోనే కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి, కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియాకు మధ్య కృష్ణానదే అడ్డం కావడం గమనార్హం.ఇలాంటి ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డ్రగ్స్ డెన్ను గుర్తించి దాదాపు రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు దీనికి అదనంగా డ్రగ్స్ తయారీలో వినియోగించే 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ రాకెట్లో హైదరాబాద్ బొల్లారంకు చెందిన సాయి త్రిభువన్, సౌరభ్కుమార్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండ్రస్టియల్ ఏరియాలే అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతుండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అధికారులే విస్తుపోయేలా.. ‘ఆపరేషన్ వైట్ హోమర్’ పేరుతో హైదరాబాద్ డీఆర్ఐ బృందం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లో మెరుపుదాడులు నిర్వహించింది. ఎమ్మెస్ రేస్ ఆర్గానిక్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో భారీగా నిల్వచేసిన ఆ్రల్పాజోలంను గుర్తించారు. కెమికల్ కంపెనీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. ఆ్రల్పాజోలం, డ్రగ్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, లీటర్ల రసాయనాలతోపాటు ఫ్యాక్టరీలోని సెంట్రిఫ్యూజన్ మిషన్లు, డ్రైయర్లు, రియాక్టర్లను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న కంపెనీని సీజ్ చేశారు. తెలంగాణలోని కల్లు డిపోలకు డ్రగ్స్ తరలింపు ఇక్కడ తయారైన డ్రగ్స్ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు 20 ఏళ్ల అనుభవం కలిగిన కెమిస్ట్ ఈ డ్రగ్స్ తయారీ రాకెట్లో మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో డ్రగ్స్ తయారీపై నిఘా ఎక్కువగా ఉండటంతో కొండపల్లిలోని ఇండ్రస్టియల్ ఏరియాను అడ్డాగా చేసుకుని ఆ్రల్పాజోలం తయారు చేస్తున్నట్లు అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ కెమిస్ట్ నెట్వర్క్ వెనుక ఉన్న ఫైనాన్షియర్లు, కొనుగోలు దారులు ఎవరన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ వైఫల్యంపారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కంపెనీల కార్యకలాపాలపై డ్రగ్ కంట్రోల్ శాఖ, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలు తరచుగా తనిఖీలు చేయాలి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో 237 కిలోల ఆ్రల్పాజోలం తయారీ జరగడం స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది. ఇక ఈ డ్రగ్స్ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం చూస్తే దీనివెనుక అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని సూచిస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే ఈ కార్యకలాపాలను గుర్తించలేకపోవడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైగా రాష్ట్ర పోలీస్ లేదా డ్రగ్ కంట్రోల్ విభాగం కాకుండా హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారుల చర్యలతో ఈ రాకెట్ వెలుగులోకి రావడం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర స్థాయి నిఘా వ్యవస్థ సమర్థతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండ్రస్టియల్ ఏరియాలో డ్రగ్స్ తయారీ జరగడం పెట్టుబడిదారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అంశం. పరిశ్రమల పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు మాస్టర్మైండ్ ఎవరు? ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? రాష్ట్రంలో ఇంకా ఇలాంటి యూనిట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. -
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు. చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు. -
‘నా దాహం తీరనిది.. నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. భూదాహం తప్పితే ఇంకోటి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభానాధ్రీశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రభుత్వంలో చాలా వేగంగా రైతుల నుంచి భూములు లాక్కొంటున్నారని ధ్వజమెత్తారు. చట్టంతో పనిలేకుండా అనుకున్నదే తడువగా ముందుకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. ‘‘నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని’’ అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని వడ్డే శోభానాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు.‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి లాక్కున భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారు. వేల ఎకరాల భూమిని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైన చర్య. పేదల పొట్టకొట్టి వారి నోటి వద్ద కూడు తీసి బడా కంపెనీలకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేయడం తగదు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనను విరమించుకోవాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. ఏపీ ప్రభుత్వం 26 లక్షల ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం కేటాయించే ప్రణాళికను రూపొందించింది. ఇది చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధం. నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనలను మానుకోవాలి. ఏపీలో ప్రతీ ఇంటిమీద , ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానల్స్ పెట్టండి. కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయండి. లేకపోతే చంద్రబాబు భూ బకాసురుడు అనే నింద మోయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. -
ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం
మోపిదేవి: ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారం కోటి రూపాయలతో తయారుచేసిన కొయ్య రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో గురువారం భద్రపరిచారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు గాను బహూకరించిన ఈ రథాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సినీ నిర్మాత నారాయణరావుతో వేదపండితులు ఉదయం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో రథాన్ని భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు వెల్లడించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ఆలయ అఽధికారులు బర్మా ప్రసాద్ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఈ నెలలో వచ్చే రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా గతంలో ప్రకటించిన సెలవులకు మార్చి 14 తేదీ పరిహార పనిదినంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి విద్యుత్ వినియోగం పెరిగిందని, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఎస్ఈ, ఈఈ, డీఈలు, రెవెన్యూ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. ఫీడర్లు బ్రేక్ డౌన్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని అందరికీ అందేట్లు చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సర్వీస్లకు ఉచితంగా ఇచ్చే సోలార్ సర్వీస్ల ప్రోగ్రెస్ను ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్టు టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎం జైకిషోర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏపీ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద వాక్థాన్ను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు జెండా ఊపి ప్రారంభించగా, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, నెఫ్రాలజిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.అమ్మన్న, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎంవీ సాయికృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ టి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
వసంత నవరాత్రులు, ఉగాది ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, ఉగాది పర్వదిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి చేసే పూల అలంకరణ, పంచాంగ శ్రవణం, విశేష పూల అర్చనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వెండి రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. చైత్ర బ్రహ్మోత్సవాల పైన చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించే చైత్ర మాస బ్రహ్మోత్సవాలపైన చర్చ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వాహన సేవలు, వెండి రథోత్సవంతో పాటు ఉత్సవాల చివరి రోజున జరిగే హంస వాహన సేవ ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వి.శ్రీధర్శర్మ, ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వి.రెడ్డి, పి.చంద్రశేఖర్, కె.గంగాధర్, ఈఈ ఎల్.రమ పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం పెల్లుబికింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా... అభిమానుల్లో ఏమాత్రం తరగని ఉత్సాహం... అదే పార్టీకి ప్రాణవాయువు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయి లో సైతం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జరుపుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారీ కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైఎస్ జగన్ను మరోసారి సీఎంను చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో... విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుణదలలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ప్రభుదాస్, గద్దె కళ్యాణ్ రామ్, సన్నీ, తుళ్లూరు ఉదయ్, సాయి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో... నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముత్యాలంపాడులో నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో... విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 43వ డివిజన్ ఊర్మిళానగర్ వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి తో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అనంతరం పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, బండి పుణ్యశీల, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూం వద్ద గల వైఎస్సార్ పార్క్లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత విగ్రహానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గాల సమన్వయ కర్తలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పూనూరు గౌతంరెడ్డి, పోతిన మహేష్, గౌస్ మొహిద్దీన్, దొడ్డా అంజిరెడ్డి, బండి పుణ్యశీల, తంగిరాల రామిరెడ్డి, పోలి మెట్ల శరత్, సర్నాల చలపతిరావు, ఆళ్ల చెన్నారావు, అవుతు శ్రీనివాసరెడ్డి, కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కావూరి అంత్యక్రియల్లో పేర్ని నాని
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడికి చెందిన కన్నెగంటి సాంబశివరావు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
‘రాష్ట్ర ప్రజలకు మాటిస్తున్నా.. చంద్రబాబును వదలను’
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్ల అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తమ బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కల్యాణ్ అంటూ ధ్వజమెత్తారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి నేతలకు చర్యలు ఎందుకు తీసుకోలేదని శ్రావణ్కుమార్ నిలదీశారు.అలా చేయకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తాచంద్రబాబు తన పై ఉన్న చాలా కేసులను కొట్టేయించుకుంటున్నారు. నేను చంద్రబాబు కేసులపై పోరాటం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు నేను మాటిస్తున్నా. చంద్రబాబు పై ఉన్న ప్రతీ కేసునూ రీ ఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను చంద్రబాబు కేసులను రీ ఓపెన్ చేయించలేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా. చంద్రబాబు తనపై ఉన్న నాలుగు కేసుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే. న్యాయస్థానాల్లో మ్యానేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. 2029లో నైనా ప్రతీ కేసును రీ ఓపెన్ చేయిస్తానని శ్రావణ్ కుమార్ అన్నారు. -
కొత్త పింఛన్.. ఇంకెప్పుడు?
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వీఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో వచ్చిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా.. కూటమి సభ్యులు అడ్డుపడ్డారు. చివరి కౌన్సిల్లో టీడీపీ తీరు మార్చుకో కుండా అదే ధోరణిలో సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. దీన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు దీటుగా ఎదుర్కొన్నారు. అరుపులు, కేకలు.. 2019 నుంచి 2024 వరకు, 2024 మే నుంచి ఇప్పటి వరకు నగరంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ వివరాలను సభ్యులు అడిగారు. అధికారులు సమాధానం ఇస్తుండగా టీడీపీ సభ్యులు లేచి అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా లేచి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు, ఈ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల జాబితాను వివరించారు. ఈ ప్రభుత్వ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ భాగ్యలక్ష్మి కల్పించుకొని అధికారులతో సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేసినా టీడీపీ సభ్యులు సభను సాగనివ్వలేదు. దీంతో మేయర్ ప్రశ్నోత్తరాల్లో తర్వాత అంశాన్ని చర్చించాల్సిందిగా ఆదేశించారు. సభను పక్కదారి పట్టిస్తున్నారు.. వేసవి ప్రారంభమైందని, వైఎస్సార్ సీపీ పాల కపక్షం ఏర్పడి ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నగరంలో తాగునీటి కష్టాలను నిరోధించేందుకు సర్కిళ్ల వారీగా ఎన్ని రిజర్వాయర్లు మంజూరయ్యాయి.. వీటిలో ఎన్ని పూర్తయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వారీగా వివరాలు తెలపాలని సభ్యులు ప్రశ్నించగా.. అధికారులు ఇచ్చిన సమాధానాలతో సభ్యులు సంతృప్తి చెందలేదు. పాలకపక్షం కౌన్సిల్ సాక్షిగా చేసిన తీర్మానాలను కూడా అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, ఇంజినీరింగ్ విభాగం కేవలం అధికారులు పనులు చేయటంలో ఆలస్యం చేస్తున్నారని, 7 తాగునీటి రిజర్వాయర్లకు శంకుస్థాపనలు చేయగా కేవలం రెండు మాత్రమే నిర్మించటంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సర్కిల్–2లోని లోటస్ల్యాండ్మార్క్లో వీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపట్టిందని, రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులకు రూ.18 కోట్లు వెచ్చించినా అవి స్థానికులకు అందుబాటులోకి రాకుండా లోటస్ యాజమాన్యం అడ్డుకుందని, చివరికి శానిటరీ సిబ్బంది వెళ్లేదారి లేకుండా గేట్లకు తాళాలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సభ్యులు ప్రస్తావించారు. అది గేటెడ్ కమ్యూనిటీ అయితే 50శాతం భాగస్వామ్యం లోటస్ యాజమాన్యంతో చెల్లింపులు చేసిన తర్వాతే శానిటేషన్ చేయాలని, అక్కడి పార్కుల్లో వీఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్కు సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు, రీడింగ్ రూంల నిర్వహణను వీఎంసీతో పాటు స్థానికులను కూడా భాగస్వాములు చేయాలని, ఎస్సీ, ఎస్సీ, బీసీ, తదితర కమ్యూనిటీల ఆధ్వర్యంలోనే వాటి నిర్వహణ జరగాలని వచ్చిన ప్రతిపాదను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. 122 అంశాలకు ఆమోదం.. వీఎంసీ చివరి సమావేశపు అజెండాలో మొత్తం 144 అంశాలు ప్రతిపాదించగా అందులో 122 అంశాలు ఆమోదించారు. ఆఫీస్ రిమార్కులకు 14 అంశాలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాలుగు అంశాలను, వీఎంసీ చర్యలు తీసుకోవాలని మరో రెండు అంశాలు సిఫార్సు చేశారు. మరో అంశాన్ని ధ్రువీకరించగా, ఇంకో అంశాన్ని రికార్డు చేశారు. సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పుణ్యశీల (ఇన్సెట్) కౌన్సిల్ నిర్వహిస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి -
హ్యాండ్బాల్ టోర్నీ విజేత కేబీఎన్ కాలేజీ
విజయవాడరూరల్: నున్న విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నీ బుధ వారం ముగిసింది. విజయవాడకు చెందిన కేబీఎన్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు ద్వితీయస్థానాన్ని దక్కించుకుంది. మైలవరానికి చెందిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడో స్థానంలో, విజయవాడకు చెందిన పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. నాకౌట్–కమ్–లీగ్ విధా నంలో జరిగిన ఈ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ కరస్పాం డెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ పురుషుల హ్యాండ్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్ కుమార్, సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నే స్వామి, డి.హేమచంద్రరావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల కానుకలు సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించారు. 18 రోజులకు రూ.3,35, 86,637 నగదు, 302 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 1,337 యూఎస్ఏ డాలర్లు, 55 ఇంగ్లాండ్ డాలర్లు, 132 సింగపూర్ డాలర్లు, 335 యూఏఈ దిర్హమ్స్, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 60 కువైట్ దినార్లు, 220 ఖతర్ రియాల్స్, 20 హాంగ్కాంగ్ డాలర్లు, 200 మాల్దీవ్స్ రూపీ, 240 కెనడా డాలర్లు లభించనట్లు వివరించారు. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనగా, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. దుర్గమ్మకు రూ.4.50 లక్షల విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన కోటిరావు, అంజుకుమారి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈఓ శీనానాయక్ను కలిసి అంజుకుమారి, తనీషిరావు పేరిట నిత్య ఉచిత ప్రసాద వితరణకు రూ.2.25 లక్షలు, గో సంరక్షణ పథకానికి రూ.2.25 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షగన్నవరం రూరల్: మండలం సూరంపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంత మంది రైతులు వస్తారు, వారికి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి, వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి తదితర అంశాలపై చర్చించారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలిచిలకలపూడి(మచిలీపట్నం): అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమ హయాంలో ఇప్పటికి 150 మంది వరకు కారుణ్య నియామకపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 100 మందికి పైగా ఉద్యోగోన్నతులు పొందారని వివరించారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యు లను జాగ్రత్తగా చూసుకుని అందరి మన్ననలు పొందాలని సూచించారు. రికార్డు అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రెరీ అసిస్టెంట్లు ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జూనియర్ అసిస్టెంట్లుగా 19 మందికి, టైపిస్టులుగా 19 మందికి, ఆఫీస్ సబార్డినేట్లుగా ముగ్గురికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, ఏఓ ఎం. తేజస్వీ తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న భోజనం’లో లోపాలు గుర్తించాం
జి.కొండూరు: మైలవరం తారకరామానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదంటూ విద్యార్థులు మంగళవారం తమ ప్లేట్లలో భోజనాన్ని బకెట్లో పడవేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీడియాలో కథనాలు రావడంతో డీఈఓ చంద్రకళ, తహసీల్దార్ అబ్దుల్దరియా, ఏంఈఓ ఎల్.బాలు, బండి రాజుతో కలిసి పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడిన అనంతరం డీఈఓ మీడియాతో మాట్లాడారు. డీఈఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వివాదంపై ఇటీవల స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ తనిఖీలు జరిపినప్పుడు కొన్ని లోపాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఈ వివాదం కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ తన దృష్టికి రాలేదని డీఈఓ అన్నారు. బుధవారం జరిపిన విచారణలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, పాఠశాల హెచ్ఎం మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇరువైపులా లోపాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ క్రమంలో వంట ఏజెన్సీని రద్దు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు. అదేవిధంగా పాఠశాల హెచ్ఎం మీద కూడా శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. పేద మహిళ ఉపాధిపై కొడతారా? వంట ఏజెన్సీ నిర్వాహకురాలిగా ఎటువంటి ఆరోపణలు లేకుండా 21 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళను కాదని వేరే వాళ్లకి ఎలా అప్పగిస్తారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్ల సుధాకర్ డీఈఓని ప్రశ్నించారు. ప్రస్తుత హెచ్ఎం వచ్చాకనే ఈ వివాదమంతా ప్రారంభమైందన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి పేద మహిళ ఉపాధి మీద ఎలా దెబ్బకొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
అక్రమాల ప్లానింగ్పై కొరడా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీకి సైతం ఆరు నెలలుగా భారీగా ఫిర్యాదులు అందాయి. నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కీలక పత్రాలను పరిశీలించారు. కళ్లముందే అక్రమ కట్టడాలు బుధవారం కూడా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగాయి. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో భవనాలను తనిఖీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో రావడం అనుమానాలకు దారితీసింది. కళ్లముందే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అజిత్సింగ్ నగర్లోని ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్యనగర్లో ఏసీబీ అధికారులు మూడు అక్రమ కట్టడాలను గుర్తించారు. బుధవారం సాయంత్రానికి రెండు భవనాలను క్షుణంగా తనిఖీ చేశారు. మూడో కట్టడాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా భవన నిర్మాణాల్లో డీవియేషన్లు, సెట్బ్యాక్స్, తీసుకున్న అనుమ తులు, ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టారా లేదా వంటి అంశాలను తనిఖీచేశారు. అక్రమ నిర్మాణాలపై లావాదేవీలు జరిగాయనే అనుమానం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద డాక్యుమెంట్లను సేకరించారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు ఏడు భవనాలకు సంబంధించి తమ పరిశీలనలో డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రధానంగా సర్కిల్ –2 పరిధిలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని సమాచారం. సర్కిల్–1 పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్టౌన్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ ఒక భవనాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా ప్లాన్లో చూపించిన వాటికన్నా, అదనంగా అంతస్తుల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారుల అవినీతికి సంబంఽధించి వచ్చిన ఆరోపణలపైనా ఆరా తీస్తున్నారు. సర్కిల్–3 ప్రాంతంలో మూడు భవనాలను పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో తవ్విన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. ప్లాన్లో చూపించిన వాటి కంటే అనధికారికంగా అదనపు అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా జరిగింది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేశారు. ఇలాంటివి పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్, వన్టౌన్ ప్రాంతంలో జరిగాయి. ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీ స్థలానికి చెల్లించాల్సిన రుసుం తగ్గించి, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించారు. కొన్ని భవనాల యజమానుల నుంచి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయలేదు. లేబర్ సెస్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ క్షేత్ర స్థాయి తనిఖీలు, రికార్డులను పరిశీలించి, జరిగిన అవకతవలకపై ఏసీబీ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. -
దుర్గమ్మకు రూ.3 లక్షల విలువైన బంగారు హారం
విజయవాడరూరల్: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాంగణంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడ్) లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్ను నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో విజయా బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్కుమార్, కృష్ణా యూనివర్సిటీ సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నె స్వామి, డి.హేమచంద్ర రావు, వికాస్ బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ సరేష్, లెక్చరర్లు డి.రత్నబాబు, జి.విజయ్ పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): కాకినాడ లో బుధవారం నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఎస్సీ నాయకులు విడుదల చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా గల అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ కాలే పుల్లారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, కార్యదర్శి గుడిశె శ్యాంబాబు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు పోలిమెట్ల శరత్ బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామెళ్ల కోటేశ్వరరావు(జోజి), సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జల నాగ సురేంద్ర, గొర్రుముచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. వైఎస్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు రూపొందించనున్న కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంటర్ పరీక్షలకు 805 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు మంగళవారం 805 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాపితంగా 98 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగాయి. అందులో భాగంగా ఆయా కేంద్రాల్లో 33,003 మందిని కేటాయించారు. అందులో 32,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మిగిలిన 805 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. -
రెచ్చిపోతున్న
● పచ్చనేతల డైరెక్షన్లో వ్యవస్థీకృతంగా దోపిడీ ● పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు ● ఫలానా వ్యక్తికే బియ్యం ఇవ్వాలంటూ రేషన్ డీలర్లకు హుకుం ● ప్రతి నియోజక వర్గం నుంచి 500 టన్నుల బియ్యం మాఫియా చేతికి ● కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి ● రేషన్ మాఫియా డాన్ వైపు కన్నెత్తిచూడని అఽధికారులు దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు జిల్లాలో పచ్చనేతలు రేషన్ బియ్యాన్ని సైతం వదలడం లేదు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ డాన్ పార్లమెంటు ముఖ్య నేతకు సన్నిహితంగా మెలుగుతూ విశృంఖలంగా రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పార్ల మెంటు ముఖ్యనేత కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ రేషన్ బియ్యం మాఫియా వ్యవహారాన్ని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బహి రంగంగా ప్రకటనలు చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడలేదు. ఏకంగా జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల బియ్యాన్ని ఏకీకృతంగా ఒక వ్యక్తే సేకరించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఈ దందా వ్యవహారంలో సింహభాగం పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లోనే సాగుతోంది. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులను పావులుగా మార్చుకున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్ మేరకు తాము చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇచ్చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లోనే రేషన్ దుకాణాల్లో బియ్యం మాయమైపోతున్నాయి. దందాకు సహకరించని డీలర్లపై రేషన్ షాపులు తనిఖీ చేసి, షాపులు సీజ్ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని ఈ దందాకు సహకరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల చొప్పున అందుతున్నట్టు సమా చారం. ఇటీవల వీరులపాడులో 295 బస్తాల బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్టు అమలు చేశారు. ఇతనిపైన 41 కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిదే. అయితే ప్రస్తుతం రేషన్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రామచంద్రరావుపైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అతనిపైన పీడీ యాక్టు అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. అయినా ఇంకా అతనిపై పీడీ యాక్టు అమలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతను పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెపుతుండటంతోనే అతడిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, దీంతో అతని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విమర్శలు వినవస్తున్నాయి. వాటాల్లో తేడాలు వచ్చి కొంత మంది మాఫియా సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ద్వారా ఇటీవల నామమాత్రంగా రేషన్ బియ్యం పట్టుకుంటున్నారు కాని, గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా పౌరసరపరాల శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడంలేదు. ఇదంతా వారికి తెలిసే జరుగుతుందని, నామమాత్రపు దాడులతో మమ అనిపిస్తున్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. రేషన్ మాఫియాకు, పచ్చనేతలకు లింకు ఉండటం వల్లే అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా బరితెగించి పోలీసులపై సైతం దాడికి తెగబడుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటన మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. -
16 నుంచి గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,93,050 పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో 34 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కో బృందంలో ఒక పశువైద్యుడు, ఒక పారా వెటర్నరీ సిబ్బంది, ఒక పశుసంవర్ధక సహాయకుడు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి వల్ల కలిగే నష్టాలు, వ్యాధి నిరోధక టీకాల వల్ల కలిగే లాభాలను వివరించాలని సూచించారు. నాలుగు నెలల వయసు దాటిన ప్రతి ఆవు లేదా గేదె జాతి పశువులకు తప్పనిసరిగా టీకా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ -
ప్రచార ముసుగులో దోపిడీ పర్వం!
సాక్షి నెట్వర్క్: నగరంలో అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. ప్రభుత్వం పరిశీలించి ఇవ్వాల్సిన అనుమతులను అధికార పార్టీకి చెందిన నేతలు ముడుపులు పుచ్చుకుని ఏ అనుమతి అయినా ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికార కూటమి నేతలు నదురు బెదురు లేకుండా మాకేమిటిలే అన్నట్టుగా ముడుపుల కోసం తెగబడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఒక సంస్థ ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలను అందిస్తోంది. వాటిపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మద్దతుతో అనధికార వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మా ఆర్ట్స్ పేరుతో స్క్రీన్లు నగరానికి చెందిన మా ఆర్ట్స్ అనే సంస్థ నగరంలో వాణిజ్య ప్రకటనల కోసం పలు స్క్రీన్లను ఏర్పాటు చేసింది. వివిధ వాణిజ్య సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ఆ సంస్థలకు చెందిన వీడియోలను అందులో ప్రచారం చేస్తోంది. ఈ తరహా స్క్రీన్లు నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద రెండు బందరు రోడ్డులోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేయటానికి నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలాగే వీటికి సంబంధించి నగర పాలకసంస్థకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపార సంస్థల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు భారీ ముడుపులు? నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులను చెల్లించి అనధికారికంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువలనే అంత బహిరంగంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు వాటిపై అధికార పార్టీకి చెందిన నేతలెవరూ నోరు మెదపకపోవటం సైతం అదే కారణమని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అనుమతులు లేకుండా స్క్రీన్లు ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలు నగరంలో పలు చోట్ల అనధికార స్క్రీన్లు వీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేవంటున్న అధికారులు ఎటువంటి పన్నులు చెల్లించకుండా వాణిజ్య ప్రచారాలపై పలువురు ఆగ్రహం పేదలు తోపుడు బండి పెడితేనే తీసేసే వీఎంసీ ఇప్పుడు ఎందుకు మీనమేషాలు ? అధికార పార్టీకి చెందిన నేతలకు భారీ ముడుపులు చెల్లించినట్లు ప్రచారం పేదలు రోడ్లపై పెట్టే తోపుడు బండిని సైతం తీసివేసే నగరపాలకసంస్థ అధికారులు ఇంత పెద్ద స్థాయిలో స్క్రీన్లను ఏర్పాటు చేస్తే వాటిని తీయటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఇటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేయటం లేదా ఇతర వ్యాపార ప్రకటనల నిమిత్తం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతిపాదనను కౌన్సిల్కు పంపించటం, అక్కడ ఆమోదం తెలిపిన తరువాత నిర్ణీత రుసుం నగరపాలకసంస్థకు చెల్లించిన తరువాత వాటికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా కొంతమంది అధికారులు సైతం ముడుపులు తీసుకొని వాటి వైపు చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
ఎంఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 86 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 284 జీవోను బుధవారం విడుదల చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్కుమార్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఈనెల 18వ తేదీ నుంచి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ వ్యవహరించనున్నారు. -
మేట వేసిన నిర్లక్ష్యం
కంకిపాడు సెక్షన్ వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలు గుర్రపుడెక్కతో నిండిన పునాదిపాడు చానెల్ కోమటిగుంట రెగ్యులేటర్ వద్ద తూడుతో నిండిన కాలువలు చలివేంద్ర పాలెం వద్ద పుల్లేరు కాలువలో గుర్రపుడెక్కపంట కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయాయి. ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లే ఆస్కారం లేదు. కంకిపాడు సెక్షన్, కోమటి గుంట రెగ్యులేటర్ల పరిధిలోని పలు ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నిట్లోనూ గుర్రపుడెక్క, తూడు మేట వేసుకున్నాయి. అధికారులు ఏమాత్రం దృష్టి సారించటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. –కంకిపాడు -
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణపై అవగాహన సదస్సు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): త్వరలో నిర్వహించనున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులకు సోమవారం కొండపల్లి డీఏవీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవ్వాలని, పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు జరగకుండా పేపర్ కోడ్ ఆధారంగా ఏరోజు ప్రశ్నపత్రం ఆ రోజే అందేలా చూడాలన్నారు. వివిధ డివిజన్ల డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. బంటుమిల్లి: భర్త, అత్త వేధింపులు భరించేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాకాల రాజగోపాల్ కుమార్తె లిఖిత(26)ను ఆగిరిపల్లి మండలం, కొత్తఈదర గ్రామానికి చెందిన బెక్కం కిరణ్కు ఇచ్చి 2024 నవంబరు 16వ తేదీన వివాహం చేశారు. వివాహం తర్వాత భార్యభర్తలు ఉద్యోగం నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యుకే) వెళ్ళారు. అక్కడ కిరణ్ జాబ్ సక్రమంగా లేదని భావించిన పోలీసులు భార్యభర్తలను ఇండియాకు పంపారు. అత్తారింటికి చేరిన లిఖితకు అత్త, భర్తల సూటిపోటీ మాటలతో వేధింపులు మొదలయ్యాయి. యుకేలో కిరణ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అత్తారింట్లో ఎదురైన వేధింపులను తోబుట్టువులకు ఫోన్ల్ చేసి చెప్పుకుంది. ఈ స్థితిలో కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకుని డబ్బులు తీసుకురమ్మని కిరణ్ లిఖితను బెదిరించడంతో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న లిఖిత సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయములో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న మాకాల సాయిసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేశారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం
మచిలీపట్నంఅర్బన్: కుష్ఠు వ్యాధి ఒక సంక్రమణ వ్యాధి కాగా, ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని రాష్ట్ర లెప్రసి విభాగం (ఎస్.ఎల్.డి) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ తెలిపారు. సోమ వారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జాతీయ లెప్రసీ నిర్మూలనలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్పై డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ వ్యాధని చెప్పారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సమ యానికి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లా లెప్రసి వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యా ధి నివారణ, గుర్తింపు, చికిత్సలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని చెప్పారు. జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ లెప్రసి వ్యాధి ఉన్నవారిని సమాజం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందించి చికిత్స కల్పిస్తోందన్నారు. వ్యాధిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ, మెడికల్ అధికారులు, ఫార్మసీ అధికారులు, పిహెచ్సి నోడల్ అధికారులు పాల్గొన్నారు. వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 531 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో 30,820 మంది విద్యార్ధులను కేటాయించారు. అందులో 30,289 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షలను నిర్వహించారు. ఓపెన్ ఇంటర్ పరీక్షకు.. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో భాగంగా జిల్లాలో సోమవారం నిర్వహించిన నాలుగో రోజు పరీక్షకు 241 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం 11 కేంద్రాల్లో భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, పౌరశాస్త్రం కలిపి 1414 మందికి గాను 1173 మంది హాజరయ్యారు. మిగిలిన 241 మంది గైర్హాజరయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.82.39 శాతం హజరు శాతంగా అధికారులు ప్రకటించారు. రాష్ట్ర లెప్రసీ విభాగం జేడీ డాక్టర్ దేవసాగర్ -
నిర్దేశిత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఇలక్కియ డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 131 అర్జీలు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మొత్తం 131 అర్జీలు అందాయని జేసీ తెలిపారు. వీటిలో ఎంఏయూడీకి 37, రెవెన్యూ 28, పంచాయతీరాజ్ 19, పోలీస్ 16, హౌసింగ్ 4, వ్యవసాయం 3, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్డీఏ 3, విద్య 3, ఏపీసీపీడీసీఎల్ 2, పౌర సరఫరాలు 2, మైన్స్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, గ్రామీణ నీటిసరఫరా 2 అర్జీలు రాగా వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్, దేవదాయ, ఇరిగేషన్, రవాణా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు. హెచ్పీవీ వ్యాక్సిన్ పోస్టర్ల ఆవిష్కరణ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో జేసీ ఇలక్కియ.. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులతో కలిసి హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వేస్తున్నారన్నారు. ఈ జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో ఆస్తి వివాదాల ఫిర్యాదులే అధికం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకు ఆమె స్వయంగా వెళ్లి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుని, దానిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత ఎస్హెచ్ఓలకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 57 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 3, ఇతర వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు అందాయి. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చల్లపల్లి: స్నానానికని వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన కె.వెంకటకృష్ణయ్య, దేవిప్రియల కుమార్తె కీర్తి (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళిన కీర్తి మార్గంమధ్యలో తనకు నెలసరి రావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. పంచాయతీలో స్వీపరుగా పనిచేస్తున్న తల్లి దేవిప్రియ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. స్కూలుకు ఎందుకు వెళ్ళలేదని అడగటంతో తనకు కడుపు నొప్పిగా ఉందని కీర్తి చెప్పింది. స్నానం చేసి వస్తే ఆసుపత్రికి వెళదామని తల్లి కూతురుని స్నానానికి పంపింది. కీర్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో తలుపులు తెరచి చూడగా కీర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. అది చూసి కంగుతిన్న దేవిప్రియ కేకలకు స్థానికులు వచ్చి కీర్తిని హుఠాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక కీర్తి మృతి చెందినట్లు చెప్పారు. ఎస్ఐ డి.దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి క్రమశిక్షణతో, టీచర్లతో ఎంతో వినయంతో నడచుకునేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. -
స్వామివారి కానుకలపై చోరుల కన్ను
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో కొండ పై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం నిధులు స్వాహా చేయటం గుడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలపై కన్నేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇద్దరు అర్చకులు, గుడిలో పని చేసే కార్మికుడు స్వాహా చేయటం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో శక్తివంతమైన శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో సిబ్బంది దొంగతనానికి పాల్పడటం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతో నమ్మకంతో స్వామి వారికి సమర్పించిన కానుకలను అధికారులు భద్రపర్చాల్సి ఉండగా చేతివాటం చూపటంతో భక్తులు తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. శివశివా అపచారం జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం అభివృద్ధే లక్ష్యంగా... స్వయం భూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధే లక్ష్యంగా దాత సంగా నరసింహారావు ఇప్పటి వరకు రూ.50 కోట్లు నిధులు పైగా వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. భక్తులు కూడా తమ వంతు సాయంగా ఆలయ అభివృద్ధికి దోహదపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు సమకూరక పోయినా దాతఉ ముందుకు వచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆదాయం తగ్గటంతో అనుమానం... కాగా శ్రీ రామలింగేశ్వరస్వామివారికి కార్తీక మాసం, మహాశివరాత్రితో పాటు ఇతర పండుగలకు భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఏడాదికి మూడుసార్లు హుండీలో కానుకలు లెక్కిస్తారు. రెండేళ్లుగా భక్తులు పెరుగుతున్నా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది. దీంతో అనుమానం వచ్చి నిఘా ఉంచారు. సీసీ కెమేరాలు కూడా గోప్యంగా ఏర్పాటు చేశారని సమాచారం. దీంతో స్వామివారి హుండీలలో సొమ్ము స్వాహా చేసిన దొంగలు చిక్కారని తెలిసింది. స్వాహా చేసి సొమ్ము ఈవో వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఆధారాలు పోలీసులకు దొరికాయని సమాచారం. సొమ్ము చోరీలో ముగ్గురు అరెస్ట్.. ఆలయం సొమ్ము స్వాహా చేసిన కేసులో పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, గుడిలో పని చేసే కార్మికుడు రోశయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. దేవస్థానంలో భారీ అవినీతి బయటపడినా దేవదాయ శాఖ అధికారులు జాడ లేదు. ఆలయ రికార్డులు స్వాధీనం చేసుకోలేదు. నకిలీ తాళాలతో హుండీ తెరిచారన్న ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారులు ఆలయానికి వచ్చి తాళాలు తనిఖీ చేయలేదు. తాళాలు మార్చలేదు. ఆలయ సొమ్ము చోరీపై ఉన్నతాధికారులు సైతం స్పందించినట్లు కనబడ లేదు. ఈ విషయమై ఏసీ సాంబశివరావును వివరణ కోరగా హుండీలు తనిఖీ చేస్తానని, ఆ తరువాత రికార్డులు పరిశీలిస్తామన్నారు. -
కూటమిలో కొట్లాట!
అవనిగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీ కోడూరు: అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీరును ఎండగడుతూ కోడూరు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇంతటితో ఆగకుండా బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారికి టీడీపీ నేతలు కూడా మరోసారి శంకుస్థాపన చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే.. కోడూరులోని తొమ్మిదో వార్డు ఎస్సీకాలనీలో ఎన్ ఆర్ఈజీఎస్ కింద రూ.22లక్షల నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఇది జరిగిన అరగంటకే మండల టీడీపీ నేతలు మళ్లీ అదే రహదారికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలోని గ్రామస్తులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఒంటెద్దు పోకడలకు నిరసనగానే.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పెట్టుకున్నారని ఆ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి పొత్తు ధర్మాన్ని బుద్ధప్రసాద్ విస్మరిస్తూ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోని నేతలను కూడా జనసేనలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో తమ ఇష్టమొచ్చినవారికే పనులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్చంద్రబోస్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆదేశాల మేరకే బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారి తాము కూడా శంకుస్థాపన చేసినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన కౌంటర్గా.. రహదారికి టీడీపీ నేతలు కూడా శంకుస్థాపన చేయడంతో మండల జనసేన నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వారు కౌంటర్కు దిగారు. సోమవారం సాయంత్రం మరోసారి రహదారి నిర్మాణ ప్రాంతానికి వెళ్లి బుద్ధప్రసాద్ను పొగడ్తలతో ముంచెత్తారు. రహదారి నిర్మాణాన్ని టీడీపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలో మద్యం, రేషన్, బుసక, ఇసుక దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందంటూ జనసేన పార్టీ మండలాధ్యక్షుడు మర్రే గంగయ్య విమర్శించారు. -
ఘాట్రోడ్డుపై నో పార్కింగ్ జోన్ !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డులో వాహనాల పార్కింగ్ నియంత్రణకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇతర ఇంజినీరింగ్ అధికారులు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఘాట్రోడ్డును నో పార్కింగ్ జోన్గా ప్రకటించే అవకాశాలున్నట్లు అధికారుల పర్యటనలో తేటతెల్లమైంది. దుర్గగుడిపై నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవానికి హోంమంత్రి అనిత హాజరైన రోజున ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద మంత్రి కాన్వాయ్ సుమారు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు పరిశీలన.. ఈ నేపథ్యంలో సోమవారం సీపీ రాజశేఖరబాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఓం టర్నింగ్ నుంచి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం వరకు ఉన్న వాహనాల పార్కింగ్ను పరిశీలించారు. దేవస్థాన భద్రతా, ఘాట్రోడ్డుపై వాహనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలయ అధికారులతో చర్చించారు. ఘాట్రోడ్డుపైకి ఎవరి వాహనాలు పడితే వారివి అనుమతించకుండా ప్రోటోకాల్ ఉన్న వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు. అంతకు ముందు సీపీ రాజశేఖరబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
వసంత నవరాత్రోత్సవాలకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 19వ తేదీ ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలు, 27వ తేదీ శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మ వారికి స్నపనాభిషేకం, అనంతరం అలంకరణ, అర్చన పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. 9.15 గంటలకు వసంత నవ రాత్రోత్సవాలకు కలశ స్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతుంది. వెండి రథోత్సవం.. ఉగాదిని పురస్కరించుకుని 19వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథోత్సవం జరుగుతుంది. ఆది దంపతులు వెండి రథంపై నగర పుర వీధుల్లో విహరిస్తారు. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ పుష్పాలతో విశేష అర్చన జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ అర్చన ప్రారంభమవుతుంది. అర్చనలో పాల్గొనే ఉభయదాతలు రూ. 2500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పూజలో పాల్గొనే వారికి శేషవస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్ర పీఠం, పెద్ద లడ్డూతో పాటు ఇద్దరికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. పూర్ణాహుతితో పరిసమాప్తం.. 26న ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, నాగవల్లీ దళార్చన (తమలపాకులు)తో అర్చన జరుగుతుంది. 27వ తేదీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘాట్ రోడ్డులోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 28వ తేదీ ఉదయంం 9 గంటలకు దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో వసంత నవ రాత్రోత్సవాలు పరి సమాప్తమవుతాయి. -
బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రాజకీయ పార్టీల తరఫున బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన తాళం, సీల్ను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు సజావుగా ఉన్నదీ, లేనిదీ విచారించారు. అనంతరం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలకు బూత్స్థాయి ఏజెంట్లను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నియమించుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, మార్కెటింగ్ ఏడీ ఎల్. నిత్యానందం, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, పంతం గజేంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం మచిలీపట్నంటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఉన్న రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు. బస్ పాస్తో సంబంధం లేకుండా ఏ రూట్లో వెళ్లే బస్సుకై నా ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే అల్ట్రా పల్లెవెలుగు, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గేట్ మీటింగ్స్ నిర్వహించి, నోటీసు బోర్డులో సమాచారం ఉంచినట్టు తెలిపారు. గోసంరక్షణ పథకానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి. వెంకటరావు, చిన్నమ్మ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణ పథకానికి రూ. 1.45లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాల్సిందే కృత్తివెన్ను: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని పడతడిక, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలలో బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రాలలో సరైన లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, నిల్వ పరిమితులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకార్మికులు ఉన్నారా తదితర వివరాలను ఆరా తీశారు. ఆయనతో పాటు బందరు ఆర్డీవో కె. సాంబశివరావు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఏసురత్నం, తహసీల్దార్ శశి కుమార్ తదితరులు ఉన్నారు. -
పన్ను పాట్లు!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారుల నుంచి బకాయిలు వేగంగా వసూలు చేయండి’ అంటూ వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 15ఏళ్లుగా ఉన్న బకాయిలు మొత్తం వసూలు చేసి తీరాలంటూ అధికారులకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావటంతో వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు ఈ బకాయిల వసూళ్లపైనే దృష్టి సారించాలని ఆదేశించటంతో ప్రస్తుతం ఉన్న పనులన్నీ నిలిపివేసి అధికారులందరూ దీనిపైనే పని చేస్తున్నారని ఆ శాఖ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.700 కోట్ల బకాయిలు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివిజన్, విజయవాడ–2 డివిజన్, విజయవాడ–3 డివిజన్ పేర్లతో మూడు ప్రధాన కార్యాలయాలు పని చేస్తున్నాయి. వాటి పరిధిలో సుమారుగా రెండు జిల్లాల్లో 17 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిన్నింటి నుంచి ప్రభుత్వానికి సుమారుగా రూ.700 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. దాంతో కమిషనర్ కార్యాలయం నుంచి ఏరోజుకారోజు నివేదికలు అడుగుతూ అధికారులపై ఒత్తిడి పెడుతున్నారని నాయకులు వివరిస్తున్నారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆయా సంస్థలను పట్టుకునే పనిలో బిజీబిజీగా పని చేస్తున్నారని నాయకులు చెబుతున్నారు. ఆదాయం లేకనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అటు పరిశ్రమల నుంచి ఉత్పత్తి సైతం దిగజారింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చే ఆదాయం సైతం కానరావటంలేదు. వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల నుంచి ఆదాయ పన్నుల శాఖకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోవటంతో దానిని ఏదో విధంగా భర్తీ చేసేందుకు బకాయిలపై పడినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో వాణిజ్య శాఖ నుంచి భారీ ఆదాయం వస్తోందంటూ ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆదాయానికి సైతం గతి లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో కమిషనర్ కార్యాలయం నుంచి బకాయిలు వసూలు చేసి పడిపోయిన ఆదాయాన్ని దీని ద్వారా భర్తీ చేయాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు పదేపదే ఒత్తిడి పెడుతున్నారని ఆ శాఖలో వినిపిస్తున్నాయి. మరింత ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తోంది. ఈ 20 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆదాయం చూపించాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్టీ నిబంధనల్లో లేని అడ్వాన్స్ పన్నులు వసూలు చేసి కొంత ఆదాయం చూపించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏదో విధంగా ఆదాయాన్ని చూపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో 20 రోజుల్లో అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని, బకాయిల గురించి ఒత్తిడి తీసుకురావటంతో అధికారులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పదేపదే కాన్ఫరెన్స్ల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఆ శాఖలో పని చేస్తున్న అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కస్థాయి అధికారి వేరువేరుగా కాన్ఫరెన్స్లు పెట్టడంతో బకాయిల వసూళ్లకు ఎక్కడ అవకాశముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలతో వ్యాపారాలు జరగక ఆదాయం పడిపోతే తమపై ఒత్తిడి పెట్టడం ఏమిటంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు ఈ కాన్ఫరెన్స్లతో ఉన్న పుణ్యకాలమంతా అయిపోతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బకాయిల పేరుతో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవి సైతం బయటకు తీసి వసూలు చేయాలంటూ కమిషనర్ కార్యాలయం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా జీఎస్టీకి ముందు కొనసాగిన వ్యాట్ విధానంలో ఉన్న బకాయిలు చాలా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దానికి తోడు చాలా వ్యాపార సంస్థలు ఇచ్చిన చిరునామాల్లో లేవు. అలాగే బకాయిలు ఉన్న అనేక సంస్థలు దివాలా తీశాయి. కొన్ని సంస్థల వ్యక్తులు చనిపోయిన వారి పేర్లతో వ్యాపారాలు చేసి మోసగించినవి అందులో కనిపిస్తున్నాయి. వాటికి తోడు చాలా వరకూ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి అన్ని కలిపి భారీగా బకాయిలు ఉన్నాయంటూ కమిషనర్ కార్యాలయం చెప్పటంతో స్థానిక డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ముంజేరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితుల న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం కమిటీ ఆధ్వర్యలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. కేసులు ఎత్తివేయాలని, ఎమ్మెల్యే లోకం మాధవి దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. కనీసం స్పందించడం లేదు.. బాధితుల న్యాయ పోరాట కమిటీ అధ్యక్షుడు బోనెల జోగేంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ ముంజేరు దళిత కాలనీ సిద్ధార్థ నగర్కు మురుగు నీరు కాల్వను మళ్లించి దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. 94 రోజులుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదన్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దళితులకు న్యాయం చేయకపోగా, వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితవాడ గుండా మురుగు కాలువ తవ్వించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మగౌరవ దీక్షలో ముంజేరు బాధితుల న్యాయ పోరాట కమిటీ -
కునుకే బంగారమాయెనే!
● విజయవాడ గాంధీనగర్కు చెందిన 40 ఏళ్ల రాజుకు ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువ కావడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలు చుట్టుముట్టాయి. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా.. ఎటువంటి జబ్బూ లేదని, ఒత్తిడి కారణమని తేల్చారు. ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు అన్ని వర్గాలకు చెందిన వారు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక యుగంలో రాణించాలంటే ఉరుకులు పరుగుల జీవనం తప్పదు. ఈ క్రమంలో కంటినిండా నిద్ర ఉండదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి లోనై వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అదుపు తప్పు తున్నాయి. కొరవడిన మానసికోల్లాసం.. ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం లోపించిందనే చెప్పాలి. ఆధునిక యుగంలో రాణించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తుంటారు. కొందరు కనీసం పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం వేళ పిల్లలతో కాసేపు సమీపంలోని పార్కుకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలపై దృష్టి పెట్టడం వంటి చేయాలి. మధుమేహుల్లో ఒత్తిడి ప్రభావం ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. యువత వాటికి బానిసలుగా మారడంతో ఇతర అంశాలపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టిపెట్ట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, ఇలా అనేక రంగాల వారు ఈ సమస్యలతో కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు మధుమేహం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి మధ్య సంబంధం ద్విముఖమైనది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసోల్, ఇతర స్ట్రెస్ హార్మోన్లను పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవుతాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించి టైప్–2 డయాబెటిస్కు మార్పు వేగవంతం కావచ్చు. నిద్రలేమి, అనియంత్రిత ఆహారం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహ చికిత్సలో చక్కెర నియంత్రణతో పాటు, భావోద్వేగ ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించే వైద్య విధానం అనుసరించాలి. – డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ వ్యాధి నిపుణుడు -
పవర్ లిఫ్టర్ చంద్రికకు ఆర్థిక సాయం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక త్వరగా కోలుకొని మళ్లీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ ఏ.రవినాయుడు ఆకాంక్షించారు. ఆనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న చంద్రికను సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవర్ లిప్టింగ్లో చంద్రిక సాధించిన విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య చికిత్స కోసం లక్ష రూపాయలను అందచేశారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
సార్.. ఆ అన్నం తినలేం..
జి.కొండూరు: ‘సార్.. ఆ అన్నం అస్సలు బాగోలేదు. మేం తినలేం...’ అంటూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో వడ్డించిన అన్నం బాగాలేదంటూ తీసుకువెళ్లి బకెట్లో పడేశారు. అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేయగా, భోజనం బాగోలేదని, తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారం అంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై ఎంఈవో బాలుని వివరణ కోరగా... మధ్యాహ్న భోజనం వివాదం తమ దృష్టికి రావడంతో ఒక ఉపాధ్యాయురాలిని పర్యవేక్షణాధికారిగా నియమించినట్లు చెప్పారు. పిల్లలకు అందిస్తున్న భోజనంలో ఎటువంటి లోపాలు లేవని ఆ ఉపాధ్యాయురాలు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయినా బుధవారం మరోసారి తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి పాఠశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పాఠశాల హెచ్ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకుల మధ్య విభేదాల నేపథ్యంలో పథకం ప్రకారమే ఈ వివాదం సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల అల్టీమేటం
సాక్షి,ఎన్టీఆర్: విజయవాడ ఆరోగ్యశ్రీ పథకంపై ఆసుపత్రులు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (UHC) లో భాగస్వామ్యం చేయబోమని స్పష్టంగా ప్రకటించాయి.ఆసుపత్రుల సంఘాలు ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ పథకంలో కొనసాగడం అసాధ్యమని స్పష్టం చేశాయి. 2007 నుండి పాత రేట్లనే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. హెల్త్ ప్యాకేజీలను పెంచకుండా, కేవలం 25 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించాయి. ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం పాత ప్యాకేజీలను కొనసాగిస్తోందని విమర్శించాయి.ప్రభుత్వం 31వ తేదీ లోపు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని ఆసుపత్రులపై ఒత్తిడి తెస్తోందని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకపోతే ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి. ఆసుపత్రులు ఓటిఎస్ (One Time Settlement) కింద మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో భాగస్వామ్యం చేయబోమని స్పష్టంగా ప్రకటించాయి.మొత్తంగా, ఆరోగ్యశ్రీ పథకంపై ఆసుపత్రులు ప్రభుత్వానికి గట్టి అల్టీమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించాయి. -
దీపికది ఆత్మహత్యే!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక గతనెల 5న అనుమానాస్పదంగా ఆపరేషన్ థియేటర్లో మృతిచెందిన ఘటన మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే, దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో ఎనస్థీషియా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అమర్ సహాస్ను సోమవారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.తన కుమార్తె మృతికి అమర్ కారణమంటూ దీపిక తండ్రి కోదండరామిరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్, హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. అంతేకాక.. దీపికతో చివరిసారిగా ఫోన్లో డాక్టర్ అమర్ సహాస్ మాట్లాడినట్లు ఉంది. వాళ్లిద్దరికీ ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆమె ఆత్మహత్యకు అమర్ ప్రేరేపించాడనే కారణంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.పోలీసులకు పోస్టుమార్టం నివేదిక..ఇదిలా ఉంటే.. దీపిక పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందినట్లు తెలిసింది. అందులో వాంతులు కాకుండా ఇచ్చే జోఫర్ ఇంజక్షన్తో పాటు, మజిల్ రిలాక్సేషన్, మత్తుకు వాడే ఇంజక్షన్ ఉన్నట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. అయితే, జోఫర్తో ప్రాణాలు పోయే ప్రమాదం లేనందున.. మజిల్ రిలాక్సేషన్, మత్తు ఇంజక్షనే కారణంగా ఆమె మృతి చెందినట్లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఆమె రక్తంలో గుర్తించిన ఇంజక్షన్ కాలీ వెయిల్ను ఘటన జరిగిన రోజు ఆమె బ్యాగులో పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. -
కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే ఒకేసారి చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒకరు ఉదయం భూమి చేస్తే.. అదే కార్యక్రమానికి సాయంత్రం మరొకరు భూమి పూజ చేస్తారు. ఇలా భూమి పూజతో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించారు కూటమి నేతలు. కోడూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ రోడ్డుకు భూమి పూజలో రగడ నెలకొంది. ఉదయం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు. మధ్యాహ్నం అదే రోడ్డుకు కోడూరు మండల టిడిపి నాయకులు మళ్లీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కుంభాభిషేకం..
అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు. పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అభిషేకం దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి -
బాబు పాలనపై గురువుల రణభేరి3.0
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు పాలనపై ఉపాధ్యాయులు గర్జిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై శీత కన్నేసిన సర్కారు దురహంకార పూరిత విధానాలపై ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి రణభేరి3.0 పేరుతో దశలవారీ పోరాటం చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమర్ ప్రకటించారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. మనోహర్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రణభేరి 2.0 పేరుతో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో ధర్నా చేసినా, ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 24 నుంచి దశల వారీ పోరాటానికి సిద్ధపడుతున్నట్టు స్పష్టం చేశారు. మార్చి 24న నియోజక వర్గ కేంద్రాలలో, ఏప్రిల్ రెండు, మూడు తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయిలో 15 నుంచి 19 వరకు ఐదు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పేర్కొన్నారు. ఏప్రిల్ 28న చలో సెక్రటేరియేట్ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య, జిల్లా కోశాధికారి కె.గంగ రాజు తదితరులు ప్రసంగించారు. -
గాల్లో దీపంలా మహిళా రక్షణ
● రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి ● సంక్షేమ పథకాలు ఇస్తానని మోసం చేశారు ● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ● జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం సాధికారత ఏది? -
రజకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనాభాలో మూడు శాతం ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎీస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పానుగుపాటి శ్రీనివాస్, దాచేపల్లి మోహన్రావు, పేట శ్రీనివాస్, బైరవరపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8.56లక్షలు వచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. -
మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు సాధికారత సాధించినప్పుడే సమగ్ర ప్రగతికి పునాది అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మహిళా దినోత్సవంలో 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్: 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలను సత్కరించారు. చెక్కులు అందజేత.. డీఆర్డీఏ ద్వారా 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.83.78 కోట్లు, 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.829.55 కోట్లు, సీ్త్రనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.138.41 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (వర్సున్నపేట)కు ట్రాక్టర్ అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దే అనురాధ, మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జోత్స్న అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ముగిసిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్ జిమ్లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ పోస్టర్ ఆవిష్కరించారు. మనోహర్, అశోక్ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్ రాజు, ఈదా రాజేష్, అల్లూరిరెడ్డి, ఎస్కే ఖాదర్ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్ మాఫియాకు డాన్లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్ వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు. కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
12న దండి యాత్ర 2.0
●100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది భాగస్వామ్యం ● వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాపూజీ దండి సత్యాగ్రహం స్ఫూర్తితో ‘వైబ్రెంట్స్ ఆఫ్ కలాం‘ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం దండియాత్ర 2.0 నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం చెప్పారు. శనివారం సంస్థ కార్యాలయంలో దండియాత్ర 2.0 వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1930 మార్చి 12వ తేదీన మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించి 240 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం తమ సంస్థ దండియాత్ర 2.0 నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది యువత పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని వంద నియోజకవర్గాలలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని యువతీయువకులు ప్రదర్శిస్తారన్నారు. దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచిన 78 మంది స్వాతంత్య్ర సమరయోధులను పోలిన నాయకుల ఆహార్యాలతో నగరంలో సీఎం చంద్రబాబుతో కలిసి నడుస్తారని తెలిపారు. పాదయాత్ర అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత తిరోగమనానికి కారణమైన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో నిర్మూలించడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం ఇచ్చారన్నారు. సమావేశంలో కార్యక్రమ జాతీయ సమన్వయకర్త వి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ రవిరాజు, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ వి.శ్రీలలిత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి జహీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
అమ్మవారి దర్శనానికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ ప్రభలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చినతిరునాళ్లలో నాల్గవ రోజు శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి పాలు, పొంగళ్లతో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ క్యూలైన్లతో పాటు పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడుతో పాటు మండలంలోని ముచ్చింతాల, వెంకటాపురం, గుమ్మడిదుర్రు, శివాపురం గ్రామాల నుంచి ఎడ్లబండ్లతో పాటు చిన్న దూడలు, గొర్రెలతో బండ్లు కట్టి వాటిలోను, సైకిళ్లకు, ఆటోలకు, ట్రాక్టర్లకు పార్టీ జెండాలు, ప్రభలు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మునేరులో పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో సేద తీరారు. ఎగ్జిబిషన్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులకు వేద సీడ్స్ వారు మజ్జిగ పంపిణీ చేయగా రామ్కో సిమెంట్స్ వారు పులిహోర పంపిణీ చేశారు. – పెనుగంచిప్రోలు -
బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఒకరికి గాయాలు
పెనుగంచిప్రోలు: బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన స్థానిక మునేరు అవతల మామిడి తోటలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామానికి చెందిన పాల పోలురాజు తన బంధువులతో కలిసి శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్లకు వచ్చారు. అందరూ మునేరు అవతల మామిడి తోటలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 12–30 గంటల నుంచి ఒంటిగంట సమయంలో భార్యతో ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చిన అతనిని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నెట్టటంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్, బంగారు గొలుసు ఇవ్వమన్నాడు. ఇవ్వకపోవటంతో బ్లేడ్తో గొంతు కింద, తలపై దాడి చేసి గాయపరిచాడని పోలు రాజు తెలిపాడు. దాడి చేసిన వ్యక్తిని బలవంతంగా నెట్టటంతో పారిపోయాడన్నారు. తరువాత తన వారికి చెప్పటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తికి తొలుత 108 వాహనంలో తిరునాళ్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్ద, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. పోలురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. -
మద్యంపై పెల్లుబికిన మహిళాగ్రహం
పాయకాపురం(విజయవాడరూరల్): పేదల బతుకులను బండపాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందంటూ మహిళలు కదం తొక్కి ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లో టెంట్ను కూల్చివేసిన ఘటన శనివారం రాజీవ్నగర్ ఎదురు అంబాపురం గ్రామ సరిహద్దులో చోటుచేసుకుంది. విజయవాడ నగర శివారు రాజీవ్నగర్ వడ్డెర కాలనీలో కాయకష్టం చేసుకుని బతుకుతున్న కుటుంబాలకు సమీపంలో వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించడానికి సిద్ధమై మద్యం అమ్మేందుకు టెంట్ వేసి కుర్చీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రికి రాత్రి బార్ను నెలకొల్పేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో మద్యం అమ్మకాలకు కౌంటర్ను, బాటిల్స్ను సిద్ధం చేశారు. ఈ విషయం గమనిస్తున్న స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆగ్రహంతో బార్ అండ్ రెస్టారెంట్లో వేసిన టెంట్లను కూల్చివేశారు. కుర్చీలను గాల్లోకి విసిరారు. తమకు తాగటానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఇళ్ల ముంగిటకు తీసుకొచ్చి అమ్ముతోందని మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తమ బతుకులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆడపిల్లలు కాలేజీలకు, స్కూల్స్కు వెళ్లే మార్గం మధ్యలో బార్ను ఏర్పాటు చేయడం ఏమిటని, ఈ ప్రభుత్వం మంట కలిసిపోవాలంటూ శాపనార్ధాలు పెట్టారు. పగలంతా మట్టి పని చేసి ఇంట్లో ఆదమర్చి నిద్రపోయే తమకు మద్యం మత్తులో ఉండేవారి నుంచి రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. వృద్ధులకు, భర్త చనిపోయిన వారికి కొత్త పింఛన్లు ఇవ్వలేని ఈ ప్రభుత్వం తమ జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు ఇళ్ల మధ్యన బార్ను ఏర్పాటు చేస్తోందని దుయ్యబట్టారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ కొండలరావు, నున్న పోలీసు స్టేషన్ సీఐ కృష్ణమోహన్ తమ సిబ్బందితో వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులు చక్కబడిన పిమ్మట వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
కనుల పండువగా పసుపు–కుంకుమ ఉత్సవం
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకొచ్చే కార్యక్రమం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. అమ్మవారి వంశీ కుడు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకుల ప్రత్యేక పూజలు అనంతరం రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి ఘనంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్బాబు, ఈఈ కె.వి.రాజు, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మి, ఏఈ రాజు, ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి బండి వద్ద ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం అమ్మవారిని దర్శించుకున్నారు. -
దుర్గామల్లేశ్వరులకు ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థా నంలో కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయానికి విచ్చేసి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు సుమారు గంట పాటు స్వామిజీ పూజాధి కార్యక్రమాలు జరిపించారు. అనంతరం రావిచెట్టు వద్ద ఇంద్ర కీలాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ కుంభాభిషేక క్రతువును పర్యవేక్షించారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామిజీ విశేష అభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరాలయం వద్ద విజయేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీమద్భగద్గీత పుస్తకాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఆయన శిష్యులు దుర్గాఘాట్ సమీపంలో కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించారు. యాగశాలలో పూజలు కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శని వారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థ్థాపన, పీఠ పూజలు నిర్వహించారు. సాయంత్రం మూలమంత్ర హవనం, ప్రదోష కాల పీఠ పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. యాగశాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను విజయేంద్ర సరస్వతి స్వామిజీ పర్యవేక్షించగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కుంభాభిషేకం వేళ దుర్గమ్మను ఎంపీ కేశినేని చిన్న, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు దర్శించుకున్నారు. నేడు కుంభాభిషేకం ఆదివారం ఉదయం 9.34 గంటలకు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా అమ్మవారి ఆలయ శిఖరానికి కుంభాభిషేకం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం యాగశాల నుంచి విజయేంద్ర సరస్వతి స్వామిజీతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు నదీ జలాలను తీసుకుని ఆలయ శిఖరంపైకి వేడుకను జరిపిస్తారు. -
మహిళల సాధికారతతో సమాజాభివృద్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళా సాధికారతతోనే సామాజిభివృద్ధి సాధ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగ ణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి సారథ్యంలో జరిగింది. తొలుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి, కుటుంబ పురోగతి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ సేవల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం అన్ని స్థాయిల్లో కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. పంచా యతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.విజయకుమారి, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ జేడీ బి. అనుపమ చేతుల మీదుగా మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి స్టేట్ అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కిషోర్ కుమార్, కో చైర్మన్ సంసాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశ్వరరావు, వి.ఆర్లయ్య, సిటీ యూనిట్ చైర్మన్ రవి ప్రసాద్, జనరల్ సెక్రెటరీ మందపాటి శంకర రావు, బత్తిన రామకృష్ణ, వై.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
ఓర్పు.. నేర్పులో
● జిల్లా అధికారులుగా రాణిస్తున్న మహిళలు ● ప్రజలకు సేవలు అందించాలని తాపత్రయం ● తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్న వైనం వన్టౌన్/గాంధీనగర్/లబ్బీపేట: కొవ్వొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిస్తోంది మహిళ. ఇల్లాలి చదువు ఇంటికే కాదు.. సమాజానికే వెలుగు అని చాటిచెబుతోంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోనే కాదు అధికారిగానూ తనదైన ముద్రతో విజయ కేతనం ఎగురువేస్తోంది. గృహిణిగా ఇంటిని చక్క దిద్దుతున్న ఆమె అధికారిగా ఓర్పు, నేర్పుతో విధులు నిర్వర్తిస్తూ తాను అవనితో సమానమని నిరూపిస్తోంది. మహిళలు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సాధించలేనిది లేదు అనేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులే నిదర్శనం. మహిళల చదువుకు ప్రాధాన్యత లేని రోజుల్లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత చదువులు చదివి నేడు జిల్లా ఉన్నతాధికారులుగా రాణిస్తున్నారు. మరి కొందరు ప్రజాప్రతినిధులు గానూ మన్ననలు అందుకుంటున్నారు. మహిళా లోకానికి వీరి కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకం. పలు ముఖ్య శాఖలను తమ ప్రతిభతో ప్రగతి పథాన నడుపుతున్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... -
ప్రజల సంతృప్తే గీటురాయి
గాంధీగనర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ల ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థాయే అధికారుల పనితీరుకు గీటురాయని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీసర్వే డెప్యూటీ తహసీల్దార్లు తదితరులలో శనివారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మండలాల వారీగా రెవెన్యూ సేవల పంపిణీ, సమస్యల పరిష్కారంలో పురోగతి తదితరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న ముఖ్యమైన శాఖ అని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయా లను ఆశ్రయిస్తారని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అసైన్మెంట్స్, 22(ఏ) నుంచి తొలగింపు, రీసర్వే గ్రీవెన్సులు వంటివాటిపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. కేవలం సమస్యను ముగించడం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని, సర్వేలు సమయానికి పూర్తిచేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించా లని తెలిపారు. ఆర్డీఓల స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ల సేవలపై నిరంతర పర్యవేక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. సేవలు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహజ వనరుల పరిరక్షణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ స్పష్టంచేశారు. చెరువులు, కాలువలు, వాగులు, కుంటలు వంటి జల వనరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారు. జల వనరులు ప్రజలకు అత్యంత విలువైన సంపద అని, భవిష్యత్ తరాలకు వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని, భూగర్భ జలాల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ లక్ష్మీశ -
కేయూ మహిళల హ్యాండ్బాల్ చాంప్ కేబీఎన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్గా కేబీఎన్ కళాశాల విజయం సాధించింది. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్బాల్ పోటీలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పోటీలు శుక్రవారం ముగిశాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ కళాశాల హ్యాండ్బాల్ పోటీల్లో 12సార్లు వరుస చాంపియన్షిప్లను కై వసం చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల మొదటగా లీగ్ పోటీలో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న)పై 14 –2 గోల్స్ ఆధిక్యతంతో విజయం సాధించారు. రెండో లీగ్లో స్టెల్లా కాలేజ్ (విజయవాడ)పై 18–00 గోల్స్ ఆధిక్యతతో కేబీఎన్ విజయం సాధించింది. ఫైనల్లో సిద్ధార్థ మహిళ కళాశాల జట్టుపై 14–00 ఆధిక్యంతో యూనివర్సిటీ చాంపియన్షిప్ ట్రోఫీని కై వసం చేసుంది. ద్వితీయ స్థానం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న) సాధించగా, తృతీయ స్థానాన్ని సిద్ధార్థ మహిళ కళాశాల జట్టు సాధించింది. బహుమతి ప్రదానం ముఖ్య అతిథి ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీ ఉత్తమ క్రీడాకారిణిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కేబీఎన్ కళాశాల విద్యార్థిని బోయి సత్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరిని తయారుచేసిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్, యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ మెంబర్స్, అధ్యాపక సిబ్బంది తదితరులు విజేతలను అభినందించారు. -
దివ్య ప్రభోత్సవం
కమనీయం.. ● 90 అడుగుల ప్రభ ● విద్యుత్ దీపాల వెలుగులుపెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో మూడవ రోజు శుక్రవారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తెన ప్రభగా గుర్తింపు పొందిన ఈదివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచారు. దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఏఈ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు కార్యక్రమం శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టం అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమ బండ్లు వచ్చే కార్యక్రమం శనివారం రాత్రి 7.32 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఈఓ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
పన్నుల చెల్లింపులో అధికారులకు చుక్కలు చూపిస్తున్న బడాబాబులు
మండలం గృహాలు, డిమాండ్ వసూలైంది భవనాలు చందర్లపాడు 15,408 76.13 57.09 జగ్గయ్యపేట 17,265 473.4 247.74 కంచికచర్ల 17,963 391.4 208.97 నందిగామ 11,986 157.7 119.22 పెనుగంచిప్రోలు 14,046 173.9 104.34 వత్సవాయి 14,981 119.5 71.68 వీరులపాడు 12,998 79.83 64.08 ఎ.కొండూరు 11,296 54.33 33.53 గంపలగూడెం 17,104 146.7 76.62 రెడ్డిగూడెం 8,838 68.55 27.35 తిరువూరు 10,120 50.12 32.28 విసన్నపేట 13,152 152.3 82.59 జి.కొండూరు 15,142 244.2 145.45 ఇబ్రహీంపట్నం 11,036 423.5 202.6 మైలవరం 16,122 343.8 220 55,693 2444 1475 జి.కొండూరు: గ్రామాల్లో పన్నుల చెల్లింపులో పెద్దలు వెనుకంజలో ఉండగా.. తప్పించకోవడానికి ముందంజలో ఉన్నారు. ప్రసంగాల్లో నీతులు వల్లించే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇంటి పన్నుల చెల్లింపులో మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించని బడాబాబులను ఏమీ చేయలేక, రాజకీయ ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఇంటి పన్నులను బడాబాబులే ఎగవేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది చివరికి వచ్చినా పన్నుల వసూళ్లు పాత బకాయిలతో కలిపి 58 శాతం మాత్రమే పూర్తవడం ఆందోళనకరంగా మారింది. గ్రామ పంచాయతీలకు ఆదాయం లేక, స్టాంపు డ్యూటీ లేక, బడాబాబుల నుంచి ఇంటి పన్నుల వసూళ్లు కాకపోవడంతో కనీస మౌలిక వసతుల కల్పన లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించలేని దుస్థితి నెలకొంటోంది . ఎన్టీఆర్ జిల్లాలోని 16మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి చివరిరే రూ.53.99కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. దీనిలో పాత బకాయిలే రూ.11.97కోట్లు ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఇంటి పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు పాత బకాయిలు రూ.4.60కోట్లు, నూతన ఇంటి పన్ను రూ.27.08కోట్లు కలిపి మొత్తం రూ.31.68కోట్లను వసూలు చేశారు. ఇప్పటి వరకు పేద, మద్య తరగతి వారి నుంచి మాత్రమే ఈ ఇంటి పన్నును అధికారులు వసూలు చేయగలిగారు. విజయవాడ రూరల్ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పన్నుల వివరాలు రూ.లక్షల్లో నగర, గ్రామ ఆర్థిక వ్యవస్థకు పన్నులు ప్రధాన ఆధారం. అయితే ఇటీవల పన్నులు కట్టకుండా దారులు చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అధిక ఆదాయం కలిగిన పెద్దలు, సంస్థలు ఇంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం బడాబాబులు పావులు కదుపుతున్నారు. పన్ను చెల్లింపులో సామాన్యులు నియమాలు పాటిస్తుంటే.. పెద్ద ఆదాయ వర్గాలు పన్నుల నుంచి తప్పించుకోవడం ఆర్థిక సమానతకు సవాల్గా మారుతోంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. సామాన్యులను ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం ఎన్టీఆర్ జిల్లాలో 2025–26లో ఇంటి పన్ను డిమాండ్ మొత్తం రూ.53.99కోట్లు ఇప్పటి వరకు 58.69 శాతం మాత్రమే వసూలు ఇంకా వసూలు చేయాల్సిన పాత బకాయిలు రూ.7.37కోట్లు, నూతన పన్ను రూ.14.93కోట్లు కలిపి మొత్తం రూ.22.30కోట్లలో 20 శాతం మొండి బకాయిలు ఉండగా మరో 20 శాతం కార్పొరేట్ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేయాల్సి ఉంది. వీరు రాజకీయ నేతల నుంచి ఫోన్లు చేయించడం, మాట్లాడించడం వంటి దారులతో పంచాయతీ అధికారుల చేతులు కట్టేస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చినా బడాబాబులు లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఇంటి పన్నును వసూలు చేసేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. -
అంగరంగ వైభవంగా..
ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సోయగం ఆలయానికి అలంకరణ కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, పరిసరాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని అడుగడుగునా మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అంతరాలయ దర్శనం రద్దు, టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో భక్తులు అన్ని క్యూల్లో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఘాట్రోడ్డుతో పాటు ఆలయ పరిసరాల్లో 11కు పైగా ప్రత్యేక వైద్య శిబిరాలు, భక్తులకు మంచినీటి పంపిణీ, మజ్జిగను అందజేశారు. లోబ్రిడ్జి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే వరకు ప్రతి వంద మీటర్లకు తాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ గెస్ట్ హౌస్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11వేల మందికి అన్న ప్రసాద వితరణ దుర్గగుడిపై కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం తొలి రోజున పవిత్ర జలాలకు పూజలు ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి విశేష అలంకరణ -
స్వయం ఉపాధితో ఆర్థిక పరిస్థితి మెరుగు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కిలేశపురంలో పి.ఉమ అనే మహిళ పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం చేయూతతో ఇప్పటికే ఒక ఎద్దు గానుగ యూనిట్ను ప్రారంభించగా మరో యూనిట్ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబం బలపడుతుందన్నారు. స్వయం ఉపాధి మహిళలకు కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని ఇచ్చే మార్గమని పేర్కొన్నారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి శిక్షణ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారి రాధికా ములేతో కలిసి జూపూడిలో పర్యటించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యాన అమలవుతున్న ఆకాంక్షిత బ్లాక్, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా రాధికా ములే జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాల్లో వివిధ ప్రగతి సూచికల్లో పురోగతిని పరిశీలించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శకుంతల, తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నంఅర్బన్: స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ టి. లీలా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ టీటీకే రెడ్డి.. డాక్టర్ లీలా ప్రసాద్కు అప్పగించారు. ఈ సందర్భంగా లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్ అంశాలను ఉన్నతాధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సేవలు మరింత మెరుగుపరచడానికి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన విజయేంద్ర సరస్వతి స్వామీజీని ఆలయ ఈవో, చైర్మన్, స్థానాచార్య, ప్రధాన అర్చకులు, వేద పండితులు పాదాభివందనం చేసి సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న స్వామీజీ తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను, క్రతువులను స్వామీజీ పరిశీలించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంచి పీఠాధిపతి ఇంద్రకీలాద్రికి విచ్చేశారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్, ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏజీఎల్ కనెక్షన్లు, వినియోగదారులకు ఇతర సర్వీసులు అందించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీడర్స్ బ్రేక్ డౌన్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్(టెక్నికల్) మురళీ కృష్ణయాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) వెంకటేశ్వర్లు, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిటర్ జనరల్, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. -
బందరులో బరితెగింపు..
మచిలీపట్నంటౌన్: మద్యం మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులతో ప్రచారం హోరెత్తిస్తోంది. జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా ఫ్లెక్సీలు కడుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధిక ధరలకు తోడు సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు జరుపుతూ మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ వ్యాపారం సాగిస్తున్నారు మచిలీపట్నంలోని మద్యం వ్యాపారులు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బార్ హోర్డింగ్ ఏ కూడలి చూసినా ఫ్లెక్సీలే..బందరులో ఏ కూడలి చూసినా మద్యం ప్రచార ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్, జిల్లా కోర్టు సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు, బస్టాండ్ సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రేవతి సెంటర్లోని మున్సిపల్ మాజీ చైర్మన్ రమణయ్య నాయుడు వంటి మహనీయుల విగ్రహాల వద్ద ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీల ప్రతినిధులు ఈ హోర్డింగులు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మహనీయుల విగ్రహాల వద్ద అభ్యంతరకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగించాలని పలువురు నగర కమిషనర్ బాపిరాజుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. జిల్లా పరిషత్ సెంటర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు ఆందోళన చేసినా బార్లా తెరిచారు... నగరంలోని హైనీచర్చి సమీపంలో నవ్య రెస్టారెంట్ అండ్ బార్ను నూతనంగా ఏర్పాటు చేశారు. చర్చి సమీపంలో బార్ ఏర్పాటుపై ఇటీవల క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ బార్ను గురువారం ప్రారంభించేశారు కూడా. దీనిలో భాగంగా బార్ నిర్వాహకుడు ఏకంగా పెద్ద పెద్ద హోర్డింగులను నగరంలోని మహనీయుల విగ్రహాల వద్ద ప్రచారానికి ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి. కానీ అదేదో మందుబాబులకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్టు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తామంటూ మద్యం బాటిళ్ల ఫోటోలతో బాహాటంగా వ్యాపారులు ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. కోర్టు సెంటర్లో అమరజీవి విగ్రహం వద్ద ఇలా.. -
గన్నవరం ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాల్లో పలు విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. సేఫ్ ల్యాండింగ్కు క్లియరెన్స్ లేకపోవడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్, సింగపూర్, ఢిల్లీ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్కి వీలులేకపోవడంతో అధికారులు.. రాజమండ్రికి దారి మళ్లించారు.పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో అంతరాయం కొనసాగుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలుగు రోజుల క్రితం పొగ మంచు కారణంగా ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి.


