breaking news
NTR
-
మంత్రి నాదెండ్లకు షాకిచ్చిన రైతులు, టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: మంత్రి నాదెండ్ల మనోహర్కు రైతులు, టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేతలు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా అందిందన్నారు. కూటమి పాలనలో రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్ 20) తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ను మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ రైతులు నిలదీశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు.. చంద్రబాబు సర్కార్ గాలితీసేశారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా రైతులు బయటపెట్టారు.రైతులకు మేమే మేలు చేశామని డబ్బాలు కొట్టిన చంద్రబాబు సర్కార్.. ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు చెప్పుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షిగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. వైఎస్సార్సీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేత తోట సాయిబాబు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అరకొరగానే ఇచ్చారన్నారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు. -
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హులతో భర్తీ చేయాలన్నారు. అర్హులైన గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్ –1, వీఆర్వోలుగా వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు అందరికీ కామన్ డీడీఓగా తహసీల్దార్లు ఉండేలాగా ఆదేశానివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే డిపార్ట్మెంట్ కింద.. వీఆర్వోలు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తారని, ఇతర శాఖల అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాటించడం సాధ్యం కాదని రవీంద్రరాజు అన్నారు. బయోమెట్రిక్ విషయంలోనూ జీఎస్డబ్ల్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదన్నారు. వీఆర్వోలు ఈ–ఆఫీసు ద్వారా ఫైల్స్ పంపేందుకు వీలుగా కంప్యూటర్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీఆర్వోల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్టీజీఎస్ అధికారులు చేస్తున్న చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మౌళి భాష, గ్రామ సహాయకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు, గ్రేటు–2 వీఆర్వో అసోసియేషన్ నాయకులు శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
దళారులకే సం‘పత్తి’!
కంచికచర్ల: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారుల నిర్వాకంతో పత్తి రైతులు దళారీల చేతుల్లో నలిగిపోతున్నారు. సీసీఐ పంట కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టినా.. చివరికి దళారీలదే పెత్తనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సీసీఐ కూడా దళారీలకే మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్భాటంగా ప్రారంభం.. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను సంప్రదించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆర్భాటంగా ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు కూడా దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని రైతులకు చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ. 7,710 నుంచి రూ.8,110గా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సీసీఐ, దళారుల మిలాకత్! కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేక పోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. కాలయాపన చేస్తూ రైతులను అసహానికి గురిచేస్తూ దళారులను రైతులు ఆశ్రయించేలా చేస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు మాత్రం ట్రాన్స్పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ.4,500 లోపు కొంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినా.. తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కంచికచర్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడిని ఇటీవల కలిశారు. కానీ నేటికీ రైతుల నుంచి ప్రభుత్వం కాని, సీసీఐ అధికారులు కాని కొనుగోలు చేయలేదని రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను బహూకరించారు. అనంతరం ఈవో చాంబర్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో చర్చించారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు, దేవస్థానంలో ఇటీవల చేపట్టిన మార్పులు, అదనపు కౌంటర్లు, ఆన్లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. కార్యక్ర మంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణల సమయంలో తయారు చేసిన లడ్డూలను శుక్రవారం కూడా దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. గురు, శుక్రవారాలలో మొత్తం 1.30 లక్షల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు, చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణల నిమిత్తం మొత్తం 28.08 లక్షల లడ్డూలను తయారు చేయగా, 24.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేవస్థానం వద్ద 4.61 లక్షల లడ్డూల స్టాక్ ఉండగా, వాటిలో 3.32లక్షల లడ్డూలను విక్రయం నిమిత్తం కౌంటర్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మిగిలిన 1.30లక్షల లడ్డూలను ఉచిత ప్రసాద వితరణ బదులుగా గురు, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలోని వేరు వేరు ప్రదేశాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన పీతల సునీల్కుమార్ కుటుంబం రూ. లక్ష, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన టి. బ్రహ్మానందరెడ్డి కుటుంబం టి. కోటిరెడ్డి పేరిట రూ. 1,01,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె. సత్యనారాయణమ్మ, అంజయ్య ల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పక డ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్లు, 355 అర్బన్ బూత్లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా బృందాలు సేవలందిస్తాయన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆర్డీవోలు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరిగే దిశగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గుణదలలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటైన రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. సిద్ధాంత పరమైన సమస్యల పరిష్కారానికి ఆలోచనా సామర్థ్యం పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ విజేతలే.. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులంతా విజేతలేనని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, గణిత వినోదం, జల వనరుల నిర్వహణ, వంటి అంశాలను ప్రదర్శించారన్నారు. డీఈఓ ఎల్. చంద్రకళ, పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం సిస్టర్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు పత్తిని రూ.7వేలకు కొన్నారు..
గ్రామంలో 20 ఎకరాలు పత్తి పంట సాగుచేశా. తుపాను దెబ్బకు ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో క్వింటా పత్తిని రూ.7.500కు కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కిలో కూడా కొనలేదు. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదు. కనీసం పత్తి పంట దెబ్బతిన్నా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావటంలేదు. – షేక్ మొహిద్దీన్ పాషా, రైతు, మోగులూరు, కంచికచర్ల మండలం -
ఆత్మస్తుతి.. పరనింద!
మొక్కుబడిగా డీఆర్సీ సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సమీక్ష సమావేశం మొక్కుబడిగా సాగింది. గంటా నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా జరగాల్సిన విధంగా జరగలేదు.. తూతూ మంత్రంగానే సాగింది. అంతా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా సాగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను సైతం గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. తాము చేసేదే గొప్ప అన్నట్లుగా సమావేశం నడిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటలకు హాజరు కావాల్సిన మంత్రి వాసంశెట్టి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి 3.40 గంటలకు వచ్చారు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే(జనసేన) మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహిస్తే పరిపూర్ణంగా నిర్వహించాలని.. లేకుంటే మరో రోజుకు వాయిదా వేయాలని, ఇలా చేస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్ల జోక్యాన్ని నివారించండి.. అనంతరం వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చ ప్రారంభంకావటంతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. రాబోయే వేసవి కాలం నాటికి ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని దీని ద్వారా ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు రూ. 8కోట్ల నిధులు జిల్లా పరిషత్కు కేటాయించారని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆర్డర్లు తమకు వచ్చాయని కృష్ణాజిల్లాకు సంబంధించి ఆర్డర్లు రాలేదని వివరించారు. అయినప్పటికీ కృష్ణాజిల్లాకు సంబంధించిన నిధులను బట్టి కేటాయించిన పనులకు సంబంధించిన ఫైలు తాము తిరస్కరించామని పత్రికల్లో సీఈవో కన్నమనాయుడు తనపై వార్తలు రాయిస్తున్నారని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనను బట్టి కలెక్టర్ ఇచ్చిన హామీని కూడా లెక్క చేయకుండా మరలా 205 పనులు రద్దు చేస్తూ తనకు లేఖ రాశారని చెప్పారు. పనులు ప్రారంభమైనవి కూడా ప్రారంభం కాన్నట్లుగా చూపుతున్నారని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు. -
డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్పైకి వెళ్లి డివైడర్ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
21న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: చిన్నారుల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని గురువారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు ఒక్క చిన్నారూ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,39,180 మంది ఉన్నట్లు అంచనా వేశామని వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,94,160 డోసులను సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి జిల్లాలో మొత్తం 4,898 మంది సిబ్బందిని నియమించామన్నారు. పెనమలూరు: మద్యానికి బానిసగా మారిన వ్యక్తి బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన దేవల దుర్గారావు(33) మట్టి పని చేస్తాడు. అతనికి భార్య మరియ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు మద్యానికి బానిసగా మారటంతో భార్య, పిల్లలు పుట్టింటికి ఐదు నెలల క్రితం వెళ్లి పోయారు. భార్య, పిల్లలు వెళ్లి పోవటంతో మనస్తాపం చెందిన దుర్గారావు విపరీతంగా మద్యం తాగడం ప్రారంభించాడు. కాగా బుధవారం దుర్గారావు యనమలకుదురు లాకుల వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. కాలువలో అతని ఆచూకీ తెలియకపోవటంతో ఈ ఘటనపై తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ెపదపారుపూడి: ఎదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో యవకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పెదపారుపూడిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ రూరల్ మండలం కాశిపూడి గ్రామానికి చెందిన చప్పిడి అజయ్(24) గ్రామం నుంచి బైక్పై గుడివాడ పట్టణానికి వెళ్తుండగా పెదపారుపూడి గ్రామంలోని రామాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు, బైక్ను ఢీకొనటంతో అజయ్ బైక్పై నుంచి కిందకు పడిపోయాడు. చిక్సిత నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే సొంత గ్రామానికి వచ్చాడు. మృతుడికి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఉన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): బీఫార్మసీ రెండు, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ ఫలితాలను గురువారం సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు ఫీజు రూ.2,070 చెల్లించాలన్నారు. అలానే వ్యక్తిగత పరిశీలనకు రూ.2,190 చెల్లించాలని సూచించారు. -
పొగముంచు.. గమనించు!
నాగాయలంక మండలంలో మంచు కమ్మేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచే దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు, స్వచ్ఛత పనులకు కదిలే పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడ్డారు. ఉదయం 8గంటల దాటినా మంచు దుప్పటి వీడక పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికివారు జాగ్రత్తగా ముందుకు కదిలారు. – నాగాయలంక ఉదయం 8.30గంటల వేళ బయటకు వస్తున్న భానుడు ఉదయాన్నే మంచు, చలి నుంచి ఊరట పొందేందుకు టీ స్టాల్స్కు క్యూ కట్టిన శ్రామికులు వర్షంలా కురుస్తున్న మంచు మధ్యనే.. -
భక్తులకు ఉచితంగా లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణలలో తయారు చేసిన లడ్డూలను దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసింది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేసింది. అయితే చివరి రోజైన సోమవారం భక్తులు, భవానీల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటంతో లడ్డూ విక్రయాలు తగ్గాయి. దీంతో దేవస్థానం వద్ద భారీగా లడ్డూ స్టాక్ ఉండటంతో గురువారం ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో భక్తులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గంలో రెండు ప్రదేశాల్లో, మహా మండపం లిప్టు ఎదుట, ఘాట్రోడ్డు మార్గంలో డోనర్ సెల్ వద్ద సేవా సిబ్బంది, ఆలయ అర్చకులకే లడ్డూలను పంపిణీ జరిగింది. మరో వైపున భక్తులు ఇదే అవకాశంగా ఒక్కోక్కరు ఒకటికి, రెండు సార్లు క్యూలైన్లో నిల్చోని లడ్డూలను పొందారు. దీంతో ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపం దిగువన లడ్డూ కౌంటర్లు విక్ర యాలు లేక వెలవెలపోయాయి. దీక్ష విరమణలకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన తిరుగు ప్రయాణమైన శానిటేషన్, సెక్యూరిటీ, దేవదాయ శాఖ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన వారికి సైతం దేవస్థానం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషం. అయితే ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రం ఉచిత లడ్డూ ప్రసాదాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలకు ఇళ్లలోనూ రక్షణ కరువు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కనీసం ఇళ్లల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా ఉండలేని భయానక వాతావరణం నెలకొనడం సిగ్గుచేటని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో బుధవారం గంజాయి బ్యాచ్ వీరంగంతో గాయపడిన గుమ్మళ్ల కుసుమ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. గంజాయి బ్యాచ్ సభ్యులు చేసిన ఆగడాల గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీసిన వీడియోలను చూసి నివ్వెరపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు. టీడీపీ నాయకుల వత్తాసు సిగ్గుచేటు.. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు టీడీపీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గౌతమ్రెడ్డి విమర్శించారు. ఇళ్లల్లో చొరబడి రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం ప్యాకెట్లతో అలజడి చేసి ఇళ్లను ధ్వంసం చేసి చిన్నపిల్లలను సైతం బూతుపురాణాలతో చంపేస్తామని బెదిరించిన మానవ మృగాలను కాపాడేందుకు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వ పాలకులు ఇటువంటి విధానాలను వీడకుండా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో పావులుగా మారకుండా చట్టపరంగా.. న్యాయపరంగా నడుచుకోవాలని కోరారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి సింగ్నగర్లో గంజాయి బ్యాచ్ చేతిలో గాయపడిన మహిళ కుటుంబానికి పరామర్శ -
కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
గుడివాడ టౌన్: వునిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్న తల్లినీ, జన్మభూమినీ మరువ కూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటించాలన్నారు. యువత ప్రకృతి సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తన జన్మభూమిని గుర్తు ఉంచుకుని గుడివాడలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న గురుదేవ్ మహాపాత్రో(23)సంఘటన స్థలంలోనే మృతి చెందిన సంఘటన గురువారం విస్సన్నపేట– నూజివీడు రోడ్డులో జరిగింది. మృతుడు విస్సన్నపేటలో ఒక కార్ల షోరూమ్లో స్పేర్పార్ట్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలసి కొండపర్వలో నివాసం ఉంటున్న గురుదేవ్ మహాపాత్రో ఉదయం విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై ఇంటి నుంచి విస్సన్నపేట వస్తుండగా మలుపు వద్ద లారీ వెనుక భాగం తగిలి తలకు బలమైన గాయం అయి తీవ్ర రక్తస్రావం జరగటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న మృతుడి హెల్మెట్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. వెనుకనే వస్తున్న డీసీఎం వ్యాను, దాని వెనుక వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. స్కూల్ బస్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. న్యాయం చేయండి.. మృతుడు తల్లి మధుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కాగా వీరి స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా మల్లూ గ్రామం, అయితే కొండపర్వ గ్రామం వద్ద ఉన్న ఫ్యానుల కంపెనీలో వైడింగ్ పని మేసీ్త్రగా తన భర్త సురేష్ మహాపాత్రో పనిచేస్తుండటంతో కుటుంబం కొండపర్వ గ్రామంలో నివాసం ఉంటున్నామని మృతుడి తల్లి మధుస్మిత పేర్కొన్నారు. డ్యూటీకి వస్తున్న క్రమంలో తన కుమారుడు ఈ విధంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, మృతికి కారణమైనవారిని పట్టుకొని తమకు తగున్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన కుమారుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించారు. -
కేంద్రాలపై ప్రభుత్వం చిన్న చూపు
● పౌషకాహార లోపంతో చిన్నారులు ● అంగన్వాడీల్లో స్పెషల్ డైట్ ఊసే ఎత్తని సర్కారు ● దొడ్డుబియ్యం ఇస్తుండటంతో తినలేకపోతున్న చిన్నారులు ● గత వైభవం కోల్పోయిన అంగన్వాడీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వం సైతం అలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతా ల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం మంది ఇలాంటి పిల్లలు ఉన్నట్లు సమా చారం. అందుకు ఇటీవల జక్కంపూడి ప్రాంతంలోని ఒక అంగన్వాడీ సెంటర్ను ఓ జిల్లా అధికారి తనిఖీ చేయగా, అక్కడ ఉన్న 20 మందిలో 8 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించడమే నిదర్శనంగా కనిపిస్తోంది. వారికి ప్రత్యేక డైట్ ఏమైనా ఇస్తున్నారా అంటే అదేమీ లేదని తేలింది. అంతేకాదు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఇచ్చే ప్రత్యేక డైట్పై అంగన్వాడీలకు సైతం సరైన అవగాహన లేక పోవడం కొసమెరుపు. లావు బియ్యం, పుచ్చిన కందిపప్పు.. అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రతిరోజూ మధ్యాహ్నం పప్పు, ఆకుకూరల భోజనంతో పాటు, ఉడికించిన గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలని మెనూలో ఉంది. కానీ అక్కడ పెట్టే భోజనం చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు(లావు) బియ్యమే అంగన్వాడీలకు ఇస్తుండటం, ఒక్కోసారి కందిపప్పు సైతం నాణ్యతాలోపం ఉండటంతో చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. నూనె, ఇతర సరుకులు కూడా అంత నాణ్యత ఉండటం లేదు. దీంతో అంగన్వాడీల్లోని చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. మరోవైపు పోషకాహారలోపం ఉన్న వారికి అదనంగా డైట్ ఇవ్వాల్సి ఉన్నా, అది సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహార లోపం చిన్నారులకు శాపంలా మారుతుంది. గర్భిణులకూ నాసిరకమే.. ఏడాదిగా గర్భిణులకు సరఫరా చేసే రాగి పిండిలో ఇసుక తగులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం రాగి పిండి సరఫరా చేయడంతో ఇలా జరుగుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా చిక్కీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినది నాణ్యతగా ఉండేదని, కానీ ఇప్పుడు తినలేక పోతున్నామంటున్నారు. మరోవైపు పాలు లీటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారని, అవి ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎలా స్టోరేజ్ చేసుకుని తాగాలని ప్రశ్నిస్తున్నారు. అరలీటరు ప్యాకెట్స్ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ పాలనలో అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నిత్యావసరాలు నాణ్యతతో ఉండేలా చూశారు. ముఖ్యంగా సన్నబియ్యం సరఫరా చేయడంతో చిన్నారులు ఇష్టంగా తినేవారు. ఎవరైనా పోషకాహార లోపంలో చిన్నారులకు ఉంటే వారికి ప్రత్యేక డైట్ అందించేవాళ్లు. అలా మూడు నెలలు ఇచ్చినా బరువు పెరగకపోతే, వారికి న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)కు రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్పెషల్డైట్ సక్రమంగా అందక పోగా, ఎన్ఆర్సీ సెంటర్కు కూడా రిఫర్ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులకు బరువు తక్కువగా ఉంటూ, చలాకీగా ఉండలేక పోతున్నారు. అంగన్వాడీల్లో పిల్లలందరికీ రొటీన్ డైట్ ఇస్తాం. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటే, వారికి జీర్ణ లోపం ఉందేమో గుర్తించి, వారికి ఆహారం ఎలా పెట్టాలో తల్లికి కౌన్సెలింగ్ ఇస్తాం. స్పెషల్ డైట్ అంటూ ఏమీలేదు. – రుక్సానా, పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా -
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
సమస్యలపై చర్చ జరిగేనా?
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తొమ్మిది నెలల తరువాత శుక్రవారం జరగనుంది. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సమాచారాన్ని సంబంధిత అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. తొమ్మిది నెలల తరువాత డీఆర్సీ సమావేశం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది మూడో సమావేశం. గత డీఆర్సీ తూతూమంత్రంగా సాగింది. ఈ సమావేశంలో అయినా ప్రస్తుతం జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం అజెండాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు. రైతుల సమస్యలపై చర్చ సాగేనా..? జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు డీఆర్సీ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చ జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులకు పైరు నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ధాన్యంలో తేమ శాతం రైతులను వేధించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రైతులు పోరాటం చేసినప్పటికీ తేమశాతం తగ్గిస్తేనే కొనంటామని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీశారు. ఇప్పటికీ జిల్లాలో సగానికిపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందో, లేదో వేచి చూడల్సి ఉంది. జిల్లాలోని ప్రతి మిల్లులో తేమశాతం తగ్గించేందుకు డ్రయ్యర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. వలసలపై చర్యలేవి? కృష్ణాజిల్లా నుంచి పేదలు ఎక్కువగా వలస వెళ్తున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిం చటం లేదని గత సమావేశం దృష్టికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకువచ్చారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని మనం ఇలా సమావేశాలు నిర్వహించటం వృథా అని ఆయన తేల్చి చెప్పారు. పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది. అన్నిశాఖల అధికారులందరూ జిల్లా కేంద్రమైన బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర గత సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అయినప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో పాటు కొంతమంది అధికా రులు తప్ప ఎక్కువశాతం అధికారులు ఇప్పటికీ విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మంత్రి సూచనలు, కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారంలో చొరవ చూపొచ్చని గత సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన నేపథ్యంలో అటువంటివి ఏమీ ప్రస్తుతం జరగటం లేదు. ఈ సమావేశంలో ఈ విషయంపై ఎంత మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది. -
విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసు కురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 క్లాజ్ 23(2) సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పని సరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికీ నాలుగు నెలలైనా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటీషన్ వేయకపోవటాన్ని తప్పుపట్టారు. వెంటనే కోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా ప్రధాన కార్య దర్శి సుందరయ్య మాట్లాడుతూ.. ఆప్షన్ హాలిడే విని యోగించుకోవడంలో, రెండో శనివారం సెలవులు, ఏకోపాధ్యా యులు ఓహెచ్, ఇతర సెలవులు వినియోగించుకోవడంలో అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ కార్పొరేషన్ పరి ధిలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
ప్రైవేటీకరణను విరమించాలి
పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఐదింటిని ప్రారంభించారు. మిగిలినవి పూర్తయితే మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుతుంది. పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వైద్య విద్యకు దూరం కావాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి – మహేష్ నాయక్, విద్యార్థి, విజయవాడ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం నాగాయలంక: మాస శివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్న గంగ, పార్వతి సమేత రామలింగేశ్వరస్వామికి గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 41.9308 టీఎంసీలు. గుడివాడటౌన్: ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవాలు గురు వారం ఘనంగా ముగిశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్(విజయవాడ పశ్చిమ):వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడలో గురువారం ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన ప్రజలు జననేతకు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో గవర్నరకు తెలియజేయడానికి అభిమాన నేత నగరానికి చేరుకోవటంతో పార్టీ శ్రేణులతో పాటుగా భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు. నేతాజీ వంతెన నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేతాజీ వంతెన వద్ద వేలాది మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ సంఖ్యలో ప్రజలు వెంటరాగా పశువుల ఆస్పత్రి సెంటర్ వద్ద బందరు రోడ్డులోకి జననేత కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్దకు చేరుకుంది. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందించేందుకు తరలివెళ్లారు. దారి పొడవునా జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మిన్నంటాయి. అడుగడుగనా ఆంక్షలు.. నగరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సంద ర్భంగా అడుగడుగునా ఆంక్షలు విధించారు. బందరురోడ్డు పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంబేడ్కర్ స్మృతి వనం నుంచి గవర్నర్ బంగ్లాకు జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు, పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జననేత వెంట జనం ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆంక్షలు విధిస్తూ ఎటూ వెళ్లడానికి లేకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ సుమారు మూడు గంటల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలాది మంది ప్రజలు అనుసరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 7ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దారుణం. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు రానున్న రోజుల్లో వైద్య విద్య అందకుండాపోతుంది. ప్రభుత్వం తక్షణం ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి. వారికి వైద్య విద్యను చేరువ చేయాలి. – కై లా భరత్ భూషణ్, బీఎస్సీ విద్యార్థి, యనమలకుదురు, పెనమలూరు మండలం -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో కానుకలు లెక్కించారు. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచింది. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రాముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101 ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, 24న తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్పూర్ కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్పురి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పల్స్ పోలియోపై యూపీ హెచ్సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ ఎంలు, బూత్ వలంటీర్లకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయాలని స్పష్టంచేశారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి సంప్రదించా లని సూచించారు. జిల్లాలో 966 పోలియో బూత్లలో 2,48,900 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో వీఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ అర్జునరావు, ఏఎంఓహెచ్ డాక్టర్ బాబుశ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డీఐఓ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నగరంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల(గుణదల)లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రొత్సహించే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించిన విజేతలతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన నమూనాలను రాష్ట్ర స్థాయిలో, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామని వివరించారు. మండల స్థాయిలో గ్రూప్ ఎగ్జిబిట్స్ ఏడు చొప్పున, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు చొప్పున ప్రదర్శనలో ఉంటా యని వివరించారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
తక్షణమే విరమించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక్క పాఠశాల కానీ, కళాశాల కానీ, విశ్వవిద్యాలయం కానీ నిర్మించడం చేతకాలేదు. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. – ఎం. సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
పీపీపీపై జనకోటి కన్నెర్ర
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాu8లో గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ● ఆ ప్రతులను నేడు గవర్నర్కు అందించనున్న వైఎస్ జగన్ ● ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): మెడికల్ విద్యను పేదలకు దూరం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించి ఆ ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ను కలిసి అందించనున్నారు. జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యమానికి కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మిగిలిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి భారీ స్పందన లభించింది. రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సంతకాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ (పశ్చిమ), విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి 4.25 లక్షల సంతకాలు రాగా, కృష్ణాజిల్లా నుంచి మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల నుంచి సుమారుగా నాలుగు లక్షల ప్రజల నుంచి సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించాయి. ఆయా సంతకాల పత్రాలను 15వ తేదీన రెండు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఉద్యమిస్తున్న రాజకీయ, విద్యార్థి సంఘాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి తరగతులను సైతం ప్రారంభించారు. మరో రెండు కళాశాలలు అందుబాటులో వచ్చే సమయానికి ఎన్నికలు రావటంతో చంద్రబాబు సర్కార్ గద్దనెక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ తన అనుకూల వర్గీయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు కుట్రకు తెరలేపారు. దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉండగా అదేబాటలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వస్తున్నాయి. 7గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. అవి పూర్తయితే నాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యలో మంచి అవకాశాలు వచ్చేవి. కాని ప్రభుత్వం మారినంత మాత్రానా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గ చర్యగా భావిస్తున్నా. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణను ఆపాలి. – కుక్కమళ్ల బ్యూలా, బీటెక్ విద్యార్థి, కంచికచర్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుంది. వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. గవర్నర్ సైతం ప్రైవేటీకరణపై తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. – జి.హేమంత్, బీటెక్ విద్యార్థి, మైలవరంప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్యను దూరం చేసినట్లే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. – వెనుగుర్తి హరి, జగ్గయ్యపేటప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నరీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ బుధవారం గుడ్లవల్లేరు పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. మందుల పంపిణీ, వార్డులను పరిశీలించారు. గుడివాడటౌన్: గుడివాడలో బుధవారం సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ఉంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ల ముందు కాజేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పీడీఎస్వో ఖండిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ిపీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. యువగళం పాదయాత్రలో జీవో నంబర్ 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నిస్తున్నాం. – ఏ సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్వో -
ఎలా రద్దు చేస్తారు..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి పనులు కేటాయింపులు జరిపి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తరువాత ఎలా రద్దు చేస్తారు? నిధుల రాబడి అంచనాలు రూపొందించిన తరువాతే పనుల కేటాయింపు జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన హామీని సీఈవో లెక్క చేయటం లేదు. చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. – వేముల సురేష్బాబు, గూడూరు జెడ్పీటీసీ -
ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ
● కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ ● గత పాలకవర్గ సమావేశంలో నిలదీసినా వెనక్కి తగ్గని వైనం ● అధికారిని వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ● సీఈఓ నిర్ణయంపై భగ్గుమంటున్న పాలక వర్గ సభ్యులు సాక్షి ప్రతినిధి, విజయవాడ/మచిలీపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేస్తూ సీఈవో కన్నమనాయుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆయన పాలక వర్గం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పాలక వర్గ సభ్యులు భగ్గుమంటున్నారు. గత పాలక వర్గ సమావేశంలో పనుల రద్దు అంశంపైన సమావేశంలో గందరగోళం నెలకొంది. సీఈవో తీరును నిరసిస్తూ సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్ హామీతో సభ్యులు శాంతించారు. అయితే మరలా ఈ నెల 19వ తేదీన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తన మొండి వైఖరి విడనాడకుండా, సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతి నిధులకు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈఓను పావుగా వాడుకొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్ పాలకవర్గం ఆమోదించిన పనులకు నిధులు లేవంటూ సాకులు చూపుతూ రద్దు చేసి, ‘నేనింతే’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. పాలకవర్గంపై అక్కసుతోనే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయా సభ్యులకు కేటాయించిన రూ.12.74కోట్లకు సంబంధించి 205 పనులు నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చైర్పర్సన్కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ పాలకవర్గం వైఎస్సార్ సీపీది కావటంతో వారిపై అక్కసుతో కావాలనే ఈ రకంగా సీఈవో వ్యవహరిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. గత సర్వసభ్య సమావేశం ముందు రూ. 24.75 కోట్లకు చెందిన 424 పనులను రద్దు చేశారు. దీంతో సభ్యులు సమావేశంలో ఒక్కసారిగా సమావేశాన్ని స్తంభింపజేసి పనులను ఎందు కు నిలిపివేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రద్దు చేసిన పనులు ఇవి.. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. గుడ్లవల్లేరు, బంటుమిల్లి మండలాలకు శ్మశానవాటికలు లేవని, దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా పంచాయతీలోని ప్రజలు విన్నవించగా 25 పంచాయతీలకు టెండర్ ద్వారా పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రూ.90 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన సైతం చేసినట్లు గత జెడ్పీ సర్వసభ్య సమావేశం దృష్టికి జెడ్పీ వైస్ చైర్సర్సన్ శ్రీదేవి తెచ్చారు. గత సర్వసభ్య సమావేశంలో పనుల రద్దు విషయంలో సభ్యులు చేసిన పోరాటానికి కలెక్టర్ డీకే బాలాజీ స్పందిస్తూ చైర్పర్సన్, సీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులు ఎంత వరకు వచ్చాయి? ఏ పనులు పూర్తయ్యాయి? అనే విషయాలను చర్చిస్తామని.. అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం తుంగలో తొక్కి ఏకపక్షంగా 205 పనులను సీఈఓ రద్దు చేయడంపై సభ్యులు మండిపడుతున్నారు. పనుల రద్దు సమయంలో కలెక్టర్ ఇచ్చిన హామీనీ ఓ అధికారి, సీఈఓ దృష్టికి తీసుకొని వస్తే, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం పెట్టకుండానే నిర్ణయం తీసుకోవడం ఆయన మొండి వైఖరికి అద్దం పడుతుందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. తొలి విడత లెక్కింపులో రూ.1.27కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన కానుకల, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపులో మొత్తం రూ. 1,27,90, 645 నగదు, 18 గ్రాముల బంగారం, 2.474 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పైడమ్మతల్లి హుండీ ఆదాయం రూ.5.47లక్షలు పెడన: పట్టణ పరిధిలోని పైడమ్మ తల్లి ఉత్సవాలు ముగియడంతో బుధవారం అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించినట్లు ఈఓ గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన 70 రోజుల పైడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రూ. 5,47,633 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే 700 మిల్లీగ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయన్నారు. ఉత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డి. వాయునందన్రావు పాల్గొన్నారు. పీవీన్వీ ప్రసాదరావు పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
దుర్గగుడికి కంప్యూటర్ సామగ్రి వితరణ
మచిలీపట్నంఅర్బన్: విద్యా ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమ పరిశీలనలో భాగంగా తవిసిపూడి జెడ్పీ హైస్కూల్ను డీఈఓ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంపొందించడం, ప్రాథమిక భావనలపై పట్టు పెర గడం, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా లక్ష్య నిర్ధారణతో బోధన జరగాలన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, హాజరు శాతం, బోధన నాణ్యత మెరుగుపడేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యాస ఫలితాలను సమీక్షించారు. నోట్స్ సరిదిద్దు విధానం సహా ఇతర అకడమిక్ రికార్డులను పరిశీలించారు. గన్నవరం: సమాజానికి డ్రగ్స్ మహమ్మారి పెను సవాల్గా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు, సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో బుధవారం వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులతో ముఖా ముఖీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని తెలిపారు. తన కుమారై దీపా వెంకట్ నేతృత్వంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ఉపాధి, వైద్య సేవలందించడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు. ట్రస్ట్ సీఈఓ శరత్బాబు, కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి పాల్గొన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి అత్యాధునిక పరికరాలు అవసరమని.. ఇందుకు సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి రూ.2.80కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు. కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ వంటి విభాగాలకు వైద్య పరికరాలు అవసరమన్నారు. ఇందుకోసం రూ.2.80 కోట్లతో రూపొందించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. -
మాకేం సంబంధం లేదు!
● బీఎస్సీ(ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలపై హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ ● వర్సిటీ ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని 2021– 22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల నుంచి వచ్చిన బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ను బుధవారం కలిశారు. ప్రధానంగా 2021–22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులకు ఇంటర్న్షిప్ను ఆప్షనల్గా పెట్టాలని లేదా గరిష్టంగా ఆరు నెలలకు పరిమితం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల నుంచి ఇంటర్న్షిప్ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్న్షిప్ కారణంగా పొడిగించిన సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్షిప్ సమయంలో కనీసం నెలకు రూ.6,000 స్టైఫండ్తో పాటు వారాంతాల్లో సెలవు ఇవ్వాలని కోరారు. మేం ఏం చేయలేం.. విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించకపోవటంతో పాటు తాము ఏం చేయ లేమని స్పష్టం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేయమని తాము చెప్పలేదని, కనుక తమకు సంబంధం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి స్టైఫండ్ రిలీజ్ చేయడం కుదరదని పేర్కొన్నారని చెప్పారు. దాంతో విద్యార్థులు బయటకు వచ్చి యూనివర్సిటీ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. -
రివర్స్ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయించింది.సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం. ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. -
ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్టు
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఐ జె.వెంకటరమణ కథనం మేరకు..పెదపులిపాక గణపతినగర్లోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. స్పందించిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడిచేసి గంజాయితో ఉన్న కానూరు మురళీనగర్కు చెందిన చెందిన జువ్వనపూడి శశికాంత్, ఉయ్యూరు వెంకటవంశీకృష్ణ, ప్రసాదంపాడుకు చెందిన వి.దుర్గారావు, ఆకుల వెంకటమాధవ్, పెదపులిపాక గణపతినగర్కు చెందిన ఆకులపల్లి మౌనిక, పెనమలూరు పల్లిపేటకు చెందిన గోగం ఫణికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల వద్ద 2,250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరంలో గంజాయి స్మగ్లర్ అరెస్టు కోనేరుసెంటర్(మచిలీపట్నం): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పూణేకు చెందిన దీపక్ తుపే ఒడిశాలో రాజ్కుమార్, సురాన్కర్ణ వద్ద 112 కిలోల గంజాయి కొన్నాడు. పూణేలో వైష్ణవిలవన్కు అందిం చేందుకు కారులో ఒడిశా నుంచి బయలుదేరాడు. దీపక్ తుపే గన్నవరం సమీపంలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద చేరుకున్న సమయంలో పోలీ సులు వాహనాలను తనిఖీచేస్తుండటంతో కంగారుపడ్డాడు. అతడిని గమనించిన గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ కారును తనిఖీ చేయగా రూ.5.60 లక్షల విలువైన 112 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపక్ తుపేపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒడి శాకు చెందిన రాజ్కుమార్, సురాన్కర్ణ, పూణేకు చెందిన వైష్ణవిలవన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్ను పట్టుకున్న గన్నవరం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బి.వి.శివప్రసాద్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్– నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూ లుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
ఘనంగా దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు అందరూ సమాజంలో మంచి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు సూచించారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నీరీ కాలనీలో ఓ ఫంక్షన్ హాలులో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడుకొండలరావు కోర్సు పూర్తి చేసిన 25 మంది దంత వైద్య విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలో సౌర విద్యుత్ వినియోగం యాభై శాతానికే పరిమితమైందని, ఇంకా పెరగాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు పేర్కొన్నారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సింటిలా–2025 పేరుతో సిద్ధార్థ ఆడిటోరియంలో భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులకు పోటీలు బుధవారం జరిగాయి. విజయభాస్కరరావు అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. బొగ్గు ఆధా రిత విద్యుత్, జలవిద్యుత్లతో పోలిస్తే సోలార్ ఎనర్జీ పర్యావరణహితమని తెలిపారు. ఎయిర్ కండీషనర్లు, గ్రీజర్లు వంటి విద్యుత్ పరికరాలు, సెల్ ఫోన్ల వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్టు ఇంజినీర్ జి.సుమంత్, అసిస్టెంట్ ఇంజినీర్ చైతన్య మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయిలో ఎనర్జీ కన్జర్వే షన్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభ అనంతరం విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మనోరంజని, ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ టి. శ్రీనివాసకృష్ణ, డెప్యూటీ హెడ్ తస్నీమ్, అధ్యాపకులు జె.పాండురంగారావు, ఎస్.విజయకృష్ణ, ఎన్.రాజశేఖర్, ముష్వరీన్, టి.పూజిత పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ తాపీ కార్మికుడి మృతి అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి పడి తాపి కార్మికుడి మృతిచెందిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన కొండపోగు ఉదయ్కుమార్(37) తాపీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. దేవినగర్లో చేపట్టిన భవన నిర్మాణ పనులకు వారం రోజుల నుంచి వెళ్తున్నాడు. మంగళవారం ఆ భవనం మూడో అంతస్తులో పనులు చేస్తూ ప్రమాదవు శాతు అక్కడి నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్కుమార్ను తోటి కార్మికులు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జనశిక్షణ సంస్థాన్ ద్వారా అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ తీసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్థి అధికారి ఎస్.శ్రీనివాసరావు సూచించారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో కెపాసిటీ బిల్డిం పోగ్రామ్ బుధవారం జరిగింది. ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనశిక్షణ సంస్థాన్ నేటి అవసరాలకు తగినట్లుగా యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ (ఐపీఓ) కె.రవికుమార్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తీసుకున్న యువకులు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన పెంచుకుని కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి చూపొప్చని పేర్కొన్నారు. జనశిక్షణ సంస్థాన్ చైర్పర్సన్ ఎన్.విదాకన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ పాల్గొన్నారు. -
ప్రకృతి సాగు ఫలప్రదం
●వ్యవసాయ క్షేత్రమే పొలమే ప్రయోగశాల ●ప్రకృతి సాగుతో రసాయన ఎరువులకు స్వస్తి ●సొంతగా సేంద్రియ ఎరువుల తయారు పెనుగంచిప్రోలు: మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఊరుగుండ్ల గోవర్ధన ప్రకృతి వ్యసాయానికి శ్రీకారం చుట్టారు. విభిన్న పంటలు సాగుచేస్తూ, వ్యవసాయ ఉత్పత్తులను సొంతంగా విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల క్రితం కశ్మరీ యూపిల్ బేర్ సాగుచేసి మంచి లాభాలు ఆర్జించారు. గత ఏడాది రెడ్గోల్డ్, మిక్స్ ఇండియా, బాల సుందరి అనే మూడు రకాల యాపిల్బేర్ పండ్లు మొక్కలు కోల్కత్తా నుంచి తీసుకొచ్చి తనకు ఉన్న 40 సెంట్ల పొలంలో నాటాడు. మరో ఎకరం కౌలుకు తీసుకుని కాకర, పొట్ల కూరగాయలు పండిస్తున్నాడు. ఎకరానికి 600 మొక్కలు నాటేందుకు కావాల్సి ఉండగా అర ఎకరంలో 300 మొక్కలు నాటాడు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. రోజుకు 80 నుంచి 100 కిలోలు దిగుబడి యాపిల్బేర్ తోటలో ఈ ఏడాది కాపు మొదలై దిగుబడి ప్రారంభమయింది. ఫిబ్రవరి వరకు దిగుబడి వస్తుందని రైతు గోవర్ధన తెలిపారు. రోజుకు 80 నుంచి 100 కిలోల దిగుబడి వస్తోంది. కాయలు నాణ్యంగా, తీపిగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. యాపిల్ బేర్ పండ్లను గోవర్ధన వ్యాపారులకు విక్రయించకుండా బైక్పై స్వయంగా గ్రామాల్లో తిరిగి విక్రయిస్తున్నారు. పెనుగంచిప్రోలుతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, ఖమ్మం జిల్లాలోని మధిరకు వెళ్లి విక్రయస్తూ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఎక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసినా తన పండ్లను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. బైక్కు కూడా తాను చేసే ప్రకృతి వ్యవసాయం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆసక్తి కనపరచటంతో పాటు రసాయన ఎరువులు వాడకుండా పండించిన పండ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. పొలంలోనే సేంద్రియ ఎరువుల తయారీ గోవర్ధన తన పొలంలో ఆవుపేడ, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను, గోమూత్రాన్ని పులియబెట్టి జీవామృతం తయారు చేసి పొలంలో చల్లుతున్నారు. గోమూత్రం, శనగపిండి, బెల్లం ముద్దలు చేసి ఘన జీవామృతం బంతులుగా చేసి మొక్కల మొదట్లో వేస్తున్నారు. పండు ఈగ, ఇతర పురుగులు, రోగాలు రాకుండా నీమాస్త్రం పులియబెట్టిన మజ్జిగ, వెల్లుల్లితో పాటు పొగాకు, జిల్లేడు మొదలైన పది రకాల ఆకులతో తయారు చేసిన అగ్నాస్త్రం స్ప్రే చేస్తూ పూర్తిగా సేంద్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారు. పందిరి విధానంలో కాకర, పొట్ల సాగు యాపిల్బేర్తో పాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా పందిరి విధానంలో గోవర్ధన కాకర, పొట్ల సాగు చేస్తున్నానే. స్టార్ కాకర వారానికి క్వింటా చొప్పున దిగుబడి వస్తోందని, మార్కెట్లో బోర్డు రేటు కిలో రూ.48గా ఉందని తెలిపారు. పొట్ల కాపు దశలో ఉందన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కూరగాయలు చాలా నాణ్యంగా ఉంటాయన్నారు. స్థానికంగా ఉండే మార్కెట్లకు వెళ్లి విక్రయిస్తున్నానన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో వ్యవసాయ ఉత్పత్తులు కలుషితం అవుతున్న వేళ తాను పెద్దగా చదుకోక పోయినా సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించటానికి తనవంతు కృషి చేస్తున్నానని రైతు తెలిపారు. గతంలో బావుల్లో వరలు దింపే పనులు, ఇతర పనులకు వెళ్లేవాడిని. రెండేళ్ల నుంచి యాపిల్ బేర్ పండ్లు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కొత్తరం యాపిల్ బేర్ పండ్లు దిగుబడి వస్తోంది. ఖర్చులు పోను ఆదాయం బాగానే ఉంది. వచ్చే ఏడాది మరో ఎకరం కౌలుకు తీసుకుని సాగు పెంచుతాను. నీళ్లు నిలబడకుండా ఉండే పొలం యాపిల్ బేర్ సాగుకు బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయల ధరలు కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయి. – ఊరుగుండ్ల గోవర్ధన, రైతు -
లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక ఎంఎస్ఎంఈ వ్యవస్థ లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి హౌసింగ్స్లో ఏర్పాటు చేసిన ఈ శాఖను జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ మోహన్ సుందరం ఏపీ అధ్యక్షుడు తులసీ యోగీష్ చంద్రతో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ సుందరం మాట్లాడుతూ.. లఘు ఉద్యోగ భారతి దేశం వ్యాప్తంగా 68 వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎంఎస్ఎంఈ సంస్థని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా కార్యవర్గం ఇదే.. లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, కార్యదర్శిగా చెరుకూరి చాముండేశ్వరి, జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ తరుణ్ కాకాని, ఉపాధ్యక్షులుగా టి.వెంకట నాగేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, శ్రీరామ్, కార్యదర్శులుగా జె.అభినయ్కృష్ణ, యార్లగడ్డ హరీష్, కార్యనిర్వాహక సభ్యులుగా దొడ్డపనేని కల్యాణ్ కృష్ణ, ప్రణీత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్త ట్రాక్టర్ దగ్ధం
బూదవాడ(జగ్గయ్యపేట): గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బాణావత్ నాగరాజుకు చెందిన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నాగరాజు ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఇంటి బయట ట్రాక్టర్ను నిలిపి ఉంచాడు. బుధవారం తెల్లవారు జామున నిత్ర లేచి చూసే సరికి ట్రాక్టర్ పాక్షికంగా తగలబడి ఉండటాన్ని గమనించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గ్రామానికి చేరుకుని ట్రాక్టర్ను పరిశీలించి నాగరాజును పరామర్శించారు. కుటుంబానికి జీవనాధారమైన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయటం బాధాకరమన్నారు. నిందితులను పోలీసులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ బూడిద నరసింహారావు, నాయకులు పరిటాల పెద్ద సైదులు, భూక్యా గోపి, బాలకోటి, సతీష్ తన్నీరుతో పాటు బాధితుడిని పరామర్శించారు. రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు రింగ్ సెంటర్లో గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. రింగ్ సమీపంలోని ఏలూరు నాన్స్టాప్ బస్ స్టాండ్ సమీపంలో సుమారు 35 ఏళ్ల యువకుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 16వ తేదీన ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ఆ యువకుడిని గర్తించిన కండెక్టర్ రామవరప్పాడు రింగ్ వద్ద దింపివేశాడు. అప్పటి నుంచి బస్స్టాప్లోనే పడుకున్న యువకుడు బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. మృతుడి వంటిపై బ్లూకలర్ స్వెట్టర్ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. పెనమలూరు: మండలంలోని గంగూరు గ్రామంలో ఓ వృద్ధుడు చెట్టుపై నుంచి కొందపడి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన మద్దాల విల్సన్ (70) చెట్లు నరుకుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు. అతను మంగళవారం గంగూరు అంబేడ్కర్నగర్లో ఆర్సీఎం చర్చి వద్ద వేప చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని నరకటా నికి వచ్చాడు. అతను చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విల్సన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్జంక్షన్ రూరల్: చెన్నయ్ – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండ లంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డులో కె.సీతారామపురం వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న పేరం వెంకట రాజేష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరం వెంకట రాజేష్ను ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయిన పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో డెలివరీ బోయ్గా పనిచేస్తున్నాడని, మరో వ్యక్తితో కలిసి బైక్పై ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి (40) ఆచూకీ తెలియాల్సి ఉంది. దీనిపై హను మాన్జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరవల్లి పోలీస్స్టేషన్ పరిధిలో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు 45 సంవ త్సరాలు ఉంటుందని, మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, దీంతో అతను ఎవరో గుర్తించటం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. మృతుడు దుస్తులు ధరించకపోవటంతో యాచకుడు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రఘురామను సస్పెండ్ చేయకుండా వదిలేస్తారా?
సాక్షి, విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చట్టం ముందు అందరూ సమానమేనని.. అలాంటప్పుడు తన సస్పెన్షన్ విషయంలో జరిగింది అవతలివాళ్లకు కూడా వర్తించాలి కదా? అంటూ ఆయన ఓ సూటి ప్రశ్న సంధిస్తూ పోస్ట్ చేశారు. మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కీ. రఘురామకృష్ణరాజు కస్టడీలో హింసకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు కూడా పిలిచారు. అయితే.. ‘‘నన్ను సస్పెండ్ చేశారు మంచిదే. కానీ దర్యాప్తు న్యాయంగా జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి తొలగించాలి కదా. అని ఆయన పోస్ట్ చేశారు. ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయని.. రఘురామకృష్ణరాజు పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను పదవుల నుండి తొలగించాలని.. తద్వారా చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ ఉంచారు.ఇదీ చదవండి: ఫ్రాడ్ కేసులో రఘురామకు భారీ షాక్ -
పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్ గేమ్లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్లకు బానిసయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ జి.అజయ్కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం -
నీడ లేకుండా చేశారు
కుటుంబంతో ఒకటో నంబరు ప్లాట్లో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నా. ప్లాటుకొనుగోలు చేసే సమయంలో లీగల్ ఓపీనియన్ తీసుకున్నాం. ఎవ రికై నా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేపరు ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి రూ.70 లక్షలతో ప్లాటు కొనుగోలు చేశాం. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఇంటి నిర్మాణం చేపట్టాను. ఇప్పుడు కొందరు గద్దల్లా వాలిపోయారు. 42 ప్లాట్లలో ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి, మాకు నిలువ నీడ లేకుండా చేశారు. – విద్యాసాగర్, బాధితుడు, జోజినగర్ -
మా కోసం పోరాడతానన్నారు
మా ఇళ్లు కూల్చివేత తరువాత న్యాయం చేయాలని కోరుతూ కలవని ప్రజాప్రతినిధి లేరు. కనీసం ఘటనా స్థలానికి వచ్చిన వారు లేరు. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లి కలిశాం. మా బాధలను ఆలకించిన ఆయన మా ప్లాట్ల వద్దకు వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్మోహన్రెడ్డి వచ్చారు. నలభై రెండు మందికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారు పేరైన ఆయన మాలో నమ్మకం కల్పించారు. మా గుండెల్లో బాధను తగ్గించారు. – గోదావరి గంగ, బాధితురాలు -
చెట్టుకింద ఉంటున్నాం
జోజినగర్ 42 ప్లాట్లలో మాది 29వ ప్లాటు. 2001లో కొనుగోలు చేశాం. ఇంటి పన్నులు కూడా చెల్లించాం. మూడేళ్ల క్రితం రూ.30 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. స్టే ఉండగానే నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మా బాధ చెప్పుకొనేందుకు ఎయిర్ పోర్టు, ఇంటి వద్ద రెండు సార్లు జగనన్నను కలిశాం. పరామర్శకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చారు. మా తరఫున ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. మాకు ధైర్యం ఇచ్చారు. జగనన్నకు రుణపడి ఉంటాం. – యమున, బాధితురాలు -
సబ్జైలులో జిల్లా జడ్జి తనిఖీలు
అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు జననేత భరోసా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘నేనున్నా.. మీకు తోడుగా ఉంటా’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యం నింపింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి, ప్రభుత్వ ఆదరణకు నోచుకోని బాధితులు జననేత ఆత్మీయ పరామర్శతో సాంత్వన పొందారు. బెజవాడ జోజినగర్లో చంద్ర బాబు ప్రభుత్వం అండతో 42 ప్లాట్లలో ఇటీవల అక్రమంగా కూల్చివేతకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జోజినగర్ చేరుకున్న జననేతకు బాధితులు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వినిపించారు. రెక్కల కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని పాతికేళ్లుగా నివ సిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్లాట్లు తమవి కావంటూ తమ ఇళ్లను ఒక్కసారిగా బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డుపాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డి సుమారు గంటకు పైగా ఆయా కుటుంబాలను ఓదార్చారు. ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకున్నారు. స్థలాలను ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంతకు కొన్నారు, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ తీసుకున్న తీరును, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జోజినగర్ 42 ప్లాట్ల ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ఆయా బాధిత కుటుంబాలు ఉన్న టెంట్లోకి వెళ్లి వారితో పాటు కూర్చుని వారి బాధలను ఓపికగా ఆలకించారు. ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి పోలీసు సిబ్బందితో తమను రోడ్డుపాలు చేసిందంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము దశా బ్దాల క్రితం కష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అన్ని అనుమతులతో నిర్మించుకుని పాతికేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వం దగ్గరుండి కూల్చివేసి మోసగాళ్లకు కొమ్ముకాసిందని జగన్ వద్ద వాపోయాయి. తమ స్థలాలకు పన్నులు కట్టించుకుంటూ, ఇంటి నిర్మాణానికి ప్లాన్లతో ఆమోదం తెలిపి, విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాలను ఎవరో వస్తే వారికి అండగా నిలిచి దోచి పెట్టిందని బాధితులు విలపించారు. జననేత కోసం తరలివచ్చిన జనసందోహం జోజినగర్కు వచ్చిన తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడటానికి, కలిసి మాట్లాడటానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జోజినగర్ పరిసరాలు మారుమోగాయి. భారీ జన సందోహం కారణంగా కారు దిగిన జగన్మోహన్రెడ్డి పక్కనే బాధిత కుటుంబాలు ఉన్న టెంట్ వద్దకు చేరుకోవడానికి 15 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, జోగి రాజీవ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వీఎంసీ ఫ్లోర్లీడర్ అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, కోటిరెడ్డి, షేక్ రెహమతున్నీసా, బండి నాగేంద్ర పుణ్యశీల, గోదావరి గంగ, శిరంశెట్టి పూర్ణ, సహాయ కార్యదర్శి షేక్ హాయత్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవితాలతో బెట్టింగ్ ఆట
జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్ గేమ్లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్ గేమ్లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్ గేమ్లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్లైన్ గేమ్లు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్లకు డబ్బుల కోసం లోన్ యాప్ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. -
కుంగ్ఫూలో తేజ్వీర్కు స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: తండ్రి క్రీడా విజయాల బాటలో కుమారుడు కూడా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన అంతర్జా తీయ కిక్బాక్సింగ్ విజేత చలాది సతీష్ కుమారుడు చలాది తేజ్వీర్ (09) కుంగ్ఫూలో జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించాడు. ఈ నెల 14న చిలకలూరిపేటలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ నేషనల్ లెవల్ కుంగ్ఫూ, కరాటే చాంపియన్షిప్ 2025లో 25 కిలోల లోపు కాటా ఈవెంట్లో తేజ్వీర్ జాతీయ విజేతగా నిలిచి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. తేజ్వీర్ తండ్రి సతీష్ గత ఏడాది న్యూఢిల్లీలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్బాక్సింగ్ ఇండియా (వాకో) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పత కాలు సాధించారు. ఇప్పుడు అతని కుమారుడు జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: స్థానిక బైపాస్రోడ్డు హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మంగళవారం రాత్రి జరిగింది. మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ చేపట్టిన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర’ బందరుకు చేరిన సందర్భంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఏర్పాటును తొలుత టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోటీగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు యత్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని జనవరి 18న ఆవిష్కరిస్తారని సమాచారం. -
జియోడెటిక్ అసెట్ మ్యాప్ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కచ్చితమైన పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జియోడెటిక్ అసెట్ రిజిస్టర్లో గ్రేట్ ట్రిగ్నో మెట్రికల్ సర్వే స్టేషన్స్ (జీటీఎస్), గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ), స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ (ఎస్బీఎం), గ్రావిటీ రిఫరెన్స్ స్టేషన్స్, మ్యాగ్నెటిక్ రిపీట్ స్టేషన్స్, టైడల్ అబ్జర్వేటరీస్ వంటి ఆరు అసెట్స్ ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా సర్వే, మ్యాపుల రూపకల్పన మెరుగ్గా చేయవచ్చని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వామిత్వ, నక్ష, అమృత్, ఏపీ రీ సర్వే వంటి కీలకమైన ప్రాజెక్టులలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మొదటిసారిగా తెలుగులో రూపొందించిన రాష్ట్ర పటాన్ని (మ్యాప్ను) కలెక్టర్కు అందజేశారు. -
ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీవీ సత్యనారాయణ, డీన్ డాక్టర్ మణి, కళాశాల కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. 75ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటుకు సహకరించిన వారందరూ రైతులు కావడంతో రైతులను స్మరించుకుంటూ తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఏరువాక సాగారో.. అనే చిన్నారుల నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనదేశంలో 15వేల మిలియన్ ఎకరాలలో పంటను పండిస్తే 145 కోట్ల మందికి భోజనం దొరుకుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల లోటు ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణవైపు రైతు దృష్టిపెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్ఎస్ పద్మజ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మ్యాజిక్ బస్తో కేయూ అవగాహనా ఒప్పందం
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. అనంతరం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వైకే సుందరకృష్ణ, మ్యాజిక్ బస్ సంస్థ నుంచి డీజీఎం డి. శేఖర్బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు. -
నిలిచిన సహకార సేవలు
పెనుగంచిప్రోలు: సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఆ దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ముందు సంఘాలకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రం అందించటం, 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం, జనవరి5, 2026నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలను జేఏసీ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 2,000 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 425 సహకార సంఘాల్లో రెగ్యులర్, రోజువారీ వేతనంతో పనిచేసే మొత్తం 2000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ధర్నాలో పాల్గొనటంతో సంఘ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో సహకార కేంద్రాల ద్వారా రోజు రూ.కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు, ధాన్యం అమ్మినవారు డబ్బులు చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో 8న, 12న రెండు రోజులు తాళాలు వేశారని రైతులు అంటున్నారు. మంగళవారం కూడా సంఘాల్లో ఉద్యోగులు లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బంగారు రుణాల కోసం పదుల సంఖ్యలో రైతులు బ్యాంకు ల వద్దకు వెచ్చి వెనుదిరగడం కనిపించింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు -
లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగికి రిమాండ్
విజయవాడలీగల్: గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్ నగేష్బాబుకు న్యాయమూర్తి ఈ నెల 30 వరకూ రిమాండ్ విధించారు. వివరాలివి.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జునకు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నగేష్బాబు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగార్జున అవినీతి నిరోధక శాఖ అధికారుల(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని మంగళవారం అవినీతి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి పి.భాస్కరరావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయ వాడ జిల్లా జైలుకు తరలించారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప తండాలో మంగళవారం కిడ్నీ రోగి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన భూక్యా సత్యం(47) పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఏకొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన సత్యం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వివాహమైన తదుపరి వినగడప తండాలో నివసిస్తూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటి కారణంగా కిడ్నీవ్యాధికి గురైన సత్యం నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో, తదుపరి తిరువూరులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. గత శనివారం తిరువూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేస్తున్న సమయంలో అతనికి రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన సత్యంను విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలే పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సత్యం కుటుంబం అతని చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
జగనన్న రాకతో ధైర్యమొచ్చింది..!
జగనన్న అంటే ప్రజల గళం.. జగనన్న అంటే ప్రజల బలం.. జగనన్న అంటే ప్రతి ఇంటి వెలుగు.. జగనన్న అంటే ప్రతి మనసు నమ్మకం.. జగనన్న అంటే ప్రజల ఆశ.. జగనన్న అంటే ప్రజల విజయం.. జగనన్న అంటే మన అందరి భవిష్యత్తు.. ఓవరాల్గా చెప్పాలంటే జగనన్న అంటే ప్రజల ధైర్యం.విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు సైతం ఇదే ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ వద్దకు జగనన్న రావడంతో ధైర్యమొచ్చిందన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే చేస్తారనే నమ్మకం ఆయన కల్పించారని ఆ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందనే బాధను దిగమింగుతూనే జగనన్న రాక ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే జగనన్న తమ వద్దకు వచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితుల్ని నేడు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో 42 మందిని అన్యాయంగా రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. కాగా, విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని ఈరోజు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. ఇవీ చదవండి:బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్జోజిగనర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ -
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
రాజేష్తో వైఎస్ జగన్ స్పెషల్ సెల్ఫీ
సాక్షి, కృష్ణా జిల్లా: జనాల్లో ఉన్న వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల ప్రేమను గౌరవంగా తీసుకుని, వారితో దగ్గరగా కలిసిపోవడం ఆయన శైలి. ఆ అభిమానానికి ఆయన ప్రతిస్పందన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అలా.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న జగన్ మరోసారి అలాంటి అభిమానాన్ని గౌరవించారు. విజయవాడ జోజి నగర్ బాధితులను స్వయంగా పరామర్శించేందుకు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ సమయంలో గన్నవరం ఎయిర్పోర్టు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే..ఓ అభిమాని ముందస్తుగా వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన దృష్టిని ఆకర్షించగలిగారు. దీంతో ఆ అభిమాని దగ్గరకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. తనపేరు గోసాల రాజేష్ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. ఆయనతో ఫొటో దిగడమే కోరి అని చెప్పాడా వ్యక్తి. దీంతో.. వైఎస్ జగన్ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాజేష్ మురిసిపోయాడు. -
జోజి నగర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి. ‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్తగా ఎంపికై న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ఎంపికై న 242 మంది కానిస్టేబుళ్లను ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించారు. వారికి తొమ్మిది నెలల పాటు ఇవ్వనున్న శిక్షణపై సోమవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు కేటాయించిన 172 మంది పురుషులు, 70 మంది మహిళా కానిస్టేబుళ్లతో సమావేశమైన సీపీ శిక్షణా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. పోలీస్ ఉద్యోగం అనేది ఒక బాధ్యతతో కూడినదని, మీరు ఇక నుంచి ఎక్కడకు వెళ్లినా చాలా హుందాగా వ్యవహరించాలన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుందని, ఈ శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతోపాటు, టెక్నాలజీపై పూర్తి పట్టు సాధించాలని చెప్పారు. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఈ శిక్షణా కాలంలో సాధించిన మార్కుల ఆధారంగానే పదోన్నతులు ఉంటాయన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులతో ముఖ్యంగా మహిళా బాధితులతో సామరస్యంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్లకు టీ షర్ట్, కిట్ను అందించారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, ఎంపికై న కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
శరణు తిరుపతాంబ
పెనుగంచిప్రోలు: ఓం శ్రీఅమ్మయే శరణం తిరుపతాంబ.. ఓం శ్రీస్వామియే శరణం గోపయ్య.. అంటూ పెనుగంచిప్రోలు మార్మోగింది. స్థానిక శ్రీతిరుపతమ్మవారి మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఎదుట ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ప్రధానార్చకులు మర్రెబోయిన గోపిబాబు సమక్షంలో ఆలయ అర్చకుడు ముందుగా మాల వేసుకుని ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు మాల వేసుకున్నారు. అర్చకులు వచ్చిన భక్తులకు మాలలు వేశారు. మొదటి రోజు సుమారు 1000మందికి పైగా స్వాములు మాలలు వేసుకున్నారు. మాల వేసుకున్న దీక్షాస్వాములకు సింగరాయకొండకు చెందిన కొత్తకోట వెంకట్రావు ప్రసాదాలు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ రాజు, లక్ష్మణ్, నాగేశ్వరరావు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో తిరుపతమ్మ మండల దీక్షలు ప్రారంభం -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక
గన్నవరం: మండలంలోని చిన్న అవుటపల్లిలో ఉన్న డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయి మహిళల బాస్కెట్బాల్ జట్టును ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 12మంది విద్యార్థినులను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టులో పిన్నమనేని వైద్య కళాశాల నుంచి నలుగురు, నర్సింగ్ కళాశాల నుంచి ఒకరు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ తెలిపారు. హెల్త్ యూని వర్సిటీ క్రీడా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, పీడీ దేవినేని రవి తదితరులు పాల్గొన్నారు. -
చల్లపల్లిలో కారు బీభత్సం
చల్లపల్లి: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. పెనమలూరు: మహిళకు కారు నేర్పుతున్న వ్యక్తిని అదే కారు ఢీ కొట్టడంతో మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకరమణ తెలిపిన వివరాల ప్రకారం నిడమానూరుకు చెందిన పాతూరు సుబ్బారావు(62) అదే గ్రామానికి చెందిన తోటకూర కవితకు ఆదివారం నారాయణపురం కాలనీ వద్ద కారు డ్రైవింగ్ నేర్పించసాగాడు. అతను కారు దిగి కారు ఎలా నడపాలో ఆమెకు వివరిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కారు వేగంగా నడిపి రోడ్డుపై ఉన్న సుబ్బారావును ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. చికిత్స పొందుతున్న సుబ్బారావు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్, లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
కోర్టు కానిస్టేబుళ్లకు సన్మానం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరిగిన జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించటంతో కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బందిని జిల్లా ప్రధానన్యాయమూర్తి జి. గోపీ సోమవారం ఆయన చాంబర్లో ఘనంగా సత్కరించారు. కృష్ణాజిల్లా న్యాయశాఖ సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా కోర్టుల్లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లను న్యాయమూర్తి సత్కరించారు. జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.వేణుగోపాల్, కార్యదర్శులు సీహెచ్ నరసింహారావు, గోపీనాథ్, ఏవో పి. శ్రీదేవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అమరజీవి త్యాగం చిరస్మరణీయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నూతన కౌన్సిల్ 51వ కృష్ణా జిల్లా సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కనకరావు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరగనున్న నూతన కౌన్సిల్ సమావేశ నిర్వహణకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యులను కూడా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు ఎండీ షౌకత్ హుస్సేన్, గౌరవాధ్యక్షుడు జె. లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీని వ్యతిరేకిస్తూ ప్రస్ఫుటమైన ప్రజాగ్రహం
ప్రజా కలం.. నిరసన గళమై నినదించింది.. సంతకాల రూపంలో తమ అభీష్టాన్ని ప్రస్ఫుటం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సహించబోమని చాటి చెప్పింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏకంగా 4.21లక్షల మంది సంతకాలు చేశారు. ఈ ప్రతులను సోమవారం విజయవాడ నుంచి భారీ ర్యాలీ నడుమ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. కోటి సంతకాల వినతి పత్రాలతో కూడిన వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలుర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చిత్రంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తదితరులుర్యాలీలో పాల్గొన్న అవినాష్, వెలంపల్లి, జగన్మోహనరావు, స్వామిదాసు ఎమ్మెల్సీ అరుణకుమార్, మేయర్ భాగ్యలక్ష్మి, జోగి రాజీవ్, షేక్ ఆసిఫ్ తదితరులులబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు నిర్వహించిన ర్యాలీ ఆద్యంతం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన 4.21 లక్షల సంతకాల ప్రతులను విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామణిసెంటర్ వరకూ నిర్వహించిన ర్యాలీలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు విజయవాడ పశ్చిమ ఇన్చార్జి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువూరు ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, నందిగామ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, మైలవరం నుంచి జోగి రాజీవ్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, ఎండీ రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కడియాల బుచ్చిబాబు ర్యాలీలో ముందు నడువగా, వెనుక ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు అనుసరించారు. శిఖామణి సెంటర్ వద్ద సంతకాల పత్రాలు ఉన్న లారీని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ ఇతర సమన్వకర్తలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అన్ని నియోజవర్గాల నుంచి రాక.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 21 డివిజన్ల నుంచి వేలాది మంది ప్రజలు ర్యాలీకి తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ర్యాలీ ప్రారంభమయ్యే ప్రాంతానికి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీగా వచ్చి చుట్టుగుంట సెంటర్లో కలిశారు. విజయవాడ పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నుంచి కూడా భారీగా ప్రజలు తరలివచ్చారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే.. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 4,21,217 మంది సంతకాలు చేశారని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గకపోతే, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సంతకాలు మొత్తాన్ని ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కి అందజేస్తామని ప్రకటించారు. కుట్రలు తిప్పి కొట్టాలి.. పేదలకు అన్యాయం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుతంత్రాన్ని తిప్పి కొడతామని జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకొని ఇప్పటికై నా ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమమే.. తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించి కోటి సంతకాలు కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారని చెప్పారు. ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు అంటే మామూలు విషయం కాదని చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు.. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు షేక్ ఆసిఫ్, ఇంటూరి రాజగోపాల్, సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కంపూడి గాంధీ, అప్పిడి కిరణ్కుమార్రెడ్డి, విజయవాడ డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో పాటు విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు, పార్టీ నేతలు, జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీకి వచ్చిన వారికి మైలవరం,పెనమలూరు నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. -
మహోద్యమంగా ఇంధన పొదుపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన పొదుపును మహోద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సమష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర – 2047 దిశగా అడుగులు వేద్దామన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు–2025 (డిసెంబర్ 14–20)లో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్టేడియంలో ఇంధన పొదుపుపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ నాగలక్ష్మి, కలెక్టర్ లక్ష్మీశ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, నెడ్క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీపీడీసీఎల్.. బీఈఈ సౌజన్యంతో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులతో కలిసి జాతీయ ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృథా కాకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తానని.. విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానంటూ ప్రతిజ్ఞ చేయించారు. జెన్కో ఎండీ నాగలక్ష్మి మాట్లాడుతూ... ప్రతి వ్యక్తీ, సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని.. భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటికే 1,400 వరకు వాణిజ్య భవంతులు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు. ప్రతి ఇల్లూ సూర్యఘర్ కావాలి.. ఇంధనాన్ని వృథా చేస్తే డబ్బును వృథా చేసినట్లేనని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ – సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఏపీ ట్రాన్స్కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్ మాట్లాడుతూ ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ఒక యూనిట్ను ఆదా చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేసేనట్లేనని పేర్కొన్నారు. నెడ్క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు.. మాట్లాడుతూ విద్యుత్ పరిరక్షణలో ఏపీ నంబర్ 1గా ఉంటోందని, మిషన్ మోడ్లో విద్యుత్ పొదుపు కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీలు, సమావేశాలు తదితరాలతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలతో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
లబ్బీపేట(విజయవాడతూర్పు): భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజుల పాటు ఆమరణదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు సేవలు మరవలేనివని, ఆయన ఆశయాలను, సేవలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదామన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఆత్మార్పణ చేసిన మహనీయులన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
అక్కినేని వజ్రోత్సవ వైభవం
గుడివాడరూరల్: గుడివాడలో విద్యా రంగానికి పెన్నిధి అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల నిలిచింది. మొదటి 1950లో గుడివాడ కళాశాలగా ప్రారంభమై నేడు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెంది 75 ఏళ్లు (వజ్రోత్సవాన్ని) పూర్తి చేసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం వజ్రోత్సవ కమిటీని ఏర్పాటు చేసి గత నెలరోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకల్లో స్వర్గీయ అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భారీగా హాజరు కానున్నారు. కళాశాల ఏర్పాట్లు బీజం పడింది ఇలా.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతుబిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా, ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారికి డిగ్రీ కోర్సులను అందుబాటుకి తీసుకురావాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో కళాశాలకు పునాది పడింది. విశాఖపట్నంలోని యూనివర్సిటీ వారిని అప్పటి ప్రముఖులు కలసి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుడివాడ, కై కలూరు, గన్నవరం ప్రాంతాల్లోని ప్రముఖులతో 1950 ఏప్రిల్ 22వ తేదీన శ్రీనివాస సినిమా హాల్లో సమావేశం నిర్వహించారు. పర్వతనేని వెంకటరత్నం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కాజ వెంకట్రామయ్య, సంయుక్త కార్యదర్శిగా వేములపల్లి రామబ్రహ్మం, కోశాధికారిగా ఉప్పలపాటి వీరభద్రరావు, సభ్యులుగా వడ్డే శోభనాద్రి, లింగం వెంకటకృష్ణయ్య, ఉపద్రష్ట పాపన్నశాస్త్రిలతో గుడివాడ కళాశాల ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటైంది. 1959లో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వారి మిత్రులు రూ.లక్ష కళాశాలకు విరాళంగా ఇవ్వడంతో అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెందింది. ల్రైబరీతో పాటు మెయిన్ బిల్డింగ్ను ఏర్పాటు చేయించి నిర్వహణ ప్రారంభించారు. 1961లో ముదినేపల్లికి చెందిన యెర్నేని వెంకటేశ్వరరావు రూ.54 వేలు విరాళం ఇవ్వగా ఆయన తండ్రి పేరు యెర్నేని చలమయ్య ఆడిటోరియం నిర్మించారు. కాలానుగుణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి కళాశాలకు కావాల్సిన అన్ని రంగాలు, అభివృద్ధి పనులు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల నేడు ఏఎన్నార్ కళాశాల 75సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్య వచ్చే ఏడాది నుంచి ఏఎన్నార్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెడుతున్నట్లు కళాశాల పాలకవర్గ సభ్యులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతోనే ఇంజినీరింగ్ విద్యను ప్రవేశ పెడుతున్నామన్నారు. కేవలం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు మాత్రమే చెల్లించి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించవచ్చని పాలకవర్గ సభ్యులు తెలిపారు. -
వంశీని పలకరించారని టీడీపీ వారిపైనే దాడి
గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను పలకరించినందుకు టీడీపీ వారిపైనే దాడి చేశారు. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ ఆదివారం మర్లపాలెం వెళ్లారు. ఆయనను టీడీపీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు కంభంపాటి సాయి, శేషు, జాస్తి మురళి ఆదివారం రాత్రి గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న శ్రీధర్పై అకారణంగా దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేశారని అడిగేందుకు బంధువైన కంభంపాటి రామ్మోహన్రావుతో కలిసి శ్రీధర్ గ్రామంలోని సాయి ఇంటికి వెళ్లగా... మరోసారి సాయి, శేషు, జాస్తి మురళీతో పాటు విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హాకీ స్టిక్స్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో శ్రీధర్ తలకు, రామ్మోహన్రావు చేతికి బలమైన గాయాలయ్యాయి. వారిని బంధువులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం పని చేశానని శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం యార్లగడ్డ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ తమను దూరం పెట్టారని చెప్పారు. తమ సమీప బంధువుల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీని పలకరించాననే కక్షతో యార్లగడ్డ వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్రావును సోమవారం వల్లభనేని వంశీ పరామర్శించారు. రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు -
పిల్లలతో నదిలో దూకేందుకు యత్నం.. రక్షించిన ట్రాఫిక్ పోలీసులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణానదిలోకి దూకేందుకు యత్నించిన తల్లీ పిల్లలను ఐదో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. ఈ ఘటన కృష్ణలంక ప్రాంతంలోని వారధిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు భవానీపురానికి చెందిన ప్రమీల అనే మహిళకు 5, 6 సంవత్సరాలు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఏ పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతుండడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపానికి గురై బాధపడుతుండేది. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణానదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుని సోమవారం మధ్యాహ్నం వారధి పరిసరాలకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే వారధిపై 45వ పిల్లర్ వద్ద పిల్లలతో కలిసి ఆమె కృష్ణానదిలో దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో వారధిపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ ఆమెను గమనించాడు. వెంటనే అప్రమత్తమై హుటాహుటినా ఆమె వద్దకు చేరుకుని వారిని రక్షించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి భవానీపురం పోలీసులకు అప్పగించారు. -
కరాటే పోటీల్లో తాత – మనవళ్ల్లకు పతకాలు
పెనమలూరు: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో యనమలకుదురుకు చెందిన తాత–మనవళ్లు ఉత్తమ ప్రతిభచాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఆదివారం ఐదో జాతీయ కుంగ్ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న యనమలకుదురుకు చెందిన ఎస్.దుర్గారావు(64) సీనియర్ సిటిజన్ కాటా విభాగంలో బంగారు పతకం, గ్రాండ్ చాంపియన్ షిప్ను గెలుచుకున్నాడు. అతని మనవళ్లు ఎస్.సాత్విక్ (9), ఎస్.రిత్విక్ (7) వెపన్ కాటా విభాగంలో బంగారు పతకాలు సాధించారు. అలాగే జి.నినా 7 సంవత్సరాల లోపు కాటా, వెపన్స్ కాటా విభాగాల్లో రెండు బంగారు పతకాలు గెలిచింది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మొగల్రాజపురం కొండపైన భాలభాస్కర నగర్కు చెందిన తుమ్మల కృష్ణ(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి బోయపాటి మాధవరావు రోడ్డులోని మురుగునీటి కాలువలో పడి మృతి చెందాడు. స్థానిక వైన్షాప్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలో ఆదివారం అర్ధరాత్రి పడిపోయి మృతి చెందిన కృష్ణను సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని బాలభాస్కర నగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. మాచవరం పోలీసులు వచ్చి మృతుడి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్లో జాతీయ ఇంధన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను సంస్థ చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులు సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జరిగే ఇంధన వారోత్సవాల్లో ఇంధన పొదుపు, ఇంధన ప్రాధాన్యతపై ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. శక్తి వృథాను తగ్గించడం, వనరులు కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక పునర్నిర్మాణ రంగం ఇంధన రంగంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదాతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. వారోత్సవాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేష్బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖ సిటీ: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్బీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్లో మొత్తం రూ.32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు. -
జయహో దుర్గాభవాని
సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. మొత్తం 5.27లక్షల మంది భవానీలు దీక్షలను విరమించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రికి నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరిప్రదక్షిణను పూర్తి చేసుకున్నారు. అర్ధరాత్రి క్యూలైన్లోకి చేరుకున్న భవానీలు, భక్తులకు గంటన్నర లోపే అమ్మవారి దర్శనం పూర్తయింది. కొండ దిగువకు చేరుకున్న భవానీలు ఇరుముడులు, హోమగుండానికి నేతి కొబ్బరి కాయలను సమర్పించిన దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భవానీలకు అమ్మవారి దర్శనానికి అనుమ తించారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో భవానీల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో గిరిప్రదక్షిణకు నాలుగున్నర నుంచి 5 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గిరిప్రదక్షిణ మార్గంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి పరిసరాలు, కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. రేపటి నుంచి ఆర్జిత సేవలు.. మంగళవారం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని, మంగళవారం కూడా వచ్చే భవానీలకు అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. దీక్షలు ముగియడంతో బుధవారం నుంచి ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొనవచ్చని, టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్, భవానీ దీక్ష విరమణల ఫెస్టివల్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం, డిసంబర్ 16వ తేదీ) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజినగర్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. భవానీపురం జోజినగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ..విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి:‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’ -
పతకాల వీరుడు @59
● ఆర్టీసీలో మెకానిక్ రామకృష్ణ ● 59 ఏళ్లలోనూ పాల్గొంటే పతకాలే ● ఇప్పటి వరకు 225 పైగా బహుమతులు కై వసం ● హైస్కూలు స్థాయి నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ వరకు పతకాల పంట ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆయన ఆర్టీసీలో మెకానిక్. 59 ఏళ్ల ప్రాయంలోనూ ఆటల పోటీలంటే అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఆటల్లో సత్తా చాటి క్రీడా కోటాలో ఆర్టీసీ ఉద్యోగం సాధించారు బంటుమిల్లి మండలం ఆముదాలపల్లికి చెందిన పి.రామకృష్ణ. ఆయన ఇప్పటి వరకు 225 పైగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. మొదటి బహుమతితో క్రీడా కోటాలో.. రామకృష్ణకు రన్నింగ్, సైక్లింగ్, యోగా అంటే మక్కువ. పాఠశాల స్థాయిలోనే ప్రావీణ్యం చూపారు. 1988లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి మారథాన్ 42.195 కిలోమీటర్ల విభాగంలో (రన్నింగ్ 3.28 గంటలు) ప్రథమ స్థానం సాధించారు. ఐటీఐ చదివిన ఆయన ఈ సర్టిఫికెట్తో 1991లో ఆర్టీసీ అవనిగడ్డ డిపోలో మెకానిక్గా ఉద్యోగంలో చేరారు. ఇలా ఇబ్రహీంపట్నం, గవర్నర్పేట, గుడివాడ డిపోల్లో చేసి ప్రస్తుతం ఆటోనగర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ.. మరోవైపు రన్నింగ్లో పతకాలు సాధించి ఆర్టీసీకి, జిల్లాకు ఖ్యాతి తెస్తున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు.. హైస్కూల్ స్థాయిలోనే కాకుండా ప్రస్తుతం మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నారు. ఎన్నోపతకాలను సొంతం చేసు కుంటున్నారు. ఆయన పాల్గొంటే కచ్చితంగా పతకం సాధించడమే. యువతకు శిక్షణ ఉద్యోగం చేస్తూనే జిల్లాలో యువకులకు నడక, యోగా, రన్నింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిలో పలువురికి పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు వచ్చినట్టు రామకృష్ణ చెబుతున్నారు. నాకు 59 సంవత్సరాలు . ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 50 బంగారు పతకాలు, 100 వెండి, 75 కాంస్య పతకాలు సాధించాను. కొన్నేళ్ల నుంచి కానూరులోని సిద్ధార్థ కాలేజీలో యువకులకు, మధ్య వయసు వారికి నిత్యం రన్నింగ్, యోగా, సైక్లింగ్లో శిక్షణ ఇస్తున్నాను. గతంలో శిక్షణ పొందినవారు పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. –పి.రామకృష్ణ, ఆర్టీసీ మెకానిక్, ఆటోనగర్ డిపో 1988, 1993, 98, 2000, 2006, 2009, 2010, 2011 వరకు జరిగిన మారథాన్ రన్నింగ్లో బంగారు పతకాలు సాధించారు. 2025లో ఇటీవల నవంబరులో జరిగిన పరుగు పందాల్లో మూడో స్థానం పొందారు. ఈ నెలలో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అధ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. అనేక పోటీల్లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ ఒక ప్రకటనలో తెలిపారు.సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం విజయవాడ నలంద డిగ్రీ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి. గుడివాడరూరల్: గుడివాడ మెయిన్రోడ్డు లోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం సంభవించింది. -
కారు, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు
కంచికచర్ల: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనగా బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుంటుపల్లికి చెందిన దుర్గా సురేష్కుమార్, రమణ అనే మహిళతో కలిసి విజయవాడ వైపు నుంచి తెలంగాణా రాష్ట్రం కోదాడ బైక్పై బయలుదేరారు. కంచికచర్ల మండలం కీసర బీజేటీ డిగ్రీ కళాశాల వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో రమణకు తీవ్రగాయాలు, సురేష్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రమణను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గా సురేష్ కుమార్ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
● దీక్షల విరమణకు తరలివచ్చిన ఉత్తరాంధ్రవాసులు ● నేడు మహా పూర్ణాహుతి అత్యధికం ఉత్తరాంధ్రవాసులే ఏర్పాట్ల పరిశీలన పూర్ణాహుతితో సమాప్తం 17,18 తేదీల్లో కానుకల లెక్కింపు చిత్రం.. భళారే విచిత్రం విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సమితి, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన పున్నమ్మ తోటలోని దూరదర్శన్, టీటీడీ కల్యాణమండపం రోడ్డులో నిర్వహించిన చిత్ర కళాప్రదర్శన ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు వారి చిత్రాలను ప్రదర్శించారు. 200 స్టాల్స్లో ప్రదర్శించిన చిత్రాలు కనువిందు చేశాయి. ఆధునిక చిత్రకళ ఉట్టిపడేలా గ్రామీణ జీవనం, రైతులు, ప్రకృతి సౌందర్యం, పల్లెజీవితం, జాతీయ నాయకులు, దేవతా మూర్తులు తదితర అంశాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చిత్ర కళాప్రదర్శన రాత్రి 9 గంటలవరకు సాగింది. ప్రపంచ తెలుగు చిత్రకళా సమాఖ్య అధ్యక్షుడు పీరన్, కార్యదర్శి బాలయోగి, టి.వెంకటర్రావ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికే.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆశయంతో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పీరన్ తెలిపారు. బాల చిత్రకారులకు ఇటువంటి వేదికలు అవసరమన్నారు. అమరావతి కేంద్రంగా కళాకారుల ప్రదర్శనకు ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. నిర్వాహకులు శిబిరంలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. దీక్ష విరమణల నేపథ్యంలో నాలుగో రోజు దేవస్థానానికి రూ. 81.58 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నాలుగో రోజైన ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 1.18 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోగా, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 76.21 లక్షల మేర ఆదాయం సమకూరిందన్నారు. సుమారు 5 లక్షల లడ్డూలను విక్రయించిగా, అన్నదానం, అల్పాహారాన్ని 26,586 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారికి 13,200 మంది తల నీలాలను సమర్పించగా, రూ. 5.28లక్షల మేర ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. -
గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
●షార్ట్సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ●రెండు షాపులు పూర్తిగా, ఓ షాపు పాక్షికంగా దగ్ధం ● రూ.కోటి వరకు ఆస్తి నష్టం గుడివాడరూరల్: పట్టణంలోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే పట్టణ నడిబొడ్డులోని నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్లో ఉన్న ఓ సెల్ఫోన్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సుమారు గంట తర్వాత సమీప ప్రజలు, ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ మంటలు బయటకు కన్పించడంతో 5.15 గంటలకు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారి జక్కంపూడి ఆంజనేయులు నేతృత్వంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడకు ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే ఉండటంతో వెంటనే కై కలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లోని ఫైర్ ఇంజన్లు రప్పించి 20 మంది ఫైర్ సిబ్బందితో గుడివాడ, కై కలూరు ఫైర్ అధికారులు ఆంజనేయులు, క్రాంతికుమార్ నేతృత్వంలో మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఒక షాపు పాక్షికంగా దగ్ధమైనట్లు ఫైర్ అధికారులు తెలిపారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు గుర్తించారు. పెరిగిన ప్రమాద తీవ్రత.. గుడివాడలో ఒక్క ఫైర్ ఇంజన్ ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి డి.ఏసురత్నం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపోయిన బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే కాంప్లెక్స్లో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్రాంచ్తో పాటు మరికొన్ని షాపులు ఉన్నాయి. ఆదివారం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై..
నియోజకవర్గం సంతకాల సంఖ్య విజయవాడ తూర్పు 96,123 విజయవాడ వెస్ట్ 65,028 విజయవాడ సెంట్రల్ 60,000 మైలవరం 58,466 తిరువూరు 40,000 నందిగామ 40,000 జగ్గయ్యపేట 61,600 డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ 750మొత్తం 4,21,967 సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాలపై ప్రజలు నిరసన సంతకం చేశారు. బాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను పప్పు బెల్లాల్లా ప్రైవేటుకు అప్పగిస్తారా అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజక వర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో విజయవాడ కార్పొరేషన్, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గ కేంద్రాల్లో ఈ నెల 10వ తేదీ వైఎస్సార్ సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. అనంతరం సంతకాలు చేసిన ప్రతులను జిల్లా కార్యాలయానికి పంపారు. జిల్లా వ్యాప్తంగా 4,21,967 సంతకాలు చేశారు. జిల్లాలో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజక వర్గంలో నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యాన రికార్డు స్థాయిలో 96,123 సంతకాలు చేశారు. ఇది బిడ్డల ఉజ్వల భవిష్యత్తు అని, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకొనేందుకు తలపెట్టిన ఉద్యమం అని, వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అక్టోబరు 10న కోటి సంతకాలు సేకరణ ప్రారంభమైంది. రెండు నెలలు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా నిరసన సంతకాలు చేశారు. నేడు విజయవాడలో భారీ ర్యాలీ విజయవాడలో చుట్టుగుంట ఈ సేవా సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమర సంతకాలతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, వైఎస్సార్ సీపీ అన్ని విభాగాల నేతలు ర్యాలీలో పాల్గొననున్నారు. శిఖామణి సెంటర్లో సభావేదికపై నుంచి నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ప్రతులు ఉన్న వాహనానికి నేతలు జెండా ఊపి ప్రారంభించి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి సంతకాలకు ప్రజల నుంచి భారీ స్పందన నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరిన సంతకాలు నేడు జిల్లా కేంద్రం నుంచి భారీ ర్యాలీతో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు విజయవాడలో చుట్టుగుంట ఈ సేవా కేంద్రం నుంచి శిఖామణి సెంటర్ వరకు భారీ ర్యాలీ -
షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి. మూడు జిల్లాల స్థాయి విజేతలు మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండు, మూడు, నాల్గవ బహుమతులు వరుసగా విజయవాడకు చెందిన విజయ్సాయిరెడ్డి, పోతురాజు, గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృథ్వీ, కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాషా, ఆదినారాయణ పర్యవేక్షించారు. -
ఏపీఆర్ఎస్ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
చల్లపల్లి: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన వృత్తిరీత్యా విశాఖపట్నంలో హెడ్కానిస్టేబుల్గా చేస్తున్న మురాల నాగమల్లేశ్వరరావు 7వ ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటారు. రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నాగమల్లేశ్వరరావు 40–45 ఏళ్ల క్రీడాకారుల విభాగంలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం నిర్వహించిన పోటీల్లో విశాఖ జిల్లా తరఫున పాల్గొని గెలుపొందారు. ఐదు కిలోమీటర్లు, 1500 మీటర్లు పరుగు పందేల్లో బంగారు పతకాలు, 110 హర్డిల్స్ పందెంలో వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం జనసంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగర్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సూర్యారావుపేటలోని ఏపీటీఎఫ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా వి.రాధిక, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా టి.పూర్ణచంద్రరావు, ఎన్.అవని, ఎండీ నయీం అహ్మద్, డి.రాజకుమార్, కార్యదర్శులుగా డి.వసరాం, ఏ సుందరరామారావు, శెట్టిపోగు రాము, షేక్ ఖాజా, షేక్ లాల్మద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పీవీ దుర్గా ప్రసాద్, ఎస్కే నిఖత్ సుల్తానా ఎన్నికయ్యారు. పీఆర్సీ కమిషన్ నియమించాలి.. ఎన్నికల అధికారిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడ వెంకటేశ్వర్లు, పరిశీలకులుగా మక్కెన శ్రీనివాసరావు వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యక్షులు అనిత మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మండాది వెంకటేశ్వర్లు, శోభనాద్రాచార్యులు, వై.భాస్కరరావు, కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
శాతవాహన కళాశాల పరిరక్షణకు ఐక్య కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాల పరిరక్షణకు విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలని అప్పుడే కళాశాలకు పూర్వ వైభవం వస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర చెప్పారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులో శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఆ కళాశాల ఆవరణలోని మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించి చేసే కార్యక్రమాల్లో తమ సంఘం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. భవనాలను కూల్చడం అనాగరిక చర్య.. శాతవాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి మాట్లాడుతూ.. శాతవాహన కళాశాల ఐదు దశాబ్దాల పాటు వేల మందికి విద్యను అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల స్థలం విలువ కోట్ల రూపాయలకు పెరగడంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శాతవాహన కళాశాల స్థలాన్ని దురాక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవలసిన బాధ్యత శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంపైనే ఉందన్నారు. ఇందుకోసం కోసం అన్ని విద్యార్థి సంఘాలతో పాటు పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి పి.కృష్ణమోహన్ మాట్లాడుతూ శాతవాహన కళాశాల స్థలాలను పరిరక్షించుకుని కళాశాలను పూర్వస్థితికి తీసుకురావడానికి తమ సొసైటీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, సభ్యులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కళాశాల భవనాలను కూల్చడం, క్రీడా మైదానాన్ని జేసీబీలతో తవ్వించడం వంటి దుశ్చర్యలు అనాగరికమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు రవి, కిరణ్, వెంకన్న, వాలేశ్వరరావు వల్లూరు బాబు, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర -
28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !
● రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బాధితులు ●ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికే బ్రాంచ్ల నిర్వహణ బాధ్యతలు ● గుట్టుగా పెట్టుబడులు తరలించి బోర్డు తిప్పేసిన నిర్వాహకులు తిరువూరు: ౖలెఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అడ్వయిజరీ సర్వీసెస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా శాఖలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు, అధిక వడ్డీల పేరుతో ప్రజలకు నమ్మకం కలిగించి 2023 నుంచి పెట్టుబడులు స్వీకరించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థకు చైర్మన్గా ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్, సీఈఓగా ఆయన భార్య శివానీ వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నమ్మకస్తులైన ఐదుగురిని నియమించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, వరంగల్ పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 బ్రాంచ్లు ఏర్పాటుచేసి రూ.30 కోట్లకు పైగా వసూలు చేశారు. తాము 200కు పైగా ప్రాజెక్టుల ద్వారా లాభాలను అందిస్తామని కస్టమర్లను నమ్మించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.10 లక్షల వరకు డిపాజిట్లు స్వీకరించారు. మొక్కలు పెంచే ఆలోచన ఉన్నవారే తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ బ్రోచర్లలో నిబంధనలు వల్లెవేశారు. పోస్టాఫీసులు, బ్యాంకుల కంటే అధిక మొత్తంలో వడ్డీ వస్తుందనే ఆశతో చిన్న, మధ్య తరహా కుటుంబాలు ఎక్కువగా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో కొంత డబ్బు కస్టమర్లకు చెల్లించినా, నిర్వాహకులు క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు దారి మళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెంట్లపై కస్టమర్ల ఒత్తిడి తాము లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థలో పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలంటూ ఏజెంట్లపై ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సంస్థ గురించి తమకు తెలియకపోయినా పరిచయస్తులైన ఏజెంట్లకు డబ్బు చెల్లించామని, వారి హామీపైనే పెట్టుబడి పెట్టామని పలువురు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల ఒత్తిడి తట్టుకోలేక శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెం తదితర పట్టణాల నుంచి ఏజెంట్లు విస్సన్నపేటకు వచ్చి దుర్గాప్రసాద్, శివానీ ఆస్తులపై ఆరా తీశారు. శివానీ అదృశ్యంపై ఫిర్యాదు దుర్గాప్రసాద్, శివానీది ప్రేమ వివాహం. వారిద్దరి కులాలు వేర్వేరు. దుర్గాప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. శివానీ స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ. డిపాజిట్దారులు, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక దుర్గాప్రసాద్ అక్టోబరు 27న ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రోజుల కిందట శివానీ తన ఇద్దరు కుమార్తెలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ, ఏజెంట్లు, కస్టమర్లు ఆందోళన చేస్తుండటంతో అనూహ్యంగా శివానీ కనిపించట్లేదని ఆమె తండ్రి గోవింద్ ఆదివారం రెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్
●నాలుగు కేటగిరీల్లో పరీక్షలు నిర్వహణ ●278 మంది విద్యార్థుల హాజరు ●ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై నైపుణ్యాలను పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. గతంలో జరిగిన క్యార్టర్ ఫైనల్ రౌండ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సెమీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ, బందరురోడ్డులోని నలంద డిగ్రీ కాలేజీలో జరిగిన పరీక్షలకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ నుంచి 278 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. కేటగిరి–1లో 39 మంది, కేటగిరీ–2లో 78 మంది, కేటగిరీ–3లో 94 మంది, కేటగిరీ–4లో 67 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కనబరిచి వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కాలేజీ ఆవరణలో సందడి నెలకొంది. ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషన్ స్కూల్(రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలను నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, ఏఓ కాళీప్రసాద్ పర్యవేక్షించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ రౌండ్ పరీక్షలకు అర్హత సాధిస్తారని ఈవెంట్స్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.శ్రీహరి తెలిపారు. -
కార్టూనిస్టుల సేవలు ఎనలేనివి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్టూనిస్టుల సేవలు ఎనలేనివని, ప్రజల హితాన్ని కాంక్షిస్తూ కార్టూనిస్టులు సేవలు అందిస్తున్నారని ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం, అమరావతి’ ఆవిర్భావ సభ సంఘం అధ్యక్షుడు బాచీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. కార్టూనిస్టుల సంఘానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. కార్టూన్ అంటే అందరికీ మక్కువేనన్నారు. అందరికీ హాస్యం ఇష్టమని, కార్టూన్కు ఎప్పుడు ఆదరణ ఉంటుందని చెప్పారు. -
బందరులో పందెంకోళ్ల కూతలు
●రంగు, వాటాన్ని బట్టి పందెంపుంజుల కొనుగోళ్లు ●రూ.10 వేల నుంచి రూ.30 వేల ధర పలుకుతున్న పుంజులు కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన బందరులో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు నెల ముందునుంచే హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా పందెంకోళ్ల కూతలు విన్పిస్తున్నాయి. పందెంరాయుళ్లు పుంజుల కొనుగోలుకు గాలిస్తున్నారు. కిందటేడాది కాకిడేగ మైలాను మట్టి కరిపించిందని ఒకరంటే.. నీ కాకిడేగ మైలానే కొట్టింది నా నెమలి అయితే పర్లాను పరుగులు పెట్టించింది గుర్తుందా.. అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏ రంగుకు ఏ రంగు కోడి కలపాలి, ఏ సమయంలో పందెం వేయాలి, ఎప్పుడు కత్తి కట్టి వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే చర్చలు సాగుతున్నాయి. పందెంకోడి కూత వినబడితే చటుక్కున ఆగి పెంపకందారులతో బేరసారాలు ఆడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పుంజు రంగు, వాటం, కాలు విసిరే విధానం నచ్చితే.. రేటు గురించి కూడా ఆలోచించడంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, అబ్రాస్, నెమలి, సీతువా, రసంగి, పర్లా, పింగళా, కక్కిరి, మైలా, ఎర్రబొట్ల సీతువా.. ఇలా రంగులను బట్టి పుంజు జాతి గలది అయితే ఒక్కో కోడిని రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధరకు కొనేస్తున్నారు. పలువురు పందెంకోళ్లను జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లు, కీమా వంటి ఖరీదైన మేతలతో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సండే మార్కెట్లో సందడి.. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో బందరు సండే మార్కెట్లో పందెంరాయుళ్ల సందడి పెరిగింది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా ప్రస్తుతం పందెంపుంజుల కూతలు విన్పిస్తున్నాయి. దీంతో పందెంరాయుళ్లు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే పుంజుల కోసం సండే మార్కెట్కు చేరుకుంటున్నారు. సండే మార్కెట్లో ఓ మాదిరి పందేలు వేసుకునే వారికి అనుకూలంగా రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలికే పుంజులు అమ్మకానికి వస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి ఈ ప్రాంతంలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమనలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. దీక్ష విరమణలపై ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ వేద పండితులు షణ్ముఖేశ శాస్త్రి, అర్చకులు యూ మురళీధర శాస్త్రిలు మాట్లాడారు. దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ భవానీలకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు లక్షలాది మంది దీక్షలు స్వీకరించే స్థాయికి చేరిందన్నారు. భవానీలకు వీలైనంత అధిక సమయం దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. దీక్ష విరమణలన్నీ శాసీ్త్రయంగానే సమర్పిస్తున్నామని చెప్పారు. -
బంగారు కొండ.. మానుకొండ అంటూ పోస్ట్!
విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్గా మారింంది. గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి. -
‘వేగ’లో పండుగల ఆఫర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వేగ జ్యూయలర్స్లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెట్టారు. ఈ నెల 15 నుంచి అందుబాటు లోకి రానున్న ఈ ఆఫర్ల బ్రోచర్ను శనివారం విజయవాడ బృందావన కాలనీ లోని నందమూరి రోడ్డులో ఉన్న వేగ షోరూమ్లో మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఆఫర్లలో భాగంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు, పోల్కి ఆభరణాల తయారీ, తరుగు చార్జీలు ఉండవని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భవానీ.. శరణు శరణు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు తరలివస్తున్నారు. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. మూడో రోజైన శనివారం లక్ష మంది మాలవిరమణ చేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండు గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. శనివారం వేకువ జాము రెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆలయానికి భవానీలు భారీగా తరలివచ్చారు. వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు కిటకిటలాడాయి. పగటి వేళ కంటే సాయంత్రమే అధికం గిరిప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలోనే భవానీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దీక్షల విరమణకు వస్తున్న భవానీలు సాయం సమయంలో ప్రశాంత వాతావరణంలో గిరిప్రదక్షిణ చేసి, తెల్లవారుజామున అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో చేరుకున్న తర్వాత రెండు గంటల్లో అమ్మవారి దర్శనం, ఇరుముడి, హోమ గుండంలో నేతి కొబ్బరి కాయ సమర్పణ, ప్రసాదాల కొనుగోలు పూర్తవుతోందని భవానీలు పేర్కొంటున్నారు. తిరుగు ప్రయాణానికి అనువైన సమయం ఉదయం ఆరు గంటల లోపే భవానీలు దీక్షలను పరిపూర్ణం చేసుకుని రైల్వేస్టేషన్, బస్టాండ్కు చేరుతున్నారు. విశాఖపట్నం వైపు రత్నాచల్, హైదరాబాద్ వైపు శాతవాహన, చెన్నయ్ వైపు పినాకినీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల లోపు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. నగరం నుంచి బయలుదేరే రైళ్లు, బస్సులను అందుకుని స్వస్థలాలకు చేరుకుంటున్నామని భవానీలు పేర్కొంటున్నారు. భవానీలతో రైల్వేస్టేషన్, బస్టాండ్ కిటకిటలాడుతున్నాయి. మూడో రోజు రూ.62.09 లక్షల ఆదాయం దీక్షల విరమణ నేపథ్యంలో దేవస్థానానికి శనివారం రూ.62.09 లక్షల ఆదాయం సమకూరిందని దుర్గగుడి అధికారులు తెలిపారు. సింగిల్ లడ్డూల విక్రయాలతో రూ.26,355, ఆరు లడ్డూ బాక్స్ల విక్రయంతో రూ.57.49 లక్షలు, శ్రీచక్ర పెద్ద లడ్డూల విక్రయంతో రూ.1100, కేశఖండన టికెట్ల ద్వారా రూ.4.32 లక్షల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. 36,512 మందికి అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీ చేశామని వివరించారు. నేడే కీలకం దీక్ష విరమణలకు మరో రెండు రోజులే గడువు మిగిలి ఉంది. ఆదివారం భవానీల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. బందోబస్తు పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తును ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ షిరీన్బేగం, క్రైం ఏడీసీపీ ఎం. రాజారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. దీక్షల విరమణకు ఇరుముడులతో వచ్చిన భవానీలు దీక్షలు విరమిస్తున్న భవానీ భక్తులు -
కొత్త లేబర్ కోడ్లతో భద్రత కరువు
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్ల రద్దుకు కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్గౌడ్ పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా శనివారం లేబర్ కోడ్స్పై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ గోపాల్గౌడ్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అనుగుణంగా కేంద్రం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి పురస్కారాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న సేవాతత్పరుల సేవలను గుర్తించి ‘సర్వేజనాః సుఖినో భవంతు’ (సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ) ఆధ్వర్యాన సంక్రాంతి పురస్కారాలతో సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈస్ఎస్ నారాయణ మాస్టారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారాల ఎంపిక కోసం సమాజ సేవ, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం, యోగ, కరాటే వంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వారు వారి ప్రతిభను, సేవలను గురించి తెలియజేసే సర్టిఫికెట్లు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో 4 పాస్ పోర్టు సైజు ఫొటోలను దరఖాస్తుకు జత చేసి ఈనెల 25వ తేదీ లోపు ‘సర్వేజనాః సుఖినో భవంతు’ డోర్ నం. 1–20–164, పోస్టు, తిరుమలగిరి, గోకుల్నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15 కు పంపించాల్సిందిగా సూచించారు. ఎంపిక చేసిన సేవాతత్పరులను వచ్చేనెల 11వ తేదీన హైదరాబాద్లో ప్రముఖుల చేతులమీదుగా ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. వివరాలకు 96523 47207 నంబర్లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. చిల్లకల్లు(జగ్గయ్యపేట): గ్రామంలోని వైన్షాపు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన యాకోబు (35) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వైన్షాపు సమీపంలో మృతి చెంది ఉండటాన్ని ప్రజలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. -
నర్సాపూర్ నుంచి వందేభారత్ పరుగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కోస్తా ఆంధ్ర, తమిళనాడు మధ్య పగటిపూట ఏసీ ప్రయాణం కోసం వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు చెన్నయ్ సెంట్రల్ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్ వరకు విస్తరించనుంది. నర్సాపూర్ – చెన్నయ్ మధ్య 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 9 గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలును ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటకు నర్సాపూర్ స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించ నున్నారు. చెన్నయ్ సెంట్రల్ – నర్సా పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 17వ తేదీ నుంచి అమలులోకి రానుంది. -
పురిటి నొప్పులు
ఎన్టీఆర్ జిల్లాప్రసూతి ఆస్పత్రులకు విజయవాడకల్చరల్: నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆంధ్ర నాట్య పోటీలు జరిగాయి. పలువురు కళాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడకల్చరల్: నగరంలోని పున్నమ్మ తోటలో ఆదివారం చిత్రకళా సంత జరుగుతుందని తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్ఎం పీరన్ శనివారం తెలిపారు. 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండు నుంచి 12వ తేదీ వరకు 36వ పుస్తక మహోత్సవం జరుగుతుందని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె. లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జన వరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ‘డబుల్ ఇంజిన్’ విఫలం గన్నవరం: రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లమందరావు విమర్శించారు. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఏపీ రైతు సంఘం నేతలు పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బస్తాకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంద న్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. వరితో పాటు పత్తికి కూడా మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుపానుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,500 కోట్ల పంట నష్టం జరి గితే ప్రభుత్వం మాత్రం రూ.వెయ్యి కోట్లుగా ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని చెప్పారు. అదాని, అంబాని కంపెనీలకు రూ.16,500 కోట్ల రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణాలను పూర్తిగా రద్దు చేసి, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ నేతలు ముక్కామల ఉమామహేశ్వరరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని ప్రసూతి ఆస్పత్రులు అలంకార ప్రాయంగా మిగిలాయి. బిడ్డలకు జన్మ నిచ్చి, దంపతుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఈ ఆస్పత్రుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వైద్యుల పోస్టు లను భర్తీ చేయకపోడంతో వెలవెలబోతున్నాయి. శాశ్వత సిబ్బంది ఉన్నా వైద్యులు లేక పోవడంతో ఈ ఆస్పత్రుల్లో ఎంతో కాలంలో సేవలు నిలిచిపోయాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నాలుగు ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. రాణీగారి తోట ఆస్పత్రి ఇప్పటికే మూతపడింది. కృష్ణలంక, రామరాజ్యనగర్, రాజీనగర్లో ప్రసూతి ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల గర్భిణులు పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఫలితంగా జీజీహెచ్ ప్రసూతి విభాగంపై ఎక్కువ భారం పడుతోంది. చిట్టినగర్లోని షేక్ రాజా ఆస్పత్రి కూడా గతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత దాని బాధ్యతలను సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంది. అలంకారంగా మిగిలిన వైనం రాణీగారితోట సిమెంట్ గోడౌన్ ప్రాంతంలో వంగవీటి మోహనరంగా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలంగా అది మూతపడి ఉంది. కృష్ణలంలో యూపీహెచ్సీ పక్కనే మరో ప్రసూతి ఆస్పత్రి ఉంది, అక్కడ ఏఎన్ఎంలు, హెచ్వీ ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే వైద్యులు లేక పోవడంతో సిబ్బంది ఏమీ చేయలేని దయనీయ స్థితి నెలకొంది. ఎవరైనా వస్తే పక్కనే ఉన్న యూపీహెచ్సీకి పంపుతున్నారు. అలాంటప్పుడు ఈ ఆస్పత్రి ఉండి ఉపయోగం ఏమిటో అధికారులకే ఎరుక. రామరాజ్యనగర్, రాజీవ్నగర్ ఆస్పత్రుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు రాజీవ్నగర్ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆరోగ్య కార్యక్రమాలకు సిబ్బంది దూరం ఇప్పుడు నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచివాలయ హెల్త్ సెక్రటరీలు అందుబాటు లోకి వచ్చారు. హెల్త్ సర్వేలు కూడా వారే చేస్తున్నారు. దీంతో వీఎంసీ ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది పనిలేక ఖాళీగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. సుమారు 12 మంది ఏఎన్ఎంలు, నలుగురు హెచ్వీలు, ఒక హెల్త్ ఎడ్యుకేటర్, నలుగురు వాచ్మన్లు, నలుగురు అటెండర్లు ప్రసూతి ఆస్పత్రుల్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు వ్యాక్సినేషన్, పల్స్పోలియో వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని అంటున్నారు. ఒకవైపు వైద్య శాఖలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంటే, అక్కడ మాత్రం వారిని ఖాళీగా ఉంచి జీతాలు చెల్లిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. వారిని సర్దుబాటు చేయాలనే ఆలోచనను అధికారులు చేయడం లేదని పేర్కొంటున్నారు. ప్రసూతి ఆస్పత్రులను ప్రారంభించాలని నగరంలోని పేద ప్రజలు కోరుతున్నారు. రాణీగారితోటలో మూతపడిన ప్రసూతి ఆస్పత్రి భవనం లబ్బీపేట(విజయవాడతూర్పు): అబద్ధపు ప్రచారంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కరువయ్యా యని పేర్కొన్నారు. గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శని వారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నూతన వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాల్లో భాగంగా జిల్లాలో 4.21 లక్షల సంతకాలను ప్రజల నుంచి సేకరించామని తెలిపారు. అక్టోబర్ పదో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని వివరించారు. అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి చేరిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తామన్నారు. అందులో భాగంగా విజయవాడ చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అలా అనడం సిగ్గుచేటు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతున్నా డని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులు అయితేనే వైద్య కళాశాలల నిర్వహణ బాగుంటుందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, టీడీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ను చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు పాలన నేర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అవినాష్ పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా వైస్ జగన్ ప్రభుత్వ పథకాలు ఏవీ ఆపలేదని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య కళాశాలలపై తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని హితవు పలికారు. ఈ నెల 15న నిర్వహించే ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీకి పోలీసుల అనుమతులు ఉన్నాయని తెలిపారు. పోలీసులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వీఎంసీ ఫ్లోర్లీడర్ వెంకట సత్యనారాయణ, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు తాటిపర్తి కొండారెడ్డి, తంగిరాల రామిరెడ్డి, కలపాల అంబేడ్కర్, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బా రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆళ్ల చెల్లారావు పాల్గొన్నారు. నగరంలోని ప్రసూతి ఆస్పత్రులను బలోపేతం చేస్తాం. గర్భిణులకు ప్రసూతి సేవలు అందించేందుకు అందుబాటులోకి తెస్తాం. అవసరమైన సిబ్బందిని, వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ కాన్పులన్నీ ఆస్పత్రుల్లోనే జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే నగరపాలక సంస్థ ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వేల రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంత ఖర్చు భరించడం పేదలకు కష్టం. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన గర్భిణులు కాన్పుల కోసం జీజీహెచ్లోని ప్రసూతి విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో జీజీహెచ్లో విపరీతంగా రద్దీ నెలకొం టోంది. ఎక్కువ మంది రావడంతో సేవల్లో కూడా జాప్యం తప్పడంలేదు. నగరంలోని ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటే క్లిష్టమైన కేసులను మాత్రమే జీజీహెచ్కు పంపించి, సాధారణ కాన్పులను స్థానికంగానే చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. దీంతో ప్రసూతి ఆస్పత్రులు నిర్వీర్యంగా మారుతున్నాయి. -
మంత్రి సాక్షిగా బట్టబయలైన ఏపీ ప్రభుత్వం బండారం
విజయవాడ: ఏపీలోని రైతుల్ని దీనావస్థలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బండారం బట్టబయలైంది. మంత్రి పార్థసారథి ఎపిసోడ్తో ప్రభుత్వం గుట్టురట్టయ్యింది. రైతులు దీనావస్థలో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పింది.. ఇప్పుడు మంత్రి పార్థసారధి సాక్షిగా నిజమని తేలిపోయింది. అసల రైతుల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో సుస్పష్టమైంది.ఈరోజు(శనివారం) మంత్రికి రైతుల నుంచి సెగ తగలడంతో రెచ్చిపోయారు. బూతులతో మరీ రెచ్చిపోయారు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేయగా, దాన్ని అధికారుల మీదకు, మిల్లర్ల మీదకు నెట్టేసే యత్నం చేశారు. మీరు మీర కలిసి దోచుకోండి అంటూ మండిపడ్డారు. ఫలితంగా మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న వైనం బయటపడింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ‘ మీరు మీరు’ దోచుకోండి’ అంటూ అధికారుల్ని, మిల్లర్లపై ధ్వజమెత్తారు మంత్రి. నాణ్యత ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. మంత్రి పార్థసారథి సొంతగ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేయక కల్లాల్లోనూ , మిల్లుల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత ఉన్నప్పటికీ తేమ శాతం చూపించి మిట్లర్లు ధాన్యం కొనుగోలు చేయని క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇలా రెచ్చిపోతే రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనేది రైతుల ప్రశ్న. -
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
నవ్విపోయిన నాణ్యత!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు. ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి.. ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కూతురు జూపూడి ఎంపీపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ప్రభుత్వం అందించిన స్కూలు బ్యాగు ఇచ్చిన రెండు నెలలకే చిరిగిపోయింది. పాఠశాలలో బ్యాగులు చిరిగిపోయిన ఒకరిద్దరికి రిట్నర్ తీసుకొని కొత్తవి ఇచ్చారు. కొందరికి అసలు ఇవ్వలేదు. ప్రభుత్వం నాణ్యమైన బ్యాగులు ఇస్తే మాకు సమస్య ఉండదు. పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లాలంటే బ్యాగు మంచిగా ఉంటేనే సక్రమంగా పాఠశాలకు వెళ్లగలుగుతారు. ప్రభుత్వం ఈ సారి సీజన్కై నా మంచి బ్యాగులు ఇవ్వాలి. – బాణావతు జగన్నాఽథం నాయక్, జూపూడి గ్రామం, ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థులకు అందించే వస్తువుల విషయంలోనూ నాణ్యత లోపించటంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాగులు, షూస్ చిరిగిపోయి ఇబ్బందులెదుర్కొంటున్నారు. నాణ్యత విషయంలో రాజీపడటం సరికాదు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను చూడాలి. అప్పుడే విద్యార్థుల భవిత ఉజ్వలంగా ఉంటుంది. – వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత -
అంగన్వాడీ.. వేడి!
సాక్షి, అమరావతి: గతంలో తాము చేపట్టిన సమ్మె సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం వీరు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై అధిక పనిభారం పెడుతోందని, సమాన పనికి సమాన వేతనం నిబంధన ప్రకారం రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. గతంలో 42 రోజులపాటు అంగన్వాడీలు ధర్నా చేపట్టినప్పుడు కుప్పంలో జరిగిన ఆందోళనకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు మద్దతు ఇచ్చి.. తాను సీఎం కాగానే డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ, అధికారం చేపట్టి ఇప్పటికి 18 నెలలు కావొస్తున్నా తమ గురించి కానీ, తమకు ఇచ్చిన హామీల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో ఇదే టీడీపీ నేతలంతా అంగన్వాడీలకు మద్దతు పలికి.. ఇప్పుడు అధికారం చేపట్టగానే పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. పింఛన్ డ్యూటీ నుంచి మినహాయించాలి.. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ.. పింఛన్ డ్యూటీ నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలన్నారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలు చేయాల్సిన పనులను కూడా అంగన్వాడీలతోనే చేయిస్తున్నారని, గతంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయడంలేదని, కొత్తవి ఇవ్వడంతో పాటు అన్ని యాప్లను ఒకే యాప్గా చేయాలని, తమకు ఎఫ్ఆర్ఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు టి. గజలక్ష్మి, సీఐటీయూ నగర కార్యదర్శి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు కూచిపూడిలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Iఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 100 క్యూసెక్కులొచ్చి చేరుతుండగా, దిగువకు 3,400 క్యూసెక్కులు వదులు తున్నారు. నిల్వ 42.4733 టీఎంసీలు. -
రేపు మధుమేహంపై జాతీయ సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ (ఏపీడీఎఫ్కాన్–2025), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీడీఎఫ్కాన్ ప్రెసిడెంట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ.. లబ్బీపేటలో హోటల్ జీఆర్టీ గ్రాండ్లో నిర్వహించే ఈ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 500 మంది నిపుణులు పాల్గొంటారని, 20 మంది జాతీయ వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. మధుమేహంతో శరీరంలోని గుండె, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయని, కొత్తగా వచ్చే మందులు ఆ అవయవా లను కాపాడతాయని పేర్కొన్నారు. కొత్త మందులు, ఒబెసిటీతో ప్రభావం వంటి అనేక కీలక అంశా లను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ హిమన, డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు. -
21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు. ఈ సమావేశాల కరపత్రాలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ.. తిరువూరులో జరిగే సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎనస్.ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యకలాపాల నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించి, నూతన కమిటీ ఎన్నిక జరుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, నాయకులు ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల, పి.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట జోరుగా నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడు స్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ వాట్సాప్ స్టేటస్గా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకుడిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్లో చేసిన కామెంట్లు మరోసారి టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంటు ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్నపేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్చల్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో.. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, మల్లేల, చిట్టేల, తోకపల్లి, కొండపర్వ, పెను గొ లను, ఊటుకూరు, రేపూడి, పుట్రేల, నాయకుల గూడెం, వేమిరెడ్డిపల్లి, తునికిపాడు, కొండూరు, గోపాలపురం గ్రామాల్లో జూదాలు జరుగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే ఈ జూదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల్లో స్థానికులు చెబుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో.. నందిగామ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. కంచికచర్ల రిక్రియేషన్ క్లబ్తో పాటు మండలంలోని గొట్టుముక్కల గ్రామంలోని మామిడి తోటలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడే పేకాట ఆడిస్తున్నాడు. ఇతనే కంచికచర్ల ఓసీ క్లబ్లోఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్నట్టు సమాచారం. గొట్టుముక్కలలో లోన – బయట, కోతముక్క ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాల ఎదురుగా ఉన్న సందుల్లో రెండు భవనాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయని సమాచారం. జగ్గయ్యపేటలో.. జగ్గయ్యపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. జగ్గయ్యపేట మండలంలోని చిలకల్లు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడు అటవీ ప్రాంత గ్రామాలైన గండ్రాయి, మల్కాపురం ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్నాడు. అతనికి పోలీసుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. సంక్రాంతి కోసం అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రధాన సెంటర్లో ఓ హోటల్లో రాత్రి వేళల్లో పేకాట నిర్వహిస్తు న్నారు. ఇటీవల పోలీసులు దాడి చేయగా పేకాట రాయుడు పరారయ్యారు. ఆ హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్లో సంచలన వ్యాఖ్యలు మైలవరం నియోజకవర్గంలో.. మైలవరం మండలంలో మైలవరం, బొర్రా గూడెం, మొర్సుమల్లి, వెల్వడం, పోరాటనగర్, రెడ్డిగూడెం మండల పరిధిలోని రెడ్డిగూడెం, మొద్దులపర్వ, అన్నేరావుపేట, దాసుళ్లపాలెం, జి.కొండూరు మండల పరిధిలో వెల్లటూరు, వెంకటాపురం, జి.కొండూరు, గంగినేని, మునగపాడు, వెలగలేరు, కందులపాడు, ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని కొండపల్లి ఖిల్లా, మూలపాడు, జూపూడి లంక గ్రామాలు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లోని మామిడి తోటలు, అటవీ ప్రాంతాలే అడ్డాలుగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వీటికి స్థానిక టీడీపీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు సైతం అప్పుడప్పుడు దాడులు చేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ ఒకటో తేదీన వత్సవాయి శివారులో పేకాడుతున్న ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ ఏడో తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 9 మంది పేకాట రాయుళ్లు చిక్కగా మరి కొందరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.1,15,600 నగదు, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ ఏడో తేదీన రెడ్డిగూడెం మండలం నాగులూరు శివారు మామిడి తోటలో పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3.25 లక్షల నగదు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 9వ తేదీన తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, నాయకులగూడెం, జి.కొండూరు మండలం వెల్లటూరు, కొత్తూరు, గంపలగూడెం మండలంలోని తునికిపాడులో పేకాడుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.73,380 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జేసీ ఇలక్కియ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. వీటిలో రేషన్ బియ్యాన్ని వినియోగిస్తే 6–ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అందరు ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్యమన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు. 6–ఏ కేసుల్లో పలువురికి జరిమానా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 6–ఏ కేసుల కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో కేసులు నమోదు అయిన వ్యక్తులను, నమోదు చేసిన అధికారులను విచారించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరానికి ఉపయోగించిన వారికి రూ.11 వేల జరిమానా విధించారు. 133 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన ఒక వాహన యజమానికి రూ.5 వేలు, పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58 వేల జరిమానా విధించారు. -
ఫలితాల సాధనలో హెచ్ఎంల పాత్ర కీలకం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల ఫలితాల సాధనలో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డెప్యూటీ ఈవో అధ్యక్షత శుక్రవారం మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం జరిగింది. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల స్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల విద్యారంగ పురోగతి, విద్యార్థుల హాజరు, బోధనా కార్యక్రమాల అమలు, పరీక్షల నిర్వహణ, స్వచ్ఛత, మౌలిక వసతుల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. 10వ తరగతి కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, హామీ ఇచ్చిన ప్రాథమిక–పునాది విద్య, విద్యాశక్తి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధనా వీడియోల వినియోగం వంటి ముఖ్య కార్యక్రమాల అమలుకు సూచనలు చేశారు. మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు. పబ్లో అగ్నిమాపకశాఖ తనిఖీలు పటమట(విజయవాడతూర్పు): గోవాలోని నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది మరణించిన నేపథ్యంలో ప్రజల భద్రతలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నైట్ పబ్లలో అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీఎంసీ ఫైర్ అధికారి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీ శుక్రవారం మొగల్రాజపురం ఐరన్ హిల్ పబ్లో జరిగింది. ఈ మేరకు అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అగ్ని నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది మంటలను ఎలా ఆర్పాలి, వస్తువులను ఎలా వినియోగించాలి, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ చర్యలు ఏమేం తీసుకోవాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణా శాఖ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని లారీ యజమానుల సంఘ నేతలు శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎం. రాంప్రసాద్రెడ్డిని కలిసి విన్నవించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన నేతలు ఫిట్నెస్ ఫీజుల పెంపు, ఆంధ్రా–తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల అంశం, కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రైలర్లపై విధిస్తున్న అధిక పెనాల్టీలు, వంటి ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఈశ్వరరావు తెలిపారు. కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ఎన్. రాజా, ప్రధాన కార్యదర్శి ఏవీవీ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్, కోశాధికారి ఎన్. కృష్ణ, ట్రైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సురేష్ పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్లు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్అదాలత్ నిర్వహిస్తారన్నారు. -
భక్తి ప్రకాశం.. అరుణోదయం
విద్యుత్ ధగధగలు.. దీక్ష విరమణల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ఆలయంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘చల్లంగా చూడు దుర్గమ్మ తల్లి.. మళ్లీ ఏడాది దీక్షతో పిల్లా పాపలను తీసుకుని నీ కొండకు వస్తాం’ అని భవానీలు అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవా నీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంటల వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు. నేడు, రేపు కీలకం.. భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారులు కీలకమైన కేశఖండనశాల, లడ్డూ తయారీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం, రాత్రికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవానీలకు తోడు నగరానికి చెందిన భక్తులు సైతం గిరి ప్రదక్షిణ చేయనుండటంతో ఆయా మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. లిఫ్టు కోసం భారీ క్యూ.. సామాన్య భక్తులు లిఫ్టుపై కొండపైకి చేరుకునేందుకు వివిధ మార్గాల ద్వారా మహామండపం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో లిఫ్టు వద్ద భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. అసలు కనకదుర్గనగర్ వైపు నుంచి పోలీసులు భక్తులెవరికి అనుమతించమని చెబుతున్నారు. అయితే వీరు ఏ విధంగా మహా మండపం వద్దకు చేరుకుంటున్నారోనని సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. రెండో రోజు ఆదాయం రూ.58.10లక్షలు భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని రెండో రోజైన శుక్రవారం దేవస్థానానికి రూ. 58.10 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ. 1.09లక్షలు, ఆరు ప్రత్యేక ప్యాక్ లడ్డూల విక్రయం ద్వారా రూ.52.20 లక్షలు, కేశఖండన ద్వారా రూ. 4.75లక్షలు, ఇతర ఆదాయం ద్వారా రూ. 5,466 లభించినట్లు పేర్కొన్నారు. భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరిపాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. -
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ.. చలో ఢిల్లీ పోస్టర్ను శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయమందించేలా రిజర్వేషన్లు ఇవ్వడానికి, నేటి ఆదిపత్య–పెత్తందారీ రాజకీయ వ్యవస్థకున్న అభ్యంతరాలను స్పష్టం చేయాలని వారు నిలదీశారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా చట్టసభలు, స్థానిక సంస్థల్లోనూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమ రూపాలలో పోరాడుతూనే ఉన్నామన్నారు. తరాలు మారుతున్నాయే గాని, బీసీల సామాజిక–ఆర్థిక–రాజకీయ అంతరాల నిర్మూలనకు మాత్రం ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని భావిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆ సంఘ ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరవు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ సీపీలో తిరుపతిరావుకు అదనపు బాధ్యతలు జి.కొండూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం జి.కొండూరుకు చెందిన వేములకొండ తిరుపతిరావును పంచాయతీ రాజ్ విభాగం జోన్–3 కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తిరుపతిరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. -
జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చక్కగా యూనిఫామ్ ధరించి బ్యాగులు తీసుకొని షూస్ వేసుకొని హుందాగా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించిన బ్యాగులు, షూస్లో సగం వరకూ చిరిగిపోయి ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
తిరువూరులో మళ్లీ మాటల యుద్ధం
తిరువూరు: ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్బుకా, పార్టీకా?’.. అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తన పార్టీ నేతలపై మరోమారు మాటల దాడికి దిగారు. పార్టీ మండల స్థాయి నేతను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి.గత కొద్దికాలంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ ఇరువర్గాలుగా చీలిపోయింది. దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తంటాలు పడుతున్న సమయంలో కొలికపూడి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. విస్సన్నపేట మండలానికి చెందిన ముఖ్యనేతను ఉద్దేశించి కొలికపూడి.. ‘పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పోస్టు చేయడంతో ప్రత్యర్థి వర్గం దీనికి కౌంటర్గా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యే తననుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, తాను సాయిబాబా సాక్షిగా ప్రమాణం చేసి తాను పేకాట శిబిరాలు నిర్వహించట్లేదని చెబుతానని, ఎమ్మెల్యే కూడా తనపై చేసిన ఆరోపణల నిరూపణకు ప్రమాణం చేస్తారా అని విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రశ్నించారు. తిరువూరులో బెల్టుషాపులను అడ్డుకుంటానని చెప్పి మద్యం సిండికేట్ల వద్ద డబ్బు దండుకోవడం, ఎ.కొండూరు మండలం గోపాలపురంలో మట్టి తవ్వకాలకు యత్నించి గ్రామస్తులు ప్రతిఘటించడంతో తోక ముడవడం ఎమ్మెల్యేకే చెల్లిందని ప్రత్యారోపణ చేశారు. ఇక కొలికపూడి తమ ఎమ్మెల్యే అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నామన్నారు. -
కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి షాక్
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీలో పార్టీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి ఊహించని షాకిచ్చారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో, టీడీపీలో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుల దోపిడీని బయటపెట్టారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాకిచ్చారు. ఈ క్రమంలో విస్సన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు సంధించారు.‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అని సటైర్లు వేశారు. దీంతో, తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు హాట్ టాపిక్గా మారాయి. -
నేటి నుంచి కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో ఈనెల 12 నుంచి 14 వ వరకు మూడు రోజులు పాటు నాట్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం విశ్రాంత ప్రధాన ఆచార్యులు, కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గురువారం తెలిపారు. నాట్యాచార్యులు చక్రవర్తులు పవన్ కుమార్, నిహారిక చౌదరిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయకారులు (కేరళ) సంగీత సామ్రాజ్య సంచారిణి అంశం పై శిక్షణ, కూచిపూడి నాట్య చరిత్ర, పరిక్రమణ సిద్ధాంతం పై అవగాహన తరగతులు ఉంటాయని చెప్పారు. డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానితో సంగీతం, తాళాలుపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 50 మంది పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–మంగుళూరు జంక్షన్ (07267) ప్రత్యేక రైలు ఈ నెల 24న బుధవారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, శుక్రవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07268) ఈ నెల 26న శుక్రవారం మంగళూరు జంక్షన్లో బయలుదేరి, శనివారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–మంగళూరు సెంట్రల్ (07269) ఈ నెల 28న ఆదివారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మంగళవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07270) ఈ నెల 30న మంగళవారం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, బుధవారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చైన్నె–విజయవాడ వందేభారత్ నర్సాపూర్ వరకు పొడిగింపు డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ (20677/20678) రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ ఉన్న ఈ రైలుకు ఈ నెల 15 నుంచి జనవరి 11 వరకు నర్సాపూర్ వరకు పొడిగించడంతో అదనంగా గుడివాడ, భీమవరం టౌన్లలో హాల్టింగ్ ఇచ్చారు. ఉదయం 5.30 గం.లకు డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్లో బయలుదేరుతుంది. రేణిగుంటకు 7.05 గంటలకు వచ్చి 7.10కి బయలుదేరుతుంది. నెల్లూరుకు 8.39కి వచ్చి 4.40కి బయలుదేరుతుంది. తెనాలికి 11.21కి వచ్చి 11.22కి బయలుదేరుతుంది. విజయవాడకు 11.45కి వచ్చి 11.50కి బయలుదేరుతుంది. గుడివాడకు 12.28కి వచ్చి 12.30కి బయలుదేరుతుంది. భీమవరం 1.15కి వచ్చి 1.17కి బయలుదేరి 2.10కి నర్సాపూర్ చేరుకుంటుంది. నర్సాపూర్లో 2.50కి బయలుదేరుతుంది. భీమవరం టౌన్కు 3.19కి వచ్చి 3.20కి బయలుదేరుతుంది. గుడివాడకు సాయంత్రం 4.04కి వచ్చి 4.05కి బయలుదేరుతుంది. విజయవాడకు 4.50కి వచ్చి 4.55కి బయలుదేరుతుంది. -
రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు
వాహనాలు ఫిట్నెస్కు తీసుకెళ్లారంటే యజమా నుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారికంగా ఫీజును చలానా రూపంలో చెల్లించినా, ఫిట్నెస్ టెస్టింగ్ వద్ద అనధికారిక దోపిడీ పెరిగిపోయింది. దీంతో అక్కడ చేయి తడిపితేనే ఫిట్నెస్, లేదంటే ఏదో ఒక లోపం చూపించడంతో ఇవ్వక తప్పడం లేదు. ఇలా ఫిట్నెస్కే కాదు, లైసెన్స్ జారీ లోనూ సెన్సార్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో దోపిడీ మరింత పెరిగినట్లు చెపుతున్నారు. ఒకప్పుడు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమయంలోనే బాగుండేదని, ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించిన నాటి నుంచి దోపిడీ పెరిగిపోయిందని వాహనదారులు వాపోతున్నారు. ఆన్లైన్ చిక్కులు... డబ్బులు ఇస్తేనే ఫిట్నెస్ ఽధ్రువీకరణ ఏదైనా లోపం ఉంటే అదనంగా చెల్లించుకోవాల్సిందే లైసెన్స్ల జారీలోనూ ఇదే పద్ధతి సెన్సార్లు ప్రైవేటుకు అప్పగించాక మరింత పెరిగిన దోపిడీ –ఎ.మోహన్, జేటీసీ, విజయవాడ -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
మైలవరం: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, ఏసీపీ వై. ప్రసాదరావు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకుని మైలవరం సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు వారి నుంచి రూ.27,50, 050 విలువ గల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి మైలవరం సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీ వై. ప్రసాదరావు మైలవరం సర్కిల్ సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆరుమళ్ళ పురుషోత్తం, (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణరాష్ట్రం)తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పురుషోత్తంతో పాటు మరో నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరవల్లి మండలం తేలుప్రోలుకు చెందిన పొట్లూరి పద్మతో పురుషోత్తం సహజీవనం చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిర్మానుష్యంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను దొంగతనాలకు వీరు ఎన్నుకుంటున్నారు. అందుకోసం వీరితో పాటు మైలవరం మండలం తోలుకోడు, వెల్వడం రోడ్లో ఉంటున్న ఏకుల రవికుమార్, ఏకశిరి అభిలాష్ , ఏకశిరి చిట్టెమ్మ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏడాది నుంచి ఆలయాల్లో దొంగతనాలుకు పాల్పడుతున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్లో 3, జి.కొండూరు 2, రెడ్డిగూడెం 1, ఆగిరిపల్లి 1, ద్వారకా తిరుమల 1, తాడేపల్లిగూడెం 1, విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనితో ఆరుమల్ల పురుషోత్తంలో పాటు అతని టీమ్ను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సొమ్మును రికవరీ చేశారు. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో చోరీ కేసులు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన మైలవరం ఎస్ఐ సుధాకర్, రెడ్డిగూడెం ఎస్ఐ, జికొండూరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో 7వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా విజయవాడ నగరానికి చెందిన ఎంఎస్ బేగ్ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్కు పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఇలక్కియా వ్యవహరించారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా నూతన డీఈవో యు.వి.సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తిరువూరు: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువూరు రెవెన్యూ డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23లక్షల 21వేల 400 గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతవరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.146 కోట్ల నగదు జమ చేశామన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులను ఇలక్కియా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారుల్ని ఆదేశించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష ఔన్నత్యం, సాంస్కృతిక వైభవాన్ని తెలియచేసేలా అధికార భాషా సంఘం పని చేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్గా నియమితులైన పి.త్రివిక్రమరావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో గురువారం భవానీపురంలోని హరిత బెరంపార్క్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిధిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ త్రివిక్రమరావుతో ప్రమాణం చేయించారు. అనంతరం త్రివిక్రమరావు మాట్లాడుతూ అందరి సలహాలు, సూచనలతో ముందుకు వెళతానని తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, కాపు కార్పొరేషన్, ఏపీ నాటక అకాడమి, ఉర్దూ అకాడమీ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, ఫారేఖ్ షుబ్లీ, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్.చంద్రకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆమె తాజా బదిలీలలో ఎన్టీఆర్ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు చేర్చటం, పర్యవేక్షణ బలోపేతం చేస్తానన్నారు. పారదర్శక సేవలను అందిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు బోధనా సిబ్బంది సమష్టిగా పనిచేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని సూచించారు. యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకు యూటీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య నాయకులు పి.లీల, జె.రామకృష్ణ, ఎం.లలిత, ఎ.భరత్, ఎస్పీహెచ్ఆర్ దేవ్ తదితరులు ఉన్నారు. -
సృజనాత్మకత వెలికితీయడానికే బాలోత్సవం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మతకను వెలికితీయడానికి బాలోత్సవం దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అమరావతి బాలోత్సవం గురువారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు సభకు లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులు, నీట్, ఐఐటీల పైనే శ్రద్ధ చూపుతున్నాయని తెలిపారు. పిల్లల మానసిక వికాసానికి అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఏటా అమరావతి బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అమరావతి బాలోత్సవం స్ఫూర్తిగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన బాలోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బాలోత్సవం వ్యవస్థాపకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక వికాసానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలోత్సవ్ ఉపయోగపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ గత ఏడు ఏళ్లుగా నిర్వహించిన దానికన్నా ఈ ఏడాది ఎంతో భిన్నంగా బాలోత్సవ్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ ఏడాది అత్యధికంగా 16,500 మంది విద్యార్థులు వివిధ అంశాలో ్ల పాల్గొని ప్రతిభను చూపారన్నారు. సభ అనంతరం పోటిల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందచేశారు. బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు, అధ్యక్షుడు ఎస్పి.రామరాజు, మంగళగిరి, తాడేపల్లి బాలోత్సవ్ అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, నిర్వహణ కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, విద్యాకన్నా, రావి శారద తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటిల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద నృత్యాల పోటీల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
విస్సన్నపేట: విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎంపీపీగా 6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఎస్.ఇలక్కియా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ఎంపీపీతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు. మల్లయ్యకు అభినందనలు గద్దల మల్లయ్యను వైఎస్సార్ సీపీ నాయకులు మండలంలోని పుట్రేల గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద గురువారం అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, నియోజకవర్గ అబ్జర్వర్ తంగిరాల రామిరెడ్డి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, పట్టణ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, సీఓఈ నియామకాలపై నిర్ణయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు గురువారం జరిగాయి. ఆయా సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఆయుష్ కమిషనర్ కె.దినేష్కుమార్లతో పాటు, వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీ సమావేశంలో 11 అంశాలపై చర్చించి ఆమోదించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో 14 అంశాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుత రిజిస్ట్రార్ పదవీ కాలం జనవరి 26తో ముగియనుండడంతో కొత్త రిజిస్ట్రార్ నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కర్నూలుకు చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ను రిజిస్ట్రార్గా నియమించేందుకు తీర్మానం చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా తిరుపతి స్విమ్స్లోని అనాటమీ ప్రొఫెసర్ను నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వీరిద్దరి నియామకాలపై గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఫ్యాకల్టీ, స్టూడెంట్స్కు రీసెర్చ్ ఫండ్ విడుదల, క్రీడల నిర్వహణకు అవసరమైన వ్యయం విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య విద్యార్థులు వత్తిడికి గురికాకుండా ప్రతి 20 మందికి ఒక కౌన్సిలర్స్ కౌన్సెలింగ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో యూనివర్సిటీ పాలకవర్గ సభ్యులు, ఫైనాన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వీఎంసీ కౌన్సిల్లో ‘మంటలు’!
టీడీపీ తీరుతో రసాభాసగా సమావేశం పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి.. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. కమిషనర్కు నోటీసు.. 27వ డివిజన్లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు. -
సంతకాలతో సమరశంఖం
జిల్లాలో కోటి సంతకాల సేకరణ విజయవంతం లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. నందిగామ నియోజకవర్గంలో మాత్రం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఆ ఆరు నియోజకవర్గాల్లో 4.16లక్షల సంతకాలు సేకరించారు. కాగా ఆయా నియోజకవర్గాల నుంచి సంతకాలు సేకరించిన పత్రాలను అట్టహాసంగా ర్యాలీలు నిర్వహించి బుధవారం విజయవాడలోని జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
పురుగు మందు డబ్బాతో రోడ్డెక్కిన రైతు
అయ్యంకి(మొవ్వ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, ఇక తమకు ఆత్మ హత్యే శరణ్యమని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగు మందు డబ్బా పట్టుకుని కుటుంబ సభ్యులతో రోడ్డెక్కాడు. ఈ ఘటన మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ధాన్యం రోడ్ల పైనే ఎండపెట్టి తేమ శాతం 16 వచ్చినా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనలేదు. ఇదే అదనుగా దళారులు రూ.1,200కు ఇస్తావా అని అడుగుతుండడంతో రైతులు దిక్కు దోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి మోహనకృష్ణ పదెకరాలు కౌలుకు తీసు కుని వ్యవసాయం చేస్తున్నాడు. యంత్రాల ద్వారా ధాన్యం నూర్చి బుధవారం నాటికి 16 రోజులుగా ఎండపెట్టాడు. తేమ శాతం 16 వచ్చింది. రోజుకు రూ.3,200 కూలి ఖర్చవుతున్నా గత్యంతరం లేక ధాన్యం పాడవకుండా అరపెడుతున్నాడు. అయితే ధాన్యం అమ్ముడుపోక పోవటం, వేలకు వేలు అదనపు ఖర్చవటంతో ఆ రైతు పడుతున్న ఆవేదన వర్ణనా తీతంగా మారింది. దీంతో పురుగుమందు డబ్బా పట్టుకొని రోడ్డెక్కిన రైతు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ధాన్యాన్ని న్యాయమైన ధరకు కొనుగోలు చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
ఎన్ఆర్సీని తనిఖీచేసిన ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోషకాహారలోపం ఉన్న చిన్నారుల పునరావాస కేంద్రాన్ని (ఎన్ఆర్సీ) బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తనిఖీచేశారు. పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్ఆర్సీ సెంటర్కి వెళ్లి, అక్కడ ఉన్న 14 మంది చిన్నారులను పరిశీలించారు. పోషకాహార లోపం కారణంగా వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేక పోవడంతో వారికి ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు సిబ్బంది తెలిపారు. వారంతా జక్కంపూ డికాలనీ, వాంబేకాలనీ, రాజరాజేశ్వరిపేట, చిట్టినగర్ ప్రాంతాల వారని వివరించారు. విజయవాడతో పాటుజిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని బుధవారం పరిశీలించారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బుధవారం తెల్లవారు జామున రాయనపాడు రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలోని డౌన్లైన్లో పురుషుడు గాయాలతో మృతిచెంది పడివున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థాలానికి వెళ్లి వివ రాలు సేకరించారు. మృతుని ఎత్తు 5.9 అడు గులు, వయస్సు సుమారు 46–48 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం టీషర్ట్, నీలం లోయర్ ఉన్నాయని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో లేదా 88971 56153, 94406 27544 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు. బస్సు నుంచి పడి వృద్ధుడి దుర్మరణం పెనమలూరు: మండలంలోని వణుకూరులో వృద్ధుడు సిటీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కొందపడి మృతి చెందాడు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. వణుకూరుకు చెందిన ఉప్పులూరి కోటేశ్వరరావు (70) సరుకుల కోసం మంగళవారం పటమట వెళ్లారు. సరుకులు తీసుకున్నాక సిటీ బస్సులో వణుకూరు బయలుదేరారు. గ్రామానికి వస్సు వచ్చాక దిగటా నికి ఫుట్పాత్పై నిలబడిన సమయంలో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమవటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడు కోటేశ్వరరావు భార్య శివనాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
16 నుంచి ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉర్దూ అకాడమీ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. ఉర్దూ అకాడమీ ఏపీ ఉద్యోగుల సమీక్ష సమావేశం విజయవాడ పాతబస్తీలోని ముసాఫిర్కానా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదన్నారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమీక్ష సమావేశానికి గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని చైర్మన్ శుబ్లీ ఆదేశించారు. మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్పీర్ పాల్గొన్నారు. ఆర్ఎంపీలకు అవగాహన మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ప్రథమ చికిత్స కేంద్రాలను నిబంధనలకు లోబడి నిర్వహించేలా ఆర్ఎంపీలకు అవగాహన కల్పించే సమావేశాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగంధర్ నిర్వహించారు. ఇటీవల జిల్లాలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ యుగంధర్ పలు సెంటర్లను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తనిఖీల అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎంపీలకు ప్రథమ చికిత్స కేంద్రాల్లో అనుమతి పొందన సేవలు, చేయకూడని వైద్య ప్రక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రొటోకాల్ వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు. ఇటీవల జిల్లాలో వెలుగుచూస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి పై ఆర్ఎంపీలకు అవగాహన కల్పించారు. -
మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకున్న ఆర్పీఎఫ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆపరేషన్ యాక్షన్, ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ నాన్హే ఫారిస్టే సేవల్లో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో పలు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ యాక్షన్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన నెల్లూరు, ఒంగోలు ఆర్పీఎఫ్, విజయవాడ సీఐబీ, బచపన్ బచావ్ ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్తలు, ఏపీఓల సంయూక్త బృందాలు ఒంగోలు– నెల్లూరు మధ్య టాటానగర్–యర్నాకులం ఎక్స్ప్రెస్ (18189) రైలులో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు బాలురిని గుర్తించి విచారించగా, ఇద్దరు ఏజెంట్టు వారిని పనుల కోసం ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. తదుపరి దర్యాప్తు కోసం ఏజెంట్లను నెల్లూరు జీఆర్పీ పోలీసులకు అప్పగించి, మైనర్లను సీడబ్ల్యూసీ సమక్షంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా గుంటూరు–రాయగడ (17243) ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడి బ్యాగులోని నగదు, సెల్ఫోన్ చోరీ కేసుపై ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీ సులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి తుని రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.54 వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఆపరేషన్ నాన్హే ఫారిస్టేలో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 13 ఏళ్ల బాలుడిని విజయవాడ రైల్వేస్టేషన్లోని ఆరో నంబర్ ప్లాట్ఫాంపై గుర్తించారు. బాలుడిని సంరక్షణ నిమిత్తం చైల్డ్ హెల్ప్ డెస్క్కు అప్పగించారు. అక్కడ బాలుడికి కౌన్సిలింగ్ చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. అపరేషన్ అమానత్లో భాగంగా ఒంగోలు, అనకాపల్లి స్టేషన్లలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగులను స్వాధీనం చేసు కుని యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీఎస్సీ (డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) షణుగ్మ వడివేల్ ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
‘భోజనం తినలేక పోతున్నాం’
పులిగడ్డ(అవనిగడ్డ): గురుకుల పాఠశాలలో పెడుతున్న భోజనం తినలేక పోతున్నామని, ఏదీ సరిగా వండరని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కె. కృష్ణకిరణ్కు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పులిగడ్డ గురుకుల పాఠశాల, అవనిగడ్డలో జెడ్పీ హైస్కూల్, పలు అంగన్వాడీ కేంద్రాలను కృష్ణకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 90 శాతం మంది విద్యార్థులు సరైన ఆహారం పెట్టడం లేదని లిఖితపూర్వకంగా చెప్పారు. అనంతరం అవనిగడ్డలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాథ, తూనికలు, కొలతలు అధికారి ఈశ్వరరావు, ఉప విధ్యాధికారి శేఖర్ సింగ్ పాల్గొన్నారు. -
భలే భలే.. బాలోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఎనిమిదో అమరావతి బాలోత్సవం బుధవారం చిన్నారుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. రెండో రోజైన బుధవారం జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై ఈ పోటీలు జరిగాయి. చిత్రలేఖనం, తెలుగు డిక్టేషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, షార్ట్ ఫిల్మ్ విశ్లేషణ, డిబేట్, కోలాటం, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్ డాన్స్, జానపద గీతాలాపన, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ రైమ్స్, పద్యం–భావం అంశాల్లో పోటీలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నాం 3.30 గంటలకు బాలోత్సవం ముగింపు సభ, విజేతలకు బహుమతులు ప్రదానం జరుగుతా యని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు తెలిపారు. -
వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన
తాడికొండ: రెండో విడత భూసమీకరణలో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ్తేజతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రా యాలు సేకరించారు. రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తాము భూములిస్తే ఎన్ని రోజుల్లో అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తానని మంత్రి తెలుపగా సమయానికి ఇవ్వకపోతే ఏడాదికి రూ.5 లక్షలు రైతులకు చెల్లించేలా బాండ్ ఇవ్వాలని కోరారు. -
భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువైన ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు సిద్ధమైంది. మాల విరమణకు తరలివచ్చే భవానీలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ 15వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతితో ముగుస్తుంది. తొలి రోజు తెల్లవారుజామున 6.30 గంటలకు మహా మండపం దిగువన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపనతో దీక్షల విరమణ ప్రారంభమవుతుంది. ఐదు రోజులు కొనసాగే ఉత్సవాలకు ఆరు లక్షల మంది భవానీలు దీక్షల విరమణ చేస్తారని పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రోజూ 20 గంటల పాటు అమ్మ దర్శనం దీక్షల విరమణలో తొలి రోజు మినహా మిగిలిన నాలుగు రోజుల్లో రోజూ 20 గంటలకు పైగా అమ్మ వారి దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి తెల్లవారుజాము మూడు నుంచి రాత్రి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమయంలో అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. ఇక సాయంత్రం అంతరాలయంలో పంచహారతుల సేవ జరుగుతుండగా, బయట అన్ని క్యూలైన్లు యథావిధిగా నడిచేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పంచహారతుల సమయంలోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకునే వీలు కలుగుతుంది. రద్దీ మరింత అధికమయితే చివరి మూడు, నాలుగు రోజుల్లో దర్శన సమయాన్ని మరింత పెంచే అవకాశాన్ని వైదిక కమిటీ పరిశీలిస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. అల్పాహారం పంపిణీకి ఏర్పాట్లు భవానీలు, భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనుంది. తెల్లవారుజాము ఆరు నుంచి పది గంటల వరకు పులిహోర, దద్యోజనం, కట్టెపొంగలి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలకు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం అక్కన్న, మాదన్న గుహల ఎదుట వెలివేటెడ్ క్యూలైన్ల కింద ఐదు నుంచి ఏడు గంటల వరకు కదంబం, ఏడు నుంచి 11 గంటల వరకు ఉప్మా పంపిణీచేస్తారు. రోజుకు 32 వేల మందికి అన్న దానం, అల్పాహారం పంపిణీచేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లడ్డూ ప్రసాదాలను కొరినన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు 30 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిద్ధం చేస్తోంది. బుధవారం సాయంత్రం నాటికి ఆరు లక్షల లడ్డూలను సిద్ధం చేసింది. ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీ మాలధారులు నేటి ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రతిష్టాపన ఐదు రోజులు కొనసాగనున్న ఉత్సవాలు -
వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోరండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోసం ట్రిబ్యూనల్ను ఆశ్రయించాలని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు బుధవారం వక్ఫ్బోర్డు సీఈఓ మహమ్మద్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ట్రిబ్యూనల్ను ఆశ్రయించా యని పేర్కొన్నారు. ముస్లిం జేఏసీ కన్వీ నర్ మునీర్ అహ్మద్ షేక్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు వక్ఫ్బోర్డు సీఈఓను కలిసి సమస్యను వివరించారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన సమయంలో ఆరు నెలల్లో ఉమిద్ పోర్టల్లో ఆస్తులు నమోదు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. ఈ నెల ఆరో తేదీతో ఆ గడువు ముగిసినా చాలా ఆస్తులను ఉమిత్ పోర్టల్లో నమోదు చేయలేదని వివరించారు. ట్రిబ్యూనల్ కర్నూలులో ఉందని, శాశ్వత జడ్జి లేనందున రోజు వారీ విచారణ జరగటం లేదని పేర్కొ న్నారు. వక్ఫ్ సీఈఓను కలిసిన వారిలో ముస్లిం అడ్వికేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ మతీన్, మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు ముఫ్తీ యూసఫ్ అలీ, నసీర్ ఉమ్రీ, ముఖ్తార్ అలీ తదితరులు ఉన్నారు. -
దీక్షల విరమణ బందోబస్తుపై దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణకు బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దిశా నిర్దేశం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బందోబస్తు సిబ్బందితో సీపీ బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బంది రెండు షిఫ్టుల్లో విధులకు హాజరు కావాలని సూచించారు. గిరిప్రదక్షిణ మార్గం, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో చూపించి తగు సూచనలు, సలహాలు అందించారు. భవానీలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. టాఫిక్ అవాంతరాలు కలుగకుండా చూడాలన్నారు. అంతరాలయం పరిసరాలు, కొండ దిగువన, క్యూలైన్లు, ఇరుముడి విరమణ ప్రదేశాలు, హోమ గుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గానగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, బి.లక్ష్మీనారాయణ, షిరీన్బేగం, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్బాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుర్గగుడి పరిసరాలను సీపీ రాజశేఖరబాబు క్షేత్రస్థాయిలో సందర్శించారు. -
అంగన్వాడీ వర్కర్లకు 5జీ సెల్ ఫోన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు అంగన్వాడీ వర్కర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంగన్వాడీ వర్కర్లకు సెల్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. 58,204 మంది వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరీతో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో పిల్లలను అందంగా అలంకరించటానికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో కొత్త యూనిఫాం, అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. -
జమలపూర్ణమ్మకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవలె అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. -
లక్ష్యానికి మించి సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ఎన్టీఆర్ జిల్లాలో విశేష స్పందన లభించింది. నూతన వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయోద్దంటూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ విద్యావంతులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరిగింది. ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 60 వేల చొప్పున సేకరించాలని లక్ష్యంగా కాగా, ప్రస్తుతం 4.60 లక్షలు సంతకాలు సేకరించారు. ఇంకా మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. ఐదు నియోజకవర్గాల్లో పూర్తి..విజయవాడతూర్పులో 97వేలు, విజయవాడ వెస్ట్లో 65వేలు, సెంట్రల్లో మంగళవారం సేకరించిన 4వేల సంతకాలతో 60వేలకు చేరింది. తిరువూరులో 75వేలు, జగ్గయ్యపేటలో 60,500 సంతకాలు సేకరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ● మైలవరం నియోజకవర్గంలో మంగళవారం జి.కొండూరు మండలంలో 3,950, మైలవరం మండలంలో 11,600 సంతకాలు సేకరించారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకూ 50వేల సంతకాలు సేకరించినట్లయింది. ● తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మంగళవారం పదివేల సంతకాలు సేకరించి నియోజకవర్గ కార్యాలయంలో అప్పగించారు. ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో మంగళవారం దాదాపు వెయ్యికిపైగా సంతకాలు సేకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4.60లక్షల సంతకాలు -
సేవల్లో గుడివాడ ఆర్ఆర్ఐ ముందంజ
హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ గుడివాడరూరల్: రాష్ట్రంలో సీసీఆర్హెచ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధన, వైద్య సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో గుడివాడ ఆర్ఆర్ఐ(హెచ్) దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ పేర్కొన్నారు. స్థానిక హోమియో వైద్యశాలలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడివాడ హోమియో వైద్యశాలకు సగటును రోజుకు 300మందికి పైగా రోగులకు అవుట్పేషంట్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 25పడకల ఇన్పేషెంట్ విభాగం(ఐపీడీ) కూడా ఉందని, రోగులకు అవసరమైన సమయంలో అన్ని సేవలు అందించి ప్రత్యేక చికిత్స అందిస్తామన్నారు. సమగ్ర నిర్ధారణ కోసం సక్రమంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాల సదుపాయాలు, లేబొరేటరీ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల వారు హోమియో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఢిల్లీలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే 2వ డబ్ల్యూహెచ్వో గ్లోబల్ సంప్రదాయ వైద్య సదస్సు గురించి ఆయన వివరించారు. ఈ సదస్సుకు ఆరోగ్యం, సంతోషం కోసం శాసీ్త్రయ ఆచరణ అనే థీమ్ను నిర్ణయించినట్లు తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. -
చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు పాలనపై వ్యతిరేకతను ప్రజలు తమ సంతకంతో తెలియజేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. నూతన వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ తూర్పులోని ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ చేపట్టామని, చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తమ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారన్నారు. దీంతో 97వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేస్తూ సంతకాలు చేశారన్నారు. కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి.. ఇప్పటికై నా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలని దేవినేని అవినాష్ హితవు పలికారు. ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి 60 వేలకు పైనే సంతకాలు చేశారన్నారు. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పేపర్లు జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తాయని, ఈ నెల 15న జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతామన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సంతకాలను గవర్నర్కి అందజేస్తామని తెలిపారు. వైద్య కళాశాలలు పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం.. గాల్లో దీపం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఆహార తనిఖీలు చేయాల్సిన ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతుండగా, నాణ్యాతా ప్రమాణాలు పాటించని ఆర్ఓ ప్లాంట్ల నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తరచూ ప్రజలు అంటువ్యాధులు బారిన పడుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. ప్రజారోగ్యశాఖ అంటే కేవలం నగరంలో శానిటేషన్ పనులకే పరిమితమైనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అనారోగ్యాలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. తనిఖీలు చేయరా.. నగరంలో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అంతేకాదు మటన్షాపుల్లో మాంసం కల్తీ కూడా జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. కానీ మటన్ దుకాణాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. కేవలం కబేళాలో ముద్ర వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మాంసం దుకాణాలు తనిఖీ చేసేందుకు నగర పాలక సంస్థలో పశు వైద్యుడితో పాటు ప్రతి డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు నగరంలో ఆర్ఓ ప్లాంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వాటిలో సగానికి పైగా నాణ్యత లేనివే ఉన్నాయి. అందుకు న్యూ రాజరాజేశ్వరీపేటలో నిర్వహించిన తనిఖీల్లో వచ్చిన రిపోర్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి నీళ్లు తాగి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. నగరంలోని ఫుడ్స్టాల్స్లో తనిఖీలు చేసే అధికారం కూడా ప్రజారోగ్య సిబ్బందికి ఉంటుంది. కానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లే కావాలి.. నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాళ్లు డబ్బులు లేనిదే ఏ పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి, షాపులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. జనన, మరణాల నమోదులో సైతం చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మాంసం దుకాణాలు, హోటళ్ల నుంచి కూడా మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తూ అసలు ప్రజారోగ్యాన్ని పక్కన పెడుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తరచూ సాంక్రమిక వ్యాధులు.. నగర ప్రజలు తరచూ డయేరియా బారిన పడుతున్నారు. ఈ ఏడాది న్యూ రాజరాజేశ్వరీపేటలో దాదాపు 400 మంది డయేరియా బారిన పడ్డారు. ఇటీవల పాత రాజరాజేశ్వరిపేటలో మరో 10 మంది వరకూ డయేరియా బారిన పడిన విషయం తెలిసిందే. కలుషిత ఆహారం, నీరు కారణంగా తరచూ ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారంపై ఫుడ్ కంట్రోలర్తో పాటు, కార్పొరేషన్ ప్రజారోగ్య సిబ్బంది తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ, వాళ్లు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. దీంతో విచ్చలవిడిగా నాణ్యత లేని ఆహార విక్రయాలు జరగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఓ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తున్నాం. నాణ్యతను పరిశీలిస్తున్నాం. – డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ -
టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ధర్నా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని డివిజన్ కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ డీఈవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఆ సంఘ నేతలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ సుందరయ్య మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం సవరణ, ఎన్సీటీఈ నిబంధనలు సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం జరపకపోవడం దారుణం.. గత ఏడాది ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో సెలవు దినాలలో పని చేసిన వారికి 10 రోజులు సీసీఎల్ లీప్ యాప్ నందు నమోదు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా గాని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరపక పోవడాన్ని ఖండించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బదిలీ అనంతరం ముగ్గురు ఉపాధ్యాయులు కొంతమంది జీతభత్యాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా సహాధ్యక్షురాలు పి. లీల, జిల్లా కార్యదర్శి డి. హరి ప్రసాద్, బి. రెడ్స్టార్, సిటీ నాయకులు సీహెచ్ వెంకట రమణ, డి. పూర్ణ చంద్రరావు, ఎ. భరత్, ఎస్పీ దేవ్, ఎండీ హాసన్ తదితరులు పాల్గొన్నారు.. -
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
కంచికచర్ల: మానవ జీవనానికి ఆధారమైన వ్యవసాయం, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావుకు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ.. రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, రైతులను ఆదుకోవాలని కోరేందుకు వస్తున్న తమను పోలీసులతో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? స్థూల ఉత్పత్తి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, వ్యవసాయాధారిత రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూలిపోయి, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా అది ఎలా సాధ్యమని జగన్మోహనరావు ప్రశ్నించారు. కంచికచర్ల మార్కెట్ యార్డుకు ఆగస్టులో తీసుకొచ్చిన అపరాల పంట నేటికీ అలానే దర్శనమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంటలు సాగు చేసిన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడేలా రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనలేకపోవటం సిగ్గుచేటు అధికార పార్టీ నేతలకు సిగ్గుంటే రైతులు పండించిన ప్రతి ఒక్క పంటను ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని జగన్మోహనరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ లేకపోవటం సిగ్గుచేటన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవటం, 18 నెలల పాలనలో ఈ పంటలు ఇంత కొన్నాం రైతులకు మేలు చేశామని చెప్పలేకపోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి మల్లికార్జునరావు, వేమా సురేష్బాబు, ఆవల రమేష్, కాలవ పెదబాబు, నువ్వుల విశ్వనాథం, కాలవ వాసుదేవరావు, దేవరకొండ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
పేపర్ కంపెనీలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేదు. ఫలితంగా పేపర్ కంపెనీల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వ్యవ హరిస్తున్నారు. సుబాబుల్ కర్ర లేనప్పుడు ధర పెంచటం, కర్ర రాగానే ధర తగ్గించటం చేస్తున్నారు. గతంలో ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు సక్రమంగా జరిగేవి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కనగాల రమేష్, రైతు నాయకుడు, మక్కపేట, వత్సవాయి మండలం -
● ఉత్సాహంగా.. ఉల్లాసంగా బాలోత్సవం
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎనిమిదో అమరావతి బాలోత్సవం మంగళవారం ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజయవాడ నగరంలోని పాఠశాలలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో కూడా పోటీలు కొనసాగుతాయని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు తెలిపారు. సభ అనంతరం సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కొత్త డీఈఓల నియామకం
మచిలీపట్నంఅర్బన్/వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు నూతన డీఈఓలు నియమితులయ్యారు. కృష్ణా జిల్లాకు యు.వి.సుబ్బారావును విద్యాశాఖ నియమించింది. ఆయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన బందరు ఉప విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన పి.వి.జె.రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారిగా ఎల్.చంద్రకళ నియమితులయ్యారు. ఆమె పల్నాడు జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. చంద్రకళ గతంలో ఉపవిద్యాశాఖాధికారిగా పని చేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లోని 16 బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ మంగళ వారం జువైనెల్ జస్టిస్ రూల్స్ ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 16,17 తేదీల్లో అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు, వైద్య శిబిరాల నిర్వహణ, ఆధార్ లేని బాలలకు ఆధార్ కల్పించటం, బాలలను స్కూల్లో చేర్పించడం వంటి తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కేంద్రాలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు జ్యోతి, డాక్టర్లు మాధవి, రాఘవరావు, ఫ్రాన్సిస్ తంబీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ కార్యనిర్వహణాధికారి అరుణ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీపావని, ఈఓ ఆకుల కొండల రావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీల కానుకలను లెక్కించారు. 45 రోజులకు రూ.16,58,075 నగదు, 920 మిల్లీ గ్రాముల బంగారం, 125 గ్రాములు వెండి వచ్చిందని ఈఓ కొండలరావు తెలిపారు. దేవస్థాన సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు సేవా సమితి బాధ్యులు, వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని వైద్య సిబ్బందికి సూచించారు. నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లకు మంగళవారం పల్స్పోలియోపై శిక్షణ ఇచ్చారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. ఈ నెల 21న బూత్ యాక్టివిటీలో ఐదేళ్ల వయస్సుగల పిల్లలందరికీ రెండు చుక్కల పోలియో చుక్కలు వేయాలన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శరత్బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.3532 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు. పాయకాపురం (విజయవాడ రూరల్): ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో రెండో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని ఆయుర్వేద పరిశోధన అధికారి డాక్టర్ కె.మిథున్ మోహన్ తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని న్యూ రాజీవ్నగర్లో ఉన్న ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె. మిథున్ మోహన్ మాట్లాడుతూ.. ఆయుష్ వ్యవస్థల ప్రత్యేక ప్రదర్శన, దేశ జ్ఞాన వారసత్వం, ప్రజారోగ్య సమన్వయం, పరిశో ధన – సాంకేతికత, అనుభవాత్మక వెల్నెస్ వంటి రంగాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సుమారు వంద దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు వర్చువల్గా పాల్గొంటారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో 700 మంది ప్రత్యక్షంగా హాజరు కానున్నారని, వందకు పైగా దేశాల నుంచి 79 అధికారిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. సమ్మిట్ ముగింపు రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అఽధానోంగేబ్రియేసస్, పలు దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటా రని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశోధన అధికారులు డాక్టర్ సుజాత, పి.ధోకే తదితరులు పాల్గొన్నారు.పెనుగంచిప్రోలు: పేపర్ కంపెనీలు కొన్ని సిండికేట్ అయ్యాయి. సుబాబుల్ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయిస్తూ నష్టాలపాలు చేస్తున్నాయి. పేపర్ కంపెనీలు ఏకపక్షంగా ధరలను భారీగా తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్య పేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో సుబాబుల్ సాగు ఎక్కువగా జరుగు తోంది. జిల్లాలో మొత్తం మీద సుమారుగా 70 వేల ఎకరాల్లో సుబాబుల్ సాగవుతోంది. పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు ఆ పంటల్లో దిగుబడి లేక, గిట్టుబాటు ధర దక్కక సుబాబుల్ సాగు చేపట్టారు. అయితే పేపర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించడంతో సుబాబుల్ సాగులోనూ నష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు. ఇటీవల వరకు టన్ను సుబాబుల్ ధర రూ.6,500 వరకు పలికింది. నెల రోజుల్లో ఆ ధర కాస్తా రూ.5,600కు పడి పోయింది. అంటే నెల రోజుల్లోనే రైతులు టన్నుకు రూ.900 చొప్పున నష్టపోతున్నారు. అజమాయిషీ లేదు సుబాబుల్ మార్కెట్పై ఎటువంటి అజమాయిషీ లేక పోవటంతో కంపెనీల ఇష్టారాజ్యంగా తయారైంది. గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సుబాబుల్ కర్ర కొనుగోళ్లు జరిగేవి. కర్ర ఎంత ఉత్పత్తి జరుగుతోంది, ఎంత కొనుగోళ్లు జరిగాయి వంటి వివరాలు మొత్తం ఏఎంసీల వద్ద ఉండేవి. ఏఎంసీల ద్వారానే కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించేవి. అయితే అమ్మకం పన్ను చెల్లించాల్సి రావటంతో కొన్నేళ్ల నుంచి ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు తీసేశారు. ప్రస్తుతం పేపర్ కంపెనీలు, వ్యాపారుల ద్వారానే కర్ర విక్రయాలు జరుగుతున్నాయి. వారు చెప్పిందే ధర అన్నట్లుగా తయారైంది. ఇటీవల మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, ఏఎంసీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ధర తగ్గకూడదని చెప్పినా వాస్తవంలో అది జరగటం లేదని రైతులు అంటున్నారు. ఆందోళనలో రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టటంతో కర్ర కోత బాగా పెరిగింది. ధర ఆశాజనకంగా ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సుబాబుల్ దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పేపర్ కంపెనీలు ధర తగ్గించాయని రైతులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందేమే అని ఆందోళన చెందుతున్నారు. పేపర్ కంపెనీలకు అవసరమైనప్పుడు ధర పెంచటం లేనప్పుడు తగ్గించటం చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భవానీ దీక్షల విరమణకు వేళాయె7పత్తి, మిర్చి సాగులో ఏటా నష్టాల పాలవుతున్న రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సుబాబుల్ ధర బాగుండటంతో పాటు సాగు నీరు అంతగా అవసరం లేక పోవటం వంటి కారణాలతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకు మొగ్గు చూపారు. మొక్క నాటిన రెండు నుంచి మూడేళ్లకు కర్ర కోతకు వస్తుంది. ఎకరానికి సగటున 30 నుంచి 35 టన్నుల దిగుబడి చేతికొస్తుంది. కర్ర దిగుబడి పెరగటంతో పేపర్ కంపెనీలు మళ్లీ తమను దోపిడీకి గురి చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.900 చొప్పున తగ్గించాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఐటీసీ భద్రాచలం, ఏపీపీ రాజమండ్రి, బలార్షా, సిర్పూర్ కాగజ్నగర్, జేకే కంపెనీలు రైతుల వద్ద నుంచి సుబాబుల్ కర్ర కొనుగోలు చేస్తాయి. కొన్ని కంపెనీలు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నాయి. -
అప్పులు ఎలా తీర్చాలి?
పెసర, పత్తి, మొక్క జొన్న, మినుము సాగుచేశా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటనూ కొనలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం పంటలు కొనకపోవటంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించా. ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశా. ఆ పంటలు చేతికిరాగానే అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు. – ఉయ్యూరు మల్లారెడ్డి రైతు, వేములపల్లి, కంచికచర్ల మండలం ● -
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఉత్తర్వులపై ఉత్కంఠ
సాక్షి, విజయవాడ: దొడ్డిదారిన తనపై నమోదైన ఫైబర్నెట్ కుంభకోణం కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రయత్నానికి వైఎస్సార్సీపీ నేత, ఫైబర్నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి రూపంలో ట్విస్ట్ ఎదురైంది. తాజాగా గౌతమ్రెడ్డి వేసిన పిటిషన్ను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఉత్తర్వులను రెండ్రోజుల పాటు వాయిదా వేసింది. 2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీడీఐ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్మెంట్కు కూడా సిద్ధమైంది.అయితే.. అదే సీడీఐ ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదని.. ఈ కేసు క్లోజ్ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సీఐడీ, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎండీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని పూనూరు గౌతమ్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ఇవాళ గౌతమ్ తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అభియోగాలను, వివరాలను.. ఇప్పుడు అధికారం ఉండడంతో కేసును మూసేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ ఆర్డర్స్ను 11వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ దేవినేని ఆవినాష్
సాక్షి, విజయవాడ: అక్టోబర్ నుండి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ వివరాల ప్రకారం, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంచనాలకు మించి 96 వేల సంతకాలు తూర్పు నియోజకవర్గంలోనే పూర్తయ్యాయి.కూటమి ప్రభుత్వ విధానాలను వైఎస్సార్ సీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేశారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు కోరుకొంటున్న విధంగా పరిపాలన చేయాలి. ఎన్టీఆర్ జిలాల్లో ప్రతి నియోజకవర్గంలో 60వేల పైనే సంతకాలు చేశారు. 18నెలల్లో ప్రజలకు ఉపయోగ పడే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయి. ఈ ప్రభుత్వంలో 8వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు పడలేదు. మా పాలనలో ఒక్క రోజు లేట్ ఐతే నానా రభస చేసే వాళ్ళు. ఇప్పుడు ఎల్లో మీడియాకి కనపడడం లేదా? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చినా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు.అప్పులు తీసుకొని వొచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. సంక్షేమం లేదు..అభివృద్ధి లేదు.. నియోజక వర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకి సేకరించిన సంతకాలు వస్తాయి.15వ తేదీన జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకి సంతకాలు పంపుతాం. 17న రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చిన సంతకాలు గవర్నర్ కి అందజేస్తాం. పిపిపికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని దేవినేని ఆవినాష్ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. -
కొమ్మా కోటేశ్వరరావుకు 15 వరకు రిమాండ్
రామవరప్పాడు(విజయవాడ రూరల్): కృష్ణాజిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ టీడీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో కొమ్మా కోటేశ్వరరావు(కొమ్మా కోట్లు)కు ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు విజయవాడ పటమట పోలీస్స్టేషన్లో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోగా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు. -
వైద్యశాఖలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించండి
ప్రభుత్వానికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యశాఖలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.గిరిబాబు అన్నారు. ఆస్పత్రుల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జీఓ ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పీహెచ్సీలు 24/7 ఆస్పత్రులుగా ఉన్నందున, వాటిలో అదనంగా మరో స్టాఫ్నర్సును నియమించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, వీక్లీ ఆఫ్, సెలవుల్లో సర్దుబాటు కావడం లేదని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు లాస్ట్ గ్రేడ్ వర్కర్లు ఉండేలా చూడాలని కోరారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజీ సర్వీసు సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. కాల్ డ్యూటీ పేరుతో ఉన్న వారినే 24 గంటలు డ్యూటీ చేయమనడం సరికాదన్నారు. సెకండరీ హెల్త్ విభాగంలో ఉద్యోగుల సెలవులు మంజూరుకు పెట్టిన ఐదు శాతం నిబంధన తీసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు పోస్టులు భర్తీ చేయాలని, శాఖాపరమైన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. పెరిగిన ఆస్పత్రులకు అనుగుణంగా వైద్యులు, పారామెడికల్, నర్సింగ్, క్లాస్ఫోర్ సిబ్బంది నియామకాలు చేపడితేనే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ ఫైలింగ్లో కాలపరిమితి పెట్టాలని గిరిబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడిన పోలీసులు పటమట(విజయవాడతూర్పు): జాతీయ రహదారి 16పై రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ మీదగా స్క్యూబ్రిడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాల మేరకు సోమవారం రాత్రి బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ దిగే సమయంలో రామవరప్పాడు వైపు నుంచి స్క్యూబ్రిడ్జికి వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు లారీ కింద చిక్కుకున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే 5వ ట్రాఫిక్ సీఐ రవికుమార్కు వైర్లెస్ సెట్లో సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడు కారు వెనుక లారీకింద చిక్కుకున్నాడు. వెంటనే క్షతగాత్రుడిని బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యమవుతుందని క్షతగాత్రుడిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిలువెత్తు నిర్లక్ష్యం
జి.కొండూరు: కవులూరు పెద్ద చెరువుకు నీటి సరఫరా కోసం తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ నిర్మాణం చేసి దశాబ్దకాలం పూర్తయింది. పథకం నిర్మించి ప్రారంభించగానే పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. ఈ లోపు పట్టిసీమ నీళ్లు రాకతో చెరువుకు నీటి సమస్య తీరింది. సబ్లిఫ్ట్ మరుగున పడింది. రూ.కోట్లు వెచ్చించి కట్టిన సబ్లిఫ్ట్ దశాబ్దకాలం పైబడి నిరుపయోగంగా మారి తుప్పు పడుతోంది. సరైన భద్రత లేకపోవడంతో మోటార్లు, విలువైన విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి మోటార్లు, విద్యుత్ పరికరాలను అవసరమైన చోట వినియోగించడం లేదా, భద్రపరచడం చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.2కోట్ల వరకు వెచ్చించి... తారకరామా ఎడమ కాల్వపై కవులూరు గ్రామ శివారులో 2.8 కిలోమీటరు వద్ద రూ.2 కోట్లకుపైగా నిధులను వెచ్చించి 2009–14 మధ్య కాలంలో సబ్లిఫ్ట్ను నిర్మించారు. ఈ సబ్లిఫ్ట్ నిర్మాణంలో భాగంగా 9 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో పంపుహౌస్ను నిర్మించారు. ఈ పంపుహౌస్లో 30 హెచ్పీ సామర్ధ్యం గల మూడు మోటార్లను అమర్చారు. ఈ పంపుహౌస్ను నడిపేందుకు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశారు. సబ్లిఫ్ట్ నుంచి కవులూరు పెద్ద చెరువు వరకు 1.5 కిలోమీటర్లు పైపులైన్ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఈ సబ్లిఫ్ట్ను ప్రారంభించగానే పైపులైను పగిలిపోవడంతో నిలిపివేశారు. పట్టిసీమ నీళ్ల రాకతో... తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ నిర్మాణం ద్వారా కవులూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువుకు నీటిని సరఫరా చేయడం లక్ష్యం. ఈ చెరువు 212.15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఆయకట్టు సాగు భూమి 638.41ఎకరాలు ఉంది. చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం 41.757 మిలియన్ క్యూబిక్ అడుగులుగా ఉంది. అయితే ఈ చెరువు బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఆనుకుని ఉండి కెనాల్ నుంచి నీరు చెరువులోకి వచ్చేందుకు తూము సైతం ఉంది. ఈ క్రమంలో గతంలో బుడమేరుకు వరదలు వచ్చిన సమయంలో మాత్రమే డైవర్షన్ కెనాల్లో నీటి ప్రవాహం కొనసాగితే ఈ చెరువుకు నీటి సరఫరా అయ్యేది. దీని వలన రైతుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ను నిర్మించారు. అయితే 2014–19 మధ్య కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ అనంతరం పోలవరం రైట్మెయిన్ కెనాల్ ద్వారా నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్లో కలిపి కృష్ణానదిలో కలిసేలా చేశారు. అప్పటి నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేసినప్పుడల్లా బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి ఈ చెరువుకు తూము ద్వారా నీటి సరఫరా అవుతోంది. దీంతో ఈ సబ్లిఫ్ట్ అవసరం లేకుండా పోయింది. దీంతో దాని మరమ్మతులను అధికారులు వదిలేశారు. అప్పటి నుంచి సబ్లిఫ్ట్ నిరుపయోగంగా మారి మోటార్లు, విద్యుత్ పరికరాలు తుప్పు పట్టిపోవడంతోపాటు వాటి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. పంపుహౌస్ ప్రాంగణంలో తుప్పుపట్టి నిరుపయోగంగా మారిన ట్రాన్స్ఫార్మర్ పంపుహౌస్లో నిరుపయోగంగా ఉన్న మోటార్లు తుప్పుపడుతున్న ప్రజాధనం -
కృష్ణలంక హైవేపై బైక్ దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యనమలకుదురు, అవనిగడ్డ కరకట్ట రోడ్డులోని హోసన్నా మందిర్ సమీపంలో నివాసం ఉంటున్న పి.కిషోర్ కంచికచర్లలోని మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన యూనికార్న్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. కృష్ణలంక, ఫైర్స్టేషన్ సెంటర్లో హైవే మీదకు చేరుకోగానే ద్విచక్ర వాహనం ఇంజిన్లో లోపాలు తలెత్తి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన కిషోర్ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. అప్పటికే యువకుని కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి పామర్రు: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన పామర్రులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు పంచాయతీ పరిధిలోని చెన్నువానిపురానికి చెందిన చిన్నం విజయ్బాబు(51) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం బలిపర్రులో ఓ ఇంటి కరెంట్ వైరింగ్ పనులు చేస్తూ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కగా, విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై కిందకు పడిపోయాడు. చెవుల నుంచి రక్తం కారుతుండగా అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాడు. విజయ్ మృతితో స్వగ్రామమైన చెన్నువానిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్బాబు భౌతిక కాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చెల్లని చెక్కు కేసులో వ్యక్తికి ఏడాది జైలుశిక్ష గన్నవరం: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ గన్నవరం స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. మండలంలోని కేసరపల్లికి చెందిన బొర్రా నాగరాజు వద్ద వ్యాపార అవసరాల నిమిత్తం ఘంటసాల మహంకాళరావు అలియాస్ మాణిక్యాలరావు 2024లో రూ.8 లక్షల రుణం తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో తీసుకున్న రుణం చెల్లింపు నిమిత్తం బ్యాంక్ చెక్ను మహంకాళరావు ఇచ్చారు. అయితే సదరు చెక్ బౌన్స్ కావడంతో నాగరాజు స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మహంకాళరావుకు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య ముసలం వచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రేగిన వివాదం ఇరు పార్టీల నాయకులు తోపులాటలు, నల్లజెండాలతో నిరసనలు, నినాదాలు, బైఠాయింపుల వరకు వెళ్లింది. ఈ ఘటన సోమవారం నగరంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అతుల్ బిహారీ వాజ్పేయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు సోమవారం ఉదయం టెంకాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సర్కిల్లో టీడీపీ నాయకులు నిలబడి బీజేపీ నాయకులు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు సర్కిల్ బయట రోడ్డుపై టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకులకు పోటీగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించే ప్రయత్నం చేయగా చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు నల్ల జెండాలను పట్టుకుని జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్... అంటూ నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు జోహార్ వాజ్పేయ్ అంటూ పోటీగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 2014లోనే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని, ఈ సర్కిల్కు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం కూడా చేశామని చెప్పారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేయడంతో సమస్య సద్దుమణిగింది. -
స్క్యూబ్రిడ్జి వద్ద భవానీల ఆందోళన
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ స్క్యూబ్రిడ్జి వద్ద స్వల్ప విషయమై భవానీ మాలధారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో భవానీలు సుమారు గంటపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది వారిని కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే... కంకిపాడుకు చెందిన సుమారు 25 మంది భవానీ మాలధారులు రెండు ఆటోల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం మధ్యాహ్నం సద్దికి బయలు దేరారు. ఆటో వెనుక డోర్పై కూడా కూర్చుని ప్రయాణిస్తున్న భవానీ మాలధారులను కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద కానిస్టేబుల్ చూసి వారిని ఆపారు. సురక్షితం కాని ఇలాంటి ప్రయాణం చేయవద్దని మందలించారు. దీంతో భవానీ మాలధారులకు, కానిస్టేబుల్కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ తరుణంలో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని భవానీ మాలధారుల్లో ఒకరు పగలకొట్టినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంజిసర్కిల్ వద్ద ఆపిన పోలీసులు ఆటోల్లో వస్తున్న భవానీ మాలధారులను బెంజిసర్కిల్ వద్ద పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారని భవానీ మాలధారులు గొడవ పడుతుంటే , ట్రాఫిక్ ప్రాంతం కావడంతో వదిలేశారు. అనంతరం స్క్యూబ్రిడ్జి వద్ద రెండు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన ట్రాఫిక్ పోలీసులు తమ ఆటోలను ఆపడంతో భవానీ మాలధారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గంటపాటు ఆందోళన సాగడంతో ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా తొలుత వినలేదు. అనంతరం వారందరినీ కృష్ణలంక పోలీస్స్టేషన్కు రమ్మని తీసుకెళ్లారు. అయితే వారు ఫిర్యాదు చేయకుండానే స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. గంటపాటు చేసిన ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కృష్ణలంక, పటమట, ట్రాఫిక్ సీఐలు నాగరాజు, పవన్కిషోర్, రామారావు, బాలమురళీకృష్ణ చర్యలు తీసుకున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 82 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్కు ప్రజల నుంచి 82 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకుని, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఎస్హెచ్ఓలతో పాటు, సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 2, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 7, మహిళ సంబంధిత నేరాలపై 5, దొంగతనాలకు సంబంధించి 2, రోడ్డు ప్రమాదాలపై 1, ఇతర చిన్న వివాదాలపై 17 ఇలా మొత్తం 82 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించారు. అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం డీఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దార్శనికత, జ్ఞానం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో రాజ్యాంగ విలువలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మడకా ప్రసాద్ గుడివాడరూరల్: ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన మడకా ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఏలూరులో జరిగిన రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా మడకా ప్రసాద్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్, గౌతమ్ స్కూల్ డైరెక్టర్ కె.అవినాష్, ఖోఖో సంఘం జిల్లా సెక్రటరీ మద్దినేని సత్యప్రసాద్ అభినందించారు. -
AP: బస్సు టైరెక్కి పాదం నుజ్జునుజ్జు
ఎన్టీఆర్ జిల్లా: మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ దిశగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎగబడడంతో అదుపుతప్పి పడిపోయిన ఓ మహిళ కాలుపైకి బస్సు టైరు ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఆర్టీసీ బస్స్టాండులో సోమవారం సాయంత్రం జరిగింది. రెడ్డిగూడెం మండల పరిధి కుదప గ్రామానికి చెందిన పజ్జూరు కృష్ణవేణి తన తల్లికి కంటి పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం మైలవరం వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బస్టాండుకు చేరుకున్నారు. సా.5.30 తరువాత విజయవాడ–విస్సన్నపేట 110వ నంబరు బస్సు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కేందుకు ఎగబడ్డారు. దీంతో తన తల్లిని బస్సు ఎక్కించేందుకు కృష్ణవేణి ముందుగా బస్సు ఎక్కి సీటులో లగేజీ సంచిని ఉంచి కిందకు దిగుతుండగా తోపులాట జరగడంతో ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. అదే సమయంలో బస్సు కదలడంతో బస్సు టైరు కృష్ణవేణి కాలుపైకి ఎక్కగా పాదం నుజ్జునుజ్జయింది. బాధితురాలిని స్థానికులు వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో పంచాయతీల ఈఓలకు అందజేశారు. ఆత్కూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సుపరిపాలన అందించడంలో, కేసరపల్లి గ్రామ కాఫీ షాప్ ద్వారా సొంతంగా రెవెన్యూ సాధించడంలో, బాపులపాడు పంచాయతీ స్వచ్ఛరథం నిర్వ హణలో, పునాదిపాడు పంచాయతీ సంపద తయారీలో, చల్లపల్లి స్వచ్ఛ సుందరంగా, నాగాయలంక ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య యూనిట్ నిర్వహణలో ఆదర్శంగా నిలిచారన్నారు. ఐఎస్వో ధ్రువీకరణ పత్రాలు పొందడంలో విశేష కృషి చేసిన డీపీవో జె.అరుణ, పంచాయతీ ఈవోలను కలెక్టర్ అభినందించి మరింత సుపరిపాలన అందించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, డీఎల్పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు.


