నయవంచన
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మరో సారి నయవంచన చేసింది. బడ్జెట్ మొత్తం అంకెలగారడీ. మసిపూసి మారేడు కాయ చేశారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బుడమేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులు లేవు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలను దగా చేసింది. నీటి పారుదల రంగానికి సంబంధించి పులిచింతల, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు నామమాత్రంగానే నిధులు కేటాయించారు. విజయవాడ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపుల ఊసే లేదు.
– దేవినేని అవినాష్,
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు


