YSR
-
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..?
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ⇒ కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు. కనుమరుగవుతున్న పాతతరం నేతలు... సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్ టీడీపీ ఇంఛార్జి వెంకటేషపై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ను విస్మరించిన తమ్ముళ్లు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున దివంగత ఎన్టీఆర్ను తెలుగుతమ్ముళ్లు విస్మరించారు. కడప నగరంలోని కొండాయపల్లె (చిన్నచౌక్ పోలీసుస్టేషన్ ఎదురుగా) వద్ద ఉన్న ఎనీ్టఆర్ విగ్రహం కనీసం ఒక పూలదండకు కూడా నోచుకోలేదంటే పార్టీ నేతల చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కాగా, కడప నగరంలో 15 డివిజన్లు మినహా తక్కిన డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టలేదని సమాచారం. -
జాంబవంతుని శోభ..అజరామరం
● 108 అడుగుల విగ్రహం ఏర్పాటుపై కసరత్తు ● దాశరథి కల్యాణంరోజున విగ్రహానికి శంకుస్థ్ధాపన?ఏకశిలానగరంలోని ఒంటిమిట్ట చెరువుఏకశిలానగరంలోని శ్రీ కోదండరాముని ఆలయంరాజంపేట : ఏకశిలానగరికి జాంబవంతుని శోభ సంతరించుకోనుంది. జాంబవంతుడు సీతారామ,లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించినందుకు ఇప్పుడు జాంబవంతుని కీర్తిప్రతిష్టలు ఇనుమడించనున్నాయి. ఏపీలో రామారాధనకు ప్రముఖ కేంద్రంగా ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచేలక్ష్యంతో రామాయణంలో కీలక పాత్ర పోషించిన జాంబవుంతుని విగ్రహాన్ని రాములోరి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టించాలని యోచిస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్గొంటున్నాయి. ఏకశిలానగరం(ఒంటిమిట)లో ఇప్పుడు రామాలయం సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటు దిశగా టీటీడీ మాస్టర్ప్లాన్ తీసుకొచ్చింది. ఆలయాన్ని అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో సాంస్కృతిక పర్యాటకాన్ని పెంపొదించడానికి రూపొందించిన బృహత్ ప్రణాళికలో జాంబవంతుడు విగ్రహం ఏర్పాటు ఒక భాగమని టీటీడీ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య విగ్రహం తరహాలో.. తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి సందర్భంగా 108 అడుగుల విగ్రహాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది రాజంపేటకే ల్యాండ్మార్క్గా మారింది. ఇదే తరహాలోనే ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏకశిలానగిరికి ల్యాండ్ మార్క్గా నిలిచేలా రూపకల్పన జరుగుతోంది. భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారనుంది. కాగా ఇప్పటికే దాశరధి కల్యాణమండపం సమీపంలో నామమాత్రంగా జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అధ్యాతిక్మ క్షేత్రంగా.. ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లోని శ్రీ కోదండరామాలయం అధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది ఒంటిమిట్ట చెరువు జాతీయరహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో వైపు జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. వచ్చెనెల 1న రాము లోరి కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అదే రోజున సీఎం చేతుల మీదుగా జాంబవంతుని విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా టీటీడీ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు విగ్రహానికి సంబంధించి డిజైన్ తుదిదశకు చేరుకున్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రశ్నిస్తే బురద జల్లడం మీ పాలన అసలు స్వరూపం
పులివెందుల : పని చేయకుండా అప్పులు తీసుకుని అవినీతికి పాల్పడుతూ ప్రజల డబ్బు దోచుకుని, ప్రశ్నిస్తే దాన్ని మళ్లించేందుకు బురదజల్లడం మీ పాలన అసలు స్వరూపమని, డైవర్షన్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట, రెండోవిడత పూలింగ్ పేరిట చేసిన డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. ఆదివారం పులివెందులలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేం ఇప్పటికీ చెబుతున్నది ఒక్కటే...అధికారంలో మీరు ఉన్నారు...మిమ్మల్ని అడ్డుకునే వారు ఎవరూ లేరు.. ఎలాంటి అడ్డంకులు లేవు...కానీ మీరు చెబుతున్న పనులు మాత్రం కనిపించడం లేదన్నారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2028లోపు రాజధాని పూర్తిచేస్తామని చెబుతున్నారని, మరి అదే సమయంలో ‘‘ఎవరైనా మార్చేస్తారు’’అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీకు మీపై నమ్మకం లేదనే సంకేతం కాదా అని ప్రశ్నించారు. కట్టలేరని మీరే అంగీకరిస్తున్నట్టే కదా అని అన్నారు. అసెంబ్లీ తీర్మానాలు చేసి డ్రామాలు చేయడం ఎందుకు? కౌన్సిల్ను పక్కన పెట్టడం ఎందుకు? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ప్లాట్ల డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్లాట్ ఎక్కడుందో తెలియని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండో విడత పూలింగ్కోసం ఎత్తుగడలో భాగంగా ఈతీర్మానం డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని...ఎవరు అడ్డుపడ్డారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ టెండర్లు పిలవడమేంటి..? మొదటి దశలోనే 50,000 ఎకరాలు తీసుకున్నారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు అంటే రూ లక్ష కోట్లు అవసరమన్నారు. రెండో దశలో మరో 20,500 ఎకరాలకు రూ.40–50 వేల కోట్లు. మరో 25,000 ఎకరాలకు రూ.50 వేల కోట్లు ఇలా మొత్తం ఖర్చు భారీగా పెరుగుతోందన్నారు. మొత్తంగా కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమని, ఇంకా అదనంగా మాస్టర్ ప్లాన్ పేరిట మరింత భూములు అమసరమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది సాధ్యమా అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుందని తెలిపారు. 2014–19లో రూ.5,000 కోట్లే ఖర్చు చేశారని, ఇప్పుడు కూడా పెద్దగా పనులు కనిపించడం లేదన్నారు. కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉందని ఎంపీ అన్నారు. ఏడేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేకపోగా, కొత్తగా ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదని పేర్కొన్నారు. టెండర్లు కొద్దిమంది కంపెనీలకే ఇవ్వడం, 4 శాతం ఎక్సెస్తో పనులు ఇవ్వడం అనేది అవినీతికి పరాకాష్ట అని అన్నారు. స్క్వేర్ ఫీట్కు రూ.11,000 ఖర్చు అంటే చివరికి ఎంత అవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారని, అయితే ఎందుకు రూ.47,000 కోట్ల అప్పులు తీసుకున్నారో? ఎందుకు ప్రభుత్వ గ్యారంటీలు? భూములు అమ్మి డబ్బు తెస్తామని చెప్పిన వారు ఇప్పటివరకు ఎంత సంపాదించారు? తెచ్చిన అప్పులను ఎవరు తీరుస్తారు? ఏడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా రాబడిలేదు. మరి ఈ భారం ఎవరిమీద వేస్తారని ప్రశ్నించారు. నత్త నడకన పనులు 2024 జూన్ తర్వాత డ్రా చేసిన రూ వేల కోట్ల రుణాల్లో రూ.5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారని, ఇవి కమీషన్ల రూపంలో వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయని, అందుకే పనులు నత్తనడకగా సాగుతున్నాయని ఎంపీ తెలిపారు. మీ అవినీతి వ్యవహారాలు చూసి రైతులు కూడా రెండో దశలో భూములు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాని అన్నారు. టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ హైకోర్టు పేరుతో సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, శాశ్వత పరిష్కారం లేకుండా ఇలా డబ్బు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా నిర్మాణాలు లేకుండా, కనెక్టివిటీ కూడా అభివృద్ధి జరగదని, ఇప్పటికీ కరకట్ట రోడ్డే ప్రధాన మార్గమని తెలిపారు. కొన్ని పనులు గత ప్రభుత్వ కాలంలోనే పూర్తయ్యాయని, వెస్ట్రన్ బైపాస్ కట్టింది జగన్మోహన్రెడ్డి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్యం రాజధాని నిర్మాణం కాదని, దాని పేరుతో సంపద సృష్టించడం. తన అనుచరులు, బినామీలకు లాభం చేకూర్చడమే అసలు ఉద్దేశమన్నారు. ఆర్టీఐ ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదని,అమరావతి ప్రాజెక్ట్లో పారదర్శకత లేదన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. అభ్యంతరం అవినీతి మీద మాత్రమేనని, వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని, అమరావతి ప్రాంతంపై వ్యతిరేకత లేదనేది స్పష్టమన్నారు.అమరావతి పనులపై రూ.2,000 కోట్ల అవినీతి ఆరోపణలతో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయని, పీఏ శ్రీనివాస్ పేరుతో కమీషన్లు వెళ్లాయని పేర్కొన్నారు. ఇది పెద్ద అనుమానాలకు దారితీస్తోందన్నారు. భవిష్యత్తులో నిర్మించే భవనాల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా ఉంటాయని, ఆచరణాత్మక ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టులు ప్రకటించడం ప్రజల్లో భయం కలిగిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. డైవర్షన్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా సీఎం చంద్రబాబుకు రాజధానిపై చిత్తశుద్ధి లేమి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
అనంతపురం, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. జట్టులోని ప్రణవ్రెడ్డి 46, రణధీర్రెడ్డి 41 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, మల్లికార్జున 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 35.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. జట్టులోని కెహెచ్ వీరారెడ్డి 84, ప్రశాంత్ 31 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్ ఆయూబ్ 3, ప్రణవ్రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 3 వికెట్ల తేడా విజయం సాధించింది. ● కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆ జట్టులోని య్యద్ షాహుల్ హామీద్ 80 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. మన్విత్ కుమార్ రెడ్డి 71, తోషిత్ యాదవ్ 51 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అశోక్ కుమార్ యాదవ్ 2, సాయి సూర్యతేజ రెడ్డి 2 తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 43.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని నయిముల్లా 50, హృదయ్ 37 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ 2, తోషిత్ యాదవ్ 2, అఖిల్ 2 అశోక్ 2 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 134 తేడాతో ఘన విజయం సాధించింది. -
ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ జెండా
సాక్షి టాస్క్పోర్స్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఆదివారం వీరపునాయునిపల్లె మండలంలోని ఉరుటూరు గ్రామ సచివాలయం వద్ద స్థానిక తెలుగుదేశం నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆగస్టు 15, జనవరి 26న జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి విరుద్ధంగా టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని, ఇలాంటి వి జరగకుండా అధికారులుచర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీటీసీ లక్ష్మిరామాంజనమ్మ అన్నారు.ఈ విషయంపై మండల అబివృద్ది అధికారి శేషా చలపతిని వివరణ కోరగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ జెండాలను ఎగురవేయడం చట్టవిరుద్ధం, ఆదివారం కావడంతో అధికారులు లేరని ఉండి ఉంటే అలా జరిదేది కాదని, వెంటనే తీసేయిస్తానని, ఇక మీదట ఇలా జరగకుండా చర్యలు తీసుకొంటామని తెలిపారు. -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
పీలేరురూరల్ : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీఎస్ఆర్ కల్యాణమండపంలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు టెట్ నిబంధన విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంటే, పరిష్కార చర్యలు చేపట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ఉండడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, ఐఆర్పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్. సాయిశ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎ. శివారెడ్డి, ఎస్టీయూ నాయకులు కె.వి. శేఖర్, గాజుల నాగేశ్వరరావు, పి. రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, పోకల మధుసూదన, జగన్మోహన్రెడ్డి, కడియాల మురళి, మోహన్, వేణుగోపాల్రెడ్డి, గంటా మోహన్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి -
అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు
గోపవరం : బద్వేలు రూరల్ స్టేషన్ పరిధిలో చంపుతామని కత్తితో బెదిరించి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తు, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య తెలిపారు. ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీరామనవమి పండుగ రోజున రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయిన ఘటనపై కేసు నమోదు చేసి రూరల్ సీఐ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని ద్వారకానగర్ సమీపంలోని గరుడయ్యసత్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మార్కాపురం టౌన్కు చెందిన షైక్ఈసుమీరావల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నేరచరిత్ర, ముఠా వివరాలు మీరావల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్లాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేష్ అనే కరుడుకట్టిన పాతనేరస్తులతో పరిచయం ఏర్పడి ఈ నలుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి జనం ఎక్కువ ఉన్న చోట మహిళలు నగలు వేసుకుని ఉంటారని, ఆ ప్రదేశాలను దొంగతనాలకు ఎంచుకుని ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికై నా సిద్ధపడాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం కత్తులు కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీరందరూ ఈ నెల 25వ తేదీన పొదిలి సమీపంలో ఒక డీలక్స్ బైక్, 26వ తేదీన నరసారావుపేటలో మరో బైక్, పామూరు సమీపంలో పల్సర్ బైక్ దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి ఆమె మెడలో ఉన్న రూ.2.50 లక్షలు విలువైన బంగారు గొలుసును దొంగిలించడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడి నుండి బంగారు గొలుసుతో పాటు కారు, ద్విచక్ర వాహనాలు, కత్తులు స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రూరల్ ఎస్ఐ రంగారావు, బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేసి 48 గంటల్లోనే అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టు రట్టుచేసి వారి నుండి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం పట్ల మైదుకూరు డీఎస్పీ రాజేందప్రసాద్ సీఐ క్రిష్ణయ్య, ఎస్ఐలను అభినందించారు. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు.ఒకరు అరెస్టు -
నేడు ఒంటిమిట్టకు ఎంపీ అవినాష్ రెడ్డి రాక
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి రానున్నట్లు ఆదివారం వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతారామలక్ష్మణులను వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డితో కలిసి ఎంపీ దర్శించుకుంటారన్నారు. ఉదయం 8:30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు.నూతన కార్యవర్గం ఎన్నికప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక కళాభారతి కార్యాలయంలో ఆదివారం సంస్థ ఎన్నికలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులుగా కొత్తపల్లి శీను, ప్రధాన కార్యదర్శిగా సుభాష్చంద్రబోస్, ట్రెజరర్గా సోమశేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఏవీ శేఖరాచారి, జీవీ సుబ్బారెడ్డి, డి.శివప్రసాద్, గౌరీశంకర్, శశిరాజా ఆచారిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి శీను మాట్లాడుతూ 49 ఏళ్లుగా కళాభారతి నాటక సంస్థను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇంకా మంచి నాటక ప్రదర్శనలు ఇచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహాలుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 27న గుర్తు తెలియని వ్యక్తులను వైద్యపరీక్షల కోసం వేర్వేరు సమయాల్లో తీసుకుని వచ్చారు. వారికి పరీక్షలను నిర్వహించగా చనిపోయారని వైద్యు లు నిర్ధారించారు. రెండు గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో ఉంచారు. వారి ఆచూ కీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. భార్యభర్తలపై దాడిచాపాడు: మండల పరిధిలోని పెద్ద గురువలూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాలగిరి సత్య వేమారెడ్డి, అతని భార్య పద్మావతి పై ప్రొద్దుటూరులో నివాసముంటున్న రామిరెడ్డి వీరారెడ్డి అలియాస్ పోలీసు వీరారెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి దాడి చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయ తెలిపారు. శ్రీరామనవమి పండుగ అనంతరం శనివారం రాత్రి రామాలయం వద్ద జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమం వద్ద వీరారెడ్డి, సత్య వేమారెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వీరారెడ్డి మరి కొంతమంది వ్యక్తులతో కలిసి సత్యవేమారెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పద్మావతి చేతికి తీవ్ర గాయమైంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ తెలియజేశారు. ఒంటిమిట్టకు 85,000 శ్రీవారి లడ్డూలు ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి ఆదివారం తిరుమల నుంచి 85,000 శ్రీవారి లడ్డూలు పంపినట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్, పరకామణి డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి లడ్డూలు ప్యాకింగ్ జరిగింది. కార్యక్రమంలో 300 మంది సేవకులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిపీలేరురూరల్ : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన ఎస్. వంశీకృష్ణ (40) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలో కల్యాణమండపం వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. -
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు
కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరా యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణం రోజున ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, కళ్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పీ బి.రమణయ్య, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విభుకృష్ణ, రాజంపేట ఏ.ఎస్.పీ హెగ్డే పాల్గొన్నారు. పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
కలెక్టర్ తరఫున అవార్డు అందుకున్న డీఈఓ,స్టెప్ సీఈఓ
కడప సెవెన్రోడ్స్ : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానాన్ని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. ఈ స్మార్ట్ కిచెన్ విధానం ఒక మోడల్గా ఉంటూ.. మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్కోచ్ అవార్డు ఇండియాస్ హానెస్ట్ ఇండిపెండెంట్ హానర్కు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం న్యూ ఢిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 106 వ స్కోచ్ సమ్మిట్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తరపున స్కోచ్ అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, స్టెప్ఈఓ విజయ్ కుమార్ అందుకున్నారు. వ్యక్తిపై హత్యాయత్నం చక్రాయపేట : మండలంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన తేల్లూరు చిన్నరాముడుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. తన పొలంలోని వేరుశనగ పంటకు అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు రాత్రిపూట కాపలా నిమిత్తం వెళతాడు. గురు, శుక్రవారాల్లో కూడా కాపలా వెళ్లాడు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంపకు నిప్పు పెట్టడమేకాక తనపై రాళ్లు కూడా వేశారని బాధితుడు తెలిపాడు. గురువారం రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడున్నారు. ఈ విషయంపై చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
ఒంటిమిట్ట విశిష్టత నలుదిశలా వ్యాపింపచేయాలి
రాజంపేట: ఒంటిమిట్ట రామాలయం చరిత్రాత్మమైనదని, ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపింపచేయాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కలిసి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)లోని శ్రీ కోదండరామున్ని దర్శించుకున్నారు. అనంతరం తూర్పు గాలిగోపురం వద్ద మీడియాతో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాములవారి గుడి అంటే ఒంటమిట్ట రామాలయం అని భక్తులు విశ్వసిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము రామాలయం అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ఆలయం అభివృద్ధి, భక్తులకు సౌకర్యం కల్పనకు సంబంధించి తాను ముందంజలో ఉంటానన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగుకుండా బ్రహ్మోత్సవాలు బ్రహ్మండంగా తిరుమల తిరుపతి దేవస్ధానం, ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మంచి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మద్దత్తు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ప్రజలందరికి శ్రీరాముని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, జెడ్పీమాజీ వైస్చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, సిద్దవరం గోపిరెడ్డి, మేకపాటి నందకిషోర్రెడ్డి, ఆకేపాటి శివారెడ్డి, మహిళరాష్ట్రనాయకురాలు ఏకులరాజేశ్వరీ రెడ్డి, రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి పాల్గొన్నారు. అంతకముందు ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీలకు శాలువాలు కప్పి సత్కరించారు. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి -
సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహాకవి పుట్టపర్తి
కడప అర్బన్: తెలుగు పదాలతో ‘శివతాండవం’ఆడించి, తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడుగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు అని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని పురస్కరించుకుని సరస్వతి పుత్రుడి చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా ఎస్పీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం మూర్తీ భవించిన వ్యక్తిత్వం నారాయణాచార్యులదని పేర్కొన్నారు. ‘శివతాండవ కావ్యం’చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదని, కనురెప్ప వాల్చనీయదన్నారు. అనితర సాధ్యమైన కావ్యాన్ని రచించి సాహిత్యాకాశంలో ‘పుట్టపర్తి’ధ్రువతారగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ పీ.నాగేశ్వర రావు, ఆర్.ఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధలను పాటించాలి
కడప అర్బన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్లో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో వివిధ కళాశాలల విద్యార్థులకు 38 హెల్మెట్లను జిల్లా ప్రధానన్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి డ్రైవ్ చేయకూడదన్నారు. డ్రైవింగ్ లైసెనన్స్ లేకుండా వాహనాలను నడుపరాదన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.దీనబాబు,ఆరో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.రమేష్కుమార్, పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి టి.కేశవ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.సి ఆషిఫాసుల్తానా, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫకృద్దీన్ విచ్చేశారు. రోడ్డు ప్రమాదాలపై న్యాయ విజ్ఞాన సదస్సును బసవ రామ తారక లా కాలేజీ, బసిరెడ్డి లా కాలేజీ, ఎస్వీ, కెఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలు, వివేకానంద మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నిర్వహించారు. జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
కంకర తొలగించమన్నందుకు గొడ్డలితో దాడి
ప్రొద్దుటూరు క్రైం : రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంకరను తొలగించమని చెప్పిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సూపర్బజార్ రోడ్డులోని శ్రీకాళహస్తి వీధికి చెందిన దుద్యాల హరి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్లో ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటి వద్దనే ఎలక్ట్రికల్ పని చేసే సత్యం అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై కంకర తోలాడు. రోడ్డుకు అడ్డంగా కంకర ఉండటంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడేవారు. ఈ క్రమంలో హరి కూడా బైక్లో అదే దారిలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతను అక్కడే ఉన్న సత్యం వద్దకు వెళ్లి దీన్ని ప్రశ్నించాడు. రోడ్డుకు అడ్డంగా కంకర వేస్తే వాహనదారులకు ఇబ్బంది కదా.. కావున తొలగించాలని హరి సూచించాడు. ఆగ్రహించిన సత్యం నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ హరిని పరుష పదజాలంతో ధూషించాడు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లెవరూ నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ప్రశ్నిస్తావా నిన్ను చంపితే ఎవరు కాపాడతారు అంటూ గొడ్డలి తీసుకొని హరి తలపై కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. సత్యం భార్య విజయ కూడా గొడ్డలి తిరగేసి హరిని కొట్టింది. హరికి తలతో పాటు శరీరంపై గాయాల య్యాయి. హరి తల్లి సావిత్రమ్మపై కూడా ఇరువురు దాడి చేయగా ఎడమ చేతికి గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డు పడి హరిని, సావిత్రమ్మను కాపాడటంతో ప్రమాదం తప్పింది. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనను చంపడానికి ప్రయత్నించిన సత్యం, అతని భార్య విజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ దుద్యాల హరి -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ తాపించి ఆమె కూడా అదే కూల్డ్రింక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి కడప రిమ్స్కు తీసుకెళ్లారు. భువనేశ్వరి, పెద్ద కుమార్తె సుష్మల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తల్లీకూతుళ్లిద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే సాయంత్రానికి ఇద్దరూ స్పృహలోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి భువనేశ్వరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ముగ్గురు పిల్లలు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కోలుకుంటున్న ముగ్గురు పిల్లలు -
భర్తతో కాపురం చేయనివ్వడం లేదు
● పోలీసులు న్యాయం చేయలేదు ● అత్తింటి వద్ద బైఠాయించిన యువతి మైదుకూరు : అత్తామామలు, ఆడపడుచులు తనను భర్తతో కాపురం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఓ యువతి అత్తింటి వద్ద బైఠాయించిన సంఘటన శనివారం మైదుకూరు పట్టణంలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన తప్పెట సునీత అనే బాధిత యువతి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సునీతకు మైదుకూరుకు చెందిన గోపవరం నవీన్ కుమార్తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందే యువతి హైదరాబాద్లో, నవీన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. వివాహం తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెడదామని సునీత కోరినా కొన్నాళ్లు ఆగాలని భర్త చెప్పాడు. రెండున్నరేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరితో కాపురం పెట్టిస్తామని పెద్ద మనుషులు చెప్పడంతో సునీత హైదరాబాద్ వెళ్లిపోయింది. తర్వాత తనకు తన భార్య సునీతతో ప్రాణహాని ఉందని నవీన్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు తీసుకునేందుకు సమ్మతి తెలిపిందని పత్రాలు సృష్టించి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి రెండు మూడు రోజులుగా సునీత అత్తింటి వద్దకు రాగా అత్తా మామలు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో శనివారం సాయంత్రం అత్తింటి వద్ద బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, తల్లిదండ్రులు వివాహ సమయంలో 16 తులాలు బంగారు ఆభరణాలు పెట్టారని, రూ.7లక్షలు ఖర్చు చేసి పుట్టింటి వారే వివాహం జరిపించారని తెలిపింది. పెళ్లి తర్వాత కాపురం పెట్టాలని కోరగా తన భర్త వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొంది. తాను పండుగ రోజుల్లో హైదరాబాద్ నుంచి వస్తే అత్త, ఆడపడుచులు ఇంట్లోకి రానివ్వరని ఆరోపించింది. అదనపు కట్నంగా స్థలాలు, ఇల్లు రాయించుకుని రావాలని అత్త లక్ష్మీదేవి తనను వేధిస్తోందని తెలిపింది. వేధింపులు తాళలేక మైదుకూరు పోలీసులను ఆశ్రయించగా ప్రొద్దుటూరులో ఫిర్యాదు చేయాలని చెప్పారని, ప్రొద్దుటూరు టూటౌన్ పోలీసుల వద్దకు వెళితే మైదుకూరులో ఫిర్యాదు చేయమన్నారని వాపోయింది. దిక్కు తోచక వారం కిందట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయినా ఇంత వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని అన్నారు. తాను ఇంటి వద్దకు రాగానే అత్తా మామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సునీత కోరుతోంది. -
రాయంచపై రాములోరి విహారం
ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ కనులపండువగా సాగింది. రాయంచపై రాములోరు కొలువై మాడ వీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఆధ్వర్యంలో సాగిన ఈ సేవలో వేలాది మంది భక్తులు పాలుపంచుకున్నారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు.హారతి కర్పూరాలతో భక్తులు తమ కోర్కెలు తీర్చాలని రాములవారికి ప్రణమిల్లారు. భక్తుల విన్నపాలను ఆలకిస్తూ..అభయమిస్తూ ..జీవన విధానానికే ఒకే సందేశమిస్తూ స్వామివారు ముందుకు కదిలారు. వేణుగానాలంకారంలో.. అంతకుముందు ఉదయం స్వామివారు వేణుగానాలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయి ద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అన్నారు. శనివారం వారు ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు సమన్వయం చేసుకుని, సమిష్టికిగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జేసీ నిధిమీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె, టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు పాల్గొన్నారు. కనుల పండువగా హంస వాహన సేవ రామయ్య సన్నిధిలో ప్రణమిల్లిన భక్తజనం -
ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారానికి జిల్లా పరిషత్ కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శనివారం కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం 15వ ఫైనాన్స్ నిధులతోపాటు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వాణిజ్య సముదాయాల నుంచి వస్తున్న ఆదాయం సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సిన జిల్లా పరిషత్ లెక్కల ప్రకారం కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఖర్చుకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలం అవుతుందన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి ఎద్దడితో గ్రామాలు విలవిలాడుతున్నాయని, బోర్లు, మోటార్ల రిపేర్లు, రక్షిత మంచినీటి పథకాల పేరుతో పాలకవర్గానికి, అధికారులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వనరులుగా మార్చుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు.జిల్లా పరిషత్లో జరుగుతున్న అక్రమ నియామకాలపై, ప్రమోషన్లు, బదిలీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఎంవీ సుబ్బారెడ్డి జి వేణుగోపాల్ కేసి బాదుల్లా పి శ్రీరాములు పి బాలు,పి మస్తాన్, జి నాగేశ్వరరావు, షావల్లి, కే మునయ్య, ఇమ్మానియేల్, పడిగే వెంకట రమణ, లింగన్న, రవికుమార్, పి నాగరాజు, సుబ్బరాయుడు, తారక్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
●రోడ్డు పనుల నిలిపివేతపై నిలదీత
● అరటి రైతులను ఆదుకోవాలి ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కడప సెవెన్రోడ్స్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే చేపట్టాలని, జిల్లాలో అకాల వర్షాలతోపాటు పశ్చిమాసియా సంక్షోభం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతూ జిల్లా పరిషత్సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ‘సీమ’జీవనాడి ఎత్తిపోతల తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ తదితర సాగునీటి ప్రాజెక్టులకు జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అల్మట్టి ఎత్తు పెంచుతోందన్నారు. ఈ నేపధ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉపయోగం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతలకు అనుమతులు లేవంటున్న టీడీపీ నేతలు పట్టి సీమను ఎలా చేపట్టారని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించకపోవడం వల్ల పర్యావరణ అనుమతులు రాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.సీమ ఎత్తిపోత పనులు తిరిగి చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసేందుకు తొలుత ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి అభ్యంతరం చెప్పినా చివరకు అంగీకరించక తప్పలేదు. తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపా రు. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారన్నారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ధరలు దారుణంగా పడిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సోలార్ భూములకు పరిహారం ఇవ్వాలి పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లె సర్వే నెంబరు 676లో బీసీ, ఎస్సీ పేదలు 51.67 ఎకరాల భూమిని చాలాకాలంగా సాగు చేసుకుంటున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ తెలిపారు. ఆ భూములను సోలార్ ప్రాజెక్టు యాజమాన్యానికి తహసీల్దార్ అప్పగించారని చెప్పారు. ఇప్పుడు సోలార్ యాజమాన్యం రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కలెక్టర్ బదులిస్తూ ఆ భూములు ఎస్సీ, బీసీలకు అసైన్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. నిజంగా ఆ భూములుసాగు చేస్తున్నారా? లేదా? అని ఆర్డీఓ విచారణ నిర్వహిస్తారన్నారు. దౌర్జన్యంగా భూముల స్వాధీనం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సోలార్ ప్లాంటు పనులను చేపడుతున్నారని తెలిపారు. రైతులతో అగ్రిమెంటు లేకుండా, లీజు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా పనులు చేపట్టారని ఆరోపించారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 16 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఇందువల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఖాళీగా ఉన్న విద్యుత్ ఏఈ పోస్టులు భర్తీ చేయాలని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి కోరారు. కారుణ్య నియామకాలపై చర్చ: జిల్లా పరిషత్లో బోగస్ సర్టిఫికెట్లతో కారుణ్య ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి కోరారు. 10మంది అనర్హులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినమాట నిజమేనని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లు జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీమా, పంట రుణాలపై వాగ్వివాదం పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన బీమా సొమ్ములు ఇప్పించాలని వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి కోరారు. జిల్లాకు బీమా కింద మంజూరైన రూ.173 కోట్లు ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఒకే డీకేటీ భూమిపై నలుగురు రుణాలు గతంలో పొందారని తెలిపారు. బద్వేలులో ఒకరు అరెస్టు కూడా అయ్యారని పేర్కొన్నారు. దీనిపై బద్వేలు జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2025 ఖరీఫ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 25 కోట్లు బీమా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరారు. కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో జంబోషెడ్, టాయిలెట్లు నిర్మించాలని కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా కోరారు. ● ఈ సమావేశంలో జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్ఠాది శారద, పిట్టు బాలయ్య యాదవ్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ రమేష్యాదవ్ వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తాగునీరు లేక అనేక గ్రామాల ప్రజలు అలమటిస్తున్నారని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగల్లు నుంచి తమ మండలంలోని గ్రామాలకు నీరిచ్చే పథకాలను చేపట్టాలన్నారు. మెగా కంపెనీ అలసత్వం కారణంగా పులివెందుల తాగునీటి పథకం నుంచి తమకు నీరు రావడం లేదన్నారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ 35 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీలు తాగునీటి సమస్యపై గళమెత్తారు. -
కార్మిక పక్షపాతి వైఎస్సార్టీయూసీ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(వైఎస్సార్టీయూసీ) కార్మికుల పక్షపాతిగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎంపాటు సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్లు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్సార్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్చేసి ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం అంజద్బాషా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్టీయూసీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తయ్యిందని, అప్పటినుంచి కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయలేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వారిని గుర్తించి ఏడాదికి రూ.10వేలు ఇచ్చినట్లు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసిందని, ఆ పథకాలన్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలు కావడం లేదన్నారు. ఇందు కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. జాషువా మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీయూసీ వారి వెన్నంటి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రిమ్స్లో 114 మంది కార్మికులను తొలగించారని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకూ వైఎస్సార్టీయూసీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజు మాట్లాడుతూ వైఎస్సార్టీయూసీ ఏర్పడినప్పటి నుంచి సుమారు 9 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ కార్మికుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సింగమాల వెంకటేశ్వర్లు, డా. నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, సీహెచ్ వినోద్ కుమార్, రాయల్ బాబు, రామ్మోహన్రెడ్డి, ఐస్క్రీం రవి, తోటక్రిష్ణ, త్యాగరాజు, బాలస్వామిరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, షంషీర్, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, మియ్యా, కంచుపాటి బాబు, రహీమ్, మల్లీశ్వరి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
అరటి తోటలోకి దూసుకెళ్లిన కారు
సింహాద్రిపురం : సింహాద్రిపురంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్టు రాజంపేట: మండలంలోని కొత్తబోయనపల్లెలో ఉన్న ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద ఈనెల 8న ఎర్రబల్లి గ్రామానికి చెందిన కడిమెల్ల గిరిధర రాజాపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే తెలిపారు. ఎస్డీపీఓ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘర్షణకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులను గుర్తించామన్నారు. వారిలో ఇద్దరు కోర్టులో సరెండరయారని,. ప్రస్తుతం మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో చాగలమర్రిమండలానికి చెందిన ఆలమూరు వెంకటకార్తీక్ రెడ్డి, గుత్తి మండలానికి చెందిన గడ్డెం ఎర్రి స్వామిలు ఉన్నారని వివరించారు. గిరిధర్రాజుపై జరిగిన హత్యయత్నం కేసులో వీరు ప్రముఖపాత్ర పోషించారన్నారు. మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. పీజీ హాస్టల్ల్లో ఉంటున్న విద్యార్ధులపై యజమానులు నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం పీజీ హాస్టల్స్ యజమానులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు.సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక శ్లోక పాఠశాల రహదారిలో ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు అఖిల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి రెండు తులాలు, వెండి వస్తువులు, రూ.50వేల నగదును అపహరించినట్లు తెలిపారు. స్థానిక మదీనాపురానికి చెందిన షేక్ అఖిల కడప కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి చెందిన సీసీ కెమెరాల కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్త ఇటీవల మృతి చెందాడు. ఈమె శ్లోక పాఠశాల సమీపంలోని జిమ్మి చెట్టు వద్ద నివాసం ఉంటోంది. తన తల్లి ఇంటి వద్ద పిల్లలను వదిలి శుక్రవారం డ్యూటికి వెళ్లింది. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తాళాలు పగులగొట్టి ఉన్న విషయం బయటపడటంతో తల్లిని పిలిపించి ఇంట్లోకి వెళ్లింది. బీరువాను పగుల కొట్టి బంగారు, వెండి వస్తువులతోపాటు డబ్బాలో ఉన్న రూ.50వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. నగదు ఉన్న డబ్బాను ఇంటి బయట వేసి వెళ్లినట్లు తెలిపారు. దాదాపు రూ.5లక్షల వరకు నష్టం కలిగినట్లు వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. షేక్ అఖిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి గాలివీడు: మండలంలోని గరుగుపల్లె పంచాయతీ పరిధిలోని ఇడపన్ చేనుపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.గ్రామానికి చెందిన పందికుంట సాయికుమార్ రెడ్డి (19) తన సొంత పొలంలోని వేరుశనగ పంట వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు కథనం మేరకు ప్రతిరోజూ పంట కాపలాకు తండ్రి ఇరగం రెడ్డి లేదా తల్లి ఆకులమ్మ వెళ్లేవారు.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంఘటన జరిగిన రోజు సాయికుమార్ రెడ్డి తన తండ్రికి భోజనం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించలేదు.ముందుకెళుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తండ్రి ఇరగం రెడ్డి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు. -
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూ లు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ మెన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్లు నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ మ్యాచ్లు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం, కేఓఆర్ఎం మైదానంలో జరుగుతాయని వివరించారు. కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ఏపీ ఎస్ఎస్డీసీ సౌజన్యంతో ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయంప్రతిపత్తి)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 30న సోమవారం జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ , పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. వివరాలకు కళాశాలలోని జేకేసీ కోఆర్డినేటర్ రాము (7995802325), మెంటార్లు సారధి (9347256400), రవీంద్రారెడ్డి (93900 52901)లను సంప్రదించాలని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా రెవెన్యూ అధికారిగా మల్లికార్జున శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మల్లికార్జునను ప్రభుత్వం కడప డీఆర్వోగా నియమించింది. ఈ మేరకు కలెక్టరేట్కు చేరుకుని తన చాంబర్లోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనను ఆహ్వానించారు. అనంతరం నూతన డీఆర్వో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ అంశాలపై చర్చించారు. కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా పీసీపీ పీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ మాతృ మరణాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు, ఇకమీదట ఎలాంటి మాతృ మరణాలు సంభవించరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ హిమదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ అరిఫుల్లా, సీ్త్ర వ్యాధి నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ సుశీల, రేఖా రావు, మత్తు వ్యాధి నిపుణులు డాక్టర్ సునీల్, డాక్టర్ యాదవేందర్ రెడ్డి, డాక్టర్ అబ్దుల్ కలీఫ్, శోభారాణి పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్కు దేశంలో ప్రముఖ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ సంస్థ ది ఇన్ట్సిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత సభ్యత్వంగా పరిగణించబడే ఈ ఫెలోషిప్, ఇంజినీరింగ్, సాంకేతికత, పరిశోధన , విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ప్రదానం చేస్తారు. కాగా ఆచార్య రాజశేఖర్ మూడు పీహెచ్డీలతో పాటు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సంపాదించి, మూడు దశాబ్దాలుగా ఉన్నత విద్యా రంగంలో సేవలు అందిస్తున్నారు. -
జనసేన కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటా!
సాక్షి, రైల్వేకోడూరు : మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయడంలేదని జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరక్కపోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆమె ఈ మేరకు విడుదల చేసిన ఒక వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ‘నాకు అన్యాయం జరిగింది. న్యాయం చేస్తారని బయటకు వచ్చాను. డిప్యూటీ సీఎంపై నమ్మకంతో ఎమ్మెల్యేపై పోరాడుతున్నా. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ అన్యాయం చేస్తున్నారు. పైగా నాకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే దర్జాగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. కమిటీ నివేదిక ఇవ్వకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అరవ శ్రీధర్ను పార్టీ ఎలా అనుమతించింది? అసలు డిప్యూటీ సీఎం తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదు?’’ ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం చేసి అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పరిహారం మరిచి.. పరిహాసమా!
కడప అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాతలతో ఆటలాడుకుంటోంది. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు పరిహారంతో మందు పూయాల్సింది పోయి నయాపైసా ఇవ్వకుండా పరిహాసమాడుతోంది. వ్యవసాయానికి చేయూతనివ్వకుండా వేధిస్తోంది. కష్టకాలంలో కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచే పలు పథకాలకు నిలువునా తూట్లు పొడుస్తోంది. గతేడాది మోంథా తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. ఆ గాయం మరవకముందే తాజాగా వారం రోజుల క్రితం జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షాలు రైతన్నలను నిలువునా దెబ్బతీశాయి. ముఖ్యంగా జిల్లాలో అరటి పంటతోపాటు మొక్కజొన్న, సజ్జపంటలు దెబ్బతిని నష్టపోయారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికి ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సర్కారు చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతులు ఆర్థికాభివృద్ధికి అడుగడుగునా చేయూతనిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన పంటల బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది. నిలువునా నష్టపోయిన రైతన్న... గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏర్పడిన మోంథా తుపాన్ కారణంగా జిల్లా రైతులు భారీగా నష్టపోయారు. జిల్లాలో 3988 మంది రైతులకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 5193.5 ఎకరాలో వరి, మినుము, పత్తి, మొక్కజొన్న, ఉల్లి, పూల పంటలు దెబ్బతిని రూ. 540.26 లక్షల మేర నష్టం వాటిల్లింది. తాజాగా వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు సంబంధించి 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జపంటలకు నష్టం జరిగింది. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో అరటికి సంబంధించి 62 మంది రైతులకు రూ. 156 లక్షల మేర నష్టం జరిగింది. ఇలా వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో రూ. 400 లక్షలకుపైగా నష్టం వాటి ల్లినట్లు తెలిసింది. గతేడాది వచ్చిన మోంథా తుపాన్ వల్ల నేలవాలిన వరిపంట కొండాపురంలో నేలవాలిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు 7 లక్షల దాకా నష్టం... ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలబడిపోయింది. దీంతో 7 లక్షల దాకా నష్టం వచ్చింది. ఎకరాకు 30 క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చేది. అలాంటి పూర్తిగా నేలపడిపోయి పనికిరాకుండా పోయింది. పెట్టుబడితోపాటు దిగుబడి కూడా నేలపాలైంది. – విశ్వనాథరెడ్డి, ఓబన్నపేట, కొండాపురం మండలం పది లక్షలు నష్టపోయా... 3700 ఆరటి మొక్కలను నాటాను. మొదటికాపు. ఆరటి గెలలతో పొలమంతా నిండుగా పంట ఉండింది. ఉన్నట్లుండి వచ్చిన ఈదురుగాలులు అకాల వర్షంతో గెలలతో సహా చెట్లన్నీ నేలపడిపోయాయి. దీంతో దాదాపు పది లక్షల దాకా నష్టం వచ్చింది. ఒక్క రుపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – మధుసూదన్రెడ్డి, సింహాద్రిపురం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి గతేడాది మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్లీ ఇటీవల అకాల వర్షంతోపాటు ఈదురు గాలలతో జిల్లాలో ఆరటి, మొక్కజొన్న, సజ్జపంట పూర్తిగా నెల పడిపోయి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పంట నష్ట పరిహారం కోసం ఏడాదిగా ఎదురుచూపు గతేడాది తుపాన్లు, వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు తాజాగా అకాల వర్షాలు, గాలులతోఅరటి, మొక్కజొన్న, సజ్జపంట నష్టం నాలుగు సీజన్లు ముగుస్తున్నాపైసా విదిల్చని కూటమి సర్కార్ ఆందోళనలో అన్నదాతలు గత ఏడాది ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం వరిపంటకు సంబంధించి ఎకరాకు రూ. 630, వేరుశనగకు ఎకరాకు రూ. 450, మామిడికి ఎకరాలకు రూ. 1750 చొప్పున రైతుల నుంచి ప్రీమియం కట్టించింది. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 2024 జూలై 12 నుంచి 2026 మార్చి వరకు దాదాపు నాలుగు సీజన్లు పూర్తి అయాయి. బీమా ప్రీమియం చెల్లించినా రైతులకు మాత్రం పంటల నష్ట పరిహారం కింద ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. గతేడాది వరుస తుఫాన్లతోపాటు వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఇస్రో సందర్శన.. విజ్ఞాన సముపార్జన
● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం ● యువికా –2026కు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతిక, అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందని సైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యువికాకు అర్హులు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇస్రో విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గడువును ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. అవి డెహ్రాడూన్(ఉత్తర్ఖండ్), తిరువనంతపురం(కేరళ), సూళ్లూరుపేట(అంధ్రప్రదేశ్), బెంగుళూరు(కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్( తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ● 8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి అదనంగా 15 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, సైన్స్ఫెయిర్ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న విద్యార్థులకు 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలింపియాడ్ పరీక్షలో మొదటి మూడు స్థానాలకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆపై స్థాయిలో(గత 3 సంవత్సరాలు) పాల్గొన్న వారికి 5 శాతం, ఆటలపోటీల్లో పాల్గొన్న వారికి 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఇలా.. ఇస్రో ప్రధాన వెబ్ౖసైట్లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీవోవి.ఇన్/యువిక.హెచ్టిఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 7న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2026 ముగింపు సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. 14 రోజుల పర్యటన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికైన వారికి ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా కల్పిస్తుంది. ఎంపికై న విద్యార్థులను 14 రోజులపాటు శ్రీహరి కోటలోని సతీష్ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్తో సంభాషించే అవకాశం కలుగుతుంది. రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 31 వరకు ఎంపికై న విద్యార్థులు జాబితా విడుదల : ఏప్రిల్ 7 విద్యార్థులకు ఆహ్వానం : మే 18 యువికా కార్యక్రమం : మే 19 నుంచి 30 వరకు ముగింపు : మే 31 -
భద్రాచలం తరహాలో ఒంటిమిట్టను అభివృద్ధి చేయాలి
రాజంపేట : భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాను కోరినట్లు గుంతకల్ డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టకు విచ్చేసిన డీఆర్ఎంతో ఆయన రైల్వేస్టేషన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధితోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రామాలయంగా గుర్తింపు పొందడంతో.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వస్తున్నారన్నారు. వీరందరికీ కూడా రైలు ద్వారా ఒంటిమిట్ట చేరుకునే పరిస్థితులు లేవన్నారు. అటు కడప, ఇటు నందలూరులో దిగి ఒంటిమిట్టకు చేరుకుంటున్నారన్నారు. ముంబై–చైన్నె రైల్వేమార్గంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లలో ముందుగా కొన్ని రైళ్లకు అయినా హాల్టింగ్ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, చైన్నె రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలన్నారు. అలాగే స్టేషన్లో రెండు ప్లాట్ఫాంల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితం చేయాలని కోరారు. తాగునీటి సౌకర్యాలు, రెండు ప్లాట్పాంలలో పై కప్పులు వేయాలన్నారు. అలాగే ఒంటిమిట్టకు వచ్చే యాత్రికులకు రెస్ట్ రూంలు, వేచివుండే గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఇప్పటికే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధి విషయంలో ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు రైల్వేమంత్రి (మినిస్టర్ ఆఫ్ రైల్వేస్)కు వినతులు ఇచ్చారన్నారు. రైళ్లకు స్టాపేజి ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులకు రైలుసౌకర్యం కల్పించినట్లవుతుందని ఎంపీలు ఇప్పటికే రైల్వేశాఖకు తెలియచేశారని గుర్తు చేశారు. డీఆర్ఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీఆర్ఎంతో పాటు గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు, స్థానిక రైల్వే అధికారులు పాల్గొన్నారు. డీఆర్ఎం వెంట ఏడీఆర్ఎం సుదర్శన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనరు రాజగోపాల్రెడ్డి, సీసీఐ జనార్ధన్, ఆర్పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వనిత, జీఆర్పీ అధికారి సునీల్రెడ్డి, గల్లా శ్రీను, శివకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఎంఆర్కు ఎంపీలు వినతులు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో డీఆర్ఎంతో భేటీ గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్రెడ్డి -
ఇదేమిటి.. రామా !
● ఆలయంలో ప్రొటోకాల్ తప్పారా..! ● టీడీపీ నేత పట్టువస్త్రాల సమర్పణపై అభ్యంతరాలు ● నోరు మెదపలేకపోతున్న ఆలయ అధికారులు రాజంపేట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన నాయకుడు.. వార్డు మెంబరు కాదు.. సర్పంచి కాదు.. ఎంపీపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. రాజంపేట టీడీపీ ఇన్చార్జిగా ఉన్న చమర్తి జగన్మోహన్రాజుకు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పట్టం కట్టిందనే విమర్శలను మూటకట్టుకుంది. టీటీడీ ప్రొటోకాల్ పాటించే విషయంలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తుంది. ఇప్పుడు రామయ్య సన్నిధిలో టీటీడీ ప్రొటోకాల్ తప్పిందన్న విమర్శలు వెలువడ్డాయి. ఆలయ అధికారులు జీ హుజూర్ అని టీడీపీకి దాసోహమన్నారా? అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీరామనవమి రోజున స్వామివారికి టీడీపీ నేత పట్టువస్త్రాలను తీసుకెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ముఖ్యనేతలు ఉన్న వారికి కూడా ఈ సంప్రదాయాన్ని వర్తింపచేయాలి కదా అని కూటమి వర్గాల నుంచి భిన్నస్వరం వినిపిస్తోంది. అధికారులూ.. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్త.. ప్రొటోకాల్ విషయంలో ఉన్నతాధికారులు, అధికారులు జాగ్రత్తగా మసులుకోకపోతే రిటైర్ అయినా పింఛన్ నిలిపివేత, సస్పెండ్, ఉద్యోగం ఊస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలని మేధావి వర్గాలు హితువు పలుకుతున్నారు. ఒక రాజంపేట నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి అధికారగణం ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు ప్రొటోకాల్ తప్పితే సంబంధిత ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు రిటైర్డ్ అయినా విధి నిర్వహణలో ప్రొటోకాల్ తప్పినందుకు ఆయనను ప్రొటోకాల్ తప్పిద శాపం వెంటాడుతున్న సంగతి విదితమే. పింఛన్ కూడా నిలిపివేశారని తెలిసింది. ప్రొటోకాల్ విషయంపై వివరణ అడగడానికి ‘సాక్షి’ విలేకరులు ఫోన్ చేయగా.. టీటీడీ అధికారులు లిఫ్ట్ చేయలేదు. -
కోలుకుంటున్న తల్లి, ముగ్గురు పిల్లలు
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్లో పిల్లలతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన భువనేశ్వరి, ముగ్గురు పిల్లలు కడప రిమ్స్లో కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ను తాపించి ఆపై ఆమె కూడా తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి నుంచి కడప రిమ్స్కు తరలించారు. వీరిలో భువనేశ్వరి, సుష్మల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే మధ్యాహ్నం తర్వాత వీళ్లిద్దరి ఆరోగ్యం కాస్త మెరుగు పడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. భువనేశ్వరిపై హత్యాయత్నం కేసు నమోదు భువనేశ్వరిపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలకు వారి అనుమతి లేకుండా పురుగుల మందుకలిపిన కూల్డ్రింక్ తాపించి చంపడానికిప్రయత్నించిందనే కారణంతో ఆమైపె హత్యా యత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం జియాలజి శాఖకు చెందిన ఆచార్యులు ఎన్. జయరాజుకు అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్ వారు నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో ఆచార్య జయరాజు ‘కృత్రిమ మేథస్సు అను వర్తనాలు’(ఏఐ ఇన్ ఓపెన్ సైన్స్) అనే అంశంపై ప్రసంగించనున్నారు.జయరాజుకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ అభినందనలు తెలిపారు. -
నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్రెడ్డి రాక
రాజంపేట: ఏకశిలానగిరి (ఒంటిమిట్ట)లో జరుగుతున్న శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు శనివారం రాజంపేట లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రానున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయంలోని సీతారామలక్ష్మణలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్డ్డితో కలిసి దర్శించుకుంటారన్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు. వీరి వెంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పాల్గొంటారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) పరీక్షకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. ఉపకులపతి స్వయంగా యూజీసీ నెట్/ఏపీ సెట్ ఉచిత శిక్షణా తరగతులు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు (రెగ్యులర్ తరగతులకు ఇబ్బంది కలుగకుండా) నిర్వహిస్తున్నారు. ఈనెల 28 , 29 తేదీలలో సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం శ్రీరామనవమి పండుగ అయినప్పటికీ శుక్రవారం బోధన చేశారు. పరీక్షల్లో రాదగిన అంశాలు, ఎలా ఆన్సర్ చేయాలో వివరించారు. పేపర్–1 లో అధిక మార్కులు స్టోర్ చేస్తే సెట్లో అర్హత సాధించడం సులువుతుందని విద్యార్థులకు తెలిపారు. కొండాపురం: గండికోటజలాశయం నుంచి కృష్ణాజలాలను మైలవరం జలాశయానికి 2500 క్యూ సెక్కులు విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఈఈ ఉమమహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ఎత్తి మైలవరం జలాశయం పరిధిలో తాగునీటి ఆవసరాలకోసం నీటిని పంపిస్తున్నట్లు వివరించారు. మైలవరం ప్రాజెక్టుకు 2 టీఎంసీలు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: కడప నగర శివార్లలోని శిల్పారామంలో శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.స్వామి నాయుడు ఆదేశాల ప్రకారం చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్లను కేటాయించనున్నట్లు ఇన్చార్జి అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తులతోపాటు కొండపల్లి బొమ్మలు,కుమ్మర్లకు స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.చిన్నపిల్ల లు, పెద్దవారికి సంబంధించిన వినోదాత్మకమైన గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆసక్తి కలవారికి ఈఓఐ పద్ధతి ద్వారా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సంబందిత వర్గాలు ఏప్రిల్ 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కడప శిల్పారామం ఆఫీస్లో సంప్రదించాలని సూచించారు. సౌమ్యనాఽథున్ని దర్శించుకున్న గుంతకల్ డీఆర్ఎం నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని గుంతకల్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం)చంద్రశేఖర్ గుప్తా దంపతులు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. అర్చకులు సునీల్, సాయికృష్ణ డీఆర్ఎం దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయనకు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి డీఆర్ఎంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్, సీనియర్ డీఈఎన్ సుదర్శన్రెడ్డి, డీఆర్యు సీసీ మెంబర్ తళ్లెం భరత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తుండగా అంజి(44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తున్న అంజి అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100582, 9121100581 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు చికిత్స కోసం వేర్వేరు రోజుల్లో వచ్చిన ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వేర్వేరు సమయాలలో మృతి చెందారు. వారి మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదంలో భారీ నష్టం ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని గీతాశ్రమం వీధిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం సంభవించింది. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో భారీ నష్టం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణపాటి రాధమ్మ ఇంట్లోని వరండాలో ఉన్న కూలర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్, టీవీ పూర్తిగా కాలిపోయాయి. అయితే మంటలను అదుపు చేసేలోగా పక్కన ఉన్న కామిశెట్టి రమాదేవి ఇంట్లోకి వ్యాపించాయి. ఈ ప్రమాదం ధాటికి గ్రైండర్, ఓవెన్, టీవీ, దుకాణానికి సంబంధించిన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అలాగే పెద్ద మొత్తంలో డబ్బు, గోధుమ పిండి, బియ్యం బస్తాలు, ఇంటి పైకప్పు, స్లాబ్ దంతెలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రెండు ఇళ్లలోనూ సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. -
గండిలో అంజన్న గ్రామోత్సవం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో వచ్చి భక్తి ప్రపత్తులతో స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఉష్ట్ర వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం ఉంచి గండి పురవీధులతోపాటు సమీపంలోని వీరన్నగట్టుపల్లెలో స్వామి వారిని ఊరేగించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పరిధిలోని రింగురోడ్డుపై జయరాజ గార్డెన్స్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని భూమిరెడ్డి సూర్యనారాయణ(43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మైదుకూరు నివాసి సూర్యనారాయణ తన కుమారుడు వెంకన్నారాయణను చైతన్య పాఠశాలలో వదిలేందుకు మైదుకూరు నుంచి కడపకు వస్తుండగా జయరాజా గార్డెన్స్ సమీపంలో వారి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి కుమారులను వైద్య సేవల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భూమిరెడ్డి సూర్యనారాయణ మృతి చెందాడని, వెంకట నారాయణ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అశ్రునయనాలతో వీడ్కోలు మైదుకూరు : భూమిరెడ్డి సూర్యనారాయణకు శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారుడిగా సూర్యనారాయణతో తమ అనుబంధాన్ని తలుచుకుని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మైదుకూరులో క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణలో అతను చురుగ్గా ఉండేవాడని మైదుకూరు క్రికెట్ క్లబ్ సభ్యులు తెలిపారు. -
● ఒంటిమిట్ట రామయ్యసేవలో ప్రముఖులు
ఒంటిమిట్ట:ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీరామచంద్రున్ని శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) చంద్రశేఖర్ గుప్తా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, దర్శించుకున్నారు.వీరికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, సత్కరించారు. -
● త్రేతాయుగాన్ని తలపించిన సంక్షిప్త రామాయణ ప్రదర్శన
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో త్రేతాయుగాన్ని మళ్లీ గుర్తుకు చేసేలా సంక్షిప్త రామాయణ ప్రదర్శణ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రామాయణంలో ఉన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను బొమ్మల రూపంలో ప్రదర్శించారు. ఇది భక్తులను కనువిందు చేసింది. ఈ ప్రదర్శనలో బాల్యంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పెరిగిన తీరు, సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచిన శ్రీరాముడు, సీతారాముల కల్యాణం, వనవాసంలో బంగారు జింక కొరిన సీత, రావణుడు సీతాదేవిని అపహరించుట, చెట్టు చాటునుంచి వాలిని రాముడు వధించుట, ఆశోక వనంలో ఉన్న సీతను చేరుకున్న హనుమకు చూడామణిని ఇవ్వడం, లంకిణి నోటి నుంచి హనుమంతుడు బయటకు రావడం, వాల్మీకి చెంత లవకుశలు రామాయణ చరితం చెప్పే సన్నివేశాలు ఏర్పాటు చేశారు. త్రేతాయుగంలో జరిగిన సంఘటలను అచ్చం అలాగే బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
జమ్మలమడుగు రూరల్ : పర్యాటక ప్రాంతమైన గండికోటలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గండికోటకు చెందిన పొలం గల రైతు శుక్రవారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి గండికోటలో పురాతన మసీద్ పక్కన పొలంలో తవ్వకాలు చేపట్టారు. గతంలో కూడా పలు మార్లు తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. స్థానిక ప్రజల సహకారం లేనిదే ఈ వ్యవహారం జరగదని పలువురు అంటున్నారు. చామలూరు గ్రామంలో.. కొండాపురం : మండలంలోని చామలూరు గ్రామానికి చెందిన జి.రామాంజనేయులరెడ్డి పొలంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు చేపట్టిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది. శుక్రవారం ఉదయం తన పొలంలోకి రైతు వెళ్లి చూడగా పుట్ట వద్ద జేసీబీతో సుమారు పది అడుగుల లోతు తవ్వినట్లు తెలిపారు. బొలేరో క్యాంపర్ జాడలు ఉన్నట్లు పేర్కొన్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ అచ్చింతలు ఉన్నాయని పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమచారం ఇచ్చినట్లు వివరించారు. కొండాపురం మండలం చామలూరు పొలంలో తవ్విన గుంత గండికోట వద్ద పొలంలో తవ్వకాలు జరిగిన ప్రదేశం -
పెన్షనర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
రాజంపేట : పెన్షనర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజీ సూచించారు. రాజంపేటలోని ఆయన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారికి సూచనలు, సలహాలు అందజేశారు. పని చేసి రిటైర్డ్ అయిన తర్వాతే ఉత్సాహంగా, ఆరోగ్యంగా మరింతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి రోజు వాకింగ్ చేయాలని చెప్పారు. రిటైర్డ్ అయిన తర్వాత మిగిలిన జీవిత కాలాన్ని ప్రశాంతంగా కొనసాగేలా వ్యవహరించాలన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ రాజంపేట తాలుకా ప్రెసిడెంట్ పిల్లి పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంక్ మాజీ మేనేజరు పిల్లి పిచ్చయ్య, డీసీసీ మాజీ జనరల్ మేనేజరు గాలిశెట్టి మనోహర్ నేతృత్వంలో శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్లు భాస్కర్ పంతులు, వెంకటేశ్వరి, జయమ్మ, రామానాయుడు, డి.బాబు, కె.నరసయ్య, ఎ.సుబ్రమణ్యం, పిల్లి నరసింహులు, పాల రాజగోపాల్, ఎంవీ రమణ, రాజేశ్వరరావు, బొడ్డు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన వసతల కల్పనకు రైల్వే అధికారులు కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజంపేట రైల్వేస్టేషన్ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ రైల్వేస్టేషన్లో రెండు ఎక్సలేటర్లు, లిప్ట్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇక్కడ పార్శిల్ ఆఫీసు ఉండేదన్నారు. అప్పట్లో ఈ ప్రాంతం నుంచి నిమ్మకాయల ఎగుమతి జరిగేవన్నారు. అలాగే ఉద్యానవనపంటలు రైళ్ల ద్వారా ఎగుమతి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే పార్శిలాఫీసు బలోపేతం దిశగా రైల్వే అధికారులు యోచించాలన్నారు. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాథరెడ్డి నేతృత్వంలో రాజంపేట రైల్వేస్టేషన్లో మెరుగైన సౌకర్యాల కల్పించే దిశగా ముందుకెళతామన్నారు. అమృత్భారత్ పథకం కింద రాజంపేటను చేర్చడంలో ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషి ఉందన్నారు. రాజంపేట సబ్వేలో త్వరిగతిన మార్గం సుగమమం చేసే విధంగా రైల్వే అధికారులుతో ఇదవరకే మాట్లాడానని, ఆ దిశగా చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు.గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి, కడప సీసీ జనార్ధన్, ఆర్పీఎఫ్ ఎస్ఐ త్రివేణి, స్టేషన్మేనేజరు గోపి వైఎస్సార్సీపీ నేతలు డీలరు సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీసుబ్బరాజు, అమర్, దండుగోపి,శివశంకర్, చికెన్ శ్రీనివాసులగౌడ్, మణి పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకంతోనే సీమకు న్యాయం
మైలవరం: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడేప్రమాదం ఉంందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని మైలవరం జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అందుకు కారణం కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరువస్తుందనే ఉద్దేశంతో ఇక్కడి కూటమి నాయకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్కు నీరు వచ్చే పరిస్థితి లేదని, అదే రాయలసీమ ఎత్తిపోతకం ప్రారంభమై ఉంటే ఈ ప్రాంత వాసులకు తాగు, సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కేసీ కెనాల్కు మైలవరం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని, వారి తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఈ నీటిని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. మైలవరం టీబీసీ కాలువ ద్వార తీగలేరు వాగుకు పంపించి కేసీ కెనాల్కు నీటిని కుందూ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద మోటార్లు బిగిస్తే పథకం ప్రారంభమవుతుందని, అయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోవడం లేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం గండికోటప్రాజెక్టు, మైలవరం, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో కుంటలు చెరువులు నీటితో నింపుకోగల్గుతున్నామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అదికార ప్రతినిధి మోహన్రెడ్డి,జమ్మలమడుగు పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు ధన్నవాడ మహేశ్వరరెడ్డి, భాస్కర్రెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, మండల నాయకుడు ఆంజేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ వినియోగం తప్పనిసరి
కడప సెవెన్రోడ్స్ : పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా ఎల్పీజీకి బదులుగా పీఎన్జీ వినియోగానికి బదిలీ కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వినియోగదారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో ఎల్పీజీ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో అందుబాటులో ఉన్న పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచేందుకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధీమీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వంట గ్యాస్ కొరత కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా మారిపోవాల్సి ఉంటుంది. వారందరికీ అతి త్వరలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆగిపోనుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ప్రస్తుతం కడప నగరంలోని అన్ని గృహ అవసరాలకు తప్పనిసరిగా పీఎస్జీని ఉపయోగించుకునే విధంగా నగరపాలక సంస్థ అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో థింక్ గ్యాస్ జిల్లా మేనేజర్ విజయ్ మోహన్ పీఎన్జీ వాడకం, ఉపయోగాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలు, లాభాలు మొదలైన అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. పలువురు హోటల్స్ యాజమాన్య కమిటీ వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ: 1800 2021 999, 9010926528లో సంప్రదించాలన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఏం జరిగింది.. ఎలా జరిగింది..
● గోడౌన్లో నిల్వలు సక్రమంగా ఉన్నాయన్న జిల్లా మేనేజర్ ● వ్యత్యాసం ఉందన్న విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని పౌరసఫరాల సంస్థ గోడౌన్లో సంస్థ జిల్లా మేనేజర్ నాగ సుధ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిల్వలను పరిశీలించారు. పరిశీలన అనంతరం జిల్లా మేనేజర్ను మీడియా ప్రతినిధులు వివరాలను కోరగా గోడౌన్లో నిత్యావసర వస్తువుల నిల్వలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేసి గోడౌన్లో ఉన్న నిల్వల్లో భారీగా వ్యత్యాసం ఉందని ఇచ్చిన నివేదికపై వివరణ కోరగా మాకు వారు ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తమ అధికారులతో కూడా సంతకాలు తీసుకోలేదని తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి విషయం తెలిపామన్నారు. జేసీ సూచనల మేరకే ఈ రోజు గోడౌన్లో తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నాగసుధతోపాటు ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్య, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు. విజిలెన్స్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. బస్తాలను లెక్కించారు. గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ లింగస్వామి, గోడౌన్ సిబ్బంది సమక్షంలోనే తనిఖీలు నిర్వహించారు. నిల్వలలో 50.2 క్వింటాలు బియ్యం, 43 క్వింటాలు చక్కెర, 7 క్వింటాలు జొన్నలు, తదితర నిత్యావసర వస్తువుల్లో తేడాలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లా మేనేజర్ నాగ సుధ నిల్వలన్నీ కరెక్ట్గా ఉన్నాయని, కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందని అన్నారు. రెండు శాఖల అధికారులు వేర్వేరుగా ఇచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏమి జరిగింది.. ఎలా జరిగిందనేదానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల, చిలంకూరు గ్రామాల్లో డాబాలు, హోటళ్లలో విజిలెన్స్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలోగురువారం దాడులు నిర్వహించారు. 13 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఉన్నతాధికారులుకు నివేదిక అందిస్తామన్నారు.ఆర్ఐ ప్రమీల, అధికారులు భాస్కర్రెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. హోటళ్లపై ఎన్పోర్సుమెంట్ అధికారుల దాడులు జమ్మలమడుగు: పట్టణంలోని హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డీటీగోవిందు మోరె ఆధ్వర్యంలో అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పాతబస్టాండ్ తాడిపత్రి రహదారిలో ఉన్న ఓ బేకరిలో దాడులు చేశారు. అక్రమ సిలిండర్లు కలిగి ఉండటంతో ఏడింటిని సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. బేకరి యాజమాన్యంపై కేసునమోదు చేసినట్లు డీటీ తెలిపారు. బి.కోడూరు : మండలపరిధిలోని వివిధ హోటళ్లలో గృహావసరాలకు వినియోగించే 5 సిలిండర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు ఆర్డీఓ ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహావసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
కసనూరులో పోలీసుల దాడులు
సాక్షి టాస్క్ఫోర్స్ : సింహాద్రిపురం మండలం కసనూరు – అంకాలమ్మ గూడూరు రోడ్డు సమీపంలోని తోటలలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. జూదమాడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.19వేలు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. కసనూరు గ్రామ సమీపంలోని తోటలో గత కొన్ని నెలలుగా టీడీపీ నాయకుని ఆధ్వర్యంలో జూదం జరుగుతోంది. ఈ ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని నెలలుగా అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు గురువారం దాడులు జరిపారు. గురువారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు జూదశాలపై దాడి చేశారు. జూదమాడతూ 40మంది పట్టుబడటమే కాకుండా పెద్ద ఎత్తున నగదు దొరికినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు కంటి తుడుపు చర్యగా నలుగురిపై కేసు నమోదు చేసి రూ.19వేల నగదు దొరికినట్లు చూపించారు. నిందితులను పోలీసులు తప్పించినట్లు సమాచారం. పోలీసులు తూతూ మంత్రంగా దాడులు చేయడంపట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ప్రతిభ కడప ఎడ్యుకేషన్: కేరళ రాష్ట్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన ఆల్ ఇండియా సౌత్ జోన్ నేషనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కడప మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి సి. శిరీష ప్రతిభ చాటి ఆల్ ఇండియా స్థాయిలో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. 800 మీటర్ల పరుగుపందెంలో శీరీష సత్తా చాటిందన్నారు. భవ్య శ్రీ లాంగ్జంప్లో రెండో స్థానంలో, బి. భవ్యశ్రీ 200 మీటర్ల పరుగుపందెంలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. నాగేశ్వరి వాలీబాల్ టీం విన్నర్గా నిలిచిందన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. -
చీనీ చెట్ల నరికివేత
తొండూరు : మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన గౌస్ అనే రైతుకు చెందిన 25 చీనీచెట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. గౌస్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చీనీ తోటలోకి వెళ్లి చీనీ చెట్లతోపాటు డ్రిప్ వైర్లు, గేట్ వాల్స్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటికి ఫిర్యాదు చేసినట్లు బాధతుడు తెలిపాడు. పోలీసుల దాడులు – నలుగురు అరెస్టు కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి నలుగురు నిందితులను అరెస్టుచేసినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వివరాలను తెలియజేశారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది భగత్సింగ్ పార్క్ సమీపంలోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద క్రికెట్ బెట్టింగ్కు పాల్పడతున్న కడపకు చెందిన సంక కల్యాణ్, ఎల్లటూరు ప్రదీప్, కొడిదెల రహమత్ వల్లి, దొంతల రాహుల్ రెడ్డిలను అరెస్టుచేసి వారినుంచి రూ.17,98,500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు నిందితులు పరారయ్యారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు వల్లూరు: పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలోని శాశ్వత హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. భక్తులు స్వామివారికి హుండీ ద్వారా సమర్పించిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. ఇందులో మొత్తం రూ 4,05,325 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అర్చకులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
గోపవరం : ఈత సరదా ఒకరి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన పెద్దగోపవరం ఎస్సీకాలనీలో గురువారం చోటుచేసుకుంది.వివరాలు మండలంలోని పెద్దగోపవరం ఎస్సీకాలనీకి చెందిన కత్తిమల్లేష్ (36) తోటివారితో కలిసి ఎస్సీకాలనీకి సమీపంలో ఉన్న బావి వద్దకు ఈతకు వెళ్లాడు. మల్లేష్ బావిలోకి దూకాడు. బావి లోపల తీగలు అల్లుకుపోయి ఉండటంతో వాటిల్లో ఇరుక్కుపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని దాదాపు రెండు గంటల పాటు గాలించగా మల్లేష్ మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరదా కోసం ఈతకు వెళ్లి మృత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. ఎస్సీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు కేసు నమోదు చేశారు. -
బాబు పాలనలో రైతులకు అష్ట కష్టాలు
కడప ఎంపీ అవినాష్రెడ్డి పులివెందుల రూరల్: చంద్రబాబు పానలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రకటనలతోనే గత రెండేళ్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆరోపించారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో బుధవా రం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంద న్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కూడా కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతోందన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు ఆహ్వానంఏప్రిల్ 1వ తేదీ నుంచి కమలాపురంలో ప్రారంభం కానున్న ’దర్గా ఏ గఫారియా’ ఉరుసు ఉత్సవాలకు రావాలని దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ ఎంపీని ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఈవీఎం గోడౌన్ల పరిశీలన
కడప సెవెన్రోడ్స్: కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీ ఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్ రావు(బీజేపీ), ఫయాజ్ అహ్మద్ (వైఎస్సార్ సీపీ), జనార్దన్, జబీవుల్లా (టీడీపీ), గౌస్ పీర్ (కాంగ్రెస్), డా.శ్రీనివాసులు (ఆప్), విశ్వనాథ్ (జేఎస్పీ) తదితరులు పాల్గొన్నారు. గనులు, క్వారీల నిర్వహణపై దృష్టి సారించాలి: జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనులు, క్వారీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో మైనింగ్ క్వారీ ల నిర్వహణ, ప్రధాన ఖనిజ బ్లాకుల కార్యాచరణ తదితర అంశాలపై జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావనలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మొగిలిచర్ల భాను ప్రకాష్ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరుకు చెందిన భానుప్రకాష్, ఎర్రగొల్ల గంగాప్రసాద్ అనే యువకులు బుధవారం బైక్పై కడపకు వెళుతున్నారు. మైదుకూరు శివారులోని చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి బైపాస్ సర్వీస్ రోడ్డు మలుపు వద్ద వ్యతిరేక దిశలో వస్తూ పాల వ్యాన్ బైక్ను ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం భాను ప్రకాష్ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం గంగా ప్రసాద్ను హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మెకానిక్ షెడ్లో కాపర్ వైర్ చోరీ పులివెందుల రూరల్ : స్థానిక కడప రోడ్డులో ఎమ్మార్ఎఫ్ షోరూం సమీపంలోని మెకానిక్ షెడ్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ను అపహరించారు. మెకానిక్ షెడ్డుకు సంబంధించిన గేట్ తాళాలను పగులగొట్టి అందులో రైతుకు సంబంధించిన కాపర్ వైరును దోచుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25కేజీల కాపర్ వైరును అపహరించుకపోయారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు శివాలయంలో చోరీ ఎర్రగుంట్ల: మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడులో ఉన్న శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం భక్తులు గుడికి వెళ్లగా ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన చేరుకుని పరిశీలించారు. భక్తులు కానుకలు వేసిన హూండీని దొంగలు తీసుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసి పుటేజీ ఆధారంగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ ధర్మకర్త మలిశెట్టి చిన్నయ్య, దొండపాడు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ద్విచక్రవాహనం దగ్ధం సుండుపల్లె : మండల కేంద్రంలోని రెహమాన్వీధి బీఎస్ఎన్ఎల్ టవర్ వెనుక భాగంలోని మల్లినేని సుజాత ద్విచక్రవాహనాన్ని ఆమె ఇంటి ముందు భాగంలో పార్కింగ్ చేసింది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ03 సియూ 4770 నంబర్ గల ద్విచక్రవాహనానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. బైక్ పూర్తిగా కాలిపోయింది. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. -
అంగన్వాడీ ఆయాపై అత్యాచార యత్నం
అడ్డుకున్న భర్త, మామపై కూడా దాడిసాక్షి టాస్క్ఫోర్స్: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో పని చేస్తున్న అంగన్వాడీ ఆయా పై అదే గ్రామానికి చెందిన రిపోర్టర్ చంద్ర దాడి చేసి అత్యాచారయత్నానికి ఒడి గట్టాడు. గురువారం గ్రామంలో ఉన్న ఆయాను లైంగికంగా వేధిస్తుండగా బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో భర్త, మామ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తీసుకెళ్లారు. గతంలో కూడా ఈమైపె పలుమార్లు లైంగిక దాడగికి ప్రయత్నించడం, సదరు మహిళ ప్రతిఘటించడం పోలీస్ స్టేషన్లో ఫిద్యాదు చేయడం జరిగాయి. ప్రస్తుతం అదే కేసు నడుస్తున్నప్పటికీ తిరిగి లైంగిక దాడికి పాల్పడడం పై గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతుండటంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన రిపోర్టర్ ఇలాంటి అఘాయిత్యాలకు ఒడి గట్టడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్ర పై తక్షణం పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
ఎన్నియ్యల్లో.. ఎన్నికల్లో.. చంద్రంమామా!
‘చందమామ రావే.. జాబిల్లి రావే అని పిల్లలకు కథలు చెప్పినట్లు.. ఎన్నికలు రావు.. నోటిఫికేషన్ రాదు అంటూ కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఊరూరా తిరుగుతూ అసాధ్యమైన హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎన్నియల్లో ఎన్నికల్లో చంద్రంమామా.. అంటూ ప్రజలు ఆటపట్టిస్తున్నారు‘ బద్వేలు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్కు ఇప్పుడు ’స్థానిక’ సెగ తగులుతోంది. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపి, అధికారం చేపట్టాక ప్రజల గొంతు కోసిన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలను ఇప్పటికే అటకెక్కించిన సర్కార్, ఇప్పుడు పంచాయతీల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైంది. జనం తిరగబడతారని, ఘోర పరాభవం తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో.. ఎన్నికల ఊసే ఎత్తకుండా ప్రత్యేకాధికారుల పాలనను రుద్దేందుకు కుతంత్రాలు పన్నుతోంది. దోపిడీ పర్వం.. పడగ విప్పిన పచ్చదండు! అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమిలోని చోటా మోటా నాయకులు ’అందినకాడికి దోచుకో.. అడ్డంగా పంచుకో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకలు ఇసుక మాఫియా పరం కాగా, కొండలు, గుట్టలను సైతం కంకర రూపంలో కరిగించేస్తున్నారు. గ్రామకంఠం భూములను పచ్చ నేతలు కబ్జా చేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్నారని మహిళా లోకం నిప్పులు చెరుగుతోంది. నిధులపై కన్నేసి.. సర్పంచ్లను ముంచేసి! పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక పెద్ద కుట్రే ఉంది. పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను కాజేసేందుకే ఈ వాయిదా పర్వమని తెలుస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగియగానే, తహసీల్దార్లు, ఎంపీడీఓల వంటి ప్రత్యేకాధికారులను నియమించి.. వారి ద్వారా ఆ నిధులను తమ అనుయాయులకు, పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. కూటమి అడ్రస్ గల్లంతు తప్పదు ‘ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా కూటమి అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం. రెండేళ్లుగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు చేరడం లేదు. జనం ఆగ్రహంతో ఉన్నారు, అందుకే గెలవలేమని తెలిసి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు.‘ –బాల అంకిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు, ఇ.రామాపురం, కలసపాడుప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది ‘కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ప్రత్యేకాధికారులతో పాలన సాగించాలని చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమికి పరాభవం తప్పదు.‘ –జి. హనుమంతరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వినర్, కాశినాయన మండలం. నిధుల దోపిడీ కోసమే వాయిదా పన్నాగం ‘పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను దోచుకోవడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకాధికారుల ద్వారా ఆ డబ్బును టిడిపి కార్యకర్తలకు పంచిపెట్టేందుకు కుతంత్రం పన్నుతున్నారు. ఓటమి భయం వల్లే వేచి చూసే ధోరణిలో ఉన్నారు.‘ –రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ కన్వినర్, బి.కోడూరు మండలంవైఎస్సార్ కడప జిల్లాలో దాదాపు 95 శాతం పంచాయతీలు వైఎస్సార్సీపీ మద్దతుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ బలాన్ని తట్టుకోలేక, ప్రజాబలంతో గెలవడం అసాధ్యమని భావించే.. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా అంటూ కుంటి సాకులు వెతుకుతున్నారు. పీకల్లోతు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికే ఈ ’వాయిదా’ డ్రామా ఆడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు. ఎన్నికలంటేనే ‘ఎల్లో గ్యాంగ్’కు వణుకు జనం తిరగబడతారనే’స్థానిక’ వాయిదా! 619 పంచాయతీల్లో ప్రజాస్వామ్యానికి పాతర..ప్రత్యేకాధికారుల రాజ్యానికి తెర ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల గడువు.. ఊసేలేని నోటిఫికేషన్! నిధుల దోపిడీ కోసమే పక్కా స్కెచ్..పచ్చ నేతల కబ్జాలకు అడ్డు లేదు -
మాస్టర్ ప్లాన్కు మంగళం.. ముడుపులే ‘మూలం’ !
ప్రొద్దుటూరు రూరల్: నిబంధనలు నెమరువేయడానికి కాదు.. బుట్టదాఖలా చేయడానికే అన్నట్లుంది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ అధికారుల తీరు. అందినకాడికి ‘తడిపితే’ చాలు.. నిబంధనలను పాతరేసి, చెరువులు, కాలువలపై కూడా అపార్ట్మెంట్లు లేపేయవచ్చని అధికారులు నిరూపిస్తున్నారు. మైదుకూరు రోడ్డులో మాస్టర్ ప్లాన్ను తుంగలో తొక్కి, బఫర్ జోన్ను కబళిస్తూ సాగుతున్న ఓ అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ. 20 లక్షల ‘ముడుపు’ మంత్రం! ఈ అక్రమ కట్టడం వెనుక భారీ స్థాయిలో కాసుల వేట సాగినట్లు తెలుస్తోంది. తొలుత నిబంధనల ఉల్లంఘనను గుర్తించి పనులను నిలిపివేసిన అధికారులు, ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంతో రూ. 20 లక్షల బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ‘ముడుపుల’ మంత్రం పఠించిన వెంటనే, అక్రమ నిర్మాణానికి అధికారులు సాగిలపడి ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేశారు. డీఎల్పీఓ, డీపీఓ వంటి ఉన్నతాధికారులు నిత్యం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నా, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఈ భారీ అక్రమ కట్టడంపై చూపకపోవడం వెనుక మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. కాలువ మలుపు.. పేదల పొట్ట కొట్టే తీర్పు! అపార్ట్మెంట్ యజమాని ప్రయోజనాల కోసం రెవెన్యూ అధికారులు ఏకంగా మురికి కాలువ అలైన్మెంట్నే మార్చేయడం గమనార్హం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే ప్రధాన మురికి కాలువను అపార్ట్మెంట్కు తగలకుండా వంకర తిప్పారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న సామాన్యుల, పేదల స్థలాలను కాలువలోకి నెట్టేశారు. అపార్ట్మెంట్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరగడానికి కనీసం 2.5 మీటర్ల సెట్ బ్యాక్ కూడా వదలలేదు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ కార్యదర్శి ‘అమాయకత్వం’! ఈ అక్రమ దందాపై ‘సాక్షి’ వివరణ కోరగా, కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి నరసింహులు చెప్పిన సమాధానం విస్తుగొలుపుతోంది. గ్రామ పరిధిలో ఐదు అంతస్తుల భవనం లేస్తుంటే.. ‘నాకేమీ తెలియదు.. నా దగ్గర రికార్డులే లేవు’ అంటూ బుకాయించడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. అధికారుల అండ, రాజకీయ అండదండలతో సాగుతున్న ఈ అవినీతి కట్టడంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. కొత్తపల్లెలో కాలువను కమ్మేసిన అపార్ట్మెంట్.. రూ. 20 లక్షల బేరంతో ‘గ్రీన్ సిగ్నల్’ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధి, అధికారుల జేబుల్లోకి భారీగా అక్రమ వసూళ్లు మురికి కాలువ అలైన్మెంట్ మార్పు.. పేదల స్థలాలకు ఎసరు ఏమీ తెలియదంటున్న పంచాయతీ కార్యదర్శి.. రికార్డులే లేవని సమాధానం! -
శ్రీరామనవమి శుభాకాంక్షలు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని జిల్లా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని .. జిల్లా ప్రజలపై ఆయన కరుణ ఉండాలని ఆకాంక్షించారు. కలెక్టర్, ఎస్పీ నవమి శుభాకాంక్షలు కడప సెవెన్రోడ్స్: కుటుంబ జీవన గమనంలో కష్ట సుఖాలు సహజమే అనే సత్యానికి సీతారాముల ఆదర్శ జీవిత సారాంశమే నిదర్శనమని కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వేరు వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రజలపై శ్రీ రామరక్ష ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని కలెక్టర్, ఎస్పీ ఆకాంక్షించారు. కడప సెవెన్రోడ్స్: కడప నగరంలో ఈ నెల 28న జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రగతి నివేదికలతో పాటు అభివృద్ధి ప్రతిపాదనల సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 లకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని, జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలి విడత లాటరీలో 711 మంది విద్యార్థులు ఎంపికై నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు కేటాయించిన 25 శాతం సీట్లు లాటరీ ద్వారా ఎంపికై న విద్యార్థులతో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1206 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తొలివిడతలో కిలోమీటర్ పరిధిలో ఉన్న 711 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలివిడతలో 178 మంది ఎస్సీలకు, 19 మంది ఎస్టీలకు, 83 మంది మైనార్టీలకు, 305 మంది బీసీలకు, 125 మంది ఓసీలకు, ఒక్క సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థికి ప్రవేశాలు కల్పించినట్లు వివరించారు. ఎంపికయిన విద్యార్థులు అన్ని రకాల ధ్రువ పత్రాలతో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆయా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని తెలిపారు. -
ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భువనేశ్వరి అనే ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ మహిళ అత్త అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని చూసి షాక్కు గురయింది. స్థానికుల సహాయంతో వెంటనే వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి , ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది. -
డీసీఎంఎస్ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్ : డీసీఎంఎస్ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణబాబు పేర్కొన్నారు. కడపలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీఎంఎస్ ఆధ్వరంలో నిర్వహించే షాపుల బాడుగలను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లాలోని అన్ని సహకారం సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. దీంతోపాటు పంటలబీమాను గ్రామ యూనిట్ను అమలు చేసేందుకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. డీసీఓ వెంకటసుబ్బయ్య, మార్క్ఫెడ్ డీఎం పరిమళజ్యోతి, డీసీఎస్ఎం మేనేజర్ ఖాదర్వల్లి పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిపులివెందుల రూరల్ : స్థానిక ఉలిమెల్ల రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సియోన్పురంలో నివాసం ఉంటున్న గంగా ప్రసాద్(32) బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఉలిమెల్ల రింగ్ రోడ్డు సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంగా ప్రసాద్ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గంగా ప్రసాద్ డివైడర్ను ఢీకొని మృతి చెందాడా లేక ఏదైనా వాహనం ఢీకొందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరటి రైతును ఆదుకోవాలి: షర్మిల కడప సెవెన్రోడ్స్ : అకాల వర్షాలు, ధరల పతనంతో నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం కడపలో జాయింట్ కలెక్టర్ నిధి మీనాకు ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో టన్ను రూ. 26 వేలు పలికిన అరటి ధర, ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ. 10–12 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. పులివెందుల ప్రాంతంలో జీ–9 రకం అరటి సాగు ఎక్కువగా ఉన్నందున, అక్కడ కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు, 2023–24 ఏడాదికి సంబంధించిన బీమా సొమ్మును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.అంతకుముందు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను సందర్శించి, తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులర్పించారు. -
రాజంపేటకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి
రాజంపేట: ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ బాలాజి మెడమల్లి తొలిసారిగా స్వగ్రామమైన రాజంపేటకు విచ్చేశారు. ఈయనను రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు ఆధ్వర్యంలో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్ , న్యాయవాదు లక్ష్మీనారాయణ, జాఫర్బాషా, సంగరాజు రామచంద్రరాజు, రఘునాథరెడ్డి, కృష్ణకుమార్, ఆనంద్, సురేంద్ర, స్ధానికులు డా.నవీన్, బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు దగ్గుపాటి నవీన్కుమార్ పాల్గొన్నారు. -
హనుమంతవాహనంపై శ్రీరాముడి తేజసం
వాల్మీకిపురం : పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. -
ఇద్దరు యువకులపై కత్తితో దాడి
కడప అర్బన్ : కడప నగరం ఎరమ్రుక్కపల్లె సర్కిల్ సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బుధవారం రాత్రి రవి,భాస్కర్ అనే యువకులపై కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ ఎస్ఐ ప్రదీప్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిని యువకులను వైద్య పరీక్షల కోసం రిమ్స్కు తరలించారు. పోలీసు అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు కడపకు చెందిన త్రిపుర పాటి భాస్కర్, తన స్నేహితుడు రవి, స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. వైన్ షాప్ నుంచి బయటికి రాగానే భాస్కర్,రవిలపై కొందరు కత్తులతో దాడి చేశారు.నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు, బైక్ ఢీ: వ్యక్తి మృతి చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని జమాల్పల్లె గ్రామ సమీపంలో భారత్ పెట్రోల్ బంకు వద్ద కారు– బైకు ఢీకొన్న ప్రమాదంలో బైక్ రైడర్ వల్లెపు పెద్ద గంగయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి వస్తున్న ఏపీ 39 జీవై 7389 నంరుగల కారు కడప నుంచి జమాలపల్లెకు వెళుతున్న ఏపీ 39 ఈడీ 6006 నంబర్గల బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అలంఖానపల్లి గ్రామానికి చెందిన వల్లెపు పెద్ద గంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా బైక్ సుమారు 45 అడుగుల దూరంలో పడిపోయింది. కారు కూడా అదుపుతప్పి పెట్రోల్ బంకు డివైడర్ గోడను ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. అరటి పంట దగ్ధంకాశినాయన : మండలంలోని ఆకులనారాయణపల్లె గ్రామానికి చెందిన కర్ర రఘునాథ్ రెడ్డి అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి పంట బుధవారం దగ్ధమైంది. రైతు తెలిపిన వివరాల మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి రెండు ఎకరాల్లో అరటి పంట కాలిపోయిందన్నారు. దీంతో సుమారు రూ.2లక్షల మేర నష్టం వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు రఘునాథ్ రెడ్డి కోరారు. -
కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు అన్యాయం
● వైఎస్సార్సీపీతోనే సంక్షేమ పాలన సాధ్యం ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీతో పాటు అంజద్బాష ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీలకు మేలు జరిగిందంటే అది దివంగత వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనేనని తెలిపారు. గత ప్రభుత్వంలో వీరి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలేవీ అమలు కావడం లేదన్నారు. ప్రతి పాస్టర్కు గౌరవ వేతనం రూ.5వేలు ఇచ్చేవారని, జెరుసలేం పర్యటనకు ఆర్థిక సాయం చేసేవారన్నారు. ఇక ప్రభుత్వ పథకాలు వారికి అందేవన్నారు. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు ఎలాంటి పథకాలు అందించకపోగా వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వ కుట్ర వల్లే ప్రవీణ్ పగడాల ఆకాల మరణం చెందారని ఆరోపించారు. క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీలను చైతన్య పరిచి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని తెలిపారు. మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో క్రిస్టియన్ మైనార్టీలకు రక్షణ, భద్రత ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అవేవీ లేవన్నారు. వారికి అందిస్తున్న పథకాలు కూడా కోత కోశారన్నారు. అనంతరం క్రిస్టియన్ మైనార్టీలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు పాస్టర్ షెడ్రక్,నగర క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు విజయ్ కిషోర్, రాష్ట్ర కార్యదర్శి ఫాస్టర్ జాన్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు సీహెచ్ వినోద్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బంగారు నాగయ్య యాదవ్ పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ ముసుగులో బియ్యం వ్యాపారం
● నిత్యావసర వస్తువుల నిల్వలో తేడా ● విజిలెన్స్ అధికారులు దాడులుప్రొద్దుటూరు : అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్ ముసుగులో బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ తనయుడు పౌరసరఫరాల శాఖ గోడౌన్లో స్టేజ్–2 కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఈయన ప్రతినెల గోడౌన్ నుంచి రేషన్ షాప్లకు తన వాహనాల ద్వారా బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తుంటాడు. ప్రొద్దుటూరులో బియ్యం వ్యాపారం రేషన్ షాపుల్లో బహిరంగంగా జరుగుతోంది. నేరుగా డీలర్లు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా సదరు కాంట్రాక్టర్ ముందుగానే తనకు అనుకూలమైన డీలర్లతో మాట్లాడుకుని తక్కువగా బియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. మిగిలిన బియ్యం బస్తాలను గోడౌన్ నుంచే బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే గోడౌన్ నుంచి రేషన్ షాపులకు నిత్యావసర వస్తువులను కాంట్రాక్టర్ సరఫరా చేశారు. విజిలెన్స్ అధికారుల దాడులు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పౌరసరఫరాల శాఖ గోడౌన్ను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి వివరాలను ప్రకటించారు. బియ్యం 50.2 క్వింటాళ్లు, చక్కెర 43 క్వింటాళ్లు, జొన్నలు 7 క్వింటాళ్లుతోపాటు ఇతర సరుకులు తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరించారు. సీఐ పి.శ్రీనివాసరెడ్డి, డీసీటీఓ ఎస్.ఖాజాహుస్సేన్, డీఈఈ ఈశ్వరయ్యతోపాటు గోడౌన్ ఇన్చార్జి లింగస్వామి పాల్గొన్నారు. -
వేతన సవరణ అమలు చేయాలని ధర్నా
కడప అగ్రికల్చర్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణను అమలు చేయాలని జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కడప డీసీసీ బ్యాంకు ఎదుట ప్లకార్డులతో నాయకులు, ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాయింట్ ఫోరం ఆప్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంటా నారాయణరెడ్డి, సుధీర్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్రెడ్డి, సుధాకర్రెడ్డిలు మాట్లాడుతూ 40 నెలల కాలం పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేస్తున్న 3,500 ఉద్యోగులకు వేతన సవరణ అమలులో జాప్యం జరుగుతోందన్నారు.ఇందుకు నిరసనగా ఏప్రిల్ 4 నుంచి జిల్లాల వారీగా విజయవాడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికి యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఏప్రిల్ 13న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. వైద్య కళాశాలను అభివృద్ధ్ది పథంలో నడిపించాలి కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త ఏపీ జూడా (ఏపీజెయుడీఏ) కమిటీ నాయకులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వీరు కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.జమునను కలిశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కడప ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ జూడాల కడప జిఎంసీ కమిటీలో డాక్టర్ ఎం. రవితేజ నాయక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బి. యశ్వంత్ కృష్ణ, డాక్టర్ కె. మేఘనా ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎ. లక్ష్మికాంత్, డాక్టర్ జి. తిరుమలేష్, డాక్టర్ ఎన్. ఎస్. మిహిర్ రెడ్డి, డాక్టర్ బి. దినేష్ విశ్వ రెడ్డి, డాక్టర్ దీపిక ఉన్నారు. -
ప్రియురాలి మోసం.. యువకుడి బలవన్మరణం
తాడిపత్రి రూరల్ : ప్రియురాలు మోసం చేసిందన్న బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అంకంపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, పద్మావతి దంపతులకు ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివపవన్కుమార్రెడ్డి వాటర్ బాటిళ్లను దుకాణాలకు వేస్తూ వచ్చిన కమీషన్ను కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల యువతి తనను మోసం చేస్తున్నట్లుగా గుర్తించిన శివపవన్కుమార్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకుని చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సులో వచ్చి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్కు ఆటోలో చేరుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా తమ్ముడు శివనాగార్జునరెడ్డి ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న శివపవన్కుమారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నానో తనకే తెలియదని, ఇక ఇంటికి రానని, ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తెలిపాడు. ఆందోళనకు గురైన తమ్ముడు వెంటనే సర్ది చెబుతూ ఎక్కడున్నావో లోకేషన్ షేర్ చేయాలని అడగడంతో శివపవన్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ షేర్ చేశాడు. అప్పటికే కోమలి సమీపంలోకి చేరుకున్న శివపవన్కుమార్రెడ్డి ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్పీ హెచ్సీ వరప్రసాద్ చేరుకుని పరిశీలించారు. కాసేపటి తర్వాత ఫోన్ లోకేషన్ ఆధారంగా ప్రత్యేక వాహనంలో తల్లిదండ్రులతో కలసి శివనాగార్జునరెడ్డి చేరుకున్నాడు. పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న కుమారుడి శరీర భాగాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రజల ఇబ్బందులపై రైల్వే దృష్టి సారించాలి
రాజంపేట: నియోజకవర్గ పరిధిలో ఆర్యూబీ వల్ల గ్రామీణుల పడుతున్న ఇబ్బందులపై రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజంపేట–రాయచోటి సబ్వే, హస్తవరం ఆర్యూబీతో పాటు పలు ఆర్యూబీల స్ధితి గతులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాజంపేట సబ్వే ద్వారా తాత్కాలిక రహదారి సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్వరలో గంగమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో రాజంపేట స్టేషన్కు ఆవలివైపు ఉన్న వారు రాకపోకలు సాగించాలంటే తప్పనిసరిగా సబ్వే తప్పనిసరి అన్నారు. అలాగే రాజంపేట రూరల్ ఏరియాలోని హస్తవరం వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జిని మరమ్మతులు చేయించాలని తెలిపారు. హస్తవరం లెవల్ క్రాసింగ్ గేటు 110 వద్ద ఆర్యూబీని మంగళవారం రాజంపేట ఏడీఎన్ వాసుదేవనాయుడుతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు.గుంతకల్లు డివిజనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లంభరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ సెక్షన్లో ఆర్యూబీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనరు దొడ్డిపల్లె భాస్కరరాజు, రైల్వేకోడూరు దళితనేత తిప్పన నాగభూషణం, నాయకుడు సానిగారి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
హాయ్గా.. వేగంగా!
● శరవేగంగా ‘గ్రీన్ఫీల్డ్’.. డిసెంబర్కే పూర్తి! ● రూ.14 వేల కోట్లతో 343 కి.మీ. మేర ఆరు వరుసల రహదారి ● కొడికొండ చెక్పోస్ట్ నుంచి విజయవాడ వరకు 14 ప్యాకేజీల్లో పనులు ● ఇప్పటికే 60 శాతం పూర్తి.. రికార్డు వేగంతో సాగుతున్న నిర్మాణంకడప సిటీ : రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనున్న ప్రతిష్టాత్మక ‘గ్రీన్ఫీల్డ్’ ఎక్స్ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ నుంచి విజయవాడ వరకు చేపట్టిన ఈ ఆరు వరుసల రహదారి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 14 వేల కోట్ల అంచనా వ్యయంతో 343 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అసలేమిటీ ‘గ్రీన్ఫీల్డ్’..? చాలామందికి గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏమిటనే అవగాహన ఉండటం లేదు. సాధారణంగా ఉన్న రహదారులను వెడల్పు చేయడం కాకుండా, గ్రామాల మీదుగా వెళ్లకుండా నేరుగా పంటపొలాలు, ఖాళీ స్థలాల గుండా కొత్తగా నిర్మించే రహదారినే ‘గ్రీన్ఫీల్డ్ హైవే’ అంటారు. ఈ రోడ్డు నిర్మాణం ఎక్కడా గ్రామాల్లోకి వెళ్లదు. దీనివల్ల ప్రయాణ దూరం, సమయం భారీగా తగ్గుతాయి. ఐదు జిల్లాల మీదుగా.. 14 ప్యాకేజీలు ఈ మెగా ప్రాజెక్టు ఐదు జిల్లాల (శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల) గుండా సాగుతోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 6,902 ఎకరాల భూసేకరణ పూర్తి చేసింది. 2024 మార్చిలో ప్రారంభమైన ఈ పనులను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. హైటెక్ భద్రత.. స్పీడ్ లిమిట్ 100 కేఎంపీహెచ్ ఈ హైవేపై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కేవలం ఫోర్ వీలర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటోలు, ద్విచక్ర వాహనాలను నిషేధించారు. వేగ పరిమితిని పర్యవేక్షించేందుకు అత్యాధునిక ‘ఆటో సీసీ కెమెరాల’ను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోమేటిక్గా వాహనదారుల మొబైల్కు చలాన్ మెసేజ్ వెళ్తుంది.పనుల వేగానికి 4 గిన్నీస్ రికార్డులు ‘గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఎటువంటి ఆటంకాలు లేవు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అత్యంత నాణ్యతతో, వేగంగా పనులు చేస్తున్నందుకు గాను ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులు లభించాయి. డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తెస్తాం.‘ – బి. అశోక్కుమార్, ఎన్హెచ్ఏఐ పీడీ, కడప -
గ్యాస్ కొట్టొద్దు సారూ!
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తు న్నా సిలిండర్లు ఇంటికి చేరకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ పక్క ఏజెన్సీ నిర్వాహకులు స్టాక్ లేదని చేతులెత్తేస్తుంటే, మరోపక్క జిల్లా అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ కలరింగ్ ఇస్తుండటం గమనార్హం. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం సున్నా కడప బీకేఎం వీధికి చెందిన వై.చాముండేశ్వరి ఈనెల 15న గ్యాస్ బుక్ చేయగా, 18న క్యాష్ మెమో కూడా వచ్చింది. 24 గంటల్లో సిలిండర్ వస్తుందని ఆశించినా ఫలితం లేదు. ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీని సంప్రదిస్తే స్టాక్ తక్కువగా ఉందని, మరికొన్ని రోజులు ఆగాలని బదులిచ్చారు. అలాగే హబీబుల్లావీధికి చెందిన శివకుమార్ ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించినా, గరిశా ఏజెన్సీ నుంచి సిలిండర్ రాక అల్లాడుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల బుజ్జగింపులు.. వాస్తవాలు వేరు జిల్లాలోని 5.99 లక్షల గ్యాస్ కనెక్షన్లకు 58 ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు నమ్మవద్దని, తగిన నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా సగానికి పడిపోయిందని ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తేజ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. దీంతో వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించలేకపోతున్నామన్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జిల్లాలో ఎల్పీజీ సరఫరా అస్తవ్యస్తంగా మారిన తరుణంలో బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం గృహ అవసరాలకే గ్యాస్ అందించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. బడా హోటళ్లకు ‘అండ’.. చిన్నోళ్లపై ‘దండయాత్ర’ కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోయినా, నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఏజెన్సీల ద్వారా గృహ వినియోగ సిలిండర్లు భారీగా పక్కదారి పడుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పౌరసరఫరాల అధికారులు, ప్రత్యేక బృందాలు ఈ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనధికార రీఫిల్లింగ్ కేంద్రాల్లో కిలో గ్యాస్ రూ. 300 వరకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ‘సాక్షి’ ప్రశ్నలకు డీఎస్ఓ మౌనం: జిల్లాలో అసలు గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి? కమర్షియల్ సరఫరా ఆగిపోయినా పెద్ద హోటళ్లు ఎలా నడుస్తున్నాయి? ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ఆరోపణలపై చర్యలేవి? వంటి అంశాలపై ‘సాక్షి’ బుధవారం జిల్లా పౌరసరఫరాల అధి కారి రఘురామ్ను వివరణ కోరగా, ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. గ్యాస్ కష్టాలతో వినియోగదారులు అల్లాడుతుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు సమాధానం చెప్పకపోవడం శోచనీయం. ఎల్పీజీ సరఫరాపై అధికారుల అబద్ధాలు కొరత లేదంటూ మభ్యపెడుతున్న అధికారులు సరఫరా సగం పడిపోయిందంటున్న నిర్వాహకులు సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న ఏజెన్సీలు గ్యాస్ అందక వినియోగదారుల తిప్పలుఎల్పీజీ లేక తిప్పలు పది రోజుల క్రితం బుక్ చేశాను. ఓటీపీ కూడా వచ్చింది. కానీ సిలిండర్ రాలేదు. ఏజెన్సీకి వెళ్తే మరో 15–20 రోజులు ఆగాలని చెబుతున్నారు. గ్యాస్ లేక చాలా అవస్థలు పడుతున్నాం. –జమీల,హబీబుల్లావీధి, కడపడబ్బు చెల్లించినా ఫలితం లేదు డెలివరీ బాయ్స్ చెబితే ఈనెల 14న ఫోన్–పే ద్వా రా రూ. 963 చెల్లించాను. అకౌంట్ నుంచి డబ్బు కట్ అయింది కానీ గ్యాస్ రాలేదు. ఏజెన్సీ వాళ్లేమో మరికొన్ని రోజులు ఆగమంటున్నారు. –శివకుమార్, హబీబుల్లావీధి, కడప -
ఆర్డీఓగా శిరీష బాధ్యతలు
జమ్మలమడుగు: జమ్మలమడుగు ఇన్చార్జ్ ఆర్డీఓగా శిరీష బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం ఆమె ఆర్డీఓ కార్యాలయంలో అధికారుల సమావేశాన్ని నిర్వహించి అధికారు లతో పరిచయం చేసుకున్నారు. జె.శిరీష కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ పుట్బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్. ఇమామ్ ఖాసిం ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్. సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి. రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్. శివ సుబ్రమణ్యం డి.ఎ.ఆర్) అన్నమయ్య, (కడప) ఉన్నారు. -
● భక్తుల కోసం వసతి, అన్నప్రసాద సౌకర్యాలు
ఒంటిమిట్ట/రాజంపేట: ఆధ్యాత్మికతకు నిలయం, భక్తి భావానికి చిరునామా అయిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట.. మరోసారి రామనామ స్మరణతో మారుమోగనుంది. జగదభిరాముడైన శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమంతుడు లేని విశిష్ట ఆలయం: దేశంలోని ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్ట ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై ఉన్నప్పటికీ, గర్భాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. శ్రీరాముడు వనవాస సమయంలో హనుమంతుడిని కలవక ముందే ఈ ప్రాంతంలో విశ్రమించారని పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ స్వామివారిని ’జగదభిరాముడు’గా భక్తులు కొలుచుకుంటారు. ముస్తాబైన ఏకశిలా నగరం: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఏకశిలా నగరానికి సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేడుకల షెడ్యూల్: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, వివిధ వాహన సేవలు, శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు భక్తులు స్వామివారి దివ్య దర్శనాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ● ఈ బ్రహ్మోత్సవాలు మరియు సీతారాముల కల్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ● టీటీడీ జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కడప జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం తరఫున హాజరవుతారు. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు కల్యాణ వేడుకల్లో పాల్గొంటారు. 1. వసతి సౌకర్యాలు: ఒంటిమిట్ట ఒక చిన్న గ్రామం కావడంతో ఇక్కడ వసతి గదులు పరిమితంగా ఉంటాయి. టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం కింది ఏర్పాట్లు చేశాయి: టీటీడీ అతిథి గృహాలు: ఆలయ సమీపంలో ఉన్న టీటీడీ డార్మిటరీ హాల్స్ మరియు కొన్ని గదులు అందుబాటులో ఉంటాయి. ఇవి ముందుగా వచ్చి న వారికి ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ప్రభుత్వ వసతి: స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు కళ్యాణ మండపాలను భక్తుల విశ్రాంతి కోసం తాత్కాలిక వసతి కేంద్రాలుగా మారుస్తారు. కడప లేదా రాజంపేట: ఎక్కువ మంది భక్తులు కడప (25 కి.మీ) లేదా రాజంపేట (30 కి.మీ) పట్టణాల్లోని ప్రైవేట్ హోటళ్లలో బస చేసి, ఉత్సవాలకు వస్తుంటారు. అక్కడి నుండి బస్సు సౌకర్యం నిరంతరం ఉంటుంది. తాత్కాలిక షెడ్లు: సీతారాముల కల్యాణం రోజున వేలాది మంది భక్తుల కోసం కల్యాణ వేదిక సమీపంలో భారీ జర్మన్ షెడ్లను నిర్మిస్తారు. ఇక్కడ ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉంటుంది. 2. అన్నప్రసాదం – తాగునీరు: బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ఆకలి తీర్చడానికి టీటీడీ అన్నప్రసాద విభాగం భారీ ఏర్పాట్లు చేస్తోంది: ఉచిత అన్నప్రసాదం: ఆలయ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజూ ఉదయం 11:00 నుండి రాత్రి వరకు భక్తులకు నిరంతరంగా భోజన సౌకర్యం ఉంటుంది. కల్యాణం రోజు ప్రత్యేక పంపిణీ: ఏప్రిల్ 1న కల్యాణం జరిగే ప్రాంగణంలోనే లక్ష మందికి పైగా భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి పొట్లాలు పంపిణీ చేస్తారు. తాగునీటి సౌకర్యం: ఎండల తీవ్రత దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో, కల్యాణ వేదిక వద్ద ’జలప్రసాదం’ (మంచినీటి) కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. ముత్యాల తలంబ్రాల పంపిణీ: కల్యాణం అనంతరం భక్తులందరికీ స్వామివారి కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం ప్యాకెట్లను క్యూలైన్లలోనే అందజేస్తారు. ముఖ్య సూచనలు: ఎండల దృష్ట్యా: చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే వారు గొడుగులు, తలకు టోపీలు వెంట తెచ్చుకోవడం మంచిది. వైద్య సౌకర్యం: అత్యవసర పరిస్థితుల కోసం కల్యాణ వేదిక వద్ద మరియు ఆలయ సమీపంలో మొబైల్ క్లినిక్లు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. (బ్రహ్మోత్సవాల రోజుల్లో...) సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, టీటీడీ ప్రత్యేక సమయాలను కేటాయించింది. సర్వదర్శనం: ఉదయం 4:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు (కై ంకర్యాల సమయం మినహా). అభిషేకం: ఉదయం 5:30 నుండి 6:30 వరకు (ముందుగా టికెట్ తీసుకున్న వారికి). విరామ సమయం: మధ్యాహ్నం 1:00 నుండి 2:00 వరకు ఆలయ శుద్ధి మరియు నైవేద్యం కోసం దర్శనాలు నిలిపివేస్తారు. కల్యాణోత్సవం రోజు (ఏప్రిల్ 1): ఆ రోజు సాయంత్రం కల్యాణం ఉన్నందున, గర్భాలయ దర్శనం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం నుంచి బహిరంగ ప్రాంగణంలో కల్యాణ వేడుకలు జరుగుతాయి. హనుమ లేని ఏకై క రామాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న దాశరథి కోవెల ఏకశిలానగరానికి ఆధ్యాత్మిక శోభ రేపటి నుంచి ఏప్రిల్ 5వ వరకు బ్రహ్మోత్సవాలు శ్రీరామ నవమికి పోటెత్తనున్న భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమైన టీటీడీ అధికారులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ప్రత్యేక కథనం. -
● విష్ణు దర్బ సమర్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 27న జరిగే ధ్వజారోహణానికి పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్బ చాప, తాడును టీటీడీ, అటవీశాఖ అధికారులు బుధవారం ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ విష్ణు దర్బని అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేశారు. సుమారు 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగి, 60 కిలోల బరువు ఉన్న దర్బ చాపతో పాటు 225 మీటర్ల పొడవు గల తాడును ఏటా ధ్వజారోహణానికి వినియోగిస్తారు. ఈ పవిత్ర విష్ణు దర్బను శుద్ధి చేసి, ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుడతారు. ఈ తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభాన్ని సూచిస్తా రు. టీటీడీ ఇంచార్జ్ డీఎఫ్వో డాక్టర్ ఏ.వి.ఎన్ శివకుమార్, డీఎఫ్వో విజయకుమార్, డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
●అల్పాహారం..అతి మూల్యం!
జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణంలో సామాన్యుడి టిఫిన్ ప్లేటుకు గ్యాస్ సెగ తగిలింది. పట్టణంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటళ్లు, టిఫిన్ బండ్ల వద్ద ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిత్యం వందలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆధారపడే టిఫిన్ సెంటర్లలో రేట్లు చూసి షాక్కు గురవుతున్నారు. గత వారం రోజుల క్రితం వరకు రూ. 30 నుంచి రూ. 40 మధ్య ఉన్న ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్ల ధరలు ఇప్పుడు రూ. 45 నుంచి రూ. 50కి చేరాయి. గతంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి రూ. 90తో టిఫిన్ పూర్తయ్యేది, కానీ ఇప్పుడు కనీసం రూ. 130 ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరల పెరుగుదలపై హోటల్ యజమానులను ప్రశ్నిస్తే.. ‘అంతా గ్యాస్ మహిమ‘ అని సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ దొరకడం లేదని, వ్యాపారం సాగాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు పెట్టి కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. దీనికి తోడు పెరిగిన కూ లీల ఖర్చుల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని టిఫిన్ బండ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కడప జిల్లా ఎస్పీ ఎస్. నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భద్ర తా ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, విజిలెన్స్ ఎస్పీ మురళీకృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేతో కలిసి పరిశీలించారు. ముందుగా వారు ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల క్యూలైన్లు, సీఎం గెస్ట్ హౌస్, కల్యాణ వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పట్లపై పోలీసులకు దిశానిర్దేశం ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుమారు 3 వేల మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు, సీతారాముల కల్యాణానికి శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా జరిపించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, మహిళా శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పసుపు కొమ్ములు దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సిద్ధం చేసిన పసుపును స్వామి వారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని విని యోగిస్తారు. ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మీ ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిధ్రా ఘట నం నిర్వహించారు. పసుపు కొమ్ములు దంచి వచ్చి న పసుపు పొడిని స్వామి వారికి సమర్పణ చేసి, తాంబూలం అంజేయడంతో కార్యక్రమం ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ఎ.ప్రశాంతి, ఎలక్ట్రికల్ డీఈ సరస్వతి పాల్గొన్నారు. దంచిన పసుపును ఉత్సవ మూర్తులకు అభిషేకిస్తున్న ఆర్చకులు రోళ్లులో పసుపు కొమ్ములను దంచుతున్న డిప్యూటీ ఈవో ప్రశాంతి, చిత్రంలో డీఈ సరస్వతి, పీఆర్వో ఎఫ్ఏసీ నీలిమ -
నేటి నుంచి ఒంటిమిట్ట రాములోరి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు అంకురార్పణతో ప్రారంభమై ఏప్రిల్ 5న పుష్పయాగంతో ముగుస్తాయి. సీతారాముల కల్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి లేదా మంత్రులు హాజరై స్వామివారికి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం -
విధి నిర్వహణలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మృతి
ప్రొద్దుటూరు : విధి నిర్వహణలో ఉన్న డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సి.గురునాథ్ (58) గుండెపోటుతో మరణించాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో సెంటర్ ఏ డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్ ఎప్పటిలాగే సోమవారం మధ్యాహ్నం పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తీసుకుని ద్విచక్రవాహనంలో హెడ్ పోస్టాఫీసుకు బయల్దేరారు. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో సెంటర్ బీ ఇన్చార్జి కొండయ్యతో కలసి వెళుతుండగా గాంధీ రోడ్డులో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కిందపడిన ఆయనను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ఇంజెక్షన్ వేసిన అనంతరం కడపకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళుతుండగా అర్ధరాత్రి సమయంలో మార్గంమధ్యలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒకు కుమారుడు ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రాఫ్ టీచర్గా పని చేస్తున్న ఈయనకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి లభించింది. గత ఏడాది జరిగిన బదిలీల్లో రాజుపాళెం మండలం పర్లపాడు హైస్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. గురునాథ్ మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులతోపాటు ఉపాధ్యాయులు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న డీఈఓ షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, పర్లపాడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరెడ్డిలు గురునాథ్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. జనగణనలో ప్రమాణాలు పాటించాలి కడప సెవెన్రోడ్స్ : సమాచారం సేకరణలో కచ్చితత్వం, ప్రమాణాలను పాటించే విధానాలపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో భారత సెన్సస్–2027 జనగణన కార్యక్రమ నిర్వహణకు సంబంధించి మూడవ స్థాయి శిక్షణలో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు 2వ రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 1 నుంచి 30 వరకు జిల్లాలో జరగనున్న సర్వేకి సంబంధించి ఫీల్డ్ ట్రైనర్స్కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన, రెండవ దశలో జనాభా గణన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండవ దశలో కుల గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనాభా గణన జిల్లా ఇన్చార్జి, మాస్టర్ ట్రైనర్ మోహన్ రమణ, మాస్టర్ ట్రైనర్లు ప్రొఫెసర్లు శ్రీనివాసులు, సుదర్శన్రెడ్డి, ఆదిలక్ష్మి ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం రాజంపేట టౌన్ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ నాయకులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీరాజా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా పీఆర్సీ కమిషన్ను కూడా ఏర్పాటు చేయక పోవడం దారుణమన్నారు. పీఆర్సీ ఇవ్వడం ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉన్నందున 29 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రావాల్సిన అన్ని డీఏలను వెంటనే ఇవ్వాలన్నారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా, డివిజన్ నాయకులు పి.వెంకటసుబ్బయ్య, సివి.రమణమూర్తి, కె.రమేష్జోషి, జి.నాగేంద్ర, కె.శివయ్య, ఎస్.వినోద్కుమార్, ఎ.చంద్రయ్య, కె.రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
చింతకొమ్మదిన్నె: మండలంలోని కొత్తపేట గంగమ్మ ఆలయ హుండీల సొమ్మును మంగళవారం లెక్కించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కడప అధికారి సురేష్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మూడే కృష్ణ నాయక్, ఆలయ చైర్మన్ సోమల మాధవరెడ్డి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీలను తెరిచి సొమ్ము లెక్కించారు. ఈ హుండీ ద్వారా మొత్తం రూ.7,67,481 నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధి మూడే కృష్ణ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు, భక్తులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. అట్లూరు: ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంతరాయం లేని విద్యుత్ను సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ తెలిపారు. మంగళవారం కరెంటోళ్ల జన బాట కార్యక్రమంలో భాగంగా అట్లూరు, బద్వేలు మండలం చింతపుత్తయ్యపల్లి గ్రామాలను ఎస్ఈ సందర్శించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. అట్లూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలు, ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు. లైన్లు, ట్రాన్సఫార్మర్లు, కనెక్షన్లు, లోడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి ఎస్ఈ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ కుల్లాయప్ప, ఏఈలు షర్మి ల, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
బార్లో అగ్నిప్రమాదం
రాజంపేట : రాజంపేట–తిరుపతి బైపాస్ రహదారిలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బార్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, రేకులు మంటల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్షార్ట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణహాని కలగలేదు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం వల్ల బార్ యాజమాన్యానికి నష్టం వాటిల్లింది. వ్యక్తి ఆత్మహత్య బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి వెళ్లే దారిలో మంగళవారం ఓ వ్యక్తి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల పరిధిలోని గాండ్లతిమ్మాయపల్లె గ్రామానికి చెందిన వేముల సుధాకర్(38) ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. ఈయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుధాకర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండకుండా మద్యం సేవిస్తుండటంతో భార్య గొడవ పడింది. దీంతో గూడెం గ్రామానికి వెళ్లే దారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిద్దైపె నుంచి పడి బేల్దారి మృతి బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని మిద్దెలవారిపాలెంలో ఓ ఇంటి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి పడి ఓ బేల్దారి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం చిన్నగోపవరం గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకటసుబ్బయ్య(50) బేల్దారిగా పని చేస్తూ జీవనం సాగిస్తుండే వాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం స్థానిక మిద్దెలవారిపాలెంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి రెండవ అంతస్తుకు పూతలు వేసే నిమిత్తం కర్రల సారవ కట్టుకుని పని చేస్తుండగా కర్ర విరిగి కర్రలకు కట్టిన తాడు ఊడిపోవడంతో పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. -
అదరగొట్టిన ‘అనంతపురం’
కడప వైఎస్ఆర్ సర్కిల్ : అనంతపురం జట్టు అదరగొట్టింది. ఏసీఏ సౌత్జోన్ సీ నియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్లు పోటీ పడ్డాయి. నెల్లూరు జట్టు 99 పరుగులకు ఆలౌట్ కాగా అనంతపురం జట్టు కేవలం 8.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. అనంతపురం జట్టులోని ప్రదీప్రెడ్డి తన బౌలింగ్లో సత్తా చాటి 6 వికెట్లు తీసి నెల్లూరు జట్టును తక్కువ స్కోరుకే అలౌట్ చేయడం విశేషం. మరో మ్యాచ్లో అలాగే చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కడప జట్టు కేవలం 119 పరుగులకు ఆలౌట్ కావడంతో చిత్తూరు జట్టు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి సునాయసంగా విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 16 పాయింట్లు సాధించి విజేతగా నిలవగా, నెల్లూరు, కర్నూలు 8 పాయింట్లు, కడప జట్టు 4 పాయింట్లు మాత్రమే సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 18.5 ఓవర్లకు 99 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రేవంత్రెడ్డి 45, సయ్యద్ ఫర్హాద్ ఖాద్రీ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రదీప్రెడ్డి చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసి కర్నూలు బ్యాటర్లను హడలెత్తించాడు. మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 8.5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆ జట్టులోని దత్తరెడ్డి 22, అర్జున్రెడ్డి 56 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తోషిత్ యాదవ్ 1 వికెట్ తీశాడు. దీంతో అనంతరం జట్టు 9 వికెట్లు తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–చిత్తూరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 27.4 ఓవర్లకు 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధృవకుమార్రెడ్డి 28, పఠాన్ షరీఫ్ 26 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, సయ్యద్ సాజిద్ 2, దీపన్ సాయినాథ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 16.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆ జట్టులోని దినేష్ వర్మ 57 పరుగులు చేశాడు. దీంతో చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ పోటీల్లో విజయం శ్రీకాంత్, చిత్తూరు (5 వికెట్లు) ప్రదీప్రెడ్డి, అనంతపురం (6 వికెట్లు) అర్జున్రెడ్డి, అనంత పురం (56 పరుగులు) -
జగన్ తెచ్చిన గంగమ్మ.. బాబు ఆపిన భాగ్యమ్మ !
కడప సిటీ/చక్రాయపేట : రాయలసీమ ముద్దుబిడ్డగా చెప్పుకుంటూనే, ఆ ప్రాంత ప్రయోజనాలను సీఎం చంద్రబాబు నాయుడు నిలువునా వంచిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూటమి సర్కారు పంగనామాలు పెడుతోంది. ఇందులో అంతర్భాగమైన కాలేటివాగు ప్రాజెక్టు పనులను అటకెక్కించి ఈ ప్రాంత రైతులకు కోలుకోలేని ద్రోహం చేస్తోంది. 90 శాతం పనులు పూర్తి.. చక్రాయపేట మండలంలోని వర్షాధార భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ సర్కారు రూ. 500 కోట్లతో కాలేటివాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జీఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించేలా ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేశారు. కేవలం 10 శాతం పనులు పూర్తి చేసి ఉంటే, 2025 నాటికే ఈ ప్రాంత రైతాంగం ముక్కారు పంటలతో కళకళలాడేది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే సీన్ మారిపోయింది. కుంటి సాకులతో బ్రేకులు ప్రాజెక్టు పనులను ఆపివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రకరకాల కుంటిసాకులు వెతుకుతోంది. 90 శాతం పనులు పూర్తయినప్పటికీ.. పైప్లైన్ పనులను కలిపి చూపిస్తూ 25 శాతం పనులు జరగలేదనే దురుద్దేశ్యంతో పనులను నిలిపివేసింది. విజిలెన్స్ తనిఖీలు, రీ–టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.నిలిచిపోయిన కాలేటి వాగు పనులు – వెక్కిరిస్తున్న అసంపూర్తి నిర్మాణాలుసాగునీటి కల సాకారమయ్యే వేళ.. నిలిచిపోయిన కాలేటివాగు టన్నెల్ పనులు పూర్తి కాని కాలేటివాగు పనులు వైఎస్ జగన్ హయాంలో 90 శాతం పూర్తయిన పనులు కూటమి సర్కారు నిర్వాకంతో రైతులకు శాపం 10 శాతం పనులపై 100 అబద్ధాలు రీ–టెండర్ల పేరిట కాలయాపన సమీక్షల్లో లేని ‘కాలేటి’ ప్రస్తావన అన్నదాతల గుండెల్లో పెనువేదన -
దేశానికే మోడల్గా స్మార్ట్ కిచెన్ వ్యవస్థ
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: జిల్లాలో వినూత్నంగా చేపట్టిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానం రాష్ట్రానికే కాక దేశంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలుస్తోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. న్యూఢిల్లీ ప్రగతి విహార్లోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 23,24వ తేదీలలో నిర్వహించిన సమ్మిట్ లో వైఎస్సార్ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనం అందడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించగలుగుతున్నామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి కిచెన్ కార్యకలాపాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ అమలును పర్యవేక్షించేందుకు ఆధునిక డిజిటల్ వ్యవస్థలు అమలు చేస్తున్నామని, ట్రాకింగ్ ద్వారా వాహనాల కదలికలు, కిచెన్ కార్యకలాపాలు మానిటరింగ్ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచ గలుగుతున్నామని కలెక్టర్ వివరించారు. -
వెలవెలబోయిన షర్మిల పర్యటన
● పీసీసీ అధ్యక్షురాలి పర్యటనకు జనస్పందన కరువు సాక్షి టాస్క్ఫోర్స్: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఉమ్మడి కడప జిల్లాలో చేపట్టిన పర్యటన తుతూమంత్రంగా సాగింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఆమె, రైతుల సమస్యల కంటే వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పర్యటన ఆద్యంతం జనస్పందన కరువవ్వడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. పులివెందుల పర్యటనలో పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లు కనిపించకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కనీసం వంద మంది కార్యకర్తలు కూడా లేకపోవడంతో షర్మిల నియోజకవర్గ ఇన్ఛార్జి ధృవకుమార్రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జన సమీకరణ కోసం మహిళలకు రూ. 500 కూలీ ఇచ్చి పిలిపించినా ఫలితం లేకపోయింది. ఈ పర్యటనలో కేవలం జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, కొందరు నియోజకవర్గ ఇన్చార్జిలు మాత్రమే పాల్గొన్నారు. బనానా ప్యాక్ హౌస్పై అసత్యాలు పులివెందుల ప్రాంత అరటి రైతుల కోసం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్’పై షర్మిల అబద్ధాలు వల్లించారు. 2024 మార్చి 11న జగన్ దీనిని ప్రారంభించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. అయితే, అసలు జగన్ హయాంలో దీనిని నిర్మించలేదంటూ షర్మిల మాట్లాడటంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. -
ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్యలను పరిష్కరిస్తాం
ఖాజీపేట: ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని సోషల్ వెల్ఫ్ర్ డీడీ సరస్వతి అన్నారు. ఖాజీపేటలోని ఇంటిగ్రేడ్ హాస్టల్ను ఆమె తనిఖీ చేశారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న హాస్టల్ వార్డన్ పనితీరు సక్రమంగా లేని కారణంగా సస్పెండ్ చేశామన్నారు. ఇన్చార్జ్ వార్డన్తో పనిచేయిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెను ప్రకారం భోజనం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ● కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష కడప అర్బన్ : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రయల్ కేసుల్లో సత్వర, సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచడం, వారికి ధైర్యం చెప్పి శిక్షల శాతం పెంచేలా కృషి చేయాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, న్యాయ వ్యవస్థతో వృత్తి పరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని చెప్పారు. కోర్టులలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్టు ద్వారా సంబంధిత కేసులలో సి.సి నంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నూతనంగా అమలులోకి వచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్షాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్థవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్రెడ్డి, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
పోరుమామిళ్ల యర్రగుంట్ల లక్కిరెడ్డిపల్లె ?
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి రావడంతో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 1.60 లక్షల ఓటర్లు తగ్గకుండా పునర్విభజన చేపట్టాలనే నిర్ణయం కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో అదనంగా 4 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓట్ల లెక్కలివే.. ప్రస్తుత ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుంటే జిల్లాలో భారీ మార్పులు సంభవించనున్నాయి. కడప లోక్సభ పరిధి: ఈ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,39,066 ఓట్లు ఉన్నాయి. 1.60 లక్షల ఓట్ల నిబంధన ప్రకారం ఇక్కడ మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముంది. కొత్త కేంద్రాలుగా పోరుమామిళ్ల, యర్రగుంట్ల? ప్రాంతాలు మరియు ఓటర్ల లభ్యతను బట్టి మరికొన్ని కొత్త స్థానాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధానంగా పోరుమామిళ్ల కేంద్రంగా ఒకటి, యర్రగుంట్ల కేంద్రంగా మరొక కొత్త నియోజకవర్గం ఏర్పడే చాన్స్ ఉంది. రాజంపేట లోక్సభ పరిధి: ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,65,702 ఓట్లు ఉండగా, ఇక్కడ కూడా మరో 3 స్థానాలు పెరగనున్నాయి. దీని ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో (రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు కలిపి) ఒక స్థానంతో పాటు, అన్నమయ్య జిల్లాలో మరో రెండు స్థానాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో గతంలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె తిరిగి నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉందని సమాచారం. తాజా మార్పుల వల్ల రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో అదనంగా మరో ఎంపీ స్థానం కూడా జతయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రేరిపితంగా కాకుండా, కేవలం ఓటర్ల సంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే.. కడప–2, పోరుమామిళ్ల, యర్రగుంట్ల వంటి కొత్త స్థానాలు ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. సీట్ల పెంపు నిర్ణయం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నేతలకు, రాజకీయ నిరుద్యోగులకు పెద్ద వరంగా మారనుంది. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా పురుష అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఇన్నాళ్లూ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు అసెంబ్లీ మెట్లు ఎక్కే అదృష్టం దక్కనుంది. వెరసి, రాబోయే పునర్విభజన జిల్లా రాజకీయ చిత్రపటాన్నే మార్చివేయనుంది. ఈ పునర్విభజనలో నియోజకవర్గాల సరిహద్దు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సగటున నాలుగు లేదా ఐదు మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండాల్సిన దానికంటే సుమారు 1.20 లక్షల ఓట్లు అదనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల కడపను ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలుగా విభజించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కడప అసెంబ్లీ సీట్ల కోటా పెరగనుంది పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో మరో 4 అసెంబ్లీ స్థానాలు నియోజకవర్గానికి 1.60 లక్షల ఓటర్లప్రాతిపదికన పునర్విభజన కడప ఈస్ట్, వెస్ట్గా జిల్లా కేంద్రం విభజన ద్వితీయ శ్రేణి నేతలు, రాజకీయ నిరుద్యోగులకు వరించనున్న అదృష్టం -
క్షయ వ్యాధి లేని సమాజం నిర్మిద్దాం
కడప రూరల్: క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ ఆశ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వంటింట్లో మళ్లీ
● దశాబ్దం తర్వాత రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ ● అంతర్జాతీయ సంక్షోభంతో ఎల్పీజీ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం ● అదనంగా 48,000 కిలోలీటర్ల కేటాయింపు.. దశాబ్ద కాలంలోఇదే రికార్డు ● రేపటి నుంచే పల్లెలు, గిరిజనప్రాంతాల్లో పంపిణీకి శ్రీకారం రాజంపేట: కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న కిరోసిన్ మళ్లీ వంటింట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అంతర్జాతీయంగా నెలకొ న్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, గ్యాస్ సిలిండర్ల కొరత వెరసి సామాన్యుడిని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. రేపటి నుంచే జిల్లాలోని పల్లెల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. హర్ముజ్ సెగ.. వంటింట్లో మంట! పశ్చిమాసియా యుద్ధం ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాధారణ కోటా 1,00, 000 కిలోలీటర్లకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించింది. ఒక దశాబ్ద కాలంలో ఇంధన కోటాలో ఇంత పెద్ద పెంపు ఇదే తొలిసారి. నేడు మనం వాడుతున్న కిరోసిన్ను కెనడియన్ వైద్యుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెన్నర్ 19వ శతాబ్దంలో కనుగొన్నారు. దీని రంగును బట్టి మన దగ్గర ’కృష్ణ ఆయిల్’ అని పిలుస్తారు. 2013–14 నుండి 2022–23 మధ్య కాలంలో దేశంలో కిరోసిన్ వినియోగం ఏటా 26 శాతం మేర తగ్గిపోయింది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మళ్లీ కిరోసిన్ను వంటగదికి చేరువ చేశాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ – కిరోసిన్ తప్పదు ‘కిరోసిన్ చూసి దశాబ్దం దాటిపోయింది. 2015 నుంచి దశలవారీగా పంపిణీ కనుమరుగైంది. ఇప్పుడు అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రభుత్వం మళ్లీ పంపిణీకి సిద్ధమైంది. ’ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా పాత విధానాలకే మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కిరోసిన్ పంపిణీ ఒక ఉదాహరణ.‘ – గునకల సుబ్బరాయుడు, సీనియర్ రేషన్ డీలరు, రాజంపేటమధ్యాహ్న భోజన పథకానికి ఆసరానివ్వాలి ‘వంట ఏజెన్సీలకు ఇప్పుడు కిరోసిన్ దికై ్కంది. మధ్యాహ్న భోజన పథకానికి ఎల్పీజీ, కట్టెలు సరిపోవడం లేదు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే కిరోసిన్ సరఫరా చేయాలి. గతంలో లాగే కిరోసిన్ పొయ్యిలను కూడా పంపిణీ చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల కిరోసిన్ అవసరం ఉంటుంది.‘ – పాలెం సాంబశివయ్య గౌడ్, అధ్యక్షుడు, ఏఐటీయూసీ, నందలూరు. జిల్లా పరిధిలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కిరోసిన్ అవసరం ఎంత ఉందో అర్థమవుతుంది: మొత్తం జనాభా: 22.60 లక్షలు రేషన్ కార్డులు: 5.80 లక్షలు గ్రామీణ జనాభా: 14.56 లక్షలు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, తొలుత ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ ప్రారంభం కానుంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు, చిన్న హోటళ్లు, టీ కొట్టుల యజమానులు మళ్లీ కిరోసిన్ స్టవ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. -
షర్మిలపై రాచమల్లు సీరియస్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు.. అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. షర్మిల ఎల్లో మీడియా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు. దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశంపై అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. ఎల్లో మీడియాలో కూడా గుండె పోటు అనే వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడం లేదు?. వివేకా మరణం గురించి ముందుగా ఆయన బావమరది శివప్రకాష్ రెడ్డే అందరికీ సమాచారం అందించారు. సంస్కారం, కుటుంబ గౌరవంతో వైఎస్ జగన్ ఈ అంశంపై స్పందించడం లేదు. మీరు తప్పుడు విమర్శలు చేస్తే మేం స్పందించకూడదా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. -
బీసీల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, నిర్మల ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీల సంక్షేమం కోసం వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలన్నారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యో గాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు శ్రీను యాదవ్, సురేష్, మధు, నాగార్జున, ఓబులేశు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా దాశరథి కల్యాణం
రాజంపేట : ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యా ణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేస్తున్నామని, మార్చి 30నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన టీటీడీ వివిధ విభాగాల అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద విస్తృతంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాడవీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో జర్మన్షెడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. తాగునీటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. లేజర్ లైటింగ్, ఎల్ఈడీ తోరణాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలకు అధ్యాత్మిక శోభ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. రాములోరి కళ్యాణవేదిక తెలుగుదనం ఉట్టిపడేలా పుష్పాలంకరణతో సుందరోపేతంగా తీర్చిదిద్దాలని జేఈవో ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగిన రీతిలో శ్రీవారిసేవకులను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ మేరకు సీపీఆర్వో డాశ్రీశ్రీటి.రవికి సూచించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకం పంపిణీ చేయాలని అన్నప్రసాదం ప్రత్యేక ఽఅధికారి శాస్త్రిని ఆదేశించామన్నారు. అనంతరం టీటీడీ అధికారులతో విశాంత్రి భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్ఈ మనోహరం, ఎస్ఈ(విద్యుత్) వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఎంవో డాశ్రీశ్రీకుసుకుమారి, వీజీవో గిరిధర్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.సునిల్ తదితరులు పాల్గొన్నారు.టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడి -
కిచెన్లో చికెన్ కరువు
● కొండెక్కుతున్న కోడి ధరలు ● ఎండల దెబ్బకు కోళ్ల కొరత ● అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్నమదనపల్లె అర్బన్ : మదనపల్లె ప్రాంతంలో మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్, ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది. ఎండల తీవ్రత వల్ల మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ధరల పెరుగుదల – గణాంకాలు గత జనవరిలో కిలో రూ. 170 నుంచి రూ. 200 మధ్య ఉన్న చికెన్ ధర, ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 270 కి చేరింది. నాణ్యమైన పెద్ద బ్రాయిలర్ కోళ్ల ధర అయితే ఏకంగా రూ. 330 నుంచి రూ. 360 పలుకుతోంది. నాటుకోడి కిలో ధర రూ.600 పలుకుతుండగా, మటన్ ధర కిలో రూ. 900 కి చేరడంతో, ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకీ పరిస్థితి? ఎండల సెగ : ఇటీవల సోకిన బర్డ్ ఫ్లూ వ్యాధి, తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి. నష్టాల్లో రైతు : లక్షలు ఖర్చు చేసి ఫారాలు ఏర్పాటు చేసినా, కోళ్ల మరణాలతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ సెగ : కోళ్ల కంపెనీలు, ట్రేడర్స్ సిండికేట్గా మారి ధరలను నియంత్రిస్తుండటం వల్ల అటువినియోగదారులకు, ఇటు రైతులకు అన్యాయం జరుగుతోంది. భవిష్యత్తు ఏంటి జాతరల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్, జూలై నాటికి మటన్ ధర రూ. 1000 మార్కును తాకే అవకాశం ఉందని, ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా ఆగస్టు (వినాయక చవితి) వరకు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అర్జీలు గడువులోగా పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని జాుుంట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశపు మందిరంలో.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారులకు నాణ్యమైన, సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఎండార్స్మెంట్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు కచ్చితంగా పరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు వారికి అందిన అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించి సమీక్ష చేయాలన్నారు. అనంతరం పలువురు నుంచి వారు అర్జీలను స్వీకరించారు. జడ్పీ సీఈఓ ఓబులమ్మ, కో– ఆపరేటివ్ శాఖ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులతో ఆయన నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రజలు నిస్సంకోచంగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రోజు అందిన మొత్తం 92 ఫిర్యాదులను పరిశీలించిన ఆయన, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే స్వయంగా ఎస్పీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం విశేషం. చట్ట పరిధిలో తగిన న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, మహిళా పి.ఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. -
కడప ఆర్డీఓ బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్ : కడప ఆర్డీఓగా ఎ.మురళి సోమవారం కడప రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా కడపలో పనిచేస్తున్న జాన్ ఎర్విన్ బదిలీ అయ్యారు. దీంతో నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్ గా పనిచేస్తున్న మురళిని రాష్ట్ర ప్రభుత్వం కడప ఆర్డీఓగా నియమించడంతో ఆ మేరకు బాధ్యతలను స్వీకరించారు. తహసీల్దార్ల బాధ్యతల స్వీకరణకడప జిల్లాలో పలువురు తహసీల్దార్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కడపకు మహబూబ్చాంద్, రాజంపేటకు యు.దస్తగిరయ్య, నందలూరుకు శివలక్ష్మీ నూతనంగా నియమితులయ్యారు. ఈమె వేంపల్లిలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ పదోన్నతి పొందారు. -
శ్మశాన రహదారి పునరుద్ధరించాలి
నాగిరెడ్డిపల్లె వాసుల ధర్నాకడప సెవెన్రోడ్స్ : తమ గ్రామ శ్మశానానికి వెళ్లే పాత రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ప్రజలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రెడ్డిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్మశానానికి వెళ్లే రహదారిని ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆక్రమించి మూసి వేశారని ఆరోపించారు. సుమారు 20 ఏళ్లుగా గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్న రహదారిని అకస్మాత్తుగా మూసివేయడంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశానానికి సమీపంలో ఉన్న భూముల్లో డీకేటీ పట్టాలు ఎలా మంజూరు చేశారన్న విషయంపై గ్రామ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై.శివశంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామాంజనేయులు, మహిళా అధ్యక్షురాలు రామలక్షుమ్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్.మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రమిచ్చారు. -
చోరీ కేసులో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
ఎర్రగుంట్ల : రైల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగ కోక్కోడస్ మహమ్మద్ సవాద్ (25)ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7.5 తులాలు బంగారు నగలు, రెండు మొబైల్స్, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. సోమవారం యర్రగుంట్ల రైల్వేస్టేషన్లోని జీఆర్పీ స్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహిళలు, ప్రయాణికుల బంగారు నగలు, విలువైన వస్తువులను దోచుకోవడమే లక్ష్యంగా చోరులు రైల్లో ప్రయాణిస్తుంటారని పేర్కొన్నారు. ఈక్రమంలో ఈ నెల 19న గుంటూరు జిల్లా గుంటూరు టౌన్కు చెందిన గున్రెడ్డి జయశ్రీరెడ్డి కుటుంబ సభ్యులతో గుంటూరు నంచి తాడిపత్రికి ధర్మవరం రైలుల్లో వస్తుండగా చోరులు తన బ్యాగు, బంగారు నగలు దొంగలించారని ఫిర్యాదు ఇచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం యర్రగుంట్ల ౖరైల్వే స్టేషన్లోని రెండో ప్లాట్ఫారం మీద ఉన్న క్యాంటిన్ మధ్య ముద్దాయి మహమ్మద్ సవాద్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నారని తెలిపారు. ముద్దాయి కేరళం రాష్ట్రంలోని వయనాడు జిల్లా, పణమరం గ్రామస్తుడని తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి 7.5 తులాలు బంగారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు వెల్లడించిన రైల్వే సీఐ ఎం. సుధాకర్రెడ్డి -
హోటళ్లపై అధికారుల దాడులు
పులివెందుల టౌన్ : పట్టణంలోని స్థానిక హోటళ్లు, డాబాలపై సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడులలో హోటళ్లు, డాబాలలో నిల్వ ఉంచుకున్న గృహ అవసరాలకు సంబంధించిన 56 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండటంతో హోటళ్లు, డాబాలలో కమర్శియల్ సిలిండర్లు వాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని వెల్లడించారు. ఈ దాడులను వరుసగా కొనసాగిస్తామని హోటల్లో వంట గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హోటళ్ల యజమానులను హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆలస్యంపై వివరణ కోరగా.. పులివెందులలో 2600మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లతో చర్చిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు రాగానే అందరికి పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 56 గ్యాస్ సిలిండర్ల పట్టివేత -
దాడి కేసులో 12మందికి జైలు
వేంపల్లె : దాడి కేసులో 12మంది ముద్దాయిలకు ఏడాది సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ పులివెందుల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి తీర్పునిచ్చారని సీఐ నరసింహులు తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. వేంపల్లెలోని స్థానిక మసీదు కాంప్లెక్స్లో చెన్నుపల్లి ఫక్రుద్దీన్ అనే వ్యక్తి షాపు పెట్టుకునేందుకు ఒక రూము బాడుగకు తీసుకున్నాడు. ఆ వ్యక్తి రూముకు అద్దె చెల్లించలేదని అక్రమంగా షాపులోకి ప్రవేశించి కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు ఫక్రుద్దీన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. 2018లో జరిగిన ఈ ఘటనలో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్పు తీర్పునిచ్చిందని సీఐ తెలిపారు. బాబోయ్.. బ్యాటరీ దొంగలు! సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురంలో శనివారం రాత్రి మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొంత సుధీర్ కుమార్ రెడ్డి తన మూడు టిప్పర్ లారీలను మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న హెచ్పి గ్యాస్ పెట్రోల్ ఎదురుగా ఉన్న మైదానంలో పార్కింగ్ చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ టిప్పర్ల నుంచి మూడు డబుల్ బ్యాటరీలు దొంగతనం చేశారు. వీటి విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని లారీల యజమాని సుధీర్ కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బంకులో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలించగా.. దొంగలు కారులో వచ్చి దర్జాగా బ్యాటరీలను దోచుకెళ్లారు. ఈ మధ్య కాలంలో లారీల బ్యాటరీలు దొంగతనాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు సింహాదిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేక నెల రోజులు కావస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ముఖ్యం తంబళ్లపల్లె: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటేనే బ్యాంకు లావాదేవీలలో సులభంగా లబ్ధి పొందగలరని ఆర్బీఐ కౌన్సెలర్లు శోభన్,శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అనంతపురం జిల్లా వలంటీరీ ఇంట్రిగేడ్ డెవలప్మెంట్ సొసైటీ(విడ్స్) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్, పెన్షన్ ప్లానింగ్, పొదుపులు, సీనియర్ సిటిజెన్స్ బ్యాంకు సేవలను వివరించారు. ఎంపీడీఓ బాపూజీ పట్నాయక్, డిప్యూటీ ఎంపిడిఓ ప్రసాద్ కార్యాలయ , ఏఓ థామస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనగణన – డీఆర్వో విశ్వేశ్వర నాయుడు కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2027 జనాభా గణనను డిజిటల్ విధానంలో సమగ్రంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోమ వారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో భారత సెన్సస్–2027 జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి.. మూడవ స్థాయి శిక్షణలో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మే 1 నుంచి 30 వరకు జిల్లాలో జరగనున్న సర్వేకి సంబంధించి ఫీల్డ్ ట్రైనర్స్ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల గణన , రెండవ దశలో జనాభా గణన నిర్వహించబడుతుందన్నారు. రెండవ దశలో కుల గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు ఈ శిక్షణలో జనాభా గణన జిల్లా ఇంచార్జి, మాస్టర్ ట్రైనర్ మోహన్ రమణ ఫీల్డ్ ట్రైనర్స్ విధివిధానాలు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. జిల్లా జనగణన ఇన్చార్జ్ మోహన్ రమణ, డిప్యూటీ కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవుల్లో కోహినూరు!
పుంగనూరు..● ఒక్క ఆవుతో మొదలై.. ఐదుకు చేరిక ● తక్కువ ఖర్చుతో పోషణ.. ఒక్కో దూడ ధర రూ. 1.50 లక్షల వరకు! ● పులిచెర్ల రైతు మురళీమోహన్రెడ్డి ‘గో’ మక్కువపులిచెర్ల (కల్లూరు), న్యూస్లైన్ : సాధారణంగా పశువుల పెంపకం అంటే శ్రమతో కూడుకున్న పని. గతంలో ప్రతి రైతు ఇంట్లో దేశీయ పశువులు ఉండేవి. కానీ ట్రాక్టర్ల రాకతో వాటి సంఖ్య తగ్గి, కేవలం పాల కోసం పెంచే జర్సీ ఆవులే ఊరూరా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పులిచెర్లకు చెందిన రైతు గోటూరి మురళీమోహన్రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులపై మక్కువతో వాటి పెంపకాన్ని చేపట్టి నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమ్మకంతో మొదలై.. లాభసాటిగా మారి ఆరు సంవత్సరాల క్రితం, ఉదయాన్నే పుంగనూరు ఆవును చూస్తే శుభం జరుగుతుందన్న నమ్మకంతో మురళీమోహన్రెడ్డి రూ. 75 వేలు వెచ్చించి ఒక ఆవును కొనుగోలు చేశారు. మొదట ఇంటి ఆవరణలోనే పెంచినప్పటికీ, క్రమంగా వీటి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఐదు ఆవులకు చేరింది. ఇందులో ఒక మగ ఆవు (నంది) కూడా ఉంది, దీని ద్వారానే బ్రీడింగ్ చేయిస్తున్నారు. సంఖ్య పెరగడంతో తన మామిడి తోపులో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి మనుషుల ద్వారా వీటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇపుడు మరో ఆవు కూడా జతచేరనుంది. ఆదాయం ఇలా.. పాల ధర : ఈ ఆవు రోజుకు ఉదయం 2, సాయంత్రం 2 లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు ధర మార్కెట్లో రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. దూడల విక్రయం : ఒక్కో దూడ ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది. వ్యర్థాలకు డిమాండ్ : కేవలం పాలే కాకుండా, వీటి పేడ మరియు మూత్రానికి ప్రకృతి వ్యవసాయం చేసే వారి నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. బంగారుబాతు : నేటి కాలంలో పాడి పరిశ్రమ అంటే కేవలం పాల దిగుబడి మాత్రమే కాదు, మన దేశీయ పశు సంపదను కాపాడుకోవడం కూడా అని మురళీమోహన్రెడ్డి నిరూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రోగాలతో, అత్యధిక పోషక విలువలున్న పాలను అందించే పుంగనూరు ఆవుల పెంపకం రైతులకు నిజంగానే బంగారు బాతు లాంటిది. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకుంటూ, ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన చాటిచెబుతున్నారు. -
ఆర్ఎల్ఐపీపై కార్యాచరణ
కడప కార్పొరేషన్: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాయలసీమ జిల్లాల నేతలతో ఆ పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి సమావేశమయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్న్ ప్రాజెక్ట్పై భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పి.రవీంద్రనాథ్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డిలతో పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాల నేతలు హాజరయ్యారు. -
కేసీ పంట.. పండేదెట్టా !
చాపాడు : కేసీ కెనాల్ ఆయకట్టు పంటలపై ప్రమాద ఘంటిక మోగుతోంది. ఆయకట్టు పొలాలకు సాగునీటిని ఎంత వరకు విడుదల చేసేది స్పష్టమైన హామీ లేకపోవడంతో రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్ సీజన్లో వరి పంట తర్వాత మార్చి చివరి వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో సాగునీరు వస్తుందనే ఆశాభావంతో ఆరుతడి పంటలతోపాటు అధికశాతం మంది రైతులు రెండో కారుగా వరి పంట సాగు చేశారు. అప్పటికే కేసీ కెనాల్లో ఖరీఫ్ సీజన్లో మాదిరి నీరు పారుతుండటంతో రైతులు సాగు నీటి కొరత రాదనే ఆశతో వరి సాగుపై దృష్టి సారించారు. పంట కాలం పూర్తవ్వాలంటే మరో నెల రోజుపాటు వరి పైరుకు సాగు నీరు అవసరం ఉంది. వారం రోజుల నుంచి తక్కువ పరిమాణంలో సాగు నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గడం, రాజోలి ఆనకట్ట వద్ద సాగునీరు అందించే కుందూనదిలో నీరు తగ్గిపోవడంతో కేసీ ప్రదాన కాలువలో గణనీయంగా నీరు తగ్గిపోయింది. దీంతో రైతులు సాగు నీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మండల పరిధిలో 12వేల ఎకరా ల్లో నూగు, పెసర, మినుము, వేరుశనగ ఇంతర పంటలు సాగులో ఉండగా అధిక భాగంలో వరి పంట సాగు చేశారు. వరి పంటకు ఏప్రిల్ చివరి వరకు నీరు విడుదలైతే తప్ప పంటలు పూర్తయ్యే పరిస్థితి లేదు. కుందూ నదిలో ఇప్పటికే నీటి ప్రవాహం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. దీంతో వరి పంటలను సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి చివరి వరకు నీటి విడుదలకు కృషి చేస్తామని కేసీ అధికారులు, పాలకులు చెబుతున్నారు. రైతులు మాత్రం ఏప్రిల్ చివరి వరకు నీటిని విడుదల చేయాలని లేకుంటే సాగైన వరి పంటలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుందూలో సాగునీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. తూముల ద్వారా కాలువలకు నీటిని అందించేందుకు సోమవారం కేసీ కెనాల్ డీఈ పుల్లయ్య, ఏఈలు జిలాని బాషా, సుబ్బరాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్లు సుబ్బన్న, దస్తగిరి, లస్కర్లు రాజోలి ఆనకట్ట వద్ద సాగు నీటిని కాలువలకు అందించేందుకు శ్రమించారు. ప్రస్తుతం కేసీ ప్రధాన కాలువలో 400 క్యూసెక్కులు, చాపాడు కాలువలో 120 క్యూసెక్కులు, కుందూనదిలో 30 క్యూసెక్కులు మాత్రమే నీరు ప్రవహిస్తోంది. దీంతో విడతల వారీగా సాగునీరు ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ● కేసీ కెనాల్లో నీటి ప్రవాహం తగ్గుదలపై కేసీ కెనాల్ డీఈ పుల్లయ్య మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలకు మార్చి చివరి వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరి అధికంగా సాగు చేయడంతో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. కేసీ ప్రధాన కాలువలో అడుగంటిన నీటి ప్రవాహం కేసీ ఆయకట్టు పరిధిలో సాగులో ఉన్న వరి పైరు కేసీ కాలువల్లో ఆగిన నీరు.. రైతుల్లో ఆందోళన సాగులో వరి, ఇతర ఆరుతడి పంటలు మార్చి నెలాఖరుకే సాగు నీరంటున్న అధికారులు, పాలకులు ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహం క్రమంగా తగ్గడంతో కేసీ కాలువకు నీరు పూర్తిగా తగ్గింది. రాజోలి ఆనకట్ట నుంచి నీటి సరఫరాకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మార్చి చివరి వరకు కాలువకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీ కాలువలో విడతల వారీగా నీటి సరఫరా చేపట్టే అవకాశం ఉంది. కుందూలో కూడా నీటి ప్రవాహం తగ్గిపోగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదలకు అధికారులతో చర్చిస్తున్నాం. వరి సాగు చేసిన రైతులు ఇతర నీటి వనరులు గుర్తించుకోవాలి. – డి.గురివిరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్, లక్ష్మీపేట, చాపాడు మండలం కేసీ కాలువకు నీటిని నిలిపేస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ప్రస్తుతం పంట వెన్నుదశలో ఉంది. 20 రోజులపాటు నీరు విడుదలైతే పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు కేసీ కాలువకు ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేయాలి. – భాస్కర్రెడ్డి, రైతు, విశ్వనాథపురం, చాపాడు మండలం -
వేంపల్లెలో చోరీ
వేంపల్లె: వేంపల్లెలోని పిరమిడ్ నగర్ ప్రాంతంలో ఆదివారం చోరీ జరిగింది. ఈ మేరకు పులివెందుల సబ్ డివిజన్, కడప క్లూస్ టీంలు చోరీ జరిగిన ఇంటిని సోమవారం పరిశీలించారు. బాధితురాలు నర్రెడ్డి లక్ష్మీదేవి కథనం మేరకు... స్థానిక రెడ్డి నగర్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాఘవ రెడ్డి సతీమణి నర్రెడ్డి లక్ష్మీదేవి ఒక్కరే నివాసముంటున్నారు. ఆదివారం ఆమె ఇంటికి తాళాలు వేసి మండలంలోని పాములూరు గ్రామంలో ఉన్న బంధువులు ఇంటికి వెళ్లారు. చుట్టుపక్కల ఎక్కువగా ఇళ్లు లేకపోవడం.. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు తాళాలను పగులగొట్టి చోరీ చేశారు. పాములూరు నుంచి సాయంత్రం ఇంటికి రాగా చోరీ జరిగిన విషయం బయట పడినట్లు ఆమె తెలిపారు. దొంగలు రెండు జతలు బంగారు కమ్మలు, రెండు వెండి దీపారాధనలు, ఒక్కటి వెండి గ్లాసును చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై బాధితురాలితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే క్లూస్ టీం పోలీసులు వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
పులివెందుల టౌన్ : పట్టణంలోని కదిరి రోడ్డులో ఆటోలో వెళుతున్న 11బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కదిరికి తరలిస్తుండగా సమాచారం రావడంతో ఆటోను పట్టుకున్నామన్నారు. పట్టుకున్న బియ్యాన్ని పంచనామా నిమిత్తం గోదాముకు తరలించామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు చోరుల అరెస్ట్ రాజంపేట: రాజంపేట మండలం ఎర్రబల్లిలో ఫిబ్రవరి 6న తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ కేసును మన్నూరు పోలీసులు చేధించారు. ఈమేరకు సోమవారం ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ చోరీకి సంబంధించి దొంగలు తమిళనాడుకు చెందిన మాబాషా, సాయికుమార్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.9లక్షల విలువైన వంద గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ కేసుల పట్టుబడిన దొంగలపై పలు కేసులు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మన్నూరు పోలీసులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ వీరంగం కడప అర్బన్: తన భార్యను వేధిస్తున్న కేసులో సస్పెన్షన్కు గురైన కానిస్టేబుల్ విల్ఫ్రెడ్ ఈ నెల 22వ తేదీ రిమ్స్ పీఎస్ పరిధిలో శివానందపురంలో తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. తీవ్రస్థాయిలో తన స్నేహితుడు, అతని కుటుంబసభ్యులను దూషించాడు. తరువాత కోపంతో ఊగిపోతూ తన స్నేహితుడి కుటుంబసభ్యులకు సంబంధించిన కారు, స్కూటీని ధ్వంసం చేశాడు. అలాగే ఇంటికి అమర్చిన అద్దాన్ని కూడా పగులగొట్టాడు. తన భార్య, పిల్లలు తన స్నేహితుని ఇంట్లోనే ఉన్నారని భావించి ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు విల్ఫ్రెడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రిమ్స్ పీఎస్ పోలీసులు తెలిపారు. -
భూ వివాదంతో రైతుపై దాడి
మదనపల్లె టౌన్ : భూ వివాదం తలెత్తి రైతుపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఊలపాడు పంచాయతీ భూసాని కురప్పల్లికి చెందిన రైతు మంజునాథ్(45)కు అదే ఊరికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాసులుకు కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఉదయం పొలం వద్దకు వెళ్తున్న మంజునాథ్ను.. దారి కాచి కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యమదనపల్లె టౌన్ : ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. ఆత్మహత్యకు సంబంధించి మృతురాలి కుటుంబీకులు, ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బ్రాహ్మణ వడ్డిపల్లెకు చెందిన రమణ కుమార్తె సౌజన్య(17) మదనపల్లెలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఆదివారం తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి, పాడి పశువులకు గడ్డి కోసుకుని ఇంటికి వచ్చింది. అంతలోనే ఎందుకు చిన్న మనసు చేసుకుందో ఏమో..? తను ఉంటున్న ఇంటిలోనే తల్లి చీర కొంగును ఫ్యానుకు బిగించి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. సంఘటనను గమనించిన తల్లిదండ్రులు బిడ్డను ఉరి నుంచి తప్పించి, చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, అప్పటికే సౌజన్య చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల సమాచారంతో ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
24,25 తేదీల్లో జీఎస్టీ సంస్కరణలపై సెమినార్
కడప ఎడ్యుకేషన్ : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘నెక్స్జన్ జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం, వికసిత్ భారత్పై ప్రభావం (జీఎస్టీ ఏఈహెచ్ఎస్–2కె26)’ అనే అంశంపై ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.సరిత తెలిపారు. ఆమె ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సెమినార్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్– సదరన్ రీజినల్ సెంటర్ (ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ) స్పాన్సర్షిప్ అందిస్తోందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రంగంలో వస్తున్న సంస్కరణలపై అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు చర్చించుకోవడం ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. విశ్వవిద్యాలయంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో 24వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ మాజీ ప్రధాన కమిషనర్ టి. రమేష్బాబు ప్రధాన అతిథిగా విచ్చేస్తారని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ పి.మోహన్రెడ్డి కీనోట్ స్పీకర్గా, గెస్ట్ ఆఫ్ హానర్గా పాల్గొంటారని తెలిపారు. ముగింపు సెషన్ మార్చి 25వ తేదీన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ హెడ్ ప్రొఫెసర్ పి.రఘునాథరెడ్డి ప్రధాన అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు భాగస్వాములై వికసిత్ భారత్ దృష్టితో జీఎస్టీ భవిష్యత్తుపై చర్చల్లో పాల్గొనాలని ఆమె కోరారు. -
ఆ పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టేరా?
సాక్షి టాస్క్ఫోర్స్ : పులివెందుల సబ్ డివిజన్ అధికారితోపాటు మరో సీఐపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ చర్యలు చేపడతారా అని పలువురు చర్చించుకుంటున్నారు. వివరాలలోకి వెళితే.. గత నెల 25వ తేదీన పులివెందుల 4వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ ఫిర్యాదు నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పులివెందుల సబ్ డివిజన్ అధికారితోపాటు మరో సీఐపై కేసు నమోదు చేసి నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఆ పోలీసు అధికారులపై జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు చేపడుతారోనని వేచి చూస్తున్నారు. కౌన్సిలర్ కిశోర్తోపాటు గతేడాది పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తోపాటు 13 మందిపై టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాక కిశోర్తోపాటు మరో ఐదుగురిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీనిపై కిశోర్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇందులో ఉన్న సీఐ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండ్లో ఉండటం గమనార్హం. అక్రమ కేసు బనాయించిన ఆ అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్న వైనం పులివెందుల నియోజకవర్గంలో యథేచ్ఛగా జూదాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకుల కనుసన్నల్లో జూద స్థావరాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల స్వగ్రామంతోపాటు లింగాల మండలం, ఇతర ప్రాంతాలలో జూదాలు సాగుతున్నాయి. రోజుకు కోట్లాది రూపాయల డబ్బు చేతులు మారుతోంది. పులివెందులలో ఎన్నడూ లేని విష సంస్కృతిని టీడీపీ హయాంలో తీసుకొచ్చారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గత నెలలో జరిగిన సంక్రాంతి పందేల ముసుగులో గోవా జూద సంస్కృతిని తెచ్చి యథేచ్ఛగా టెంట్లు వేసి జరిపించారు. వీటి ద్వారా టీడీపీ నాయకులు ప్రతి రోజు లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పులివెందుల పట్టణానికి నూతనంగా వచ్చిన ఎస్ఐ తెలుగుదేశం పార్టీ జూదశాలపై దాడి చేయగా, ఆ ఎస్ఐని అధికార పార్టీ నాయకులు స్టేషన్లోనే దుర్భాషలాడటమే కాకుండా పులివెందుల నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయించారు. అప్పుల పాలవుతున్న కుటుంబాలు నియోజకవర్గంలో యథేచ్చగా జూదాలు ఆడుతుండటంతో.. వీటికి బానిసలైన కొంత మంది డబ్బులు పోగొట్టుకుని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా లింగాల మండలానికి చెందిన ఓ వ్యక్తి, పులివెందుల మండలానికి చెందిన మరో వ్యక్తి జూదంలో డబ్బులు కోల్పోయి అప్పుల పాలైనట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి ముసుగులో జరిగిన జూదాలలో అనేక మంది డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలయ్యారు. వీరి కుటుంబాలు రోడ్డు పాలవ్వడానికి టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జూదశాలలే కారణమని బలమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అవన్ని తమకు పట్టనట్లుగా తమ అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. అరికట్టాల్సిన వారే.. పులివెందులలో ఖాకీపై ఖద్దరు సవారీ చేస్తుందనడానికి అక్కడ జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్సీపీ నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో పేట్రేగిపోతున్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు ఆయా పోలీసు అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమ కళ్లెదుటే జూదం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా జూదశాలలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు పులివెందులలో యథేచ్ఛగా జూదాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో స్థావరాలు చోద్యం చూస్తున్న ఖాకీలు -
కుందూలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
జమ్మలమడుగు రూరల్ : పెద్దముడియంలోని కుందూ నదిలో శనివారం గల్లంతైన గొడుగు సురేష్ (41) మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన గొడుగు సురేష్ అనే వ్యక్తి పెద్దముడియంలో జరుగుతున్న ఎడ్ల పోటీలను తిలకించడానికి శనివారం వచ్చాడు. మధ్యలో కుందూ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా అతని జాడ కనిపించలేదు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పెద్దముడియం పోలీసులు తెలిపారు. అరటి రైతులనుప్రభుత్వం ఆదుకోవాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : యుద్ధ ప్రభావం వల్ల మార్కెట్లో ధర పడిపోవడం, అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు వాణిజ్య వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు. దిగుమతులు, ఎగుమతులు మందగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో అస్థిరత ఏర్పడుతుందన్నారు. జిల్లాలో ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో వేల ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారన్నారు. అయితే యుద్ధ ప్రభావంతో ధరలు పూర్తిగా తగ్గిపోయాయని, దానికి తోడు అకాల వర్షాలతో అరటి చెట్లు కూలిపోవడం, గెలలు విరిగిపోవడంతో అరటిపంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. అరటి పంటను క్వింటా రూ.15 వేలతో ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 240 కేసులు నమోదు చేసి, రూ. 48,550 జరిమానా విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, రాంగ్ రూట్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలుకేవీపల్లె : ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలోని కుప్పంవారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. ఆదివారం మారేళ్ల నుంచి ఏపీ39డబ్ల్యూఈ0498 నంబరు గల ఆటో ప్రయాణికులతో పీలేరుకు బయలు దేరింది. మార్గం మధ్యలోని కుప్పంవారిపల్లె వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మారేళ్ల రెడ్డివారిపల్లెకు చెందిన చంద్రకళ, సులోచన, సంధ్యారాణి, జ్ఞానదీపిక, విజయ్కుమార్తోపాటు ద్విచక్రవాహనదారుడు సురేంద్ర గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరిట టోకరా
● రైసింగ్ సన్ మల్టీ ఫీల్డ్ డెవలపర్స్ అండ్ ఇన్ఫ్రా వెంచర్ నిర్వాకం ● ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు ● తర్వాత పత్తా లేకుండా పోయిన వైనం కడప కార్పొరేషన్ : ఓ స్థలాన్ని చూపించి అక్కడ డెవలప్మెంట్ పేరుతో అగ్రిమెంట్లు రాసుకొని, ఆ ప్లాట్లనే విక్రయించి కోట్ల రూపాయలు దోచుకున్నారని బాధితులు వాపోతున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు ప్లాట్లు రిజిస్టర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కేశవరెడ్డి స్కూల్ దగ్గర నివాసం ఉంటున్న కట్టుబడి హుస్సేన్ వల్లి భార్య షేక్ సాహెరా, మరి కొంత మంది బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో ఉషోదయ స్కూల్ దగ్గర మొదటి ఫ్లోర్లో డోర్ నంబర్–7/4267లో రైసింగ్ సన్ మల్టీ ఫీల్డ్ డెవలపర్స్ అండ్ వెంచర్స్ పేరుతో పుటిక సుబ్బరామయ్య కుమారుడు పుటిక సుబ్బరాయుడు కార్యాలయం ప్రారంభించారు. 2022లో ముద్దనూరు మండలం కల్లమల్ల పంచాయతీ కల్లమల్ల గ్రామ పొలంలో శ్రీ శివ సాయి వెంచర్స్ ఏర్పాటు చేసి ఐదు సెంట్లు కలిగిన ఒక్కో ప్లాటుకు మొదటి విడతగా రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారు. ఆ తర్వాత పుటిక సుబ్బరాయుడు కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతని కోసం బాధితులు నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. వైఎమ్ఆర్ కాలనీలోని కార్యాలయం పెట్టిన ఇంటి వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదని అక్కడున్న వారు చెబుతున్నారు. అక్కడ కార్యాలయాన్ని తొలగించేశారు. ఆ ఇంటి ఓనర్కు కూడా డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారు. రైల్వేకోడూరు జనసేన నాయకులతో పుటిక సుబ్బరాయుడు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన నాయకులతో పుటిక సుబ్బరాయుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతని ఫేస్బుక్లో కనిపిస్తున్నాయి. వారితో ఫొటోలతో పాటు ప్రెస్మీట్లో పాల్గొన్న ఫొటోలు కూడా ఉండటంతో అతనికి జనసేన నేతల మద్దతు ఉందని బాధితులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల కర్నూలు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా ఆయన ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. పుటిక సుబ్బరాయుడు ఎంత మంది వద్ద ఎన్ని లక్షలు వసూలు చేశాడు.. ఆయన బాధితులు ఎంత మంది ఉన్నారు అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
ఖాజీపేట : 17 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేశారు. ఖాజీపేట పోలీస్స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నాగసానిపల్లె చిలకకనం పై భాగాన ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో ఖాజీపేట సీఐ వంశీధర సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారని అన్నారు. అక్కడ తరలించేందుకు సిద్ధంగా ఉన్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీటి బరువు సుమారు 326.700 కేజీలుగా ఉందని అన్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న ఒక మినీ లారీ, ఆల్టో వాహనం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీటి విలువ రూ.10 లక్షల 54 వేలు ఉంటుందని అన్నారు. అక్రమ రవాణా విషయంలో 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో తాడిపత్రికి చెందిన ప్రతాప్రెడ్డి, వనిపెంట గ్రామానికి చెందిన శేషు, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంకు చెందిన బండి మహేంద్ర, తిరుపతికి చెందిన దండు కృపాకుమార్, తిరుపతి రూరల్ చెర్లోపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ, మంచిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తేజ, కానాల వరచంద్రకుమార్ ఉన్నారని పేర్కొన్నారు. పవన్, నక్కా చిన్న వెంకటసుబ్బయ్య, బెంగుళూరుకు చెందిన బామ్ పరారీలో ఉన్నారని అన్నారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. ముగ్గురు అరెస్ట్కలికిరి : ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ అనీల్కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం మండల పరిధిలోని మేడికుర్తి క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తమిళనాడు వాసులు ఒక ద్విచక్రవాహనంలో ముగ్గురు రావడంతో వారిని ఆపడంతో తడబడిన వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తరలించడానికి ఎర్రచందనం దుంగలు సిద్ధంగా ఉన్నాయని, ముందుగా దారి చూస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో మేడికుర్తి క్రాస్ సమీపాన నల్లగుట్ట వద్ద దాచిన నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు తమిళనాడు వేలూరు జిల్లా అన్నిగట్టు తాలూకా తొంగమలైకి చెందిన సోదరులు చంద్రన్, రామరాజు, సెంగాడకు చెందిన దొరస్వామిగా గుర్తించారు. వీరు ఎర్రచందనం కూలీలుగా విచారణలో తేలిందని సీఐ తెలిపారు. -
అమరవీరుల వర్ధంతి కార్యక్రమాలు జయప్రదం చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దుల్లపల్లి ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లింగదారి చంద్ర తెలిపారు. ఆదివారం నగరంలోని హోచిమన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడి పార్లమెంటులో సైతం బాంబులు వేసి వెనుతిరగకుండా ఎదురొడ్డి నిలిచిన మహనీయులు అని అన్నారు. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకార చర్యగా, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్యలో పాలుపంచుకున్నారనే నెపంతో ఆ మహనీయులని ఉరి తీశారన్నారు. అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా సోమవారం కడప నగరంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు బత్తల శివతేజ, శివ నాగేంద్ర పాల్గొన్నారు. -
హోరాహోరీ పోరులో కడప, అనంతపురం జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు హోరాహారీగా సాగాయి. ఆదివారం కర్నూలు జట్టుపై కడప జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతపురం–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టు 174 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 41.4 ఓవర్లకు 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి సూర్యతేజ్రెడ్డి 72, మనోజ్రాజ్ 47 పరుగులు చేశారు. కడప జట్టులోని శేషాద్రి నాయుడు అద్భుతంగా బౌలింగ్ చేసి 4, చెన్నారెడ్డి 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కడప జట్టు 24.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్రెడ్డి 84, షేక్ జహీర్ అబ్బాస్ 76 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని షేక్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీశాడు. దీంతో కడప జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఽవినయ్ కుమార్ 81, హానీష్ వీరారెడ్డి 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ఆశిష్రెడ్డి 3, గిరీష్కుమార్రెడ్డి 2, శ్రీకాంత్ 2, సూర్య చరణ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 27 ఓవర్లకు 130 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆశిష్రెడ్డి 19, సాజిద్ సయ్యద్ 46 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 5, వినయ్ కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 174 పరుగులతో ఘన విజయం సాధించింది. -
భారత్ వైభవానికి ఆర్ఎస్ఎస్ కృషి
చింతకొమ్మదిన్నె : రాష్ట్రీయ స్వయం సేవక్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవ భారతం కార్యక్రమాన్ని చింతకొమ్మదిన్నె మండలంలోని కే–స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ (ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల) భరత్ కుమార్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ రామసుబ్బారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుని 2025 విజయదశమి నాడు శతాబ్ది వేడుకలను ఘనంగా ప్రారంభించిందని, ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వైభవ భారతం దృష్టి, దిశ అనే ఇతివృత్తం చుట్టూ కార్యక్రమం జరుగుతోందన్నారు. 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్న అనేక సవాళ్లు, సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం అనే విషయాలు వివరించారు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాలని, భారత్ను వైభవ స్థితికి ఎలా తీసుకుపోవాలో, జాతీయ భావాలు ఎలా పెంపొందించుకోవాలో, దేశభక్తి ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు 45 వరకు పని చేస్తున్నాయని, విద్యాసంస్థలో విద్యా భారతి, విద్యార్థి రంగంలో విద్యార్థి పరిషత్, ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయ సంఘం, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, ఇలా అనేక రంగాలలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె, కడప నగరం, పెండ్లిమర్రి మండలం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులు డాక్టర్స్, ఇంజినీర్స్, బిజినెస్ మ్యాన్స్, విద్యావేత్తలు, సైంటిస్టులు, పాఠశాలల కరస్పాండెంట్లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆర్ఎస్ఎస్ సాధించిన విజయాలు, భవిష్యత్తు దిశా నిర్దేశంపై ప్రతిభావంతులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక్ లక్ష్మణ్, జిల్లా ప్రచారక్ మహేష్, చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట, చెన్నూరు, పెండ్లిమర్రి, కడప నగరం నుంచి వివిధ రంగాల ప్రతిభావంతులు సుమారు 400 మంది పైగా పాల్గొన్నారు. -
అడ్డుకున్న ప్రజలు
ఇసుక అక్రమ రవాణాను సుండుపల్లె: ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం లేదని, ఇసుక రీచ్ను ఆపాలని బహుదానది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఆదివారం రీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుప్పగుట్ట సమీపంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో టిప్పర్లతో ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం హిటాచీలతో ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తుండగా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బహుదానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని,దీనివల్ల బోర్లలో నీరు రాక సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే మేం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోయారు. నిబంధనలు పాటించని రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్లో ఒక మీటర్ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్వారీని రద్దు చేయాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఇసుకను తోడేసి విక్రయించుకుంటున్నారు. ● బహుదానదిలోని ఇసుకను హిటాచీలతో ప్రతిరోజూ వందలాది టిప్పర్లకు లోడ్చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారని, దీంతో నదిలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయని పలుమార్లు మండల, జిల్లా అధికారులకు అర్జీల రూపంలో తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఇసుక అక్రమరవాణాకు పాల్పడతోంది అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం వల్లే అధికారులు చూసీ చూడనట్లు వ్వవహరిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చొరవ తీసుకొని ఇసుక అక్రమరవాణాను అరికట్టి రీచ్ను రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. రీచ్ వద్ద రైతులు, ప్రజల ఆందోళన -
మంగళ హారతి!
శిక్షణా కేంద్రానికి కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ( మేల్ ) ట్రైనింగ్ స్కూల్ నడుస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతతో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి ప్రభుత్వం 18 నెలల పాటు శిక్షణ ఇస్తుంది. మహిళా అభ్యర్థులకు ఇచ్చే ఏఎన్ఎం తరహాలోనే ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. 2016వ సంవత్సరం వరకు శిక్షణలు బాగానే జరిగాయి. తర్వాత ఎందుకనో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈ కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇందుకుగాను 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. పాలకులు తీసుకున్న నిర్ణయం కారణంగా పురుషుల శిక్షణా కేంద్రాలకు గ్రహణం పట్టుకుంది.కాగా మహిళలకు మాత్రం యధావిధిగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు కూడా విరివిగానే వెలిశాయి. రాష్ట్రంలో మూడు కేంద్రాలపై ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి చెందిన పురుషుల ట్రైనింగ్ కేంద్రాలు వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం తో పాటు శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఈ కేంద్రాలు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన ఎంతోమంది పురుష అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా 2016వ సంవత్సరం నుంచి ఈ కేంద్రాల్లో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు జరగలేదు. ఒక శిక్షణా కార్యక్రమంలో 17 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఈ శిక్షణ కేంద్రాల గురించి ప్రస్తావించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ జరగలేదని, సిబ్బంది ఖాళీగా ఉన్నారని, వారిని వైద్య ఆరోగ్యశాఖలోనే ఇతర విభాగాల్లో పనిచేయించుకోవాలని సూచించారు. ఆ ప్రతిపాదనను ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ సమర్థించారు. ఈ శిక్షణా కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాల్లో నియమించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆ ప్రకారంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శిక్షణ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదలాయించడం జరుగుతోంది. కాగా కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు జిల్లా కేంద్రాల్లోని శిక్షణా కేంద్రాలు, అందులోని సిబ్బంది యధావిధిగా కొనసాగడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర అసంతప్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి 2014లో ప్రభుత్వం ఒక సర్దుబాటు జీవోను ఇచ్చింది. ఆ జీవో ప్రకారం శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అయితే అలా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులను యధావిధిగా వారి స్థానాలకు పంపించి, ఆ స్థానాల్లో తమను నియమించుకోవాలనే వాదన వినిపిస్తోంది. శిక్షణ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనిది, ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అని ఉద్యోగులు వాదిస్తున్నారు. ప్రభుత్వం కేవలం వైఎస్సార్ కడప జిల్లాతో పాటు ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న శిక్షణా కేంద్రంలోని ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదలాయించారు. అయితే ఈ శిక్షణా కేంద్రాలను మూసేశారా.. తీసేసారా.. పూర్తిగా తొలగించారా అనేది సందిగ్ధంగా మారింది. అలాగే శిక్షణా కేంద్రాలను మరింతగా అభివద్ధి చేసి, అర్హులైన వారికి శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగ ఉపాధి దారిని చూపించాలి. అలా కాకుండా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు జరగలేదని, ఆ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని ఇతర ఆరోగ్య కేంద్రాలకు బదలాయించడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ తరుణంలో పాలకులు శిక్షణా కేంద్రాలకు మంగళహారతి ఇచ్చే అవకాశం ఉందనే అనుమానాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. శిక్షణలు లేవు.. సిబ్బంది ఎందుకనిప్రజాప్రతినిధుల నిర్ణయం ఏంపీహెచ్ డబ్ల్యూ (ఎం)ట్రైనింగ్ స్కూల్ పై ప్రభావం ఉన్న సిబ్బందిని ఇతర కేంద్రాలకు బదలాయింపు -
బాలికల విద్యకు భరోసా కేజీబీవీలు
కడప ఎడ్యుకేషన్: బాలికల విద్యకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు(కేజీబీవీ) భరోసాగా నిలుస్తున్నాయని ఇందులో చేరడానికి విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోవాలని కడప జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్ కుమార్ పేర్కొన్నారు. కడపలోని యానాది కాలనీలో ఆదివారం ఉపాధ్యాయులు, కేజీబీవీ సిబ్బందితో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దార్ల రూత్ ఆరోగ్య మేరీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమంత్కుమార్ మాట్లాడుతూ కేజీబీవీల ప్రాధాన్యత గురించి వివరించారు. వైఎస్సార్ కడప జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయన్నారు. వాటిలో 2026–2027 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నామని తెలిపారు. బడి బయటి పిల్లలు ,అనాథలు, వెనుకబడిన తరగతుల పిల్లలకు 100% అడ్మిషన్స్ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆల్లైన్లో దరఖస్తు చేసుకోవచ్చన్నారు.ఆరోతరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయని చెప్పారు. బాలికలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ -
రేపు ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుపుతారన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని నీటితో శుద్ధి చేస్తారు.శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయమంతా ప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రొద్దుటూరు: స్థానిక వైఎంఆర్ కాలనీకి చెందిన మురుకూటి జయప్రతాప్రెడ్డి, ప్రభావతి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం రూ.10,00,116 డీడీని అందించారు. తన కుమారుడు మురుకూటి వెంకట్ విజయ్ కుమార్రెడ్డి పేరున ఈ విరాళాన్ని ఇచ్చినట్లు ఈ సందర్భంగా జయప్రతాప్రెడ్డి దంపతులు తెలిపారు. తిరుమలలోని డోనర్స్ కౌంటర్లో సంబంధిత టీటీడీ అధికారి ప్రకాష్ చేతికి డీడీని అందించారు. ఎర్రగుంట్ల: మండల పరిధిలోని మేకలబాలయ్యపల్లె గ్రామంలో వెలసిన శ్రీ దుర్గమ్మ అమ్మవారిని భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. అదివారం మేకలబాలయపల్లి పరిధిలోని శ్రీదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రీచరణి కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వహకులు జి. వెంకటేశు తెలిపారు. జమ్మలమడుగు: మండల పరిధిలోనిఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ అనే విద్యార్థి గేట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకును సాధించాడు. గత ఫిబ్రవరి 19న గేట్పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19న వెలువడిని ఫలితాల్లో మోహన్ 89వర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, సంజీవరాయులు తెలిపారు. ప్రస్తుతం కర్నూల్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ టెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు చెప్పారు. కుమారుడు 89వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. -
ఈదురు గాలులతో అప్రమత్తం
కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ పంటలకు సంబంధించి జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు చెందిన 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో ఉద్యాన పంటలకు సంబంధించి 62 మంది రైతులకు రూ.1.56 కోట్ల మేర నష్టం జరిగింది. ఇంకా మరో 2 రోజుల పాటు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ సంస్థ తెలపడం జరిగింది. కావున జిల్లాలోని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. పంటలకు కలిగే నష్టాలు వర్షాలు అధికంగా కురవడం వల్ల పొలంలో నీరు నిలుస్తుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల పూతరాలటం, పంట పెరుగుదల కుంటుపడడంతోపాటు, పంట నాణ్యత కూడా లోపిస్తుంది. చీడ పీడల ఉధృతి పెరుగుతుంది. భూమిలోని పోషకాలు సరిగా మొక్కలకి అందక ఎదుగుదల ఆగిపోతుంది. విత్తనాలు మొలకెత్తకుండా కుళ్లిపోయే అవకాశం ఉంది. సకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పలు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరరావు వివరించారు. వరద అనంతరం కొద్దిపాటి ముంపుకు గురైన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ● పంట ఎదుగుదలకు తోడ్పడే విధంగా బూస్టర్ డోస్ ఎరువులను వేసుకోవాలి. ● అధిక తేమ వల్ల ఉధృతి పెరిగే అవకాశం గల తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు చేపట్టాలి. ● వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసి కలుపు తొలగించుకోవాలి. ● నేల కొంచెం ఆరిన తరువాతే రసాయనిక ఎరువులను నేలలో వేసుకోవాలి. వరి పంటలో.. ● వరిలో పాము పొడ నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లేక ప్రోపికొనజోల్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల లేక ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తెగుళ్ల ఉధృతి కనిపించట్లయితే ట్రైప్లోక్సీస్ట్రోబిన్ + టేబ్యుకొనజోల్ కలిసిన మందును 0.4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి. గింజ మొలకెత్తకుండా, రంగుమారకుండా లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంటకు.. ● నిలిచిన నీటిని తీసివేసిన తర్వాత, పంటపై 2 శాతం యూరియా(10 కిలోలు/హెక్టారు) లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ (5 కిలోలు/హెక్టారు) పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా కోలుకుంటుంది. ● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి. మినుము, పెసరలలో.. ● అధికంగా నిలిచిపోయిన నీటిని బయటికి తీయాలి. ● ఇనుము లోపాన్ని సవరించడానికి, సమర్థంగా పంట కోలుకోవడానికి ఫెర్రస్సల్ఫేట్ 5.0 గ్రా + సిట్రిక్ యాసిడ్ 0.5 గ్రాములు, యూరియా 20 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ● వర్షాలు తగ్గగానే, ఒక వారం తర్వాత, 1 శాతం 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి. వేరుశనగకు.. ● వేరుశనగలో ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగులు ఉధృతి పెరగకుండా హెక్సాకొనజోల్ 2 మి.లీలు/ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఇనుము లోపాన్ని సవరించడానికి ఫెర్రస్సల్ఫేట్ 5 గ్రా/లీతోపాటుగా సిట్రిక్ యాసిడ్ 1 గ్రా/లీ పిచికారీ చేయాలి. ● పంట కోతకు సిద్ధంగా ఉన్న చోట వర్షాలు ఆగే వరకు పంటకోత ఆలస్యం చేయాలి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజులపాటు జిల్లాలో వర్షాలు జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులుసూచనలు పాటించాలి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. గాలులు, వర్షాలతో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రాథమిక సూచనలు, జాగ్రత్తలను ప్రతి రైతు పాటించాలి. దీంతో పంటనష్టం నుంచి సులభంగా రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. – మట్టా సుబ్రమణ్యేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
మద్యం బాటిళ్లు స్వాధీనం
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని పలు గ్రామాల్లో పులివెందుల రూరల్ సీఐ సీతారామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన చిన్న ఓబుళరెడ్డి ఇంట్లో ఉన్న 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దుకాణంలోకి దూసుకొచ్చిన ట్రాక్టర్రాజంపేట : పట్టణ పరిధి రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ స్టీల్, సిమెంట్ దుకాణంలోకి శనివారం ఇసుక ట్రాక్టర్ దూసుకొచ్చింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. -
ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు అపహరణ
వేంపల్లె : వేంపల్లెలోని పాపాఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గవిమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి తాళిబొట్టుతోపాటు బీరువాలో ఉన్న మరికొన్ని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.3 వేల చిల్లర నాణేలు అపహరించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. వారు ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి..సుండుపల్లె : మండల పరిధిలోని రాయవరంలో శనివారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలలోకి వెళితే.. స్వర్ణలత అనే మహిళ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు బీరువాలోని 6.6 తులాల బంగారు నగలు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆమె ఇంటి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించింది. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. మహిళపై భర్త ఎదుటే అసభ్య ప్రవర్తన మదనపల్లె టౌన్ : స్థానిక చౌడేశ్వరి అమ్మవారి జాతరలో మహిళపై భర్త ఎదుటే ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. స్థానికంగా ఉండే మమత ఆమె భర్త సురేష్తో కలసి జాతరకు వెళ్లారు. ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయి యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.బంగారు నగలు చోరీ -
జడ్ఎంఓగా హుసేనమ్మ
కడప రూరల్: జోనల్ మలేరియా ఆఫీసర్ (జడ్ఎంఓ)గా హుసేనమ్మ శనివారం బాధ్యతలు స్వీక రించారు. ఈమె నెల్లూరు జిల్లా మలేరియా ఆఫీసర్ గా పనిచేస్తూ పదోన్నతి పై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న త్యాగరాజు పదవీ విరమణ పొందడంతో ఈ స్థానంలోకి హుసేనమ్మ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లె: మున్సిపాలిటీలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారుల్లో(ఎస్ఓ) ఇద్దరిని మార్పుచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలకువైఎస్సార్ కడపజిల్లా రాజంపేట, చిత్తూరు ఆర్డీఓలను నియమించారు. అయితే పొరుగుజిల్లాల ఆర్డీఓలు కావడంతో ఏ జిల్లాకు చెందిన అధికారులను ఆ జిల్లా మున్సి పాలిటీలకు నియమిస్తే పాలనా సౌలభ్యం ఉంటుదని భావించిన ప్ర భు త్వం పుంగనూరుకు మదనపల్లె సబ్కలెక్టర్, రాయచోటికి అక్కడి అర్డీఓలను ఎస్ఓలుగా నియమించారని అధికార వర్గాలు తెలిపాయి. కడప కార్పొరేషన్: కడప నగరం బిల్టప్ వద్దనున్న శ్రీ విజయదుర్గాదేవి ఆమ్మవారిని భారత మహిళ క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్రావు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచరణి తల్లి పదేళ్లుగా ప్రతి మంగళవారం రాహు, కేతు పూజలు నిర్వహిస్తుంటారని, ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. మదనపల్లెటౌన్: పంటలు నాశనం చేస్తున్న కో తులను బెదిరించేందుకు తారా జువ్వలు వెలిగిస్తుండగా రైతు తొడలోకి ఓ జువ్వ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో శనివారం జరిగిన ఘటనపై వివరాలు..చీకిలబైలుకు చెందిన రైతు చిన్నయ్య(60)వ్యవసాయ బావి వద్ద సాగు చేసిన టమాటా, ఇతర కూరగాయల పంటల్లోకి కోతులు రావడంతో వాటిని తరిమేందుకు తారా జువ్వలు వెలిగించాడు. ఓ తారా జువ్వ తిరిగి ఆ రైతు తొడలోకి దూసుకుపోయి పేలిపోయింది. గాయపడిన రై తును కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
వైఎస్ జగన్ను దెబ్బతీసేందుకే విజయమ్మ లేఖ
కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దెబ్బతీసేందుకే వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లిగా జగన్తో మాట్లాడే చనువు, బాధ్యత ఉన్నప్పటికీ మాట్లాడకుండా, కుమార్తె షర్మిలమ్మను రక్షించడంలో భాగంగా రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు విజయమ్మ స్టేట్మెంట్ను నోటరీ చేయించి విడుదల చేయడం అన్యాయమన్నారు. తల్లిగా మీకు ఇది తగునా... ఇది జగన్ను దెబ్బ తీసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. కోట్లాది మంది ఆరాధించే అభిమాన నేత వైఎస్ జగన్ను శత్రువు కంటే మిన్నగా విమర్శించడం దారుణమన్నారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని షేర్లు అటాచ్మెంట్లో ఉన్నాయని, కాబట్టి షేర్ల బదలాయింపు జరగదని తెలిసీ షర్మిలమ్మ చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా ఆ షేర్లను బదిలీ చేయించుకున్నారన్నారు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దయి జైలుకు పోవాలనే దుష్ట బుద్ధితో చంద్రబాబుతో కుమ్మకై షర్మిలమ్మ ఇలా ప్రవర్తించారని, ఇలాంటి ఆమె చెల్లెలు పదానికే కళంకమన్నారు. చరిత్రలో షర్మిలమ్మ, సునీతమ్మ లాంటి చెల్లెళ్లు పగవానికి కూడా ఉండకూడదని తెలుగింటి ఆడపడుచులంతా భావిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డికి ఉన్న ఏకై క చెల్లెలు విమలమ్మకు మీరు వాటా పంచి ఇచ్చారా? మీరు ఆడపడుచు విమలమ్మకు వాటా పంచనప్పుడు షర్మిలమ్మకు వాటాను జగన్తో ఎలా అడుగుతారని ప్రశ్నించారు. విజయమ్మ దీనిపై రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన నిశితంగా విమర్శించారు. సునీతమ్మ, షర్మిలమ్మ, విజయమ్మ అందరూ మూకుమ్మడిగా వారి స్వార్థం కోసం కుట్ర పన్నినా.. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి జగన్ అభిమన్యుడు కాదని అందరినీ ఎదిరించే సత్తా గల అర్జునుడని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు నిజం నిలకడ మీద తెలుస్తుందని, తద్వారా జగన్ను విజయం వరించి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కమలాపురం, చెన్నూరు మండలాల అధ్యక్షులు ఎస్.ఉత్తమారెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, చెన్నూరు మండల పరిషత్ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ మండల నేత చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత ఎం.వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. చెల్లెళ్లు అనే పదానికే షర్మిలమ్మ, సునీతమ్మ కళంకం వైఎస్ అవినాష్రెడ్డిపై బీటెక్ రవి వ్యాఖ్యలు సిగ్గుచేటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట సుబ్బారెడ్డి -
దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్–ఉల్–ఫితర్’
కడప కార్పొరేషన్: దైవభక్తి, శాంతి, సమైక్యత, సోదర స్నేహ భావాలు, దానధర్మాలు వంటి దివ్య సుగుణాల పరిమళభరిత సారమే.. ‘ఈద్–ఉల్–ఫితర్‘(రంజాన్ పర్వదినం) అని మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్బాషా అన్నారు. శనివారం రంజాన్ సందర్భంగా బిల్టప్ సర్కిల్లోని అమీనియా ఈద్గాలో పెద్దదర్గా పీఠాధిపతులు హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజద్బాషా పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిసో తెలియకో ఏడాదిపాటు చేసిన తప్పులను సమూలంగా కడిగేసే అవకాశం పవిత్రమైన రంజాన్ మాసంలో లభిస్తుందన్నారు. ఈ సృష్టిలో ధనదాన్యాలు, ఇతర సౌకర్యాలు అన్నీ దైవం ఇచ్చేనవేనని.. భూమిపై మనదంటూ ఏమీ ఉండదని, కానీ మనిషి అజ్ఞానంతో అన్నీ తానే సాధించినట్లు భ్రమ పడుతున్నాడని.. వాటిలో ఏ ఒక్కటి తిరిగి తీసుకు వెళ్లలేడని తెలుసుకోవాలన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనల వల్ల మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలు పెంపొందుతాయన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో రెండున్నర శాతం జకాత్ రూపంలో పేదలకు ఖర్చు చేయడం ఈ రంజాన్ మాసంలో చేసే పవిత్ర పుణ్యకార్యం అన్నారు. అందుకే ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకో వాలని కోరారు. ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండాలని, దేశం, రాష్ట్రం, జిల్లా, కడప నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు (మౌల్వి) ముష్టి న్యామతుల్లా సాహెబ్, దర్గా అమీర్, సీనియర్ నాయకులు సుభాన్ బాషా, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, అజ్మతుల్లా ఖాన్, వివిధ పార్టీల నాయకులు నజీర్ అహ్మద్, అమీర్ బాబు, వైవీయూ మాజీ రిజిస్ట్రార్ గులాం తారీక్, మేధావుల విభాగం నగర అధ్యక్షుడు డాక్టర్ అస్గర్ అలీ, నగర కార్యదర్శి మాస్టర్ అహ్మద్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కేంద్రీయ కల..సాకారం
● ఎంపీ మిథున్రెడ్డి కృషితోమదనపల్లెకు కేంద్రీయ విద్య ● ప్రిన్సిపాల్ను నియమించిన కేంద్రం ● 2026–27 ఏడాది నుంచే తరగతులు మదన పల్లె కేంద్రీయ విద్యాలయానికి కేంద్రప్రభుత్వం ప్రిన్సిపాల్ను నియమించింది. కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వు జారీ చేయడంతో శుక్రవారం ఆయన ఇక్కడ బాధ్యతలను స్వీకరించి కార్యకలాపాలను ప్రారంభించారు. మదనపల్లె: మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విద్యా కేంద్రం..కేంద్రీయ విద్యాలయం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి లక్ష్యం నెరవేరుతోంది. కేంద్రంపై ఒత్తిడితో ఆయన మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటూ ఈ విద్యా కేంద్రానికి ప్రిన్సిపాల్ను నియమిస్తూ చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించగా దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన జారీ చేశారు. కూటమిప్రభుత్వం మోకాలడ్డినా కేంద్రప్రభుత్వంతో ఎంపీ నిత్యం సంప్రదిస్తూ మదనపల్లె ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రజలు కొనియాడుతున్నారు. ఎస్టీ హస్టల్లో తరగతులు మదనపల్లెలోని నీటిపారుదలశాఖ ఆవరణలో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)ను కేంద్రీయ విద్యాలయం మార్చారు. గత ఏడాదే తరగతుల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం తరగతుల నిర్వహణకు భవనం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించి వచ్చే 2027–28 ఏడాదిలో తరగతుల సంఖ్యను పెంచనున్నారు. ప్రతి తరగతిని 40 సీట్లు ఉంటాయి. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కేటగిరీ ఫోర్ ఉద్యోగుల పిల్లలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సీట్లకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లేకుండా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఉంటుంది. వీరితోపాటు సాధారణ పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ ఉంటుంది. దరఖాస్తుల ఆహ్వనం కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31–03–2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తారు. అడ్మిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కాకుండా ఇతరులు కూడా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులపై ఏప్రిల్ 19న పది గంటలకు 2 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సీట్ల కేటాయింపుకు లాటరీ పద్దతిలో ఎంపిక జరుగుతుంది. మదనపల్లెలో 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేలా స్థానిక ఎస్టీ హస్టల్ బాలుర భవనాన్ని సిద్ధం చేశారు. విద్యార్థుల తరగతుల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకున్నారు. త్వరితగతిన తరగతులు ప్రారంభం అయ్యేందుకు ఎంపీ మిథున్రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో హస్టల్ భవనంపైన భవనాల నిర్మాణం, బాల, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లను నిర్మించారు. అయితే తరగతులను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అధికారులు, కేంద్రం సిద్ధంగా ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత, రాజంపేట ఎంపి పీవీ.మిథున్రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవిస్తూనే ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మాకు కేటాయించిన 6.09 ఎకరాల భూమిని అప్పగించండి అంటూ అన్నమయ్యజిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి కేంద్రం లేఖలు రాసింది. గత డిసెంబర్ 3న మిథున్రెడ్డి మళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఇక్కడి పరిస్థితులు, తక్షణమే విద్యాలయం ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రం స్పందించి తరగతుల ప్రారంభానికి సిద్ధంమైంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
కడప అర్బన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి వెళ్లి బావిలో మునిగి ప్రాణాలు వదిలిన సంఘటన కడప నగరం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రిమ్స్ పోలీసుల వివరాల మేరకు.. కడప బీడీ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్ (28) తన తండ్రితోపాటు తిరుపతిలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బుడ్డాయిపల్లె వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి ఈత కొట్టాడు. కొద్దిసేపటికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిరాజంపేట : కడప–తిరుపతి బైపాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జీకేఎస్ఆర్ కల్యాణ మండపం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. ఆచూకీ గుర్తించిన వారు టౌన్ సీఐ 9121100569, ఎస్ఐ 9121100570 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులు పట్టణ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని వివరించారు. రిమ్స్ మార్చురీలో ఇద్దరి మృతదేహాలుకడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ నెల 13వ తేదీన ఒకరు, ఈనెల 18న మరొకరు చికిత్స కోసం చేరారు. వీరు మృతి చెందడంతో మృతదేహాలను మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు పేర్కొన్నారు.పండగ రోజు ఈతకెళ్లి యువకుడు మృత్యువాత -
వైఎస్ కుటుంబం విలువలతో కూడినది
కడప కార్పొరేషన్ : వైఎస్ కుటుంబం మొదటి నుంచి పేద ప్రజల పక్షాన నిలబడి ఆశయాల కోసం పని చేసిన కుటుంబమే గానీ.. ఏనాడూ ఆస్తుల కోసం కొట్లాడుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. అలాంటి కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టి.. షర్మిలమ్మను పావుగా మార్చి ఆస్తుల పేరుతో ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పెంచలయ్యతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. వైఎస్ కుటుంబంలో అంత మంది సోదరులున్నా.. ఏనాడూ నాకు ఆస్తులు పంచి ఇవ్వాలని గానీ, నా అస్తి నీవు తీసుకున్నావని గానీ కొట్లాడిన సందర్భాలు ఒక్కటి కూడా లేవన్నారు. గతంలో వైఎస్ రాజారెడ్డి, అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిల మాటే వేదంగా అందరూ ఒక తాటిపై సోదరభావంతో ముందుకు వెళ్లారన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే కాసులు తీసుకొని షర్మిలమ్మ.. వైఎస్ జగన్ను రోడ్డుకీడ్చడం వైఎస్ కుటుంబ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తొందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే ఆస్తులు పంచి ఇచ్చినా.. ఇప్పుడు కొత్తగా ఆస్తులు పంచలేదని మాట్లాడటం ఆమెలోని ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఆనాడు ఆస్తులు పంచిన వాస్తవం వైఎస్ విజయమ్మకు తెలిసినా.. ఆమైపె ఒత్తిడి తెచ్చి తప్పుడు లేఖలు విడుదల చేయించడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో షర్మిల పావుగా మారడం పద్ధతి కాదన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు, ప్రజా సమస్యలు పక్కనపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద, ఆయన ఆస్తుల మీద విమర్శలు చెయ్యడం సరైనటువంటి సరికాదని హితవు పలికారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు...షర్మిలకు న్యాయం చేయరన్నారు. బాబు ఇచ్చిన కరెన్సీ నోట్లు తీసుకొని సొంత అన్నను విమర్శించడం దుర్మార్గమన్నారు. భవిష్యత్లో నీకు ఏదైనా సమస్య వస్తే... అన్నగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి తప్ప నిన్ను ఆదుకునేటువంటి వాళ్లు ఎవరూ లేరన్నారు. తెలుగుదేశంపార్టీ ఆడిస్తున్న ఆటలో షర్మిల ఎన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, 2029 ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం.. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రాష్ట్రానికి కావడం ఖాయమన్నారు. పనికిమాలిన రాజకీయాలు, ఆలోచనలు, చంద్రబాబు చేసేటువంటి ఎత్తుగడలను షర్మిల అనుసరించవద్దని కోరారు. ఆస్తుల కోసం ఏనాడూ కొట్లాడలేదు అంతమంది అన్నదమ్ములున్నా.. ఆస్తుల గొడవలు లేవు చంద్రబాబుకు పావుగా మారిన షర్మిల వల్లే ఇప్పుడు ఆస్తుల గొడవలు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి -
గండి అంజన్న సన్నిధిలో అవినీతి తాండవం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో అవినీతి తాండవం ఆడుతోందని ఆలయ మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు ఆరోపించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గండిలో అర్చకులకు అక్రమ సంపాదనే పరమావధిగా మారిందని చెప్పారు. ఇందుకోసం దేవుడికి వేసిన పూలమాలలు తిరిగి దుకాణాలకు అమ్ముకొంటున్నారని మండిపడ్డారు. హారతి పల్లెం డబ్బు హుండీలో వేయకుండా కాజేసి ఆలయ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో తాయత్తులు విక్రయించాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవన్నారు. అలాంటిది తాయత్తులు ఎలా విక్రయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ హారతి పల్లెం డబ్బులు తింటూ కోట్లకు పడగలెత్తిన ఆలయ అర్చకుడిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చివరికి గుడిలో స్వామి వారికి నైవేద్యం పెట్టకుండా ఎగర గొట్టారంటే ఇంతకంటే అపచారం ఏముంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు, ఆకుపూజ తదితర పూజల నిమిత్తం గండికి వచ్చిన భక్తులు టికెట్టు తీసుకున్నా కూడా అదనంగా డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మాజీ చైర్మన్ అయిన తనకు, తన కుటుంబ సభ్యులకే ఎదురయ్యిందని చెప్పారు. ఇక సామాన్య భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదని తెలిపారు. గురు,శుక్రవారాల్లో ఆలయంలో జరిగిన సంఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, గండి ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న గురుప్రసాద్ను ఫోన్ ద్వారా కోరినట్లు చెప్పారు. గండి అక్ర మాలపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులచే సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఆలయ మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు -
వన్డే మ్యాచ్లో అనంతపురం, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల క్రికెట్ వన్డే మ్యాచ్లు రెండవ విడత ప్రారంభం అయ్యాయి. ఈ వన్డే మ్యాచ్లో అనంతపురం 260 పరుగుల భారీ స్కోరుతో, నెల్లూరు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం– కర్నూలు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కర్నూలు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 43.5 ఓవర్లకు 339 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని గిరినాథ్రెడ్డి 100 బంతుల్లో 10 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగి 156 పరుగులు చేశాడు. ఎంకే దత్తరెడ్డి 86 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని ఆంజనేయులు అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, షేక్ ఇస్మాయిల్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 22.1 ఓవర్లకు 79 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని షేక్ ఇస్మాయిల్ 23, న్యాయిముల్లా 10 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంతోష్కుమార్ 3, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 260 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 48.1 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కేఎన్ పృధ్వీరాజ్ 68, శశాంక్ శ్రీవత్స్ 46 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాకేత్ రామ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 34 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఆ జట్టులోని రేవంత్రెడ్డి 93, రోషన్ పవన్కుమార్ 62 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని దీపన్ సాయినాథ్ 2 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
అన్నమయ్య కాలిబాటలో భక్తులను అనుమతించాలి
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన కాలిబాటలో నడిచి వెళ్లి..ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం ఈ సారైనా వేలాదిమంది భక్తులకు కల్పించాలని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని అన్నమయ్య ఉద్యానవనం లో టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులు తిరుమల మహాపాదయాత్ర చేపట్టాలని సిద్ధమయ్యారన్నారు. అయితే చివరి క్షణంలో అన్నమయ్య కాలిబాటలో యాత్రగా వెళ్లకూడదని అటవీశాఖ ఆంక్షలు పెట్టిందన్నారు. దీంతో అనేకమంది శ్రీవారిభక్తుల మనోభావాలకు దెబ్బతగిలిందన్నారు. అన్నమయ్య కాలిబాటలో ప్రతి ఏటా నడిచివెళ్లేవారమని, గత ఏడాది పోలేకపోయామని భక్తులు మనోవేదనకు గురయ్యారన్నారు. ఇలాంటి విధానం పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ చూడాలన్నారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ స్టేట్కౌన్సిల్సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, తాళ్లపాకకు చెందిన జువ్వాది మోహన్,జవ్వాది సుదర్శన్, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు శివయ్య, రామయ్య, మాజీ ఎంపీటీసీ రెడ్డయ్య, తాళ్లపాక నేత అజయ్వర్మ, ఊటుకూరు మల్లికార్జునరాజు, కళ్యాణ్,సూరి,జై.ప్రకాశ్వర్మ, రంగస్ధల కళాకారుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, కళాకారులు, రంగస్ధల నటులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి, చొప్పాఎల్లారెడ్డిని తాళ్లపాక గ్రామస్తులు జవ్వాది మోహన్, జవ్వాది సుదర్శన్, అజయ్వర్మలు సన్మానించారు. ● టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్యుని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీతసభలు, హరికథలు భక్తులను అలరించాయి. శనివారం తిరుపతికి చెందిన వేణుగోపాల్, కోమల బృందం సంగీతసభ, తిరుపతికి చెందిన అనుసూయ బృందం హరికథ నిర్వహించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’
మదనపల్లె టౌన్ : ‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి వరకు పిల్లల ఆటపాటలతో మురిసిపోయిన వారికి రోడ్డు ప్రమాదం కడుపుకోత మిగిల్చింది. లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఘటనపై మృతుల కుటుంబీకులు, తాలుకా పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చీకిలబైలుకు చెందిన శివారెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలను అక్కడే చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం గురువారం చీకిలబైలుకు శివారెడ్డి భార్యా పిల్లలతో వచ్చాడు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సమీపంలోని బల్తమూరులో ఉంటున్న తన తమ్ముడు శ్రీనివాసులురెడ్డిని చూడటానికి కొడుకు కుశల్రెడ్డి(10)ని వెంట తీసుకుని బైకులో వెళ్లాడు. తమ్ముడిని పలకరించి తిరిగి ఇంటికి తన కుమారుడు కుశల్రెడ్డితోపాటు తమ్ముడు శ్రీనివాసులురెడ్డి కుమారుడు భువనేశ్వర్రెడ్డి(6)ని వెంట తీసుకుని తిరిగి చీకిలబైలుకు బయలుదేరాడు. స్కూటర్ చీకిలబైలుకు రాగానే తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న స్పీడు బ్రేకరు వద్ద స్లో చేయడంతో వెనకనే వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివారెడ్డి ఒక వైపు, పిల్లలు మరో వైపు కింద పడడంతో.. పిల్లలపైకి లారీ దూసుకెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక 50 మీటర్ల దూరం వెళ్లి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునే వారని, లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే తాలుకా ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదు.. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘అరవ శ్రీధర్కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా?. లేదంటే ఇంటర్నెల్గా శ్రీధర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా?. ఒక వేళ కమిటీ రిపోర్టు ఇస్తే మాకు చెప్పండి. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ నివేదిక ఇవ్వకుండానే కండువాతో అరవ శ్రీధర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు పలుదఫాలు గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశిస్తున్నట్లు జనసేన అధినాయకత్వం ప్రకటించడం తెలిసిందే.అయితే ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోగా.. ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం గమనార్హం. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కమిటీ పేరుతో జనసేన నాయకత్వం కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే నిర్వాకాలను కనీసం ఖండించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రోజుల కిందట అరవ శ్రీధర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే నెపంతో పొలాల్లో పర్యటించి ప్రజలకు ముఖం చూపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. -
బంగారు గొలుసు చోరీ
మైదుకూరు : గ్రామానికి వెళ్లేందుకు బస్సులో కూర్చున్న వృద్ధురాలు సంచిలోని పర్సులో ఉంచిన బంగారం గొలుసు చోరీకి గురైన సంఘటన మైదుకూరులో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన లక్షుమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం ఉదయం మైదుకూరు బస్టాండ్లో పోరుమామిళ్ల వెళ్లే బస్సు ఎక్కింది. కండక్టర్కు ఆధార్ కార్డు చూపించేందుకు బ్యాగులో చూడగా.. అందులో ఉంచిన పర్సు జిప్ తీసి కనిపించింది. ఆందోళనతో పర్సులో చూడగా అందులో ఉంచిన రెండు తులాల బరువున్న బంగారు గొలుసు కనిపించలేదు. ఆమెబీ లబోదిబోమంటూ బస్సు దిగి బస్టాండ్ అంతా వెతికింది. వృద్ధురాలి రోదన చూసి తోటి ప్రయాణికులు కూడా బంగారం గొలుసు కోసం గాలించారు. కనిపించక పోవడంతో దొంగలు దొంగలించి ఉంటారని అందరూ భావించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జూదరుల అరెస్ట్ వీరపునాయునిపల్లె : మండలంలోని సంగమేశ్వర దేవాలయం తూర్పు భాగంలో ఉన్న కంప చెట్లలో జూదమాడుతున్న జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్సై క్రిష్ణయ్య తెలిపారు. ఏడుగురు జూదమాడుతున్నట్లు సమాచారం అందిందని, వెంటనే తమ సిబ్బందితో వెళ్లి దాడి చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మిగిలిన నలుగురు పరారయినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 7400 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పారిపోయిన నలుగురు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు. గాయపడిన వ్యక్తి మృతి ఎర్రగుంట్ల : డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగి బడుగు త్యాగరాజు(45) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారని కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం ఆర్టీపీపీలో డ్యూటీకి వెళ్తున్న సమయంలో స్కూటర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో త్యాగరాజు తలకు బలమైన గాయం అయింది. వెంటనే చికిత్స కోసం ప్రొద్దుటూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్యాగరాజు మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. మృతుడి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాత కమిటీ ఉండగా కొత్త కమిటీ ఎలా తెస్తారు?
● ముతవల్లి ఆధ్వర్యంలోనే ఖాదర్హుస్సేన్ మసీదు కమిటీ నడుస్తోంది ● మసీదు ఎదుట ముతవల్లి కుటుంబ మహిళల ఆందోళన ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఖాదర్హుస్సేన్ మసీదులో పాత కమిటీ ఉండగా కొత్త కమిటీని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ముతవల్లీ కుటుంబ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం నమాజ్ అనంతరం మసీదు ఎదుట బ్యానర్లను చేతపట్టుకొని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాదర్హుస్సేన్ మసీదుకు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఖాదర్హుస్సేన్ వంశీయులే ముతవల్లీగా ఉంటున్నారని, ముతవల్లి ఆధ్వర్యంలోనే కమిటీ నడుస్తోందని తెలిపారు. అయితే పాత కమిటీ ఉండగానే కొందరు వ్యక్తులు కుయుక్తులు పన్ని వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ముతవల్లి లేకుండా కొత్త కమిటీని తెచ్చుకున్నారన్నారు. ఈ కమిటీకి ఎన్ఎస్ మున్నా ప్రెసిడెంట్గా నియమించుకున్నారని తెలిపారు. రామేశ్వరం రోడ్డులో మున్నాకు చెందిన ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ స్థానంలో కొత్త మసీదును నిర్మించుకొని ఎన్ఎస్ మున్నానే ముతవల్లీగా, కమిటీకి ప్రెసిడెంట్గా కొనసాగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహిళలు సూచించారు. అయితే ఖాదర్హుస్సేన్ మసీదుపై సర్వహక్కులు ఉన్న తమను కాదని వక్ఫ్బోర్డు నుంచి తెచ్చుకున్న కొత్త కమిటీని అంగీకరించే ప్రసక్తే లేదని వారు చెప్పారు. 100 ఏళ్లలో వక్ఫ్బోర్డు నుంచి ఖాదర్హుస్సేన్ మసీదుకు ఒక్క ఇటుక గానీ, సిమెంట్ బస్తా గానీ సహాయం చేయలేదన్నారు. మోడంపల్లె మసీదుకు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయని, దానిపై ఎప్పుడైనా విచారణ చేశారా అని ప్రశ్నించారు. ఖాదర్హుస్సేన్ మసీదు నుంచి ప్రతి సంవత్సరం ఆషారే షరీఫ్నకు గంధం తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోందన్నారు. అయితే ఈ ఏడాది అంజుమన్ కమిటీ ఆదేశాల మేరకు తమ మసీదు నుంచి గంధం తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. మసీదు సంప్రదాయానికి విరుద్ధంగా ఎన్ఎస్ మున్నా వారి ఇంటి నుంచి గంధం తీసుకెళ్లారని తెలిపారు. మసీదుకు సంబంధం లేని మున్నా ఫ్యామిలీ వాళ్లు ఎలా గంధం తీసుకెళ్తారని మహిళలు ప్రశ్నించారు. తమ మసీదుపై వారి పెత్తనం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఇంత వరకు ఖాదర్హుస్సేన్ మసీదు వక్ఫ్బోర్డులో లేదని కొత్తగా కమిటీని తీసుకొచ్చారని అన్నారు. ఏం ఆశించి వాళ్లు ఇదంతా చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసునని తెలిపారు. కొత్త కమిటీ తెచ్చిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పెద్దలు స్వర్గీయ ఖాదర్హుస్సేన్ మసీదు కోసం స్థలం ఇచ్చారని, ఆయన సమాధి కూడా మసీదులోనే ఉందన్నారు. వారి వంశీయులైన తమకే ఈ మసీదుపై సర్వహక్కులు, నిర్వహణా బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ఇదంతా కడప వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, వక్ఫ్బోర్డు స్టేట్ డైరెక్టర్ బేపారి జాకీర్లు కుట్ర పన్ని కొత్త కమిటీని తీసుకొచ్చారని ఆరోపించారు. మసీదుపై కన్నేసిన వీళ్లు ఒక్క రోజు కూడా ఇక్కడ ఐదు పూటలా నమాజు చేయలేదన్నారు. ప్రస్తుత ముతవల్లి ఆధ్వర్యంలో ఉన్న కమిటీనే కొనసాగుతుందని, కొత్త కమిటీని అంగీకరించబోమన్నారు. ఇకనైనా కొత్త కమిటీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
యువకుడి ఆత్మహత్య
మైదుకూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైదుకూరులో జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న తుపాకుల శివశంకర్ (36) అనే యువకుడు గ్యాస్ స్టౌవ్లను రిపేరు చేస్తూ జీవనం సాగించేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే యువతితో వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన శివశంకర్ చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడేవాడు. గురువారం రాత్రి భార్య, పిల్లలు అదే కాలనీలో తన ఇంటి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లడంతో శివశంకర్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. అతని తండ్రి వీరభద్రయ్య, చుట్టుపక్కల వారు చూసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గండి అంజన్న సన్నిధిలో అపచారం
● అర్చకుల మధ్య ముదిరిన వివాదం ● ఉదయాన్నే సమర్పించాల్సిన నైవేద్యం 11 గంటలకు పెట్టిన వైనం చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం పూట అపచారం జరిగిందని చెప్పవచ్చు. ఇద్దరు అర్చకుల మధ్య గురువారం ఉగాది నాడు జరిగిన సంఘటన ఈ అనర్థానికి దారి తీసింది. ఇప్నటికే ఎన్నో మార్లు స్వామి పరువును బజారు కీడ్చిన అర్చకులు.. తమ పద్ధతులు మార్చుకోక పోగా ఏకంగా స్వామి వారికి నైవేద్యం పెట్టకుండా వదిలేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో 11 గంటల సమయంలో స్వామికి నైవేద్యం పెట్టి మమ అనిపించారు. దీంతో భక్తులు అర్చకుల తీరుపై మండి పడుతున్నారు. కొందరు భక్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వాస్తవంగా ఆలయంలో భక్తులు హారతి పల్లెంలో వేసే కానుకలు తీసి హుండీలో వేయాలి. కానీ ఇక్కడ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒకరు.. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మరొకరు హారతి పల్లెం కానుకలు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు గత కొన్నేళ్లుగా అధికారులు, పాలక మండలి సభ్యుల సమక్షంలో పంపకాలు చేసుకున్నారు. ఈ పంపకమే శుక్రవారం స్వామి వారికి నైవేద్యం అందకుండా చేయడానికి కారణమైంది. ఎందుకంటే అమావాస్య గురువారం ఉదయం 7 గంటలకు పోయి పాడ్యమి వచ్చింది కనుక ఇక తాను తీసుకుంటాను అని ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్ ప్రధాన అర్చకుడు కేసరిని అడిగారు. ఇందుకు ఈ రోజంతా నేనే ఉంటా వదిలే ప్రసక్తే లేదని ప్రధాన అర్చకుడు ఖరాకండిగా చెప్పాడు. దీంతో ఉప ప్రధాన అర్చకుడు పలువురి ద్వారా ప్రధాన అర్చకుడిని ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ప్రధాన అర్చకుడి తీరుపై బీటెక్ రవికి ఫిర్యాదు ‘ఇక నుంచి ప్రతి రోజు నీవే తీసుకో’ అంటూ అలిగి వెళ్లిన ఉప ప్రధాన అర్చకుడు నేరుగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవిని కలసి తమకు ప్రధాన అర్చకుడి ద్వారా జరిగిన అన్యాయంతోపాటు ఆయన అక్రమాలను వివరించారు. దీంతో బీటెక్ రవి ప్రధాన అర్చకుడి తీరుపై మండి పడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆలయ మాజీ చైర్మన్ వెంకటస్వామికి సూచించారు. వినక పోతే సీఐకి ఫోన్ చేస్తానని కూడా టీడీపీ ఇన్చార్జ్ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ఇది గురువారం జరిగిన తతంగం. ఇక శుక్రవారం నాటి కథ చూస్తే ప్రధాన అర్చకుడు తన కుమార్తె ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి ఉప ప్రధాన అర్చకుడికి ఇవ్వాల్సిన తాళాలు మరో అర్చకుడి చేతికి ఇచ్చి వెళ్లి పోయాడు. తాను ఇకపై అన్నీ నీవే చూసుకో అని చెప్పానని చెప్పి మిన్నకుండి పోయాడు. తాళాలు తీసుకున్న మరో అర్చకుడు మాత్రం ఉదయాన్నే గుడికి వెళ్లి అన్ని కై ంకర్యాలు పూర్తి చేసి నైవేద్యం కోసం ఎదురు చూశాడు. నైవేద్యం రాక పోవడంతో ఆయన చేసేదేమీలేక మిన్నకుండి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ మాజీ చైర్మన్ మరి కొందరు సిబ్బంది ఉప ప్రధాన అర్చకుడి వద్దకు వెళ్లి ప్రాధేయ పడి ఉదయం పెట్టాల్సిన నైవేద్యాన్ని 11 గంటల సమయంలో పెట్టించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో భక్తులు అర్చకుల తీరుపై మండి పడుతున్నారు. అధికారులకు వాటాలు ఉన్నందునే హారతి పల్లెంపై ఎన్ని విమర్శలు వచ్చినా, అర్చకులు కొట్టుకొని బజారుకెక్కినా పట్టించుకోలేదనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ బాధ్యతలను ఇన్చార్జ్ అధికారిగా పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భక్తులు పేర్కొంటున్నారు. -
వివేకా హత్య కేసు లేకుంటే.. నీకు పార్టీలో మనుగడే లేదు
● నీకు ఏ అర్హత ఉందని చర్చకు సిద్ధమా అంటున్నావు ● ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ● బీటెక్ రవిపై వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం పులివెందుల రూరల్ : బీటెక్ రవి వివేకా హత్య కేసు లేకుంటే నీకు మీ పార్టీలో మనుగడ ఉండదని, నీకు ఏ అర్హత ఉందని చర్చకు సిద్ధమా అంటున్నావని, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ డేరంగుల చంద్రమౌళి, మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీటెక్ రవి నీ మనుగడ కాపాడుకునేందుకే సునీత వెనుకాలే తిరుగుతూ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నావన్నారు. ఏ సెక్షన్ ఎవ్వరికీ పెట్టాలో, ఎవ్వరికి ఏ శిక్ష వేయాలో చెప్పడానికి నువ్వు, సునీతమ్మ మీరే జడ్జిలుగా వ్యవహరించితే ఇక సుప్రీంకోర్టులు ఎందుకు, సీబీఐ ఎందుకు అని ప్రశ్నించారు. నెలకొకసారి పులివెందుల రావడం, వివేకా హత్య కేసు గురించి మాట్లాడటం మళ్లీ అదృశ్యమవ్వడం తప్ప ఈ రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఏ అర్హత ఉందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని చర్చకు సిద్ధమా అని అడుగుతున్నావు అన్నారు. ఊర్లో పెళ్లికి ఎవరెవరో హడావుడి అన్నట్లు నీ గోల ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రపంచంలోనే ఇదొక వింత, చంపినోడికి ఒకడే లాయర్, సునీతమ్మకు ఒక్కడే లాయర్, ఆదుకుంటున్న చంద్రబాబుకు ఒక్కడే లాయర్, ఇంత వింత గురించి మాట్లాడే నీకు అవార్డులు ఇవ్వాలన్నారు. జిల్లాలో వైఎస్ అవినాష్రెడ్డి క్రేజ్ ముందు నీ కుప్పిగంతులు బలాదూర్ అన్నారు. ఎన్ని చారలు పెట్టుకున్నా పిల్లి పులి అవ్వదు, వైఎస్ అవినాష్రెడ్డికి మీరు సరితూగరన్నారు. వైఎస్ అవినాష్రెడ్డి ఏ తప్పు చేయలేదు, ధర్మం ఉంది కాబట్టే అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు, సిద్ధార్థ లూథ్రా, సీబీఐ అంతా ఏకమైనా సుప్రీం కోర్టులో అన్ని పిటిషన్లు వీగిపోయాయని, న్యాయం గెలిచింది, గెలుస్తుందన్నారు. నీచ రాజకీయాల కోసం నీ లాంటి వారంతా వైఎస్ కుటుంబీకుల పంచన చేరి షర్మిల, సునీత, చంద్రబాబు, నువ్వు, ఆదినారాయణరెడ్డి, వాసు అంత మంది కలిసి వైఎస్ అవినాష్రెడ్డిపై బురద చల్లినా, ఈవీఎం ట్యాంపర్ చేసినా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. బురదజల్లే మాటలు మానుకొని పులివెందులను అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ వ్యాల్యుయేషన్ ప్రారంభం ● కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు ● రెండు విడతల్లో స్పాట్ పక్రియ కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వ్యాల్యుయేషన్) ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతోపాటు మూల్యాంకనం జరగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. కావున అన్ని జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం చేయాలని అధికారులు సూచించారు. 1,94,932 పేపర్లకు మూల్యాంకనం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 1,94,932 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,66,362 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,61,841లకు కోడింగ్ పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం రెండు విడతల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మూల్యాంకనం జరగనుంది. మొదటి విడత ఉదయం 10 నుంచి 1 గంట వరకు, 2వ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనం కోసం 810 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 106 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 83 స్క్రూటిని నైజర్స్, 15 మంది ఏసీఓలను నియమించినట్లు ఆర్ఐవో తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది. పేపర్ వ్యాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్గా ఆర్ఐవో వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు. జనరల్–1, జనరల్–2, సీసీఓ–1, సీసీఓ–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వ్యవహరిస్తారు. వీరితోపాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, సబ్జెక్టు ఎక్స్ఫర్ట్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, స్క్రూటిని నైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు సైతం ఆయా కళాశాలలకు చేరాయి. మూల్యాంకన షెడ్యూల్ ఇలా... విడత మొదలయ్యే తేదీ దిద్దనున్న సబ్జెక్టు వివరాలు మొదటి మార్చి 22 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్, గణితం రెండవ మార్చి 25 నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ జిల్లాలో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక హాజరు కావాలి. విధులకు కేటాయించిన లెక్చరర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి మూల్యాంకన విధులకు పంపాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్ను అనుమతించడం జరగదు. మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రీనింగ్ చేయించాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంతటి వారికై నా చర్యలు ఉంటాయి. – వెంకటేశ్వర్లు, ఆర్ఐవో, ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్ -
మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి చెందినట్లు అక్కడి ఈస్ట్ పోలీసులు మదనపల్లె వన్ టౌన్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి పట్టణం ఎస్వీ మెడికల్ కాలేజీ–రుయా రోడ్డులోని ఫుట్ పాత్పై మదనపల్లె యువకుడు మృతి చెంది ఉండటాన్ని ఈస్ట్ పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్, పాన్ కార్డులో మృతుడు మదనపల్లె మండలం పొన్నూటి పాళ్యం కుమారపురం నమాజు కట్ట ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుమారుడు ఎం.ప్రేమ్కుమార్(30)గా గుర్తించారు. వారు వెంటనే మదనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. -
జగన్పై కుట్రతో అసత్య ఆరోపణలు
కమలాపురం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మకు తన కుమార్తె షర్మిల చేతబడి చేసి వశ పరచుకుని తప్పుడు వాంగ్మూలాలు, అబద్ధపు మాటలు చెప్పిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్పై రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేని కూటమిలోని కొందరు నాయకులు షర్మిలను రెచ్చగొట్టి విజయమ్మ చేత జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయించడానికి ప్రణాళికలు రచించారన్నారు. ఇదే అదునుగా తీసుకున్న షర్మిల తన తల్లి విజయమ్మను తన వైపు తిప్పుకోవడానికి చేతబడి చేసి మత్తు మందు చల్లి తన వైపు తిప్పుకొని జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులలో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ కూటమి నాయకులను సంతోష పరుస్తున్నారని పేర్కొన్నారు. చైన్నెలోని ట్రిబ్యునల్ కోర్టులో విజయమ్మ ఇచ్చిన అఫిడవిట్ను పరిశీలిస్తే షర్మిల విజయమ్మను లోబర్చుకుని కూటమి నాయకులతో సంప్రదించి రాయించి కోర్టులో సమర్పించినట్లుగా ఉందన్నారు. విజయమ్మ మీద ప్రయోగించిన చేతబడిని, మత్తు మందును తీసివేస్తే అపుడు ఆమెకు వాస్తవ విషయాలు తెలుస్తాయన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కీర్తి ప్రతిష్టలను మరో వంద కాలాల పాటు శాశ్వతంగా ప్రజల హృదయాలలో ఉండే విధంగా కుమారుడిగా బాధ్యత తీసుకుని జగన్మోహన్రెడ్డి కష్టపడుతూ ఉంటే.. ఆస్తుల కోసం షర్మిల జగన్మోహన్రెడ్డి వ్యతిరేకులతో చేతులు కలిపి చేస్తున్న కుట్రను దేవుడు కూడా క్షమించడన్నారు. ఎస్ఈసీ సభ్యుడు సత్య సాయినాథశర్మ -
క్రీడా పోటీల్లో మెరిసిన కడప విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : క్రమశిక్షణ, నిరంతర శ్రమ క్రీడాకారులను ఉన్నత స్థితిలో నిలబెట్టుతాయని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రవికుమార్ అన్నారు. ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులపాటు జరిగిన యోగివేమన విశ్వవిద్యాలయం అంతర కళాశాలల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో కడప ఆర్ట్స్ కళాశాల క్రీడాకారులు 20 పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ శుక్రవారం అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమేష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి డాక్టర్ టి.హజరతయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థి జి.సింహాచలం 5 (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు, బీబీఏ తృతీయ సంవత్సరం కే మహేష్ నాలుగు రజత పతకాలు సాధించారు. బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న లోకేశ్వరరావు 5(1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం), టి.మనోజ్ కుమార్ 2 రజతాలు, వినోద్ 1 రజతం సాధించారు. బాలికల్లో నీలామహేశ్వరి జావెలిన్ త్రోలో రజితం, స్పందన 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించారు. -
ప్రజాస్వామ్య గొంతుకపై ప్రత్యేక కత్తి!
కడప కార్పొరేషన్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్య పాలనను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. 2021 మార్చిలో ‘ఫ్యాన్’ ప్రభంజనంతో జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమకు బుద్ధి చెబుతారనే భయంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఊసెత్తకుండా, పట్టణ పాలనను అధికారుల పరంచేసింది. రాజంపేట మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. అడుగడుగునా అడ్డంకులు.. అప్రజాస్వామిక ధోరణి: గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని మున్సిపాలిటీలను లక్ష్యంగా చేసుకుని దమనకాండకు తెరలేపింది. ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. కడప కార్పొరేషన్లో: 11 మంది కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలతో ఫిరాయింపజేశారు. ప్రొద్దుటూరులో: 17 మంది కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారు. పోలీసు కేసులు, గూండాగిరీతో భయపెట్టినా, మెజారిటీ ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికే కట్టుబడి నిలవడం గమనార్హం. కుర్చీ కోసం కుట్రలు.. మేయర్పై అనర్హత వేటు కడప నగరంలో కూటమి నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. స్థానిక ఎమ్మెల్యే మాధవికి, మేయర్ కొత్తమద్ది సురేష్ బాబుకు మధ్య ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదాన్ని సాకుగా చూపి, కేవలం కుర్చీ వేయలేదన్న అల్ప కారణంతో జీహెచ్ఎంసీ చట్టంలోని లొసుగులను వాడుకుని మేయర్పై అనర్హత వేటు వేయించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఎన్ని కుతంత్రాలు పన్నినా మళ్లీ వైఎస్సార్సీపీ ప్రతినిధే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కూటమి నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభివృద్ధికి గండి.. ప్రజలకు ఇబ్బందులు తమకు అనుకూలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. పట్టణాల అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు ప్రత్యేకాధికారుల పాలన రావడంతో సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక సమస్య వస్తే అడిగే దిక్కు లేని పరిస్థితి పట్టణాల్లో నెలకొంది. జిల్లాలో ముగిసినమున్సిపల్ పాలకవర్గాల గడువు. రాజంపేట మినహా నేటి నుంచిప్రత్యేకాధికారుల చేతుల్లోకి పురపాలన..ప్రజలకు తప్పని తిప్పలు. కూటమి సర్కార్ కుట్రలు, ఫిరాయింపుల మధ్యే ఐదేళ్ల ప్రస్థానం. నిధులు ఆపి.. అభివృద్ధిని అడ్డుకున్నా..వెరవని వైఎస్సార్సీపీ సైనికులు. -
ఆలయఘటనపై దేవదాయ శాఖ అధికారుల విచారణ
బద్వేలు అర్బన్: మండల పరిధిలోని అనంతరాజుపురం పంచాయతీ లక్ష్మీపాలెం గ్రామంలో ఉగాది సందర్భంగా గురువారం భక్తులకు, పూజారులకు జరిగిన వాగ్వాద ఘటనపై శుక్రవారం దేవదాయశాఖ డివిజనల్ టెంపుల్స్ ఇన్స్పెక్టర్ జనార్ధన్, ఈవో రామలింగారెడ్డి విచారణ చేపట్టారు. భక్తులను, గ్రామస్తులను, పూజారులను వేర్వేరుగా విచారించారు. అనంతరం వాగ్వాదం జరిగిన భక్తులు, పూజారులను పిలిపించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారి సన్నిధిలో పూజలు చేయించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన గ్రామస్తులను దేవదాయశాఖ అధికారులు అభినందించారు. కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్) ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెల 17వ తేదీతో ముగియడంతో, ప్రభుత్వం కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి, నగర పాలనపై దృష్టి సారించారు. సమసిన వివాదం -
● ముస్తాబైన ఈద్గాలు.. కడపలో ప్రత్యేక ఏర్పాట్లు
ఆధ్యాత్మిక వేదిక సిద్ధం: రంజాన్ పండుగ పురస్కరించుకుని బిల్టప్ ఈద్గాలో ముస్లిం సోదరులకు రంజాన్ సందేశాన్ని అందించేందుకు తీర్చిదిద్దిన ముఖ్య వేదిక ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు: కడపలోని బిల్టప్ ఈద్గా వద్ద ప్రార్థనలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కడప సెవెన్ రోడ్స్: క్రమశిక్షణ, దైవచింతన, దానగుణానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు సాగిన కఠిన ఉపవాస దీక్షలు, తరావీ ప్రార్థనలు నిన్నటి నెలవంక దర్శనంతో ముగిశాయి. శనివారం పండుగ జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ముస్తాబైన ఈద్గాలు.. పండుగ పురస్కరించుకుని కడప నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని ఈద్గాలు, మసీదులు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. శనివారం ఉదయం జరగబోయే ప్రత్యేక ఈద్ ప్రార్థనల కోసం ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొత్త బట్టలు ధరించి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని అల్లాహ్ ఆశీస్సుల కోసం ఈద్గాల వైపు అడుగులు వేస్తున్నారు. మానవత్వానికి మారుపేరు.. సాటి మనిషిని ఆదుకోవడమే పరమార్థంగా భావించే ఈ పండుగ వేళ, పేదలకు ‘ఫిత్రా’ దానాలను అందజేస్తూ ముస్లింలు తమ ఉదారతను చాటుకుంటున్నారు. షీర్ ఖుర్మా మధురిమలతో, ఆలింగనాలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుతున్నారు. ఉత్సాహంగా మార్కెట్లు.. పండుగ నేపథ్యంలో గత రెండు రోజులుగా కడప మార్కెట్లు జనంతో కిటకిటలాడాయి. బట్టలు, పండ్లు, సేమియాల కొనుగోళ్లతో వ్యాపార సముదాయాల్లో సందడి నెలకొంది. పాలక సంస్థ మరియు పోలీసుల బందోబస్తు కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఎండ నుంచి ఉపశమనం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తును కల్పించడమే కాకుండా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ ఉత్సాహం, సందడి వాతావరణం కనిపిస్తోంది. నేడు పవిత్ర ఈద్–ఉల్–ఫితర్ పర్వదినం నెలవంక దర్శనంతో ముగిసిన రోజాలు,తరావీ ప్రార్థనలు ఈద్ ప్రత్యేకప్రార్థనలకుసిద్దమైన ఈద్గాలు, మసీదులు నేడే పవిత్ర ఈద్–ఉల్–ఫితర్ పర్వదినం భక్తిశ్రద్ధలతో ముగిసిన రంజాన్ మాసం నగరంలోని ప్రధాన ఈద్గాలు ప్రార్థనల కోసం ముస్తాబయ్యాయి. ముఖ్యంగా... బిల్టప్ ఈద్గా ఆలంఖాన్పల్లె వద్దగల దండు షాహీ ఈద్గా జమాల్పల్లె, మాచుపల్లె ఈద్గాలు రిమ్స్ వద్దగల ఈద్గా ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
అకాలవర్షాల బీభత్సం
కడప అగ్రికల్చర్: కడప జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులు జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన పంటలను అతలాకుతలం చేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కళ్లముందే నేలకొరగడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అరటి రైతులకు కోలుకోలేని దెబ్బ జిల్లాలో ప్రధానంగా 52 హెక్టార్లలో అరటి పంట దెబ్బతింది. సుమారు 62 మంది రైతులకు రూ.156 లక్షల (1.56 కోట్లు) మేర నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సింహాద్రిపురం మండలం: సింహాద్రిపురంలో 20 హెక్టార్లు (రూ.60 లక్షలు), కసనూరులో 17 హెక్టార్లలో (రూ. 51లక్షలు) పంట దెబ్బతింది. ముద్దనూరు మండలం: బొందలకుంట గ్రామంలో 12 మంది రైతులకు చెందిన 6 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 18 లక్షల నష్టం వాటిల్లింది. తొండూరు మండలం: బుచుపల్లిలో 5 మంది రైతులకు సంబంధించి 5 హెక్టార్లలో రూ. 15 లక్షల నష్టం జరిగింది. రాజంపేట మండలం: పెద్దకారంపల్లిలో ముగ్గురు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షలు, బ్రాహ్మణపల్లెలో ఇద్దరు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న వ్యవసాయ పంటలు: మరోవైపు జిల్లావ్యాప్తంగా 107 మంది రైతులకు సంబంధించి 98.40 హెక్టార్లలో మొక్కజొన్న, సజ్జ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మొక్కజొన్న: కొండాపురం, కమలాపురం, వీఎన్పల్లి, సింహాద్రిపురం మండలాల్లోని 21 గ్రామాల్లో 71.40 హెక్టార్లలో పంట నేలపాలైంది. ముఖ్యంగా సింహాద్రిపురం–2 గ్రామంలో 16 హెక్టార్లు, వీఎన్పల్లి ఇందకూరులో 8 హెక్టార్లలో నష్టం జరిగింది. సజ్జ: వీఎన్పల్లి, కాశినాయన, కొండాపురం మండలాల్లో 27 హెక్టార్లలో సజ్జ పంట దెబ్బతింది. వీఎన్పల్లిలో 12 హెక్టార్లు, కాశినాయన మండలం ఉప్ప లూరులో 7 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల వల్ల అరటి ధరలు తగ్గి ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు అకాల వర్షాలు తోడవ్వడంతో దిక్కుతోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి మట్టిపాలు కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. జిల్లాలో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న, సజ్జ పంటలు సుమారు 150 హెక్టార్లలో పంట నష్టం..అవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా కుందేళ్ల పార్వేట
లింగాల: మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం సాయంత్రం కుందేళ్ల పార్వేటను నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పండుగ పార్ణమి రోజు కేందేళ్ల పార్వేట కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ఎగువ లింగాలకు చెందిన యువకులు అడవికి వెళ్లి వలలు వేసి కుందేళ్లను ప్రాణాలతో పట్టుకుని తీసుకొస్తారు. పార్ణమి రోజు కుందేళ్లను రామాలయం నుంచి సీతారామ, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను తప్పెట్లు, మేళాలతో ఊరేగింపుగా గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకొస్తారు. సీతారాముల పల్లకిని పొలంలో ఉంచి అక్కడ రామ భజనలు నిర్వహిస్తారు. అనంతరం యువకులు తీసుకొచ్చిన కుందేళ్లను జనాల మధ్య వదిలుతారు.వాటిని యువకులు, పిల్లలు పారిపోకుండా పట్టుకుంటూ ఉల్లాసంగా కేరింతలు వేస్తూ పార్వేట నిర్వహించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, గ్రామ పెద్దలు కుందేళ్లను చూపిస్తూ పార్వేటను ప్రారంభించారు. ఇందులో ఎగువ లింగాల, దిగువ లింగాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వైవీయూ పీజీ ప్రవేశాల గడువు 28 వరకు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీపీజీసెట్ (APPGCET)–2026 దరఖాస్తు గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ్చఞ. జౌఠి. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సందేహాల కోసం 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించవచ్చు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు. కడప అర్బన్: కడపనగరంలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో ఉన్న జల వనరుల శాఖ డీఈఈ వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేసిన జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు ఈనెల 17వ తేదీ జల వనరుల శాఖ కార్యాలయంలో ఆడిట్ తనిఖీ జరుగుతుండగా జూనియర్ అసిస్టెంట్తో ఈ– బుక్ తేవాలని సూచించడంతో ఆయన కోపంతో దూషించడంతోపాటు గాయపరిచినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. లింగాల: మండలంలోని అక్కులగారిపల్లెలో రైతు నరాల ఉదయ్ కృష్ణారెడ్డి సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పొలాలను లండన్ శాస్త్రవేత్త డాక్టర్ నటాషా ఎడ్వార్డ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ తయారయ్యే కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్, బయో ఎంజైమ్స్ మరియు వర్మీ వాష్ తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సిద్ధమైన ఈ కషాయాలను ఎంత విస్తీర్ణానికి, ఏ మోతాదులో పిచికారీ చేయాలో రైతును అడిగి తెలుసుకున్న డాక్టర్ నటాషా, విత్తన గుళికల తయారీ మరియు వాటి ఉపయోగాలు, పీఎండీఎస్ సాగు పద్ధతులపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఈ వివరాలను డాక్టర్ పుష్ప ఇంగ్లీష్లోకి అనువదించి శాస్త్రవేత్తకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డివిజనల్ అధికారి భాస్కర్రెడ్డి, మండల ఇన్ఛార్జ్ జయ నాయక్, డీఎంఎంటీ యామినిలత పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: స్థానిక నీరుగట్టువారిపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ఉట్ల తిరునాల నిర్వహించారు. ఆలయం ఎదుట ప్రాంగణంలో ఉట్ల మాను ఏర్పాటు చేశారు. యువకులు ఎంతో ఉత్సాహంగా ఉట్ల మాను ఎక్కేందుకు ముందుకు వచ్చారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఉట్లమాను కొందరు యువకులు ఎక్కి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఉదయం ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 23న కడప నగరంలో నిర్వహించనున్న ‘అమరవీరుల దినోత్సవం’ కార్యక్రమాలకు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23న సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ‘కాగడాల ప్రదర్శన’ నిర్వహిస్తామన్నారు. అలాగే, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూమి సాధన కోసం సీపీఐ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా.. 24న బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం 25న బద్వేల్లో జరిగే జిల్లా సమితి సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, హరినాథ్ రెడ్డి పాల్గొంటారని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 26న పులివెందులలో జరిగే ఆందోళనలో జి. ఈశ్వరయ్య పాల్గొంటారని చంద్ర తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జి. వేణుగోపాల్, కె.సి. బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని వెలసిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్కుమార్, ఈవో వి. రమణారెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రాహుకాల పూజల విశిష్టతను చాటుతూ అమ్మవారికి నిమ్మకాయల హారాలను సమర్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుకాల పూజల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఇంత అన్యాయమా తల్లీ!
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?మంగళవారం ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?జగన్ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.ఎన్సీఎల్టీ తీర్పు అర్థమేమిటి?న్యాయాన్యాయాలు తేల్చమని జగన్ ఎన్సీఎల్టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? మీరు ఒక సైడ్ తీసుకోవడం న్యాయమా?చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటాక్ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? సరస్వతీ పవర్, ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్తో షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది. చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్ బెయిల్ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్సైడ్ తీసుకున్నారనేగా తల్లీ. కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా «థియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు. 2019 ఆగస్టులో జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?వైఎస్సార్గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్ దగ్గరే ఉన్న షేర్స్ సర్టిఫికెట్స్ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్సైడ్ తీసుకున్నారు. షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్ తప్పులు, బీఆర్ నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్లోని వెబ్సైట్లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? -
విద్యుత్ పోల్ నుంచి ఎగసిన మంటలు
● భయభ్రాంతులైన ప్రజలు ● కేబుల్ ఆపరేటర్లదే నిర్లక్ష్యంరాజంపేట రూరల్ : విద్యుత్ స్తంభం నుంచి ఒక్క సారిగా మంటలు ఎగసి పడటంతో.. చుట్టు పక్కల నివాసం ఉంటున్న ప్రజలు, దుకాణదారులు, ప్రయాణికులు భయభ్రాంతులైన సంఘటన పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక కర్నాటం లాడ్జీ పక్కన ఉన్న విద్యుత్ పోల్ నుంచి మంటలు రావటంతో అవి ఎందుకు వస్తున్నాయో, దానివల్ల ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సమీప ప్రాంతాల ప్రజలు హడలిపోయారు. సమయం పెరిగే కొద్ది మంటలు అధికం కావటంతో స్థానికులు అటు విద్యుత్ శాఖ అధికారులకు ఇటు ఫైర్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. విద్యుత్ పోల్కు ఏర్పాటు చేసిన యాంప్లి ప్లేయర్ బాక్స్ ఓవర్ హీట్ అయి పేలిపోవటంతో మంటలు చెలరేగాయని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. మంటలు పెద్దవి అయి పక్కన ఉన్న దుకాణాలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమేనని స్థానికులు వాపొయారు. రానున్నది వేసవి కాలం. ఇదే విధంగా యాంప్లీ ఫ్లేయర్లు మండుతూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పట్టణంలోని విద్యుత్ పోల్ల చుట్టూ ఇష్టాను సారంగా కేబుల్ వైర్లను చుట్టడంతోపాటు యాంప్లి ఫ్లేయర్లను ఏర్పాటు చేయటం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మంటలు చెలరేగటంలో తప్పిదం విద్యుత్ శాఖ అధికారులదా లేక కేబుల్ ఆపరేటర్లదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఒంటిమిట్టలో ఆక్రమణల తొలగింపు
● అధికారులను అడ్డుకున్న దుకాణాదారులు ● ఘర్షణ పడ్డ ఆక్రమణదారులుఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆనుకుని వెనుక వైపు ఉన్న 1500/1బీ సర్వే నంబర్లో ఒంటిమిట్ట పంచాయతీకి చెందిన ఎంతో విలువైన గ్రామ కంఠాన్ని కొంత మంది కొన్నేళ్లుగా ఆక్రమించుకుని దుకాణాల పేరుతో ధనార్జన చేస్తున్నారు. వారిని చూసి మరి కొంత మంది ఈ మధ్య కాలంలో ఆక్రమణ చేసి, ముగ్గులు, రేకుల షెడ్లు, టెంట్లు వేసుకున్నారు. దీనిపై కొంత మంది మండల ప్రజా పరిషత్, పంచాయతీల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవోపీఆర్డీ చలపతి, ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి టి.కిశోర్ కుమార్ పోలీసు బందోబస్తుతో వచ్చి ఆక్రమణలను తొలగించడం మొదలు పెట్టారు. అయితే ఇది జరుగుతుండగా ఆక్రమణలు చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని, ఘర్షణకు దారి తీసింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై సిమెంటు ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరికి రక్త గాయాలు అయ్యాయి. బాధితుడిని కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఘర్షణ అనంతరం ఆక్రమణల తొలగింపు మళ్లీ పుంజుకుంది. ఈ క్రమంలో ఆరు ఆక్రమణలను తొలగించి, మిగిలిన అక్రమ దుకాణాలను తొలగించబోతున్న ఈవోపీఆర్డీ చలపతి, ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శిని అక్రమంగా దుకాణాలు నడుపుతున్న వ్యాపారస్తులు అడ్డుకున్నారు. తొలగిస్తే అన్ని దుకాణాలను తొలగించాలని, లేకుంటే ఇక్కడి నుంచి తాము దుకాణాలను తొలగించుటకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దీంతో 1500/1బీ సర్వే నంబర్లోని పంచాయతీ గ్రామకంఠంలో గత కొన్ని ఏళ్లుగా ఆక్రమణ చేసి, దుకాణాలను నడుపుతున్న వారందరి ఆక్రమణలను తప్పకుండా తొలగిస్తామని, ఈ నెల 21 వరకు దుకాణాదారులకు గడువు ఇవ్వడం జరిగిందని, ఆ లోపు వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటే సరిపోతుందని, లేకుంటే తామే జేసీబీ సాయంతో తొలగించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. తాము చెప్పిన సమయానికి దుకాణాలను తొలగించకుంటే అధికారులే తొలగించుకోవచ్చునని, ఇది వరకు దుకాణాదారులు తాము ఇచ్చిన నోటీసులలో సంతకాలు కూడా చేశారన్నారు. -
కారుకు తప్పిన ప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం : డివైడర్ను ఢీకొని కారు టైరు పగిలిన ఘటన కొర్రపాడు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇందిరానగర్కు చెందిన ఒక వ్యక్తి కారులో కొర్రపాడు రోడ్డులో వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఓ మహిళ అడ్డం వచ్చింది. డ్రైవర్ ఆమెను తప్పించే క్రమంలో కారు డివైడర్ దిమ్మెను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ముందు భాగం టైరు పగలడంతో కారు రోడ్డుకు అడ్డంగా తిరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోవడంతోపాటు కొంత భాగం దెబ్బతింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపు ఘటనా స్థలంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుళ్లతో కలిసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కరెంటు షాక్తో వ్యక్తికి తీవ్ర గాయాలు మదనపల్లెటౌన్ : పండుగ పూట చేనేత కార్మికుడు కరెంటు షాక్కు గురై తీవ్రంగా గాయ పడ్డాడు. మదనపల్లెలో గురువారం జరిగిన ఘటనకు సంబంధించి జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్లో ఉంటున్న బి.రఘునాథ్(40) మగ్గాలు నేసుకొని కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలో ఉన్న మునగ చెట్టెక్కి మునగ కాయలు కోసేందుకు బుధవారం రాత్రి వెళ్లాడు. కాయలు కోసే క్రమంలో చెట్టు కొమ్మ విరిగి పక్కనే వెళుతున్న విద్చుత్ వైర్ల మీద పడి కరెంటు షాక్కు గురయ్యాడు. కుటుంబీకులు గమనించి తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డివైడర్ను ఢీకొని పగిలిన టైరు -
జర్మనీతో అన్నమాచార్య యూనివర్సిటీ ఒప్పందం
● ఉన్నత విద్యా రంగంలో మరో ముందడుగు ● అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డిరాజంపేట : జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ (యూఏఎం)తో రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కదర్చుకున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కేవలం ఐదు విశ్వవిద్యాలయాలతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని యూఏఎం నిర్ణయించిందన్నారు. ఇందులో అన్నమాచార్య యూనివర్సిటీ స్థానం సంపాదించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాదులో ఉగాది సందర్భంగా కుదిరిన ఒప్పందంలో కంప్యూటర్ సైన్స్లో గేమ్ డిజైన్, సాఫ్ట్వేర్ అనుభవం, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేకతలతో టు ప్లస్ టు ట్విన్ డిగ్రీ బ్యాచ్లర్ ప్రోగ్రాం ప్రారంభించనున్నామన్నారు. మొదటి రెండు సంవత్సరాలు ఇండియాలోని భాగస్వామ్య సంస్థ ఏయూతో , చివరి రెండు సంవత్సరాలు జర్మనీలో అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం జర్మనీలో మాస్టర్స్ చదివే అవకాశం కల్పిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాల విద్యతోపాటు విదేశీ అనుభవం, మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయన్నారు. జర్మనీ బృందంలో యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్, అంతర్జాతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ టర్న్ వాల్ట్, జర్మనీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ అధినేత రాజ్ వంగపండు, ఇండో యూరోసింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగరాజులు ఉన్నారన్నారు. కాగా ఒప్పంద పత్రాలను ఏయూ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి, యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు, అడ్మిషన్స్ డిప్యూటీ డైరక్టర్ డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వన్డే మ్యాచ్లో కర్నూలు, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు కొనసాగాయి. గురువారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో కర్నూలు–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 24,4 ఓవర్లకు 110 పరుగులకు ఆలౌట్ అయింది. పూర్య 61, సూర్య చరణ్ 18 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సుదర్శన్రెడ్డి 4, ఆంజనేయులు 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 14.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆ జట్టులోని కరణ్ షిండే 46, ఎంఎస్ గిరినాథ్ 21 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మాధవ్ రాయుడు 2 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–నెల్లూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధనుష్ 102 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. షేక్ జహీర్ అబ్బాస్ 44 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సాకేత్ రామ్ 2, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్రెడ్డి 122, సయ్యద్ పర్హాద్ ఖద్రీ 48 పరుగులు చేశారు. కడప జట్టులోని పఠాన్ షరీఫ్, ఆరిఫ్ బాషా, జహీర్ అబ్బాస్ తల ఒక వికెట్ తీశారు. దీంతో నెల్లూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.సూర్య, చిత్తూరు (63 పరుగులు) సుదర్శన్రెడ్డి, కర్నూలు (4 వికెట్లు)ధనుష్, కడప (127 పరుగులు) నిఖిలేశ్వర్రెడ్డి, నెల్లూరు (122 పరుగులు) -
ఘనంగా పెద్దపీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : భవిష్యత్తు కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ శిశ్యుడు ముడుమాల సిద్దయ్య నాలుగో కుమారుడు పెద్దపీరయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు గురువారం ముడుమాల పంచాయతీ సిద్దయ్యమఠంలో ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఏటా పెద్దపీరయ్య స్వామి ఆరాధన జరుగుతుంది. ఇందులో భాగంగా సిద్దయ్యమఠం ప్రస్తుత పీఠాధిపతులు, వారి సోదరులు ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించారు. భక్తుల కోసం చలువ పందిర్లు, తాగునీరు తదితరాల సౌకర్యాలు నిర్వాహకులు కల్పించారు. వివిధ కులాల సంఘాల వారు అన్నదానాలు ఏర్పాటు చేశారు. రాత్రి భజనలు, నాటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.మఠం ఎస్ఐ శివప్రసాద్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు అధికంగా రానున్నారు. నేటి కార్యక్రమాలు పెద్దపీరయ్యస్వామి ఆరాధన సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు బండలాగుడు పొటీలు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్లకు ప్రథమ బహుమతి రూ.1లక్ష 116లు జెడ్పీ చైర్మన్ ఎం.రామగోవిందరెడ్డి తన తండ్రి పిచ్చిరెడ్డి పేరున ఇస్తున్నారు. రెండవ బహుమతి రూ.70 వేలు గొడ్లవీడు రామసుబ్బారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. మూడవ బహుమతి రూ.45 వేలు, నాల్గువ బహుమతి రూ.30 వేలు, ఐదవ బహుమతి రూ.15 వేలు ఇవ్వనున్నారు. అలాగే 16, 13 మనుముల రాతి గుండు ఎత్తిన వారికి బహుమతులు ఉన్నాయి. -
రథోత్సవానికి రంగులు దిద్దుకుంటున్న రథం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జరగబోవు రథోత్సవానికి ఒంటిమిట్ట రామయ్య రథం నూతన రంగులతో మెరుగులు దిద్దుకుంటుంది. టీటీడీ సివిల్ విభాగం అధికారులు రథోత్సవానికి ఒంటిమిట్ట రథాన్ని పూర్తి స్థాయిలో దృఢంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతలో గుత్తేదారుడు కట్టా సుబ్బరాయుడు రాజీ పడకుంగా శరవేగంగా పూర్తి చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. రథోత్సవానికి ముందే ఒంటిమిట్ట రథాన్ని అన్ని విధాలా సిద్ధం చేసి ఉంచాలని టీటీడీ సివిల్ విభాగం అధికారులు గుత్తేదారుడిని ఆదేశించారు. -
వదినపై మరిది దాడి
రాజంపేట : పట్టణంలోని నూనివారిపల్లెలో నివసిస్తున్న సింగనమల శిరీషపై భర్త తమ్ముడు సింగనమల శ్రీను దాడి చేసినట్లు గురువారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగనమల శిరీష, రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అత్తగారింటిలో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త నూనివారిపల్లెలో ఇల్లు తీసుకొని, తన భార్యను అక్కడి పెట్టి, కువైట్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మరిది ఆసరా తీసుకొని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడన్నారు. దీంతో మరిది వదినపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఆమెను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు కడప రిమ్స్కు రెఫర్ చేశారు. రిమ్స్లో చికిత్స తీసుకొని, నేరుగా రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్కు వచ్చారు. మీడియా ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వివరించారు. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అగ్నిప్రమాదం రూ.1.50 లక్షల నష్టం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో గురువారం షార్ట్ సర్య్కూట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కొత్తమాధవరంలోని రాముడి గుడివీధిలో ఉన్న ఎన్.వెంకటసుబ్బయ్య ఇంటిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో షార్ట్ సర్య్కూట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఇంటి నివాసులు బయటికి పరుగులు తీశారు. మంటలు ఎక్కువ కావడంతో ఇంటిలోని కూలర్, ఎల్ఈడీ టీవీ, రైస్ కుక్కర్, బట్టలు టేబుల్ ఫ్యాన్, సెల్ఫోనులు దగ్ధం అయినట్లు ఇంటి యజమాని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.లక్ష 50 వేలు ఉంటుందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన శ్రీకాంత్(27) గురువారం ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు బయలుదేరాడు. సిద్దవరం మలుపు వద్దకు వెళ్లాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి శ్రీకాంత్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. -
ఒంటిమిట్టలో.. ఉగాది వేడుకలు
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురువారం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మూలమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, సుగంధపరిమలమైన తులసీ గజమాలతో సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునుంచే భక్తులు స్నానాలు ఆచరించి స్వామి దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరారు. సాయంత్రం సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. అలరించిన పంచాంగ పఠనం: టీటీడీ ఆధ్వర్యంలో ఆస్థాన పురోహితులు ఏలేశ్వరం గురుస్వామి, మధు స్వామి శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ పఠనం చేశారు. ఈ సంఏడాదిలో అహంకారాన్ని జయించి, వినయా న్ని అలవర్చుకోవాలని, ఆత్మపరిశీలన ద్వారా ఆత్మోన్నతిని సాధించాలని సూచిస్తుందన్నారు. టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


