breaking news
YSR
-
కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ పుణ్యమే. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. -
‘మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని.. తన జెండా, తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని.. ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుంది. వారి పాలనలో ఆలోచనలు కూడా అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి’’ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.‘‘మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.. ఈ మూడు పార్టీలకు విడిగా వైఎస్సార్సీపీనీ ఓడించే బలం ఉందా..?. వారికి సొంతగా గెలిచే బలం లేదు కాబట్టే మూడు పార్టీలు జత కట్టాయి. మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు. మీరు మూడు పార్టీలు కలిసి ప్రజలకు ఏమైనా మేలు చేశారా...?. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కేవలం చంద్రబాబు ఇచే ప్యాకేజీతో నోరు మూసుకున్నాడు. నువ్వు జగన్ చేతిలో రేఖలు తుడుపుతావా..?. ఓ పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదు. నువ్వు జగన్ను ఏమి చేయగలవు..?’’ అంటూ రాచమల్లు నిలదీశారు.‘‘ఈ దేశంలో చంద్రబాబు అంత అవకాశవాది ఎవరూ లేరు. ఆయన జత కట్టని పార్టీ లేదు.. ఆయనకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది. బీజేపీ పెద్ద ముత్తయిదువు పాత్ర.. ఏమీ చేయలేదు కానీ పేరుకు ఉంటుంది. 2 శాతం, 30 శాతం ఓట్లు ఉన్న వీళ్లు 40 శాతం ఓట్లున్న జగన్ను ఏమీ చేయలేరు. అందుకే జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు అని వాళ్లే అంటున్నారు. వీళ్లెవరికీ జగన్ను ఢీకొట్టే పరిస్థితి లేదని వాళ్లకే తెలుసు. మీ మేనిఫెస్టోను ఆనాడు బీజేపీ ముట్టుకోలేదు. కానీ జగన్ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు’’ అని రాచమల్లు గుర్తు చేశారు.‘వీళ్ళంతా రాజకీయంగా అవిటి వాళ్ళు.. ఒకరి ఊతం లేనితే మరొకరు లేరు. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక్క వైఎస్ జగన్ మాత్రమే చేశాడు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కడు కాబట్టే.. సొంత ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టాడు. జగన్ పొత్తుకు పోలేదంటే నైతిక విలువలు ఉన్నాయని అర్థం.. తన పాలనని నమ్ముకున్నాడు. ఓటమిని ఆహ్వానించాడు. కష్టాలను ఆహ్వానించాడు కానీ తలొగ్గలేదు. అలాంటి విలువలు కలిగిన జగన్ మా నాయకుడు అయినందుకు గర్వపడుతున్నా. నా శ్వాస ఆగిపోయేంత వరకు జగన్ తోనే నా ప్రయాణం..2029 వస్తుందంటే మీ దడ పుడుతోంది..జనంలో జనం బలమెంతో మీకు తెలుసు. అందుకే మీరు గెలిచినా మీకు ఆదరణ లేదు.. జగన్ ఒడినా ఆదరణ ఉంది. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. తమ ఓట్లకు, సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుంది..?. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే అన్నమయ్య జిల్లా రాకుండా ఉంటుందా?. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదు’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నందలూరు– మంటపంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(34) తిరుమల దర్శనం ముగించుకుని కేప్ పూణే ఎక్స్ప్రెస్ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు నుంచి జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ముఠా సభ్యుల అరెస్టు గుర్రంకొండ : గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదుకేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు గుర్రంకొండ పట్టణ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారం అందుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబుల ఆధ్వర్యంలోని రెండు వేర్వేరు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం గ్రామానికి సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన కనగాని వెంకటరమణ (40), స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుటం సమీర్ (20), గుర్రంకొండ పట్టణం ఎస్ఎల్టీ వీధికి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్ (19), తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లెకు చెందిన అరుణ్కుమార్ (19)లతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాల్మికిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రవీంద్ర, హెడ్కానిస్టేబుల్ నాగరాజనాయక్లను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. ముగ్గురు మండీ యజమానులకు నోటీసులు గుర్రంకొండ : ప్రభుత్వ నిబంధనలను పాటించని ముగ్గురు టమాటా మండీల యజమానులకు నోటీసులు జారీచేశామని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ అలీ తెలిపారు. ఆదివారం స్థానిక మార్కెట్యార్డు ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు మార్కెట్ యార్డుకు 8 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ కూడా ప్రైవేట్ టమాటా మండీలను నిర్వహించకూడదన్నారు. అలా నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మదనపల్లె మార్కెట్యార్డులో జాక్పాట్లను ఫూర్తిగా రద్దు చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇక్కడి మండీల యజమానులు పాటించాలన్నారు. కమీషన్లు పదిశాతం బదులు నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. వచ్చేనెల నుంచి 25 కేజీల టమాటా క్రీట్ల స్థానంలో 15 కేజీల క్రీట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. తండ్రి కోసం.. కుమారుడి మృతదేహం ఎదురుచూపుకురబలకోట : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందిన కుమారుడి మృతదేహం సౌదీలోని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న విషాదకర సంఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..మండల కేంద్రం కురబలకోటకు చెందిన కె. తన్వీర్ (24) మూడు రోజుల క్రితం మదనపల్లి నుండి బైక్లో స్వగ్రామానికి వస్తూ మార్గ మధ్యంలోని గౌనివారిపల్లి వద్ద ప్రమాద వశాత్తు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. జీవనోపాధి కోసం సౌదీలో ఉన్న తండ్రి కె. రెడ్డిబాషా రాక కోసం మృత దేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కురబలకోటలో విషాదం -
చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జమానాలో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీసీలకు ద్రోహం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు రూ. 4000 పింఛన్ ఇస్తానని ఇవ్వలేదని, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
ఆర్ఎస్ఎస్, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం
మదనపల్లె : దేశ అత్యున్నత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చెర్మన్ డాక్టర్ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ ముసుగు వేసుకున్న దోపిడిదారులకు అప్పగిస్తున్నారని, సహజ వనరులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అన్నారు. ప్రకృతి సంపదను అదానీకి దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ నేతలు ఎన్నో నిర్బంధాలు, కుట్ర కేసులు ఎదుర్కొన్నారని, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్ల పైన, ధరించే దుస్తులపైన ఆంక్షలు విధిస్తూ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తారా సహజ సంపదను కొల్లగొట్టడానికే ఆపరేషన్ కగార్ మదనపల్లె సదస్సులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమీషన్ చెర్మన్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య -
గాండ్ల తెలికుల హక్కుల సాధన కోసం పోరాటం
కడప ఎడ్యుకేషన్ : గాండ్ల తెలికుల హక్కుల సాధనే తమ ఎజండా అని హక్కుల సాధన కోసం ఎంతవరకై నా పోరాడుతామని అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం(ఏజీటీయూపీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ పేర్కొన్నారు. కడప నగరంలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్న సమావేశం మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకట విజయభాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో గాండ్ల తెలికులకు పాలకమండలి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ఇవ్వాలన్నారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో కూడా గాండ్ల తెలికులకు కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ సమాజంలో గాండ్ల తెలికులను కూడా అన్ని కులాలతో పాటు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీటీయూపీఎస్ఎస్ వ్యవస్థాపకుడు గిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముక్కెర హరినాథ్, ట్రెజరర్ యాదాటి శివప్రసాద్ , అనంతపురం జిల్లా అధ్యక్షుడు సిగిచర్ల నాగరాజు, జిల్లా గౌరవాధ్యక్షుడే కొసినేపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కోశాధికారి వీరపు లక్ష్మిపతి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులను యంత్రాలుగా భావిస్తూ, నిరంతరం బోధనేతర కార్యక్రమాలతో విద్యా బోధనకు దూరం చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. కడప యూటీఎఫ్ భవన్లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యాశక్తి పేరుతో వందరోజుల ప్రణాళిక రూపొందించి, పండుగలు, సెలవు దినాలలో పనిచేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించి, అదే రోజు సాయంత్రానికల్లా మార్కులు ఆన్లైన్లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదన్నారు. ముస్తాబు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకు తగినంత సమయం కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రణాళిక రూపొందించాలి కానీ ముస్తాబు, బోధనేతర పనుల ద్వారా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని హరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వెనుక ప్రభుత్వ విద్యా రంగాన్ని పతనావస్థకు తీసుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పథకానికి తూట్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే పద్ధతిలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.వేణుగోపాల్ విమర్శించారు. సీపీఐ వందేళ్ల వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రామరాజుపల్లెలో సీపీఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకై క పార్టీ సీపీఐ అన్నా రు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారన్నారు. ఇలాంటి మహానుభావులను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండి పడ్డారు. దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ సంపదనంతా అంబానీ, అదాని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. -
● తాగుబోతుల లోకం
● ఆటో.. ఇటో.. ఎటో.. కడప నగరంలో రోజురోజుకు ఆటోల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పాత బస్టాండ్, చెన్నూరు బస్టాండ్, వైవీ స్ట్రీట్, కృష్ణాసర్కిల్, సంధ్య సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్, అప్సర సర్కిల్, బిల్టప్, ఐటీఐ వద్ద ట్రాఫిక్ సమస్య ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో ప్రజలు సమయానికి గమ్యం చేరలేక పోతున్నారు. ట్రాఫిక్ సమస్యపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.రాష్ట్రంలో నాణ్యమైన మందు పేరిట కల్తీ మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా బార్లు, మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యానికి బానిసలుగా మారుతున్న వారు అధికమవుతున్నారు. ఫలితంగా వారిపై ఆధారపడిన కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం కావాలి. అంతే తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైనా పట్టదు. దీంతో మందు బాబులు ఎక్కడ పడితే అక్కడ తప్ప తాగి రోడ్లపై పడిపోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
అన్నమయ్యకు అన్యాయం చేయొద్దు
రాజంపేట : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు అన్నమయ్య నామకరణం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య పేరు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రతిపాదనలపై రాజంపేట ప్రాంతీయుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద.. ఆదివారం సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్యకు అన్యాయం చేయవద్దంటూ చేసిన నినాదాలతో మార్మోగిపోయింది. రాజంపేట జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యమకారులు వినూత్న నిరసన తెలిపారు. అన్నమయ్య చరిత్ర కనుమరుగుచేయకండి.. రాజంపేట పార్లమెంటరీ కేంద్రంతో పుట్టిందని, సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉందని న్యాయవాదుల జేఏసీ నేత కొండూరు శరత్కుమార్రాజు అన్నారు. ఆదివారం అన్నమయ్య ఉద్యానవనంలో మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య పేరును తీసేయాలని ఆలోచన నిజమైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అధికారుల మాటలను పక్కనపెట్టి, అన్నమయ్య సెంటిమెంట్ను గౌరవించి, పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పూలభాస్కర్, ప్రభాకర్నాయుడు, సికిందర్, నందకిషోర్గౌడ్, చల్లా సుధాకర్, రెడ్డయ్య, గుత్తా లతచౌదరి, కేఎంఎల్ నరసింహులు, కొండూరు విశ్వనాథరాజు, శివరామరాజు, జీవీసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని.. అన్నమయ్య పేరు లేకుండానే చేస్తున్నారంటూ ఉద్యమకారులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు.అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్న నిరసన -
జానపదంలో మేటి పరిశోధకుడు ‘పేటశ్రీ’
కడప ఎడ్యుకేషన్: జానపద పరిశోధనలో అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడమేగాక, విద్యార్థులచే పరిశోధనలు చేయించిన మేటి పరిశోధకులు ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి అని మైదుకూరు తెలుగు అధ్యాపకుడు డాక్టర్.కోడూరు జయప్రకాశ్ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ’నెలనెలా సీమ సాహిత్యం’ 150వ సదస్సులో భాగంగా ’ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి జీవితం– సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఆదివారం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి (పేటశ్రీ) కథారచయితగా, జానపద పరిశోధకులుగా, విమర్శకులుగా తనదైన శైలిలో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పేటశ్రీ జానపద సాహిత్యంపై విమర్శనా గ్రంథాలు రాయడమే కాక అనేక గేయాలను సంకలనం చేసి ప్రచురించారన్నారు. 150 కథలు, వివిధ పత్రికల్లో 230 వ్యాసాలు రాశారన్నారు. చిత్తూరు జిల్లా జానపద విజ్ఞానం, తెలుగు ఐతిహ్యాలు, తిరుపతి కథలు, తిరుమల కథలు, తిరుమల–తిరుపతి కథలు, గొబ్బి పాటలు, జానపద గేయాల్లో శ్రీకృష్ణుడు’ లాంటి అనేక రచనలు చేశారన్నారు. కార్యక్రమాన్ని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమ ప్రారంభంలో వక్త డాక్టర్ కోడూరు జయప్రకాశ్ను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, సిబ్బంది, ఎస్. సుబ్బరాయుడు, కొత్తపల్లె రామాంజనేయులు, కృష్ణానందం, కందిమళ్ల రాజారెడ్డి తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్, చంద్రశేఖరరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ముడియం కిశోర్ కుమార్, నాగిరెడ్డి, రఘునాథ రెడ్డి, మల్లేష్, దక్షిణామూర్తి, లక్ష్మిరెడ్డి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మా కుమార్తె ఆచూకీ తెలపండి
ప్రొద్దుటూరు కల్చరల్ : వారం రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలని సీతం పల్లెకు చెందిన కొల్లుబోయిన వీరప్రతాప్, వెంకటలక్షుమ్మ దంపతులు కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమార్తె ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కనిపించకపోవడంతో అంతా వెతికామన్నారు. తర్వాత రోజు ఉదయం చాపాడు మండలం రామదాసుపల్లెకు చెందిన రాకేష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలువగా మహిళా పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారన్నారు. వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ కుమార్తె బతికుందో లేదో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుగొనాలని కోరారు. కడపలో అగ్నిమాపక శాఖ క్రీడలు కడప అర్బన్ : కడప నగరంలో అగ్నిమాపకశాఖ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం క్రీడలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈనెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అక్కడ ఎంపికై న వారిని రాజస్థాన్లో జరిగే నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్కు పంపిస్తామని కర్నూలు రేంజ్ ఆర్ఎఫ్ఓ భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ధర్మారావు, ఏడీఎఫ్ఓ బసివి రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని యువకుడి మృతిరాజుపాళెం : మండలంలోని అయ్యవారిపల్లె–టంగుటూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వంగల నూర్ బాషా (25) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు టంగుటూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన నూర్బాషాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. కబ్జాలను అడ్డుకోండిసాక్షి టాస్క్ఫోర్స్ : బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1107, 1109లో అగ్రవర్ణాల వారు దళితుల భూములను లాక్కుని కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ గ్రామ దళితులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను దళితవాడ గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు నాలుగు ఎకరాల భూమిలో చదును చేసి బోరు కూడా వేశారు. -
షూటింగ్బాల్ ఛాంపియన్షిప్లో జిల్లాకు తృతీయ స్థానం
మదనపల్లె సిటీ : రాష్ట్ర సీనియర్ షూటింగ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈనెల 25 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంది. మహిళల విభాగంలో 19 జట్లు పాల్గొన్నాయి, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో అన్నమయ్య జిల్లా జట్టు కాకినాడ జట్టు తలపడ్డాయి. 21–15 స్కోరుతో మూడవ స్థానం దక్కించుకున్నట్లు షూటింగ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. పురుషుల జట్టు కూడా సెమీఫైనల్స్ చేరుకుని కృష్ణ, పల్నాడు జిల్లాల జట్లుతో ఆడి నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాకారులను జట్టు కోచ్ యూసఫ్, మేనేజర్ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్బాబు, సభ్యులు రెడ్డి శ్రీనివాస్, భారతి, సురేష్ తదితరులు అభినందించారు. -
భూపేష్.. బోగస్ కమిటీల భరతం పట్టాలి
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన భూపేష్ సుబ్బరామిరెడ్డి అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కోరారు. ఆదివారం స్థానిక అల్మాస్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయచంద్ర, మహమ్మద్ షా, కొండ్రెడ్డి జనార్దన్రెడ్డి, కొండా సుబ్బయ్యలు మాట్లాడారు. మొన్నటివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని జెండాను మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కడప నగర కమిటీకి అధిష్టానం నుంచి ఆమోదం తెలుపలేదన్నారు. అయితే శ్రీనివాసులురెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి తాను నియమించుకున్న కమిటీని అఽధికారికంగా ప్రకటించడం దారుణమన్నారు. అలాగే జిల్లా కమిటీలో కూడా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపుదారులతో నింపేశారన్నారు. జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి ఈ కమిటీలను పరిశీలించి వాస్తవాలను గ్రహించి పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరారు. -
వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి సీతారామలక్ష్మణులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్ల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, టీటీడీ ఆలయ సివిల్ విభాగం ఏఈ అమర్నాథ్రెడ్డి తెలిపారు. కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. పాత పీజీఆర్ఎస్లో నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం పాత పీజీఆర్ఎస్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’వెబ్సైట్లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలియజేశారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు. సాక్షి కథనంపై ‘రెవెన్యూ’లో కదలిక – నీటి మునక ప్రాంతం పరిశీలించిన అధికారులు కడప కార్పొరేషన్ : జిల్లా కేంద్రమైన కడపలో కొత్త కలెక్టరేట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న వైనంపై ఈనెల 28వ తేది ‘బాబోయ్ బూచోళ్లు’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై రెవెన్యూ శాఖలో కదలిక వచ్చింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆదివారం డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓ లు ఎన్టీఆర్ నగర్ వద్దనున్న ప్రభుత్వ భూమి (నీటి మునక) ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ వంక వెంబడి గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్న సమయంలో మార్కింగ్ వేసి కొన్నింటిని కూల్చివేశారు. తాజాగా కాలువకు అడ్డంగా మరికొన్ని ఆక్రమ కట్టడాలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబర్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది రెవెన్యూ రికార్డుల్లో నీటి మునక, వంక పొరంబోకుగా ఉంది. దీనిపై ప్రైవేటు వ్యక్తులకు, రెవెన్యూ శాఖకు మధ్య చాలా ఏళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లు విలువజేసే ఈ భూమిపై అ ధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు జరిపిన పరిశీలనలో కూడా వారు తమ వద్ద పొజిషన్ పత్రాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. -
సమస్యలకేదీ పరిష్కారం?
కడప సెవెన్రోడ్స్ : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా మారింది. క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో కలెక్టర్కు మొర పెట్టుకుంటే సమస్యలు తీరుతాయన్న కొండంత ఆశతో వ్యయ ప్రయాసలు కోర్చి జనం గ్రీవెన్స్కు బారులు తీరుతున్నారు. అధికారుల ఎదుట తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఫిర్యాదులు అధికంగా వచ్చే మొదటి పది శాఖల్లో రెవెన్యూ అగ్రగామిగా ఉంటోంది. మొత్తం వచ్చే ఫిర్యాదుల్లో భూమి సమస్యలే అత్యధికంగా ఉంటున్నాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. అర్జీల పరిష్కారానికి సంబంధించి అధికారులు చూపెడుతున్న గణాంకాలు క్షేత్ర స్థాయి వాస్తవాలకు బిన్నంగా ఉన్నాయి. ఆర్థికేతర అంశాలు సైతం పరిష్కారం కావడం లేదు. దీర్ఘకాల భూ సమస్యలు పరిష్కరించేందుకంటూ బుధవారం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ వల్ల కూడా ఫలితం కనిపించడం లేదు. జవాబుదారి తనం, పారదర్శకత, గడువులోపు అర్జీల పరిష్కారం వంటివి మాటలకే పరిమితం అవుతున్నాయి. దీంతో అర్జీదారులు వచ్చిన వారే మళ్లీ గ్రీవెన్స్కు రావడం సర్వసాధారణంగా మారింది. రెవెన్యూ క్లినిక్స్, జీరో టాలెరెన్స్ విధానం, ఆడిట్ వంటి పొద్దుపోని మాటలతో ప్రభుత్వం, అధికారులు ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమి సమస్యలే అత్యధికం రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)కు సంబంఽధించి భూమి స్వభావం, వర్గీకరణ, విస్తీర్ణ సవరణకు సంబంధించిన అర్జీలు అధికంగా ఉంటున్నాయి. తర్వాత మ్యూటేషన్స్, ఇంటిపట్టాలు, రీ సర్వేకు సంబంధించి ఆర్ఓఆర్ డేటా సవరణలు, నిరుపేదలు, మాజీ సైనికులకు ప్రభుత్వ భూముల అసైన్మెంట్, ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణలు వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, గోపవరం మండలాల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోరుమామిళ్ల మండలంలో బెంగళూరు–విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో సర్వే నంబర్ 72లో ఆర్ఎస్ఆర్ దాఖలా మేరకు 146 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ భూమిని సర్వే నంబర్ 73 అని చూపెట్టి ఇతరుల పేరుతో ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఈ విషయంపై హైకోర్టులో రిట్ పిటీషన్ సైతం దాఖలు చేసినట్లు చెబుతున్నారు. పోరుమామిళ్లమండలంలో మచ్చుకు రెండు సమస్యలను పరిశీలిస్తే... ప్రహసనంగా పీజీఆర్ఎస్ పేరుకుపోతున్న ఫిర్యాదులు భూ సమస్యలే అత్యధికం -
●యూరియా కోసం పాట్లు..
● ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే ● చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. రైతులకు శాపం ● యూరియా దొరకక అవస్థలు కడప అగ్రికల్చర్ : పట్టెడన్నం పెట్టే రైతన్నలకు ఈ ఏడాది కాలం కలిసిరాలేదు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ కష్టాల కడలిలో ఎదురీదారు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రతో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి.పెట్టుబడులు రాక భారీగానష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు చంద్రబాబు సర్కార్ నిర్వాహకంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి.పంటలకు గిట్టుబాట ధరలు కూడా లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్లో సకాలంలో వర్షాలు లేక సాగు మందకొడిగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది రైతులకు సరిగా కలిసి రాలేదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో... జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు వరిపంట నేలకొరిగింది. చిరుపొట్ట దశలో ఉన్న పంటంతా దెబ్బతిని తాలు గింజలు ఏర్పడ్డాయి. కొన్ని కోట్ల వరికంకి సుంకు కాలిపోయి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వరితోపాటు వేరుశనగ, మినుము, కంది, మొక్కజొన్నకు సంబంధించి 2242.7 ఎకరాల్లో, అలాగే ఉల్లిపంటకు 158 హెక్టార్లలో నష్టం జరిగింది. మోంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలతో జిల్లాలో 7500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రుపాయి కూడా విదల్చలేదు. తర్వాత కురిసిన అధిక వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు. ఉల్లిపంట ఊడ్చిపెటుకుపోయింది.. జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయం. జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోయారు. చాలా మందికి సాగు ఖర్చులు కూడా రాలేదు. చంద్రబాబు సర్కార్ మాత్రం జిల్లాలో రెండు ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పంది. దీనిపై వామ పక్షాలు అందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు క్వింటాకు రూ.1200 మద్దతు ధర ప్రకటించినా ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ ధరకు కొనుగోలు చేసే వాళ్లు లేక రైతులు నష్టాపోయారు. చివరకు క్వింటా ధర రూ. 400 నుంచి రూ.200కు పడిపోయింది. దీంతో రైతులు పంటను పొలంలోనే వదిలేశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ఉల్లిరైతు పూర్తిగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వర్షాలకు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తామని చెప్పి కర్నూలు జిల్లాకు ప్రకటించింది. రైతులు ఆందోళన చేయడంతో కడప జిల్లాకు కూడా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఒక్క రైతుకు కూడా చెల్లించలేదు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం... విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్వార్ అధికారంలోకి రాగానే వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కానీ పేరుకు తగ్గ సేవ మాత్రం అందించలేక పోయింది. దీనికితోడు రేషనలైజేషన్ పేరుతో కొన్ని రైతు భరోసా కేంద్రాలను మూసి వేసింది. మిగిలిన వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో లక్ష్యం నీరుగారి పోయింది. ఉచిత పంటల బీమాకు మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటలబీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. ప్రీమియం ఎప్పుడు చెల్లించాలో తెలియక చాలా మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లింకలేకపోయారు. గత వైఎస్సార్సీసీ పాలనలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది.అన్నదాతలు ఎలాంటి దిగులు లేకుండా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గదెనెక్కగానే ఉచిత పంటల బీమాకు చెల్లు చీటి పాడింది. ఆరుతడి పంటలైన అరటి, ఉల్లి, టమాట పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు. దీనికి తోడు సాధారణ రైతులకు కూడా ఒక ఏడాది అన్నదాత సుఖీభవ నిధులను ఎగరకొట్టారు. అలాగే కౌలు రైతులకు మెండిచేయి చూపిస్తూ అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయక పోవడంతో వారు పూర్తిగా నష్టపోయారు. ఇలా 2025 జిల్లా రైతుల పాలిట చీకటి సంవత్సరంగా మారింది. వర్షాభావంతో ఎండిపోయిన పంటను దున్నేస్తున్న రైతు(ఫైల్) మోంథా తుపాను వర్షాలకు నీటి మునిగిన వరిపంట(ఫైల్) ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపులు, రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.అయినా ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. అది సరిపోక బ్లాకులో కొద్దామంటే దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం అందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం సరిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. చివరకు కొంతమంది రైతులు బ్లాకులో కొనుక్కొని అవసరాలను తీర్చుకున్నారు. -
అక్రమంగా ఆన్లైన్ చేశారు
గ్రామ పొలం సర్వే నంబర్ 413లో 0.91 సెంట్ల భూమిని 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓర్సు చిన్నయ్య అనే వ్యక్తి బత్తుల తిరుపాలమ్మ అనే మహిళకు సర్వే నంబర్ 416,417లో కొంత భూమిని విక్రయించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పొరపాటున నా సర్వే నంబర్ 413 నమోదు చేశారు. ఈ పొరపాటును సవరించుకోవాలని బత్తల తిరుపాలమ్మ, నేను అనుకున్నాం. ఇంతలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తిరుపాలమ్మ కుమారుడు శివకుమార్ను ఎగదోయడంతో డాక్యుమెంట్ సవరణ ఆగిపోయింది. నేను జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు వేయగా అది నడుస్తోంది. అలాగే 2021లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. సర్వే నంబర్ 413లోని భూమి నా అనుభవంలోనే ఉన్నట్లు గతంలో తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ కూడా ఉంది. ఓవైపు రిట్ పిటీషన్, జేసీ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి నవంబర్లో శివకుమార్ పేరిట ఆన్లైన్ చేశారు. ఆ భూమిని తహసీల్దార్ ప్రత్యేక శ్రద్దతో తుపాకుల ప్రసాద్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. పలుమార్లు నా సమస్యను అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. – గంపా చలపతి, నరసింగుపల్లె, పోరుమామిళ్ల మండలం గ్రామ పొలం సర్వే నంబర్ 205/5లో 2.13 ఎకరాల భూమి నా పేరిట ఉంది. 2012లో సబ్ డివిజన్ కూడా జరిగింది. నా భర్త జి.శ్రీనివాసులు ప్రొద్దుటూరు టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కాగా, మా భర్త అన్న హద్దులు చెరిపేసి మా భూమి ఆక్రమించారు. సర్వే చేసి హద్దులు నిర్దారించాలని ఆరుసార్లు చలనా కట్టగా, ఆరుసా ర్లు మా బావకు నోటీసులు ఇచ్చారు. అయితే తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సర్వేయర్ కోనయ్య, వీఆర్వో సుబ్రమణ్యం సర్వే జరగకుండా అడ్డు పడుతున్నారు. మా భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ విషయంపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆగ్రహించిన మా బావ మా ఇల్లు కూల్చి వేయించారు. ఎస్ఐ కేసు తీసుకోలేదు. మైదుకూరు డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే మాపైన కౌంటర్ కేసు నమోదు చేయించారు. – రమణమ్మ, రామేశ్వరం, పోరుమామిళ్ల -
రాయచోటిలో బంద్ ప్రశాంతం
● స్వచ్ఛందంగా దుకాణాలు మూత ● రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంచాలని ఉధృతమైన ఆందోళనలు రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలను దిక్కుకొకటి చొప్పున కలుపుతున్నారన్న వార్తల ప్రచారంపై రాయచోటిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై రాయచోటిలో ఒక్కసారిగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. రెండురోజులుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన రాయచోటి బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్కు సంపూర్ణ మద్దత్తును ప్రకటించారు.ఉద్యోగులు, ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు బంద్కు మద్దతుగా నిలిచారు. బంద్ ప్రభావంతో ఉదయం పది గంటల వరకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రాయచోటిలోని శివాలయం చెక్ పోస్టు నుంచి చిత్తూరు జాతీయ రహదారి మీదుగా నేతాజీ సర్కిల్ వరకు సాగింది. అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. జిల్లా విభజన చేయాలన్న ఆలోచన కూటమి నేతల కుట్రలో భాగమేనని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతోపాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా బహిర్గతం అవుతున్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆత్మహత్యలకై నా సిద్ధమని యువకులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంపై ఆదోళనలను ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సాధన కమిటీ నాయకులు చెబుతున్నారు. -
కులాలు విస్మరించి ఐక్యత చాటాలి
పోరుమామిళ్ల : వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ సమాజంలో కుల వివక్షకు స్థానం లేదని, 17 వ శతాబ్దంలో ఆంగ్లేయులు దేశంలో ప్రవేశించాకే విభేదాలు చోటు చేసుకున్నాయని స్వామి శివరామానందసరస్వతి, సూర్యనారాయణ(హైదరాబాద్), కిషోర్ (ధర్మవరం), శ్రీమతి భక్తవత్సల పేర్కొన్నారు. కులాల మధ్య విభేదాలు విస్మరించి హిందువులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఆదివారం పోరుమామిళ్ల పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన హిందూ సమ్మేళన సభలో వారు మాట్లాడారు. కులం ఇంట్లోనే ఉండాలని, గడప దాటితే అందరం హిందువులమని, కులాల అడ్డుగోడలు ఉండకూడదన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీలాగా, వివేకానందుడిలాగా ధర్మపోరాటం చేయాలని కోరారు. అంతకు ముందు పట్టణ ఉత్తర శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి పట్టణ దక్షణ శివారులోని పద్మావతి కల్యాణ మండపం వరకు ప్రదర్శన సాగింది. కళాకారులు కోలాటం చేస్తుండగా పలు పాఠశాలల విద్యార్థులు సీతారాములు, లక్ష్మణ, హనుమంత, శివుడు, భరతమాత, ఛత్రపతి, రాణిరుద్రమ, వివేకానందల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ర్యాలీలో వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది పాల్గొన్నారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం పోరుమామిళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి. పోరుమామిళ్లలో హిందూ సమ్మేళనం -
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
● చేతిరాత పరీక్షల్లో ‘కీ’లకం ● టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఆసన్నమైన సమయం ● విద్యార్థులు దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు ● ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతపై సాధన చేయిస్తున్న ఉపాధ్యాయులురాజంపేట టౌన్ : టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు టైమ్టేబుల్ కూడా వచ్చేసింది. అత్యుత్తమ మార్కులు సాధించి మంచి గ్రేడింగ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు ఓ ప్రణాళికను సైతం రూపొందించుకొని చదవడం ప్రారంభించారు. అయితే ఏడాది పాటు చదివిన విషయాలను జవాబు పత్రంపై రాసే విధానం వల్ల కూడా మార్కులు, గ్రేడింగ్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించే విద్యార్థులు తక్కువ మంది మాత్రమే ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో చేతిరాత కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చేతిరాత నిపుణులు సూచిస్తున్నారు. చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒకమార్కు లేదా అర్ధ మార్కు అయినా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గ్రేడింగ్ పాయింట్స్పై ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు నెలలలోపే సమయం ఉండగా, టెన్త్ పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు రోజుకు అర్ధగంట అయినా చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతిరాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే.. ● ప్రతి విద్యార్థి ఆన్సర్షీట్ (బుక్లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి. ● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. ● ఒక లైనుకు మరో లైనుకు సెంటీమీటర్ గ్యాప్ ఇవ్వాలి. ● పదానికి, పదానికి తగనంత (ఒకటి లేదా రెండు అక్షరాల) స్పేస్ ఇవ్వాలి. ● బుక్లెట్లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి. ● కంటికి, పేపరుకు 30–35 సెంటిమీటర్ల దూరం ఉండాలి. ● బొటన వేలు, మూడవ వేలికి మధ్య చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రాసే సమయంలో పెన్ను స్పీడుగా ముందుకు కదులుతుంది. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. ● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీఓ) ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కడప పర్యటనలో భాగంగా ఆయన ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. అనంతరం వై.జంక్షన్ నుంచి దీక్షా శిబిరం వరకు ర్యాలీగా వచ్చి దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు డీపీటీఓ తీరుతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ప్రతి చిన్న అంశానికి సస్పెన్షన్లు, ఛార్జిషీట్లు, పనిష్మెంట్ల విధానాన్ని అమలు చేయడం దారుణమన్నారు. డీపీటీఓ వ్యవహారంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పదోన్నతుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముందుగానే డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉండగా, ఉన్న కార్మికులను నెలల తరబడి విధులకు దూరంగా ఉంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీ శివారెడ్డి, శ్రీనివాసరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేష్కుమార్, పీఎస్ఎన్ రావు, జోనల్లోని వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లాలోని ఆరు డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం పాణ్యం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప నగరానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన నాగార్జున రెడ్డి, పద్మావతి దంపతుల కుమారుడు అవినాష్రెడ్డి(22) హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన అవినాష్రెడ్డి పనులు ముగించుకు శనివారం కారులో తల్లితో కలసి హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యంలో పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్దకు రాగానే మలుపు వద్ద కారు అదుపు కాక సూచిక బోర్డును ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో నంద్యాల జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అవినాష్రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద సమయంలో కారులో రెండు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పద్మావతి గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు -
ప్రీ క్వార్టర్ ఫైనల్ విజేత సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 34 పరుగుల తేడాతో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. ఆంధ్రా జట్టు బ్యాట్స్మన్ హానీష్ రెడ్డి 245 (డబుల్ సెంచరీ) చేశాడు. మిగతా బ్యాటర్లు చతికిల పడి బ్యాటింగ్లో రాణించలేకపోయారు. నాలుగో రోజు సౌరాష్ట్ర జట్టు 452 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. నిర్ణీత 118.5 ఓవర్లకు 483 పరుగులు చేసింది. ఆ జట్టులోని వాత్సల్ పటేల్ 62 పరుగులు చేశాడు. 522 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత ఓవర్లకు 488 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. హానీష్ వీరారెడ్డి 206 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 245 పరుగులు (డబుల్ సెంచరీ) చేశాడు. ఆనంద్ జోష్ 50 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర జట్టులోని పుష్పరాజ్ జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, మోహిత్ ఉల్వా 2 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 488 పరుగులు చేసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 483 పరుగులు చేసింది, ఆంధ్రా జట్టులో బ్యాటింగ్లో రాణించి 245 పరుగులు చేసిన హానీష్ వీరారెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ అందజేశారు.విజృంభించిన ఆంధ్రా బౌలర్లు -
ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్లో శనివారం పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఆయుధ నైపుణ్యాలను పరీక్షించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫైరింగ్లో ప్రతి ఒక్కరు పాల్గొని మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప మహిళలు జిల్లాను ప్రపంచ ఖ్యాతికి ఎక్కించారు. ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్లో జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రతిభ చాటింది. దేశానికి కప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరో విద్యార్థిని గుర్రాల హరిణి ముందుకు వెళుతోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీల్లో సత్తాచాటింది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన గుర్రాల హరి, అరుణ దంపతుల కుమార్తె హరిణి పదో తరగతి వరకు చెమ్ముమియ్యాపేటలోని గంగా భవాని బాలికల హైస్కూల్లో చదివింది. ఇంటర్మీడియట్ కడప నగరంలోని శ్రీహరి జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆల్ రౌండర్ అయిన గుర్రాల హరిణి ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీల్లో కడప జట్టు తరుపున ఆడి సత్తా చాటింది. శ్రీకాకుళం జట్టుపైన 22 బంతులకు 57 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. అటు బ్యాటింగ్లోను, ఇటు ఫాస్ట్ బౌలింగ్లోను రాణిస్తూ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కడపలో ‘శంబాల’ యూనిట్ సందడికడప కార్పొరేషన్ : కడప నగరంలో ‘శంబాల’ యూనిట్ సందడి చేసింది. ఆ సినిమా హీరో, హీరోయిన్లు ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, సినీనటుడు సాయికుమార్లు ఎస్ఆర్ థియేటర్కు వచ్చారు. వారికి రాక్స్టార్ ఆది యువసేన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్. యూనుస్ బాషా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు థియేటర్ వద్ద అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్లో నిర్వహించిన మీట్లో వారు మాట్లాడుతూ కడపకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కడప ప్రజలు చాలా మంచి వారని కొనియాడారు. ‘శంబాల’ సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని, అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ఎండీ షఫీ, బీజేపీ యువనాయకుడు పనతల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు నోటీసులు లేకుండా బండ చప్పట ధ్వంసం
చాపాడు : తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటి వద్ద ఉన్న బండ చప్పటను జేసీబీ పెట్టి టీడీపీ నాయకులు అక్రమంగా తొలగించారని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చందా పార్వతి, భర్త చందా రామసుబ్బారెడ్డి(అబ్బిరెడ్డి) వాపోయారు. మండలంలోని బద్రిపల్లె గ్రామంలో శనివారం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ చందా పార్వతి ఇంటి ముందు ఉండే బండ చప్పటను తొలగింపజేశారు. బండ చప్పటను జేసీబీతో తొలగించే క్రమంలో చందా రామసుబ్బారెడ్డి కుటుంబీకులు అభ్యంతరం చెప్పగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బద్రిపల్లె ఊరంతా గ్రామ కంఠంలో ఉందని, పూర్వీకుల నుంచి గ్రామంలో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమ దాయాదుల ఇళ్లకు రాకపోకల కోసం స్థలం ఏర్పాటు చేసుకుని బండ చప్పట వేసుకున్నామన్నారు. పదేళ్ల క్రితం తమ ఇళ్ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. ఈ సమయంలో కోర్టుకెళ్లగా రోడ్డు నిర్మాణ పనులు జరుగలేదన్నారు. ఈ క్రమంలో శనివారరం టీడీపీ నాయకుడు నారాయణ పోలీసులను వెంట బెట్టుకుని వచ్చి జేసీబీతో తమ ఇంటి ముందున్న బండ చప్పటను ధ్వంసం చేయించాడన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామ ని రామసుబ్బారెడ్డి కుటుంబీకులు తెలిపారు. -
ఐటీఐ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు అభ్యర్థులకు అవకాశం
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో 2026 సంవత్సరంలో జరగనున్న ఐటీఐ పరీక్షలు రాసేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ ఐటీఐ విద్యార్హత పొందేందుకు అర్హత, అనుభవం గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మైనారీటీ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. అభ్యర్థులు తప్పని సరిగా 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలన్నారు. సంబంధిత ట్రేడ్కు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. లేదా ఎంఎస్ఎంఈ గుర్తింపు కలిగి ఉండాలన్నారు. కనీస విద్యార్హతగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఏ ప్రభుత్వ ఐటీఐనైనా సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసేందుకు 2026 జనవరి 28వ తేదీ చివరి గడువని తెలిపారు. బాలనర్తకి కేతనరెడ్డికి అవార్డుగాంధీనగర్(విజయవాడసెంట్రల్) : కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకోవడం తన భవిష్యత్ లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది. మహిళా మార్ట్లో చేతివాటం వాల్మీకిపురం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఉపాధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మహిళా మార్టును ఏర్పాటు చేశారు. అయితే వాల్మీకిపురంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్లో వెలుగు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో నష్టాల బాట పట్టి మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు పలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది చేతివాటం వల్లనే మార్టు నష్టాల బాట పట్టిందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై శనివారం మహిళా డీపీఎం వెంకటరమణ మార్టులో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైన్ స్నాచర్ అరెస్టు కలికిరి : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ కేసులో కర్నాటక రాష్ట్రం బెంగళూరు డీజే హళ్ళి ఏరియా మోదీ రోడ్డుకు చెందిన ఫైరోజ్ను కలికిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పట్టణం క్రాస్ రోడ్డు చదివేవాండ్లపల్లిలో వృద్ధురాలు అరుణకుమారి ఒంటరిగా ఉంటోంది. ఈమె పిల్లలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న ఆమె మెడలో వేసుకున్న బంగారు చైనుపై పక్కింటిలో నివాసం ఉంటున్న అబ్దుల్లా కన్ను పడింది. బెంగళూరులో వుంటున్న తన స్నేహితుడు ఫైరోజ్ను ఈ నెల 6న కలికిరికి పిలిపించాడు. ఇల్లు బాడుగకు కావాలని వృద్ధురాలిని మాటల్లో దింపిన ఫైరోజ్ చాకచక్యంగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ పీవీ రమణ దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, కలికిరి సీఐ రామచంద్ర సాంకేతికత సాయంతో నిందితుడు కర్నాటకు చెందిన ఫైరోజ్గా గుర్తించి అరెస్టు చేశారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర, జిల్లా కార్యాలయం నుంచి వచ్చే పనులను సీఆర్ఎంటీలు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.ప్రేమంత కుమార్ ఆదేశించారు. శనివారం కడప నగరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని 36 మండలాలకు సంబంధించిన సీఆర్ఎం టీచర్లకు సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చే పనుల పైన ఒక్క రోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ సమగ్ర శిక్ష, విద్యాశాఖకు సంబంధించిన ప్రతి ప్రతి రిపోర్టు సీఆర్ఎం టీచర్ల ద్వారానే జరుగుతున్నాయన్నారు. 90 శాతం పనులు సకాలంలో జరుగుతున్నాయని మిగిలిన 10 శాతం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత్కుమార్ మాట్లాడుతూ సీఆర్ఎం టీచర్లు తమ క్లస్టర్ పరిధిలో పూర్తి సమాచారాన్ని తమ దగ్గర క్రోఢీకరించుకొని ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ జిల్లా నోడల్ ఆఫీసర్, డైట్ లెక్చరర్ గిరిబాబు మాట్లాడుతూ పరీక్షపై చర్చ 2026కు సంబంధించి ఉపాధ్యాయలు విద్యార్థుల తల్లిదండ్రులతో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు విజయ భాస్కర్, నరసింహరాజు, రమణమూర్తి, ఉపేంద్ర యాదవ్ తదితరులు మాట్లాడారు. -
గంగమ్మ జాతర వేలం పాటలో రూ. 28,49,000 ఆదాయం
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసినగంగమ్మ ఆలయంలో శనివారం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా రూ. 28 లక్షల 49 వేలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 18,19 తేదీల్లో జరగనున్న జాతరకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయలు, పూజా సామగ్రి కోసం నిర్వహించిన వేలంపాటలో రూ. 7 లక్షలు, జాతన తలనీలాలకు రూ. 1 లక్ష, 90 వేలు, విడిదినాల్లో తలనీలాలకు రూ. 6 లక్షల, 55 వేలు, విడిదినాల్లో కొబ్బరికాయలు రూ. 7 లక్షల, 92 వేలు, షామియాన సప్లయర్స్ కోసం రూ. 5 లక్షల, 12 వేల ఆదాయం వచ్చిందని వారు తెలియజేశారు. టోల్గేట్, ఐస్క్రీమ్లు అమ్ముకొనేందుకు సంబంధించిన వేలంపాట వాయిదా పడిందని చెప్పారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రైలు ప్రయాణం భారం !
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లామీదుగా వెళ్లే ప్రధాన రైలుమార్గాల్లో నడిచే రైళ్లలో ప్రయాణం భారం కానుంది. కొత్త చార్జీలను రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వేవర్గాల సమాచారం. జిల్లాలో మూడు రైలుమార్గాలు ఉన్నాయి. ముంబై–చైన్నె ప్రధాన రైలుమార్గం ఉండగా, ఎర్రగుంట్ల–నంద్యాల, ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో అప్ అండ్ డౌన్ కలిసి 30కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. 25 స్టేషన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వే కేంద్రాలుగా కడప, నందలూరు, ఎర్రగుంట్ల కొనసాగుతున్నాయి. ఆర్డినరీ క్లాస్కు ఒక పైసా.. ఆర్డినరీ క్లాస్కు కిలోమీటర్కు ఒక పైసా పెంచారు. పైసా లేదు.. 99 పైసలు లేదు కాబట్టి రూపాయే పడుతుందని ప్రయాణికులు అంటున్నారు. కాగా లోకల్, స్వల్ప దూరప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించేవారికి ఎలాంటి చార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువదూరం వెళితే, ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్–ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసలు చొప్పున చార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణపు టికెట్ల విషయంలో రైల్వేశాఖ కొత్త చార్జీలను పెంచిన తరుణంలో ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. ఈ చార్జీలు డిసెంబరు 26 నుంచి అమలులోకి వచ్చాయి. జనరల్ బోగీలేవి.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దే శ వ్యాప్తంగా అన్ని రైళ్ల ఫార్మిసిన్లో జనరల్ కోచ్లు తగ్గించేశారనే అపవాదు పేదవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వాటి జాడ కనుక్కొనేందుకు ప్లాట్ఫాంపై ఊరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఒకొక్కసారి జనరల్ బోగీలోకి ఎక్కలేక స్లీపర్కోచ్లు ఎక్కి కొంతమంది టీసీల దురుసుతనంతో నెట్టివేతకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఏసీ, స్లీపర్ కోచ్లే అధికం.. ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ఏసీలో త్రీటైర్.. వివిధ శ్రేణుల కోచ్లు ఉంటాయి. ఫార్మసీన్లో ఒకటి లేదా రెండు ఉంటాయి. అవి కూడా కోచ్ పొజిషన్ బట్టి స్లీపర్, ఏసీ కోచ్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. లేడీస్కోచ్ ఉంటుంది. అటువంటప్పుడు సాధారణ ప్రయాణికులు రైలెక్కలాంటే వెనుకంజవేసే పరిస్ధితులున్నాయి. ముంబై–చైన్నె రైలుమార్గంలో నడిచే ఎక్స్ప్రెస్ రైలు జనరల్బోగీలో కిక్కిరిసిన ప్రయాణికులు అమలులోకి కొత్త చార్జీలు ఆర్డీనరీ క్లాసుకు కిలోమీటర్కు పైసా మెయిల్ ఎక్స్ప్రెస్కు రెండుపైసలు నాన్ ఏసీలో 500కిలోమీటర్ల జర్నీకి రూ.10అదనం పెరగని జనరల్బోగీలు -
అన్నదానానికి రూ. లక్ష విరాళం
చక్రాయపేట : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీగండి వీరాంజనేయస్వామి ఆలయంలో ఉన్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు లక్ష రూపాయలు విరాళంగా అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. వేంపల్లె మండలం కత్తలూరు గ్రామానికి చెందిన శివ మాన్విక్రెడ్డి రూ.50,116లు, హైదరాబాద్కు చెందిన వసంత రూ.50,116లు విరాళం ఇచ్చారన్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా స్వామి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారని పేర్కొన్నారు. చేపల చెరువుల పరిశీలన చాపాడు : మండలంలోని కుచ్చుపాప గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువులను శనివారం చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల భూ కొలతల డిప్యూటీ డైరెక్టర్ జయరాజు, ఏడీ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ చేపల చెరువులు 80 ఎకరాల విస్తీరణంలో ఉండగా వీటిని భూ రికార్డులలో 3 ఎల్పీఎంలు చేశారని, వీటి స్వరూపంపై రికార్డులను పరిశీలించినట్లు డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ కొలతల ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, వెంకటేశు, హరి, చాపాడు మండల సర్వేయర్ నాగభూషణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మిట్స్ ఒప్పందం కురబలకోట : చైన్నెకు చెందిన హ్యాకర్స్ ఇన్పోటెక్ సంస్థతో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ రామనాధన్ శనివారం తెలిపారు. విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. -
మంచుపడి.. పూత మాడి
● తెగుళ్లబారిన మామిడి తోటలు ● తీవ్రమైన చలితో చిగుర్లు వస్తున్న వైనం ● ఫలించని రైతుల ముందస్తు ఆశలు.. ● రెండో దశ పూతపైనే ఆశలు రాయచోటి : వాతావరణ మార్పులు ‘ఫలరాజం’పై పగబట్టాయి. ముందస్తు దిగుబడుల కోసం శ్రమించిన జిల్లా మామిడి రైతుల ఆశలు ఫలించలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు సమయం నుంచే తోటల్లో సాగు పనులు మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసిన వర్షాలు మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. తీవ్రమైన చలి, మంచు వల్ల చెట్లలో పూతకు బదులు చిగుర్లు వస్తున్నాయి. చెట్లకు వేడిమి కోసం మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించ లేదు. దీంతో రైతులు రెండో దశ పూతపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. ● నవంబర్ నెల నుంచి మామిడి తోటల్లో మొదటి దశ, డిసెంబర్లో రెండో దశ పూత వస్తుంది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పూత రావడం ఆలస్యమైంది. గత ఏడాది దిగుబడులు ఆలస్యం కావడం, జులై, ఆగస్టు నెల వరకు దిగుబడులు ఉండటంతో నవంబర్ నెలలో కొన్నిచోట్ల మాత్రమే పూతలు వచ్చాయి. అయితే వర్షాల కారణంగా అవి కూడా మాడిపోయాయి. వర్షాలు కురవని ప్రాంతంలో మాత్రమే పూత మిగిలింది. డిసెంబర్ నెలలో కూడా మెజార్టీ తోటల్లో పూతకు బదులుగా చిగుర్లు వస్తుండటంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చిగుర్లు ముదిరేందుకు, ఉన్న కొద్దిపాటి పూతలను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మందులను పిచికారీ చేస్తున్నారు. తేనె మంచు పురుగు తోటల్లో ఉన్న కొద్దిపాటి పూతలకు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రధానంగా తేనెమంచు పురుగు రైతులను కలవరపెడుతోంది. చిగుర్లు, పూతలకు వీటి బెడద అధికమైంది. నల్లి, పచ్చ పురుగు కూడా సోకుతోంది. దీంతోపూతను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు పడుతున్నారు. -
జిల్లా కేంద్రం మారుస్తారంటూ ఆత్మహత్యాయత్నం
రాయచోటి : కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రకటన, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంగా మారుస్తున్నారన్న వదంతులపై రాయచోటిలో శనివారం ఆందోళనలు ఉధృతమయ్యాయి. జేఏసీ, స్థానిక ప్రజాశక్తి సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని నేతాజీ, వైఎస్ఆర్ కూడళ్లలో ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించరాదంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్, హసన్బాషాలు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే వారించి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు సత్వరం చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నేడు బంద్కు పిలుపు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో కలుపుతున్నారంటూ వచ్చిన వదంతులపై జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, ఉద్యోగులు, సంఘాలు పాల్గొనాలని శనివారం రాత్రి ఒక ప్రకటనలో కోరింది. -
ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు అన్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను శనివారం టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, సిద్దవటం ఎస్ఐ రఫీ పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకునేందుకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ విజిలెన్స్ వారికి సూచించామన్నారు. ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దొంగ తనాలు నివారించేందుకు సివిల్ డ్రస్లో ఉన్న ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో కలిపి దాదాపు 100 మంది బందోబస్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అన్నమయ్యా.. పాలకుల కళ్లు తెరపించవయ్యా
● గోవిందా..గోవిందా అంటూ వేడుకోలు ● రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ ● హైవేపై రాస్తారోకో చేసిన జేఏసీ నేతలు ● వంటావార్పు, నినాదాలు రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ, పాలకుల కళ్లు తెరపించాలని వేడుకుంటూ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్ధులు మూకుమ్మడిగా పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి వినతులు సమర్పించుకున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్తో ప్రజాపోరును అన్నమయ్య ఎదుట శుక్రవారం నిర్వహించారు. గోవిందా..గోవిందా అంటూ ముక్తకంఠంతో వేడుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టి కేంద్రీకరించేలా చేయాలంటూ అన్నమయ్యను వేడుకున్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఉద్యమకారులు కొండూరు శరత్కుమార్రాజు, చిట్వేలి రవి కుమార్, మర్రి రవికుమార్, మండెం అబూబకర్, పూల భాస్కర్, యల్లటూరు శ్రీనివాసరాజు, డా.సుధాకర్, ఉద్దండం సుబ్రమణ్యం, యద్దల సాగర్, మేడికొండు రవి, కెఎంఎల్ నరసింహా, సంజీవి, సమ్మెట శివప్రసాద్, యల్లటూరు శివరామరాజు, కొట్టే హరి, సికిందరులతో పాటు మహిళలు పాల్గొన్నారు. హైవేపై రాస్తారోకో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ప్రజల వినతి ముగిసిన అనంతరం అన్నమయ్య ఉద్యానవనం ఎదురుగా కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఉద్యమకారులు రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కడప, తిరుపతి వైపు వాహనాలు బారులు తీరాయి. మన్నూరు సీఐ ప్రసాద్బాబు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తును నిర్వహించారు. న్యాయవాద జేఏసీ నాయకుడు శరత్ ఆధ్వర్యంలో వంటావార్పు అన్నమయ్యకు వినతుల కార్యక్రమం అనంతరం న్యాయవాదుల జేఏసీ కన్వీనరు కొండూరు శరత్కుమార్ రాజు ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపక్కన వంట చేయించారు. ఆందోళనకారులకు వడ్డించారు. కార్యక్రమంలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్, బీవీఎన్ హైస్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలని ఈ సందర్భంగా నినదించారు. ప్రజల వినతులను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. -
టైపిస్ట్ ప్రశాంత్నాయక్ అరెస్ట్
– అక్రమ చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ రాయచోటి : సుండుపల్లె మండల తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ దుర్వినియోగం చేసి అక్రమంగా పొసెషన్ సర్టిఫికెట్లను జారీ చేసిన టైపిస్టు ప్రశాంత్నాయక్ను సుండుపల్లె పోలీసులు శుక్రవారం రాయచోటిలో అరెస్టు చేవారు. డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడిన టైపిస్ట్ ప్రశాంత్నాయక్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్ఐ ఎస్కె హుస్సేన్ పేర్కొన్నారు. అందుబాటులో లేకుండా పారిపోయిన టైపిస్టును శుక్రవారం రాయచోటిలో అరెస్టు చేశామన్నారు. టైపిస్టును శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. అక్రమ చర్యలకు పాల్పడితే కఠినచర్యలు: శాఖాపరంగా అక్రమ అవినీతి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. సుండుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్కీ దుర్వినియోగానికి పాల్పడిన టైపిస్టు ప్రశాంత్నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కలెక్టర్ శుక్రవారం స్పందించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. గడ్డి మందు తాగి యువకుడు మృతి పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డు సమీపంలోని రాజారెడ్డి కాలనీలో నివాసంముంటున్న సాగర్ (19)అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్ తల్లిదండ్రులు అతడి చిన్నప్పుడే మృతి చెందారు. అమ్మమ్మ కాంతమ్మ ఇంట్లో ఉంటూ బేల్దారి పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సాగర్ అయ్యప్పమాల ధరించి మండల దీక్ష పూర్తి చేసుకుని మూడు రోజుల క్రితమే పులివెందులకు వచ్చాడు. మాలలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారం సంబంధించి సాగర్ను గంగిరెడ్డి అనే వ్యక్తి బెదిరించాడు. దీంతో మనస్థాపం చెంది గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బంధువులు యువకుడిని చికిత్స కోసం పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. రిమ్స్లో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అర్బన్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్ పట్టా భూములకు సంబంధించి జరిగిన ఇరువర్గాల దాడులలో శుక్రవారం పది మందికి గాయాలయ్యాయి. లక్ష్మీనగర్లోని సర్వే నంబర్ 7–3, 7–5, 7–4, 13–1ఏ పట్టాభూమిని దశాబ్దాల క్రితం100 మందికిపైగా అన్ని వర్గాల పేదలు కొనుగోలు చేసారు. అయితే కోడూరు అరుంధతివాడకు చెందిన వారు కొద్ది రోజులుగా ఈ భూమి తమదేనంటూ గొడవలు పడుతున్నారు. తహసీల్దార్ అమర్నాథ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివాద స్థలాన్ని పరిశీలించి భూములు కొన్నవారే హక్కుదారులని నిర్ధారించారు. ఇటీవలే పోలీసుల సహకారంతో జేసీబీలతో చదును చేయించి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు వేసేందుకు యంత్రాలు పని చేస్తుండగా పోలీసుల సమక్షంలో అరుందతివాడ గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఇంటి స్థలాలు కొన్న వర్గాలకు, అరుంధతివాడ గ్రామస్తులకు మధ్య గొడవ జరిగి రాళ్లు, కట్టెలతో కొట్టుకొన్నారు. ఈ గొడవలలో అరుంధతి వాడకు చెందిన వారు రాళ్లు రువ్వారు, కర్రలతో దాడులు చేసారు. ఈ క్రమంలో ఇంటి స్థలాలకు చెందిన సుబ్బారెడ్డి, శాంతి, సురేంద్రరాజు, నాగరాజు, అనిల్కుమార్, మహేష్, కరీమున్నీసాలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మేరకు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘సీమ’కు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తీసుకు రండి
● గుజరాత్కు తరలిపోతున్నాయ్ ● బాబూ....ఆర్ఎస్ఎస్ అధినేతతో కాదు..సత్య నాదెళ్లతో మాట్లాడు ● కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ కడప సెవెన్రోడ్స్ : అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కోరారు. కడపలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలో పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయితే ప్రధాని ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకు వెళుతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే ఈరోజు మోదీ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. కనుక చంద్రబాబు తక్షణమే పెట్టుబడులు గుజరాత్కు తరలిపోకుండా రాయలసీమకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. తిరుపతిలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో ఇతర అంశాలపై మాట్లాడటం కాదని, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మాట్లాడి పెట్టుబడులు తీసుకు రావాలన్నారు.సత్య నాదెళ్ల తల్లి రాజంపేట వాసి కాగా, తండ్రి తాడిపత్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తే గనుక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడితే ఈ ప్రాంతానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారని, పెట్టుబడులు వస్తే అందరికీ ఉపాధి లభించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పాలించినా ఈ ప్రాంతం వెనుకబడే ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ గురించి తానే ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకు వెళ్లానని, అయితే తన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారని తెలిపారు. పోలవరం, బనకచర్ల ఇప్పట్లో పూర్తి కావని, అవి పూర్తి అయినప్పటికీ పేదలకు పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. పెట్టుబడులు వస్తేనే సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగింపు సరికాదన్నారు. కూలీ రేట్లు తగ్గించడం ద్వారా కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చట్టాన్ని మార్పు చేసిందని విమర్శించారు. -
రుణాలపేరిట మోసపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం
రాయచోటికి చెందిన మహిళ నగదు కాజేసిందని ఆరోపణ మదనపల్లె రూరల్ : కేంద్ర ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్నానని, రూ. 3 వేల నగదు చొప్పున కడితే రూ.5 లక్షల నగదు ఒక్కొక్కరికి రుణంగా ఇప్పిస్తానని చెప్పి రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తనను మోసం చేసి నగదు కాజేసిందని ఆరోపిస్తూ, మదనపల్లె రామారావు కాలనీకి చెందిన మహిళ రూప (27) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెల్లడించిన వివరాల మేరకు మదనపల్లె పట్టణం రామారావు కాలనీలో నివాసం ఉంటున్న రూప తో రెండు సంవత్సరాల క్రితం రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఇన్చార్జినని, మహిళల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తుందని నమ్మబలికి పరిచయం పెంచుకుంది. రుణాల మంజూరుకు ఒక్కొక్కరు మూడు వేల రూపాయలు కడితే రూ.5 లక్షల రుణం వస్తుందని చెప్పింది. ఈ విషయాన్ని నమ్మి రూప దళారిగా వ్యవహరించి, తన సొంత పూచికత్తుతో 200 మందికి పైగా మహిళల వద్ద నగదు వసూలు చేసి ఫరీదా కు ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రుణాలు మంజూరు కాకపోవడంతో డబ్బు కట్టిన మహిళలు రూపపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై రూప ఫరీదాతో మాట్లాడినా, ఆమె అదిగో ఇదిగోనంటూ కాలయాపన చేసింది. అయితే నగదు చెల్లించిన మహిళలు తమ డబ్బు వాపస్ ఇవ్వాల్సిందిగా నిలదీయడంతో, ఒత్తిడి భరించలేక పోయింది. మోసం చేసిన మహిళపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, ఇంటి వద్ద విషం తాగింది. టూ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధంతోనే కిశోర్ హత్య
● నలుగురు నిందితులను అరెస్టు చేసిన యర్రగుంట్ల రైల్వే పోలీసులు ● రూ.5 లక్షలకు సుపారి, రూ.30 వేలు అడ్వాన్స్ యర్రగుంట్ల : తన భార్యతో వి వాహేతర సంబంధం పెట్టుకు న్న పైడిపాలెం వెంకట కిశోర్ (34)ను ఎన్నిసార్లు మందలించినా మారకపోవడంతో పాటు తన భార్య వద్ద నుంచి బంగారు నగలు, డబ్బులు తీ సుకుని తనను ఆర్థికంగా, సామాజికంగా చితికి పో యేట్లు చేసినందున నరసింహులు అనే వ్యక్తి అతడిని పథకం ప్రకారం హత్యచేయించాడని యర్రగుంట్ల రై ల్వే సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. తొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పైడిపాలెం వెంకటకిశోర్ అదే గ్రామానికి చెందిన నరసింహులు భార్యతో వివా హేతర సంబంధం పెట్టుకున్నాడు. నరసింహులు గ్యా స్ డీలర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పైడిపా లెం వెంకట కిశోర్ ఆరేళ్లుగా నరసింహులు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నరసింహులు తన భార్యను వెంకటకిశోర్ను ఇద్దరినీ మందలించాడు. అయినా వారి తీరు మా రలేదు. వెంకటకిశోర్కు పెళ్లి అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. నరసింహులు, అతడి బా వ కిరణ్కుమార్లు ఇద్దరు కలసి వెంకటకిశోర్ను కొట్టి గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికి నరసింహులు భార్య ఇంటిలోని డబ్బును, బంగారు నగలున్నింటినీ వెంకటకిశోర్కు ఇచ్చి సంబంధం కొనసాగించింది. దీంతో నరసింహులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్రక్షోభకు గురయ్యాడు. ఈ సమస్యను పరిష్కరించాలంటే వెంకటకిశోర్ను హత్య చేయడమే మార్గమని భా వించి కిరణ్కుమార్తో చర్చించాడు. కిరణ్కుమార్ త న మేనల్లుడు అయిన కార్తిక్తో ఈ విషయంపై చర్చించాడు. ఆ తరువాత కార్తిక్ తన స్నేహితుడైన క్రాంతికుమార్కు వెంకటకిశోర్తో సన్నిహిత పరిచయం ఉందని తెలుసుకొని అతడి ద్వారా వెంకటకిశోర్ను హత్య చేయవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జూలై 1వ తేదీన నరసింహులు, కిరణ్కుమార్, పులివెందు లలోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో కార్తిక్, క్రాంతికుమార్లతో చర్చించి రూ.5 లక్షలు సుపారి కుదుక్చు కొని రూ.30 వేలు అడ్వాన్స్గా కార్తీక్కు చెల్లించారు. జూలై 25వ తేదీన వెంకటకిశోర్ తన సన్నితుడైన క్రాంతికుమార్కు ఫోన్ చేసి తన భార్యతో ఓ పంచాయతి మాట్లాడటానికి దొమ్మర నంద్యాలకు వెళదామని చెప్పాడు. ఇదే అదునుగా భావించి క్రాంతికుమార్, కార్తిక్లు ఇద్దరు వెంకటకిశోర్ను పులివెందల మీదుగా బైక్ ఎక్కించుకొని ముద్దనూరుకు వచ్చి అక్కడ మద్యం కొనుగోలు చేసి చెన్నరెడ్డిగారిపల్లి గ్రామ సమీపాన రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కూర్చొని మద్యం తాగారు. వెంకటకిశోర్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత క్రాంతికుమార్, కార్తిక్లు ఇద్దరు కలసి వెంకటకిశోర్ను గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై ఉంచి తలపై రాయితో కొట్టి, ఈ సంఘటనను రైల్వే ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని యర్రగుంట్ల రైల్వే పోలీస్స్టేషన్ బయట ఉంచారు. ఫలితంగా వెంకటకిశోర్ బంధువులు గుర్తించారు. దీంతో విచారణను యర్రగుంట్ల రైల్వే పోలీసులు లోతుగా చేపట్టారు. పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుసుకొని ముద్దాయిలు నరసింహులు, కిరణ్కుమార్, కార్తిక్, క్రాంతికుమార్ తొండూరు వీఆర్ఓ వద్ద లొంగిపోయారు. -
యువకుడిపై కత్తితో దాడి
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరం మాసాపేట ప్రాంతంలో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడి పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కడప శంకరాపురానికి చెందిన నల్ల పోగు పవన్ స్నేహితులతో కలిసి గురువారం రాత్రి మాసాపేట సమీపంలో మద్యం సేవించారు. ఈ క్రమంలో పవన్, హర్ష మధ్య మాటామాటా పెరిగింది. పవన్ (24)పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కడప కోటిరెడ్డిసర్కిల్ : నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు సూచించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు శుక్రవారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఓబులేసు హెచ్చరించారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహాలు కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివార్లలోని రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మూడు మృతదేహాలు ఉన్నాయని రిమ్స్ అధికారులు తెలిపారు. వారు వివిధ రోజుల్లో చికిత్స కోసం చేరి మృతి చెందారన్నారు. ఆయా మృతదేహాలు మార్చురీలో ఉంచామని, సంబంధీకులు ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలన్నారు. – మహిళ మృతి చిన్నమండెం : కడప–బెంగళూరు జాతీయ రహదారిపై కేశాపురం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం కారును ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. బద్వేల్కు చెందిన గణేష్, అతని భార్య ప్రవళిక, ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు నుంచి కారులో బద్వేల్కు వస్తుండగా కేశాపురం ఫారెస్ట్ చెక్పోస్టు వద్దకు వచ్చేసరికి ప్రకాశం జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వేగంగా ఎదురుగా రావడాన్ని గమనించిన కారు డ్రైవర్ రోడ్డు సైడ్ ఆపి ఉన్నాడు.అయితే వేగంగా వచ్చిన అంబులెన్స్ కారును ఢీకొనడంతో అందులో ఉన్న ప్రవళిక(33) అక్కడికక్కడే మృతిచెందింది. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. -
పశువుల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు
సిద్దవటం : పాడి పశువులు దొంగలించిన కేసులో చింతకొమ్మదిన్నె, అట్లూరు మండలాలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సిద్దవటం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, సుబ్బరాయుడు అనే పాడి రైతులు వారి గేదెలను సిద్దవటం మండలంలోని కనుమలోపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మేపుకుంటూ రాత్రివేళలో గేదెలను కట్టేసుకుని అక్కడే ఉండేవారు. వారికి ఒక్కొక్కరికి 5 చొప్పున ఉన్న 10 గేదెలను అక్కడే మేపుకునేవారు. ఈ నెల 22వ తేదీన కూడా రోజువారీగా గేదెలను మేపుకుని ఆ రాత్రి అక్కడే కట్టేసుకొని పడుకున్నారు. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున చూసుకుంటే అక్కడ గేదెలు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా గేదెలు కనిపించకపోవడంతో అదే రోజు రైతులు సిద్దవటంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహమ్మద్రఫీ రెండు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 25వ తేదీ సిద్దవటం మండలం నేకనాపురం క్రాస్ రోడ్డులోని చాముండేశ్వరిపేట వద్ద ఎస్ఐ మహమ్మద్రఫీ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్కు చెందిన చినాయాపల్లి జనార్దన్, అట్లూరు మండలం సురాయపల్లి గ్రామానికి చెందిన చప్పిడి వెంకటేష్, చప్పిడి నరసింహులు అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని వి చారించగా 10 గేదెలను దొంగతనం చేసిన విషయా న్ని ముగ్గురు నిందితులు అంగీకరించారు. నేకనాపు రం గ్రామ శివారులోని శివాలయం వద్ద గేదెలను పెట్టి ఒకరిని కాపలా ఉంచినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి ప ది గేదెలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. వారిని శుక్రవారం కోర్టుకు తరలించారు. ము ద్దాయి చినాయపల్లె జనార్దన్పై గతంలో 10 కేసులు నమోదై ఉన్నందున అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయుటకు పై అధికారులకు సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపించామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా సకాలంలో ఛేదించిన ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ, పోలీస్ సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు. 80 మద్యం బాటిళ్లు స్వాధీనం -
వైఎస్సార్సీపీ నాయకులు అరెస్ట్
● జగనన్న పుట్టినరోజు వేడుకలు చేశారని కేసు ● గుర్రంకొండ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత ● పాకాల కోర్టులో బెయిల్ మంజూరు గుర్రంకొండ : గుర్రంకొండలో వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ ఆలీఖాన్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన జగనన్న పుట్టినరోజు వేడుకల్లో జరిగిన సంఘటనలపై కేసు నమోదు చేశారు. దీంతో గుర్రంకొండ పోలీస్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రంతా నాయకుల్ని పోలీస్స్టేషన్లోనే ఉంచారు. శుక్రవారం తిరుపతి జిల్లా పాకాల కోర్టులో వీరిని హాజరు పరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 21న మండలకేంద్రమైన గుర్రంకొండలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాత్రి వరకు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్లు కట్చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సమయంలో కార్యకర్తలు కత్తులతో కేక్ కట్ చేశారు. పచ్చమీడియా దీనిని వక్రీకరించి ప్రజలను భయాందోళనకు గురి చేశారంటూ, కత్తులతో సైర్వవిహారం చేశారంటూ వార్తలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం పోలీసులు రాష్ట్ర ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ ఆలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ అలీఖాన్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్లను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకొన్న కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డితో పాటు పలు పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్ఐలు తమ సిబ్బందితో గుర్రంకొండకు చేరుకొన్నారు. పోలీస్స్టేషన్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీస్స్టేషన్లోనే రాత్రంగా ఉంచారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్లను పోలీసులు మొదటగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి జిల్లాలోని పాకాల కోర్టులో వీరిని పోలీసులు హాజరుపరిచారు. కేసు విచారించిన జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నాయకులు హర్షం ప్రకటించి గుర్రంకొండకు చేరుకొన్నారు. గుర్రంకొండలో పోలీసుల పహారా రెండురోజులుగా పట్టణంలో జరుగుతున్న సంఘటనలపై పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. గత రెండురోజులుగా జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్ఐలతో పాటు పోలీసులు, ఇద్దరు సీఐలు, స్పెషల్ఫోర్స్ పోలీసులు పట్టణంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా ఈకేసులో ఇంకా 40 మందిని చేర్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష గట్టి అనవసరంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టులో బెయిల్ తీసుకొని నాయకులు ఇళ్లకు చేరుకొన్నా పోలీసులు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తుండడం గమనార్హం. రెండురోజులుగా జరుగుతున్న సంఘటనలు నియోజకవర్గంలో సంచలనం కలిగించాయి. -
జాబ్కార్డులు సరిచేశారు
కడప సిటీ: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై కొరడా ఝళిపిస్తోంది. ఏ చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆర్థికంగా దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అందులో భాగంగానే జిల్లాలో జాబ్కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నం చేశారు. 10,158 జాబ్కార్డులను తొలగించారు. ఈ నేపథ్యంలో సాక్షిలో ఇటీవల పేదల ‘ఉపాధికి ఎసరు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భావనతో గ్రామ సభల ద్వారా 10,158 జాబ్కార్డులను తీసి వేయగా, అందులో 5050 మళ్లీ యాక్టివ్ జాబ్కార్డులుగా సరిచేశారు. ఈ విషయంపై డ్వామా పీడీని వివరణ కోరగా కేవలం మృతి చెందిన వ్యక్తులవి మాత్రమే తొలగించినట్లు పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్:విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు బీఎల్ఓలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఓటర్ల జాబితాల ప్రత్యేక తనిఖీ, నవీకరణ కార్యక్రమంలో భాగంగా ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహించినందులకు కమలాపురం నియోజకవర్గం పరిధిలోని సీకే దిన్నె మండలం తాడిగొట్ల గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీగా చేస్తున్న ఎన్.శాంతమ్మ, వల్లూరు మండలం టీజీ పల్లె గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎల్.మారుతీ, వీరపునాయునిపల్లె మండలంలోని అలిదెన గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సి.శివ మహేశ్వర్ రెడ్డి, ఎన్. పాలగిరి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జి. మురళికృష్ణలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఆర్డర్ కాపీలను జారీ చేశారు. -
భయాందోళనలో సిబ్బంది
కడప సిటీ: ఉపాధిహామీ పథకానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2006 ఫిబ్రవరిలో మన్మోహన్సింగ్ ప్రధానిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండపల్లె గ్రామంలో సోనియాగాందీ చేతుల మీదుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం (ఎన్ఆర్ఈజీఎస్) ప్రారంభించారు. దీనిని ప్రవేశపెట్టి 19 సంవత్సరాల 10 నెలల 15 రోజులైంది. అయితే ఈ పథకం పేరు మార్చేందుకు ప్రస్తుత మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. వికసిత్భారత్ గ్రామీణ రోజ్గార్, అవిజీక మిషన్ (వీబీజీ ఆర్ఏఎం)గా రూపకల్పన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. మెజార్టీ ఉన్నందువల్ల ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిధుల ఖర్చులో కూడా తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూలీలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేది. మెటీరియల్కు, పండ్లతోటల పెంపకానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రం 40 శాతం ముందుగా చెల్లిస్తేనే కేంద్రం 60 శాతం నిధులు విడుదల చేస్తుంది. 10 శాతం చెల్లించలేమన్న చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం కూడా కేంద్రమే భరించాలని వెల్లడించడమే కాకుండా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నిధుల ఖర్చు గతంలో కంటే మరో 30 శాతం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అయితే పది శాతం మేర నిధులు చెల్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుండగా, ఈ విధానం అమలులోకి వస్తే అసలు రాష్ట్రంలో ఉపాధి పథకం ఉంటుందా? ఊడుతుందా? అనే ఆందోళనలు అటు సిబ్బంది, ఇటు కూలీల్లోనూ నెలకొంది. ● వికసిత్ భారత్ గ్యాంరటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ బిల్లు–2025పై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రాలపై భరించలేనంత భారం మోపి పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లోనే ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతోంది. నిధుల ఖర్చులో భారీ తేడా ఉన్నందువల్ల సకాలంలో వేతనాలు అందుతాయా? లేదా? అన్న ఆందోళనలో కూలీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లించలేని పరిస్థితి ఉంటే వేతనాలుసకాలంలో అందే పరిస్థితి ఉండదు. దీంతో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. పథకానికి పేరు మార్పు ఉపాధిహామీ పథకానికి కొత్త పేరును పెట్టేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది అమలైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియడం లేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు ప్రస్తుతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్– అవిజీక మిషన్ (వీబీజీఆర్ఏఎం)గా మార్పు చేసేందుకు అడుగులు వేస్తోంది.. అయితే నిధుల తేడా కూడా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉంటుందా? ఊడుతుందా? అనే సందిగ్ధం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వీబీఆర్ ఆర్ఏఎం పేరు మార్పునకు కేంద్రం శ్రీకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన వైనం లోక్సభలో బిల్లును వెనక్కి తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ ఆందోళనలో గ్రామీణ కూలీలు ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు చేయడమే కాకుండా నిధుల ఖర్చులో కూడా తేడాలు ఉంటున్నాయని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పథకంలో 100 శాతం కూలీలకు కేంద్ర ప్రభుత్వమే నిధులను ఖర్చుచేస్తోంది. మెటీరియల్కు, ప్లాంటేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసేది. కొత్త పథకంలో మార్పులు భారీగా ఉంటాయని సిబ్బంది భావిస్తున్నారు. కూలీలకు కూడా ఉచితంగా కాకుండా 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తుందా? లేదా? అన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. పది శాతానికే రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతుంటే అంతకు మూడింతలు పెంచే పరిస్థితి కనిపించడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? ఊడుతాయా? అన్న భయాందోళనలో సిబ్బంది ఉన్నారు. ఇంకా గైడ్లైన్స్ రాలేదు ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పేరు మారుతోందని చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకు ఎటువంటి గైడ్లైన్స్ ఈ మార్పు గురించి రాలేదు. ఒకవేళ మార్పు చేస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలుచేయాల్సి ఉంటుంది. – ఆదిశేషారెడ్డి, డ్వామా పీడీ, కడప -
నిర్లక్ష్యానికి మూల్యం!
మదనపల్లె: చేసిన పాపం ఊరకనే పోదనేది సామెత అయితే.. చేసిన తప్పు రిటైర్మెంట్ అయినా వెంటాడుతుందని, మూల్యం చెల్లించక తప్పదని అన్నమయ్య జిల్లా డిస్కం రిటైర్డ్ సూప రిండెంటింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి ఉదంతం చెబుతోంది. ప్రస్తుతం ఈ ఉదంతం జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేపుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లా విద్యుత్ శాఖలో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ (డీఈసీ) కీలకంగా పనిచేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి.. కన్వీనర్, మెంబర్ కార్యదర్శిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులో చైర్మన్ పాత్ర కీలకంగా ఉంటుంది. పథకం అమలును పర్యవేక్షించడానికి, కమిటీ సమావేశాల నిర్వహణను నిర్ణయించడం, తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో చైర్మన్కు అధికారాలు ఉంటాయి. చైర్మన్ అధ్యక్షతన కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. చైర్మన్ అనుమతి లేకుండానే.. డీఈసీ చైర్మన్ అయిన ఎంపీ మిధున్ రెడ్డి అనుమతి లేకుండానే గత డిస్కం ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి..ఈ ఏడాది మే 12న కమిటీ సమావేశం ఉందని సమాచారం పంపారు. ఈ విషయం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి వారు నిర్ణయించిన తేదీన సమావేశం నిర్వహించాలనే అంశంపై చైర్మన్ తో సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకుని తర్వాత సమాచారం ఇచ్చారు. చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశమే..ఆయనకు తెలియకుండా నిర్ణయించడం ద్వారా హక్కులు. అధికారాలను కాల రాసేలా ఏకపక్షంగా వ్యవహరించారు. కలెక్టర్కు ఫిర్యాదు మే 12న కమిటీ సమావేశం ఉందని అందిన సమాచారంపై ఎంపీ విస్తుపోయారు. తన ప్రమేయం లేకుండా, తన అధ్యక్షతన జరగాల్సిన సమావేశాన్ని తాను నిర్ణయించకుండానే తేదీ, సమయం ఎలా ఖరారు చేశారని ప్రశ్నిస్తూ జిల్లా కలెక్టర్కు మిథున్ రెడ్డి లేఖ రాశారు. విషయాన్ని పరిశీలించి, సమావేశం ఏర్పాటులో సరైన విధానాలను అనుసరించాలని లేఖలో కోరారు. నా హక్కులకు భంగం తన హక్కులకు భంగం కలిగించారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఈిసీ చైర్మన్ అయిన మిథున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎంపీ అయిన ఆయన లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్, అలాగే స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. హక్కులకు భంగం కలిగించడం, ప్రోటోకాల్ పాటించకవడం వంటి అంశాలపై జిల్లా అధికారుల నుంచి వివరణ కోరింది. దీంతో చర్యలు మొదలయ్యాయి. రిటైర్డ్ అయినప్పటికీ.. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. డీఈసీ చైర్మన్ హక్కులను హరించిన ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్టోబర్ చివర్లో రిటైర్ అయ్యారు. అయితే నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. రిటైరైన తర్వాత అధికారిగా ఉండాల్సిన సౌకర్యాలను నిలిపివేశారు. పెన్షన్ తో పాటు, రిటైర్మెంట్ తో ముడిపడి ఉన్న అన్ని ఆర్థిక అంశాలను నిలుపుదల చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ కార్యాలయం దీనిపై వివరణ కోరెందుకు సంబంధిత అధికారిని హాజరుకావాలని ఆదేశించే అవకాశం ఉంది. ఒక జిల్లా అధికారి నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టడంతో ఇప్పుడు అధికార యంత్రాంగంలో గుబులు పుట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనలను పాటించకుంటే ఇలాంటి పరిస్థితి తమకు కలగవచ్చన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కిందిస్థాయి అధికారుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అన్న నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా చేపట్టారు. చివరకు ప్రజా ప్రతినిధుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంపై చర్యలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులు నిబంధనలను, ప్రతినిధుల హక్కులను గౌరవించేలా పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. చైర్మన్ అయిన సీనియర్ ఎంపీమిథున్ రెడ్డి అధికారాలనువిస్మరించిన గత డిస్కం ఎస్ఈ చైర్మన్ అనుమతి లేకుండానే గత మే 12న డీఈసీ సమావేశం స్పీకర్, కలెక్టర్లకు మిథున్ రెడ్డి ఫిర్యాదు ఎస్ఈ రిటైర్డ్ అయినప్పటికీఆగని చర్యలు జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు -
శ్రీనిధి, వైవీయూ మధ్య అవగాహన ఒప్పందం
కడప ఎడ్యుకేషన్: పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, ఆహార పరిశ్రమ విద్యా సహకారాన్ని ప్రోత్సహించడానికి ప్రొద్దుటూరు శ్రీ నిధి డెయిరీ, కడప యోగి వేమన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. వైవీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ పి. పద్మ, శ్రీనిధి డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రేగంటి సురేష్ బాబు, ప్లాంట్ మేనేజర్ బాలయ్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల డెయిరీ ప్లాంట్ సందర్శన, ఇంటర్న్షిప్, ప్రాజెక్టుల నిర్వహణ, ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి శ్రీనిధి డైరీ వారు ముందుకు వచ్చారని తెలిపారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు పరిశోధనల్లో వారికి సహకరిస్తారని వివరించారు. మార్కెటింగ్ టీంకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రొద్దుటూరులోని విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల, వైవీయూ ఎంబీఏ ఫ్యాకల్టీ సేవలందిస్తారని తెలిపారు. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డీన్, ప్రొఫెసర్ దాము, పీఎం–యుఎస్హెచ్ఎ కోఆర్డినేటర్ డాక్టర్ టి. చంద్రశేఖర్, ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. రియాజున్నిసా, పీఎం ఉషా సాఫ్ట్ కాంపోనెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
30న వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం
కడప సెవెన్రోడ్స్: వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్బంగా ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శిచుకుని ఆయన కృపా కటాక్షాలు పొందాలని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్బంగా విశేష పూజలు నిర్వహించాలని టీటీడీ వారు నిర్ణయించారన్నారు. అందులో భాగంగా అర్దరాత్రి 1.30 గంటలనుంచి స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారన్నారు. రాత్రి 12 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆరాధన, ఇతర విశేష పూజలు నిర్వహించి 1.30 గంటలకు గరుడ వాహనంపై వైకుంఠ ద్వారం వద్దకు స్వామి వారు చేరుకుంటారన్నారు. అప్పటి నుంచి ఉదయం 11.30 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబరు 30, 31, జనవరి 1వ తేదీల్లో ఆన్లైన్ టిక్కెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారన్నారు. దర్శనం టిక్కెట్టు లేని వారికి జనవరి 2 నుంచి క్యూలై న్ లోకి అనుమతిస్తారన్నారు. భక్తులు టీటీడీ వారికి సహకరించాలని ఆయన కోరారు. -
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డెమోగా ఆర్.ప్రసన్నలత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్కు రిపోర్టు చేశారు. ఈమె కోరుగుంటపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ హెచ్ఈఓగా పనిచేస్తూ పదోన్నతిపై డిప్యూటీ డెమోగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వకుమార్, ఇతర వైద్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం దేవదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో లెక్కించారు. మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాములవారి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.19,24,000 లక్షలు నగదు,22 గ్రాములు బంగారు, 2.400కేజీల వెండి వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాజారెడ్డి, ఆలయ ఈఓ క్రిష్ణానాయక్, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. జమ్మలమడుగు: జాతీయ స్థాయి అండర్–17 విభాగంలో జమ్మలమడుగుకు చెందిన మంగదొడ్డి ప్రియాంక ఎంపికై నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ సెలెక్షన్ మ్యాచ్లు జరిగాయి. అందులో గుంటూరు జిల్లా తరఫున ఆడి ఫైనల్లో తన బౌలింగ్లో చిత్తూరు టీమ్పై మూడు వికెట్ల తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది. దీంతో ఆమెను అండర్–17 జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఆమె పులివెందులలో నిత్యానందరెడ్డి దగ్గర కోచించ్ తీసుకుందని వివరించారు. జమ్మలమడుగు నుంచి మహిళల అండర్–17 జట్టుకు ఎంపిక కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కడప కోటిరెడ్డిసర్కిల్: పౌర్ణమిని పురస్కరించుకుని జనవరి 2వ తేదీ జిల్లాలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప డిపో నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసు రాయచోటి, పీలేరు మీదుగా అరుణాచలం బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ. 1044 చార్జీగా నిర్ణయించారన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అల్ట్రాడీలక్స్ సర్వీసులు తిరుగుతాయని, ఇందులో రూ. 1282 చార్జీగా ఉందన్నారు. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్మీదుగా సూపర్ లగర్జరీ సర్వీసులు నడుస్తాయని, ఇందులో రూ. 1201 చార్జిగా ఉందన్నారు.ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు మైదుకూరు, కడపమీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఇందులో రూ. 1273 చార్జిగా నిర్ణయించారన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జి రూ. 1363 అని తెలిపారు. పులివెందల డిపో నుంచి ఉదయం 7 గంటలకు రాయచోటి, పీలేరు మీదుగా సూపర్ లగ్జరీ సర్వీసు నడుస్తుందని, ఇందులో చార్జీగా రూ. 1193 చెల్లించాలన్నారు. అంతేకాకుండా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. -
హెచ్చరికలు బేఖాతర్
ఒంటిమిట్ట: మండల పరిధిలోని పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 296లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై టీడీపీకి చెందిన గంగపేరూరు గ్రామంలోని ఓ నాయకుడి కన్ను పడింది. సుమారు ఎకరం వరకు చదును చేశారు. దీనిపై గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తప్పెటవారిపల్లికి చెందిన తప్పెట సుబ్బారెడ్డి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో, కడప కలెక్టరేట్లోని డీఆర్వో విశ్వేశ్వరయ్యనాయుడుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడ జరుగుతన్న ఆక్రమణలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, వీఆర్వో అంజయ్య నిలిపివేయించి, మళ్లీ అక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆక్రమణ దారుడిని హెచ్చరించారు. రెవెన్యూ వారు హెచ్చరించినా..తమ పార్టీ అధికారంలో ఉందనే ధీమాతో వారి హెచ్చరికను భేఖాతర్ చేసి బుధవారం అర్థరాత్రి ఎకరా ప్రభుత్వ భూమిని పూర్తిగా చదును చేశాడు. దీంతో తప్పెట సుబ్బారెడ్డి ఈ సమస్యను గురువారం మళ్లీ డీఆర్వో విశ్వేశ్వరయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది తెలుసుకున్న డీఆర్వో ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులను ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు దారుడు తప్పెట సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై డీఆర్వో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ భూమిని చదును చేసిన ఆక్రమణదారుడు -
అయ్యప్ప స్వాముల మినీ బస్సుబోల్తా
సంబేపల్లె : మండలంలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రాత్రి అయ్యప్ప స్వాముల మినీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటన సంబేపల్లె మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 18 వ తేదీన శబరిమలై యాత్రకు వెళ్లారు. ఈ నెల 22వ తేదీన అయ్యప్పను దర్శించుకొని తిరిగి సొంత గ్రామానికి వెళుతుండగా సంబేపల్లె మండల కేంద్రానికి రాగానే అయ్యస్వాములు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. బస్సులో డ్రైవర్తో పాటు 15 మంది భక్తులు ఉన్నారు. డ్రైవర్ రాజు, ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో భక్తులు, స్థానికులు అయ్యప్ప స్వామి కాపాడాడని తలుచుకొన్నారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించారు. -
చదువులు చట్టుబండలు
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఇక చట్టుబండలు కానున్నాయి. రోజుకో పథకం, పర్యవేక్షణల పేరుతో చదువులు అటకెక్కుతున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో పిల్లల హాజరు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, పరీక్షల మూల్యాకనం మార్కులు ఆన్లైన్ చేయడం, పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయడం వంటి పనులతో అరగంట విశ్రాంతి లేకుండా అల్లాడి పోతున్న అయ్యవార్లకు తాజాగా ముస్తాబు పేరుతో మరో పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అయ్యవార్లు దిక్కుతోచని పరిస్థితుల్లో అంతర్గతంగా కుమిలిపోతున్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు. ముస్తాబుతో ముప్పుతిప్పలు... అయ్యవార్లకు కొత్త అగచాట్లు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వంలో అయ్యవార్లుకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ రచ్చ చేసిన అప్పటి ప్రతి పక్షం గద్దెకెక్కిన తర్వాత నాడు చెప్పిన మాటలను విస్మరించి బోధనేతర పనులు అప్పగిస్తుండటంపై అయ్యవార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదోతరగతి ప్రణాళిక అమలుకు సంబంధించి ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇతర శాఖల కర్రపెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న పంతుళ్లపై చంద్రబాబు ప్రభుత్వం ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం మోపింది. దీంతో విద్యార్థులను ముస్తాబు చేయలేక చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల ఇలా.... ప్రభుత్వ పాఠశాలల్లో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ముస్తాబు కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జోవొ నంబర్– 43 ఇచ్చింది. తప్పని సరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన. సబ్బు, హ్యాండ్వాస్, నెయిల్ కట్టర్ ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణా ఉండేలా చూడాలన్నది ఈ జీవో సారాంశం. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్లను ఎంపిక చేయడం రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు పరిశుభ్రంగా వచ్చే వారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం, లేదా దువ్వించడం చేయించాలి. అయితే ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు, యూనియన్లు భగ్గమంటున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా.. లేక ముస్తాబు చేయాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం... వాస్తవానికి ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యవార్లు ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది. దీతో కొన్ని బడుల్లో ముస్తాబు కార్నర్లు కనిపించని పరిస్థితి చోటు చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రం పరుచుకోవడం వంటివి అవసరమే.. అయితే విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటిని ఉంచడం వల్ల వారు చదువుపై కన్నా వ్యక్తిగత సౌందర్యంపైన శ్రద్ధ చూసే అవకాశాలు లేకపోలేదని పలువురు విద్యావంతులు, మేధావులు అంటున్నారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎలా ఉన్నా ఈ ప్రభావం హైస్కూళ్లపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు, గురువులు ఇవేం ఉత్తర్వులంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పునరాలోచించాలి ఒకదాని వెంట ఒకటి బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా రకరకాల యాప్లతోపాటు ముస్తాబు వంటి బోధనేతర కార్యక్రమాల బాధ్యతలు మోపడంవల్ల బోధన మరుగున పడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాలి. – అమర్నాథరెడ్డి, వైఎస్సార్టీఏ, జిల్లా అధ్యక్షుడు బోధనకు ఆటంకం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ముస్తాబు కార్యక్రమం రూపొందించింది. తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఉపాధ్యాయులపై రుద్ది, అవి చేయలేదని వారిని సమాజంలో దోషులుగా చూపెట్టడం బాధాకరం. ముస్తాబుపై ఎక్కువ దృష్టి సారిస్తే బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం యాప్ల గొడవ, స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర , ముస్తాబు, రోజు ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కల్పించాలి. – లెక్కల జమాల్ రెడ్డి, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. రాష్ట్ర అధ్యక్షులు ముస్తాబు పేరుతో మరో పథకం గురువులకు కొత్త అగచాట్లు పాఠశాలల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేయాలని జీవో విడుదల ఉపాధ్యాయ సంఘాల మండిపాటు -
బోయనపల్లెలో బీహారీల గంజాయి!
రాజంపేట : రాజంపేట మండలం బోయనపల్లె (కడప–రేణిగుంట జాతీయ రహదారి)లో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టయింది. బోయనపల్లెను వీడని గంజాయివాసన అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కొద్దిరోజుల క్రితం గంజాయి మత్తులో కొంతమంది యువకులు నేరాలకు పాల్పడిన సంఘటనలతో మన్నూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ప్రసాద్బాబు నేతృత్వంలో.. మన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్బాబు నేతృత్వంలో పోలీసులు బోయనపల్లెలో గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా...బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లా సాధూలేపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తిరుపతి జిల్లా వడమాలపేట, లక్ష్మీపురానికి చెందిన రావెళ్ల మోహన్, బీహార్కు చెందిన మహదేవచౌదరి, రైల్వేకోడూరు మండలం సమతానగర్కు చెందిన మాడగడపాల దియా, పుల్లంపేటకు చెందిన దాసరి తరుణ్, పుల్లంపేట మండల దళవాయిపల్లెకు చెందిన కట్టే ప్రవీణ్కుమార్రెడ్డి, రాజంపేట మండలం ఇసుకపల్లె లక్ష్మీపురానికి చెందిన పిడుగు అజయ్లు బోయనపల్లెలో గంజాయి రవాణా, అమ్మకాలకు కారణంగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి పది కేజీల గంజాయి, ఆరుసెల్ఫోన్లు, రూ.3వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసిన రిమాండ్ నిమిత్తం రాజంపేట కోర్టుకు పంపించారు. నేరమిలా.. గంజాయి కేసులో బీహార్కు చెందిన వారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో గంజాయిని తీసుకురావడం కొనసాగుతూ వచ్చింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో డాబా నడుపుతూ, వాహనాల డ్రైవర్ల ద్వారా చుట్టూ ప్రాంతాల వారికి రవాణా చేస్తున్నారు. స్థానికంగా పంపిణీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు విక్రయం వంటి విధానం వల్ల గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం పోలీసులు విచారణలో బహిర్గతమైంది. గంజాయి పట్టివేతలో సీఐ ప్రసాద్బాబు, పోలీసుల ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి.ఏడుగురిని అరెస్టు చేసిన మన్నూరు పోలీసులు -
వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయమని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు అన్నారు. మూడోసారి గల్ఫ్ కన్వీనర్గా ఎన్నికై గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, దుబాయ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దిగ్విజయంగా నిర్వహించి కడపకు విచ్చేసిన బీహెచ్ ఇలియాస్ను వారు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇలియాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మునీర్ సిద్ధిఖీ, నెల్లూరు జిల్లా యువజన విభాగం కార్యదర్శి షేక్ అలీం, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హలీమ్, సయ్యద్ జమీర్, షేక్ సలీం పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ రేంజ్ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలిలా.. రాయవరం సెక్షన్ వానరాచపల్లె బీట్ పరిధిలోని తాటిమానుపెంట ప్రదేశంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోందనే సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది రాత్రి 9 గంటల సమయంలో ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అశోక్ లేలాండ్ దోస్త్ (టీఎన్ 92జే 1679) వాహనం వీరికి ఎదురుగా వస్తుండగా వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని గుర్తించి కిందకు దూకారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పొదలలో పారిపోయారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 1205 కేజీల బరువున్న 30 ఎర్రచందనం దుంగలున్నాయి. వాహనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.11,82,620, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని సానిపాయి రేంజ్ అధికారి తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్ఓ రమేష్బాబు, సానిపాయి స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణకు ప్రణాళిక
● జనవరి 21న కల్యాణం ● 22న శోభాయాత్రకడప సెవెన్రోడ్స్ : కడప గడపలో మూడవ శ్రీరామ మహా శోభాయాత్రను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గురువారం హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలోఅయోధ్య ఐక్యవేదిక ప్రతినిధి దేసు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర ప్రముఖులు, వివిధ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కమనీయంగా నిర్వహిచేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి సమావేశంలో చర్చించారు. మరుసటిరోజు జరిగే శ్రీరామ మహా శోభాయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. భజన బృందాలు, కోలాటాలు, భజరంగి విన్యాసాలు, కేరళ వాయిద్యాలు, పిల్లన గ్రోవి, తప్పెట దరువులు, రాజస్తానీ యువకుల డప్పు వాయిద్యాలు, మరెన్నో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగించాలని నిర్ణయించారు. విస్తృత ప్రచారం సీతారామ కల్యాణం, మహా శోభాయాత్ర గురించి ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని ఆలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్యాణం, శోభాయాత్ర విజయవంతానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వీటి నిర్వహణకు అవసరమయ్యే నిధుల సమీకరణగురించి సమావేశంలో చర్చించారు. శోభాయాత్రకు ఎప్పటిలాగా వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన, చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్రెడ్డి, సూర్యనారాయణరావు, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అందూరి రామకృష్ణారెడ్డి, బీజేపీ నేత బాలకృష్ణయాదవ్, దేవతి శంకరయ్య, కడప ఎమ్మెల్యే తనయుడు శ్రావణ్రాజ్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వేణుగోపాల్రెడ్డితోపాటు పలువురు నగర ప్రముఖులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహా శోభయాత్రకు పూర్తి సహకారం – నగర మేయర్ పాకా సురేష్కుమార్ శ్రీరామ మహా శోభాయాత్రకు కార్పొరేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ పాకా సురేష్కుమార్ తెలిపారు. శ్రీ రామ శోభాయాత్రకు కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో కళ్యాణోత్సవం, శానిటేషన్, ప్రతి సర్కిల్లో లైటింగ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. -
కోట్ల రూపాయల స్థలంపై కన్ను
ఓబులవారిపల్లె : రైల్వేకోడూరు పట్టణ నడిబొడ్డు లక్ష్మీనగర్లో పెత్తందారులు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఆన్లైన్ చేయించి దళితవాడ గ్రామస్తులను పురమాయించి కోట్ల రూపాయల పేదల ఇంటి స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల క్రితం సర్వే నంబరు. 7/3, 7/4, 7/5, 13/1ఎ సర్వే నంబర్లలో దాదాపు ఆరు ఎకరాల భూమిలో ఇంటి స్థలాలను దళితులు, నాయీబ్రాహ్మణ తదితర కులాలకు చెందిన వారు వందమందికి పైగా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వాళ్ల ఆధీనంలో ఉంది. అయితే కొందరు భూ బకాసురులకు కోట్ల రూపాయల స్థలంపై కన్ను పడింది. 2017వ సంవత్సరంలో అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని కోడూరు దళితవాడ గ్రామస్తులతో కలిసి దౌర్జన్యం చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాజంపేట ఎస్పీ ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారించి పేదల పక్షాన నిలబడ్డారు. అయితే కొందరు పెత్తందారులు కోడూరు దళితవాడ గ్రామస్తులను ఉసిగొలిపి వారివద్ద ఎలాంవంటి పత్రాలు లేకున్నా కూడా పేదల స్థలాల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను సైతం లెక్కచేయకుండా తిరగబడుతున్నారు. గురువారం ఈ సర్వే నంబర్లలో నీటి పైపులైను రోడ్డు వేస్తున్న అధికారులను, స్థల యజమానులను బెదిరించి గొడవలకు పాల్పడ్డారు. వారివద్ద పత్రాలు తీసుకురమ్మని ఎన్ని మాటలు చెప్పినా మా తాతల భూమి అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు పరిశీలించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కరుణామయుడు ఉదయించాడు
కడప సెవెన్రోడ్స్: ప్రపంచ మానవాళిని రక్షించేందుకే దేవుడు తన ప్రియ పుత్రుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని సీఎస్ఐ సెంట్రల్ చర్చి బిషప్ ఐజాక్ వరప్రసాద్ అన్నారు. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని సీఎస్ఐ సెంట్రల్ చర్చిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన ప్రసంగం చేశారు. సంవత్సరకాలం నుంచి ఎదురు చూసిన శుభ తరుణం క్రిస్మస్ రూపంలో వచ్చిందని లోకమంతా ఆనందోత్సాహాలతో పర్వదినంగా నిర్వహించుకుంటున్నదని తెలిపారు. క్రీస్తును హృదయాలలో నింపుకునే అపూర్వ అవకాశం ఈ పండుగ ద్వారా లభిస్తోందన్నారు. మన సంతోషాన్ని ఇరుగుపొరుగులతో పంచుకున్నప్పుడే నిజమైన హ్యాపీ క్రిస్మస్ అని ఆయన అభివర్ణించాడు. హృదయశుద్దిగల వారినే ప్రభువు ప్రేమిస్తాడన్నారు. క్రీస్తు అందరికీ ప్రభువని, అందరినీ సమానంగా ఆదరించే మహానీయుడన్నారు. మంచి చేసే వారిని ప్రోత్సహించి మనవంతుగా సహాయం చేయాలని క్రీస్తు ప్రభువు మానవాళికి సందేశమిచ్చాడన్నారు. కార్యక్రమంలో సహాయ గురువులు వాక్య పరిచర్య నిర్వహించారు. చర్చి కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు కడప నగరం రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్యమాత విచారణ డైరెక్టర్ ఆధ్వర్యంలో దివ్య బలిపూజ నిర్వహించారు. బిషప్ ఐజాక్ వరప్రసాద్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు -
హత్య చేసి.. రైలు పట్టాలపై పడేసి..
● అదృశ్యమైన వ్యక్తి హత్య ● వివాహేతర సంబంధమే కారణమా.. ● ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సూచనతో స్పందించిన జిల్లా ఎస్పీతొండూరు/ముద్దనూరు : మండల కేంద్రమైన తొండూరు దళితవాడకు చెందిన పైడిపల్లె కిశోర్ (34) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది జులై 20వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన పైడిపల్లె కిశోర్ను కొంతమంది వ్యక్తులు హత్య చేసినట్లు తెలిసింది. గ్రామంలోని వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో ఆమె భర్త, బంధువులు పలుమార్లు కిశోర్ను మందలించినా కూడా మార్పు రాకపోవడంతో ఆమె భర్త కొంతమంది కిరాయి వ్యక్తులను ఆశ్రయించి కొంత మొత్తాన్ని సుపారీగా ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడైంది. పైడిపల్లె కిశోర్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కిశోర్ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కనిపించకపోవడంతో కిశోర్ సోదరులు, భార్య ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన తొండూరు పోలీస్ స్టేషన్లో రెండు నెలలుగా పైడిపల్లె కిశోర్ కనిపించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటి కేసు నమోదు చేశారు. అయినప్పటికి పోలీసులు పైడిపల్లె కిశోర్ ఆచూకీ తెలపకపోవడంతో ఏమయ్యారో తెలియక నానా తంటాలు పడ్డారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సూచనతో స్పందించిన జిల్లా ఎస్పీ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పైడిపల్లె కిశోర్ కుటుంబ సభ్యులు కలిసి కిశోర్ ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈ ఏడాది నవంబర్ 13వ తేదీన ఎంపీకి మొరపెట్టుకున్నారు. దీనికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్పందించి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్కు పైడిపల్లె కిశోర్ మిస్సింగ్ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకుని దర్యాప్తు చేయాలని సూచించారు. దీంతో జిల్లా ఎస్పీ అన్ని కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు జరిపించి పైడిపల్లె కిశోర్ను హత్య చేసి ముద్దనూరు సమీపంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై శవాన్ని వేసినట్లు గుర్తించారు. అయితే పైడిపల్లె కిశోర్ ఇంటి నుంచి ఈ ఏడాది జులై 20వ తేదీన వెళ్లగా 5 రోజుల తర్వాత అంటే 25వ తేదీన ముద్దనూరు రైల్వేస్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్పై మృతదేహం లభ్యమైంది. అప్పట్లో రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. అయితే ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జిల్లా ఎస్పీకి కిశోర్ మిస్సింగ్ కేసు గురించి ప్రత్యేక చొరవ చూపాలని కోరిన వెంటనే ఎస్పీ అన్ని కోణాల్లో విచారణ జరపడంతో రైల్వే ట్రాక్పై పడి ఉన్న మృతదేహం పైడిపల్లె కిశోర్దేనని తేలింది. దీంతో రైల్వే పోలీసులు కిశోర్ కుటుంబ సభ్యులను పిలిపించి జరిగిన విషయంపై విచారణ చేశారు. అప్పటికే విచారణలో పైడిపల్లె కిశోర్ హత్యకు గురైన రోజు రూ.1000 వేరే అకౌంట్లో నుంచి అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించినట్లు తెలిసింది. ఆ డబ్బులను కిశోర్ ఏటీఎం ద్వారా డ్రా చేశారు. డ్రా చేసిన కొంత సమయానికి చెన్నారెడ్డిపల్లె సమీపంలో అండర్ బ్రిడ్జి వద్దకు కిశోర్తోపాటు మరికొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించినట్లు రైల్వే పోలీసుల విచారణలో తెలిసింది. దీన్నిబట్టి పథకం ప్రకారమే కిశోర్తో వారు మద్యం తాగించి అనంతరం అతన్ని రైల్వే ట్రాక్పై పడేసి హత్య చేసినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కిశోర్ అకౌంట్లోకి రూ.1000 డబ్బులు వేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు హత్య బండారం బయటపడినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం కారణంగా కిశోర్ను హత్య చేయించినట్లు తెలిసింది. త్వరలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకుంటామని ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలోని బుగ్గవంక బ్రిడ్జి వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని గుర్తించిన వారు కడప రైల్వే సీఐ 94406 27398, ఎస్ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. గుండె పోటుతో వైద్యుడు శశికాంత్ మృతిమైదుకూరు : మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు సి.శశికాంత్ (52) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. శశికాంత్ తండ్రి ప్రముఖ వైద్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగసింహ ఈనెల ఒకటో తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తండ్రి మృతి చెందిన 25 రోజులకే కుమారుడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. కరెంట్ షాక్తో బాలికకు తీవ్రగాయాలు మదనపల్లె రూరల్ : ఇంటిమిద్దైపె ఆడుకుంటుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి చదువుతున్న బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద, శ్రావణి దంపతుల కుమార్తె రెడ్డిప్రసన్న(10) స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో అదే వీధిలోని నిర్మలమ్మ ఇంటి మిద్దైపె తోటిపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, మిద్దైపె తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు విద్యార్థినికి తగలడంతో షాక్కు గురై తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు...అప్పులు...అనారోగ్యం వెరసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగుచూసింది. కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన రామస్వామి, శివమ్మ దంపతుల కుమారుడు హరినాథ్(32)కు తంబళ్లపల్లె మండలం మూలపల్లెకు చెందిన గంగాదేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవించేవారు. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వచ్చిన హరినాథ్ తల్లిదండ్రులతో పాటు ఇంట్లోనే ఉండేవాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఆరోగ్యం మెరుగుపడలేదు. అంతేకాకుండా చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సమస్యలు, భార్య లేక ఒంటరితనం తదితర కారణాలతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోపుగా హరినాథ్ భార్య గంగాదేవి తన భర్త మృతి చెందడంపై తనకు అనుమానం ఉందంటూ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ముందంజలో సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా సాగుతోంది. రెండవ రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 42 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 71 ఓవర్లకు 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 77 పరుగులు, ఆనంద్ జోషయ్య 40 పరుగులు చేశారు. సౌరాష్ట్ర జట్టులోని మోహిత్ ఉల్వా 3 వికెట్లు, వత్సల్ పటేల్, పుష్పరాజ్ జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 25 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఆ జట్టులోని రుద్ర లక్షణ 57 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని తోషిత్ యాదవ్ 2 వికెట్లు, సాయి 2 వికెట్లు తీశారు. సౌరాష్ట్ర జట్టు 145 పరుగుల ముందంజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.ఉత్సాహంగా సాగుతున్న కూచ్బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ -
ప్రభుత్వ భూమి కబ్జా.!
సిద్దవటం : మండలంలోని పెద్దపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో మాధవరం–1 గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిని స్థానికులతో కలిసి కొందరు ఆక్రమించే పనులు చేపట్టారు. దాదాపు 40 ఎకరాలకు పైబడిన భూమిపై మొక్కలు తొలగించి చదును చేశారు. మాధవరంలోని 937 సర్వే నంబరులో దాదాపు 154 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మాధవరం–1లోని ఎస్కెఆర్ నగర్ దళితులు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మా భూములు మాకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సోమశిల వెనుక జలాల గ్రామాలు ముంపునకు గురై ఇక్కడికి గతంలో మాధవరం–1లోని ఎస్ఎఆర్ నగర్ దళితులు వలస వచ్చారు. జీవనాధారం కోసం ప్రభుత్వ భూములు మంజూరు చేయాలని అధికారులను పలుమార్లు కోరారు. వారికి భూపంపిణీ కింద పట్టాలు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అయితే నేటికీ వారికి పట్టాలు మంజూరు చేయలేదు. తరచూ ఈ భూమి ఆక్రమణ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తుండటంతో సర్వే చేసి తమకు భూమి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు దళితులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమిని కొందరు పొక్లెయిన్ యంత్రం తెచ్చి భూమిలో చదును పనులు చేపట్టారు. ఈ భూమిపై తమకు ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల పైబడి పట్టాలు ఉన్నాయంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. భూకబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ వారు రాత్రి వేళ పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ భూముల పక్కన నేషనల్ గ్రీన్ హైవే రహదారి నిర్మాణం కోసం పనులు కొనసాగుతుండటంతో అందరి కళ్లు ఈ భూమిపైన పడ్డాయని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమకు భూములు ఇచ్చేంత వరకు నిరవధిక రిలే నిరాహారదీక్షలు చేస్తామని చదును చేసిన స్థలంలో వారు ఆందోళన చేస్తున్నారు.నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టిన దళితులు -
క్రిస్మస్ వేడుకలలో వైఎస్ జగన్
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి విచ్చేసిన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదినం, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏటా క్రిస్మస్ పర్వదినం రోజున నా సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొనడం మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, చర్చి ఫాదర్లు రెవరెండ్ డాక్టర్ థామస్ ప్రసాదరావుబాబు, నరేష్ బాబు, మృత్యుంజయరావులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2026 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్ను ఆవిష్కరించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, డాక్టర్ సుధ, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్, కడప మేయర్ పాకా సురేష్, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి పాల్గొన్నారు. -
క్రిస్టమస్ వేడుకలో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఆయన ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందుల వాసులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. -
నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలి మృతి
రాయచోటి టౌన్ : నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రాయచోటి పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో నివాసముండే మకుర్నిసా (65) అనే వృద్ధురాలు బుధవారం రాత్రి బయటి నుంచి ఇంటిలోకి వెళుతోంది. అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ ఆమెను గమనించక ట్యాంకర్ను వెనక్కు మళ్లించే క్రమంలో ఆమెను ఢీకొంది. వెనుక చక్రం కింద పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు. జాతీయ స్థాయి సైన్స్ఫేర్కు కడప విద్యార్థి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి సైన్సు ఫేర్లో భాగంగా ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడ మురళి రిసార్ట్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో కడప విద్యార్థి ఘన విజయం సాధించి సౌత్ జోన్ సైన్సుఫేర్కు ఎంపికయ్యాడు. కడప నగరం అంగడివీధి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ. గిరీష్ అనే విద్యార్థి గైడ్ టీచర్ మాధవి నారాయణ మార్గ దర్శకత్వంలో స్నేక్ బైట్ అలర్ట్ అనే వర్కింగ్ మోడల్ను ప్రదర్శించి తమ ప్రతిభను చాటి అందరి మన్ననలు పొందాడు. రాష్ట్రస్థాయిలో ఘన విజయం సాధించిన విద్యార్థి గిరిష్ త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్సుఫేర్లో పాల్గొననున్నాడు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్లో ప్రతిభ చాటిన విద్యార్థి గిరీష్, గైడ్ టీచర్ మాధవి నారాయణ, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినేజర్లను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ క్రిష్ణారెడ్డి, డీఈఓ షేక్ షంషుదీ్ద్న్ అభినందించారు. -
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రామాపురం:నిందితుడితో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనమోహన్, సిబ్బందిసిద్దవటం:నిందితుడు, ఎర్రచందనం దుంగలతో సిద్దవటం రేంజర్ కళావతి, సిబ్బందిసిద్దవటం : కూంబింగ్ సిబ్బంది దాడి నిర్వహించి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళ కూలీని అరెస్టు చేసినట్లు రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. సిద్దవటం రేంజ్లోని గొల్లపల్లి బీటు, గొల్లపల్లి సెక్షన్ నల్లబండలు, సాలుపెంట ప్రదేశంలో మంగళవారం తమ సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళ్లడాన్ని తాము చూశామన్నారు. వారు తమ సిబ్బందిని చూసి పరారవుతుండటంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఒక తమిళ కూలీని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ లభించిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 479 కేజీలు ఉంటుందని, వీటి విలువ రూ.1.39 లక్షలు చేస్తుందన్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడిన నిందితుడు తమిళనాడు రాష్ట్రం వేలూరు తాలూకా చిన్నతటన్ కొంటై గ్రామానికి చెందిన మునిస్వామి అలియాస్ ముత్తుస్వామి అన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టుకు హాజరుపరిచామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, గొల్లపల్లి ఎఫ్బీఓ మధు, సిద్దవటం ఏబీఓ హైమావతి, ప్రొటెక్షన్ వాచర్లు, సైక్లింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. రామాపురం : రాయచోటి రేంజ్ రామాపురం మండలంలోని గువ్వలచెరువు తూర్పు బీటు పరిధిలో కూంబింగ్ నిర్వహించి ఒక తమిళ కూలీని అరెస్టు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనమోహన్ తెలిపిన వివరాల మేరకు.. వేపమాను బోటు ప్రదేశంలో ఏడుగురు తమిళ కూలీలు ఎర్రచందనం చెట్లు నరుకుతుండగా చుట్టుముట్టి పట్టుకునేందుకు ప్రయత్నించగా తమిళనాడుకు చెందిన కన్నాబిరాన్ పట్టుబడ్డాడు. మిగిలిన వారందరూ తప్పించుకున్నారు. అతని వద్ద నుంచి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళ కూలీ అరెస్టు -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది లెక్కల గోవర్దన్రెడ్డి(30) అనే యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో జరిగింది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె గ్రామానికి చెందిన లెక్కల గోవర్దన్రెడ్డి ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు కొండారెడ్డి, లక్ష్మీదేవి చనిపోయారు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్ద అక్క అయిన భారతి భర్త థర్మల్లో ఉద్యోగం చేస్తుండటంతో గోవర్దన్రెడ్డిని తీసుకెళ్లి బీటెక్ వరకు చదివించారు. కానీ ఉద్యోగం రాకపోవడంతో అక్క వద్దనే ఉంటూ థర్మల్లో హోటల్ పెట్టుకొని జీవిస్తున్నాడు. మంగళవారం హోటల్ మూసివేసి ప్రొద్దుటూరుకు వెళ్లి వస్తా అని అక్కతో చెప్పి ఇంటినుంచి వచ్చాడు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గండికోటలో ప్రైవేట్ రిసార్ట్లో గది అద్దెకు తీసుకున్నాడు. బుధవారం తెల్లవారి 9 గంటలైనా తలుపులు తెరవకపోవడంతో గది యాజమానికి అనుమానం వచ్చి పిలువగా పలకలేదు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా చీర అంచుతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఉన్నట్లు తెలిసింది. ఆ మేరకు అతని కుటుంబ సభ్యులకు విషయం చేరవేశారు. ఉరివేసుకునే ముందు లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉన్న ఒక్క తమ్ముడు చనిపోవడంతో ముగ్గురు అక్కలు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. -
బతిమాలినా ఆపని డ్రైవర్
మైదుకూరు: ప్రయాణికుల పట్ల ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తన గ్రామానికి వెళ్లే స్టేజి వద్ద బస్సు ఆపమని బతిమలాడినా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ససేమిరా అంటూ ముందుకు తీసుకెళ్లడంతో బస్సులో నుంచి దూకి ఓ విద్యార్థిని తీవ్ర గాయాల పాలైన సంఘటన మైదుకూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని వేపరాలపల్లె గ్రామానికి చెందిన ధనికెల స్రవంతి అనే విద్యార్థిని చాపాడు మండలంలోని పల్లవోలు సీబీఐటీ కాలేజీలో బీటెక్ చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని, సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు మైదుకూరులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కింది. బస్సు కర్నూలు–చిత్తూరు జాతీయ రహ దారి బైపాస్ వద్దకు రాగానే బస్సు ఆపాలని కండక్టర్ను కోరింది. కండక్టర్ బస్సు ఆపాల్సిందిగా డ్రైవర్కు చెప్పినా అతను పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సును ఆపా లని విద్యార్థిని బతిమలాడింది. కండక్టర్, ప్రయాణికులు గట్టిగా కేకలు వేసి ఆపాలని చెప్పినా నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు. విద్యార్థిని దిగాల్సిన స్టేజి నుంచి కిలోమీటర్ దూరంలోని శ్రీనగరం గ్రామ సమీపంలో బస్సు ఆపడేమోనన్న ఆందోళనతో విద్యార్థిని స్రవంతి బస్సులో నుంచి దూకింది. విద్యార్థిని తలకు, భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనగరం గ్రామస్తులు, ప్రయాణికులు గాయపడిన విద్యార్థిని మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డిపో మేనేజర్ శ్రీలత ఆసుపత్రిలో స్రవంతిని పరామర్శించారు. అర్బన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విషయం తెలుసుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. బస్సు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలో విద్యార్థుల ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు – 2025లో కడపలోని శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఇందులో హర్షిత్ సాయి, రిషిత రామ్, చరణ్ రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మైథిలి, అకడమిక్ డైరెక్టర్ జితేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శివరాం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కూచ్బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. బుధవారం కడప వేదికగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 66.2 ఓవర్లకు 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వన్ష్ ఆచార్య 134 బంతుల్లో 18 ఫోర్లతో 124 పరుగులు, హర్వాన్ష్ సింగ్ 27 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని తోషిత్ యాదవ్ 14 ఓవర్లకు 50 పరుగులిచ్చి 3 వికెట్లు, ప్రణవ్ రెడ్డి 2 వికెట్లు, రాజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు నిర్ణీత 17 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 21 పరుగులు, హానీష్ వీరారెడ్డి 13 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలు
కడప కోటిరెడ్డిసర్కిల్/నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే స్టేషన్ యాడ్ సమీపంలో 30 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారాన్ని అందుకున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మాట్లాడే స్థితిలో లేకున్న ఆ యువకుడి వివరాలు తెలియాల్సింది. ఇతనికి సంబంధించిన వారు తమను సంప్రదించాలని కడప రైల్వే పోలీసులు తెలిపారు. ఎస్పీ క్రిస్మస్ శుభాకాంక్షలు కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమ, కరుణకు ప్రతీకగా జరుపుకునే మహత్తర పండుగ అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటి విలువలు మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. తరిగొండ దర్గాలో హుండీ ఆదాయం చోరీ గుర్రంకొండ : మండలంలోని తరిగొండ హజరత్ మురాద్షావలీ దర్గాలో రెండు హుండీలను పగులగొట్టి అందులో డబ్బులను దుండగులు చోరి చేసుకెళ్లిన సంఘన బుధవారం జరిగింది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ దర్గాకు ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తులు బాబాకు కానుకలను హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈనేపథ్యంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దర్గాలోని రెండు హుండీలను పగులగొట్టి అందులో నగదును ఎత్తుకెళ్లారు. దర్గాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి డేటా రికార్డులు ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈరోజు యథావిధిగా దర్గా తెరవడానికి వచ్చిన దర్గా నిర్వాహకులకు హుండీలు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వైఎస్ జగన్తోనే రాష్ట్రం అభివృద్ధి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని బేతేలు చర్చి సమీపంలో ఉన్న టీడీపీ నాయకులు బుధవారం కౌన్సిలర్ శ్యామలాదేవి, కౌన్సిలర్ కోడి రమణ, చిన్నల ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీకి చెందిన యూసఫ్, నూరి, ఇబ్రహీం, ఖాజా, షమీనా, భాను, మాబ్జాన్, ఆయేషా, చిన్న ఆయేషా, హజీరా, హనీఫా, ఆదాం, మహమ్మద్, హమీదా, మాబ్జాన్, రబియా, షబీనా, మున్ని, మా బాషా, షబీనా, అమ్మాజి, నూర్ మున్నా తదితరులకు పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి పారీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరిన వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇంటి వద్దకు వచ్చి అందించేవారని, ఈ ప్రభుత్వంలో ఒక పథకం కూడా అందలేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు కూటమిని వీడి వైఎస్సార్సీపీలో చేరామన్నారు. గత ప్రభుత్వంలో 15 రోజులు ఇంటి వద్దకు వచ్చి రేషన్ బండ్లు రేషన్ ఇచ్చేవని, ఈ కూటమి ప్రభుత్వంలో రెండు రోజులకే రేషన్ బియ్యం అయిపోయాయని డీలర్లు చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు వేచి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, వైఎస్సార్సీపీ నాయకులు వీరారెడ్డి, చలపతి, నరసారెడ్డి, కనక పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు జగనన్న పాలన బెస్ట్.. కూటమి పాలన వేస్ట్ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో 20 కుటుంబాల చేరిక కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ మనోహర్రెడ్డి -
రిటైర్డు ఈఓపై చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : అగస్త్యేశ్వరస్వామి ఆలయ రిటైర్డు ఈఓ రామచంద్రాచార్యులుపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి బంగారు, వెండి నగల లెక్కింపులో, డబ్బు జమలో అవకతవకలు జరగడం బాధాకరమని తెలిపారు. ఆయన వేలం నిర్వహించేటప్పుడు సమాచారం ఇవ్వరని, అధికారులకు, పత్రికలకు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా జరిపిస్తారన్నారు. నామా ఎరుకలయ్య ఆశ్రమంలోని డైట్ కాలేజీ గదులు, నెల్లూరు జిల్లా భరద్వాజ ఆశ్రమానికి సంబంధించిన గదుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసి అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అందరికీ అండగా ఉంటుంది
పులివెందుల: కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్వరంతో బాధపడుతుండడంతో తన రెండవ రోజు పర్యటన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. భాకరాపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచేకాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చిన ప్రజలను నిరాశపరచకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను ఆయా ప్రాంతాల వైఎస్సార్సీపీ నాయకులకు తెలియజేస్తూ, మరికొన్ని సమస్యలను తానే పరిష్కరిస్తూ, మరికొన్నింటిని జగనన్నకు తెలియజేస్తానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కొంతమంది తమను కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగనన్న అండగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదుర్కొని వారు చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.● ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
పలువురికి పదోన్నతులు
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో బుధవారం డిప్యూటీ డెమోగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెల్త్ ఎడ్యుకేటర్స్కు డిప్యూటీ డెమోగా పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల ( స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ప్రేమంత్కుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 2026 జనవరి 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను కడప ఎన్జివో కాలనీలోని సమగ్రశిక్షకార్యాలయంలో అందచేయాలని తెలిపారు. -
● సెమీ క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ కుటుంబం
వేంపల్లె మండలం ఇడుపులపాయలోని నెమళ్ల పార్కు పక్కన ఉన్న ఓపెన్ ఎయిర్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను వైఎస్ కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్షలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏటా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ లో వైఎస్ విజయమ్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్య కారణంగా సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు.వైఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో పాస్టర్లు మృత్యుంజయరావు, బెనహర్, నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం బంధువులందరినీ పలకరిస్తూ వారి యోగ క్షేమాలను వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ విజయమ్మలు అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మేనత్త విమలమ్మ, అరకు ఎంపీ తనూజా రాణి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్రెడ్డి సతీమణి సమతమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, షేక్షావలి, మునీర్, మటన్ బాబా, పోతిరెడ్డి శంకరయ్య, తువ్వపల్లె వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ ఆనందహేల
లోక రక్షకుడు ఉదయించిన వేళ.. కడప కాంగ్రిగేషనల్ టౌన్ చర్చిలో క్రిస్మస్ ట్రీకి విద్యుద్దీప అలంకరణ, పశువుల పాక సెట్టింగ్ విద్యుద్దీప వెలుగుల్లో క్యాథడ్రల్ చర్చి విద్యుద్దీప అలంకరణలో సీఎస్ఐ సెంట్రల్ చర్చి కరుణామయుని చల్లని చూపుల ప్రభావమేమో అంతటా వాతావరణం చల్లగా ఉంది. ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. తమశక్తి కొద్ది క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ క్రిస్మస్ తారలు వెలుగులు ప్రసరిస్తున్నాయి. క్రిస్మస్ తాతలు కానుకలతో ఇల్లిల్లూ తిరిగి చిన్నారులకు కానుకలు అందిస్తున్నాడు. శుభవార్తను గంభీరంగా చెబుతున్నట్లు మంద్రంగా చర్చి గంటలు... క్రీస్తుకు వెలుగుల స్వాగతం పలుకుతున్న కొవ్వొత్తులు... గురువుల బోధనలు, విశ్వాసుల ప్రార్థనలు....అంతా క్రిస్మస్ ఆనందహేల. అవును.. శాంతి స్వరూ పుడు, కరుణామయుడు ఏసు భువికి వచ్చిన వేళ! .. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి. గురువారం అర్థరాత్రి పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కడప నగరంలోని కాంగ్రిగేషనల్ టౌన్చర్చి, మరియాపురంలోని కేథడ్రల్ చర్చి, సీఎస్ఐ సెంట్రల్ చర్చి, రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చి, సంధ్య సర్కిల్లోని డాన్బాస్కో చర్చి, క్రై స్ట్ చర్చిలతోపాటు జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కలసపాడు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లోని ప్రముఖ చర్చిలలో కూడా గురువారం క్రిస్మస్ పండుగ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కెట్లోనూ క్రిస్మస్సందడి కనిపించింది. –కడప సెవెన్రోడ్స్ -
● ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాలు మినహా...
జిల్లాలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో సాధారణ సాగుకు మించి శనగపంట సాగైంది. జమ్మలమడుగు మండలంలో సాధారణసాగు 4486 హెక్టార్లుకాగా 5758 హెక్టార్లలో, ఎర్రగుంట్ల మండలంలో సాధారణసాగు 5076 హెక్టార్లుకాగా 5438 హెక్టార్లలో సాగైయింది. మిగతా బాగా సాగయ్యే మండలాలైన వేముల లో సాధారణసాగు 3213 హెక్టార్లకుగాను 2350, కమలాపురంలో 5686 హెక్టార్లకుగాను 4261 , తొండూరు మండలంలో 2435 హెక్టార్లకుగాను 784, లింగాల మండలంలో 2131 హెక్టార్లకుగాను 1250, ప్రొద్దుటూరు మండలంలో 3320 హెక్టార్లకుగాను 2990, రాజుపాలెం మండలంలో 7697 హెక్టార్లకుగాను 5134, సింహాద్రిపురంలో మండలంలో 6826 హెక్టార్లకుగాను 4900, పెండ్లిమర్రి మండలంలో 1863 హెక్టార్లకుగాను 1027, మైలవరం మండలంలో 4008 హెక్టార్లకుగాను 2730 హెక్టార్లలో శనగ సాగైంది.అత్యధికంగా సాగయ్యే మండలాల్లోనే ఈ ఏడాది శనగపంట అంతగా సాగుకాలేదు. -
మాజీ సీఎం వైఎస్ జగన్కు అస్వస్థత!
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నాటి కార్యక్రమాలు రద్దు అయ్యాయి. జ్వరంతో బాధ పడుతుండటంతో వైద్యుల సూచన మేరకు కార్యక్రమాలను రద్దు చేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. బెంగళూరు నుంచి మంగళవారం ఆయన పులివెందులకు చేరుకున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకల్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, అనారోగ్యం కారణంగా బుధవారం ఇడుపులపాయలోని సెమీ క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అనంతరం ‘వైఎస్’ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భోజనాలు అనంతరం పులివెందుల భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, ప్రజాదర్బార్ చేపట్టాల్సి ఉంది. తీవ్ర జ్వరం కారణంగా డాక్టర్ల సలహా మేరకు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బుధవారం కార్యక్రమాలు రద్దు డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతికి పరిమితం -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని పోస్టు చేశారు. Heartfelt congratulations to the Indian Space Research Organisation and its dedicated team on the successful #LVM3M6 / BlueBird Block-2 mission. Placing the satellite into its intended orbit is a proud moment for India and a testament to our scientific excellence. A Salute to the…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2025 -
రాబోయే రోజులు మనవే
సాక్షి కడప ప్రతినిధి/పులివెందుల: రాబోయే రోజులు మనవేనని, ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి కష్టం విని.. నేనున్నానని ధైర్యం చెప్పి ఊరడించారు. మంగళవారం ఆయన తన సొంత నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్టీఏ నూతన డైరీ, క్యాలెండర్లను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సు«ధ, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగించి గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే పేరు కలిసేలా జి రామ్ జి అని చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్సీపీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలను, గ్రామీణ ఉపాధి కూలీలను పస్తులు ఉంచేలా, వలసలు వెళ్లేలా కేంద్రం చూస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంపన్నులకు వెట్టి చాకిరీ చేసేందుకు మనుషులను సిద్ధం చేసే పనిలో భాగమే ఉపాధి హామీ తొలగింపు అన్నారు. బీజేపీ సంపన్నుల పక్షమే అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. మోడీకి అత్యంత ప్రియమైన వారు ఇద్దరు అయితే పూర్తిగా నచ్చని వారు ఇద్దరు ఉన్నారని, ఒకరు రైతులు, మరొకరు వ్యవసాయ కూలీలు అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టం మార్పుపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మగ్బుల్ బాషా, సిద్ధిరామయ్య, ఆంజనేయులు, అనంతపురం జిల్లా కార్యదర్శి అక్బర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణ, హక్కుల సాధనకు తోడ్పడాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లలు, మహిళల రక్షణతోపా టు వారి హక్కుల సాధనకు మహిళా పోలీసులు పా టుపడాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో బాలలకు ఉన్న చట్టాలు, మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి మహిళా పోలీసులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమాదేవి మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ సచివాలయ పరిధిలోని మహిళలు, పిల్లలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వాటిని నివృత్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శోభారాణి మహిళా పోలీసులు విధి నిర్వహణలో పాటించాల్సిన మెలకువలు, పిల్లల పట్ల వ్యవహరించాల్సిన వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో మహహిళా పోలీసులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ మిషన్ శక్తి సిబ్బంది పాల్గొన్నారు. నైపుణ్య ఆధారిత విద్యను అమలు చేయాలి కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధికి భరోసా ఇచ్చేలా నైపుణ్య ఆధారిత విద్య అమలు చేయాల్సి ఉందని ఆ దిశగా సిలబస్ రూపకల్పన జరగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. రెండు జిల్లాల డిగ్రీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీ ఓఎస్) చైర్మన్లతో మంగళవారం తన ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలిత ఆధారిత విద్యను అమలు చేయాల్సి ఉందన్నారు. డిగ్రీ కోర్సులలో ప్రస్తుత సమాజ అవసరాలను తీర్చే నాణ్యమైన సిలబస్ తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సిలబస్ తో పాటు, ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనంలో సరికొత్త మార్పులు అవసరమన్నారు. ఈ సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు, వివిధ డిగ్రీ సబ్జెక్టుల బీఓఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలకు 41ఏ నోటీసులు
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలను చేపడుతోంది. ఇందుకోసం పోలీసు అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులను బనాయించి తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కడపలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్టాండ్ సమీపంలో నవంబర్ 25వ తేదీన యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం క్రైమ్ నంబర్: 281/2025 కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసే ముందు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి.పుష్పరాజు, కానిస్టేబుల్ రాముడు నాయక్ల దగ్గర స్పెషల్ రిపోర్టు ద్వారా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు కడప కార్పొరేషన్ 25వ డివిజన్ ఇన్చార్జి షేక్ షఫీ, 21వ డివిజన్ ఇన్చార్జి శ్రీరంజన్ రెడ్డి, 23వ డివిజన్ ఇన్చార్జి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ ఐస్ క్రీం రవి, మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య, సీనియర్ లీడర్ జయచంద్రారెడ్డి, యువజన నాయకుడు గుంటి నాగేంద్ర, శంకరాపురానికి చెందిన సింధు, ఇంకా కొంత మందిపై అక్రమ కేసు బనాయించారు. మంగళవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలను పిలిపించి కడప వన్ టౌన్ పోలీసులు 41 ఏ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొందరు కడప పాత బస్టాండ్ సమీపంలో ఉన్న యాదాళ్ల నాగమ్మ సత్రంలో అక్రమ కట్టడాలను నిర్మిస్తుండగా తాము అడ్డుకునే ప్రయత్నం చేశామన్నారు. అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం అప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన తమపై అనుమతులు తీసుకోలేదనే నెపంతో అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలుగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో టీడీపీ నాయకుల అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నందుకు కక్ష సాధింపు -
అంబా అని అరిచినా...
పశు పోషకుల ఇంటి ముంగిటే మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సేవలు సైతం అంతంత మాత్రంగానే అందుతున్నాయని.. సంచార వాహనం ఒక ఊరికే పరిమితం చేస్తున్నారని పలువురు పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలకించరేమయ్యా..!కడప అగ్రికల్చర్: మూగజీవాల సంరక్షణ చర్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. పశు వైద్యశాలకు మందుల సరఫరాను పూర్తిగా అటకెక్కించింది. ఫలితంగా మందుల కోసం పశు యజమానులు ప్రైవేటు షాపులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జీవాల చెంతకే వచ్చి వైద్య సేవలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. దీంతో మూగ జీవాల వేదన అరణ్య రోదనగా మారింది. జిల్లావ్యాప్తంగా... జిల్లావ్యాప్తంగా 79 గ్రామీణ పశు వైద్యశాలలు, 78 పశు వైద్యశాలలు , 17 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు, ఎనుములు కలిసి 4,44,460 ఉండగా, 9,83,684 గొర్రెలు, 3,62,582 మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యంతోపాటు మందులు అందించాల్సి ఉంది. జిల్లాలో వేల మంది పాడి పశువులును నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చాలా మంది పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలం రావడంతో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. జబ్బు చేసిన జీవాలతో పశు వైద్యశాలకు వచ్చిన వారికి మందులు లేవనే సమాధనంతో పశు యజమానులు ఆందోళన చెందుతున్నారు. పాత కడప పశువైద్యశాలలో పశువుకు వైద్యం అందిస్తున్న పశువైద్య సిబ్బంది సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి మందులు రావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకసారి మాత్రమే మందులు వచ్చాయి. తొమ్మిది నెలల నుంచి ఇంకా మందులు రాలేదు. మందుల సరఫరా విషయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశు వైద్యశాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్స్టాక్ యూనిట్లు పరిగణించి డైరెక్టరేట్ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్ పెట్ట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆసుపత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు. పశు వైద్యశాలల్లో వేధిస్తున్న మందుల కొరత తొమ్మిది నెలలుగా సరఫరా కాని మందులు పశు యజమానులపై ఆర్థికభారం బడ్జెట్ కేటాయించారు జిల్లా పశు వైద్యశాలల్లో మందుల కోసం ప్రభుత్వం 2025–26కు సంబంధించి జిల్లావ్యాప్తంగా రూ. 1,59,27,987 బడ్జెట్ కేయించారు. గ్రామీణ పశువైద్యశాలకు రూ. 50 వేలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ. లక్ష, ప్రాంతీయ పశు వైద్యశాలకు రూ.1.25 కేటాయించారు. త్వరలో మందులు వస్తాయి.–శ్రీనివాసులు, జిల్లా పశువైద్యాధికారి, కడప -
స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. మంగళవా రం కలెక్టరేట్ బోర్డు మీ టింగ్ హాల్ నుంచి మధ్యా హ్న భోజన పథకంలో భాగంగా అందిస్తున్న ఆహారం తయారీలో నాణ్యమైన రుచి, పారిశుద్ధ్య మెరుగుపై అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పురోగతిపై నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో ఆరా తీశారు. మహిళా సాధికారతకు చక్కటి వేదిక ఆర్తీ విలేజ్ మహిళా సాధికారత సాధనకు, బాలికల విద్య, నైపుణ్య సామర్థ్యాల పెంపునకు చక్కటి వేదికగా నిలిచిన ఆర్తీ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆర్తి హోమ్ (ఆర్తీ విలేజ్) ప్రాంగణాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించి హోం పనితీరును పరిశీలించారు. సంస్థ వ్యవస్థాపకురాలు పుచ్చలపల్లి సంధ్య సంస్థ ఆర్తీ ఫౌండేషన్ ప్రగతిని కలెక్టర్ కు వివరించారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తరలింపు: కలెక్టర్కు సర్పంచ్ ఫిర్యాదు ఇసుక రీచ్కు ఎలాంటి అనుమతులు లేకున్నా 15 నెలల నుంచి పాపాగ్ని నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందని చక్రాయపేట మండలం కుమారకాల్వ సర్పంచ్ కె.శీధర్రెడ్డి మంగళవారం కలెక్టర్ శ్రీధర్కి ఫిర్యాదు చేశారు. పాపాగ్ని నదిలో సుమారు 1400 మీటర్ల పొడవున 300 మీటర్ల వెడల్పుతో 15 అడుగుల లోతులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అధికారం అండతో ఆక్రమిస్తే అడ్డుకుంటాం
సాక్షి టాస్క్పోర్సు : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే గ్రామమంతా ఏకమై అడ్డుకుంటామని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు శివవర్దన్రెడ్డి, సుధాకర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోట్లదుర్తి గ్రామంలోని పెద్దమ్మ గుడికి సంబంధించి స్థలం సమస్య చాలా కాలంగా ఉందన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారన్నారు. గ్రామంలోని పెద్దలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని వదిలేసి మిగిలిన స్థలంలో ప్రహరీ నిర్మించమని చెప్పారని తెలిపారు. దీనిపై కూడా కోర్టులో ఫైల్ చేశామన్నారు. కానీ కేసు కోర్టులో ఉండగానే అధికారం ఉందని అధికారులను లొంగదీసుకుని జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారని తెలిపారు. ఈ జంగిల్ క్లియరెన్స్ కూడా ఏ అధికారి లేకుండానే ఇష్ట్రపకారం చేస్తున్నారన్నారు. దీనికి దేవదాయశాఖ అధికారులు సహకరిస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
యురేనియం బాధితుల సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో ఆయన చర్చించారు. ఇటీవల తాను లోక్సభలో కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. యూసీఐఎల్ గత 18 ఏళ్లుగా తుమ్మలపల్లె గ్రామంలో మైనింగ్, ప్రాసెసింగ్ లాంటివి నడుపుతోందని తెలిపారు. తీవ్రమైన రేడియేషన్ ముప్పు ఉంటుందని తెలిసినప్పటికీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు తమ విలువైన భూములను యూసీఐఎల్కు ఇచ్చారని తెలిపారు. అయితే యూసీఐఎల్ యాజమాన్యానికి ప్రజల బాధల పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడం దురదృష్టకరమన్నారు. టెయిలింగ్ పాండ్ వద్ద ప్రమాదకర రసాయనాల వ్యర్థాల గురించి, పునరావాస ప్యాకేజీ అందించడం ద్వారా కొట్టాల గ్రామాన్ని తరలించాల్సిన అవసరం గురించి ఆయన కలెక్టర్కు వివరించారు. భూ సేకరణ సమస్యలు, భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన కోటా ఉద్యోగాల కల్పన ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయన్నారు. కోరుకొండ–ముద్దనూరు నాలుగు లేన్ల రహదారి వల్ల ఇళ్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, చిన్నప్ప, రుషికేశ్రెడ్డి, షఫీవుల్లా, సీహెచ్ వినోద్కుమార్, దేవిరెడ్డి ఆదిత్య, యురేనియం బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్కు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వినతి -
Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️
కడప అర్బన్ : పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీ స్ సిబ్బందికి ఐటీ ఆధారిత అప్లికేషన్ల నైపుణ్యాలు పెంపొందించే రిఫ్రెషర్ కోర్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్, సీడీఆర్ ఎనాలిసిస్, టవర్ డంప్ ఎనాలిసిస్, ఏపీ–కాప్స్, ఈ–సాక్ష్య, తదితర సాంకేతికపరమైన దర్యాప్తు నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. ఎన్.సి.ఆర్.పి పోర్టల్, మీ సేవా పోర్టల్, పి.జి.ఆర్.ఎస్ పోర్టల్ లలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకునేలా నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎ.మధుమల్లేశ్వర రెడ్డి, ఐ.టి కోర్ టీమ్ సిబ్బంది, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
నేటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 24 నుంచి 27 వరకు బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ 2025–26 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇరు జట్లు కడపకు చేరుకోగా మంగళవారం ప్రాక్టీస్ చేశాయి. జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీ కడప అర్బన్ : కర్నూలు రేంజ్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వైఎస్సార్ కడప జిల్లా కడప నగరంలో టూ టౌన్ సీఐగా నియమితులైన యు. సదాశివయ్యను కడప స్పెషల్ బ్రాంచ్ వన్ సీఐగా బదిలీ చేశారు. గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న జి.ప్రసాదరావును కడప టూ టౌన్ సీఐగా నియమించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు వల్లూరు : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన నరసింహులు పని మీద మండలంలోని కొప్పోలు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుండి కడప వైపు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వేంపల్లె : భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి క్వాంటం టెక్నాలజీ అవసరమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జరిగిన క్వాంటం కంప్యూటర్ వర్క్ షాప్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా విద్యార్థులు సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ క్వాంటం శిక్షణ ద్వారా యంగ్, సెర్చ్ ఫిలోస్ ఇంటర్న్షిప్స్ ఇచ్చి భవిష్యత్తు తరాలకు కావలసిన క్వాంటం సాంకేతికతను అందరికి చేరే విధంగా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ రమేష్ కై లాష్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఇన్చార్జి సుధాకర్ రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు. సోలార్ కంపెనీలో చోరీ కొండాపురం : మండల పరిధిలోని సెయిల్ సోలార్ కంపెనీలో సోమవారం రాత్రి సోలార్ కంపెనీలో సుమారు రూ. లక్షలు విలువ చేసే కాపర్ కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఫోర్ ఎస్కేయు ఎంఎం సోలార్కు చెందిన 20,050 వేల మీటర్ల కాపర్ కేబుల్ చోరీకి గురైనట్లు సెక్యూరిటీ ఆఫీసర్ రామిరెడ్డి మహేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. -
అగస్త్యేశ్వరా.. ఆభరణాలు ఏవీ !
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఆభరణాలలో కొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ఈ మేరకు దేవదాయశాఖ రాయలసీమ జోన్ జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పాండురంగారెడ్డి నిర్ధారించారు. రెండవ రోజు మంగళవారం ఆభరణాల తనిఖీ పూర్తి చేసిన తరువాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డుల మేరకు ఉన్న ఆభరణాలలో 28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. వాటి విలువ రూ.3.20 లక్షలు ఉంటుదన్నారు. అలాగే భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించిన 2.129 కిలోల వెండి, 3.100 గ్రాముల బంగారు ఆభరణాలను రికార్డుల్లో నమోదు చేయలేదన్నారు. స్వామివారి ఆభరణాలు 15 రోజుల్లో రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. ఈఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తాను ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఈఓగా బాధ్యతలు చేపట్టానని తనకన్నా ముందు ఉన్న ఈఓ రామచంద్రాచార్యులు స్వామివారి, బంగారు, వెండి ఆభరణాలను తనకు అప్పగించలేదన్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఆభరణాలను తనిఖీ చేయాలని లేఖ రాయడంతో తనిఖీ నిర్వహించారని, తనపై ఆరోపణలు రావడం విచారకరమన్నారు. తాను వచ్చినప్పటి నుంచి చేసిన ఖర్చులకు రికార్డులు చూపిస్తానన్నారు. రిటైర్డ్ ఈఓ రామచంద్రాచార్యులు మాట్లాడుతూ తాను 2016లో ఒకసారి, 2024లో ఒకసారి ఆలయ ఈఓగా పనిచేశానన్నారు. ఉన్నతాధికారుల అనుమతి, పాలకమండలి నిర్ణయం మేరకు ఆలయ నిధులను ఖర్చుచేస్తామని తెలిపారు. తనకన్నా ముందు ఉన్న ఈఓ శంకరబాలాజీ రెండు ఆభరణాలు తనకు అప్పగించలేదని దానికి ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చైర్మన్ అయి న తరువాత రికార్డులను పరిశీలించానని స్వామి వారి నిధులలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారించిన తరువాత బాధ్యులపై కేసు నమోదు చేస్తామ న్నారు. సుదీర్ఘ కాలంగా జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివప్రసాద్పై ఆభరణాల గోల్మాల్, నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అప్రైజర్ మాధవస్వామి, ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు మాయం రికార్డుల్లో నమోదు కాని 2.129 కిలోల వెండి, 3.100 గ్రాముల బంగారు ఆభరణాలు -
కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం
కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు కడప సెవెన్రోడ్స్: తిరుమలకు తొలిగడపగా భావించే కడప నగరంలోని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించి కల్యాణ వేదికపైగల ప్రత్యేక పీఠాలపై కొలువుదీర్చారు. అనంతరం ప్రధాన అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సాయంత్రం కల్యాణమూర్తులను ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే అమ్మవార్లతో కలిసి తమ ఇంటి ముంగిటికి రావడంతో భక్తులు పులకించి పూజాద్రవ్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్చకులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి
కడప అగ్రికల్చర్ : రైతుల సంక్షేమానికి మార్కెట్యార్డుల చైర్మన్లు, సెక్రటరీలు కలిసి కట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత సూచించారు. కడప మార్కెట్ యార్డులోని జేడీ కార్యాలయ సమావేశం మందిరంలో మంగళవారం రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, ఆనంతపురం ఉమ్మడి జిల్లాల మార్కెట్యార్డు చైర్మన్లకు మార్కెట్ యార్డు చట్టాలు, విధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయడమే అభివృద్ధి అన్నారు. మార్కెట్యార్డు చైర్మన్లు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా విలువల జోడింపుతోపాటు స్థూల ఆదాయం పెంచే పంటలనే రైతులు సాగు చేసుకునేలా సూచించాలన్నారు. రైతులు అభివృద్ధి చెందితే మార్కెట్యార్డులు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మార్కెటింగ్శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ మార్కెట్యార్డు చైర్మన్లు మార్కెట్కు వచ్చే రైతులకు సౌకర్యాలను కల్పించడంతోపాటు మార్కెట్యార్డులో వసతులను కల్పించి రైతుల మన్ననలు పొందాలన్నారు. మార్కెటింగ్శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య మాట్లాడుతూ అమ్మకందారులు, కొనుగోలు దారుల మధ్య సమన్వయం ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ అజాద్వలీ, కడప మార్కెట్యార్డు సెక్రటరీ శ్రీకాంత్రెడ్డితోపాటు సిబ్బంది, వివిధ జిల్లాల మార్కెట్యార్డు చైర్మన్లు పాల్గొన్నారు. అలా వచ్చి.. ఇలా కారెక్కి..కడప నగరంలోని మార్కెట్యార్డును మంగళవారం ఉదయం మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత సందర్శించారు. మార్కెటింగ్శాఖ సెక్రటరీ, సిబ్బంది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె వారితో కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి కారెక్కి రయ్మని వెళ్లిపోయారు. మార్కెట్యార్డుకు వచ్చిన ఆమె యార్డులో వసతుల గురించి, ఏళ్లుగా ఆగిపోయి ఉన్న షెడ్డు నిర్మాణ పనులు, రైతుల సమస్యలు, మార్కెట్లో మరుగుదొడ్లు, మంచినీటి సమస్య, రైతుల వసతిగృహం తదితర విషయాలు ఏమీ అడగకుండా వెళ్లిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత -
తిరుపతి–హిస్సార్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–హిస్సార్ మధ్య కడప మీదుగా నడుస్తున్న రైలు ఫిబ్రవరి 11వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే కమర్షి యల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, పూర్ణ, అఖోల, సూరత్, వడోదర, మదార్, సిఖార్, సాగుల్పూర్ల మీదుగా హిస్సార్కు చేరుతుందన్నారు. 07718 నెంబరుగల రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేది వరకు ఈ రైలును పొడిగించామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్బంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్ధేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 8977716661 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈఈ అమీర్బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
ప్రజలను నమ్మించి మోసం చేసిన బాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు బాబు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టారని.. ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా చిత్తశుద్ధితో అమలు చేశాడని గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. అదే వైఎస్సార్, వైఎస్ జగనన్న పేర్లు చెబితే అనేక పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. అలా కాకుండా ప్రజలను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు తెచ్చుకునే నాయకుడిగా చంద్రబాబు నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూడా ఆయన జగనన్న పథకాలకే పేర్లు మార్చి అవి కూడా అరకొరగా అమలు చేస్తున్నాడని మండిపడ్డా రు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేకుండా తయారైందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలేక అల్లాడుతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేకపోవడం దౌర్భాగ్య మన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఏ–1మోటార్స్ను ప్రారంభించిన ఎంపీ సోమవారం కడప రోడ్డులో వైఎస్సార్సీపీ నాయకుడు నాగూరు అనిల్ బాబా నూతనంగా ఏర్పాటు చేసిన ఏ–1మోటార్స్ షోరూంను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్పలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ షోరూంలో మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
పెట్రోల్ పంపు నిర్వహణలో మున్సిపల్ ఉద్యోగి చేతివాటం
సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ మున్సిపల్ పెట్రోలు బంకు నిర్వహణ బాధ్యతలు చూ సేవారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ వేసి ఇంధనం పక్కదారి పట్టించారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు 2022–25 వరకూ రూ. 1,23,47,318ల విలువగల పెట్రోలు, డీజల్ను అప్పుగా పట్టినట్లు, వారి నుంచి డబ్బులు రావాలంటూ తాపీగా వెల్లడించారు. ఇంత మొత్తం పెండింగ్లో ఉంటే పెట్రోల్ పంపు నిర్వహణ సాధ్యమా?అనేది ప్రశ్నార్థకం. వచ్చే ఆదాయం మొత్తం స్వాహా చేసి ప్రొద్దుటూరులో లేని ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లు పొందుపర్చినట్లు కొందరు వివరిస్తున్నారు. మాతాంగి ట్రావెల్స్ 2023వ సంవత్సరం నుంచి 2025 అక్టోబరు నెల వరకు అప్పు రూ. 13,75,344 ఉన్నట్లు లెక్క రాశారు. ఈ ట్రావెల్స్ ప్రొద్దుటూరులో ఉన్నట్లు రికార్డుల్లో లేకపోవడం విశేషం.అధికారులూ అమ్ముడుబోయారా!ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పెట్రోలు బంకును 2021 ఆగస్టు 18న ప్రారంభించారు. అప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ పెట్రోలు బంకు మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. పెట్రోల్ పంపు ద్వారా మున్సిపాలిటికి ఆదాయం లభించకపోవడంతో ఇటీవల కమిషనర్ రికార్డులు పరిశీలించారు. దాంతో ఒక్కమారుగా వ్యవహారం బహిర్గతం అయ్యింది. రూ.1.23కోట్లు విలువజేసే పెట్రోలు, డీజల్ను ప్రైవేటు వ్యక్తులకు అధికారుల అనుమతి లేకుండా అప్పుగా ఇవ్వడం వెలు గులోకి వచ్చింది. ఎవరి అనుమతి తీసుకుని మేనేజర్గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అప్పులు ఇచ్చా రు అన్న ప్రశ్నలకు సమధానం లేదు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ సైతం మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు లోబడి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.కమిషనరా మజాకా !ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తన సొంతమైనట్లు తాను ఆడిందే ఆట...పాడిందే పాటగా అన్నట్లుగా వ్యవహరించారు. పెట్రోల్ పంపు నిర్వహణలో లెక్కాపత్రం లేని రూ.1.23కోట్ల అవినీతిపై కమిషనర్ నాన్చుడు ధోరణి అవలంబించారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ సీసీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఓబులేసు తనకు తెలియకుండా అజెండాలో లేని అంశాలను పొందుపరిచారని, అతన్నిసస్పెండ్ చేయాలంటూ సిఫార్సులు చేశారు. ఒకే మున్సిపాలిటిలో పని చేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఒకరిపై ఒకలా, మరొకరిపై ఇంకోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెట్రోల్ పంపు నిర్వహణలోని లోపాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆడిట్ ఆఫీసర్ను నియమించాం. సదరు అధికారి క్షుణ్ణంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వారంలో నివేదిక వస్తుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదు పరి చర్యలు తీసుకుంటాం. –రవిచంద్రారెడ్డి,కమిషనర్,ప్రొద్దుటూరు మున్సిపాలిటీ -
రాయచోటి వద్దు... కడపే ముద్దు
కడప సెవెన్రోడ్స్ : ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా వైఎస్సార్ కడపజిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు సోమవారం ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి.రాజగోపాలయ్య, అరవిందకుమార్, జవహర్, మోహన్రెడ్డి, రామకృష్ణయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టీ నెం. 1500ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో కలుపడం వల్ల తమ మండలాలకు చెందిన ప్రజల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందన్నారు. కడప తమకు కూతవేటు దూరంలో ఉందన్నారు. కొత్తగా ప్రకటించిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని కడపజిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చలమయ్య, జేఏసీ నాయకులు రామదాసు, యానాదయ్య, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్ నరసయ్య, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ నాయకులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం ప్రజల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతారు. ఇడుపులపాయలో, పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.తొలిరోజు పర్యటన ఇలా..ఈనెల 23వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరుతారు. సాయంత్రం 4గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.15గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4.15గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.రెండో రోజు పర్యటన ఇలా..24వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని ప్రేయర్ హాలు వద్దకు బయలుదేరుతారు. 10.30గంటలకు అక్క డికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేయర్ హాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 1గంటకు ఇడుపులపాయ ప్రేయర్ హాలు వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2గంటలకు పులివెందుల భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.మూడో రోజు క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న మాజీ సీఎం25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 8.10గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు బయలుదేరుతారు. 8.30గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 10గంటల వరకు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.20గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 127 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజ ఫిర్యాదులు పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, మైదుకూరుడీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
క్రీడలతో శారీరక, మానసికోల్లాసం
కడప ఎడ్యుకేషన్ : క్రీడలతో విద్యార్థులకు శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం లభిస్తుందని జిల్లా పరిషత్తు సీఈఓ ఓబులమ్మ తెలిపారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లాలోని 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్తు సీఈఓ ముఖ్య అతిథిగా హాజరు కాగా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రెయినింగ్(ఎస్బీటీఈటీ) జాయింట్ సెక్రటరీ టి.శేఖర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వారు క్రీడా జెండాను ఊపడంతోపాటు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, పలు డిపార్టుమెంట్ల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేనేతల కష్టాలు విస్మరించిన కూటమి ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేనేతల కష్టాలను పూర్తిగా విస్మరించిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నాగులకట్టలో చేనేతల జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట ప్రతి ఏడాది 24వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలలో జమ చేయడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జగన్ అమలు చేసిన పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మనోహర్, సత్యనారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, ఓబులేసు పాల్గొన్నారు. -
ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి
వేంపల్లె : ఫోటోలోని వ్యక్తి ఆచూకీ కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని వేంపల్లె సీఐ టి.నరసింహులు విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోనీ పిరమిడ్ నగర్లో ఉన్న చౌడేశ్వరిదేవి గుడి వద్ద భిక్షాటన చేస్తూ ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తిరుగుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 4న చౌడేశ్వరిదేవి గుడి సమీపంలో ఏపీ 40 డీటీ 9402 నెంబర్ కలిగిన హోండా ఆక్టివా స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల సాయంతో ఫొటోలోని వ్యక్తి ఆ స్కూటీని దొంగిలించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికాన్ని ప్రకటించారు. అలాగే సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. -
నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు
కడప సెవెన్రోడ్స్ : కడప నగర శివార్లలోని మాచుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈనెల 23న గంధోత్సవం సందర్భంగా రాత్రి 9 గంటలకు గంధం, పూలచాందిని ఫకీర్ల మేళతాళాలతో, బ్యాండు వాయిద్యాలతో గ్రామంలో మెరవణి నిర్వహించి గురువుల మజార్వద్ద సమర్పిస్తామన్నారు. అనంతరం ఫాతెహా ఉంటుందని పేర్కొన్నారు. 24న ఉరుసు సందర్భంగా వివిధ కార్యక్రమాలతోపాటు రాత్రి ఖవ్వాలీ కచేరి ఉంటుందన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం నిర్వహిస్తామన్నారు. 25న తహలీల్ ఫాతెహాతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఒంటిమిట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పుజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, ముత్యాల ఆభరణాలు తొడిగి, పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత పారాయణం చేశారు. -
నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయం
కడప సెవెన్రోడ్స్ : నిరంతరాయ విద్యుత్ సరఫరాను ప్రజలకు అందించడమే లక్ష్యంగా విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ శాఖ ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించి, ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా కడప జిల్లాలో వినూత్నంగా ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి విద్యుత్ శాఖ వారు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారా ల్లో విద్యుత్ శాఖ అధికారులు నేరుగా గ్రామాలు, వాడలు, హాబిటేషన్లను క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సందర్శిస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలను వెంటనే ‘కరంటోళ్ల జనబాట’ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ పీడీసీఎల్ కడప సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
క్షమాపణ కోరిన డీపీఓ రాజ్యలక్ష్మి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా సంస్కృతిని కించపరుస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య, జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, పలువురు సర్పంచుల సమక్షంలో క్షమాపణ చెప్పారు. డీపీఓ వ్యాఖ్యలకు నిరసనగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న రాజ్యలక్ష్మి స్పందిస్తూ తాను తొందరపాటు లో అలా మాట్లాడానని చెప్పారు. కడప బాంబుల గడ్డ అని, తనతో చాలామంది అన్నారని, కానీ ఇక్కడి ప్రజల మంచితనం వల్ల తాను 14 నెలలుగా పనిచేయగలుగుతున్నానన్నారు. జిల్లా ప్రజలు కల్మషం లేని వారని చెప్పాలనుకున్నానని, కానీ సమయం లేకపోవడం వల్ల మరో అంశంపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన వ్యాఖ్యలు జిల్లా ప్రజలను బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానన్నారు. డీపీఓ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేయాలి అంతకుముందు జిల్లా సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జిల్లా పంచాయతీ అఽఽధికారి రాజ్యలక్ష్మిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. కడపజిల్లాలో పనిచేయడమంటే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని సర్పంచులు మండిపడ్డారు. జిల్లా సంస్కృతిపై విషం కక్కిన డీపీఓపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు
పోరుమామిళ్ల : మండలంలోని కవలకుంట్ల దళితవాడలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు నాగార్జునరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి వారు పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ రాజశేఖర్, వైద్యవిభాగం సెక్రటరి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. పార్టీలో చేరినవారిలో వీరపోగు జోజి, మరియమ్మ, గురవయ్య, ప్రసాద్, రవిచంద్ర, పుష్పరాజ్, రవి, ఫాతిమా, రోజమ్మ, అబ్బయ్య, చందు, శంకర్, నారిపోగు రవి, మేరమ్మ, అశోకరాణి, నిర్మలాదేవి, అజయ్, విజయభాస్కర్, యేసు, చిట్టిబాబు, రూతమ్మ, శంకర్, సునీల్, సరిత, నీలిమ తదితరులు ఉన్నారు. -
అగస్త్యేశ్వరాలయంలో ఆభరణాల తనిఖీ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరాలయంలో అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి బంగారు వెండి, ఆభరణాలను సోమవారం దేవదాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్య ఆభరణాల తనిఖీ చేపట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో రాయలసీమ జోన్ జ్యువెలరి వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి తనిఖీ చేశారు. ఆలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శివప్రసాద్పై ఆరోపణలు రావడం, పూర్వ ఈఓ రామచంద్రాచార్యులు రిటైర్డ్ అయిన తరువాత బాధ్యతలు చేపట్టిన వెంకటసుబ్బయ్యకు ఆభరణాలను అప్పజెప్పకపోవడంతో ఆభరణాల గోల్మాల్ జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఆభరణాల తనిఖీ జరిగింది. కొన్ని బంగారు, వెండి ఆభరణాల లెక్కలు తేలకపోవడంతో వాటి రశీదులు, ఆభరణాలను మంగళవారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆభరణాల తనిఖీలో దేవదాయ ఆభరణాల అప్రైజర్ మాధవస్వామి, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
అత్యున్నత ప్రమాణాలతోశిక్షణ పొందేందుకు వచ్చిన అనంతపురం జిల్లా పోలీసు కానిస్టేబుళ్లుమాట్లాడుతున్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, పాల్గొన్న పోలీసు అధికారులుకడప అర్బన్ : కొత్తతరం పోలీసింగ్కు అనుగుణంగా అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు ఇచ్చే శిక్షణను ట్రైనీ కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకుని సమర్థవంతంగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో (డి.పి.టి.సి) లో అనంతపురం జిల్లాకు చెందిన సివిల్ ట్రైనీ కానిస్టేబుళ్లు 194 మందికి, అలాగే 11 వ బెటాలియన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే ఏ.పి.ఎస్.పి కి ఎంపికై న కానిస్టేబుళ్లు 330 మందికి 9 నెలల పాటు ఇచ్చే ట్రైనింగ్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ట్రైనింగ్కు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేశారన్నారు. వంద శాతం క్రమశిక్షణ, నిజాయితీతో విశేష అనుభవమున్న పోలీస్ అధికారులు అందించే శిక్షణను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలోని అత్యాధునిక సైబర్, కంప్యూటర్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకుని సైబర్, ఫైనాన్సియల్ నేరాల దర్యాప్తు విధానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల సౌకర్యం కోసం ’సజెషన్ బాక్స్’ ఏర్పాటు చేశామని, సలహాలు, సూచనలు రాసి అందులో వేయవచ్చన్నారు. ట్రైనింగ్లో భాగంగా నిర్దేశిత ప్రమాణాలతో నిర్వహించే మిడ్ టర్మ్, ఫైనల్ పరీక్షలను తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో 11 వ బెటాలియన్ కమాండెంట్ కె.ఆనంద రెడ్డి, అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ పి అబ్దుల్ కరీం, కడప నగరంలోని సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు. క్రమశిక్షణ, నిజాయితీగా శిక్షణ పూర్తి చేసుకోవాలి ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలి ట్రైనీ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
బాకీ డబ్బు అడిగినందుకు క్రూరంగా హతమార్చాడు
ప్రొద్దుటూరు క్రైం : గాఢ నిద్రలో ఉన్న మహేశ్వరరెడ్డిని స్వీట్ దుకాణం యజమాని రామచంద్రారెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని మూడు ముక్కలుగా కసితీరా నరికాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి పట్టణ శివారులో పడేశాడు. ఈ దారుణ ఘటన 2024 జూన్ 23న ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని ముద్దాయి భూమిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విఽధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ద్వార్శల నాగరత్నమ్మకు 35 ఏళ్ల క్రితం శ్రీనివాసరెడ్డితో వివాహమైంది. వీరికి వెంకటమహేశ్వరరెడ్డి అనే కుమారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎంఆర్కాలనీలో ఓ ఇల్లు బాడుగకు తీసుకొని స్వీట్ల దుకాణం నిర్వహించేవాడు. నాగరత్నమ్మ 15 ఏళ్లుగా దుకాణంలో స్వీట్లు తయారు చేసే పనికి వెళ్లేది. ఇలా రామచంద్రారెడ్డితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని రోజులు గడచిన తర్వాత నాగరత్నమ్మ, ఆమె కుమారుడు మహేశ్వరరెడ్డి, దుకాణ యజమాని రామచంద్రారెడ్డి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. స్వీటు దుకాణం యజమానికి నాగరత్నమ్మ రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు విషయమై నాగరత్నమ్మ కుమారుడు, దుకాణం యజమాని తరచూ గొడవ పడేవారు. రూ.120 కోసం నిలదీశాడని.. తనకు డబ్బు అవసరముందని 2024 జూన్ 23న రూ.120 ఇవ్వమని మహేశ్వరరెడ్డి అడిగితే రామచంద్రారెడ్డి ఇవ్వలేదు. తమకు బాకీ ఉన్న డబ్బులో నుంచి ఇవ్వాలని గట్టిగా దబాయించి అడిగాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడుతుండగా నాగరత్నమ్మ ఇరువురికి సర్ది చెప్పి కుమారుడికి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించింది. కొద్ది సేపటి తర్వాత మహేశ్వరరెడ్డి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఈ క్రమంలో 24న తెల్లవారు జామున నిద్రపోతున్న మహేశ్వరెడ్డి తలపై రాచమంద్రారెడ్డి ఇనుప రాడ్డు తీసుకొని కొట్టడంతో అతను అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు. హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకని మృతదేహాన్ని మూడు భాగాలుగా కోశాడు. శరీర భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి జమ్మలమడుగు బైపాస్రోడ్డు సమీపంలోని కంపచెట్లలో పడేశాడు. మరో గదిలో పడుకున్న నాగరత్నమ్మ తెల్లారాక నిద్రలేచి చూడగా గది నిండా రక్తపు మరకలు ఉన్నాయి. తన కుమారుడు కనిపించకపోవడంతో రామచంద్రారెడ్డి చొక్కా పట్టుకొని నిలదీసింది. నీ కుమారుడుకి పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించి అతను పారిపోయాడు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు వాదనలు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో కొనసాగుతూ వచ్చాయి. నేరం రుజువు కావడంతో ముద్దాయి రామచంద్రారెడ్డికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 3 లక్షలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె.సత్యకుమారి సోమవారం తుదితీర్పు చెప్పారు. అధికారులకు ప్రశంసలు ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి తన వాదనలతో ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. సకాలంలో సాక్షులను కోర్టులో హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ భావన, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్కానిస్టేబుల్ ఏ.నాగరాజు, త్రీ టౌన్ పీసీ పి.పవన్కుమార్రెడ్డి, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవకారాగార శిక్ష రూ.3 లక్షలు జరిమానా ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు తీర్పు మహేశ్వరరెడ్డిని హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికిన రామచంద్రారెడ్డి 2024లో ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో జరిగిన ఘటన -
ఉత్సాహంగా జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో 72వ సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు ఉత్సాహంగా జరిగినట్లు కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్.వెంకటసుబ్బయ్య, జాయింట్ సెక్రటరీ సునీల్ తెలిపారు. ఈ ఎంపికలకు విశేష స్పందన లభించిందన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు వీరే.. పురుషుల జట్టు బ్రహ్మయ్య, అభిలాష్ రెడ్డి, హుస్సేన్, వేణుసాయి, బి. వంశీ, పవన్, మల్లికార్జున, ధనుష్ రెడ్డి, వి. వంశీ, ఎం. వంశీధర్ రెడ్డి, నరేంద్ర, యశ్వంత్, నిఖిల్, కళ్యాణ్ కుమార్, మహమ్మద్ హుస్సేన్. మహిళల జట్టు టి. శ్రీవాణి, ఏ. అపర్ణ, ఎం. లీలావతి, ఎస్. పూజ, జ్యోత్స్న, ఎస్. ఇందు, నీలమహేశ్వరి, విష్ణుప్రియ, జ్యోతి, అక్షయ, అశ్విత, తేజ, అమూల్య, దివ్య. స్టాండ్ బై క్రీడాకారులు ప్రణీత్, నవ్య, దీప్తి, హుస్సేన్, బి. మాధవి, కృపా జ్యోతి, మౌనిక, వాసంతి -
యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కడప ఎడ్యుకేషన్ : యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మాదన్ విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా పాలెం మహేష్బాబు ఎన్నికయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్. నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులుగా వై.రవి కుమార్, డి.సుజాత రాణి, కోశాధికారిగా కె.నరసింహారావు, కార్యదర్శులుగా కె.చెన్నయ్య, సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, వి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసులు, కె.సుధాకర్, కె.ప్రసాద్, ఎస్.షకీల బేగం, డి.సుబ్బారావు, జి.గోపినాథ్, ఎస్.ఫయాజుద్దీన్, సి.సుదర్శన్, ఎ.డి.దేవదత్తం, జె.వెంకటసుబ్బారెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎన్.కంబగిరిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పాలెం మహేష్ బాబు, మాదన విజయకుమార్, డి.కృష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, బి.ప్రసన్నలక్ష్మి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా ఎం.ప్రభాకర్, ఆడిట్ కమిటీ సభ్యులుగా టి.వెంకటరమణ, కె.సి.ఓబులేసు, బి.చంద్రశేఖర్, డి. సెబాస్టియన్, ఎన్.మేరీ ప్రసన్న, సీపీఎస్ జిల్లా కన్వీనర్గా ఎన్.పవన్ కుమార్, కో–కన్వీనర్లుగా ఎస్.కరీముల్లా, ఎస్.అనిల్ కుమార్ రెడ్డి, ఎన్.అయ్యవారు రెడ్డి, పి.మునిశేఖర్, కె.గంగయ్య, కె.రాజశేఖర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్గా టి.శివ ప్రసాద్, ప్రచురణల కమిటీ జిల్లా కన్వీనర్గా ఎ.వీరనారాయణ, అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్గా వీరదాసరి క్రిస్టఫర్, కల్చరల్ కమిటీ జిల్లా కన్వీనర్గా ఎస్.గుర్రయ్య, మున్సిపల్ కమిటీ జిల్లా కన్వీనర్ గా పి.హిఫాజతుల్లా, మహిళా కమిటీ కన్వీనర్గా కె.సరస్వతి, పెన్షనర్స్ విభాగం జిల్లా కన్వీనర్గా ఎస్.శివశంకర్ రెడ్డి, ఎయిడెడ్ స్కూల్స్ జిల్లా కన్వీనర్గా ఎస్.మహమ్మద్ రఫీ, కేజీబీవీ పాఠశాలల జిల్లా కన్వీనర్గా డి.సుజాత రాణి, ఏపీ మోడల్ స్కూల్స్ జిల్లా కన్వీనర్గా పి.నవీన్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా పరిశీలకులుగా, యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
దుష్ప్రచారంలో ‘ఈనాడు’ బరితెగింపు
సాక్షి ప్రతినిధి, కడప: తప్పుడు వార్తలు వండివార్చడంలో ‘ఈనాడు’ మరోసారి ముందు వరుసలో నిలిచింది. ‘వివేకా కుటుంబంపై వైకాపా పగ’ కథనమే అందుకు తాజా ఉదాహరణ. ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట ఆన్లైన్లో ఉన్న భూమిని లేనట్లుగా ఎల్లో మీడియా చిత్రీకరించింది. పైగా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఇతరుల పేరుతో మ్యుటేషన్ చేశారని, అప్పటి తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది.పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 ప్రకారం నాలుగు సర్వే నంబర్లలో 7.03 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 351/ఏలో 2.91 ఎకరాలు, 352–ఏలో 4.05 ఎకరాలు, 353/1ఏలో 0.04 సెంట్లు, 354ఏలో 0.03 సెంట్లు కలిపి మొత్తంగా 7.03 ఎకరాలు వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట వెబ్ల్యాండ్లో కనిపించడం లేదంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.టీడీపీ హయాంలోనే ల్యాండ్ కన్వర్షన్..వైఎస్ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఆమేరకు రూ.65 వేలు చలానా చెల్లించారు. ఆ ఫైలును పరిశీలించిన అప్పటి జమ్మలమడుగు ఆర్డీవో ద్వారా 2018 మార్చి 20న ల్యాండ్ కన్వర్షన్ కూడా అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ల్యాండ్ కన్వర్షన్ చేపట్టారు. ఆమేరకు రెగ్యులర్ ఖాతా 763 నుంచి నోషనల్ ఖాతా నంబర్ 300004కి మారింది.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీభూమి పోర్టల్లో ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట 1బీ నమోదై ఉంది. 351/ఏలో 3.47 ఎకరాలు పట్టాదారు పేరు తెలియదని వెబ్ ల్యాండ్లో నమోదై ఉంది. వైఎస్ సౌభాగ్యమ్మ భూమి ఇప్పటికీ వారి స్వాధీనంలో, వారి అనుభవంలోనే ఉంది. ఈ విషయమై పులివెందుల తహశీల్దార్ నజీర్ను వివరణ కోరగా.. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి వన్టైమ్ కన్వర్షన్ అయ్యిందని.. కాబట్టే నోషనల్ ఖాతా నంబర్కు బదలాయింపు అయ్యిందని వివరించడం గమనార్హం. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
సైన్సు మ్యూజియం సందర్శన
కడప ఎడ్యుకేషన్: కడప చెన్నూరు బస్టాండ్లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్ను ఆదివారం ఉన్నత విద్య ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు. సైన్సు మ్యూజియంలోని ఎక్యూప్మెంట్ గురించి సైన్సు క్యూరేటర్ రెహమాన్ను అడిగి తెలుసుకున్నారు. కడప ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: కడపలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన శిక్షణ కేంద్రంలో వారం రోజుల నుంచి సాగుతున్న స్కౌట్ మాస్టర్ శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఎల్.ఓ.సి డాక్టర్ కమల కన్నన్, శివ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బేసిక్, అడ్వాన్స్ కోర్సు శిక్షణకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి దాదాపు ఎనబై మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, కోశాధికారి శివ శంకర్ రెడ్డి, సహాయ సిబ్బంది శివ ప్రసాద్, అమర్నాథ్ బాబు, అహమ్మద్, పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బహుజన టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున డిమాండ్ చేశారు. కడపలోని బహుజన టీచర్స్ యూని యన్ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కు అనేక హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిటీ వేసి, 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏలు, ఐ.ఆర్, పీఆర్సీ కమిటీలపై ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులలో నెలకొన్న తీవ్ర నిరాశ నిస్పహలను తగ్గించాలని కోరారు. కడప జిల్లా అధ్యక్షుడు యమ్. గంగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కట్టా గంగాధర్, జిల్లా కార్యదర్శి కె. జయరాం తదితరులు పాల్గొన్నారు. సిద్దవటం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. అనంతరం పరమాత్మ సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందాలని, అలాగే పేద కుటుంబాల వారు ఉచిత వైద్యం పొందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తెచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని ప్రైవేట్పరం చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ప్రొద్దుటూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజా సోమశేఖర్రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు. గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తూ మెరుగైన జీతభత్రాలతో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు జీఓ ఎంఎస్ నంబర్ 114ను అమలు చేసి వారి సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు గరుడాచలం, జనరల్ సెక్రటరీ జీఎన్ సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నాగేంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, దివాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు. హైందవ సంస్కృతిని పరిరక్షించాలి ప్రొద్దుటూరు కల్చరల్ : హైందవ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వేదాంత గీత శివం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానందా స్వామిజీ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక బొల్లవరం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి వరకే కులం అని గడప దాటితే అందరూ హిందువులనే భావన అందరిలో రావాలన్నారు. శివదర్శనానంద స్పిరిచ్యువల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శివదర్శనానంద సరస్వతీ మాతాజీ హిందువులంతా కలిసికట్టుగా జీవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, హిందూ సమ్మేళన సమితి సమన్వయకర్త డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, హిందూ ధర్మం గురించి వివరించారు. కార్యక్రమంలో సమ్మేళనం సమన్వయకర్త సుధాకర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలులింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు. కల్వర్టును ఢీకొని ఇద్దరి దుర్మరణం రాయచోటి టౌన్ : రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలోని యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద పల్స్ర్ బైక్పై మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మీప్రసాద్(18) అలియాస్ ప్రతాప్, వెంకటసాయి కుమార్ (25)లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మాధవరం వడ్డెపల్లె నుంచి రాయచోటికి సొంత పనుల నిమిత్తం వస్తున్న సమయంలో యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటసాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీప్రసాద్ను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా అస్మితా లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్ 14, 16 బాలబాలికలకు ట్రియాథ్లాన్ హైజంప్, లాంగ్జంప్, 60 మీటర్ల, 600 మీటర్ల పరుగు పోటీలు, బ్యాక్త్రో, షాట్పుట్, జావెలిన్త్రో, డిస్కస్త్రో విభాగాలలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్తల సుధాకర్రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా లీగ్మ్యాచ్ ప్రతిభ గల క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు. అబ్జర్వర్ రాజా, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అహ్మర్బాషా, వ్యాయామ సంచాలకులు నాగూర్బాషా, రమణయ్య, షేక్బాషా, సుబ్బయ్య, లక్ష్మీ, రాఘవ, సతీష్రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
కడప రూరల్: చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల మందు దోహదపడుతుందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా పులివెందులలో చిన్నారులకు చుక్కల మందు వేశారు. కడపలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ మాట్లాడుతూ తొలిరోజు 94శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామని వివరించారు. వైద్య సిబ్బంది సోమ, మంగళవారం ఇంటింటికి వచ్చి తొలిరోజు వేయించని చిన్నారులకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల కు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.● తొలి రోజు 94శాతం నమోదు -
జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమైన చర్య
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సాయినాథ శర్మ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం పెద్దచెప్పలిలో జరిగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు చించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీనిపై స్పందించిన సాయినాథ శర్మ కమలాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పర్మిషన్ లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయన్నారు. పెద్దచెప్పలికి మాత్రమే పర్మిషన్ కావాలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులు చేసే కార్యక్రమాలను ఏనాడైనా అడ్డుకున్నామా? అన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకుని మళ్లీ వెళ్లి వేడుకలు నిర్వహిస్తామన్నారు. కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపు కోవడం కోసమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు శృంగభంగం తప్పదని టీడీపీ నాయకులు ఇలాంటి ఆటలు సాగిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దచెప్పలిలో గత 30 ఏళ్ల నుంచి ఏ పార్టీ కార్యక్రమమైనా అదే సర్కిల్లో జరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జగనన్న జన్మదిన వేడుకలు అదే ప్రాంతంలో నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు చించడం తగదన్నారు. ఇలాంటి వికృత చేష్టలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్, దాసరి సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు. కడపలో చైన్ స్నాచింగ్ కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రామరాజుపల్లెలో ఆదివారం మధ్యాహ్నం పందిళ్లపల్లి పద్మావతి అనే మహిళ మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్తో పాటు రెండు కాసుల బంగారు చైన్ను గుర్తుతెలియని వ్యక్తి వచ్చి లాక్కెళ్లాడు. రామరాజుపల్లికి చెందిన పద్మావతి తమ బంధువుల ఇంటికి సీమంతం ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా సచివాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బాధితురాలి తల వెనుక భాగాన కొట్టి ఆమె మెడలోని చైన్ను లాక్కెళ్లాడు. చైన్ను లాక్కున్న వెంటనే దూరంగా పరుగు తీసి, వేరే వ్యక్తితో కలిసి మోటార్బైకులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె మెడలోని రోల్డ్ గోల్డ్ చైనుతోపాటు రెండు కాసుల బంగారు చైన్ను నిందితుడు లాక్కెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలుపెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు. అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
మానవతావాది న్యాయవాది లేబాక తులసిరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : దివంగత న్యాయవాది లేబాక తులసిరెడ్డి నిజమైన మానవతావాది అని హైకోర్టు న్యాయవాది రతంగపాణిరెడ్డి తెలిపారు. దివంగత తులసిరెడ్డి జ్ఞాపకార్థం పెన్నానది ఒడ్డున ఉన్న స్వరూప్ ఎస్టేట్లో తులసిరెడ్డి కుమారుడు లేబాక హృతిక్రెడ్డి, తమ్ముడు లేబాక గంగిరెడ్డి, మేనల్లుడు మధుసూదన్రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. న్యాయవా ది లేబాక తులసిరెడ్డి వల్ల ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. పైసా ఆశించకుండా వందలాది మందికి ఉద్యోగాలు, పోస్టింగ్లను ఇప్పించారని తెలిపారు. అనంతపురం ఎస్కే యూని వర్సిటీలో సీట్లు ఇప్పించడంలోను, హాస్టల్ వసతి కల్పించడంలో ఎందరికో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్లో తులసిరెడ్డి చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి హాజరై, తులసిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారు సుమారు 400 మందికి పైగా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ రామగంగిరెడ్డి, హైకోర్టు న్యాయవాది మహేశ్వరరెడ్డి, అనంతపురం అడ్వకేట్లు శ్యామ్, నారాయణరెడ్డి, రామ్మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి (చిత్తూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి), మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ బీవీరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్దన్రెడ్డి, అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి, మెట్టుపల్లె సుధాకర్రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వైద్యులు త్యాగరాజరెడ్డి, స్వరూప్కుమార్రెడ్డి, హెడ్మాస్టర్ రాంభూపాల్రెడ్డి, దొంతిరెడ్డి హనుమంతరెడ్డి, అశ్విన్కుమార్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ స్వరూప్కుమార్రెడ్డి, డాక్టర్ సింగం భాస్కర్రెడ్డి, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ
పులివెందుల : చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ అన్న విధంగా మారారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పనులను చంద్రబాబు నాయుడుతో ప్రారంభించాలని వీళ్లు కాన్సెప్ట్ పెట్టుకున్నారని, అసలు వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, ఆ పథకం వీళ్లే మంజూరు చేసినట్లు, వీళ్ల బిల్డప్ తెలియని వాళ్లు చూస్తే ఆశ్చర్యపోతారన్నారు. రూ.480 కోట్లతో మంజూరు చేసిన తాగునీటి పథకానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే దాదాపు 60 నుంచి 80 శాతం పనులు పూర్తయినా వీళ్లు ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. ఎవరి హయాంలో ఏమి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు వచ్చేదన్నారు. ఈనెల 15వ తేదీన వరి కాకుండా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయిందన్నారు. వరికి ఇంకా కొంచెం గడువు ఉందని, ఏ ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దాని ఫలితంగా రైతులెవరూ బీమా, ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. జనవరి 15వ తేదీ వరకు బీమా గడువు పెంచాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్లు విదేశాలకు వెళతారు.. ఒక గ్రూపు మీటింగ్కు సంబంధించి ఫొటో తీస్తారు, ఆ ఫొటో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించి, మీడియా చానెళ్లలో ప్రసారం చేసి రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారన్నారు. ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, జగనన్న ఇష్టపడే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్ అని అన్నారు. రాజకీయ అరంగ్రేటం నుంచి నేటి వరకు ఆయన జర్నీ చూస్తే ఆదర్శనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు.కూటమి ప్రభుత్వంపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఫైర్ -
తొలి తెలుగు శాసనానికి విశ్వఖ్యాతి
కడప ఎడ్యుకేషన్ : కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనానికి విశ్వఖ్యాతి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కేంద్ర గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ సౌజన్యంతో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) శతజయంతి (1925–2025) సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలుగు శిలా శాసనం‘ నమూనా (రెప్లిక) స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇమ్మణ్ణి దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నా రు. తన తండ్రి గారి జిల్లా పర్యటన అనంతరం కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తమ ట్రస్టు ద్వారా సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ఉచిత విద్యా సదుపాయాలు, ఆరు లక్షల మందికి పైగా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమ్ పూల మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని, తెలుగు శిలా శాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే సత్కార్యంలో భాగస్వాములైన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా వెంకట్ సేవలు అమూల్యమైనవన్నారు. కడప జిల్లాలో వెలసిన మొదటి తెలుగు శిలాశాసన నమూనాను సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ మాట్లాడుతూ సామాజిక సేవకు మారుపేరైన దీపా వెంకట్ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తనయ అన్న గుర్తింపు మాత్రమే కాక ఆయన మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ మేనేజింగ్ ట్రస్టీగా సామాజిక సేవలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్, కలమల్ల ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వర్మ వంశీకుడు పీవీఎల్ఎన్ రాజు, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డాక్టర్ జి.పార్వతి మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులు సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను తిలకించారు. గ్రంథాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ -
సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యలో సంక్షోభం
మైదుకూరు : సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టి వేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా ఆరోపించారు. ఆదివారం మైదుకూరులోని డీసీఎల్ ఫంక్షన్ హాల్లో యూటీఎఫ్ 45వ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు కడప రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి డీసీఎల్ వరకు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మీరాజా మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని హరిస్తూ, బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని చెబుతూనే ప్రభుత్వ విద్యకు పాతరేస్తున్నదని దుయ్యబట్టారు. యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల అండదండలతో గెద్దెనెక్కి ఇప్పుడు ఉద్యోగులను విస్మరించడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేసే కార్యక్రమాలను నిరంతరం రూపొందించి అమలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా -
జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలకు పూర్తి న్యాయం
కడప కార్పొరేషన్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో పార్టీ కార్యకర్తలకు పూర్తిగా న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆదివారం అక్కాయపల్లె 47వ డివిజన్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రజలకు మేలు చేయకపోగా పేద, మధ్య తరగతి వర్గాలకు నష్టం కలిగించేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పేరుతో నెల రోజులు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంజద్బాషా మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కడప శాసన సభ్యురాలు కుర్చీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇసుక, మట్టి, వైన్ షాపులు, వెంచర్ల నుంచేగాక తోపుడు బండ్ల వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీతోనే సాధ్యమన్నారు. మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, రూ.27 కోట్లతో మంచినీటి పథకం తెచ్చామని, రెండు పార్కులు నిర్మించుకున్నామన్నారు. శ్మశానాలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా మేయర్ పాకా సురేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, డాక్టర్ నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, త్యాగరాజు, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
వైఎస్సార్సీపీ దళిత నాయకునిపై టీడీపీ నాయకుల దాడి
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామం దళితవాడకు చెందిన చాట్ల విజయభాస్కర్ (38)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడికి దిగారు. అతని వద్ద ఉన్న మొబైల్ఫోను, డబ్బును లాక్కున్నారు. దీంతో బాధితుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.చాట్ల బాలరాజు వైఎస్సార్సీపీలో దళిత సంఘం నాయకునిగా ఉంటున్నాడు. తుడుమలమదిన్నె గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చందా శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేసి నువ్వు మా గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ కులం పేరుతో, కుటుంబ సభ్యులను సైతం తిట్టాడు. ఫోన్ సంభాషణ రికార్డింగును ఖాజీపేట సీఐ వంశీధర్కు వినిపించి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు స్టేషన్కు వెళ్లాడు. సీఐ న్యాయం చేస్తానని చెప్పడంతో వెనుదిరిగాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చందా శ్రీనివాసులరెడ్డి, మదన్మోహన్రెడ్డి, సుధాకర్రెడ్డి, సంతోష్లు బైక్పై ఉన్న విజయభాస్కర్ను ఈడ్చి తీవ్రంగా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వీపీ రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోలీసు స్టేషన్కు చేరుకుని బాధితునికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.బాధితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. -
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్
ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది.. ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది.. పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే.. సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు.. విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు.. అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్ జగన్మోహనుడు.బద్వేలు : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు. రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి. పడిలేచిన కెరటం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా .. 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు. జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు. నేడు జన్మదిన వేడుకలు..వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.మళ్లీ జగనన్న పాలనే రావాలి ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ లీడర్ అంటే జగనే ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్ కరీముల్లాకు 2021లో లివర్ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు సీఎంఓకి ఫోన్ చేశారు. కరీముల్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ ఆదుకున్న మనసున్న లీడర్ వైఎస్ జగన్..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు మా కుటుంబానికి దేవుళ్లు వైఎస్సార్.. వైఎస్ జగన్ మా కుటుంబానికి దేవుళ్లు. 2004లో వైఎస్ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం మా కుటుంబానికి అందలేదు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్.. వైఎస్ జగన్ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. – పెసల కొండారెడ్డి, చియ్యపాడు, చాపాడు మండలంఎప్పటికీ రుణపడి ఉంటా..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాశినాయన మండలం, వైఎస్సార్ కడప -
తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వాటర్ గ్రిడ్ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘గూగుల్ డేటా సెంటర్ నుంచి అన్నింటిలో క్రెడిట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్ చేపట్టిన వాటర్ గ్రిడ్కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు...ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ...విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్ చోరీకి పాల్పడాలని అర్నాబ్ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్రెడ్డి హెచ్చరించారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్ఓ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఇందుకు సంబంధించి పోలియో చుక్కలు ప్రభుత్వ వైద్య కేంద్రాలతోపాటు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ -
డీజిల్ దొంగతనంపై విచారణ
చాపాడు : బెంగళూరు – విజయవాడ మధ్య జరుగుతున్న గ్రీన్ఫీల్డు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో బుధవారం జరిగిన డీజిల్ దొంగతనంపై శనివారం ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు. ఎర్రగుడిపాడు–ఆదిరెడ్డిపల్లె ప్యాకేజి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మండలంలోని రామసుబ్బమ్మకొట్టాలు గ్రామ సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ రామసుబ్బమ్మ కొట్టాలు–పెద్దగురువళూరు, కుచ్చుపాప, వెదురూరు గ్రామాలకు వెళ్లే క్రమంలో రోడ్డుపై వంతెన నిర్మిస్తున్నారు. పనులు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఇక్కడ ఉన్న హిటాచీ వాహనం నుంచి 200 లీటర్ల మేరకూ డిజిల్ను అపహరించినట్లు రోడ్డు నిర్మాణ ప్రతినిధులు గుర్తించారు. రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం ఏఎస్ఐ సంఘటనా స్థలం వద్ద విచారించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వర్కర్లను విచారించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రెండు ఆటోలు దగ్ధంపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసంటున్న శివ, కుళ్లాయి బాషాలకు చెందిన రెండు ఆటోలకు శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వీరిద్దరూ ఆటోలను పెట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మద్యం తాగుతున్న వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మళ్లీ జగనన్న పాలనే రావాలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ -
ఇంటర్ నూతన పరీక్షా విధానంపై అవగాహన సదస్సు
కడప ఎడ్యుకేషన్ : జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ –2020) అనుగుణంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2025–26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో శనివారం 2025– 26 విద్యా సంవత్సరం నుంచి మారిన ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో తెచ్చిన సమూల మార్పులపై కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, ిపిన్సిపల్స్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఈ 2026 పబ్లిక్ పరీక్షలలో రెండవ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం పూర్తిగా కొత్త విధానంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షల విధానం అమలు చేస్తారన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఈఆర్టీడబ్ల్యూ) జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు గణిత సబ్జెక్టుల్లో 150 మార్కులకు 1ఏ, 1బి లుగా రెండు పేపర్లు వేర్వేరు రోజుల్లో ఉండేవన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం ఒకే పేపర్ గా 100 మార్కులకు ఒకే రోజు ఉంటుందన్నారు. అలాగే గతంలో బాటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు వేర్వేరు పేపర్లు, వేర్వేరు రోజుల్లో పరీక్ష నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం నుంచి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష 85 మార్కులకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఒకేరోజు రెండు విడివిడి సమాధాన పత్రాలలో బాటనీ, జువాలజీకి సంబంధించిన సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అడిషనల్ సబ్జెక్టుగా, బైపీసీ విద్యార్థులు గణిత సబ్జెక్టును అడిషనల్ సబ్జెక్టుగా ఎంచుకొని ఎం బైపీసీ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. గత సంవత్సరం ఉన్న సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. -
వంద బస్తాల వడ్లు ఉచితంగా పంపిణీ
కడప ఎడ్యుకేషన్ : కడప నగరం రామచంద్రాపురం గ్రామంలో శనివారం లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ లేవాకు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 50 కేజీల బరువైన వంద బస్తాల వడ్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న రెండు ఎకరాల్లో సొంత ఖర్చుతో వరిపంటను సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని తమ చుట్టుపక్కల గ్రామాలైన పబ్బాపురం, రామచంద్రాపురం, రామరాజుపల్లెకు చెందిన పేదలకు ఒక్కొక్కరికి 50 కిలోల చొప్పున వంద బస్తాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ పినతండ్రి లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి కొనసాగిస్తున్నామని తెలిపారు. ట్రస్టు వైస్ చైర్మన్ లేవాకు నితీష్రెడ్డి, ట్రస్టు సభ్యులు లేవాకు రఘునాథరెడ్డి, లక్ష్మిదేవి, మహేశ్వరరెడ్డి, శివ, వేమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ సెంటర్పై విజిలెన్స్ దాడులుకడప అర్బన్ : MýSyýlç³ ¯]lVýS-Æý‡…ÌZ° gñæ.G….[ïÜtsŒæÌZ E¯]l² Æ>Ķæ$-ÌS-ïÜÐ]l$ º*Åsîæ òÜ…r-ÆŠ‡Oò³ Ôèæ°-ÐéÆý‡… ÑhÌñ毌SÞ A«¨M>-Æý‡$Ë$, íܺ¾…¨ §éyýl$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D §éyýl$-ÌSÌZ ç³Ë$ Æý‡M>ÌS M>òÜÃ-sìæMŠS ÝëÐ]l${W ç³Ç-Ö-Í…-^éÆý‡$. GÐ]l*Ãȵ «§ýlÆý‡ ÌôæMýS$…yé AÐ]l¬Ã-™èl$¯]l², GMŠS{OòÜీ M>ÝùÃsìæMŠS AÐ]l$Ã-M>Ë$, GÐ]l*Ãȵ Æó‡rϯ]l$ Ð]l*Æó‡aíÜ AÐ]l¬Ã-™èl$¯]l² A…Ô>-ÌS¯]l$ ç³Ç-VýS׿-¯]l-ÌZMìS ¡çÜ$MýS$° ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. D ™èl°T-ÌSÌZ ÎVýSÌŒæ Ððl${sêÌSi C¯ŒS-òܵ-MýStÆŠ‡ G….Ñ Æý‡Ðól$‹Ù MýS$Ð]l*ÆŠ‡ Æð‡yìlz, ÑhÌñ毌SÞ A«¨-M>-Æý‡$Ë$ ¼.X-™éÐé×ìæ, ¼. »êº$ Ððl*òÜ‹Ü, G‹Ü. Rêgê çßæ$õÜÞ¯ŒS ´ëÌŸY¯é²Æý‡$. °º…-«§ýl-¯]lÌZ EÌSÏ…-íœ$…^ól Ķæ$fÐ]l*-¯]l$-ÌSOò³ ^èlrt-ç³-Æý‡…V> ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê-Ð]l$-¯é²Æý‡$. òßæyŠæ M>°-õÜt-º$ÌŒæ G‹Ü.-Æý‡ïœ, M>°-õÜt-º$â¶æ$Ï G‹Ü. sìæç³š çÜ$Ìê¢-¯Œl, çÜ$«§éMýSÆŠæ, Æý‡…™èl$ »êÚë ´ëÌŸY¯é²Æý‡$. -
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆసుపత్రిలో ఈనెల 8 తేదీన అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి (49) చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. యువజనోత్సవాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభకడప ఎడ్యుకేషన్ : యువజన సర్వీసుల శాఖ, విజయవాడ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారని స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఐ.జె. విజయ్ కుమార్ తెలిపారు. కవిత్వంలో ఎస్.హీన ఫిరసత్ ప్రథమ, కథా రచనలో ఎం. వెంకట సాహిత్య ద్వితీయ బహుమతి పొందారని తెలిపారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాలికడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్లో శనివారం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఈయన కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్న తరగతి గదిలో ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న బోధనాభ్యాసన చర్చా విషయాలను పరిశీలించారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రమణమూర్తి, నరసింహరాజు, హెచ్ఎం ముబీన రెహనా తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిఎర్రగుంట్ల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ చీఫ్ మేనేజర్ ఐఆర్పీఆర్ హెచ్ఓడీ పేర్ల భార్గవరెడ్డి తెలిపారు. శనివారం తిప్పలూరులోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్, పెయిడ్ స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భార్గవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీఎస్ఆర్ హెడ్ నితీశ్వర్కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మాజీ సలహదారులు అంబటి కృష్ణారెడ్డి, సంస్థ డైరెక్టర్ చలపతిరావు, ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్మధన్రెడ్డి పాల్గొన్నారు. గువ్వలచెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న నక్షత్ర ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిలైంది. డ్రైవర్ బస్సును అదుపు చేయలేక ముందు వెళుతున్న లారీని ఢీకొన్నాడు. బస్సులోని అయ్యప్ప భక్తులు పదిమందికి, డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. వీరంతా శబరిమలలో దర్శనం ముగించుకొని హైదరాబాద్కు వెళుతున్నట్లు సమాచారం. -
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బా ధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎ స్పీ ఆదేశాల మేరకు ఆర్ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శా ఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మ హేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు. మహేశ్వర్ రెడ్డి (ఫైల్), నివాళులర్పిస్తున్న ఆర్ఐ శివరాముడు -
కరెంట్షాక్తో యువకుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్షాక్తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి – మరొకరికి గాయాలు అర్ధవీడు (ప్రకాశం) : వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
● మద్యం తాగొద్దని మందలించినందుకు.. ● నరసింహుడును దారుణంగా హత్య చేసిన నాగరాజు ● 2021లో జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో జరిగిన ఘటనప్రొద్దుటూరు క్రైం : జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021లో జరిగిన హత్య కేసులో ప్రొద్దుటూరులోని ఎర్రన్నకొట్టాలకు చెందిన ఇల్లూరు నాగరాజు అనే నిందితుడికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021 అక్టోబర్ 24న జ్యోతుల పండుగ నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు గూడెంచెరువు గ్రామానికి చెందిన సర్వ నరసింహుడు అనే బంధువు మిద్దె లక్ష్మిదేవి ఇంటికి వచ్చాడు. వారింటి సమీపంలోనే వెంకటరాముడు నివాసం ఉంది. అతని అల్లుడైన ఇల్లూరు నాగరాజు కూడా పండుగ నిమిత్తం వెంకటరాముడు ఇంటికి వచ్చాడు. నాగరాజు మద్యం సేవించి అందరితో గొడవ పడుతుండటంతో నరసింహుడు అతన్ని వారించాడు. ఎందుకు మద్యం తాగి అందరితో గొడవ పడుతున్నావని సున్నితంగా మందలించాడు. దీన్ని నాగరాజు అవమానంగా భావించి మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మరుసటి రోజున (2021 అక్టోబర్ 25న) నాగరాజు లక్ష్మీదేవి ఇంటి వద్దకు వెళ్లాడు. ‘అలా బయటికి వెళ్దాం రా..’ అని మాయమాటలు చెప్పి నరసింహుడును తీసుకెళ్లాడు. అలా నరసింహుడుతో కలసి వెళ్లిన నాగరాజు రక్తపు మరకలు కలిగిన షర్టుతో సాయంత్రం ఒంటరిగా ఇంటికి వచ్చాడు. అనుమానం కలిగిన లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు నరసింహుడు కోసం వెతికే క్రమంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తారస పడ్డాడు. నరసింహుడు గురించి అతన్ని అడుగగా మామిడి తోటలోకి వెళ్లి చూడమని చెప్పాడు. లక్ష్మీదేవి, ఆమె కుమారుడు రామ్మోహన్తో కలిసి తోటలోకి వెళ్లి చూడగా నరసింహుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు అప్పటి జమ్మలమడుగు అర్బన్ సీఐ జి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. నిందితుడు నరసింహుడును అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో జరుగుతూ వచ్చింది. తుది విచారణలో నేరం రుజువు కావడంతో ఇల్లూరు నాగరాజు అలియాస్ ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె సత్యకుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి వాదనలను వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ప్రస్తుత జమ్మలమడుగు సీఐ సురేష్, కోర్టు హెడ్కానిస్టేబుళ్లు నాగరాజు, మహబూబ్బాషా, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని తన కార్యాలయంలో ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్యచే డ్రైవర్లకు యోగా, ధ్యానం ప్రాధాన్యతను తెలియజేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయించారు. గోపాల్రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు పనితీరుతోనే ఆర్టీసీకి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయన్నారు. నిర్ణీత సమయంలో బస్సును నడిపినపుడే ప్రయాణీకుల మన్ననలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలాగే ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉన్న అంశాలను తెలియజేశారు. పులివెందుల డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ ప్రమాదాలపై సమీక్ష చేశారు. డ్రైవర్లకు బ్లాక్ స్పాట్పై జాగ్రత్తలను తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపోలకు చెందిన 19 మంది డ్రైవర్లు, కండక్టర్లు హాజరయ్యారు. -
రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం
● అరుదైన వన్యప్రాణుల స్మగ్లింగ్లో నలుగురు అరెస్ట్ ● స్థానిక ఎస్సార్కె లాడ్జీలో నిందితులను విచారించిన అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇన్టెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారిని పట్టణంలోని ఎస్సార్కె లాడ్జ్లో మధ్యాహ్నం నుంచి 9 గంటలకు పైగా విచారణ చేస్తుండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమికూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు, అధికారులు, పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జ్ను మొత్తం వారి అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీశాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరాజుపేటకు చెందిన ఆటోడ్రైవర్ మొలకల సుబ్రమణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచారిలను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పూడుపాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారివద్దనుండి కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదుపులోకి తీసుకొన్న వారితో అధికారులు, లాడ్జీ ముందు గుమికూడిన జనం -
మట్కా బీటర్లు అరెస్ట్
కడప అర్బన్ : కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మట్కా బీటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. షేక్ మస్తాన్ షరీఫ్, మొహమ్మద్ గౌస్ అనే ఇరువురు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి దాడులు చేసి వారి నుంచి రూ.6.950 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. టీవీ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు రామాపురం : మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా పోర్టబుల్ టీవీ పేలి పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గూడురు లక్ష్ముమ్మ అనే వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా టీవీ పూర్తిగా దెబ్బతినగా, బీరువా, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానికులు కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధిక వోల్టేజ్, నిరంతరం టీవీ ఆన్లో ఉండటం వలన పేలుడు జరిగి ఉండవచ్చునని లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, వోల్టేజ్ స్టెబిలేజర్లు వినియోగించాలని సూచించారు. కడప వ్యాపారి హత్య రాయచూరు రూరల్ : వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు. ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ
వల్లూరు : వల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకుంది. దీంతో వాహన దారులకు అతి సమీపంలోకి వచ్చే వరకు ఎదురుగా వున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తప్పెట్ల గ్రామ సమీపంలో కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సీ కొత్తపల్లెకు చెందిన రైతు చంద్ర శేఖర్ అలియాస్ చెన్నయ్య బక్కిరెడ్డిపల్లె సమీపంలోని పొలంలో సేద్యం పనులకు ఎద్దుల బండిలో బయలుదేరాడు. అదే సమయంలో కడప వైపు నుండి కమలాపురం వైపు వెళ్తున్న లారీ పొగ మంచు కారణంగా కనిపించక పోవడంతో ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండి బోల్తా పడింది. బండిలో వున్న రైతు చెన్నయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా మంచు కమ్ముకున్న పరిస్థితుల్లో మరో ప్రమాదం జరగకుండా రోడ్డుపైన బోల్తా పడి ఉన్న ఎద్దుల బండిని పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. -
గాంధీ విగ్రహం ఎదుట నిరసన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ఉపాధిని హరించే జీ–రామ్–జీ అనే నూతన బిల్లును బీజేపీ లోక్సభలో బలవంతంగా ఆమోదింపజేసిందని దీనిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఐటిఐ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మకద్రోహమని, ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్వేష్, దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రరెడ్డి జమీల, వెంకటేశ్వర్లు, నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, నారాయణరెడ్డి, శంషాద్, విజయ్, తిమ్మయ్య, ప్రవీణ్ కుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు. -
సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్ డీన్ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 21న సీనియర్స్ జిల్లా స్థాయి నెట్బాల్ ఎంపికలను కడప నగరంలోని జేేఎంజే జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్బాల్ సంఘం కార్యదర్శి రెడ్డయ్య తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరగనున్న రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని శుక్రవారం పెండ్లిమర్రి పీహెచ్సీపీ వైద్యాధికారి ప్రసాద్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లటూరులో నిర్వహిస్తున్న వరదారెడ్డి ప్రథమ చికిత్స కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించామని తెలి పారు. అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికిత్స చేయకపోడంతో చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసీ డీఎంహెచ్ఓకు తెలిపామన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశాల గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 20వ తేదీ పీజీలో ప్రవేశాలు చేసుకునేలా కళాశాలలకు అవకాశాన్ని కల్పించిందన్నారు. అభ్యర్థులు తమ బరిజనల్ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయంలోని డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ –2025 రాసి అర్హత సాధించిన వారు, రాయని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చన్నారు. మదనపల్లె సిటీ: జేఎన్టీయూ సౌత్జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్టీయూ సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు ఉన్నతమైన నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు, నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు. -
వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రతి పాఠశాల పదో తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల (మెయిన్)లోని యాక్షన్ ప్లాన్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో తరగతి గదిలో మమేకమై ప్రిపరేషన్పై అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముబీన రెహనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులుగా పని చేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ వారికి పదోన్నతుల పత్రా లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, పరిపాలన అధికారి చాంద్బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
21న రచ్చబండ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత బలంగా చేపట్టేలా కార్యాచరణ కొనసాగుతోందని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో కమిటీల నియామకం పూర్తయిందన్నారు. కమిటీల నియామకం పూర్తయిన నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా మడకశిర నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోను, అనంతరం వేమూరులోను కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్.. కడప పార్లమెంటులో పూర్తి చేద్దామని పిలుపునివ్వడంతో వాళ్లు కూడా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో 80 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. ఈ నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల ప్రోత్సాహం చెప్పుకోదగినదని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం పటిష్టం జరిగి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కిందిస్థాయిలో ఏది చేయాలన్నా, వాళ్ల ద్వారా చేయడం, లేదా ఇన్వాల్వ్ చేయడం కోసం పటిష్టమైన నాయకత్వం రికార్డు అయి ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, సెంట్రల్ ఆఫీసులో డేటా అందుబాటులో ఉండేందుకు, బీమా, ఐడీ కార్డులు అందించేందుకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు ప్రయారిటీ తెలుస్తుందని వివరించారు. ‘రేపు (ఆదివారం) మన అధ్యక్షులు వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై తీర్మానం, గవర్నర్కు మెమొరాండం ఇచ్చినది ఆయా కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలి. స్థానిక సమస్యలు పెట్టాలి. ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన ప్రభావం గ్రామాల్లో పడుతుంది. కాబట్టి, పేద కూలీలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేయాలి. రైతుల సమస్యలు, మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాలు లేకపోవడం వంటివాటిని చేర్చవచ్చు. సోషల్ మీడియా వేదికలు వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగాం ద్వారా యాక్టివ్గా ఉండేవారిని గుర్తించి షేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ ఇన్చార్జీలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మూడు, నాలుగునెలలు మీటింగులు జరగాలి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహిస్తే అదే గాడిలో పడుతుంది’ అని సజ్జల పేర్కొన్నారు. సంస్థాగత కమిటీలు పూర్తయిన 10 నియోజకవర్గాల్లో నిర్వహణ వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ -
నేడు కెరీర్ ఫెస్ట్
కడప ఎడ్యుకేషన్: స్థానిక వైఎస్సార్ అడిటోరియం పక్కన ఉన్న నూర్జహాన్ షాదిఖానా – ఉర్దూ ఘర్లో శనివారం జిల్లా కెరీర్ యాక్టివిటీ ఎక్స్పో, ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పేమ్రంత్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై శుక్రవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 36 మండలాల నుంచి పాల్గొననున్నారని చెప్పారు. ప్రతి మండలం నుంచి 5 ప్రాజెక్టులు ప్రదర్శించాన్నారు. అందులో 3 కెరీర్ పాత్ మోడల్స్, 1 పెయింటింగ్, 1 వృత్తి విద్య/వృత్తి దుస్తుల పోటీ ఉండాలని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో మండల స్థాయి విజేతలందరూ పాల్గొనాలని సూచించారు. కాగా ఇంటర్మీయెట్ తర్వాత ఏ కోర్సులు చదివితే, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వంటి విషయాలపై ఈ ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల ద్వారా తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇందులో తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో ఆరోగ్య మేరీ, సెక్టోరియల్ అధికారులు, జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బోయనపల్లెను వీడని గంజాయి వాసన!
రాజంపేట: కడప–రేణిగుంట హైవేలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బోయనపల్లె.ఈ ప్రాంతాన్ని గంజాయి వాసన వీడేటట్లు కనిపించడంలేదు.బోయనపల్లెలో వివిధ ఇంజినీరింగ్ విద్యాసంస్ధలు ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులు ఉన్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఈ ప్రంతానికి వస్తుందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు న్యూ బోయనపల్లెలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేది ఓపెన్ టాక్. రూ.350, రూ.450, రూ.550లకు విక్రయిస్తున్నట్లు పలువురు చెపుతున్నారు. యువతను అధికంగా ఆకర్షించేలా రహస్యంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి అవుతోందన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. . పోలీసు సబ్కంట్రోల్ ఉన్నా.. న్యూబోయనపల్లెలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంది. పోలీసు సిబ్బంది కొరత కారణంగానే నిర్వహణ భారంగా మారిందనే భావనలు శాఖాపరంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మూతపడింది. గతంలో బోయనపల్లెలో అటు మద్యం, ఇటు గంజాయి మత్తులో యువత వీరంగాలు సృష్టించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.అనుమానితులపై నిఘా.. తాజాగా గంజాయి అమ్మకాలు విషయంలో మన్నూరు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కొందరిని పట్టుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో స్పెషల్పార్టీ సంచరిస్తోంది. అవాంఛనీయ సంఘటన ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుగా అమ్మకాలు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
బాదుడే.. బాదుడు!
వాహనం సంవత్సరాలు గత రేటు ప్రస్తుత రేటు ● ఫిట్నెస్ పేరుతో చార్జీల మోత ● వాహనదారులపై అదనపు భారం ● ఆందోళన చెందుతున్న యజమానులు ● ఇక వాహనాలు నడపలేమంటున్న వైనం కడప వైఎస్ఆర్ సర్కిల్: వాహనదారులు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ చార్జీలు పెంచింది. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకు పైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెన్స్తోపాటు విడిభాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇటు పెరిగిన ఫిట్నెస్ చార్జీలు అటు ఈఎంఐలు కట్టలేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు నడపలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వివిధ రకాల వాహనాలు, లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు అధికంగా ఉన్నాయి. వాటి యజమానులకు.. పెంచిన చార్జీలు అదనపు భారం కానున్నాయి. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. లైట్ గూడ్స్ వెహికల్స్, మిడిల్ గూడ్స్ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్గా విభజించి ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు హెవీ వెహికల్స్ 10 920 1416 10–13 2360 15–20 16,520 20 ఏళ్లకు పైగా 33,040 ఎంజీవీ 10 920 1416 10–13 2360 15–20 13,334 20 ఏళ్లకు పైగా 26,668 ఆటో 15 620 944 15–20 2360 20 ఏళ్లకు పైగా 10,620 ఎల్జీవీ 15 820 944 15–20 10,030 20 ఏళ్లకు పైగా 20,060 కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్జేటీసీ) కృష్ణ వేణి పేర్కొన్నారు. శుక్రవారం నగర శివారులోని ఊటుకూరులో ఉన్న జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ స్థాయి అర్ధ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ లక్ష్యాలను 82 శాతం మాత్రమే సాధించామని, వంద శాతం సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు పంపించాలని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి వాహన పన్నుల వసూలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాల డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


