YSR
-
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘జేఈఈ’లో మెరిసిన కడప కుర్రాడు
కడప ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడపలోని భాగ్యనగర్కు చెెందిన మొలకల జశ్వంత్రెడ్డి మెరిశాడు. ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్రెడ్డి, శ్రీలత కుమారుడు జశ్వంత్రెడ్డి ఒకటి నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్లో చదివాడు. ఆ తరువాత ఇంటర్మీడియెట్ను విజయవాడ కానూర్లోని నారాయణలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకును సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. డాక్టర్ రాజకిషోర్రెడ్డి సొంత గ్రామం వీరపునాయునిపల్లె మండలం అనిమెల అయితే కడపలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్ ఆఫ్ యానియల్ హస్బెండరీలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నారు. ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు -
బ్యాంకర్లతోనే ఆర్థిక వ్యవస్థ పటిష్టం
కడప అగ్రికల్చర్ : బ్యాంకర్లు సమర్థంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ –2047 దిశగా వైఎస్ఆర్ జిల్లాను కూడా ముందుకు నడిపించాలన్నారు. అందుకుగాను వైఎస్ఆర్ విజన్ యాక్షన్ ప్లాన్ 2024–29 ప్రకారం జిల్లాను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు, రైతులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులకు రుణాలు అందించి, ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు. అనంతరం 2025–26 జిల్లా క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, నాబార్డ్ ఏజీఎం విజయ విహారి, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ రాజేష్ కుమార్, కెనరా బ్యాంకు ఏజీఎం అరుణ జ్యోతి, ఎస్బీఐ ఏజీఎం కృష్ణ కిషోర్, యూబీఐ ఏజీఎం లక్ష్మి తులసి, ఏపీజీబీ ఏజీఎం శ్రీనివాస ప్రసాద్, కేడీసీసీ సీఈఓ రాజమ్మ, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, డీఐఏ జిల్లా కోఆర్డినేటర్ ఎస్వీ రమణ, వివిధ బ్యాంకుల జిల్లా మేనేజర్లు, ఆర్ఎంలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు ఎటువంటి అసౌర్యాలు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆశోక్కుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం
పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో మంగళవారం వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద రాయి తగిలింది. దానిని వెలికితీయగా వినాయక విగ్రహం కనిపించింది. దీంతో సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వినాయక విగ్రహానికి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. పూర్వం ఈ ప్రదేశంలో గుడి ఉండి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. విలువలతో కూడిన విద్య అందించాలి కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప జయనగర్ కాలనీలో బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజైన మంగళవారం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు చేరవేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ విజయభాస్కర్రెడ్డి, ఎస్సీఆర్టీ అబ్జర్వర్ బ్రహ్మానందరెడ్డి, డైట్ లెక్చరర్లు గిరిబాబు, రెడ్డెయ్య, స్టేట్ రీసోర్సు పర్సన్స్ సుబ్బానాయుడు, గంగాధర్, తిరుమల కొండ, సురేష్కుమార్రెడ్డి, కృష్ణానాయక్, బాబాసాహేబ్ తదితరులు పాల్గొన్నారు. 7న యోగాంధ్ర రాయచోటి : ఈనెల 7న తాళ్లపాక అన్నమయ్య సన్నిధిలో అత్యంత వేడుకగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 617 మందితో యోగాసనాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రజల్ని వంచింది. సీఎం చంద్రబాబు తన సహాజ ధోరణి వీడలేదు. ప్రజల్ని నిలువునా మోసగించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాజ్యాంగాన్ని విస్మరించి ఏకపక్ష పాలన సాగిస్తున్నారు. ఐదేళ్లు వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో ఠీవిగా జీవించిన ప్రజలు అనేక కష్టనష్టాలు చవిచూస్తున్నారు. ఏడాదికే తీవ్రస్థాయి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన విజయవంతం చేయండి. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి బలంగా విన్పించాలి. – ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మోసం.. చంద్రబాబు నైజం ప్రజల్ని మోసగించడం, అబద్ధాలతో వంచించడం సీఎం చంద్రబాబు నైజం. సూపర్ సిక్స్ పథకాల పేర్లతో పక్కాగా మోసగించాడు. 1995 నుంచి 2025 వరకూ చంద్రబాబు చరిత్ర పరిశీలిస్తే విశ్వసనీయత అనేది లేదు. ఏ అవసరానికి అనుగుణంగా ఆ గొడుగు మార్చే రకం. ఎన్టీయార్ను మొదలుకొని తోడల్లుడు దగ్గబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్ది హరికృష్ణ, తుదకు జూనియర్ ఎన్టీయార్లను వాడుకొని వదిలేశారు. ప్రజల్ని కూడా తన అవసరానికి అనుగుణంగా అబద్ధాలు చెప్పి మోసగించారు. ఏడాదిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదు. ఈ తరణంలో వైఎస్సార్సీపీ చేపడుతున్న ‘వెన్నుపోటు దినం’ జయప్రదం చేయాలి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ -
మద్దుతు ధర.. అరకొర
వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఆశాజనకంగా లేవు. పెరుగుతున్న ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా నిర్ణయించడం లేదు. వివిధ పంటల సాగు, ఉత్పత్తి వ్యయాలకు.. మద్దతు ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా కంటితుడుపుగా నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఆచరణలో చూపెట్టాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కింది స్థాయిలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు దళారులకు అందుతున్నాయి తప్ప సామాన్య రైతులకు అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల వల్ల రైతులకు కొంత వరకై నా ఉపశమనం కలగాలంటే కచ్చితంగా అమలు జరగాలి. – మోహన్రెడ్డి, రైతు, సుంకేసుల ఖర్చులకు అనుగుణంగా... ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడం ఏమాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను ప్రకటించాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, రాష్ట్ర ఉద్యాన మాజీ సలహాదారు గిట్టుబాటు అయ్యే విధంగా లేవు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే విధంగా లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే చెప్పిన కేంద్రం మద్దతు ధరలను అరకొరగానే పెంచుతోంది. మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – పోతిరెడ్డి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం కడప అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్లోని 14 పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, నూనెగింజ పంటలైన పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్తోపాటు మిల్లెట్స్ రకాలైన జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతోపాటు ఎరువులు, కూలీలు ఇలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగినఽ ధరలకు అనుగుణంగా పెంచి ఉంటే బాగుండేదని పలువురు రైతులు అంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి పంటకు గతేడాది కంటే ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే ధర పెంచడంపై అన్నదాతలు అంతగా సంతృప్తి చెందడం లేదు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే కొంత మంది వరి రైతులు ఈ మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకు ఎంత మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు సంబంధించి వరి సాధారణ రకం క్వింటాలుకు రూ.2300 ఉండగా 2369కి పెంచారు. అలాగే గ్రేడ్–ఏ రకానికి 2320 ఉండగా 2389, జొన్న (హైబ్రీడ్) రూ.3371 ఉండగా 3699, జొన్న (మాల్థండి) రూ. 3421 ఉండగా 3749, సజ్జలు రూ.2625 ఉండగా 2775, రాగులు రూ.4290 ఉండగా 4866, మొక్కజొన్న రూ.2225 ఉండగా 2400, వేరుశనగ రూ.6783 ఉండగా 7263, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280 ఉండగా 7721, నువ్వులు రూ.9267 ఉండగా 9846, సోయాబీన్ రూ.4892 ఉండగా 5328, పెసలు రూ.8682 ఉండగా 8768, పత్తి (మధ్యరకం) రూ.7121 ఉండగా 7710, పత్తి (లాంగ్ స్టెపెల్) రూ.7521 ఉండగా 8110కి పెంచారు. పెరుగుతున్న సాగు ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర మాత్రం పెంచడం లేదని పలువురు రైతులు అంటున్నారు. కంటి తుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, వీటితో రైతులకు గిట్టుబాటు కావడం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకు ఏటా సగటున వరిధాన్యంపై సరాసరిన రూ.100కు లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు మాత్రం ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.13 వందల ఉండే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ఇప్పుడు రూ.18 వందలకు చేరింది. డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టరు యజమానులు సేద్యం ధరలను పెంచేశారు. కూలీలు, ఎరువులు, పురుగు నివారణ మందులు ఇలా అన్ని రకాల ధరలు భారీగా పెరిగాయి. మొత్తం మీద సాగు ఖర్చులు గతం కంటే 8 వేల నుంచి 10 వేల వరకు పెరిగాయి. కావున సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా మద్దతు ధరను పెంచాలని పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. గతేడాది, ఈ ఏడాది పెరిగిన మద్దతు ధరల వివరాలు 2018 నుంచి వరికి కనీస మద్దతు ధర వివరాలు ఇలా (క్వింటాలుకు)... కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంపు స్వల్పంగా పెంచడంపై అన్నదాతల్లో అసంతృప్తి కంటితుడుపు చర్య అంటున్న రైతు సంఘాలు సాగు ఖర్చులకు అనుగుణంగా ప్రకటించాలని వినతి పంట 2024–25 2025–26 పెరిగిన ధర వరి సాధారణ 2300 2369 69 వరి ఏ గ్రేడ్ 2320 2389 69 జొన్న హైబ్రీడ్ 3371 3699 328 జొన్న (మల్థాని) 3421 3749 328 సజ్జలు 2625 2775 150 రాగులు 4290 4866 576 మొక్కజొన్న 2225 2400 175 కందులు 7550 8000 450 పెసలు 8682 8768 86 వేరుశనగ 6783 7263 480 పొద్దుతిరుగుడు 7280 7721 441 సోయాబీన్ 4892 5328 436 నువ్వులు 9267 9846 579 పత్తి 7121 7710 589 పత్తి 7521 8110 589 (లాంగ్ స్టేపుల్)సంవత్సరం సాధారణ ఏ గ్రేడు రకం రకం 2018–19 1750 1777 2019–20 1815 1835 2020–21 1865 1888 2021–22 1940 1960 2022–23 2020 2060 2023–24 2183 2203 2024–25 2300 2320 2025–26 2369 2389 -
వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, కడప : మారిన మనిషిగా అనుచరగణం కీర్తించారు, పథకాల పేర్లతో జనాన్ని నమ్మించారు. అధికారం కోసం అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. ఎన్నికల్లో నెగ్గారు, ఆపై నిజస్వరూపం బహిర్గతమైంది. ఏడాది కాలంలో హామీలు తుంగలో తొక్కేశారు. ప్రకృతి సంపద ఆధారంగా తెలుగు తమ్ముళ్లు దోపిడీ యథేచ్ఛగా తెరపైకి వచ్చింది. పౌరులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు తిలోదాకాలు ఇచ్చారు. ‘నాడు–నేడు’ వెలుగు కరిగిపోయి, విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. తల్లికి వందనం ఊరిస్తోంది. ఆడబిడ్డ నిధి మాటే లేదు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఉండిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ‘బాబు ష్యూరిటీ... భవిష్యత్కు గ్యారెంటీ’తో జనం మధ్యకు వచ్చారు. సీఎం చంద్రబాబు మాటల గారడీని నమ్మి మోసపోయామని ఆవేదన చెందడం ప్రజల వంతైంది. ఏడాది పాలనలో అవినీతి, మోసం, నయవంచన, కుట్ర, పగ, వెన్నుపోటు రాజ్యమేలుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఊరువాడ ప్రచారం ‘ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం’ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి భృతి చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ‘అమ్మ ఒడి’ పథకంలో సమూల మార్పులు తీసుకువస్తాం. ఎంత మంది విద్యార్థులంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున చెల్లిస్తాం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు చెల్లిస్తాం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘రైతులను ఆదుకుంటాం. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడికి ‘అన్నదాత సుఖీభవ పథకం’ ద్వారా రైతులకు రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు’ హామీ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువతి నుంచి 59 సంవత్సరాల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ చెల్లిస్తామని ఊరువాడా చెప్పుకొచ్చారు. మహిళలు ఎక్కడికెళ్లినా సరే ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఇప్పటికీ చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేయలేదు. ప్రజలను వంచించి ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్’గా సీఎం చంద్రబాబు కీర్తి గడిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆశపడి ఆపై మోసపోయి.. సామాన్యులకు కామధేనువుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా ఐదేళ్లు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి సరిగ్గా ఆ తేదీకి అమలు చేసిన చరిత్ర ఆయన సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులు 9,82,554 మంది బ్యాంకు ఖాతాలకు రూ.8,857.42 కోట్లు వేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 9,72,388 మందికి రూ.3,279.10 కోట్లు చెల్లించారు. మొత్తంగా రూ.12,136.52 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి అందించి చరిత్ర సృష్టించారు. సామాన్యుల జేబులు డబ్బులతో గలగలు ఉండేవి. అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రవేశ పెట్టడంతో ఆశపడి టీడీపీ మాటలకు మోసపోయారు. ఏడాదైనా ఒక్క రూపాయి ప్రజలకు నేరుగా అందిన దాఖలాలు లేవు. కామధేనువులాంటి వైఎస్ జగన్ సర్కార్ను పోగొట్టుకొని, దున్నపోతు లాంటి చంద్రబాబు సర్కార్ తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన పడుతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలకు చంద్రబాబు మరోసారి మోసం ఊరిస్తున్న తల్లికి వందనం పథకం అందని ద్రాక్షలా నిరుద్యోగ భృతి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.15 వందలు ఉత్తిదే రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేల ఊసేలేదు సీ్త్రలకు ఉచిత బస్సు ప్రయాణం మాటే మర్చారు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఏడాదైనా అమలు కాని ‘సూపర్ సిక్స్’ పథకాలు నేడు వెన్నుపోటు దినంపై ఆందోళనలు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ మొదటి నుంచి గర్జిస్తోంది. జూన్ 4న, బుధవారం ‘వెన్నుపోటు దినం’ పాటిస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో నిరశన పాటించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మరోమారు చంద్రబాబు హామీలతో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అన్నీ ప్రాంతాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఆ పార్టీ సర్వసన్నద్ధమైంది. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
కడప అర్బన్ : డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని.. సమష్టి కృషితో డ్రగ్స్ను పారదోలుదామని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ’ఈగల్’ (ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పై ప్రజలకు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఈ టాస్క్ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, సాగు, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టాస్క్ ఫోర్స్ నోడల్ ఇన్చార్జి ఆఫీసర్, ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం.డి. రియాజ్ అహమ్మద్, సైబర్ సెల్ సి.ఐ. నాగరాజు, డీసీఆర్బీ ఎస్.ఐ. బీవీ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
ఉజ్వల భవిష్యత్తుకు సోపానం
జవహర్ నవోదయలో విద్యాభ్యాసం..రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. అన్నమయ్య జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో, మరొకటి మదనపల్లె మండలం వలసపల్లెలో ఉంది. ఒక్కో విద్యాలయంలో ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను రాస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్య లభించి తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రవేశ పరీక్షను రాయిస్తారు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. పోటీకి తగ్గట్లు ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో చదివిన విద్యార్థులకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివిన విద్యార్థులకు మదనపల్లెలోని నవోదయ విద్యాలయంలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా ఓ ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1984వ సంవత్సరం మదనపల్లెలో, 1987వ సంవత్సరం రాజంపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మదనపల్లెకు చెందిన నవోదయ విద్యాలయం తొలుత హార్సిలిహిల్స్లో ఏర్పాటయింది. అనంతరం మదనపల్లె మండలం వలసపల్లెలో ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎం. గీత తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే ● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. ● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పని సరిగా చదివి ఉండాలి. ● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2025–2026 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది. ● నోటిఫికేషన్లో పొందు పరిచిన విధంగా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు. ● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది. ● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ఇవీ ప్రయోజనాలు.. ● నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీటు పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. ● మెరుగైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అన్ని ఉచితంగా కల్పిస్తారు. ● విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ● విద్యాబోధన మాత్రం కంబైన్డ్ విధానంలో ఉంటుంది. ● కంప్యూటర్ కోర్సుతో పాటు ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సీట్ల కేటాయింపు ఇలా.. ● ఆరవ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీకే ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. ● 80 సీట్లలో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, 20 సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ సౌకర్యం ఇలా.. ● బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ● గ్రామీణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో 9 సీట్లను ఎస్సీలతో, ఐదు సీట్లు ఎస్టీలతో భర్తీ చేస్తారు. ● పట్టణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో మూడు సీట్లు దివ్యాంగులకు, మూడు సీట్లు ఎస్సీలకు, ఒక సీటు ఎస్టీలతో భర్తీ చేస్తారు. పరీక్షా విధానం ఇలా.. ● మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది. ● మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాప్స్ ఇలా మూడు విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. ● మెంటల్ ఎబిలిటీకి (మేధాశక్తి)కి సంబంధించి 50 మార్కులకు గాను 40 ప్రశ్నలు పది భాగాల్లో ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు డయాగ్రమ్స్ రూపంలో ఉంటాయి. ● గణితంకు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● పేరాగ్రాప్స్కు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29–7–2025 ● ప్రవేశ పరీక్ష తేదీ – 13–12–2025 సీటు సాధిస్తే.. బంగారం లాంటి జీవితం ఆరవ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో చదివితే సీటు సొంతం జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలుఆరునెలలు ఆటలను కట్టిపెట్టాలి విద్యార్థులు ఆరునెలల పాటు ఆటలు కట్టి పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. – కొండూరు రఘునాథరాజు, ఎంఈఓ, రాజంపేట -
చాపాడు మండలంలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ
చాపాడు : మండల పరిధిలోని సీతారామాపురం, కుచ్చుపాప, నరహరిపురం, అనంతపురం తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజులుగా మండలంలోని వివిధ గ్రామాలలోని పంట పొలాల్లో బోర్లు, ఫిల్టర్ల ద్వారా రిగ్గు వేసి లోపల ఉండే ఖనిజాలను అన్వేషిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలతో జరుపుతున్న ఈ పరిశోధనలో ఆయిల్, ఇతర ముడి ఖనిజాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎకరా పొలం పొడవునా 20 చోట్ల బోర్లు వేస్తూ అందులో అన్వేషణ చేసి వెంటనే వాటిని పూడ్చి వేస్తున్నారు. పంట పొలాల్లో జరుగుతున్న ఖనిజ అన్వేషణను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే చెస్ రేటింగ్లను సాధించడం గర్వకారణమని జిల్లా చెస్ సంఘం కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన రవి వసంత కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ అలాగే ఢిల్లీలో నిర్వహించిన రెండు ఫిడే క్లాసికల్ రేటింగ్ టోర్నమెంట్లలో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో 1452 క్లాసికల్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ప్రస్తుతం ఆయన కాశినాయన మండలం, ఇటుకలపాడు జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన నదీమ్ సాహెబ్ గారి ముజమ్మిల్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 1491 రాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ఈ ఇద్దరు క్రీడాకారుల ఫిడే రేటింగులను ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో ఈ నెల 1వ తేదీన ప్రకటించిందన్నారు. -
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి పేర్కొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీలో అచీవర్స్డే–2025ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ప్లేస్మెంట్ అధికారి సునీల్ అల్లువాడ మాట్లాడుతూ ఎన్నో కంపెనీల్లో విద్యార్థులు ఎంపిక కావడమే కాకుండా, ఇంటర్న్షిప్లో కూడా పాల్గొన్నారన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబద్ధత, మానవతా విలువలు గర్వించదగ్గవన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ ఖ్యాతి విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఇండ్రస్టియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ జేఎన్టీయూ (అనంతపురం) ప్రొఫెసర్ కిరణ్మయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమకేశవులు, వివిధ విభాగాల డీన్లు, శాఖాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన స్నేహితులు ఫారూక్(20), చైతన్య(19) ద్విచక్ర వాహనంలో బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ కు వెళ్లేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఫారూక్కు, ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. చైతన్య గాయపడగా ఫారుక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు బాధితులు ఇద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫారుక్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అదేవిధంగా ములకలచెరువు పట్టణంలోని షాపులో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ (50) వ్యక్తిగత పనులపై కదిరి పట్టణానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో ములకలచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని చీకటిమాను పల్లె వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా గాయపడగా, లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లగా, లక్ష్మీనారాయణను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు పంపారు. ఏయూ అచీవర్స్డేలో చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి -
నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి
వీరపునాయునిపల్లె : మండలంలోని యలంకూరుపల్లెలో మంగళవారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి చెందాయి. వివరాలిలా.. యలంకూరుపల్లె గ్రామానికి చెందిన యలంకూరు సాంబశివారెడ్డి ఎద్దులను పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో బతుకుదెరువు కొనసాగించేవాడు. ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లి ఎద్దులకు నీటిని తాపించేందుకు బండితో సహా నీటి గుంత వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగే సమయంలో బండి ముందుకు దొర్లడంతో ఎద్దులు రెండు నీటి గుంతలో పడి బురదలో ఇరుక్కు పోయి ఊపిరి ఆడక మృతి చెందాయి. రెండు ఎద్దులు మృతి చెందడంతో 2 లక్షల రూపాయలు నష్టపోవడంతో పాటు బతుకుదెరువు కోల్పోయామని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సహా యం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ‘బాబు’
కడప సెవెన్రోడ్స్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధ్వజమెత్తారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. అందుకే ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఎన్నికల హామీలు తుంగలో..తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని అంజద్బాషా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. సీ్త్ర శక్తి కింద 18+, 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 15 వేలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల అరియర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి పాత పద్దతిని పునరుద్దరించడం వల్ల పేదలు, మహిళలు రాత్రి 8.30 గంటల సమయంలో కూడా ఎఫ్పీ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సమావేశంలో వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభా గం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, కార్పొరేటర్ షఫీ, నాయకులు యానాదయ్య, వేణుగోపాల్ నాయక్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అమరావతి తప్ప సీమ, ఉత్తరాంధ్ర పట్టడం లేదుముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమి పట్టడం లేదని అంజద్బాషా విమర్శించారు. తన కోటరీలో ఉన్న రియల్టర్లు, బాబు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకే అమరావతి నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఎంతో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించడం అన్యాయమన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు వచ్చాక 66 వేల మంది విద్యార్థులు రీ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయడం మంత్రి లోకేష్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
●అడ్డంగా బుక్కయ్యారు
టీడీపీ నాయకులు ఇష్టారీతిన కరెంటును అక్రమంగా వాడుకునేందుకు సాగిలపడి సహకరించిన విద్యుత్ అధికారులు...తాము చేసిన తప్పు మూడో కంటికి తెలియకూడదని అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 29వ తేదీ సాయంత్రానికి మహానాడు పూర్తికాగా, ఆగమేఘాలపై కదిలి యంత్రాంగాన్నంతా వినియోగించి 30వ తేదీ మధ్యాహ్నానికల్లా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, కాంక్రీట్ దిమ్మెలు వంటిి ఏ చిన్న ఆనవాళ్లు కూడా దొరక్కుండా పక్కాగా పథక రచన చేశారు. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...సాక్షికి అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను క్రేన్లతో తొలగించడం, విద్యుత్ సామాగ్రిని ట్రాక్టర్లలో తరలించడం వంటి దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. -
5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్
రాజంపేట : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ తెలిపారు. సోమవారం తన చాంబరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28 విభాగాలతో జిల్లా వ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తామన్నారు. జిల్లాలో 50 శాతం పచ్చదనం సాధించాలనే ప్రధాన లక్ష్యంతో అటవీశాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అంతటా 4.5 లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఎస్ఆర్పాళెం నగరవనంలో జిల్లా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం, వేప, టేకు, నేరెడు, ఉసిరి, వెదురు, చింత, దానిమ్మ, ఎగసి, గంగరావి, మారేడు, సీతాఫలం, తాండ్ర, శ్రీగంధం, తెల్లమది, మునసంపెంగా, బహునీయతో పాటు మరికొన్ని మొక్కలను నాటుతామన్నారు. అన్నమయ్య హరిత విప్లవంలో భాగం కావాలని ఆయన కోరారు.జిల్లా అటవీ అధికారి జగన్నాథ సింగ్ -
పంటల సాగుపై రైతులకుఅవగాహన
సిద్దవటం: రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతు రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.సిద్దవటంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సోమవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పీఎం కిసాన్ పథకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి, సజ్జ, చిరుధాన్యాల సాగు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు, విస్తీర్ణం పెంపు, ప్రకృతి వ్యవసాయ విధానాల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వీరయ్య మాట్లాడుతూ వరిలో పచ్చిరొట్ట ఎరువుల పంట పూత దశలో ఉన్నపుడు కలియదున్నాలని, 2 కిలో లు సూపర్ వేసి దున్నితే త్వరగా కుళ్లుతుందన్నారు. విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఉధ్యానాధికారి జయభరత్రెడ్డి మాట్లాడుతూ మామిడిలో జూన్, జూలైలో ముదురు కొమ్మలను కత్తిరించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ శాస్త్రవేత్త ఖురేషి, శాస్త్రవేత్త మానస, జిల్లా వనరుల కేంద్రం ఏఓ పద్మజ, రైతులు పాల్గొన్నారు. -
5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు 3 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించి సామాజిక భద్రతా చట్టంలో భాగంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఏఐటియూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరి కేసీ బాదుల్లా తెలిపారు.సోమవారం నగరంలోని హోచిమిన్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండటం వల్ల ఆయాలపైన విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని కోరారు. పాఠశాలలను, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ (ఆయా) వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఉద్దే మద్దిలేటి, ఆయాలు కుమారి, నాగలక్ష్మి, వెంకటేశ్వరి పాల్గొన్నారు. -
కమిషనర్ సారూ.. ఇదేం తీరు.!
కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తీరు రోజురోజుకు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే మాధవికి తొత్తుగా మారి పక్షపాత ధోరణి ప్రదర్శించడం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సోమవారం నాటి సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలుపొంది నగర పాలకవర్గ సభ్యులుగా ఉన్న పదిమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లి వినతి పత్రం ఇస్తే కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని వినతి పత్రం స్వీకరించారు. అదే రీతిలో ఎలాంటి ప్రొటోకాల్ లేని సామాన్య టీడీపీ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అత్యంత వినయ విధేయతలతో నిలబడి వినతిపత్రం స్వీకరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మాటలకు, వారి సూచనలకు ఎంతటి విలువనిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి హోదాలో ఉన్న కమిషనర్ ఇలా దిగజారి ప్రవర్తించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. ఇప్పటికై నా ఆయన వైఖరి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల అందరితోనూ ఒకే రకంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. వారిలో మూడుసార్లు వరుసగా గెలుపొందిన సీనియర్ కార్పొరేటర్లు కూడా ఉండటం గమనార్హం. అధికార పార్టీ నేతలకు గులాంగిరి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి వెల్లువెత్తుతున్న విమర్శలు -
రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్ అడ్డానే
జమ్మలమడుగు : రాబోయే ఎన్నికల తర్వాత కడప సహా రాష్ట్రమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాగా మారబోతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచిన ఏకై న నాయకుడుగా చరిత్ర కెక్కారన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇంతవరకు ఒక్కటి కూడా అమలు పరచలేక ఘోరంగా విఫలమైందన్నారు. మహానాడులో పరస్పరం పొగుడుకుంటూ కాలయాపన చేశారే తప్ప ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదన్నారు. నారా లోకేష్ యువగళం పేరుతో పెద్దముడియం మండలంలో పర్యటించిన సమయంలో రాజోళి ముంపు వాసులకు రూ.12 లక్షలు కాకుండా రూ.24 లక్షలు ఎకరాకు ఇస్తామని ప్రకటించారన్నారు. ఇంత వరకు దాని ఊసే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అలాగే దాల్మియా పరిశ్రమ ద్వారా ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం ఇప్పించడంతోపాటు వారి భూములను సైతం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు లక్షుమయ్య, కౌన్సిలర్ పోచిరెడ్డి, బడిగించల జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
జయలక్ష్మిపై దాడికి ఎస్ఐదే బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కొండాపురం మండలం తిరుమలాయపల్లె గ్రామానికి చెందిన బండారు జయలక్ష్మీపై ఎలాంటి దాడి జరిగినా అందుకు తలమంచిపట్నం పోలీసు స్టేషన్ ఎస్ఐదే బాధ్యత అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ తెలిపారు. సోమవారం బాధిత మహిళ జయలక్ష్మితో పాటు మహిళా ఐక్య వేదిక నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ జయలక్ష్మికి 17 ఏళ్ల క్రితం మైలవరం మండలం గంగుల నారాయణ పల్లె గ్రామానికి చెందిన మైల శ్రీనివాసులుతో వివాహమైందన్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో పదేళ్ల క్రితం విడిపోయారన్నారు. అయితే జయలక్ష్మి ఇచ్చిన కట్నం, భరణం తిరిగి ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవని మైల శ్రీనివాసులు సర్వే నెంబరు 1241లో తనకున్న 2 ఎకరాల 11 సెంట్ల వ్యవసాయ భూమిని జయలక్ష్మి పేరు మీద 2015లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్నారు. ఆ తర్వాత బాధితురాలు జయలక్ష్మి తిరుమలాయపల్లెలో తన పుట్టింటిలో ఉంటూ ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమికి ధర రావడంతో ఆమె మాజీ భర్త, అతని రెండవ భార్య కృష్ణవేణి, అతని అన్న కలిసి ఆ భూమిని తిరిగి ఇవ్వాలని, లేకుంటే చంపుతామని జయలక్ష్మిని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో కూడా ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కొండాపురం సీఐని కలవగా బాధితురాలి మాజీ భర్త మైల శ్రీనివాసులును పిలిపించి మందలించారన్నారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న అతను తిరిగి ఆమె వెంట పడుతూ భూమి దగ్గరికి వస్తే అక్కడే చంపి పూడ్చి పెడతా అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వ తేదీన వారు ముగ్గురు కలిసి దౌర్జన్యంగా బాధితురాలి భూమిని దున్నుతుండగా, ఆ విషయం తెలుసుకున్న జయలక్ష్మి పోలీసులను ఆశ్రయించిందన్నారు. తర్వాత తలమంచిపట్నం ఎస్ఐని కలిసి బాధితురాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మైలవరం మండల తహసీల్దార్ ఇచ్చిన నివేదిక చూపించగా ఇవి ఎందుకూ పనికిరావని, ఇలాంటివి 100 డాక్యుమెంట్లు పుట్టించవచ్చు అంటూ ఎస్ఐ ఎగతాళిగా మాట్లాడారని చెప్పారు. బాధితురాలి తరపున భూమిని గుత్తకు తీసుకున్న పెద్దరంగడిని కూడా ఎస్ఐ బెదిరించారన్నారు. భవిష్యత్తులో జయలక్ష్మికి ఏ హాని జరిగినా అందుకు తలమంచిపట్నం ఎస్ఐనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాధితురాలి తరపున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. -
పోట్లదుర్తిలో ఉద్రిక్తత
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎర్రగుంట్ల సీఐ నరేష్బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనాకపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు తన కోటా కింద గ్రామంలోని పెద్దమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులు చేపట్టేందుకు ప్రస్తుతం పూనుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించి 3.09 ఎకరాల భూమి ఉందని, అందులో కొంత భూమిని ఆక్రమణదారులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులు దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించారు. ఆలయానికి సంబంధించిన మొత్తం స్థలంలో ఆక్రమణలను తొలగించిన తర్వాతే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. ఆలయ పరిరక్షణ కోసమే ప్రస్తుతం ఉన్న స్థలంలో ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎంపీ సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం రమేష్ నాయుడు సంఘటన స్థలానికి వచ్చి చెప్పారు. ప్రహరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహింపజేయడంతోపాటు వాచ్మెన్ను ఏర్పాటు చేసి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. ఎంపీ నిధులతో ఆలయ పరిరక్షణ కోసం ప్రహరీని నిర్మించాలని నిర్ణయించామన్నారు. గతంలో గ్రామస్తులు ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని న్యాయస్థానంలో రెండు పిటీషన్లు వేశారని వాటిని న్యాయ స్థానం కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం సూచన మేరకే పనులు చేపడుతున్నామని, ఇందులో తమకు ఎలాంటి స్వార్థం లేదని సురేష్నాయుడు తెలిపారు. ప్రహరీని నిర్మించి తీరుతామన్నారు. పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ఆలయ పరిరక్షణ కోసమే అంటున్న సురేష్ నాయుడు -
సెల్ఫోన్ లాక్కొని పరారైన దొంగ
లింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామంలో సోమవారం సునీత తన కుమార్తె నైనికతో కలిసి పోస్టాఫీస్ వద్దకు వెళ్లి డబ్బులు కట్టి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి నైనిక చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని కొండలోకి పరారయ్యాడు. వెంటనే సునీత గట్టిగా అరవగా అక్కడ ఉన్న వాళ్లు సెల్ఫోన్ లాక్కొని పారిపోతున్న వ్యక్తిని వెంబడించగా కనబడకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా సెల్ఫోన్ దొంగ దొరకలేదు. దీంతో బాధితురాలు సునీత లింగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నలుగురిపై కుక్కల దాడికమలాపురం : కమలాపురం నగర పంచాయతీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి పొద్దుపోయాక పట్టణంలోని ఎస్బీఐ వెనుక వైపు ఉన్న కాలనీలో సుహానా అనే బాలికతో సహా నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలతో పాటు పిచ్చి కుక్క కూడా సంచరిస్తున్నట్లు పట్టణ వాసులు తెలిపారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు అంజద్, ప్రసాద్, రమేష్, నరసింహ ఫర్హాన్ తదితరులు కోరుతున్నారు. అల్లాడుపల్లె అర్చీ వద్ద రోడ్డు ప్రమాదంచాపాడు : మండల పరిధిలోని మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు, ఆల్విన్ లారీ ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం వద్ద జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని లక్ష్మీపేటకు భూమిరెడ్డి చంద్రఓబుళరెడ్డి అనే వ్యక్తి పిల్లలను తీసుకుని కారులో వెళుతుండగా క్రాస్ రోడ్డు వద్ద మైదుకూరు వైపు నుంచి వస్తున్న ఆల్విన్ లారీ ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతినింది. మద్యం షాపులో చోరీసిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ కృష్ణ మద్యం షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగిందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం షాపు యజమాని రామసుబ్బారెడ్డి తమ షాపులో రూ. 30 వేలు విలువచేసే మద్య బాటిళ్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 5వేలు నగదును అహపరించారని ఫిర్యాదు చేశారన్నారు. -
నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో నెల్లూరు, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. సోమవారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై 225 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 49.4 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. నిఖిలేశ్వర్ రెడ్డి 83, జి. మన్విత్ రెడ్డి 67, సోహన్ వర్మ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. కనీష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. పి. సాబ్జాన్బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 36.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలయింది. ఆ జట్టులోని పి. కనిష్ 60, పి. సాబ్జాన్ బాషా 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. ఎస్ అఖిల్ సాలుంకే 2, సయ్యద్ అతిక్ సల్మాన్ 2 వికెట్లు తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో.. కేఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కడప జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఏ. శివకేశవ రాయల్ 63, సి. విజయ్ రామిరెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మహమ్మద్ 4, పి. అచ్యుతానంద 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 262 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 49.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ 84, నికిత్ గౌడ్ 54 పరుగులు చేశారు. కడప జట్టులోని ఏ. నాగ కుళ్లాయప్ప 3, షేక్ ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు తీసుకున్నారు. -
అల్ల నేరేడుకు ఊజి దెబ్బ
● కాయలు పక్వానికి రాకుండానే కుళ్లిపోతున్న వైనం ● రైతులను వెంటాడుతున్న గుబులు ● సస్యరక్షణ పెట్టుబడులు కూడా రావంటున్న రైతులురాయచోటి : అల్ల నేరేడు శక్తినందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. అలాంటి అల్ల నేరేడుకు తెగుళ్లు రూపంలో ఊజి పురుగులు వెంటాడుతున్నాయి. నిగనిగలాడే నేరేడు పండును సంతృప్తిగా తిందామన్న వారికి పురుగుల రూపంలో భయపెడుతోంది. నేరేడు పండ్లపై ఈ పురుగులు దాడి చేస్తుండటంతో కాయలు పక్వానికి చేరి మాగకుండానే కుళ్లిపోతున్నాయి. ఫలితంగా సాగు, సర్యరక్షణకు పెట్టిన ఖర్చులు కూడా వస్తాయో లేదో అన్న భయం పట్టుకుంది. కొద్దికొద్దిగా దిగుబడి వచ్చినా ప్రస్తుతం నేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు రూ.250లు నుంచి రూ.300లు పైనే అమ్ముతుండటంతో నేరేడు తోటలను సాగు చేసిన రైతులు ఆనందపడుతున్న వేల ఊజీ పురుగుల దాడి వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. పండ్లతోటల సాగులో భాగంగా మామిడి, జామ, సపోటా తదితర పండ్ల మొక్కలతోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేరేడు పండ్లతోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలో కూడా అధికంగా సాగులో ఉన్న నేరేడు పండ్లను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఫలితమివ్వని మందుల పిచికారీ.. అల్లనేరేడుకు సోకుతున్న తెగుళ్లు, పురుగుల నివారణకు రకరకాల మందులు పిచికారి చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి మాగకుండానే మగ్గిపోతుండటాన్ని చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మామిడి పంటకు ధరలు లేక కుంగిపోతున్న రైతులు అల్లనేరేడు పంటపై ఊజీ పురుగుల దాడి చూసి వాటి సాగుకు, సంరక్షణకు పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలు లేవని మథనపడుతున్నారు. -
ఇరువురు చైన్ స్నాచర్ల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన కేసులో త్రీ టౌన్ పోలీసులు ఇరువురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చింతకొమ్మదిన్నె మండలంలోని మర్రి జాషువ, మైదుకూరుకు చెందిన మర్రి జయప్రకాష్లు అన్నదమ్ములు. వీరు జులాయిగా తిరుగుతుంటారు. ఈ క్రమంలో త్రీ టౌన్ పరిధిలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్కౌంటీ వద్ద ఇటీవల మహిళల మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ సుందరాచార్యుల వీధి మలుపు వద్ద ఉండగా సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు హనుమంతు, వెంకటరెడ్డి, సిబ్బంది దస్తగిరి, సుబ్రమణ్యం, కుమార్, హోంగార్డు జనార్దన్రెడ్డిలతో కలిసి వెళ్లి సోమవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 2.20 లక్షలు విలువైన రెండు బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండు నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
● ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు ఇలాగే ఇస్తారా?
విద్యుత్ స్తంభాలు, దిమ్మెల ఆనవాళ్లు లేకుండా క్రేన్తో ఊడబెరుకుతున్న దృశ్యాలు ఇంకా తొలగించని ట్రాన్స్ఫార్మర్ కడప కార్పొరేషన్: అధికార తెలుగుదేశం పార్టీ కడప నగరంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ముగిసింది. ప్రొటోకాల్ బాధ్యతలకే పరిమితం కావాల్సిన అధికారులు...ఆ పేరు చెప్పి సమస్త పనులు చక్కబెట్టారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని చిన్నస్థాయి అధికారుల వరకూ అన్ని శాఖల అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కాగా మా రూటే సపరేటు అన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఓ పది అడుగులు ముందుకేసి సంస్థ ఆదాయాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేశారని తెలుస్తోంది. మహానాడు ఏర్పాట్ల దశ నుంచే సుమారు 150కిపైగా విద్యుత్ స్తంభాలు నాటి, 11 కేవీ విద్యుత్ లైన్ ప్రత్యేకంగా లాగి, 50 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన మెటీరియల్ను భారీగా వినియోగించారు. అందులో మహానాడు వేదిక వెనుకవైపు 10 ట్రాన్స్ఫార్మర్లను ఏయే కార్యక్రమాలకు వినియోగించాలో రాసి మరీ ఏర్పాటు చేశారు. మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు కూడా ప్రత్యేకంగా లైన్లు లాగి పార్కింగ్ స్థలాల్లో, వేదిక చుట్టుపక్కల వెలుతురు కోసం ఉపయోగించారు. ట్రాన్స్ఫార్మర్లు కూర్చొబెట్టడానికి సిమెంటు కాంక్రీట్తో రెడీమేడ్గా తయారు చేసిన దిమ్మెలను ఏర్పాటు చేశారు. కరెంటు వినియోగాన్ని తెలుసుకునేందుకు కనీసం మీటర్లు కూడా అమర్చలేదు. ఇలా ఏర్పాట్ల నుంచి మహానాడు మూడు రోజులపాటు ఇష్టం వచ్చినట్లు విద్యుత్ను లెక్కా పక్కా లేకుండా లక్షల యూనిట్ల విద్యుత్ను యథేచ్ఛగా వాడేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సరఫరాలో చిన్న అంతరాయం కూడా కలగకుండా సుమారు 200 మంది విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి 24 గంటలపాటు డ్యూటీలు వేసి ఆయా ట్రాన్స్పార్మర్ల వద్ద నియమించినట్లు సమాచారం. 50 ట్రాన్స్ఫార్మర్లు, 150 స్తంభాలు అక్రమంగా వినియోగం మీటర్లు కూడా అమర్చకుండానే విద్యుత్ వాడకం ఆ భారమంతా ప్రజలపైనే 200 మంది ఉద్యోగులు, సిబ్బందికి 24 గంటలు డ్యూటీలు ఓ పార్టీ కార్యక్రమానికి ఇంతలా ప్రజాధనందుర్వినియోగంపై తీవ్ర విమర్శలు దీనిపై విద్యుత్శాఖ ఎస్ఈ రమణకు వివరణ కోరగా మహానాడు కార్యక్రమానికి మేం విద్యుత్ ఇవ్వలేదు. వాళ్లు జనరేటర్లు పెట్టుకున్నారు...విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా మాత్రమే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం...ఇందుకు వారు రూ.25వేలు డిపాజిట్ చెల్లించారని చెప్పారు. ఎస్ఈ ఇచ్చిన వివరణపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొక పార్టీయో, వ్యక్తులో ఇలా ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించుకుంటే విద్యుత్ అధికారులు ఇలాగే రూ.25వేలు కట్టించుకొని ఇలాగే ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తారా. ప్రత్యేకంగా లైన్లు లాగి కరెంటు ఇస్తారా...అప్పుడు కూడా మీటర్లు అమర్చకుండా విద్యుత్ను వాడేసుకోవచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా శుభకార్యానికి 12 గంటలు విద్యుత్ వాడితే యూనిట్కు రూ.19లు చొప్పున వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.15వేలు కంటే తక్కువ కట్టించుకోరు. ఇంత పెద్ద మహానాడు కార్యక్రమానికి సుమారు పది రోజులు కరెంటు వినియోగిస్తే కేవలం రూ.25వేలు మాత్రమే డిపాజిట్ కట్టించుకోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్ రెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్గా నిరంజన్ నియమితులయ్యారు. ఆయన చిత్తూరు జిల్లా డీటీసీగా పని చేస్తున్నారు. ఇక్కడ ఇన్చార్జ్ డీటీసీగా పని చేస్తున్న ప్రసాద్ వ్యక్తి గత పనులపై నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్రెడ్డిని నియమించారు. జైళ్ల శాఖ డీఐజీగా రవికిరణ్ కడప అర్బన్: కడప నగర శివార్లలో కేంద్ర కారాగారం పక్కనే వున్న జైళ్ల శాఖ రాయలసీమ డీఐజీగా ఎం.ఆర్ రవికిరణ్ను నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో అధికారికంగా రానున్నట్లు సమాచారం. ఈయన గతంలో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా విధులను నిర్వహించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర ప్రాంతంలో జైళ్లశాఖ డీఐజీగా పనిచేస్తున్నారు. ఖైదీలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీలకు మెరుగైన సదుపాయాలు అందించాలని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జైళ్ల శాఖ అధికారులతో కలిసి ఆయన కడప కేంద్రకారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందించే సదుపాయాలు వసతులపై ఆరా తీశారు. కేంద్రకారాగారం పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. రీమాండ్ ఖైదీ వివరాలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, జైలు అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి కడప అర్బన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్బాబు, డి.టి.సి డిఎస్పీ అబ్దుల్కరీం, మహిళా పీఎస్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం రూ. 1,08,353 సిద్దవటం: సిద్దవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. రూ. 1,08,353 వచ్చినట్లు ఆలయం ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 మార్చి 2025 నుంచి 2 జూన్ 2025 వరకు స్వామి వారి హుండీలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.కార్యక్రమంలో దేవదాయ శాఖ కొండ గంగమ్మ దేవస్థానం నందిమండల కార్యనిర్వహణాధికారి మారుతిప్రసాద్, సిద్దవటం పోలీసులు శివప్రసాద్రెడ్డి, ఆలయ సిబ్బంది చంద్రా, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, స్థానికులు వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు
సాయి అనిష్ ప్రతిభ సింహాద్రిపురం: జేఈఈ అడ్వా న్స్ పరీక్షా ఫలితాలలో పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంకు డాక్టర్ శివన్నారాయణరెడ్డి, డాక్టర్ మాధవి రెడ్డిల కుమారుడు సాయి అనిష్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సాయి అనిష్రెడ్డి తెలిపారు. ● సింహాద్రిపురానికి చెందిన నాగిరెడ్డి సుధాకర్రెడ్డి, నవీనాల కుమారుడు నాగిరెడ్డి లిఖిత్రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 512వ ర్యాంక్ సాధించారు.లిఖిత్రెడ్డి ప్రతిభ చూపడంపట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాణించిన మధుమన్మోహిత్ వల్లూరు(చెన్నూరు): జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో చెన్నూరు మండలంలోని కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 303 వ ర్యాంక్ సాధించాడు. మధు మన్మోహిత్ రెడ్డి తల్లి ప్రశాంతి పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తుండగా, తండ్రి మధు వేణు గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివిన మధు మన్మోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్టెక్టులో 80 మార్కులు, ఫిజిక్స్లో 87 మార్కులు, మ్యాథ్స్లో 82 మార్కులతో మొత్తం 249 మార్కులు సాధించాడు. దీంతో ఇతడు సీఆర్ఎల్ ర్యాంకు 303 సాఽధించాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యంగా తెలిపాడు. తమ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు మధు వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంతిలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా అతడు ఇంటర్లో 991 మార్కులు సాధించాడు. కృష్ణహర్షిత్కు 139వ ర్యాంకు సిద్దవటం: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సిద్దవటానికి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియాలో 139వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి మంచాల ఈశ్వరయ్య కడపలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి రాధిక గృహిణి తమ కుమారుడు కృషి, పట్టుదలతో జేఈఈలో మంచి ర్యాంకు సాధించినందుకు తల్లిదండ్రులు కుమారుడికి అభినందించారు. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత నైపుణ్యం పొంది, ఏ1లో ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని ర్యాంకర్ మంచాల కృష్ణ హర్షిత్ తెలిపారు. ఇటివల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కష్టపడి చదివారు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రి పురానికి చెందిన సాయి అనిష్ రెడ్డి, నాగిరెడ్డి లిఖిత్రెడ్డి, సిద్ధవటానికి చెందిన కృష్ణహర్షిత్, చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డిలు మంచి ర్యాంకులతో మెరిశారు. -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఇన్ఛార్జి డీఆర్వో శ్రీనివాసులు కడప సెవెన్రోడ్స్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ఇన్చార్జి డీఆర్వో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కార నివేదికను అందివ్వాలని ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, ఎస్డీసీ వెంకటపతి, జిల్లా రిజిస్ట్రార్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. -
బస్టాండా.. స్టాక్ పాయింటా.!
సాక్షి టాస్క్ఫోర్స్ : కమలాపురం నగర పంచాయితీ పరిధిలోని ఆర్టీసి బస్టాండులో సీసీ రోడ్డు నిర్మాణ సామగ్రి నిల్వ చేస్తున్నారు. కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నూతన హంగులతో ఆర్టీసీ బస్టాండు నిర్మించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, అప్పటి ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డిలు ప్రత్యేక చొరవ చూపి ప్రజల అభీష్టం మేరకు నూతనంగా ఆర్టీసీ బస్టాండును నిర్మించారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం కమలాపురం పట్టణంలోని పడమట వీధి, కోగటం రోడ్డు లకు సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు నిధులు విడుదల చేసింది. టెండర్లు పూర్తి చేసి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సీసీ రోడ్లకు అవసరమైన కంకర తదితర సామగ్రిని కాంట్రాక్టర్ ఆర్టీసి బస్టాండు ఆవరణంలోనే నిల్వ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల బరువు కంటే కంకర తరలించే టిప్పర్ల బరువు ఎక్కువ ఉండటంతో బస్టాండులో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. అలాగే బస్టాండులో దుమ్ము, ధూళి నిండుకుని ప్రయాణికులు కూర్చునే అవకాశం కూడా ఉండదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నిర్మించిన బస్టాండు ఛిద్రమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండులో సీసీ రోడ్డు నిర్మాణ సామగ్రి నిల్వ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
జూన్ 9న పీజీ సెట్ వాయిదా వేయాలి
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీలో పీఈటీ, పీజీ సెట్లో ఎంపీఈడీ రెండు పరీక్షలు జూన్ 9న జరుగుతున్న కారణంగా పీజీ సెట్ను వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోతారన్నారు. పీజీ సెట్ పరీక్షను జూలై నెలలో నిర్వహించాలని కోరారు. సూపర్ సిక్స్అమలు చేయకపోతే పోరాటం జమ్మలమడుగు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండల పరిధిలోని నాయకులతో ఈనెల 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతినెల రూ.1500 వారి ఖాతాలలో జమ చేసేవిధంగా ఆడబిడ్డ పథకం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతులకు 20వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకు వాటిని అమలు చేయలేదన్నారు. సూపర్ సిక్స్పై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మహానాడులో కూడా సూపర్ సిక్స్పై స్పష్టత ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలు వచ్చేందుకు ప్రధానం కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమే అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్, రైతుల సంక్షేమం పూర్తిగా విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిధర్రెడ్డి, శివగురివిరెడ్డి, మోహన్రెడ్డి, మహేశ్వరరెడ్డి, రామాంజనేయులు యాదవ్, కొట్టాలపల్లి నారాయణరెడ్డి, రమణారెడ్డి, సుధీర్, విశ్వనాథ్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం ది బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు 15వ ప్రజ్ఞా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంతరాలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమన్నారు. విద్యార్థులకు మంచి ఆలోచనా దృక్పథం అవరసరమన్నారు. వెనుకబాటు తనాన్ని అధిగమించాలంటే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి తొగర్ల చిరంజీవులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టమో గుర్తించి ఆ వైపుగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేయరాదన్నారు. ప్రస్తుత సమాజంలో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమని, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఏరోజుకారోజు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిభ గల బీసీ విద్యార్థులను చదవులో ప్రోత్సహించడానికి తాము 15 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్, జేఈఈ మెయిన్స్లో రాణించిన వివిధ కులాల బీసీ విద్యార్థులు 76 మందికి రూ.2.50 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు జీసీ పుల్లయ్య, కొత్తపల్లె శ్రీను, ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు, కార్యదర్శి భాస్కరరావు, కోశాధికారి సంటెయ్య పాల్గొన్నారు.కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ -
నరాలరామారెడ్డికి సతీ వియోగం
ప్రొద్దుటూరు క్రైం : ప్రముఖ శతావధాని నరాలరామారెడ్డి సతీమణి సరోజమ్మ (70) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె వీధిలో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నరాల రామారెడ్డి, సతీమణి సరోజమ్మలు వైఎంఆర్కాలనిలోని విహంగ–2 అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు ముగ్గురు విదేశాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సరోజమ్మ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి చిరంజీవులు కోరారు. ఆదివారం స్థానిక ఎస్కే గ్రాండ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులగణన జరపకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఏ నివేదికల ఆధారంగా అమలు చేస్తారో చెప్పాలన్నారు. 50 శాతం సీలింగ్ నిబంధనను అధిగమించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణన ఏడాదిలోపు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కులగణన పూర్తయితే బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం పైగానే విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణనతోనే సాధ్యమన్నారు. ఇందుకు బీసీ సంఘాల నాయకులు ఉద్యమాలకు నడుం బిగించాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు, ప్రతాప్ నాయుడు పాల్గొన్నారు. -
ఆరోగ్య యోగం.. ఆనంద భాగ్యం
కడప ఎడ్యుకేషన్ : యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, తద్వారా ఆనంద భాగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4,365 మందికి మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై యోగాసనాలు వేసి జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి ఒక్కో కుటుంబానికి చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మొదలైన మూడు కేటగిరీలకు చెందిన 4,365 మంది హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. ఇంటిల్లిపాదికీ మన దినచర్యలో యోగా ఒక భాగం కావాలని పేర్కొన్నారు. ‘యోగాంధ్ర క్యాంపెన్ –2025’ మాసోత్సవాలు మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప మునిసిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, స్టెప్ సీఈఓ సాయిగ్రేస్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి, డీఎమ్హెచ్ఓ నాగరాజు, డీఎస్డీఓ జగన్నాథరెడ్డి, ఆయుష్ నోడల్ అధికారి మురళి తదితర జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పలువురు ఉద్యోగులు, ఎన్జీవో ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ‘ఫ్యామిలీ యోగా‘కార్యక్రమానికి విశేష స్పందన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
కలలను సాకారం చేసుకోవాలి..
విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైనది. ప్రతి విద్యార్థి అనవసరమైన ఆలోచనలను దరిచేరనివ్వకుండా శ్రద్ధగా చదివితే సునాయాసంగా కలలను సాకారం చేసుకోగలరు. కాలేజీలో చేరామన్న మితిమీరిన స్వేచ్ఛ ఉండకూడదు. ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మా కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. అలాగే ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలను కూడా సాధిస్తున్నాము. – ఎస్వీ రమణరాజు, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట -
ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో ప్రారంభం రోజు అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నెల్లూరు జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.0 ఓవర్లలో 230 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కే. హెచ్. వీరారెడ్డి 47, పి. వికాస్ 42 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ 4, ఎస్ అఖిల్ సాలుంకే 3, ఎన్. మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 231 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 36.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని జి. మన్విత్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి సెంచరీ చేశారు. 77 బంతులను ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఎస్. ఆతిక్ సల్మాన్ 33 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని జి. మల్లికార్జున 2, ఎం. దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో.. కడప జట్టు విజయం వైయస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రారంభమైన మ్యాచ్లో కడప జట్టు 21 పరుగుల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 45.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎం. వాసుదేవరాజు 99, సి విజయ్ రామ్రెడ్డి 61 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. సాబ్జాన్ బాషా అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 45.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని టి.తౌఫిక్ హుస్సేన్ 41, మనోజ్ రాజు 66 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4 వికెట్లు తీసుకున్నాడు.తొలి రోజు మ్యాచ్లో నెల్లూరు, కడప జట్ల విజయం -
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు వేళాయె
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కీలకమైనస్థానాల కోసం ఉద్యోగుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొందరు ‘డిమాండ్’ ఉన్న ‘సీటు’ను పొందడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందు కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బది‘లీలలు’ జరగకుండా చర్యలు చేపట్టాలి. కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్స్ ప్రక్రియసై సందేహాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం జీఓ ఆర్టీ నంబరు 344, 399, ఈ–ఫైల్ నంబరు 2840767ను జారీ చేస్తూ, గైడ్లైన్స్ను విడుదల చేసింది. అనుకూలమైన స్ధానాల కోసం ఆరాటం.. కడపలోని వైద్య ఆరోగ్య శాఖ జోన్–4 కార్యాలయంతో పాటు ఈ శాఖ పరిధిలోకి వచ్చే రాయలసీమ జిల్లాల్లోని ఆరోగ్య శాఖల్లో పలు కీలకమైన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోటికి వెళ్లడానికి ఉద్యోగులు ఉబలాటపడుతున్నారు. ఉదాహరణకు కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో బదిలీల కారణంగా అక్కడ పనిచేసే సీనియర్ అసిస్టెంట్స్ మరొక చోటికి వెళ్లాల్సివుంది. ఆ సీటులోకి రావడానికి ఇప్పటికే పలువురు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అదే కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గోపాల్రెడ్డి మే 31వ తేదీన పరిపాలనా అధికారిగా పదోన్నతిపొంది, పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఈ స్థానంపై రాయలసీమ వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల కన్ను పడింది. ఇది చాలా ప్రధానమైన సీటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇందుకు కొందరి అండదండలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. పదోన్నతుల ద్వారా ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయాలి. అంతలోపే ట్రాన్స్ఫర్స్ రావడంతో వేరొక ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ బదిలీపై ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అసలు సంగతి ఏమిటంటే..‘పదోన్నతులు వస్తే ఎవరిని తేవాలి లేదా ఆ లోపు బదిలీలు గనుక జరిగితే ఎవరిని తీసుకురావాలి, లేదా మరే మార్గం ఏమైనా ఉందా..!’ అనే ఎత్తుగడల్లో ఉన్నట్లు సమాచారం. ట్రాన్స్ఫర్స్ కారణంగా వైద్య ఆరోగ్య శాఖల్లో ఉత్కంఠ..సందడి వాతావరణం నెలకొననుంది. ● 20 రోజుల పాటు.. గైడ్లైన్స్ను జారీ చేసిన పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ నెల 19 వరకు ప్రక్రియ 20 నుంచి నిషేధం కీలకమైన స్థానాల కోసం గట్టి పోటీ మే 31వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు 20 రోజుల పాటు బదిలీల ప్రక్రియ సాగుతుంది. 23వ తేదీన ఉద్యోగులు రిలీవ్ కావాలి. 20వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం ఉంటుంది. ఒకే స్ధానంలో ఐదేళ్లకు పైగా విధులను చేపడుతున్న ఉద్యోగులంతా ట్రాన్స్ఫర్ అవుతారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తదితర ప్రధాన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్ (జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరిండెంట్ తదితరులు) ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీసు నిండిన వారు బదిలీ అవుతారు. ఒకే చోట రెండేళ్లకు పైగా పనిచేస్తున్న వారు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లు, ఉద్యోగులైన భార్యాభర్తలు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం బదిలీలను చేపడుతారు. -
క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది. కడపలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ కేటగిరీల్లో 50 మంది క్యారమ్స్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అండర్ 9 ఇయర్స్ బాలురలో గోకుల్, మహేశ్వర్ జాయింట్ విన్నర్స్గా, రిషి రన్నర్గా నిలిచారు. అండర్ 11 బాయ్స్లో చరణ్సాయి విన్నర్గా, అడనాన్ రన్నర్గా, అండర్ 14 బాయ్స్లో కేఎల్ రంగనాథ్, చరణ్సాయి, బాలికల విభాగంలో షణ్ముఖప్రియ విన్నర్గా, ధరణి రన్నర్గా గెలుపొందారు. సీనియర్స్ మెన్ విభాగంలో నాగేంద్ర విన్నర్గా, మస్తాన్వల్లి రన్నర్గా నిలిచారు. ఎంపికై న వారు రాబోయే రోజుల్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా సీనియర్ క్యారమ్స్ క్రీడాకారుడు, ఏపీఎస్పీడీసీఎల్ రిటైర్డ్ ఏఈ నాగభూషణం క్రీడాకారులకు సర్టిఫికెట్, మెమెంటోలు అందజేశారు. ప్రతి ఆదివారం ఇండోర్, డీఎస్ఏలో క్యారమ్ ఆటపై ఉచిత కోచింగ్ ఇస్తామని టోర్నమెంట్ ఆర్గనైజయింగ్ సెక్రటరీ పోలంకి గణేష్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ రెఫరీ సురె క్రిష్ణయ్య, కోచ్లు నాగేంద్ర, సాగర్, ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. -
● గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో..
ప్రభుత్వ చౌకదుకాణం వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికి రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలను) సమకూర్చి సరుకులను ప్రజలకు అందిస్తూ వచ్చారు. బియ్యం బండి ఫలాన గ్రామం, వీధికి ఎప్పుడు వస్తుందో ముందుగానే వలంటీర్లు సమాచారం అందించేవారు. దీంతో రేషన్ కార్డుదారులు బియ్యం బండి వచ్చే సమయానికి అందుబాటులో ఉండి.. సరుకులు ఇంటి ముంగిటే తీసుకునేవారు. అందువల్ల ఎవరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. ఈ విధానం ఇతర రాష్ట్రాల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రజలు కూడా ఈ విధానానికి కొన్నేళ్లుగా అలవాటు పడ్డారు. ప్రజలకు జగన్మోహన్రెడ్డి చేసిన మంచి పనులను చెరిపి వేయాలన్న ఉద్దేశంతో.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. మళ్లీ ప్రభుత్వ చౌక దుకాణాల నుంచి రేషన్ పొందాల్సి రావడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. -
కష్టపడితేనే ఉద్యోగ సాధన సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహించే డీఎస్సీలో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించాలంటే మరింత కష్టపడాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కడప యూటీఎఫ్ భవన్లో నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులకు 40 రోజులపాటు నిర్వహించిన ఉచిత శిక్షణ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం కోసం, నవతరంలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు యూటీఎఫ్ ఈ ఉచిత కోచింగ్ నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు సి.వనజా రెడ్డి, ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీనివాసులు ఆచారి, అభయ్, అనిల్ కుమార్, నరసింహులు, ప్రకాష్, బాషా, గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం ఖాజీపేట : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుగ్గబోయిన భాస్కర్(34) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఖాజీపేట మండలం నాగపట్నం వెళ్లే దారి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గోపవరం మండలం వల్లెవారిపల్లి గ్రామానికి చెందిన దుగ్గన బోయిన భాస్కర్ (34) ఖాజీపేటలోని అగ్రహారంలో జరిగే జాతరకు వెళుతున్నానని శనివారం రాత్రి భార్య నాగేశ్వరికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున నాగపట్నం క్రాస్ వద్దకు రాగానే ఇతను నడుపుతున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. భాస్కర్ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వాహనాలు ఢీసంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల సమీపంలో ఆదివారం రాత్రి బొలేరో పికప్ వాహనం–కారు ఢీ కొన్నాయి. కడపకు చెందిన బ్యాంకు ఉద్యోగులు కారులో చిత్తూరు నుంచి కడపకు వెళుతుండగా ఎదురుగా కోళ్ల లోడుతో వస్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. -
ఏఐని దృష్టిలో ఉంచుకోవాలి..
ఇంతవరకు జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది ఒక ఎత్తు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో జరగబోయేది మరో పెద్ద ఎత్తు. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులు ఏఐని దృష్టిలో ఉంచుకొని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయో మేధావులు సైతం సరైన అంచనా వేయలేక పోతున్నారు. అందువల్ల ప్రతి విద్యార్థి తన మేధస్సును అనునిత్యం వేగవంతం చేసుకోగలిగితేనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరు. – కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట -
కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం
రాజంపేట టౌన్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులది కౌమార దశ. ఆ దశలో ఆలోచనలు, ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, హర్ట్ అయ్యే సందర్భాలు, పాఠాలు, కాలేజికి డుమ్మా కొట్టడాలు ఇలా అన్నీ కొత్తగా అనిపించేవే. ఒక్కమాటలో చెప్పాలంటే టెన్త్ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలకు ఇంటర్లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి విద్యార్థికి అదో తెలియని అనుభూతిలా వుంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్ని కూడా విద్యార్థులకు కొత్తగా, వింతగా అనిపిస్తాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. కనుక ఈ దశలో వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికి అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమీ తెలియని తనం ఆవహిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది... పరాజయం బాటలో నడుస్తుంది. తొలిసారి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాఽధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు కళాశాల దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్ విద్య. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్మీడియట్లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడితప్పి అంధఃపాతాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్లోనే బీజాలు పడతాయి. హైస్కూల్ విద్యతో ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ ఎంతో ప్రధానమైనది. చదువుపైనే దృష్టి సారించాలి.. ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. కనుక వారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు. అయితే మనసును అదుపులో వుంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అదుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేలా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి. స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం.. ప్రధానంగా ఇంటర్మీడియట్లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇంటర్లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తాయి. టెన్త్ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తారు. ఇంటర్ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని పిల్లలకు సున్నితంగా చెప్పి పిల్లలను తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టకుండా చెడ్డవారి స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, చెడ్డవారితో స్నేహం ఉజ్వలంగా ఉండాల్సిన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు గాడితప్పితే జీవితమే గందరగోళం క్రమశిక్షణను అలవరుచుకుంటే ఉజ్వల భవిష్యత్తు -
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి..
టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్లో చేరగానే విద్యార్థులు ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తారు. ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటేనే ఉన్నత చదువుల్లో నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటర్లో కూడా పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే విద్యార్థులు సరైన మార్గంలో పయనించి చదువులో రాణించగలరు. – మునగాల కృష్ణకుమార్, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ, రాజంపేట -
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. -
ప్రజల్లోకి ప్రజా వ్యతిరేక విధానాలు
వేంపల్లె : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జగనన్న మిషన్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లెలోని మధురెడ్డి కల్యాణ మండపంలో జగనన్న మిషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలను ఎండగట్టే సమయం దగ్గర పడిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగనన్న ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ తగ్గలేదన్నారు. అధికారం లేనప్పుడు చంద్రబాబు సమావేశం పెడితే జనాలు రాని పరిస్థితి ఉండేదని, అ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. జగనన్న ఒక్కసారి ప్రజల్లోకి అడుగు పెడితే చంద్రబాబు గాలికి కొట్టుకొనిపోతాడన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 లాంటి మీడియా, పత్రికలు భజన చేస్తున్నాయన్నారు. జగనన్న మిషన్ సోషల్ మీడియా ప్రతినిధులెవరూ కూడా కేసులకు భయపడవద్దని, వైఎస్సార్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని తెలిపారు. పులివెందులలో సైతం రాజశేఖరరెడ్డి విగ్రహానికి జెండాలు కట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి మాట్లాడుతూ గతంలో 60లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని, ఇప్పుడు సూపర్ సిక్స్ పథకమైన గ్యాస్ సబ్సిడీ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆచూకీ కనపడలేదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరి, కో ఆప్షన్ మెంబర్ పత్తి రాజేశ్వరి, ఆలూరు మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ శశికళ, జగనన్న మిషన్ ఫౌండర్ చిన్న సైదులు, జగనన్న మిషన్ డైరెక్టర్ రాఘవ రెడ్డి, విష్ణు, ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, ఈశ్వరరెడ్డి, తుషార్ నాగిరెడ్డి, రోహన్ నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు, జగనన్న సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి -
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
– ఇద్దరికి తీవ్ర గాయాలు పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక ముద్దనూరు కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ఉన్న హుస్సేన్ పీరా, హరిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దనూరు రోడ్డులోని జయమ్మ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంలో హుస్సేన్ పీరా, హరిలు వస్తుండగా.. ఆర్టీసీ బస్టాండులోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు సిఫార్సు చేశారు. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కమలాపురం రైలు మార్గంలోని గంగాయపల్లె యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి (50) శనివారం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తు పట్టిన వారు 94409 00811 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. రిమ్స్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శనివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడిని (70) తీసుకుని వచ్చారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు సూచించారు. అదుపు తప్పి వాహనం బోల్తా – ఒకరి మృతి సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్ద శనివారం బొలేరో పికప్ లగేజీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జింకా చంద్ర(44) అనే వ్యక్తి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. డప ఉక్కాయపల్లె వైఎస్ఆర్ కాలనీకి చెందిన జింకా చంద్ర కూలి పనిచేసుకొని జీవించేవాడు. ఇతనికి బద్వేలులోని శ్రీకృష్ణ దేవరాయ నగర్లో 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారని, స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటుకు శనివారం కడప నుంచి సిమెంటు ప్లేట్లు, స్తంభాలు తీసుకొని కూలీలతో బొలెరో పికప్ లగేజి వాహనంలో బద్వేల్లుకు బయలుదేరాడు. వాహనం సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్దకు రాగానే ఎదురుగా ఎద్దు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకా చంద్రకు, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు అబ్దుల్బార్, ఆర్బాజ్, అఫ్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అయితే జింకా చంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భక్తుల మనోభావాలను గుర్తించాలి
అట్లూరు : అవధూత కాశిరెడ్డి నాయన భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశినాయన మండల పరిధిలోని జ్యోతి క్షేత్రం ఆవరణంలో భక్తుల అవసరాల నిమిత్తం ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ అధికారులు కూల్చి వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాశిరెడ్డి నాయన భక్తుల ఆందోళన ఫలితంగా తొలగించిన నిర్మాణాలను యధాతథంగా నిర్మించడంతో పాటు ఆగిన బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీ అమలు కాకపోవడంతో శాసన మండలి సమావేశంలో ప్రస్తావించినా సరైన సమాధానం లేదన్నారు. అలాగే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిసి భక్తుల మనోభవాలను దృష్టిలో ఉంచుకుని కూల్చిన నిర్మాణాలను నిర్మించుకునేందుకు అలాగే అక్కడ అవసరమైన మేర స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేయాలని కోరామన్నారు. త్వరితగతిన జ్యోతి క్షేత్రానికి అనుమతులు రాని ఎడల ఎంపీలతో కలసి పార్లమెంటు దృష్టికి తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు రాజీవ్బాషా, కాశినాయన మండల నాయకులు రమణారెడ్డి, జగన్మోహన్రెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దళిత మహిళలపై దాడులను అరికట్టాలి
ప్రొద్దుటూరు : దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టాలని రాష్ట్ర మాలమహానాడు కమిటీ జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్ తెలిపారు. శనివారం స్థానిక పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర మాలమహానాడు నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అధికారుల వేధింపులు, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రతి నెల ఆర్డీఓ సమక్షంలో దళిత వాడల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా స్పందన కార్యక్రమంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా జిల్లాకు ఒక అధికారిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్, గౌరవాధ్యక్షుడు సుద్దపల్లి మురళీప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గున్నంపాటి వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెల్లికట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని శాంతినగర్ బ్రిడ్జిపై శనివారం రాత్రి కడప వైపు నుంచి వస్తున్న లారీని తిరుపతికి వెళ్తున్న మ్యాక్స్ వాహనం ఢీ కొనడంతో డ్రైవర్ షీర్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. -
మీ సేవలు చిరస్మరణీయం
కడప అర్బన్ : సుదీర్ఘ కాలంపాటు పోలీస్ శాఖకు విశేష సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మే నెలాఖరున పదవీ విరమణ పొందిన వి.మోహన్ రావు ఏ.ఎస్.ఐ (ఒంటిమిట్ట పి.ఎస్), పి.భాస్కర్ ఏ.ఎస్.ఐ (జమ్మలమడుగు పి.ఎస్), ఈ.రామన్న ఏ.ఆర్.హెచ్.సి 484, (డీ.ఏ.ఆర్, కడప), బి.నారాయణ హెచ్.సి 1956 (కడప టూ టౌన్ పి.ఎస్) లను జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం సేవ చేస్తూ పదవీ విరమణ పొందడం అదృష్టమన్నారు. విధి నిర్వహణలో అందించిన సేవలే ఉద్యోగానంతరం కూడా గుర్తుండిపోయేలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయన్నారు. విధి నిర్వహణలో అప్పటి కఠిన పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం సాధారణ విషయం కాదని, నిబద్ధత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని జిల్లా ఎస్.పి భరోసా ఇచ్చారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, ఎ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్.ఐ ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, టైటస్, డి.పి.ఓ ఏ.ఓ జ్యోతి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
3 కేజీల గంజాయి స్వాధీనం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప పాత బస్టాండులోని రవీంద్రనగర్ బ్రిడ్జి వద్ద గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పదాడి నిర్వహించామన్నారు. పఠాన్ బిలాల్ అహ్మద్, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్, సయ్యద్ మహమ్మద్ ఉమర్, షేక్ మహ్మద్ రఫీ అనే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మూడు కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరిపై ఒడిస్సా రాష్ట్రం, కడప వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న పఠాన్ బిలాల్ అహ్మద్ భవన నిర్మాణ కూలీగా, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ అర్షద్ టీ హోటల్లో మాస్టర్గా, సయ్యద్ మహ్మద్ ఉమర్ ఏసీ మెకానిక్గా, షేక్ మహ్మద్ రఫీ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్ఐలు టి. మహేంద్ర, నరసింహారావు, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురి అరెస్టు -
చేతులెత్తేసిన కూటమి సర్కార్
జమ్మలమడుగు : రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారాజ్యంగా హామీ ఇచ్చాయి. అందులో సూపర్ సిక్స్ పేరుతో పెట్టిన పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చుతామని అసత్య ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది.. అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎ స్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలకు పథకాలు అందించారన్నారు. గతంలో బటన్ నొక్కే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేశారని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీలు కలిసి ప్రజలకు ఆడబిడ్డ పథకం, నిరుద్యోగభృతి, రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఒక్కపైసా కూడా జమ చేయలేదన్నారు. సూపర్ సిక్స్తోపాటు 143 హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వాటిని అమలు చేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈనెల 4వతేదీ వెన్నుపోటు దినంగా చేపట్టబోయే కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
లోతైన దుక్కులతో ఎంతో మేలు
కడప అగ్రికల్చర్ : రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, రైతులందరూ లోతైన దుక్కులు చేసుకోవాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగు చేసే పంటలకు సంబంధించి విత్తన ఎంపిక ఎంతో ముఖ్యమన్నారు. పంటల సాగుకు ముందు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. భారత నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మంగేష్ దుబే మాట్లాడుతూ ఖరీఫ్ పంటల సాగుకు ముందు రైతులు అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడితో నేల సమతుల్యతను కాపాడే విధంగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వ్యాధులు, టీకాలు, అలాగే గొర్రెలు, మేకల పెంపకంలో జాగ్రత్తల గురించి వివరించారు. ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి జ్యోతిర్మయి ఉద్యాన రంగంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కే.సాయి మహేశ్వరి, డాక్టర్ సురేష్ కుమార్రెడ్డి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి శైలజ, మండల వ్యవసాయ అధికారి ఈశ్వర్ రెడ్డి, సిబ్బంది తరుణ్, చంద్రారెడ్డి, ఆత్మ ఏటీఎం రైతులు పాల్గొన్నారు. -
విద్యాశాస్త్రంపై అవగాహనతోనే విజయాలు
కడప కల్చరల్ : విద్యా శాస్త్రంపై అవగాహనతోనే మానవాళికి విజయాలు దక్కగలవని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రవీంద్ర అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న వేసవి వినోదం శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల భవిష్యత్తు సమాజ అవసరాలతో ముడిపడి ఉందన్నారు. సాంకేతిక, సాంస్కృతిక అవసరాల రీత్యా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిచారు. జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల బయన్న మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పరిశీలనాత్మక శక్తులను పెంచడంలో తోడ్పడగలవన్నారు. విజ్ఞానాన్ని సరదాగా ఎలా నేర్చుకోవచ్చో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజాద్ అలీ తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు పలు శాసీ్త్రయ ప్రయోగాలు, చిత్రలేఖనం, పాటలు, మ్యాజిక్, ఓరిగామి తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బమ్మ , రిసోర్స్ పర్సన్స్ ప్రసాద్ రెడ్డి, శిరీష, రంగనాయకులు, కామేశ్వరమ్మ, గఫూర్, సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులకు అందిస్తున్న విద్యాప్రమాణాలను గుర్తించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తమ కళాశాలకు అటానమస్ హోదా కల్పించిందని గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ నాగూర్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 29 నుంచి ఐదేళ్లపాటు అటానమస్ హోదా తమ కళాశాలకు ఉంటుందన్నారు. గత 16 ఏళ్లుగా తమ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థినులకు ఉద్యోగాలు రావడానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం వల్ల విద్యార్థులకు స్కాలర్షిప్లు, రీసెర్చ్ ఓరియెంటెడ్ కార్యక్రమాలకు దోహపడుతుందన్నారు. క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. కళాశాలకు అటానమస్ హోదా రావడానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామసుబ్బమ్మ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థినులకు అందుతున్న నాణ్యమైన బోధన వల్ల 2023లో న్యాక్ బీ ప్లస్ లభించిందని తెలిపారు. ఈ ఏడాది అటానమస్ హోదా లభించిందన్నారు. మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేయిస్తామని తెలిపారు. -
●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...
రైతులు పంటలసాగు కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం (వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తాన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ. 6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 7500 మొత్తం కలిపి ఏడాదికి రూ. 13500 రైతు ఖాతాలకు జమ చేసేది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు ఖాతాలకు జమచేసేది. ఇందులో ఖరీఫ్ ఆరంభంలో, రెండవది కోతల సమయంలో, మూడవది ధాన్యం ఇంటికి చేరే వేళ ఇలా రైతుల ఖాతాలకు జమ చేసేవారు. ఇలా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసా కింద ఐదేళ్లపాటు రూ. 1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్రవాట కింద రూ. 14 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ నయాపైగా విదల్చకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప అగ్రికల్చర్: రైతులంటే కూటమి ప్రభుత్వానికి ఎప్పిటికీ చిన్నచూపే. అది నిజమని మరోసారి నిపూపణ అయింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధి కారింలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అన్నదా తలకు పెట్టుబడి సాయానికి ఒక్క రూపాయి విదల్చ లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందచేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అన్నదాతలకు నయాపైసా విదల్చలేదు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్, రబీ రెండు సీజన్లు ముగిశాయి. రెండు సీజన్లకు ఒక్క రూపాయి కూడా విడదల కాకపోవడంతో పంటల పెట్టుబడికి అన్నదాతలు అప్పు తెచ్చుకుని పంటలను సాగు చేసుకున్నారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ కూడా మరో రెండు రోజుల్లో ఆరంభంకానుంది. ఈ ఏడాది ఖరీఫ్కు ముందే రుతుపవనాలు రావడంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కూడా ఆరంభమయ్యాయి. ఇక రైతులు కూడా కాడి సిద్ధం చేసుకుని పంటల సాగుకు సన్నద్ధమౌతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఈ సారి కూడా పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్న దాత సుఖీభవ నిధులను సకాలంలో విడుదల చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో... వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పంటల సాగుకోసం క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించింది. ప్రతి ఏటా ఖరీఫ్ ఆరంభం లోనే పెట్టుబడి సాయాన్ని అందించి పంటల సాగుకు చేయూత నిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వంలో పంటల సాగుకు అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దీనికితోడు గత ఖరీఫ్, రబీ సీజన్లలో అకాల వర్షాలు, తుఫాలతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. వారిని కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. దీనికితోడు అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. దీంతో అటు అన్నదాత సుఖీభవ రాక ఇటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక అన్ని రకాలుగా అన్నదాతలు నష్టపోయారు. ఠంచన్గా కేంద్ర ప్రభుత్వ సాయం... పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఠంచన్గా సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు విడతల్లో 6 వేలు సాయం అందచేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జూన్ నెలలో రూ. 2 వేలు, అక్టోబర్లో 2 వేలతోపాటు మార్చి నెలలో మూడవ విడతను విడుదల చేసింది. అయితే ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా రూ. 20 వేలు చొప్పన సాయం అందిస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు వివరాలు...సంవత్సరం రైతుల విడుదలైన నిధులు సంఖ్య (రూ. కోట్లలో) వైఎస్సార్ కడప జిల్లాలో... మేనిఫెస్టోలో ... కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెప్టో సూపర్సిక్స్లో భాగంగా ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఆర్థికసాయం రైతు ఖాతాలకు జయచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే పట్టనట్లు వ్యవహరించడంతో అన్నదాతల్లో ఆందోళన చెందారు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా రైతులకు ఒక్క రూపాయి సాయంగా అందించలేదు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు సర్కారు మరోసారి అదే తీరున వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు దాసరి గంగయ్య. మాది పొద్దుటూరు మండలం కానపల్లె గ్రామం. నాకు మూడు ఎకరాలు పొలం ఉంది. గతేడాది వరిపంటను సాగు చేశాను. పంటలసాగు సమయంలో పెట్టుబడి సాయం అందలేదు. దీంతో అప్పు చేసి పంటను సాగు చేశాను. తరువాత కూడా పెట్టుబడి సాయం అందలేదు. మళ్లీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా ఆరంభం అవుతుంది. ఈ ఏడాదైనా పంటలసాగుకు అన్నదాత సుఖీభవ నిధులను ప్రభుత్వం విడుదల చేసి ఆదుకోవాలి. ఏడాదైనా నయా పైసా విదల్చని సర్కార్ గత ఖరీఫ్, రబీలకు సంబంధించి దాదాపు రూ. 250 కోట్ల ఎగవేత అన్నదాత ఆశలను అడియాసలు చేసిన బాబు ప్రభుత్వం జిల్లాలో ఈ ఏడాది 1,28,084 హెక్టార్లలో ఖరీఫ్ పంటల సాగు ఎప్పటికప్పుడు రైతు భరోసాతో ఆదుకున్న గత ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికిరైతన్నల ఎదురుచూపు వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల పరిధిలో దాదాపు రెండు లక్షలకు పైగా రైతులు ఉన్నారు. రెండు లక్షల హెక్టార్లకుపైగా సాగు భూమి కూడా ఉంది. అయితే రైతులు పంటల సాగులో విత్తనాలు, ఎరువులు, కూలీలతోపాటు పలు పనులకు నగదు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో పెట్టుబడి కోసం కొంత మంది రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడంతోపాటు ఇళ్లలోని బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సూపర్సిక్స్లో చెప్పినట్టుగా సాయం విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 2019–20 2,06,708 279.93 2020–21 2,08,747 280.06 2021–22 1,99,344 269.11 2022–23 2,02,598 235.68 2023–24 2,10,481 126.25 -
అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతాం
జమ్మలమడుగు రూరల్: ఆదర్శ గ్రామం అయిన ఎస్. ఉప్పలపాడు గ్రామాన్ని అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శనివారం జమ్మలమడుగు మండల పరిధిలోని ఎస్. ఉప్పలపాడు గ్రామంలో ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ తో కలసి గ్రామంలోని పలు కాలనీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానం ప్రవేశపెట్టిందని.. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదరికాన్ని తొలగించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. సమాజంలో ఉన్న పేదవారి అభ్యున్నతికి ధనికులు తోడ్పడాలన్నారు. గ్రామంలోని యువతీ యువకులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, మయాలూరు రామ మనోహర్రెడ్డిలు గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని గ్రామంలోని ప్రజలకు మౌళిక వసతులు కల్పించారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలకు ప్రహరీ ఏర్పాటుచేయాలని, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజలు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీబీహెచ్ఎల్సీ మాజీ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ పి. శ్రీనివాసులురెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, సర్పంచ్ అక్కల దేవి, ఎంపీడీఓ సయ్యద్ ఉన్నీసా పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ -
‘వెన్నుపోటు దినం’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలు ఆవిష్కరించారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2025 జూన్ 4 నాటికి ఏడాది పూర్తవుతుందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 ఇతర హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అన్ని లెక్కలు చూసుకున్నాము, సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారన్నారు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వీరు నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూల్యాంకనం చేసేందుకు కూడా చేతకాలేదు మూల్యాంకనం సక్రమంగా చేసి పదో తరగతి పేపర్లు దిద్దేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. పదవ తరగతిలో రీ వెరిఫికేషన్కు 66వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 11500 మంది పాస్ అయ్యారన్నారు. ఆలోపే ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి గడువు దాటిపోయిందని, విద్యార్థుల ఆందోళనతో గడువు పెంచారన్నారు. ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 90కిపైగా మార్కులు వచ్చాయని, సోషల్లో మాత్రమే 22 మార్కులు వచ్చాయన్నారు. అడిషనల్ పేపర్లు కౌంట్ చేయకపోవడం వల్లే ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినట్లు రీవెరిఫికేషన్లో తేలిందన్నారు. ఇంత బాధ్యతారహితంగా పేపర్లు దిద్ది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దరఖాస్తు చేసిన వారి పేపర్లలోనే ఇన్ని తప్పులు ఉంటే దరఖాస్తు చేయని వారు చాలామందే ఉన్నారన్నారు. ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక క్షోభ ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ సంబంధిత రైల్వే మంత్రి రాజీనామా చేశారని, మూల్యాంకనంలో తప్పులు దొర్లినందుకు టీచర్లను సస్పెండ్చేస్తే సరిపోదని, విద్యాశాఖామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించి గత ఏడాది ఇచ్చిన ఒక్క సిలిండర్ డబ్బులు కూడా చాలామంది ఖాతాల్లో వేయలేదన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలు ఊడగొట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్కుమార్, యానాదయ్య, ఎస్. వెంకటేశ్వర్లు, శంకర్రెడ్డి, సీహెచ్ వినోద్, బంగారు నాగయ్య, దాసరి శివప్రసాద్, షఫీ, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, సునీత తదితరులు పాల్గొన్నారు. 4వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నాయకుల పిలుపు -
నేటి నుండి చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ
కడప సెవెన్రోడ్స్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జూన్ 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీని రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేయనున్నట్లు జేసీ అదితిసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం డీలర్ల ద్వారా ఆదివారాలు, సెలవు దినాలతోసహా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. నిత్యావసర సరుకులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తామన్నారు. పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉన్నందున, కార్డుదారులు తమకు సమీపంలోని ఏ రేషన్ షాప్ నుండైనా సరుకులు పొందవచ్చని, ఈ సౌకర్యాన్ని రైస్ కార్డుదారులందరూ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు లేదా అంగ వైకల్యం ఉన్నవారు లేదా అనారోగ్యంతో మంచం మీద ఉన్న కార్డుదారుల ఇంటి వద్దకే.. డీలరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల్లోగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తారని జేసీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఈఈలుగా అదనపు బాధ్యతలు కడప సెవెన్రోడ్స్: జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు ఈఈలు శనివారం ఉద్యోగ విరమణ చేయడంతో వారి స్థానాల్లో ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జీవీ శ్రీనివాసులురెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు పీఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఎం.శ్యామసుందర్రాజు రిటైర్డ్ అయ్యారు. రాజంపేట పీఆర్ఐ డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఎం.రామచంద్రనాయక్కు జమ్మలమడుగు ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎఫ్ఏసీగా వ్యవహరిస్తారు. ఇప్పటిదాక జమ్మలమడుగు పీఆర్ఐ డివిజన్ ఈఈగా ఉన్న శ్యామసుందర్రాజు పులివెందుల పీఆర్ఐ డివిజన్ ఈఈ ఎఫ్ఏసీగా ఉండేవారు. ఆయన రిటైర్డ్ కావడంతో రాయలసీమ పీఆర్ఐ డివిజన్ ఈఈ ఎం.దయాకర్రెడ్డిని పులివెందుల ఈఈ ఎఫ్ఏసీగా నియమించారు. -
వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా ఆచార్య శ్రీనివాస్
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ వైస్–ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పత్రాలను ఆచార్య శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ.. శ్రీనివాస్కు అందజేశారు. ప్రిన్సిపల్ పోస్టుతోపాటూ కడపలోని వై.వి.యు. హాస్టళ్ల (బాలురు, బాలికలు) చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ప్రిన్సిపల్ , వసతిగృహాల చీఫ్ వార్డెన్గా పనిచేసిన ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ఆ బాధ్యతల నుంచి ఆయన రిలీవ్ అయ్యారు. 2న డీఈఈ సెట్ పరీక్ష కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈ సెట్–2025 (కంప్యూటర్ బేస్డ్ టెస్టు)పరీక్ష జూన్ 2వ తేదీ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత పరీక్ష మూడు సెంటర్లలో నిర్వహించనున్నామని తెలిపారు. డీఈఈ సెట్–25 అభ్యర్థులు హాల్ టికెట్లను https://apdeecet. apcfss.in/ వెబ్సైట్లో డౌన్లోన్ చేసుకోవచ్చని తెలిపారు. నామినల్ రోల్స్లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి ఏవైనా సవరణలు ఉంటే పరీక్షా కేంద్రంలో సరిదిద్దుకోవచ్చన్నారు. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు) తమ వెంట పరీక్ష హాల్కు తీసుకొని రావాలని తెలిపారు. అభ్యర్థులు వారికి సంబంధిత పరీక్ష తేదీ , సెంటర్ను సరిచూసుకుని నిర్ణీత సమయంకంటే అరగంట ముందే పరీక్ష సెంటర్కు హాజరుకావాలని డీఈఓ తెలిపారు. నేడు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ‘ఫ్యామిలీ యోగా’ కడప సెవెన్రోడ్స్: కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం మైదానంలో ఆదివారం నిర్వహించే ‘ఫ్యామిలీ యోగా‘ కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వారు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర– 2025‘ మాసోత్సవాల్లో భాగంగా.. ప్రత్యేకించి ఈ ఆదివారం (జూన్ 1వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, అవ్వతాతలు మొదలైన మూడు కేటగిరీలకు చెందిన కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 21 వరకు జరిగే ఈ యోగా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, అంతర్జాతీయ యోగా వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ యోగా ఆవశ్యకతను తెలుసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు. మార్కెట్లకు వరదలా టమాట బి.కొత్తకోట: ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని వ్యవసాయ మార్కెట్యార్డులకు టమాట వరదలా వచ్చి పడుతున్నాయి. ధరల్లో పెరుగుదల లేనప్పటికి పంట దిగుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో శనివారం ఒకరోజే 5,480 టన్నులు విక్రయానికి వచ్చాయి. మదనపల్లె మార్కెట్కు 1,750 టన్నులు, వి.కోట మార్కెట్కు 132, పలమనేరు మార్కెట్కు 460, పుంగనూరు మార్కెట్కు 1,568, ములకలచెరువు మార్కెట్కు 1,580, బి.కొత్తకోట మార్కెట్కు 25 , అంగళ్లు మార్కెట్కు 40 టన్నులు వచ్చాయి. కాగా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కిలో టమాట రూ.6.20 పైసలు, వి.కోటలో కిలో రూ.7, పలమనేరులో కిలో రూ.7.50 పైసలు, పుంగనూరులో కిలో రూ.6.70పైసలు, ములకలచెరువులో కిలో రూ.8.50 పైసలు పలికింది. -
లోకేష్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్కుమార్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్కుమార్ రెడ్డి మండిపడ్డారు.‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని సతీష్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. -
మోక్షితకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదెవరు?
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పరిధిలోని జెడ్పీహెచ్ఎస్లో గంగిరెడ్డి మోక్షిత తొలుత పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయింది. విచిత్రంగా.. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిష్లో సోషల్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చిన ఈమెకు సోషల్ స్టడీస్లో మాత్రం 21 మార్కులే వచ్చాయి. పరీక్ష తప్పినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. కానీ, తన ప్రతిభపై గట్టి నమ్మకం ఉన్న మోక్షిత తండ్రి సాయంతో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసింది. ఈసారి 84 మార్కులు వచ్చాయి. అప్పుడు ఎస్ఎస్సీ బోర్డు మొత్తం 537 మార్కులతో మోక్షిత పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. కానీ, నిజం కాని ఫెయిల్కు–నిజమైన పాస్కు మధ్యలో ట్రిపుల్ ఐటీ, రెసిడెన్షియల్, గురుకులాల్లో ప్రవేశ దరఖాస్తులకు అవకాశం కోల్పోయింది మోక్షిత.ఈ దోషం ఎవరిది..??‘‘అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో 540 మార్కులు వచ్చాయి. ఫస్ట్ లాంగ్వేజ్ 96, ఇంగ్లిష్లో 87, గణితంలో 93, సైన్స్లో 95, సోషల్లో 96 స్కోర్ చేసింది. కానీ, హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో సందేహం వచ్చి రూ.వెయ్యి చెల్లించి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంది. ఒక్క మార్కు కూడా పెరగలేదు. విద్యార్థికి పీడీఎఫ్ రూపంలో అందించిన జవాబు పత్రాన్ని చూస్తే.. నాలుగు మార్కుల ప్రశ్నల్లో నాలుగింటికి ‘సున్నా’ వేశారు. ‘సాక్షి’.. ఈ మూల్యాంకన పత్రాన్ని ఉపాధ్యాయ వృత్తిలో అనుభవజ్ఞులైనవారికి చూపించగా జవాబుల్లో స్వల్ప అక్షర దోషాలు తప్ప మరే సమస్య లేదని, కచ్చితంగా ఒక్కో ప్రశ్నకు మూడు, నాలుగు మార్కులు వస్తాయని చెప్పారు. అంటే, ఆ విద్యార్థిని 12 నుంచి 16 మార్కులు కోల్పోయినట్లేగా?34 నుంచి ఏకంగా 93కు..శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బాలిక ఆర్.సాయికుందనకు పదో తరగతి ఫలితాల్లో 489 మార్కులు వచ్చినా ఫెయిల్ అయ్యింది. ఫస్ట్ లాంగ్వేజ్ 94, హిందీ 79, గణితం 96, సైన్స్ 92, సోషల్ 94 మార్కులు రాగా.. ఇంగ్లిష్లో మాత్రం 34 వచ్చాయి. ఫీజు కట్టి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయంగా ఇంగ్గిష్లో 34 మార్కులు కాస్తా 93కు పెరిగాయి. అంటే, ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం కనిపించింది. -
కడప ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఇ.జి.అశోక్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారు? ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం బేఖాతర్ 2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్కు ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు. వైఎస్సార్సీపీకి మద్దతుదారు కావడంతోనే.. దీంతో రామలింగారెడ్డి జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, వారంతా వైఎస్సార్సీపీ మద్దతుదారులని తెలిపారు. పిటిషనర్ వ్యాపారాలు చేస్తుంటారని పేర్కొన్నారు. రాజకీయ, వ్యాపార కారణాల వల్ల శత్రువులు పెరగడంతో ఆయనకు ప్రాణహాని ఉందని, భద్రత కోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని వివరించారు. చివరకు ప్రభుత్వం 2020లో పిటిషనర్కు 1+1 భద్రతను కల్పించిందని, ఇదిలా ఉంటే 2024 జూలైలో ప్రభుత్వం అకస్మాత్తుగా పిటిషనర్ భద్రతను ఉపసంహరించిందని పేర్కొన్నారు. హైకోర్టు పిటిషనర్ భద్రత పునరుద్ధరణకు ఆదేశాలిచ్చిందని, ఈ ఆదేశాలను ఎస్పీ ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టారని వివరించారు. దీంతో న్యాయమూర్తి.. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేశారు. -
నూతన వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి
కడప అగ్రికల్చర్ : జిల్లాలో అనుకూలమైన కొత్త రకాల పంటలను ఎంపిక చేసుకుని నూతన వ్యవసాయ పద్ధతులు పాటింటి అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు సూచించారు. ఊటకూరు కృషి విజ్ఞానకేంద్ర వారు శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కడప మండలం నానపల్లిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ద్వారా వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలను ౖరైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీంతోపాటు పచ్చి రొట్టె పైర్లు, జిప్సం మరియు జీవన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు పాంటించి లాభదాయకమైన దిగుబడి వైపు సాగాలి అని తెలియజేశారు. భారత నూనె గింజన పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మంగేష్ దుబే మాట్లాడుతూ ఖరీప్ పంటలు సాగు చేసే రైతులు శాస్త్రవేత్తల అధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులను సాధించాలని సూచించారు. ఊటకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ పంటలసాగులో కీలకం విత్తన ఎంపికేనన్నారు. విత్తన ఎంపికతోపాటు విత్తనశుద్ది, దుక్కులు, ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబాషిణి మాట్లాడుతూ సాధారణంగా సాగు చేసే ఉల్లి నుంచి వినూత్నమైన పంటలైన డ్రాగన్, అంజూరతోపాటు ఇతర పూల పంటల సాగును అలవర్చుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తున్న సూక్ష్మ నీటి పథకం, పాలిహౌస్ పథకాన్ని గురించి వివరించారు. పొద్దుటూరు పశు వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వ్యాధులు, టీకాల గురించి వివరించారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్ సాయి మహేశ్వరి, డాక్టర్ సురేష్ కుమార్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్రెడ్డి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి నాగభూషణ్రెడ్డి, మండలం ఉద్యాన అధికారి సింధూరి, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు -
అదనపు కట్నం వేధింపులపై కేసు
మదనపల్లె రూరల్ : అదనపు కట్నం, కానుకల కోసం వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదుచేసినట్లు వన్టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. మదనపల్లె పట్టణం తాళ్లసుబ్బన్న వీధికి చెందిన నజీరుల్లా, జుబేదా దంపతుల కుమార్తె ముస్కాన్(22)ను కర్ణార్నాటక ఆర్కే.పురంకు చెందిన జలీల్అహ్మద్, షహీనా దంపతుల కుమారుడు షేక్ సల్మాన్కు ఇచ్చి 2022లో వివాహం జరిపించారు. ఏడాది నుంచి భర్త సల్మాన్, అత్త షహీనా, మేనత్త ఘాజియాలు అదనపు కట్నంతో పాటు బైక్ కొనివ్వాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భరించలేక నెలరోజుల క్రితం ముస్కాన్ పుట్టింటికి వచ్చేసింది. విషయం తల్లిదండ్రులకు తెలిపి వారి సహాయంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితులు ముగ్గురిపై కేసు నమోదుచేసి హెడ్కానిస్టేబుల్ చంద్రరాజు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు యూనవర్సిటీ ప్రొచాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి తెలిపారు. స్ధానిక ఏయూలోని తన చాంబరులో ఏయూఈటీ –2025 మొదటి దశ ప్రవేశ ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూఈటీ ప్రవేశపరీక్ష ఈనెల 15న నిర్వహించామన్నారు. పరీక్షను మొత్తం 1908 మంది విద్యార్ధులు రాశారన్నారు. అందులో 1239 మంది విద్యార్ధులు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన విద్యార్ధుల కోసం జూన్ 5, 6, 9, 10 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అన్నమచార్య యూనివర్సిటీ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబా, రిజిస్టార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ నారాయణ, డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నేహితుడి కోసం వెళ్లి అనంత లోకాలకు.. కురబలకోట : కురబలకోట మండలం జంగావారిపల్లె సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో రాయచోటికి చెందిన యువకుడు షేక్ మహమ్మద్ నవాజ్ (23) మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు..రాయచోటికి చెందిన సుహేల్ (24) కువైట్లో పని చేస్తూ స్వగ్రామం రాయచోటికి రావడానికి శుక్రవారం బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. ఇతన్ని తీసుకు రావడానికి రాయచోటికి చెందిన ఇతని స్నేహితులు మహమ్మద్ అలీ ఖాన్ (23), డ్రైవర్ ముజిమిల్ (24), ఖాదర్ బాషా (24), షేక్ మహమ్మద్ నవాజ్ (24) వెళ్లారు. వీరి స్నేహితుడు సుహేల్తో పాటు కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని జంగావారిపల్లె వద్ద రోడ్డు డివైడర్ను డీకొంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనలో షేక్ మహమ్మద్ నవాజ్ (24) మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృత దేహాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. స్నేహితుడి కోసం వెళ్లి రెప్పపాటున జరిగిన ప్రమాదంలో ఇతను మృతి చెందడం పట్ల రాయచోటిలో తీవ్ర విషాదం నెలకొంది. సాగులో శాసీ్త్రయత పెంపొందించుకోవాలి – భారత నూనె గింజల పరిశోధనా శాస్త్రవేత్త ఖురేషి నందలూరు : రైతులు సాగులో శాసీ్త్రయత పెంపొందించుకోవాలని తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధనా శాస్త్రవేత్త ఖురేషి సూచించారు. శుక్రవారం మండలంలోని లేబాక, నల్లతిమ్మయ్యగారిపల్లె గ్రామాల నందు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ద్వారా రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త మానస మాట్లాడుతూ మామిడి తోటల పెంపకం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి రామకృష్ణరాజు మాట్లాడుతూ మండలంలోని ప్రధాన పంట వరి పైరు గురించి వివిధ రకాల విత్తనాలు నారుమడి పెంపకం, ప్రధాన పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షక్షణ చర్యల గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి మల్లిఖార్జున మాట్లాడుతూ రైతులందరూ విశిష్ట నమోదు సంఖ్య తీసుకోవాలని, ఇప్పటికీ తీసుకోని వారు త్వరగా నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం వారిచే రైతులకు ఇచ్చే పంట ద్వారా వారు వేసిన పంటను నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సురేష్బాబు, వైపి గిరీష్కుమార్, పామాయిల్ పంట అభివృద్ధి అధికారి కొండారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ఖైదీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కడప అర్బన్ : కడప నగరంలోని పురుషుల కేంద్రకారాగారం, ప్రత్యేక మహిళా కారాగారంలతో పాటు రాయచోటిలోని సబ్ జైలును వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ తమ సిబ్బందితో శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను పరిశీలించడంతో పాటు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయమును సద్వినియోగం చేసుకోవాన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు. సకాలంలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ప్రిజం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం కల్పించారు. కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, ప్రత్యేక మహిళ కారాగారం సూపరింటెండెంట్, రాయచోటి సబ్ జైల్ సూపరింటెండెంట్, పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు మరియు ఖైదీలు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పసిడిపురి వసంతోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో శనివారం నటరాజకళాక్షేత్రం నాట్య విశారద మోహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పసిడిపురి వసంతోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, వేంపల్లె తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని తమ నాట్య నైపుణ్యంతో అందరిని అలరించారు. 100 మంది చిన్నారులకు ఈ సందర్భంగా అయోధ్య బాలరామ అవార్డులను, ప్రశంశా పత్రాన్ని పంపిణీ చేశారు. అలాగే పలువురు నాట్యగురువులకు ‘నాట్య వతంస’ అవార్డులను అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నాట్యగురువు మోహిద్దీన్ ఖాన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణలో భాగంగా తాము ఈ కార్యక్రమాన్ని ‘పసిడిపురి వసంతోత్సవం 2025’ పేరుతో ఘనంగా నిర్వహించామన్నారు. మానవజాతి ఆవిష్కరించుకున్న అనేక కళల్లో నాట్యం ఒకటని నాట్యం ప్రాముఖ్యతను వివరించారు. ఇటీవలి కాలలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సాంప్రదాయ నృత్యాలను నేర్పించేందకు ఆసక్తి కనపరుస్తుండటం సంతోషకమన్నారు. కళలను ఆదరించి పోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం జానపద నృత్యం, సంగీతం, సెమిక్లాసికల్, సోలో, గ్రూప్ విభాగాలలో చిన్నారులు చేసిన నృత్యాలను ఆహుతులు ఆసక్తిగా తిలకించారు. అలాగే వేసవి శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన చిన్నారుల బృంద నృత్యం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. ఉదయం ప్రారంభమైన ఈ వసంతోత్సవం వేడుక రాత్రి 9 వరకు జరిగింది. కార్యక్రమంలలో పలు ప్రాంతాలకు చెందిన నాట్య గురువులు, కళాకారులు, కళాభిమానులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 100 మందికి అయోధ్య బాలరామ అవార్డులు ప్రదానం -
రైలు ఢీకొని యువతికి తీవ్ర గాయాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ పరిఽధిలోని ముకుందాశ్రమం వద్ద రైలు పట్టాలపై నడిచి వెళుతున్న ఆవారి చందు అనే యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిందని ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసులు, ఎర్రగుంట్ల, నందలూరు ఎస్ఐలు త్రివేణి తెలిపారు. స్థానికంగా ఉన్న శివాలయంలో అభిషేకం చేయాలని ఆ యువతి కుటుంబం భావించి పూజా సామగ్రికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు యువతి శివాలయంకు వెళ్లిందన్నారు. తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన స్థలం వద్ద ఫేస్ మాస్క్, పాదరక్షలను చూసి యువతిని గుర్తించామన్నారు. కుటుంబ సభ్యులు గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం కడపకు, ఆ తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ కొంతమంది పట్టాలు దాటే సమయంలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ వెళుతున్నారని, ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి చర్యలను విడనాడాలని ఆయన సూచించారు. -
మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం
కడప ఎడ్యుకేషన్ : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్–2025లో మార్షల్ ఆర్ట్స్(పెన్– కాక్ సిలాట్)లో కడప బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి జాన్ బెన్ని బంగారు పతకం సాధించినట్లు కరస్పాండెంట్ లేవాకు నితీష్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున బాలాజీ ఎంబీఏ కళాశాల విద్యార్థి బంగారు పతకం సాధించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఇందుకు విద్యార్థికి రూ. 10 వేలు నగదుతో సత్కరించామని తెలిపారు. జూన్లో వియత్నాంలో జరిగే మార్షల్ ఆర్ట్స్లో భారత్ తరపున జాన్ బెన్ని పాల్గొంటాడని తెలిపారు. యూనివర్సిటీ ప్రొఫెసర్., స్పోర్ట్స్ ఇన్చార్జ్ జోజిరెడ్డి తమ కెంతో తోడ్పాటునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ హిమ్మల్, హాకీ చోక్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. -
యోగాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్ : ఈనెల 21 నుంచి జూన్ 21 వరక్ఙుయోగాంధ్ర– 2025్ఙ మాసోత్సవాల్లో నిర్వహించే అన్ని కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు శ్రీయోగాంధ్ర– 2025్ఙపై నిర్వహించే వివిధ కార్యక్రమాలు, పీఎం–సూర్యఘర్ పథకం, ఎన్టీఆర్ వైద్యసేవలు, స్వచ్ఛఆంధ్ర, హరితాంధ్ర, హౌసింగ్ తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు జేసీ అదితిసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ 11వ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని దీనికి రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది హాజరయ్యే లక్ష్యంతో అధికారులు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రతి ఆదివారం ఉదయం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థాగత, పబ్లిక్ ప్రదేశాల్లో జిల్లాలో యోగా క్యాంపెయిన్ లను నిర్వహించాలన్నారు. యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జూన్ 10వ తేదీ వరకు ఆశక్తి కలిగిన ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది మీ ఇంటివద్దకే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, సీపీవో హాజరతయ్య, డిపివో రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు రాజ్యాలక్ష్మీ, అదిశేషారెడ్డి, కిరణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సర్వజన ఆసుపత్రికి తీవ్ర ఆనారోగ్యంతో బత్తల చిన్నా (35) అనే పేరుతో ఈనెల 28న ఓ వ్యక్తిని వైద్యం కోసం చేర్పించారు. అతడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలనీ రిమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. యువతిపై దాడి కేసులో విచారణ ముద్దనూరు : మండలంలోని నల్లబల్లె గ్రామంలో గురువారం సాయంత్రం హరిణి అనే యువతిపై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం సీఐ దస్తగిరి తమ సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన నల్లబల్లె గ్రామంలోని యువతి ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినందుకు క్రాంతి కుమార్ అనే యువకుడు హరిణి ముఖంపై కత్తితో దాడిచేసి గాయపరచాడు.దీనిపై కేసు నమోదు చేసి బాధితురాలిని సీఐ విచారించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ టవర్పై నుంచి కిందపడి యువకుడి మృతి జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని దొండపాడు రస్తాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ముద్ద శివసాయి(27) అనే యువకుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శివసాయి సెల్ టవర్ ఎక్కి పనులు చేస్తుండటగా ప్రమాదవశాత్తు తాడు విరిగిపోవడంతో కింద పడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు శివసాయి వేంపల్లి మండలం అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఎర్రగుంట్ల పోలీసులు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ మృతి కడప అర్బన్ : కడప – ఒంటిమిట్ట రహదారిలో ఈనెల 28వ తేదీన రాత్రి ఆటో నడుపుకుంటూ ఇంటికి వెళుతున్న ఆటో డ్రైవర్ పెయ్యాల శ్రీనివాసులు (40) అనే వ్యక్తిని కడప కేంద్ర కారాగారం సమీపంలోని సైనిక్నగర్ వద్ద గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈసంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి ఈనెల 29న పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్పై నుంచి పడి మహిళకు తీవ్రగాయాలు మదనపల్లె రూరల్ : బైక్పై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పీటీయంకు చెందిన ఇమ్రాన్బాషా భార్య హసీనా(48) కుమారుడు ముజాహిద్ధీన్తో కలిసి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వస్తుండగా, మార్గమధ్యంలోని కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద ఆమె కట్టుకున్న చీర బైక్ వెనుకచక్రంలో చిక్కుకుపోవడంతో అదుపుతప్పి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. -
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం
పిఠాపురం పీఠాధిపతి సనాతన ధర్మం ఎక్కడ ? పులివెందుల : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని మెడికల్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు చూపించే భాగంలో శుక్రవారం పులివెందుల నుంచి ఆ కార్యక్రమాలను చూడటం జరిగిందని, గండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మొదలుపెట్టుకుని ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వమైన సరే విద్య, వైద్య విధానాలపై దృష్టి సారిస్తే రాష్ట్రాభివృద్ధికి మంచి జరుగుతుందనే విషయాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించిందన్నారు. రూ.8,500కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 17మెడికల్ కళాశాలలను స్థాపించాలన్న ఉద్యమంలో ఈ కళాశాలకు రూ.530కోట్ల నిధులను వెచ్చించి నిర్మించారన్నారు. ఎంత పెద్ద కళాశాల, ఇంత మంచి కళాశాలకు 100సీట్లు కేటాయించాలని చెప్పి ఎన్ఎంసీ పర్మిషన్ కోసం అప్లయ్ చేసి ఆ టైంలో వంద కాదు, 50సీట్లు అంటే... సరే 50 సీట్లతో కళాశాలను రన్ చేయాలనే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తర్వాత మాకు 50సీట్లు కూడా వద్దు మేం ఇచ్చే సీట్లు కూడా ఇవ్వం, మొత్తం సీట్లను వెనక్కి తీసేసుకోండని చెప్పిన పరిస్థితి ఉందన్నారు. ఈ కళాశాల రన్ అయ్యి ఉంటే కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. ఎంతో మంది డాక్టర్లు బయటకు వచ్చేవారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు ఉద్యోగాలు ఇచ్చారని, అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో నుంచి మమ్ములను తరిమేసినట్లుందని, ప్రైవేటీకరణ చేస్తారన్న భయంగా ఉందని సిబ్బంది తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని మంచి పనులు ప్రజలకు తెలియాలనే లక్ష్యంతో పులివెందుల నుంచి ప్రయాణం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష చక్రాయపేట : రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్లు ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు.శుక్రవారం ఆమె చక్రాయపేట మండలంలో అర్ధాంతరంగా ఆగిన కాలేటివాగు ప్రాజక్టును పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. మండలంలోని అన్ని ఎకరాలకు సాగునీటిని అందించి రామాపురం,లక్కిరెడ్డిపల్లె, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె తోపాటు కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రు.5,300 కోట్లతో 0.25 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న కాలేటివాగు ప్రాజక్టును 1.2టీఎంసీలకు పెంచి నిధులు మంజూరు చేశారని చెప్పారు.ప్రాజక్టు పనులు సుమారు 90శాతం పూర్తయ్యాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు కూడా 80 శాతం మందికి పరిహారం అందించినట్లు చెప్పారు.మిగిలిన రైతులకు పరిహారం ఇచ్చి ఆగినపనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయక వదిలేసిందంటే కక్ష సాధింపు కాక మరేమవుతుందని ప్రశ్నించారు. రైతులు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వారైనందునే ఈప్రాజక్టు గురించి పట్టించుకోలేదని అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందుకు తెస్తాం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల వైఎస్సార్ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయం కుంభాభిషేకంలో జరుగుతున్న జాప్యంపై సనాతన ధర్మం అని చెప్పే పిఠాపురం పీఠాదిపతి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదప లేదని ఆమె ప్రశ్నించారు. కాలేటివాగు ప్రాజక్టు పరిశీలించిన అనంతరం ఆమె గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.అనంతరం గత ప్రభుత్వ హయాంలో సుమారు రు.25 కోట్లతో పనులు ప్రారంభించి సుమారు 90 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. ఆలయం కుంభాభిషేకం చేసి భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు జాప్యం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. తక్షణం కుంభాభి షేకం జరిపించి శ్రావణ మాసంలో వచ్చే లక్షలాది మంది భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. జగనన్న హయాంలో హిందూ ఆలయాలకు పెద్ద పీట వేశారని ఆమె చెప్పారు.కార్యక్రమంలో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,జడ్పీటీసీ శివప్రాదరెడ్డి,సతీష్ రెడ్డి తనయుడు రోహాన్ నాగిరెడ్డి,జిల్లా కార్యదర్శి ఈశ్వరరెడ్డి,పార్టీనేతలు వెంకటసుబ్బయ్య, శంకర్రెడ్డి, కృష్ణా రెడ్డి,సుబ్బిరెడ్డి,సుధాకర్,ప్రతాప్,గండి చేర్మెన్ కావలి కృష్ణతేజ,శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓగా గోపాల్రెడ్డి
కడప రూరల్: ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓగా రాచుమల్లి గోపాల్రెడ్డి నియమితులయ్యారు. ఈయన వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై కడప ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏఓ (పరిపాలనా అధికారి)గా నియమితులయ్యారు. గోపాల్రెడ్డికి పదోన్నతి లభించడం పట్ల సహచర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలుకడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా షేక్ షఫీవుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.రఘురామిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎం.గురుప్రసాద్, ఎస్.భాస్కర్రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులుగా వై.జనార్దన్రెడ్డిలను నియమించారు.ఏనుగు హల్చల్పీలేరు: మండలంలోని జాండ్ల, గూడరేవుపల్లె పరిసర గ్రామాల్లో ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. యర్రావారిపాళెం మండలంలో ఫారెస్ట్ అధికారులు సైతం గాయపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం మండలంలోని జాండ్ల పంచాయతీలో ఒంటరి ఏనుగు సంచరించినట్లు గ్రామస్తులు గుర్తించారు. నారుమడి తొక్కిన ఏనుగు అడుగులు, అరటి తోట ధ్వంసం చేసినట్లు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు జాండ్లలో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.2న జెడ్పీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పని చేస్తున్న ఎంపీడీఓల క్యాడర్ నుంచి అటెండర్/వాచ్మెన్ వరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 2న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 వరకు పరిపాలన అధికారులు, సీనియర్ సహాయకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్న 1 గంట వరకు జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్లు, వాచ్ మెన్లకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు మండల పరిషత్ అఽధికారులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కావున ఒకే కేంద్రంలో ఐదేళ్లు పని చేసిన వారు, రిక్వెస్ట్ బదిలీలు కోరిన ఉద్యోగులంతా జూన్ 2న జిల్లా పరిషత్ సమావేశ భవనంలో హాజరు కావాలని ఆమె కోరారు. -
‘వెన్నుపోటు’ దినం.. కదం తొక్కుదాం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో కడప పార్లమెంటు పరిశీలకులు కె.అజయ్రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 2025 జూన్ నాటికి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. సూపర్ సిక్స్తోపాటు 143 ఇతర హామీలు ఇచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహానాడుకు డ్వాక్రా మహిళల తరలింపు రాష్ట్రంలో ప్రజల అవసరాలు గుర్తెరిగి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ ట్రెండ్ సెట్టర్స్గా నిలిచారని, వారి తర్వాత అనేక వినూత్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. సుమారు 20 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంటే మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలే గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. ఆత్మస్తుతి పరనిందలాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుని, వైఎస్ జగన్ను తిట్టడానికే మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేశారన్నారు. మహానాడుకు డ్వాక్రా మహిళలను, ఉపాధి కూలీలను భయపెట్టి బస్సుల్లో తరలించారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తుందని చెబుతున్నా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు. సంపద సృష్టిస్తా, పేదలను ధనవంతులుగా చేస్తా, అభివృద్ధిని అందలం ఎక్కిస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటేలా చేశారన్నారు. కరోనా విస్తరిస్తుందని చెబుతున్నా వినకుండా మహానాడు నిర్వహించారన్నారు. ప్రయాణికులకు బస్సులు లేకుండా చేసి మహానాడుకు అన్ని బస్సులు తరలించారన్నారు. 50 ఏళ్లుగా ఈ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తున్నారని, ఒక్కసారి గెలిపించినందుకే ఇది మా అడ్డా అని టీడీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వెళ్లి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్, సంబటూరు ప్రసాద్రెడ్డి, దాసరి శివప్రసాద్, షఫీ తదితరులు పాల్గొన్నారు. 4న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు ప్రజల భాగస్వామ్యంతో వైఎస్సార్సీపీ ర్యాలీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ నేతలు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే ‘మహానాడు’ నిర్వహించారని విమర్శ -
● నాడు గలగల.. నేడు వెలవెల
● ఉచిత బస్సు ‘అదిగో.. ఇదిగో’ అంటూ..సాక్షి ప్రతినిధి, కడప: ఆ మనిషేం మారలేదు. మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. అధికారమే పరమావధిగా.. ముఖానికేసుకున్న అపద్ధాల హామీల ముసుగు తొలగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తక్కువ కాలంలోనే బహిర్గతమైంది. ‘నాడు–నేడు’ వెలుగు కరిగిపోయి, విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. అవును, బాబు మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువయ్యాయి. తల్లికి వందనమంటూ ఇప్పటికీ ఊరిస్తున్నారు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఉండిపోయింది. కర్షకులకు కన్నీరు తుడుస్తానంటూ.. పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500లు ఊసేలేదు. ఆడబిడ్డ నిధి మాటే ఎత్తడం లేదు. మహానాడు వేధికగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’ కాదు ‘బాబును నమ్మితే మోసం గ్యారెంటీ’ అని రుజువు చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఊరువాడా ఊదరగొట్టి.. 18 ఏళ్లు నిండిన యువతి నుంచి 59 ఏళ్ల వరకు వయసు గల ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరువాడా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ఏడాది మునుపు ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతామని ప్రతి యువతి, మహిళకు ఏడాదికి రూ.18 వేలు చెల్లిస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల మనసు టీడీపీ వైపు మొగ్గు చూపేలా వ్యవహరించారు. ఆపై ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆడబిడ్డ నిధి గురించి ఆలోచనే చేయలేదు. మహానాడు వేదికగా ప్రకటిస్తారని భావించిన అక్కచెల్లెమ్మలకు నిరాశే ఎదురైంది. కామధేనువు లాంటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారును పోగొట్టుకొన్నామని మథనపడుతున్నారు. అమలు చేసింటే రూ.1272 కోట్లు దక్కేది 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఆడబిడ్డ నిధిగా రూ.1500 చొప్పున టీడీపీ సర్కారు చెల్లించి ఉంటే ఏడాది కాలానికి రూ.18 వేలు వచ్చేది. జిల్లా వ్యాప్తంగా 7,06,974 మంది మహిళలు ఈ పథకానికి అర్హులు కానున్నారు. అంటే ప్రతి నెలా రూ.106.05 కోట్లు.. యువతులు, మహిళలకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాది కాలానికి రూ.1272.6 కోట్లు దక్కేది. చంద్రబాబు సర్కారు మోసం కారణంగా.. ఆ మొత్తాన్ని మహిళాలోకం కోల్పోయింది. మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని, సమాజంలో ఆత్మగౌరవం పెంచేందుకు మునుపటి వైఎస్సార్సీపీ సర్కారు అడుగులు వేస్తే.. సీఎం చంద్రబాబు సర్కారు తద్భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా మహిళాలోకాన్ని వంచనకు గురిచేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా, ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అందరికీ రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ ద్వారా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదైనా ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. రాబోవు జూన్లో ఇస్తామని మహానాడు వేదికగా మరోమారు ప్రకటించారు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తే జిల్లాలో 3.58 లక్షల మంది విద్యార్థులకు రూ.538 కోట్లు చెల్లించాల్సి ఉంది. పథకం అమలులో ఎలాంటి నిబంధనలు తెరపైకి వస్తాయో వేచిచూడాలి. పథకం పేరు జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు అందాల్సిన మొత్తం కాలం ఏడాదైనా నెరవేరని హామీ ఎదురుచూస్తున్న అక్కాచెల్లెమ్మలు కూటమి సర్కారు తీరని ద్రోహం జగనన్న సర్కారులో మహిళలే మహారాణులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు మహారాణులుగా విరాజిల్లుతూ వచ్చారని విశ్లేషకులు వివరిస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా 2,16,222 మందికి రూ.912 కోట్లు నాలుగేళ్లలో లభించింది. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రూపేణా మరో రూ.190 కోట్లు అందించారు. మరోవైపు కోట్లాది రూపాయాలు వెచ్చించి.. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మహిళల పేరిట రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు. మహిళలు మహారాణులుగా అటు సమాజంలో.. ఇటు సొంత ఇళ్లలో గౌరవం పెంచే చర్యలను నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ వ్యవహరించిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మహిళలు ఇకపై ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆశించారు. ఈ హామీ అమలు ‘ఇదిగో.. అదిగో’ అంటూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో 6 ఆర్టీసీ బస్సు డిపోల ద్వారా 590 బస్సులు ప్రజా రవాణాలో ఉన్నాయి. సరాసరి ప్రతి రోజు 1.29 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలు ప్రతి రోజు ప్రయాణించున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే 38,700 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. తక్కువలో తక్కువంటే సరాసరిగా రూ.100 చార్జీలు చెల్లిస్తున్నారనుకున్నా, ప్రతి రోజు రూ.38.7 లక్షలు మహిళలు చార్జీల రూపేణా భరిస్తున్నారు. అంటే నెలకు రూ.116 కోట్లు మహిళలు భరిస్తున్నారని నిపుణులు వివరిస్తున్నారు. ఆడబిడ్డ నిధి 7,06,974 (18 ఏళ్లు నిండిన మహిళలు) రూ.106.05 కోట్లు ప్రతి నెల తల్లికి వందనం 3.58 లక్షలు విద్యార్థులు రూ.538.24 కోట్లు ఏడాది ఉచిత ప్రయాణం 38,700 (రోజూ ప్రయాణిస్తున్న మహిళలు)ఒకరికి రూ.100 చొప్పున ప్రతి రోజు రూ.38.7 లక్షలు ఇంకెప్పుడు ఇస్తారు? అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఆడబిడ్డ నిధి ఊసే లేదు. అసలు పథకం అమలు చేస్తారా? లేదా? నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న సంగతి చంద్రబాబుకు గుర్తుందా? ఇప్పటికైనా ఇవ్వాలి. – సరోజ, కమలాపురంఉచిత బస్సు తుస్సు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తుస్సు అయింది. – గురుదేవి, ధన్నవాడ, మైలవరం మండలం పథకాలు పేర్లకే పరిమితం మహిళలను మోస పుచ్చేందుకు చంద్రబాబు సంక్షేమ పథకాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టారు. అధికారం పీఠం ఎక్కాక వాటిని అమలు చేయడం మరిచారు. – గుర్రం లావణ్య, కౌన్సిలర్, ప్రొద్దుటూరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు వైఎస్సార్సీపీ హయాంలో మహిళలందరూ మహారాణులుగా ఉండేవారు. కానీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. – వనజమ్మ, లింగాలదిన్నెపల్లె, బి.మఠం -
వైద్య ఉద్యోగులు.. బదిలీల గుబులు
కడప రూరల్: ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ ముగిసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖకు ఇంత వరకు గైడ్లైన్స్ రాలేదు. దీంతో ఆ శాఖ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీల తంతు ముందుకు సాగడం లేదు. వేలాది మంది ఉద్యోగులు.. ప్రభుత్వ శాఖల్లో వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనది. కడప పాత రిమ్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) పరిధిలో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో దాదాపు 17 కేడర్లకు సంబంధించి 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అధిక సంఖ్యలో వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు ఈ శాఖ పరిధిలోకే వస్తారు. ప్రభుత్వం ఇటీవల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇంత వరకు ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాలేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 143 జీఓ ప్రకారం చర్యలు చేపట్టాలి. అంటే ఒక కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ నుంచి క్షేత్ర స్థాయి కేడర్ వరకు 14 మంది ఉద్యోగులు ఉండేలా వైద్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి. ఈ సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రాలేదు. ఈ కారణం చేత బదిలీలు కూడా ఆలస్యమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైద్యఆరోగ్య శాఖ అవినీతిమయం అయిందని స్వయంగా మంత్రినే ప్రకటించడంతో.. ఆ శాఖను ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా ఐదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలి. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్తోపాటు కొన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులను మూడేళ్లు సర్వీసు దాటితే.. తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే భార్య,భర్తలు ఉద్యోగాలు చేస్తున్నా, దివ్యాంగులు ఉన్నా నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలి. అనుకూలమైన స్థానంలో ఉండటానికి.. ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఉద్యోగులు తమకు అనుకూలమైన చోటికి వెళ్లడానికి, వీలు పడితే ఉన్న స్థానంలోనే ఉండిపోవడానికి ఆలోచిస్తున్నారు. అలాగే కొందరు మాంచి స్థానాల్లోకి రావడానికి పావులు కదుపుతున్నారు. గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల్లో ఉన్న సభ్యులకు.. నిబంధనల ప్రకారం బదిలీల నుంచి మినయింపు ఉంది. కొందరు ఉద్యోగులు తమ పరపతి, పలుకుబడిని ఉపయోగించి ఈ సంఘాల్లో పని చేస్తున్నట్లుగా లేఖను పొంది.. స్థానికంగానే ఉండటానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. ఈ శాఖ ఉద్యోగుల్లో గైడ్లైన్స్ అంశం ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైద్య,ఆరోగ్య శాఖలు అవినీతిమయంగా మారాయని ఆరోపించారు. కొన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులను మూడేళ్ల సర్వీసు దాటితే బదిలీ చేయాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్కు పచ్చ జెండా ఊపింది. అయితే వైద్య ఆరోగ్య శాఖకు ఇంత వరకు గైడ్లైన్స్ను జారీ చేయకపోవడంతో ఉత్కంఠగా మారింది. ఆ ఉద్యోగులకు మూడేళ్లు దాటితే బదిలీ ప్రభుత్వ ఉద్యోగుల స్థానచలనానికి గ్రీన్సిగ్నల్ వైద్య ఆరోగ్యశాఖకు అందని గైడ్లైన్స్ ఆలస్యంతో మరింత ఆందోళన ఉన్న స్థానంలోనే కొనసాగడానికి విశ్వప్రయత్నాలు గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు ఇంకా ప్రభు త్వం నుంచి గైడ్లైన్స్ రాలేదు. మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం బదిలీలను చేపడుతాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియను చేపడుతాం. – డాక్టర్ రామగిడ్డయ్య, రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు
సాక్షి ప్రతినిధి, కడప, అమరావతి: ఏడాదిలో చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు..! అంతా ఆత్మస్తుతి.. పరనింద..! వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకునెట్టి.. సొంత కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు సీఎం ఎత్తులు..! ఇదీ టీడీపీ మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేక పోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాన్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు. మరోవైపు మహా నాడును.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన కేడర్ చేతులతోనే ఎన్టీఆర్ను ఛీ కొట్టించి ఆయన్నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు.. టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నారా లోకేశ్ నాయకుడనేలా..మంత్రి నారా లోకేశ్ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్కు మంచి స్పందన వచ్చింది. ఆయనను కొనసాగిస్తే తనయుడు లోకే‹శ్ రాజకీయ భవిష్యత్కు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్ను దూరంపెట్టారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందుపెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరమూ తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారా వారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని కేడర్కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పరనిందలతో ఆత్మానందంకడప మహానాడులో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడడానికే టీడీపీ నేతలు ఎక్కడ లేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకొంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్కమాట చెప్పలేకపోయారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఏఐ వీడియో ప్రదర్శించడం బెడిసికొట్టింది. బాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.తీర్మానాలు పోయి శాసనాలు వచ్చె..సాధారణంగా మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి బాబు తన తనయుడు లోకేశ్తో చెప్పించారు. ఈ శాసనాలేమిటని తమ్ముళ్లు బుర్రగోక్కుంటూ చర్చించుకున్నారు. కార్యకర్తలే బలం అన్న రోజే బలవన్మరణ యత్నంఆరు శాసనాల్లో గొప్పగా చెప్పినవాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ, అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే మాధవి తమను అణచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్నిబట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత పదికి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండాపోయింది.వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్నా.. రామ్మోహన్నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి భారీగా జనం వచ్చినట్టు చిత్రీకరించడం విమర్శలకు దారి తీసింది.టీడీపీ నేత ఫిర్యాదుతో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసుముందుగా వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకుని.. ఆపై ఫిర్యాదు తెప్పించుకుని కేసులు నమోదు చేస్తున్న అపఖ్యాతిని పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు మూటగట్టుకున్నారు. బుధవారం నమోదు చేసిన ఓ కేసులో వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల అదుపులో ఉండిపోయారు. కడపలో మహానాడు నిర్వహణను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. వారి దురుద్దేశం, దుశ్చర్యలను గమనించిన వైఎస్సార్సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, సబ్ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారు. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ కేడర్ వాటిని తొలగించింది. ఈ చర్యలో ఎలాంటి గొడవ, ఘర్షణ చోటుచేసుకోలేదు. తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్సార్ విగ్రహాలకు జెండాలు, తోరణాలు కట్టి సవాళ్లు విసిరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ వారికే వత్తాసు పలికింది. టీడీపీ నేతలు చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసు ప్రతాపం చూపారు. అప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, టీడీపీ నేత అక్కులగారి విజయ్కుమార్రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం. విజయ్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మంది బుధవారం రాత్రి నుంచి పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నారు. కోర్టులో హాజరుపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసు స్టేషన్లు మారుస్తూ వారిని కొడుతూ వచ్చారు. దీంతో పులివెందుల పోలీసులు.. పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
కడప మేయర్ సురేష్ బాబుకు ఊరట
సాక్షి, అమరావతి: కడప మేయర్ కె.సురేష్ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాని నేపథ్యంలో స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న జారీ చేసిన జీవో 446ను సవాలు చేస్తూ సురేష్బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తొలగింపు ఉత్తర్వుల అమలును నిలిపి వేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, జీవో 446 అమలును నిలిపి వేసేందుకు నిరాకరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్బాబు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ నూనెపల్లి హరినాథ్, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేష్ బాబు తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తన కుటుంబ సభ్యులు చేస్తున్న కాంట్రాక్ట్ పనుల గురించి పిటిషనర్ సురేష్ బాబుకు తెలియదన్నారు. దీనిని పిటిషనర్కు వ్యతిరేకంగా వాడారని, ఇది అన్యాయమని వివరించారు. ఈ విషయం పాలక మండలి ముందుకు రాలేదని, అందువల్ల వాటితో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిని ఉల్లంఘన కింద భావించడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ను మేయర్గా తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సహేతుక కారణాలను పేర్కొన లేదని చెప్పారు. మేయర్గా సురేష్ బాబు పదవీ కాలాన్ని ఇలా ఏకపక్షకంగా అడ్డుకోలేరన్నారు. పిటిషనర్కు వాదనలు వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. న్యాయవాది యతీంద్రదేవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చట్ట ప్రకారం తిరిగి విచారణ జరపాలని, తన వాదనలు వినిపించేందుకు సురేష్ బాబుకు తగిన అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కాశినాయన : మండలంలోని జ్యోతిక్షేత్రం సమీపంలోని గరుడాద్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాశినాయన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోరుమామిళ్ళ వైద్యాధికారి కరీమ్ ఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్య కలసపాడు : మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామానికి చెందిన షేక్ ఇమాంసాబ్ కుమారుడు షేక్చాంద్బాషా (24) గురువారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాంద్బాషా కలసపాడులో మోటారు మెకానిక్గా పనిచేస్తుండేవాడు. కడుపునొప్పితో ఆరోగ్యం సరిగా లేక రెండు సార్లు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. అయినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి తలుపులు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. యోగ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరవుతారన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నాగభూషణం, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓఆర్డీ సునీల్కుమార్, డాక్టర్ కార్తీక్విశ్వనాథ్, ఎంఈఓలు అనంతకృష్ణ, నాగయ్య, ఏఓ మల్లికార్జున, ఏపీఓ మురళి, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలి ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీ గనుల బైరెటీస్ ఖనిజం ఆధారితంగా నిర్మించిన పల్వరైజింగ్ మిల్లులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎండీసీ గనుల విస్తరణలో ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల వారు అప్పులు చేసి స్థానికంగా చిన్న పరిశ్రమలైన మిల్లులను ఏర్పాటు చేసి అందులో యాభై మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. దాదాపు 175 మిల్లులు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎగుమతిదారులకు సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజం ధర తగ్గించి ఇవ్వడం మిల్లులకు మరో ధర ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు రాయితీలతో ఖనిజాన్ని సరఫరా చేసే వారన్నారు. మిల్లులకు రాయితీపై ఖనిజం సరఫరా లేక మిల్లులన్నీ మూతపడి కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు. -
మహానాడు.. మందు.. విందు
గ్లాసు పట్టు.. మందు కొట్టు.. మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కడప: మహానాడు.. మందు.. విందు.. మూడుముక్కల్లో చెప్పాలంటే మూడు రోజుల పసుపు పండగ సాగిన తీరిదే.. ముఖ్యంగా కడప గడపలో మద్యం ఏరులై పారింది. కడప నగరంలో నెలరోజులు పాటు ఖర్చు అయ్యే మద్యం మూడు రోజుల్లోనే ఖర్చైంది. గురువారం బహిరంగసభ కారణంగా గ్రామాల గల్లీల నుంచి ప్రధాన రహదారుల వరకూ మందుబాబులు తాగి చిందులేశారు. జనసమీకరణ కోసం పచ్చనోట్లు పంచడంతో అందుకున్న ప్రజలు ఎక్కడిక్కడ మద్యం తాగు తూ కనిపించారు.కొందరు తూలి కింద పడ్డారు..నిద్రలోకి జారుకున్నారు. మహానాడు సందర్భంగా సమీపంలోని వైన్ షాపులను మూసివేసి ఉండే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ● కడప గడపలో 22 మద్యంషాపులుంటే దాదాపు అన్నీంట్లో రద్దీ విపరీతంగా ఉండిపోయింది. మంగళ, బుధవారాలల్లో నగరంలోని మద్యంషాపులల్లో వ్యాపారం రూ.65లక్షలు చొప్పున చోటుచేసుకోగా గురువారం 5 రెట్లు అధికంగా దాదాపు రూ.3కోట్లు పైబడి వ్యా పారం లభించినట్లు సమాచారం. చిత్తూరు–కర్నూల్ జాతీయ రహదారి వెంబడి మందుబాబులు తిష్టవేసి మద్యం సాగారు. ఇటు కడప–రేణిగుంట రహదారిలో కూడా ఇదే పరిస్థితి. కడపలో వలసపక్షులకే ప్రాధాన్యత... కడప నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న కార్యకర్తలకు న్యాయం లభించలేదని టీడీపీ మాజీ మహిళా అధ్యక్షరాలు చిప్పగిరి మీనాక్షి ఆరోపిస్తూ బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం మరోమారు అదే విషయం తేటతెల్లమైంది. వలస పక్షలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. వారి చేతికే డబ్బులు అప్పగించి జనాన్ని సమీకరించాలని ఆదేశించినట్లు సమాచారం. పాతతరం నేతలెవ్వరిని జనసమీకరణలో ప్రోత్సహించలేదని సమాచారం. కడప నగరంలో డ్వాక్రా మహిళలు కదలకుంటే జనం ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ సీనియర్ నాయ కుడొకరు చెప్పుకొచ్చారు. ఎండవేడిమికి వెనుతిరిగిన జనం... మహానాడు బహిరంగసభకు జనాన్ని సమీకరించారు, కానీ వారిని సభ అయ్యేంత వరకూ అలాగే నిలువరించలేపోయారు. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కాసేపు కూర్చు న్నా వెనుకవైపు నుంచి జనం జారుకోవడం కన్పించింది. 3గంటలకు వేదిక మీదకు సీఎం రావడం 4.20 నిమిషాలకు ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే బాగా జనం వెనుకడుగు వేస్తుండడం కన్పించింది. అభివృద్ధికి నిర్ధిష్ట ప్రణాళిక ఏదీ? ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, చర్చించారు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాయలసీమ అటుంచితే కనీసం కడప జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించారనుకున్న వారికి చేదు అనుభవమే ఎదురైంది. జిల్లాలోని గండికోట రిజర్వాయర్ను నాన్ ప్రియారిటీ జాబితాలో పెట్టిందే చంద్రబాబు హాయాంలోనే జిల్లాలో పాతతరం నాయకులు ఎవరైనా సరే, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించగలరు. కడప ఎమ్మెల్యే కోరిక మేరకు దేవుని కడపను పర్యాటక కేంద్రంగా చేస్తామని ప్రకటించడం మినహా నిర్దిష్టమైన ప్రణాళిక వెల్లడించలేదు. కమలాపురం ఎమ్మెల్యే ఏపీఐఐసీ భూములల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కోరినా సీ ఎం నోటా హామీ లభించకపోవడం గమనార్హం.పాపం.. డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి బహిరంగసభకు డ్వాక్రా సభ్యులు కచ్చితంగా హాజరు కావాలని యానిమేటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఎవరైనా హాజరు కాలేని పక్షంలో వారి తరుపునా కూలీలను హాజరు పర్చాలని ఆదేశించారు. ప్రతి సంఘం వారి వారి గ్రూపు ఫొటో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహారిస్తే భవిష్యత్లో ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించవని డ్వాక్రా గ్రూపు లీడర్లును యానిమేటర్లు బెదిరించారు. యానిమేటర్లు వాయిస్ మెసేజ్ వైరల్ కావడంతో డ్వాక్రా సభ్యులు పెద్ద ఎత్తున మహానాడు సభకు హాజ రయ్యారు. గ్రామాల కంటే పట్టణాలు, నగరాలల్లోని డ్వాక్రా సభ్యులు భారీగా తరలిరావడంతో దాదాపు 40శాతం మంది సభా ప్రాంగణంలో మహిళలే కనిపించారు. గల్లి నుంచి ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసిన మద్యం ప్రియులే జనసమీకరణ కోసం డబ్బుల పంపిణీ, వాహానాలు ఏర్పాటు ఎండవేడిమికి తట్టుకోలేని జనం మధ్యలోనే నిష్క్రమణ -
తైక్వాండో జిల్లా స్థాయి పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు
పోరుమామిళ్ల : పోరుమామిళ్లలో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో 88 పాయింట్లకు 35 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్గా పోరుమామిళ్ల విద్యార్థులు నిలిచారని మాస్టర్ నాయబ్రసూల్ తెలిపారు. బంగారు పతకాలు సాధించిన వీరంతా తాడిపత్రిలో జూన్ నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థుల వివరాలు ఇలా.. బాలుర సబ్జూనియర్స్ విభాగంలో.. మోక్షిత్, హుసేన్, తస్వీక్ అయాన్, మహమ్మద్ సమీర్, సయామ్బాషా, నదీష్, సఫాన్, జస్వంత్ బాలికల సబ్ జూనియర్స్ విభాగంలో.. శ్రీ గీతిక, హరిణి, తత్వికవనమా, దివ్య నాగ హర్షిత క్యాడియేట్ బాయ్స్ విభాగంలో.. గురు వెంకట తేజస్, పర్వీజ్, అబ్దుల్ అజీజ్, ఫయుం బాషా, మహబూబ్ సుహాన్, శివ సాత్విక, రిత్విక్, శివరామకృష్ణ క్యాడియేట్ బాలికల విభాగంలో.. నాగదీపిక, లక్కీ, లోక్షిత జూనియర్స్ బాలుర విభాగంలో.. అబూబకర్, సాజిత్, హరుణ్, సాయి కృష్ణ తేజ, చరణ్ జూనియర్స్ బాలికల విభాగంలో.. మాధవి, ధనిషా, మౌనిక, ఆఫ్రిన్ సీనియర్స్ బాలుర విభాగంలో.. అమరనాథ్, నయామ్ సీనియర్స్ బాలికల విభాగంలో.. భవ్య, తస్లీమ్ -
మహా వైఫల్యం
కడప రూరల్: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు ఫ్లాప్ షోగా మిగిలింది. గురువారం జరిగిన బహిరంగ సభ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నేతల ప్రసంగాలతో ప్రారంభమైంది. చివరన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించారు. సాయంత్రం 5.30 గంటలకు బహిరంగ సభను ముగించేశారు.నేతల్లో నీరసం...ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా కడపలో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. తద్వారా వైఎస్సార్ జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా పట్టు సాధించాలని భావించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆ పార్టీ అగ్రనేతలంతా కడపలోనే మకాం వేశారు. బహిరంగ సభకు 5 లక్షల నుంచి 7 లక్షల మంది హాజరవుతారని గొప్పగా చెప్పారు. బహిరంగ సభ సమయం రానే వచ్చింది. నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. సభకు హాజరైన జనాలను చూసి పార్టీ నేతల్లో నిరుత్సాహం కలిగింది. అధికార యంత్రాంగాన్ని అంతా మోహరించి నా, అనుకున్న దాని కంటే తక్కువ సంఖ్యలో జనాలు హాజరు కావడంపై గొప్పలు చెప్పుకున్న నాయకులు దిక్కులు చూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది.వచ్చిన వారి ఇబ్బందులు...భారీగా జన సమీకరణ కోసం అధికార యంత్రాంగం అంతా కసరత్తు చేసింది. బస్సులతో పాటు ఇతర వాహనాల్లో పలు ప్రాంతాల నుంచి జనాలను తీసు కొచ్చారు. వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బహిరంగ సభా ప్రాంగణానికి 3 కిలో మీటర్ల దూరానికి పైగా వాహనాలు నిలిపేశారు. అక్కడి నుంచి జనాలు సభ వద్దకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులు సభా ప్రాంగణంతో పాటు వచ్చే ప్రధాన అన్ని ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కల్పించామని చెప్పినా ఆచరణలో అమ లు కాలేదు. ఫలితంగా సభకు వచ్చిన జనాలు ఆకలితో అలమటించారు. నిర్వాహకులు పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.భద్రతా ఏర్పాట్ల పరిశీలనకడప అర్బన్: మహానాడు బహిరంగ సభలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా భద్రతా ఏర్పాట్లను ఐజీపీ (ఆపరేషన్స్) సీహెచ్ శ్రీకాంత్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. 23 డ్రోన్లు, 4 అత్యాధునిక ’టెదర్ టెక్నాలజీ’ డ్రోన్లను వినియోగిస్తూ ట్రాఫిక్, పార్కింగ్ పై ఎప్పటికప్పుడు విహంగ వీక్షణం ద్వారా పర్యవేక్షిస్తూ పోలీస్ అధికారులకు ప లు సూచనలు చేశారు.నేతల ప్రసంగాలకు స్పందన లేమిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్తో సహా నేతల ప్రసంగాలకు జనాల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. అంతా మౌన వ్రతం దాల్చినట్లుగా ఉండిపోయారు. నేతలు అనుకున్న విధంగా జనాలు రాకపోగా వచ్చిన వారు సభ ప్రారంభం కాగానే బయటికి వెల్లడం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభ కాగానే సభ నుంచి జనాలు వెల్లిపోవడం మరింతగా పెరిగింది. నేత ల నిరాశల మధ్య మూన్నాళ్ల ముచ్చటగా ‘మహనాడు’ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రయాణికుల కస్సుబస్సు
● మహానాడు సభకు 1847 బస్సుల వినియోగం ● ప్రజలకు తప్పని ప్రయాణ కష్టాలు ● గంటల తరబడి నిరీక్షణ ● భారీ జన సమీకరణ కోసం డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీల తరలింపు సాక్షి కడప: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు జనాలను తరలించేందుకు తమ్ముళ్లు నానా తంటాలు పడ్డారు. భయపెట్టో.. బెదిరించో..తీసుకు రావడం ఒక ఎత్తయితే, మరోవైపు ఆర్టీసీ బస్సులన్నీ మహానాడు వైపే వేయడంతో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి బస్టాండులో నరకయాతన అనుభవిస్తున్నా ఏమి అని అడిగేవారు లేకపోగా..ఎప్పుడు వస్తాయనే చెప్పేవారు లేకపోవడంతో ప్రయాణానికి కష్టాలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి హోదాలో అక్కడే ఉండడం..మంత్రులు, అధికార పార్టీ నేతలంతా అక్కడే మకాం వేయడంతో అధికార యంత్రాంగం సైతం వారి మెప్పుకోసం వెంపర్లాడిందే తప్ప ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని బస్టాండ్లలో ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు. గంటల తర్వాత వచ్చిన ఒకటి, రెండు బస్సుల కోసం తోపులాటలు..సీట్ల కోసం వెంపర్లాడుతూ సర్కార్ తీరును తూర్పారబట్టడం కనిపించింది. ● మహానాడు చివరి రోజు బహిరంగసభ జనం కోసం టీడీపీ నానా తిప్పలు పడింది. తక్కువ జనాలు కనిపిస్తే మహానాడు విఫలమైందన్న భావన కలుగుతుందని ఎక్కడికక్కడ డ్వామా మహిళలను, ఉపాధి కూలీలను తరలించారు. మహానాడా...మజాకా అన్నట్లు అటు డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలు కచ్చితంగా రావాలంటూ అల్టిమేటం జారీ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ చూసినా సభ వద్ద, బయటి ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు దర్శనమిచ్చారు. . యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంత మందిని తరలించాలని...బస్సులో తీసుకొచ్చిన వారి ఫొటోలతో పాటు సంతకాలను తీసుకున్నట్లు తెలియవచ్చింది. బస్సులు లేక బస్టాండ్లు వెలవెల కడపలో జరుగుతున్న మహానాడుకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1847 బస్సులను వినియోగించారు. సుదూర ప్రాంతాలతోపాటు రాయలసీమ ప్రాంతంలోని అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున బస్సులను వినియోగించడంతో ఆర్టీసీ బస్టాండులో బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా నుంచి 170, సత్యసాయి 167, చిత్తూరు 130, తిరుపతి 245, నంద్యాల 196, కర్నూలు 110, వైఎస్సార్ కడప 274, అన్నమయ్య 240, ప్రకాశం 85, నెల్లూరు 230 బస్సులను వినియోగించారు. ఆర్టీసీ బస్సులు మహానాడు దారి పట్టడంతో బస్టాండులు ఖాళీగా దర్శనమిచ్చాయి.ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. మహానాడు పుణ్యమా అని పలువురు ప్రయాణికులు తాము పడుతున్న కష్టాన్ని చెబుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. -
వైఎస్ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత
పులివెందుల : మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజారెడ్డి అని, ఆయన పేద ప్రజలకు ఆత్మీయుడు అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. గురువారం దివంగత నాయకుడు వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి వైఎస్ జయమ్మ సమాధుల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజారెడ్డి కుటుంబంలో చూపిన ప్రేమను, ఆయనను నమ్ముకున్న వారికి అండగా ఉండటంలోనూ, ప్రజల కష్టసుఖాలను పంచుకోవడంలోనూ, అన్నదమ్ముల విషయంలో, అక్కాచెల్లెళ్ల పట్ల బాధ్యతగా ఉండటంలోనూ, ప్రజలపట్ల సేవా తత్పరత కలిగి ఉండటం ఇవన్ని కూడా ఆయనలో ఉన్న సుగుణాలు అన్నారు. రాజారెడ్డి కుటుంబానికి తాము ఐదుగురం కోడళ్లం, అయినా ఏరోజు తమను కోడళ్లుగా చూడలేదని, కన్నబిడ్డల్లాగానే చూసుకున్నారన్నారు. అదేవిధంగా ప్రజలపట్ల కూడా ఆయన సేవాభావంతో ఉండేవారన్నారు. ముఖ్యంగా ఆయన ప్రజలకు సహాయం చేయాలన్న తలంపుతో వారి బిడ్డలలో ఒకరైన వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు, వైఎస్ వివేకానందరెడ్డిని పూర్తిగా రాజకీయాల్లో పనిచేసేందుకు స్వాతంత్య్రం ఇచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో జగన్ మోహన్రెడ్డి అయినా, షర్మిల అయినా, వైఎస్ అవినాష్రెడ్డి అయినా సేవలు అందిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డిని సీఎంగా చూడాలని చిరకాల వాంఛ అని అది చూడలేకపోయారన్నారు. కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా రాజారెడ్డి వద్దకు వస్తే ఆ సమస్యను ఆయనే తీరుస్తారనే నమ్మకం ప్రజలలో ఉండేదన్నారు. ఆరోగ్యం కోసం ఆరోజు వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిని కట్టి కొడుకును ఇక్కడ పెట్టి ఒక్క రూపాయి వైద్యం అందించారన్నారు. చదువుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్మీడియట్ కళాశాల పెట్టారన్నారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించి ప్రజల హృదయాలలో పెద్దాయనలాగా నిలిచిపోయారని గర్వంగా చెబుతున్నానన్నారు. వైఎస్ కుటుంబీకులలో రాజకీయ పునాది వేసిన రథ సారథి ఎవరంటే రాజారెడ్డి అన్నారు. రాజారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి అన్నారు. అలాంటి స్ఫూర్తిని మనం కూడా పొందాలని, ఆయన ఆశయాలను గుర్తుకు తెచ్చుకోవాలని, ఆయన పైనుంచి మనందరిని కూడా గర్వపడేలా చూసేలా బతకాలని కోరారు. అలాగే వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా స్థానిక వైఎస్ రాజారెడ్డి మోమోరియల్ పార్కులో ఉన్న వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరులు సుధీకర్రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, మైఖేల్ బాబు, షర్మిలమ్మ, వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. ఆయన పేద ప్రజలకు ఆత్మీయుడు వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన స్ఫూర్తితో వైఎస్సార్, వైఎస్ వివేకా, జగన్, షర్మిల, అవినాష్ ప్రజాసేవ మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ -
పైనాపిల్ కాసింది..!
పుల్లంపేట : పుల్లంపేట మండలం, అనంతంపల్లి గ్రామానికి చెందిన శేషారెడ్డి తన ఇంటిలో పైనాపిల్ మొక్క తెచ్చి నాటాడు. దీంతో పైనాఫిల్ విరగకాయడంతో గ్రామంలోని ప్రజలు వింతగా చూస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పైనాపిల్ పండదని, అలాంటిది శేషారెడ్డి ఇంటిలో విరగకాయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నిమ్మతోట దగ్ధంపెనగలూరు : పెనగలూరు మండలం, కాకర్లవారిపల్లి పంచాయతీ వెంకటనారాయణ పల్లి వద్ద నిమ్మతోట దగ్ధమైనట్లు ఫైర్ అధికారి శివయ్య తెలిపారు. గురువారం వేపాటి వారిపల్లికి చెందిన పి.పెంచలయ్య నిమ్మతోట అగ్నికి ఆహుతవుతుండగా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆర్పివేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చుట్టూ ఉన్న కంచె పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో నిమ్మతోట పూర్తిగా దగ్ధం కాలేదు. దాదాపు రూ.80 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి తెలిపారు. భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్ ఒంటిమిట్ట : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైందని భారతి సిమెంట్ డీజీఎం ఓబుల్ రెడ్డి, జిల్లా ప్రధాన మార్కెటింగ్ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ రమణా రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంట్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. రొబోటిక్స్ ప్రయోగశాల, జర్మన్ టెక్నాలజీ తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం కలవన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అయితే భారతి అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లో సెట్ అవుతోందని, దృఢత్వం కల్గి ఉంటుందని, కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మేసీ్త్రలకు లక్ష ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను యాభై మంది మేసీ్త్రలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ పాండురంగారెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
అహల్య బాయి త్రిశతాబ్ది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
రాయచోటి టౌన్ : అహల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ఎల్.మురుగున్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి సాయి సుధ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఈ నెల 31వతేదీన జరిగే త్రి శతాబ్ది జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాల పునర్నిర్మాణానికి చేసిన కృషి అమోఘమైనదన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జకియా ఖానం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా మాతంగి మహా పీఠంరాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలోని మాతంగి మహా పీఠం అధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ అన్నారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య శ్రీ శారద లక్ష్మి నరసింహా పీఠాధిపతులు స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి సరస్వతి సంకల్పం మేరకు లక్కిరెడ్డిపల్లెలోని దొర్రిచెరువు సమీపంలో శ్రీమాతంగి మహాపీఠ శిల శాస్త్ర ప్రతిష్టకు ఆయన హాజరయ్యారు. ముందుగా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో అల్పాహారం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహా పీఠం ప్రపంచానికి ఆధ్యాత్మికను నేర్పి ఆది గురువుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘన నివాళి
వేంపల్లె : వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్సార్ సమాధి వద్ద పీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. గురువారం పులివెందుల పర్యటనకు విచ్చేసిన ఆమె వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నాయకులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి, ప్రొద్దుటూరు కాంగ్రెస్ సమన్వయ కర్త ఇర్ఫాన్ బాషా, పులివెందుల సమన్వయ కర్త ధృవకుమార్ రెడ్డి, వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, బాలం సుబ్బరాయుడులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ కుట్రలు పటాపంచలు
కడప కార్పొరేషన్: కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వ విప్ మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చేసిన కుట్రలు ఫలించలేదు. మేయర్పై ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయిస్తూ పురపాలక శాఖతో వారు ఇప్పించిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. వివరాలిలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులపై కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టడం, సామ, దాన, భేద, దండోపాయాలతో బెదిరించి టీడీపీలో చేర్చుకోవడం ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కుతంత్రాలతో చేజిక్కించుకోవడం ఒక తంతుగా మారింది. కడపలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్.మాధవి ఆధ్వర్యంలో అంతకు రెట్టింపు స్థాయిలో కక్షసాధింపు చర్యలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. నగర ప్రథమ పౌరుడైన మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి....నగరపాలక సర్వసభ్య సమావేశంలో మేయర్తో సమానంగా తనకు కుర్చీ వేయకపోవడంపై మరింత రెచ్చిపోయారు. ఎలాగైనా సరే మేయర్ను పదవీచ్యుతుడిని చేయాలన్న కక్షతో ఎమ్మెల్యే, ఆమె భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మేయర్పై మున్సిపల్ శాఖకు ఫిర్యాదులు చేశారు. మేయర్ కుమారుడు కాంట్రాక్టు వర్కులు చేశారని విజిలెన్స్కు ఫిర్యాదు చేసి, మున్సిపల్ చట్టంలోని చిన్న లొసుగును ఆధారంగా చేసుకొని ఆయనపై అనర్హత వేటు వేయించారు. ఈనెల 14వ తేదీ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మేయర్ సురేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ తోసిపుచ్చడంతో...ఆయన డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. గురువారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ పురపాలక శాఖ ఇచ్చిన ఉత్వర్వులపై స్టే విధించింది. సంఘీభావం తెలిపిన నేతలు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మేయర్ సురేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, కార్పొరేటర్లు తదితరులు మేయర్ను కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకుల సంబరాలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయం వద్ద, అపూర్వ ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ఎమ్మెల్యే మాధవి ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలిచిందని వారు తెలిపారు. మేయర్ అనర్హత ఉత్తర్వులపై హైకోర్టు స్టే కడప ఎమ్మెల్యే మాధవికి చుక్కెదురు -
సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు
రాయచోటి టౌన్ : నూనె గింజల పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగేష్ దుబే అన్నారు. గురువారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో నూనె గింజల సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 700 జిల్లాలో రెండు వేలకు పైగా శాసీ్త్రయ బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. పండ్ల తోటల సాగులో కూడా కొత్తరకాల పండ్ల తోటలను ఎంచకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. ఏరువాక (ఖరీఫ్) సేద్యానికి రైతులు సిద్ధం కావాలని రాయచోటి వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ రైతులకు కోరారు. వేరుశనగ, కంది, నువ్వులు వంటి వ్యవసాయ పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరి సూచించారు. డాక్టర్ ఐ.సురేష్ కుమార్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ నాగేశ్వరరావు, రైతులు రామకృష్ణం రాజు, ఉద్యానశాఖ అధికారిణి నాగమణి, ఆత్మ ఏటీఎంలు, రైతులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న లారీ
పుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి మోడల్ స్కూల్ సమీపంలో గురువారం బైకును లారీ ఢీ కొన్న సంఘటనలో బైకుపై వెళ్తున్న మహిళ ఎడమచేయి లారీ కింద పడటంతో నుజ్జునుజ్జు అయింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరబల్లి మండలం, తొట్టికిందపల్లి దళితవాడ గ్రామానికి చెందిన రామ్మోహన్, సునీత దంపతులు. వీరు సునీత పుట్టినిల్లు అయిన పుల్లంపేట మండలం, అనంతంపల్లి పంచాయతీలోని జానకీపురానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పుల్లంపేట మోడల్ స్కూల్ సమీపంలోకి రాగానే కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఎదురుగా లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రామ్మోహన్కు తీవ్ర గాయాలు కాగా, సునీత కుడిచేతికి స్వల్ప గాయాలు కాగా, ఎడమ చేయి లారీ కిందపడటంతో నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రులను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యంకోసం తిరుపతికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
85 మందికి పదోన్నతి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్కు గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్లో జిల్లావ్యాప్తంగా జెడ్పీ హైస్కూల్స్లో పనిచేస్తున్న 85 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులను కల్పించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఏడీ మునీర్ఖాన్, డీసీఈబీ సెక్రటరీ విజయబాస్కర్రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది నాగేశ్వరెడ్డి, ఏసన్న, సాయి, నిఖిల్, బాష తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల: కొనసాగుతున్న ‘కూటమి’ వేధింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. -
మహానాడు ఎఫెక్ట్.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు -
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఎస్కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్.. ఓ ఎమోషన్ -
మా భూముల్లో జోక్యం చేసుకోకుండా..అధికారులను నిలువరించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె (సీకేదిన్నె) మండలం మద్దిమడుగు గ్రామ పరిధిలో తమకు చెందిన 63.72 ఎకరాల భూమిని స్వాదీనం చేసుకుంటూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21న ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేయాలని కోరుతూ సజ్జల దివాకర్రెడ్డి కుమారుడు సందీప్రెడ్డి, భార్య భగీరథి, మరో సోదరుడు సజ్జల జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి విజయకుమారి, అల్లుడు వై.సత్యసందీప్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సీకేదిన్నె మండల పరిధి పలు సర్వే నంబర్లలో తమకున్న 201.17 ఎకరాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.రికార్డుల ప్రకారం మావన్నీ వ్యవసాయ భూములే దశాబ్దాల నుంచి తమ స్వాదీనంలో ఉన్న వ్యవసాయ భూములను అధికారులు ఇప్పుడు అటవీ భూములుగా చెబుతున్నారని పిటిషనర్లు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కూడా అవన్నీ వ్యవసాయ భూములేనని తెలిపారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చాయని.. అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని తెలిపారు. చాలా భూములను రిజిష్టర్ డీడ్ల ద్వారా కొన్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇవన్నీ వ్యవసాయ భూములుగానే ఉన్నాయి తప్ప పోరంబోకు భూములుగా లేవన్నారు. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, 201.17 ఎకరాలు తమవేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తమ చట్టబద్ధ హక్కుల విషయంలో జోక్యం చేసుకుంటోందని తెలిపారు. అన్నీ అటవీ భూముల బయటే ఉన్నాయి ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం గానీ, ఏ అధికారి గానీ తమ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని సందీప్రెడ్డి తదితరులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అటవీ శాఖ హద్దులన్నీ కూడా తమ భూముల వెలుపలే ఉన్నట్లు పేర్కొన్నారు. అటవీ అధికారులు కూడా ఎన్నడూ తమ భూమిని అటవీ భూమిగా చెప్పలేదన్నారు. తమ భూముల్లో నిర్మాణాలకు సంబంధిత శాఖల అధికారులు అన్ని అనుమతులు మంజూరు చేశారని, వాటిలో నివాస గృహాలు, సర్వెంట్ రూమ్లు ఉన్నాయని, సకాలంలో పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.సంయుక్త సర్వేలోనూ అటవీ భూమి కాదని తేలిందిరెవెన్యూ, అటవీ శాఖ సంయుక్త సర్వేలోనూ తమ భూమలు అటవీ భూములు కావని తేలిందని పిటిషనర్లు వివరించారు. తమ భూముల హద్దులేవీ అటవీ భూముల్లో లేవని తేల్చారన్నారు. సంయుక్త సర్వే నివేదికతో పాటు తమవద్ద ఉన్న అన్ని రికార్డులను జిల్లా కలెక్టర్ ముందుంచినా... వాటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. 63.72 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ, స్వాదీనం చేసుకోవాలంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని, ఆ వెంటనే భూముల నుంచి తమను ఖాళీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యరి్థంచారు. -
●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు
కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజు పూర్తిగా ఆదరణ కరవయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రంగా హాజరైన తెలుగు తమ్ముళ్లు, రెండు రోజు పూర్తిగా ముఖం చాటేశారు. మహానాడు ప్రాంగణం వైపే చూడని వారు కొందరైతే, వచ్చిన వారు కూడా ప్రసంగాలు ప్రారంభం కాగానే తిరుగుబాట పట్టారు. వెరసి మహానాడు ప్రాంగణం, చుట్టుపక్కల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎంతో ఆర్భాటంగా మహానాడును కడపలో నిర్వహించుకుంటున్నాం అని చెప్పుకున్న టీడీపీ బోర్లా పడింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆదరణ కరవైంది. దీనికి ప్రధాన కారణం నేతలల్లో చిత్తశుద్ధి లేకపోవడమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. మహానాడులో రెండో రోజు ఉదయాన్నే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక ఆ టెంట్ల కింద ఉన్న జనాలు తప్ప కనుచూపు మేర ఎక్కడా జనం కనిపించలేదు. సొంత పార్టీ కార్యకర్తలే మహానాడుకు డుమ్మా కొట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని విఽశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం
కడప సెవెన్రోడ్స్: నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయం, స్ఫూర్తి దాయకమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ హాలులో జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో ఎన్టీ రామారావు 102 జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ప్రతి ఏటా మే 28న ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం, ఆ మహానుభావుని స్మరించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, వ్యవసాయ శాఖ జెడి నాగేశ్వరరావు, డిసిఎంహెచ్ హిమదేవి, అగ్నిమాపక శాఖ అధికారి ధర్మారావు, మెప్మా పిడి కిరణ్, స్టెప్ సీఈవో సాయి గ్రెస్ తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ -
నేటి నుంచి ‘వికసిత్ కృషి’ యాత్రలు
కడప అగ్రికల్చర్: జిల్లాలో రైతులు మంచి వ్యవసాయ దిగుబడిని పెంచడానికి శాస్త్రవేత్తలు, రైతులను అనుసంధానించే లక్ష్యంతో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ (వీకేఎస్పి) యాత్రలు ఉమ్మడి కడప జిల్లాలో మే 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. ఎ.వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ , భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎల్ఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉమ్మడి కడప జిల్లాలోని 26 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు కొత్త విత్తన రకాలు, వినూత్న వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. అలాగే రైతులకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై మార్గనిర్దేశం చేయడం, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వైఎస్సార్ ఓ ఎమోషన్
పులివెందుల: ఈ ప్రాంత ప్రజలకు వైఎస్సార్ ఒక ఎమోషన్ అని.. ఆయన విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టి రెచ్చగొట్టడం సరికాదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలపై బుధవారం ఆయన భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమ వాసులు ఈ ప్రాంత అభివృద్ధి గురించి సీఎం ప్రస్తావిస్తారని ఎదురు చూశారు, కానీ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి, పరనింద, ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని ప్రశ్నించారు. కేవలం వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగ్లు వేసి మహానాడు పేరుతో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్రెడ్డిని తిట్టారన్న పైశాచిక ఆనందం కోసం వందల కోట్లు వెచ్చించారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికి తెలుసు అన్నారు. 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.18వేలు పథకాన్ని హ్యాండ్ ఇచ్చారు.. ఉచిత బస్సు, తల్లికి వందనం, రూ.20వేలు రైతు భరోసా, 50ఏళ్లకే పింఛన్, 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ గాలికొదిలేసి ప్రజలకు మోసం చేశారు. సంవత్సరం రోజులలో ఇది టీడీపీ ట్రాక్ రికార్డు అని తూర్పారబట్టారు. ఈ సారి ఎన్నికలు వస్తే మీ స్థానం కాదు కాదా ఏ ఒక్క స్థానం తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కదని, అటువంటి దయనీయమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని, సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. టైం వచ్చినప్పుడు ప్రజలు మీకు బలమైన దెబ్బకొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. మహానాడు సందర్భంగా సభ్యత మరిచిపోయి, మనుషులమని మరిచిపోయి పులివెందులలో రాజశేఖరరెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు పెట్టడం, తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టడం దారుణమన్నారు. ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. వాటిని తొలగించాలని అధికారులను కోరగా పట్టించుకోలేదన్నారు. ఇవాళ ఉదయం కొంతమంది తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి వాటిని తొలగించారన్నారు. దీనికి బీటెక్ రవి మాట్లాడుతూ టీడీపీ తోరణాలను, జెండాలను వైఎస్సార్సీపీ నాయకులు తొక్కారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఒక ఎమోషన్.. ఆయన్ను అగౌరవపరిస్తే మీ పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు కడితే ఏ ఒక్కరు సహించక రెస్పాండ్ అయ్యి తీసేశారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. ఈ 11నెలల్లో టీడీపీ నేతలు ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండు పోలీసులను అడ్డుపెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేశారు, ఒక సెకండు పోలీసులను పక్కనపెట్టి వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. ఈరోజు తాము సహనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యకర్తలు కూడా సంయమనంగా ఉండాలని ఎంపీ కోరారు. టీడీపీ నేతల కవ్వింపు చర్యలకు, రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరు రెచ్చిపోవద్దని సూచించారు. గత ఐదేళ్లలో తాము ఎన్టీఆర్ను ఎప్పుడు అగౌరవపరచలేదు, పైగా ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. విష సంస్కృతికి బీజం వేయొద్దని టీడీపీ నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ను అగౌరవపరుస్తున్నారు వైఎస్సార్ విగ్రహాలకు పచ్చ జెండాలు కట్టడం సరికాదు సంయమన రాజకీయాలు చేస్తున్నాం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి టీడీపీ మహానాడు ఆత్మస్తుతి, పరనింద మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
కొండ గుల్ల!
‘తమ్ముళ్ల’ దెబ్బ.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత! ● ప్రకృతి సంపదను గుళ్ల చేస్తున్న పచ్చ నేతలు ● కొండలు, గుట్టలు, చెరువులు, నదులు లూఠీ ● పైసా ఖజానాకు చేరకుండా జేబుల్లోకి ప్రజాధనం సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల అక్రమాదాయకోరల్లో చిక్కి నదులు శల్యమవుతున్నాయి. ఉచిత ఇసుక మాటున లూఠీ చేస్తున్నారు. చిత్రావతి, పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదులను చెరబట్టారు. పేరుకే ప్రభుత్వ రీచ్లు, పక్కనున్న గ్రామాల నుంచి యధేచ్ఛగా మిషన్లు పెట్టి లోడింగ్ చేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. ప్రజాధనం పైసా కూడా ఖజానాకు చేరకుండా పక్కదారి పట్టింది. అధికారమే పెట్టుబడిగా తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా అన్నట్లుగా అక్రమ ఆదాయం ఉండిపోయింది. ● ప్రకృతి సంపద అధికార పార్టీ నేతల పాలిట కల్పతరువుగా మారింది. ముఖ్యంగా ‘ఉచిత ఇసుక’ దోపిడీ పథకంగా తెరకెక్కింది. ప్రభు త్వ రీచ్లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, సంబటూరు ఇసుక రీచ్లు నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను దక్కించుకున్న తెలుగుతమ్ముళ్లు ఆ మాటునా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాలల్లో ఈతంతు అత్యధికంగా చోటుచేసుకుంటోంది. కడపలో గ్రావెల్ దందా... కడప పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తీవ్రమైంది. అధికారికంగా ఉన్న గ్రావెల్ మైనింగ్కు అనుమతులు ఇవ్వకపోగా, అనధికార గ్రావెల్ మైన్స్ టీడీపీ నేతల నేతృత్వంలో నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది రూపాయాలు గ్రావెల్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్పితే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. అధికారం అడ్డుపెట్టుకొని ప్రజాధనం లూఠీ అవుతోంది. సంక్రాంతి పండుగ సందట్లో ఏకంగా నిల్వ ఉంచిన బరైటీస్ లూఠీ చేశారు. టిఫెన్ బరైటీస్ కంపెనీకి చెందిన సుమారు 3వేల టన్నుల బరైటీస్ ఖనిజాన్ని వేముల కేంద్రంగా అక్రమంగా తరలించుకుపోయారు. ఇవన్నీ తెలుగుతమ్ముళ్ల కనుసన్నుల్లోనే చోటు చేసుకున్నాయి. శాంతి విధ్వంసం–పునః నిర్మాణం అంటూ మహానాడులో సమీక్షలు చేసిన చంద్రబాబు సర్కార్లోనే ఇవన్నీ చోటుచేసుకున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ● అన్యాక్రాంతమవుతున్న విలువైన భూములుబి.కోడూరు మండలం పాయలకుంట్ల పంచా యతీ పరిధిలోని వేమకుంట రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 18లో 16.75 ఎకరాల ప్రభు త్వ భూమి ఉంది. ఈ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. అంతే రాత్రికి రాత్రే బోరు వేశా రు. అందుకు అవసరమైన విద్యుత్ కోసం స్థంభాలు వెలిశాయి. ప్రొక్లెయిన్తో భూమి చదును చేశారు. పార్టీ ఇన్చార్జీ నేత కనుసన్నల్లో రేయింబవళ్లు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ భూమి చదును చేస్తున్న వ్యవహారం పత్రికల్లో వెలుగుచూసినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ● మైదుకూరు మండలం నంద్యాలంపేటలో సర్వేనంబర్ 859లో 16 ఎకరాలు, సర్వేనంబర్ 840లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమికి ఏకంగా కంచె వేశారు. తిప్పిరెడ్డిపల్లె గోడేరు చెరువులో 50ఎకరాలు అన్యాక్రాంతమైంది. వల్లూరమ్మ చెరువు పేరుకు మాత్రమే ఉండిపోయింది. 30 ఎకరాలల్లో ఉన్న చెరువు 2 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. సర్వే నంబర్ 77లో 4ఎకరాలు కొండ పరంబోకును చదను చేశారు. 138/సీలో కుంట పరంబోకు 12 ఎకరాలు సబ్డివిజన్ చేయించుకొని పాసుబుక్లు కూడా తెచ్చుకున్నారు. -
మహానాడుకు సుగవాసి కుటుంబం దూరం
రాయచోటి: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అడుగులు వేసిన సుగవాసి కుటుంబం, ఆయన అనుచరులు నేడు కడప గడ్డపై జరుగుతున్న మహానాడు వేదికకు దూరమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానమే సుగవాసి కుటుంబాన్ని దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుధవారం దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని రాయచోటిలోని సుగవాసి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహానాడులో సుగవాసి కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆవేశం, ఆక్రోశం ఆయన వర్గీయుల్లో కట్టలు తెంచుకుంటుంది. సుగవాసి పాలకొండ్రాయుడు తనయులకు ప్రాధాన్యం లేకపోవడంతో బాల సుబ్రమణ్యం, ప్రసాద్ బాబులు మహానాడుకు దూరమయ్యారని తెలిసింది. వారి అనుయాయులు కూడా మహానాడు కార్యక్రమానికి వెళ్లలేదని సమాచారం. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, టీడీపీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తన అనుయాయులతో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుగవాసి అనుచరులు పెద్దఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. తండ్రి ఆశయ సాధనకోసం.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో అందరి అభిప్రాయం మేరకు రాజకీయాలలో అడుగులు వేస్తామన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా పార్టీని, కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. సుగవాసి భవన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు -
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం
సాక్షి,వైఎస్సార్: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు. -
మహానాడుపై బాబుకు టీడీపీ మహిళా నేత లేఖ.. ఆవేదనతో టవర్ ఎక్కి..
సాక్షి, వైఎస్సార్: మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అనంతరం, సెల్ టవర్ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో, భారీగా పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.మహానాడు సందర్బంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20ఏళ్లుగా పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు, ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. మహానాడుకు తన లాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ లాంటి పార్టీ కార్యకర్తలను చంద్రబాబు, లోకేశ్ వరకూ రాకుండా మాధవీ రెడ్డి కోటరీ అడ్డుకుంటోందని ఆరోపణ చేశారు. నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ మనుగడే కష్టమన్నారు. తన లాంటి కార్యకర్తల గోడు మీకు తెలియాలనే ఆత్మహత్యకు పూనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం, కడపలో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ వద్దకు వెళ్లి.. టవర్ ఎక్కారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ నేత ఇలాంటి చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా.. -
అది మహానాడు కాదు.. మహా కరోనా
ప్రొద్దుటూరు : మూడు రోజుల పాటు తెలుగు దేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే కడప గడ్డపై మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని భారత ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున మహానాడు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహానాడు తర్వాత ఏ ఊరిలో కరోనా వ్యాప్తి చెందినా అందుకు టీడీపీ, సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఓ యువకుడు, వృద్ధుడు కరోనాతో మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రామం, వార్డు నుంచి కార్యకర్తలు మహానాడు సభకు వెళితే కరోనా వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంతోపాటు భరోసాను ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఇలాంటి బహిరంగ సభలను నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మహానాడు ప్రభావం కారణంగా రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా అని ప్రశ్నించారు. అది మహానాడు కాదని మహా కరోనా అని అన్నారు. ఉన్నతాధికారి మొదలు వీఆర్ఏ వరకు అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. కడప గడప ఎప్పుటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను మరువదన్నారు. ఇది జగన్కే సొంతమని తెలిపారు. టీడీపీ నేతల ఇళ్లకే జెండాలు కడతాం మహానాడు సందర్భంగా కడప నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కడతారా అని రాచమల్లు ప్రశ్నించారు. ఏనాడైనా ఎన్టీఆర్ విగ్రహాలకు తాము జెండాలు కట్టామా అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకంగా టీడీపీ నాయకుల ఇళ్లకే వైఎస్సార్సీపీ జెండాలు కడతామన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం ఏమి సాధించిందో ప్రజలకు చెప్పాలని కోరారు. సమావేశంలో కో–ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, అనిల్కుమార్, పాతకోట మునివంశీధర్రెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, సత్యం, రాగుల శాంతి, వైఎస్సార్సీపీ నాయకులు ఉప్పర మురళి, తుపాకుల వెంకటరమణ, గంజికుంట శివారెడ్డి, అంజి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
బియ్యం బండి.. ఇక రాదండి.!
కడప సెవెన్రోడ్స్ : పనీపాట వదులుకుని రేషన్ షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు, కొండవీటి చేంతాడంత క్యూలైన్లు. తోపులాటలు, వాగ్వాదాలు తీరా తమవంతు వచ్చేసరికి సర్వర్ మొరాయిస్తే ఇక చేసేదిలేక ఊసూరుమంటూ ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి. మళ్లీ మరుసటిరోజు సంచి పట్టుకుని బియ్యం కోసం ఉరుకులు పరుగులు.. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ చౌక దుకాణాల వద్ద మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ప్రతినెల ఇంటి ముంగిటకే వచ్చి పేదలకు ఇన్నాళ్లూ సరుకులు అందిస్తున్న బియ్యం బండ్ల (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్)ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే ఇందుకు కారణం. మరో పక్క ఉపాధి కోల్పోయిన ఎండీయూ ఆపరేటర్లు తమ భవిష్యత్తు ఏమిటో అర్థం గాక సతమతమవుతున్నారు. జిల్లాలో 1239 ప్రభుత్వ చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో అంత్యోదయ అన్నయోజన కార్డులు 36,031 ఉండగా, అందులో 97,878 మంది సభ్యులు ఉన్నారు. తెల్లకార్డులు (డబ్ల్యుఏపీ) 5,42,746 ఉండగా, అందులో 16,43,489 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం మీద 5,78,777 బీపీఎల్ కార్డులు ఉండగా, 17,41,367 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, చక్కెర తదితర నిత్యావసర సరకులు పొందుతున్నారు. ఎఫ్పీ షాపుల వద్ద కార్డుదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గతంలో ఉండేవి. అలాగే అనేక గ్రామాల ప్రజలకు ప్రభుత్వ చౌక దుకాణం అందుబాటులో ఉండేది కాదు. నిత్యావసర సరుకుల కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఇంటి ముంగిటకే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీడీఎస్లో ఈ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. రేషన్షాపు డీలర్ల ఉపాధికి ఏమాత్రం దెబ్బతగలకుండా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ) వాహనాలను ప్రవేశపెట్టారు. 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారు వాటాతో ఎండీయూ వాహనాలను సమకూర్చారు. ఇందువల్ల బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, సామాజిక న్యాయం, సాధికారత లభించింది. బియ్యం బండి ఎప్పుడు వస్తుందో ముందుగానే వలంటీర్లు కార్డుదారులకు తెలియజేసే వారు. ఇందువల్ల వినియోగదారుల రోజువారి పనులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడేది కాదు. గంటల తరబడి క్యూలో నిలుచునే పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. అలాగే తమకు సరుకులు అందలేదని ఫిర్యాదులుసైతం లేవు. ఇప్పటివరకు ఎండీయూ వాహనాల పద్ధతి ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సవ్యంగా అందుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారు అయ్యాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందనే ముద్ర పేదల గుండెల్లోనుంచి చెరిపేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు ఎండీయూ వాహనాలను తొలగించడం ద్వారా నిరుద్యోగ యువతను రోడ్లపాలు చేస్తున్నారు. ఎండీయూ వాహనాలకు సంబంధించి 2027 వరకు ప్రభుత్వంతో ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని కాదని వాహనాల తొలగింపునకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. జూన్ 1 నుంచి కార్డుదారులు రేషన్షాపుల వద్దకే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం సరుకులను డోర్ డెలివరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే డోర్డెలివరీ ఎవరు చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. జూన్ 1 నుంచి ఎఫ్పీ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అంశంపై ఇటీవల జేసీ అదితిసింగ్ కలెక్టరేట్లో జిల్లాలోని డీలర్లతో సమావేశం కూడా నిర్వహించారు. ప్రతినెల 1 నుంచి 15వ తేది వరకు సరుకుల పంపిణీ జరగాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని ఆమె ఆదేశించారు. ఎండీయూ ఆపరేటర్ల ఆవేదన కడప నగరానికి చెందిన ఎండీయూ ఆపరేటర్ సుధాకర్ సాక్షితో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాలు తమకు ఇచ్చారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం సమకూర్చిందన్నారు. లబ్ధిదారు వాటా కింద తాను 10 శాతం అంటే రూ.63 వేలు చెల్లించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో ఆరు సంవత్సరాల అగ్రిమెంటు కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రతినెల 21 వేల రూపాయల తమ వేతనంలో రూ.3000 ప్రభుత్వమే మినహాయించుకుని బ్యాంకు రుణం చెల్లించేదన్నారు. మిగతా రూ. 18 వేలు తమకు అందిస్తుండేదన్నారు. నిరుద్యోగినైన తనకు ఉపాధి లభించడంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. ఇంకా 20 నెలల అగ్రిమెంటు గడువు ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఇప్పడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఎండీయూ ఆపరేటర్ వినోద్కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం తమకు 2027 వరకు గడువు ఉందన్నారు. ప్రతినెల ప్రభుత్వం నుంచి రూ. 18 వేలు వేతనం అందడం వల్ల తమ కుటుంబాన్ని పోషించుకునే వారమన్నారు. ఇప్పుడు హఠాత్తుగా బియ్యం బండ్లను తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. బ్యాంకుల నుంచి ఎన్ఓసీ వచ్చినంత వరకు బియ్యం బండ్లను కొనసాగించాలని, ప్రభుత్వం తమ ఉపాధిని దెబ్బతీయడం తగదని పేర్కొన్నారు. సరుకుల కోసం రేషన్ షాపులకు వెళ్లాల్సిందే కార్డుదారులకు ఇక తప్పని తిప్పలు ఉపాధి కోల్పోయిన ఎండీయూ ఆపరేటర్లు ప్రజల్లో జగన్ ముద్ర చెరిపేయడమే బాబు లక్ష్యంపనులు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలు దృష్టిలో ఉంచుకుని ఇంటివద్దకే రేషన్ అందించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి వల్ల మాలాంటి పేదలు పనులు పోగొట్టుకుని రేషన్ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి లేకుండా ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడమే కాకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడే బియ్యం బండ్లను తొలగించడం అన్యాయం. – జె.అమ్ములు, రామాంజనేయపురం, కడపఇంటి దగ్గరకే రేషన్ అందించాలి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించడం వల్ల మాలాంటి వారికి ఎంతో సౌలభ్యంగా ఉండేది. బియ్యం బండి ఎప్పుడు వస్తుందో సమాచారం అందించేవారు. కనుక ఆ సమయంలో అందుబాటులో ఉండి సరుకులు తీసుకు వెళ్లేవారం. గతంలో మాదిరి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేకుండా ఉండేది. ఇప్పుడు బియ్యం బండ్లు తీసివేస్తే పనులన్నీ వదులుకొని రేషన్షాపుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుంది. పైగా వెళ్లిన రోజే రేషన్ అందుతుందనే నమ్మకం లేదు. ఇంటి వద్దకే రేషన్ అందించే పద్ధతినే కొనసాగించాలి. – అబ్దుల్, రాజారెడ్డి వీధి, కడప -
పశ్చిమబెంగాల్ సైబర్ నేరస్తుడు మదనపల్లెలో అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడి మదనపల్లెలో తలదాచుకున్న పశ్చిమబెంగాల్కు చెందిన సైబర్ నేరస్తుడిని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కలకత్తాకు చెందిన జిజాన్స్(40) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని నగదు వసూలు చేసుకున్నాడు. అంతేకాకుండా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఆరు నెలల క్రితం కలకత్తా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జిజాన్స్ మదనపల్లెలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేశారు. -
యువకులపై పోలీసుల దాడి దారుణం
పోరుమామిళ్ల : తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగరీత్యా నేరమని మానవహక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న, ప్రతినిధులు ఫణిరావు, శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో దండించడం పక్కనపెట్టి బహిరంగంగా నడిరోడ్డుపై ముగ్గురు యువకులను కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోదడం చూస్తున్నవారిని భయకంపితులను చేసిందన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు సీఐలపై చర్య తీసుకోవాలని కోరారు. రౌడీలను దారిలో పెట్టే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. -
రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్
బి.కొత్తకోట : జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేసిన సీసీ రోడ్లు, కూలీలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం తెలిపారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో ఆయన మంగళవారం ఫాం పాండ్స్ పనులపై క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి ఎఫ్ఏ, టీఏలు, ఏపీఓలకు వేతనాలు అందలేదన్నారు. వీరికి త్వరలోనే వేతనాలు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 11 వేల ఫాం పాండ్స్ నిర్మాణం కోసం పనులు చేపట్టగా.. ఇప్పటి దాకా 5,109ను రూ.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 71 వేల మంది ఉపాధి పనులు చేస్తుండగా.. అందులో 26 వేల మంది ఫాం పాండ్స్ పనులు చేస్తున్నారని తెలిపారు. నెల రోజులుగా ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య పెరిగిందన్నారు. మండల ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తూ.. మండలానికి 225 కంపోస్టు యార్డులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలఖారులోగా 263 ఫాం పాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 200 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం లక్ష్యంగా నిర్ణయించామని, దీనిపై రైతులను గుర్తించి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీల సంఖ్యను 1,370కు పెంచాలని సూచించారు. యోగాంధ్ర యాప్లో ఉపాధి కూలీలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. సమావేశంలో ఏపీడీ నందకుమార్, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయకుంటే చర్యలు పెద్దతిప్పసముద్రం : ఉపాధి హామీ పథకంలో భాగంగా సిబ్బందికి నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండలంలోని క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ములకలచెరువు క్లస్టర్ ఏపీడీ నందకుమార్రెడ్డి ఉన్నారు. ఫాం పాండ్స్ పనులకు రూ.25 కోట్ల వ్యయం పీడీ వెంకటరత్నం -
ఎమ్మెల్సీ సీఆర్సీ, సుగవాసి డుమ్మా!
సాక్షి ప్రతినిధి, కడప: బలిజ సామాజికవర్గనేతల్ని టీడీపీ విస్మరిస్తోందా...ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా దూరం పెట్టిందా...అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య, సుగవాసి బాలసుబ్రమణ్యం మహానాడుకు దూరంగా ఉండడమే దీనికి నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎన్నో పదవులు అలంకరించిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ పార్టీలో కనుమరుగయ్యారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడమే అని తెలుస్తోంది. భవిష్యత్లో తమకు అడ్డుగా నిలుస్తారనే అభద్రతాభావంతో స్థానిక నేతలు ఎన్నికల వరకు వాడుకొని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. దీంత ఉనికి కోసమే పార్టీలో ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పసువు పండుగగా చెప్పుకుంటున్న మహానాడుకు గైర్హాజరయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాయలసీమ బలిజ నేతలకుపొగబెడుతున్న టీడీపీ మహానాడుకు దూరంగా ఉండిపోయిన నేతలు -
వర్షాలు పలకరించినా.. కలవరమే!
● సబ్సిడీ ఖరారు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న వేరుసెనగ విత్తన కాయలకు ప్రభుత్వం ధరలకు ఖరారు చేసింది. వేరుశనక్కాయలకు సంబంధించి 40 శాతం రాయితీ ఇవ్వనుండగా రైతులు వాటా 60 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి 50 శాతం సబ్సిడీని కేటాయించారు. ఇందులో జనుములు కిలో రూ. 123 రుపాయలుగాకా 50 శాతం సబ్సిడీ ఉంటుంది. అలాగే జనుములు కిలో రూ.109 కాగా రూ. 54.5, పెసలు కిలో రూ. 180 కాగా రూ. 90 వంతున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. కడప అగ్రికల్చర్: నైరుతి రుతు పవనాలు పలకరించాయి. జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతన్నలు కాడిమేడీని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇంత జరుగుతున్న రైతన్నలు కావాల్సిన వేరుశనక్కాయ లు సిద్ధం చేయడంలో ప్రభుత్వం వెనకబడి పోయింది. సబ్సిడీ విత్తనాల ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం విత్తనకాయలు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి 4567 క్వింటాళ్లకుగాను కేవలం 500 క్వింటాళ్ల జనుములు మాత్రమే వచ్చాయి. మిగతా జీలుగలు, మినుములు, పెసలతోపాటు అతి ముఖ్యమైన వేరుశనక్కాయలు కూడా రాలేదు. సాగుకు అవసరమైన విత్తనాలు కనీస స్థాయిలో కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో... ఖరీప్ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మొట్టప్రాంతంలో చాలా మంది రైతులు వర్షాధారంతో వేరుసెనగ పంటను సాగు చేయనున్నారు. వేరుశన క్కాయలకు సంబంధించి కే–6 రకం 3122 క్వింటాళ్లు, టీసీజీఎస్ రకం 297 క్వింటాల్, కదిరి లేపాక్షి రకం 200 క్వింటాల్, నారాయణి 1347 ఇలా మొత్తం జిల్లాకు 4966 కింటాళ్లు కేటాయించగా కేవలం కే–6 రకానికి సంబంధించి 3250 క్వింటాళ్లను మంజూరు చేశారు. ఇవి కూడా ఇంతవరకు జిల్లాకు రాలేదు. మారో వారం రోజులు పట్టనున్నట్లు అధికారులు వెల్లడిస్తుండడం గమనార్హం. వేరుశనక్కాయ ధరలు ఇలా (క్వింటా) రకం పూర్తి ధర రాయితీ రైతు వాటా మరో వారం రోజుల్లో.. ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన వేరుశనక్కాయలు మారో వారం రోజుల్లో జిల్లాకు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ ఖరారు చేసింది. ప్రభుత్వ సబ్సిడీ 40 శాతం కాగా రైతు వాటా 60 శాతంగా కేటాయించారు. విత్తనాలు కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. – జగదీష్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ టీడీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైంది. అన్నదాతల సంక్షేమం పట్టదని సబ్సిడీ విత్తనకాయల సాక్షిగా తెలిసిపోయింది. నైరుతి ముందే వస్తుందని తెలిసినా.. తొలకరి పలకరిస్తున్నా.. సకాలంలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతన్నలతో ఆటలాడుకుంటోంది. ఖరీఫ్ సాగు ఆదిలోనే ఆటంకాలు కలిగిస్తోంది. కే–6 9300 3720 5580 టిసిజిఎస్ 9300 3720 5580 నారాయణి 9500 3800 5700 ఇంకా జిల్లాకు రాని సబ్సిడీ వేరుశనక్కాయలు విత్తనాల కోసం రైతన్నలు ఎదురుచూపులు -
ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు
రాయచోటి టౌన్ : రాయచోటికే తలమానికంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కోసం రూ. కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయానికి చెందిన పనుల్లో స్వామి వారి ఆలయానికి పడమర దిక్కున ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపు అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటి స్థలాలు కూడా కేటాయించి ఇళ్ల నిర్మాణాలకు సహకరించారు. ఆ వెంటనే పశ్చిమ రాజగోపురం రూ.158 కోట్లతో నిర్మించారు. అలాగే గర్భాలయంపై పిడుగు పడటంతో 2020లోనే మళ్లీ రూ.33 లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం రూ.38 లక్షలతో మాఢవీధులు నిర్మించారు. చివరగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఐదు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు రూ.1.58 కోట్లతో 2023 జనవరి 26న పనులు ప్రారంభించారు. మూడు అంతస్తుల వరకు గోడలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన విషయమై ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డిని వివరణ కోరగా నూతన కమిటీ ఏర్పడ్డాక మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. యోగాంధ్రకు సర్వం సిద్ధం మదనపల్లె రూరల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్.. పట్టణంలోని బెంగళూరు రోడ్డు బీటీ కాలేజీ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. మైదానంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. యోగా ట్రైనర్, ఆసనాలకు సంబంధించి చెప్పే మాటలు అందరికీ వినపడేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. యోగాలో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు, ఆశా కార్యకర్తలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. -
అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!
సాక్షి కడప: మహానాడుతో ప్రజలు తిప్పలు పడ్డారు. కడప శివారు చుట్టూ ఎటుపోయినా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కిచిక్కి విలవిల్లాడారు. వాహనాలు కదలక...అడుగు ముందుకు పడక....ఎటువైపు పోలేక సతమతమయ్యారు. కడప నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతూ అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పరిస్థితిని తెలుసుకుని డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర పోలీసు అధికారులు వచ్చి ట్రాఫిక్ను కొంతమేర క్రమబద్ధీకరించినా తర్వాత మళ్లీ యథాస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య టీడీపీ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులకూ తగిలింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ నేతలు ఇష్టానుసారం వాహనాలు నిలబెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించా రు. పలుచోట్ల టీడీపీ నేతలు ట్రాఫిక్ను సరిదిద్దుతు న్న పోలీసులపైనే రుసరుసలాడడం కనిపించింది. మందుబాబులం.. మేము మందుబాబులం... మహానాడు సందర్భంగా మందుబాబులు ఫుల్ జోష్లో కనిపించారు. వైన్షాపుల వద్ద ఎక్కువ సంఖ్యలో పచ్చ చొక్కాల వారే కనిపించడం గమనార్హం. ఓ వైపు జనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోగా.. మరోవైపు తమ్ముళ్లు కిక్కులో గడిపారు. రింగ్ రోడ్డు వెంబడి నిలిచిపోయిన వాహనాలు అటు, ఇటుపోలేక ప్రజలకు తిప్పలు -
● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..
● ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ ‘వైఎస్’ హయాంలోనే.. సాక్షి ప్రతినిధి, కడప: మహానాడులో చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ల పరువు తీసి రోడ్డున పడేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డా కడపలో మహానాడు పెడుతున్నాం. ఇక అన్నీ మారిపోయాయి.. రాయలసీమ రూపురేఖలు రేపటి నుంచి మారిపోతాయి’ అంటూ తెలుగుదేశం నేతలు బీరాలు పలికారు. మహానాడు సందర్భంగా.. ఏ వేదిక దొరికినా, ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. తీరా మహానాడులో చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి అంశాన్నే పక్కన పెట్టడంతో.. టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. వైఎస్సార్, జగన్ చేసిన అభివృద్ధిని.. ఖాతాలో వేసుకునే యత్నం.. ‘కడప ఇక ఎవరి అడ్డా కాదు.. టీడీపీ వారి అడ్డా’ అంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. ఈ మహానాడు రాయలసీమ రూపురేఖలనే మార్చబోతోందంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మహానాడులో రాయలీసీమ అభివృద్ధికి తమ అధినేత చంద్రబాబు ఎన్నెన్నో ప్రకటనలు చేయబోతున్నారంటూ.. మీడియా ముందు ఊదరగొట్టేశారు. మరో అడుగు ముందుకు వేసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కడప జిల్లాలో చేసిన అసామాన్యమైన అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకున్నారు. సీమ, కడపను అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యం అంటూ గొప్పగా డప్పాలు కొట్టుకున్నారు. తీరా మహానాడు ప్రారంభమైంది. తమ అధినేత చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో పాత చింతకాయపచ్చడి ప్రసంగాన్ని బయటకు తీశారు. గత పదిహేనేళ్లుగా చెబుతున్న.. ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తా, ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తాను’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ముగించేశారు. వెరసి తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. తమ అధినేత రాయలసీమ అభివృద్ధికి ఎన్నెన్నో చేస్తారని, కనీసం మాటలైనా చెప్తారని ఆశపడ్డ సీమ నేతలకు చంద్రబాబు ప్రసంగం మింగుడుపడటం లేదు. పైడిపాలెం ప్రాజెక్టును కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. జిల్లాలో చెప్పుకొనేందుకు కూడా ఆయన చేపట్టిన ప్రధాన అభివృద్ధి అంటూ లేదు. పైగా మంజూరైన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తరలించారు. ఆ స్థానంలో హజ్హౌస్ మంజూరు చేశారు. చెప్పుకునేందుకు నిర్ధిష్టమైన అభివృద్ధి అంటూ ఏదీ లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైడిపాలెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించినప్పటికీ.. ఆ పనులను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 95 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అంతకు మించి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు అస్కారమే లేదని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. పథకం పేరు పూర్తి చేసిన వారు ప్రారంభించిన వారు రాయలసీమ అభివృద్ధి కాదు కదా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వాటిని కొనసాగిస్తానన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరో వైపు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గతంలో చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు సంగతేంటని వారు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఆ విషయాన్నే మాట్లాడలేదు. దీనికి తోడు ఇప్పటికే పులివెందులకు వచ్చిన 50 మెడికల్ సీట్లను వెనక్కు పంపడం, కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతి తరలించుకుపోవడం, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాజధానికి తరలించుకుపోవడం వంటి అంశాలపై రాయలసీమ ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంచుతానని మైదుకూరు సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన అమృత్ స్కీంలో భాగంగా రూ.500 కోట్లతో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు, కడపలో నిర్మిస్తున్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిధులు వంటి ఎన్నో అంశాలను చంద్రబాబు ప్రస్తావించనే లేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఏదో అత్యుత్సాహంలో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని మంత్రులు, ఎమ్మెల్యేలు బీరాలు పలికితే.. వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు పోశారు. ఇప్పుడు రాయలసీమ వాసులకు ఏం సమాధానం చెప్పాలో అంటూ తెలుగు తమ్ముళ్లు లోలోన మథన పడిపోతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కడప అభివృద్ధి కోసం పసుపు పండుగని చెప్పుకొచ్చిన టీడీపీ సీఎం చంద్రబాబు ప్రసంగంలో నోచుకోని ప్రణాళికలు ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టిన వైనం ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యత యోగిమేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలు, ట్రిపుల్ఐటీ, రిమ్స్ మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేసి పూర్తి చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ సెష్పాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, పుష్పగిరి ఐ హాస్పిటల్, డాక్టర్ ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, ఆర్కిటెక్చర్ పైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, పులివెందులలో మెడికల్ కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేశారు. చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ జిల్లాలో లేకపోవడం గమనార్హం. గండికోట ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వామికొండ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ సర్వారాయసాగర్ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వెలుగల్లు ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ బ్రహ్మంసాగర్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోనియాగాంధీ పైడిపాలెం ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబునాయుడు -
ప్రజలకు క్షమాపణ చెప్పండి: అంజద్బాషా
ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఎద్దేవా చేశారు. మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు స్వాతంత్య్ర సమరయోధులు, మహానాయకుల విగ్రహాలకు పార్టీ జెండాలు కట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏం సాధించారని, ఏం ఘన కార్యాలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించామని టీడీపీ నేతలు సంబరపడుతున్నారని, ఇది ఎప్పటికీ జగన్ అడ్డానేనని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర టీడీపీకి లేదు: సురేష్ బాబు రాష్ట్ర చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కడపలో మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్ల వల్లే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని, దుష్టబుద్ధితో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చారని మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలని మహానాడులో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధికార, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని, వారం రోజులుగా వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మహానాడు కార్యక్రమం ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. -
ఎస్ఎస్సీ బోర్డు ‘ఫెయిల్’
జమ్మలమడుగు : ఫలితాల వెల్లడిలో ఎస్ఎస్సీ బోర్డు ఫెయిలైంది. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఓ విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు సాధించింది. సోషల్లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్ఎస్సీ బోర్డు మార్కుల లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబుపత్రం రీవాల్యూయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతోపాటు జవాబుపత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో దీక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్ అధికారుల తప్పిదం వల్ల ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది. వాల్యూయేషన్ చేసిన అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
‘మహానాడు’ ప్రాంగణంలో కూలిన కటౌట్లు
కడప అర్బన్: కడప నగర శివార్లలోని పబ్బాపురంలో మంగళవారం నుంచి జరిగే టీడీపీ ‘మహానాడు’ ప్రాంగణంలో కటౌట్లు కూలడంతో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మహానాడు కోసం రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్కుమార్ పర్యవేక్షిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం అట్లూరు మండలంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న శీలి దొరబాబు, సుబ్బన్న మహానాడు ప్రాంగణంలోకి మోటార్సైకిల్పై వస్తుండగా భారీ కటౌట్లు కూలి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచర ఉద్యోగులు, పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించారు. -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో డీఆర్ఓ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కింది స్థాయి సిబ్బందిని పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలన్నారు. ● గోపవరం మండలం రామాంజనేయ నగర్కు చెందిన బత్తల వెంకట్రామయ్య ఇంటి నివాస స్థలానికి సంబంధించి అనుబంధం పత్రం మంజూరు చేయాలని అభ్యర్థించారు. ● కడప నబీకోటకు చెందిన ఎస్. కమాల్ బీ వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం విన్నవించారు. ● కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన కె.రంగలక్షుమ్మ వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ● చాపాడు మండలం ఓబయ్యపల్లికి చెందిన తప్పెట చంద్ర ఓబుల్ రెడ్డి తన భూమిని ఇతరులు ఆన్లైన్ చేసుకున్నారని, దానిని తొలగించి వెబ్ ల్యాండ్లో తన భూమి విస్తీర్ణం నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తరలింపు కొండంత!
అనుమతులు కొంత..ఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి రెడ్బుక్ పరిపాలన మీద పెట్టిన ధ్యాస ప్రజా పరిపాలనపై పెట్టకుండా అక్రమార్జనకు కూటమి నేతలు నేనంటే నేను అంటూ వరుస పెడుతున్నారు. ప్రజలనే కాకుండా జల వనరులను కూడా దోచుకునే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు. ఇసుక, మట్టి, అడవిని కూడా దోచుకునేందుకు వెనుకాడటం లేదు. దోచుకుని దాచుకోవడంలో కూటమినేతల తరువాతనే మరెవరైనా అనే విధంగా మండలంలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదే తంతు ఒంటిమిట్ట మండల కేంద్రంలో జరుగుతోంది. మండల కేంద్రమైన ఒటిమిట్ట చెరువులో రైతులకు ఉచితంగా మట్టి తరలింపు అనే ముసుగులో మూడురోజుల నుంచి కూటమి నేతలు ఇరిగేషన్ అనుమతులకు విరుద్ధంగా మట్టిని దోచేస్తున్నారు. రైతులకు ఉచితం అంటూ ఆదేశాలు ఉన్నా ఇక్కడి కూటమి నేతలు మాత్రం ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టికి రూ. 600 లెక్కన రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. భారీ యంత్రాలతో ట్రాక్టర్లకే కాకుండా పెద్దపెద్ద టిప్పర్లకు మట్టిని పోసి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్న పొలాలకు మాత్రమే మట్టి తరలించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రెండు గ్రామాలలోని ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వగా దానికి విరుద్ధంగా అనుమతులు లేని గ్రామాలకు కూడా మట్టిని తరలించి కూటమి నేతలు రోజుకు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతుల ముసుగులో ప్రతి రోజు దాదాపు 500 ట్రిప్పులపైబడి అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి మాఫియా జరుగుతుందన్న సమాచారం సంబంధిత అధికారులకు తెలిపినా వారి వద్ద నుంచి ఎలాంటి చలనం లేకపోవంతో సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయని మండలంలో చర్చ జరుగుతోంది. ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి.. మట్టి తరలింపుపై మండలంలోని సాలాబాదు, ఒంటిమిట్ట గ్రామ రైతులుగా ఉన్న ముగ్గురికి మాత్రమే మూడు రోజుల క్రితం ఒంటిమిట్ట చెరువులో వారి పొలాలకు మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. జేసీబీ సహకారంతో చెరువులో మట్టిని తరలించొచ్చు.. రైతులకు ఉచితంగా మట్టిని తరలించే విషయంలో జేసీబీని వాడుకోవచ్చు. ట్రాక్టర్లే కాకుండా టిప్పర్లను కూడా రవాణాకు ఉపయోగించవచ్చు. రైతులకు పూర్తి ఉచితంగా మట్టిని తరలించాలి. ఒక క్యూబిక్ మీటర్కు కేవలం ఒక రూపాయి మాత్రమే రైతు ప్రభుత్వానికి చెల్లించాలి. వారు చెల్లించిన రూపాయి కూడా మళ్లీ తిరిగి వారి ఖాతాలోకి జమ చేస్తాము. మూడు రోజులపాటు 500 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోమని అనుమతి ఇచ్చాం. అలా కాకుండా అనుమతులకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కిషోర్, ఇరిగేషన్ శాఖ ఏఈ -
మోడల్ మెగా డీఎస్సీ పరీక్షను జయప్రదం చేయాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 27వ తేదీన ఆర్ఎస్ఎఫ్ నేతృత్వంలో నిర్వహించనున్న మోడల్ మెగా డీఎస్సీ పరీక్షను డీఎస్సీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం. ఓబులేసు యాదవ్ కోరారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పోస్టర్ను సోమవారం కడపలోని వెంకట సాయి కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ దామోదర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మోడల్ పరీక్షకు ఎస్జీటీ అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఉందన్నారు. అభ్యర్థులు కడపలో 8639919308 నెంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే కడపలోని వెంకటసాయి కోచింగ్ సెంటర్, యూటీఎఫ్ భవన్లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. జమ్మలమడుగులో 8886238055 నంబర్ లేదా వివేకానంద జూనియర్ కాలేజీలో, ప్రొద్దుటూరులో 7036695591 నంబర్ లేదా సృజన్ కోచింగ్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల – బద్వేలు రోడ్డులో చెన్నారెడ్డిపేట సమీపంలో సోమవారం ఉదయం మోటార్బైక్లో వెళుతున్న పెద్దిరెడ్డి వెంకటరెడ్డి (56)ని బొలెరో వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని కొండుగారిపల్లెకు చెందిన వెంకటరెడ్డి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఉదయం పని వద్దకు వెళ్లేందుకు బైక్లో వెళుతుండగా 4 వే లైన్స్ రోడ్డు పనికి చెందిన బొలెరో వాహనం అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టి 50 మీటర్లు వెంకటరెడ్డిని బైక్తో సహా లాక్కొని వెళ్లింది. వెంకటరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డికి సమీప బంధువు కావడంతో పాటు వెంకటరెడ్డికి పెద్ద బంధువర్గం ఉంది. వెంకటరెడ్డి ప్రమాదంలో మృతి చెందిన వార్త తెలియడంతో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. దుంపలగట్టు చెరువు మట్టి తరలింపుతో సంబంధం లేదు ఖాజీపేట : చెరువు మట్టితో టీడీపీ నేత వ్యాపారం అంటూ తనపై బురద చల్లే విధంగా వార్త రాశారని దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రెడ్యం రవీంద్రారెడ్డి తెలిపారు. సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఖాజీపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుంపలగట్టు చెరువులో మట్టిని జాతీయ రహదారి అవసరాల కోసం అధికారులు తరలించారన్నారు. అయితే అది తాను తరలిస్తున్నట్లు రాయడం తగదన్నారు. ఈ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. -
వైస్ విగ్రహాలకు కట్టిన పసుపు జెండాలు తొలగించకుంటే ఆందోళన
వల్లూరు : మహానాడు సందర్భంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పసుపు జెండాలు, తోరణాలను కట్టడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. కడపలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా జెండాలు గానీ, లేక మరేవైనా కట్టినప్పుడు మరుసటి రోజే తొలగించే కార్పొరేషన్ అధికారులు అధికార టీడీపీ పట్ల అతి ప్రేమ చూపుతూ పసుపు జెండాలు, తోరణాలను అలాగే ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా అధికారులు విజ్ఞతతో స్పందించి వైఎస్ విగ్రహాల వద్ద ఉన్న పసుపు పచ్చ జెండాలను, తోరణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోతే మంగళవారం ఉదయం 11 గంటలకు కడప – మైదుకూరు రోడ్డులో ఉన్న ఇర్కాన్ సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. అధికారులను సొంత పార్టీ పనులకు ఉపయోగించడం సిగ్గుచేటు మహానాడు పూర్తిగా టీడీపీకి చెందిన సొంత కార్యక్రమం, అలాంటి సొంత పనులకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం అఽధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర జిల్లా స్థాయి అఽధికారులు సైతం ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్లు మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ిసిగ్గుచేటని విమర్శించారు. మహానాడు వద్ద కేటాయించిన విధులకు హాజరయ్యేందుకు వస్తూ కటౌట్ విరిగి ఇద్దరు వీఆర్ఓలు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. మహానాడు కాదది విద్రోహ నాడు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మోసగించి అఽధికారంలోకి వచ్చిన టీడీపీ సంవత్సర పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సంవత్సరం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దాని నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇది మహానాడు కాదని, విద్రోహనాడని ఆయన ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తన లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రొద్దుటూరులో సోమవారం బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. బీసీలు అంతా ఏకమై బలమైన బీసీ ఉద్యమాలను నిర్మిస్తే బీసీల డిమాండ్లన్నీ సాధించుకోగలమన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బీసీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, సహ అధ్యక్షుడు సందు శివనారాయణ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీవీ రాజు, జిల్లా అధ్యక్షుడు జింకా జయప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జిల్లా యువజన అధ్యక్షుడు శివనారాయణ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గురుమూర్తి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుభాన్బీ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డెయ్య, విజయకుమార్, గురప్ప, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆర్టీసీ అధికారులతో మంత్రుల సమీక్ష
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివార్లలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి కడప జోన్లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర మంత్రులు సూచించారు. సోమవారం ఆర్టీసీ ఆర్ఎం, ఈడీ కార్యాలయలలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, నారాయణ సమీక్ష నిర్వహించారు.అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కడపజోన్ ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్ఎం గోపాల్రెడ్డి, కడపజోనల్ చైర్మన్ నాగరాజుతోపాటు ఆర్టీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 284 మంది గైర్హాజరు కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం సాంఘికశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలకుగాను 1969 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1685 మంది హాజరుకాగా 284 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాలను నాలుగు బృందాల ఫ్లయింగ్ స్వ్కాడ్ 12 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఖనిజ నిక్షేపాలపై కేంద్రం అన్వేషణ ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్తపల్లె గ్రామ పరిసరాల్లో సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని 20 అడుగుల లోతు వరకు బోర్లు వేసి ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇందుకోసం అనేక వాహనాలను ఏర్పాటు చేశారు. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకుని పనులను ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో హెలికాప్టర్ ద్వారా పర్య టించి ఖనిజాలు నిక్షేపాలు ఉండొచ్చని చూపించిన జియోట్యాగ్ ఆధారంగా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. నేడు కడపలో జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కడప నగరంలోని తమ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్సీఎల్ టెక్నాలజీ కంపెనీలో ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. 2023, 24, 25 సంవత్సరాలలో ఇంటర్మీడియేట్ పాసైన వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు హోదానుబట్టి వేతనం ఉంటుదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు ధర కల్పించాలి రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలంలో మామిడి పంటలకు ధర కల్పించాలని సోమవారం మామిడి రైతులు, వ్యాపారులు స్థానిక ప్రైవేటు మార్కెట్ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షుడు కె మణి మాట్లాడుతూ జూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి కాయల కోత తర్వాత కుట్రపూరితంగా ధరలు తగ్గిస్తూ రైతులు, వ్యాపారులు నష్టపోయే విధంగా కు ట్రలు చేస్తోందన్నారు. మామిడి కాయలను తోలుకొని ధరల్లో వ్యత్యాసాలు చూపడం తగదన్నారు. అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు తక్షణమే పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. -
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో మూడు రోజులపాటు జరగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రం 7:35 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం మహానాడు ప్రాంగణానికి సాయంత్రం 7.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. -
టీడీపీ..మహా కవ్వింపు !
● రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి సాక్షి ప్రతినిధి, కడప : మహానాడు సందర్భంగా కడపలో టీడీపీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలతో పాటు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, దేశ చిహ్నమైన అశోక చక్రాన్ని కూడా అవమానిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి అందరి మనోభావాలు దెబ్బతినేలా చేస్తోంది. ప్రతి సర్కిల్లో పసుపు జెండాలు కట్టి అన్ని వర్గాలనూ రెచ్చగొట్టే పనిలో పడింది. నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో చేపట్టనున్న మహానాడు కోసం నగరంలో ప్రతి చోటా ఫ్లెక్సీలు, జెండాలతో నింపేస్తున్న టీడీపీ నేతలు, మహనీయులను కూడా అవమానపరుస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో మేం జెండా ఎగురవేశాం అని చెప్పుకునేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. గత ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కినా టీడీపీ, ఇప్పుడు తామేదో గొప్ప విజయం సాధించినట్లు కడపలో మహానాడు నిర్వహించుకుంటోంది. అంతవరకూ సరే అనుకున్నా, దీని కోసం ప్రత్యర్థి పార్టీలను, వివిధ వర్గాలను రెచ్చగొట్టే చర్యలకు దిగడం సమస్యాత్మకంగా మారుతోంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి మహనీయులను సైతం అవమానపరిచే స్థాయికి వెళ్లింది. నగరంలోని అలంఖాన్పల్లి సర్కిల్, కృష్ణాపురం సర్కిళ్లలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు కూడా పసుపు జెండాలు కట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహనీయుడికి పసుపుతోరణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నీ అవమానించడంపై అంబేద్కర్ వాదులంతా మండిపడుతున్నారు. కడపలో ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంలో మహనీయులను అవమానపరచడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కడప నగరంలోకి అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ తీరును నిరసిస్తూ నేలపై కూర్చుని మాలమహానాడు నేతలు నిరసన తెలిపారు. మహాత్మగాంధీ, ప్రకాశం పంతులు, సైనిక్ సర్కిల్, అన్నమయ్య విగ్రహం ఇలా అన్నీ విగ్రహాలను పసువుమయం చేశారు. అన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించుకోని అధికారులు.. పైగా మహానాడు సేవలో మునిగి తేలుతుండడం గమనార్హం. ఎవరి పార్టీపై వారికి అభిమానం ఉండటం సహజమే. హద్దులు దాటి పక్కవారిని రెచ్చ గొట్టేలా ప్రయత్నించడం సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యం మహానాడు పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఇలాంటి చర్యలను ఎలా సమర్థ్ధిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక్క వైఎస్సార్ విగ్రహమే కాదు... చివరికి దేశ చిహ్నమైన అశోకచక్రంతో కూడిన వై జంక్ష న్ సర్కిల్ను కూడా పసుపు జెండాలతో కప్పేయడం గమనార్హం. అలాగే మరో అడుగు ముందుకు వేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు మయం చేసేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పచ్చ తోరణాలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అశోక చక్రాన్నీ వదలని ‘తమ్ముళ్లు’ రగిలిపోతున్న అభిమానులు... మాల మహానాడు నేతల నిరసన చోద్యం చూస్తున్న కార్పొరేషన్ యంత్రాంగం -
పిచ్చి కుక్క స్వైరవిహారం
బద్వేలు అర్బన్ : పట్టణంలోని వెంగమాంబ నగర్, సుమిత్రానగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఒకే రోజున ఆయా ప్రాంతాల్లోని ఎనిమిది మందిపై దాడి చేసింది. తొలుత ఇంటి ముందు ఆడుకుంటున్న రోషిణి (11), శబరినిధి(5)లపై దాడి చేసి గాయపరచింది. నరసమ్మ(57), హుస్సేన్బాషా(50), రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతుండగా వారిపైనా విరుచుకుపడింది. వీరితోపాటు శ్రీకాంత్, మహబూబ్నాజర్, పవన్కుమార్రెడ్డిలపై కూడా దాడి చేయడంతో అందతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సిద్దవటం రోడ్డులో పిచ్చికుక్క మరో ఇద్దరిపై కూడా దాడి చేయగా వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని మున్సిపల్ సిబ్బందికి తెలిపినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు.ఒకే రోజున ఎనిమిది మందిపై దాడి -
మహానాడుకు భారీ బందోబస్తు
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27, 28, 29వ తేదీలలో జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బందోబస్తు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, సీఐడీ ఎస్పీ శ్రీధర్, నార్కోటిక్స్ ఎస్పీ పి.నగేష్ పేర్కొన్నారు. సీఎంతో పాటుపలువురు వీఐపీలు, మంత్రులు మహానాడులో పాల్గొనే నేపథ్యంలో సికె దిన్నె పరిధిలోని మహానాడు వేదిక, జయరాజ్ గార్డెనన్ హాల్, మాధవీ కన్వెన్షన్ హాల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ప్రణాళికను వివరిస్తూ సెక్టార్ల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్పరంగా అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్, క్లియరెన్స్ సెక్టార్ల అధికారులకు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఎస్పీ వివరించారు. అనంతరం పబ్బాపురం వేదిక వరకూ కాన్వాయ్ వచ్చే మార్గంలో చేపట్టాల్సిన భద్రతాచర్యలపై కాన్వాయ్ రిహార్సల్స్లో ఎస్పీ పాల్గొ పాల్గొని దిశానిర్దేశం చేశారు.జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
పిల్లల సంరక్షణపై దృష్టి పెడదాం
కడప అర్బన్ : పిల్లల సంరక్షణ, పిల్లల అపహరణ, దోపిడీ లేని ప్రపంచాన్ని చూసేలా దృష్టి పెడుతూ ఐసీఎంఈసీ సంస్థ సేవలందిస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్ఛార్జి చైర్మన్ ఎల్.వెంకటేశ్వరరావు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సి.ఆసిఫాసుల్తానా అన్నారు. తప్పిపోయిన పిల్లల దినోత్సవం సందర్భంగా కడప ప్రభుత్వ బాలుర గృహంలో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, పిల్లల దోపిడీ జరగకుండా చూసేలా 1998లో యునైటెడ్ స్టేట్స్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లయిటెడ్ చిల్డ్రన్న్ (ఐసీఎంఈసీ) సంస్థ ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో పలు సంస్థలు ఈ ఐసీఎంఈసీ పరిధిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఏవైనా సమస్యలుటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్లు ప్రవీణ్కుమార్, రవితేజ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను ఇంటికి తీసుకురావడం. చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2024, తదితర వాటిపై వివరించారు, విద్య విలువైనదని.. క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమలో మెడికల్ ఆఫీసర్ జె.లక్ష్మి, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాజకీయ అరాచకపాలన
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ అరాచక పాలన సాగిస్తోందని, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్రమోదీ తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. రైల్వే కోడూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయులను చంపిన టెర్రరిస్టులను ఎంత మందిని హతమార్చారో ప్రధాని తెలపలేదన్నారు. దేశంలోని అటవీ సంపద కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయడానికి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలన్నారు. అప్పట్లో సీఎం రమేష్ ఈ ప్లాంట్ కోసం నిరాహారదీక్ష చేసినా, ఇప్పటికీ శంకుస్థాపన రాళ్లు వెక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 2న అన్ని మండల కేంద్రాలలో ఆందోళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, పండుగోల మణి, దార్ల రాజశేఖర్, చైతన్య, గంగాధర్ పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య -
చెరువు మట్టితో టీడీపీ నేత వ్యాపారం
ఖాజీపేట : ఎదుటి వారికి చెప్పేందుకే నీతులుంటాయి అన్న మాటలు వారికి వర్తించవేమో.. ఓ వైపు మైదుకూరు, దువ్వూరు చెరువులు, కొండల నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు మట్టి తరలిస్తుంటే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్.. ఖాజీపేట మండలం దుంపలగట్టు చెరువు నుంచి కొన్ని రోజులుగా వందల ట్రాక్టర్లతో టీడీపీ నేత మట్టిని తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు, టీడీపీ వర్గీయులు నివ్వెరపోతున్నారు. కర్నూలు–కడప జాతీయ రహదారి సమీపంలో ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువులో ఇటీవల కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఎన్నికై న ఓ టీడీపీ నేత రాత్రింబవళ్లు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ ఒక్కో గ్రామానికి ఒక్కో రేటు చొప్పున విక్రయిస్తున్నారు. దుంపలగట్టు చెరువు నుంచి రాములపల్లె చెరువులోకి దారి ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైవే రోడ్డు మీదుగా చెన్నూరు, ఖాజీపేట మండలాల్లో అన్ని గ్రామాలకు మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారు. అనుమతులు లేవు.. నిబంధనలు వ్యతిరేకిస్తూ.. దుంపలగట్టు చెరువులో కేసీ కెనాల్ తూముల కంటే తక్కువ లోతుకు చెరువు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు మట్టి మరింత లోతుగా తీస్తే పంట పొలాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈనే పథ్యంలో దుంపలగట్టు చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ టీడీపీ వర్గీయు డు దర్జాగా చెరువు చెరబట్టి త్రవ్వకాలు జరుపుతూ మట్టిని అమ్ముకోవడం శోచనీయం. టీడీపీ ప్రభు త్వం ఏర్పాటైన ఏడాదిలో కడప నగర సమీపంలో మహానాడు నిర్వహించేందుకు ఓ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు కడప–కర్నూలు జాతీయ రహ దారి వెంటే వెళ్తున్నారు. ఈ దారి పక్కనే దుంపలగట్టు చెరువు నుంచి టీడీపీ వర్గీయులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టితరలిస్తున్నా పట్టించుకోకపోడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ మట్టి త్రవ్వకంపై ఆర్డీఓ, తహసీల్దారు, కేసీ కెనాల్ అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిప్రతినిధులు, అధికారులు స్పందించి దుంపలగట్టు చెరువులోని మట్టి అక్రమ రవాణపై చర్యలు తీసు కుని చెరువును కాపాడాలని కోరుకుంటున్నారు. దుంపలగట్టు చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు ఫిర్యాదు అందినా పట్టించుకోని రెవెన్యూ, కేసీ కెనాల్ అధికారులు ఈ దారి నుంచే మహానాడు ప్రాంగణానికి టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు -
గుజిరీ దుకాణంలో గంజాయి
మదనపల్లె రూరల్ : పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. చాపకింద నీరులా మత్తు విస్తరిస్తోంది. పట్టణ శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుని మత్తులో జోగుతున్నారు. ఈఎస్టీఎఫ్ సీఐ వి.యల్లయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ బీఎంపీపీ సీఐ సత్యశ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. నక్కలదిన్నె తండా సమీపంలోని పాత సామాన్లు, స్క్రాప్ విక్రయించే గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్, బీఎంపీపీ, రాయచోటి ఈఎస్టీఎఫ్ సీఐ, సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారని తెలిపారు. పొన్నేటిపాళెంకు వెళ్లే దారిలోని గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకుని 2.100 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోషే అలియాస్ బన్ను పారిపోగా, ఎస్.మహమ్మద్బాషా (22), సయ్యద్సద్దాం (35), బి.దినకర్ (21), పి.సాయిప్రసాద్ (25)లను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగిస్తున్న హోండా డియో టూవీలర్ను సీజ్ చేశామన్నారు. ఆస్పత్రిలో పారిపోయే ప్రయత్నం గంజాయి అమ్ముతుండగా పట్టుకున్న నిందితులను రిమాండ్కు పంపే ముందు వైద్య పరీక్షల కోసం ఎక్సై జ్ సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. నిందితులను పరీక్షిస్తుండగా గంజాయి మత్తులో ఉన్న పల్లపోలు సాయిప్రసాద్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వేగంగా పరిగెత్తగా, అప్రమత్తమైన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. మత్తులో ఉన్న సాయి ప్రసాద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, మత్తులో తూలడం కనిపించింది.ఐదుగురి అరెస్టు, 2.100 గ్రాముల స్వాధీనం -
అశ్రునయనాల నడుమ ప్రమాద మృతులకు అంత్యక్రియులు
బద్వేలు అర్బన్/బి.కోడూరు : గువ్వల చెరువు ఘాట్రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చింతపుత్తాయపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, శిరీషల అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల నడుమ ముగిశాయి. బంధువులు, స్నేహితులు కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉంటే బి.కోడూరు మండలంలోని గంగిరెడ్డిపల్లె సాయిహర్షిణి, రుషికేశవరెడ్డిల మృతదేహాలకు భారీ జనసందోహంతో కన్నీటి వీడ్కోలు పలికారు. పిల్లలను కడసారి చూసేందుకు తల్లిదండ్రులైన జర్మనీ నుండి వచ్చిన తిరుపతిరెడ్డి, కడసారి చూపు కోసం ఆసుపత్రి నుండి అంబులెన్స్లో తీసుకువచ్చిన శశికళలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ బూత్కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, వీరనారాయణరెడ్డి, బి.కోడూరు మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డిలు మృతదేహాలకు నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరి వెంట చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీనరసారెడ్డి, జయరామిరెడ్డి, పోలిరెడ్డి, యోగానందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వర్షాలు కురుస్తున్నాయి.. విష సర్పాలతో జరభద్రం
రాజంపేట టౌన్ : ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తుగానే వచ్చేశాయి. వాతావరణం చల్లబడడమేగాక వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా వుంటే ఇన్ని రోజులు ఎండ వేడిమికి కటవల్లో, చెట్ల నీడన దాగిన విష సర్పాలు ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో పొదల్లోకి వచ్చి చేరుతాయి. అలా బయటకు వచ్చిన విష సర్పాలు రైతులను, ప్రజలను కాటేసే ప్రమాదం ఉంటుంది. సాధారణ సర్పాలైతే పెద్దగా ప్రాణాపాయం ఉండదు. అదే విష సర్పాలు కాటేస్తే వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందే. లేకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. వర్షాకాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విష ప్రభావం ఉన్న పాములివే కట్లపాము, నాగుపాము, రక్తపింజరి, జెర్రిపోతు వంటి పాముల్లో విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వైద్యుడిని సంప్రదించి వైద్యం చేయించు కోకుంటే మనిషి ప్రాణాపాయస్థితికి చేరుకుంటాడు. అలాగే నాగుపాము కాటేసిన పదిహేను నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతుంది. ఇక రక్తపింజరి కాటేసిన రెండు గంటల్లో విషం శరీరంలోకి చేరుతుంది. జెర్రిపోతు కాటేసిన పెద్ద ప్రమాదం ఉండదు. అయినా చికిత్స చేయించుకోవాలి. పాముకాటును బట్టి వైద్యం పాముకాటును బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్దారణ అవుతుంది. కాటులో రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగ పండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. ఈ లక్షణాలను బట్టి వైద్యులు కాటేసింది విషపు పామా కాదా అని నిర్ధారిస్తారు. కొంతమంది పాము కాటువేయగానే ఆ ప్రాంతాన్ని కోస్తే రక్తంతోపాటు విషం బయటకు వస్తుందని కత్తి, బ్లేడు వంటి వాటితో గాటు పెడతారు. అలా ఏమాత్రం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకొక్కమారు పాముకాటుకంటే కోసిన గాయం ప్రమాదకరంగా మారవచ్చు. పాము, తేలు కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎలాంటి లక్షణాలుంటాయి ● పాము కాటువేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. ● విషం క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షికంగా పక్షపాతం రావచ్చు. ● నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు ఉంటుంది. ● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు పంట పొలాల వద్దకు వెళ్లే సమయంలో, పొలాల గట్టుమీద నడుచుకుంటూ వెళ్లేటపుడు కర్రచప్పుడు చేస్తూ నడవడం మంచిది. పొలాలకు వెళ్లే రైతులు టార్చిలైటు వేసుకుంటూ వెళ్లాలి. ధాన్యం బస్తాలు నిల్వ వుండే చోట, గడ్డివాములు ఉండే ప్రాంతంలో ఎలుకలు, కప్పలు తిరుగుతుంటాయి. అందువల్ల పాము తినేందుకు ఆ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో పాదరక్షలు విధిగా వేసుకువెళ్లాలి.మంచి మందులు ఉన్నాయి పాముకాటుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మందులున్నాయి. ఆ వ్యక్తికి ఏఆర్వీ, యాంటి స్నేక్ వీణం మందులతో వైద్యం అందిస్తాం. ఎవరికై నా పాము కరిస్తే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. కొంతమంది పాముకాటు గురైన వెంటనే నాటుమందు, ఆకుపసురుతో వైద్యం చేసుకొని సరిపెడతారు. ఇలా చేస్తే ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరిండెంట్, రాజంపేట -
మున్సిపాల్టీలో పన్నులు వసూలు చేయండి
కడప ఎడ్యుకేషన్ : మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో మున్సిపల్ అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. సమీక్షా సమావేశం ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వార్డుకు క్లస్టర్ స్థాయి పన్నుల జాబితా రూపొందించాలన్నారు. వాటర్ టాక్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రేడ్ లైసెన్స్, షాప్ రెంట్లు, బిల్డింగ్ ఛార్జీల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. బద్వేల్, కమలాపురం అండర్ అసెస్మెంట్లపై సర్వే చేయించాలన్నారు. టౌన్ ప్లానింగ్లో ఆన్లైన్ విధానాన్ని రెండు నెలల్లో అమలు చేస్తామన్నారు. కడప నగరంలో 387 షార్ట్ ఫాల్స్ సమస్యలపై టౌన్ ప్లానింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రూ.125 కోట్లతో నూతన స్లీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అతిథిసింగ్, పబ్లిక్ అండ్ హెల్త్ సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ విశ్వనాథ్, టౌన్ ప్లానింగ్ రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్, రాకేష్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ -
● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన
● కాపు నేతల్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ ● ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్కు అప్రాధాన్యత ● మినీ మహానాడు కార్యక్రమానికి దూరంగా ఆ ముగ్గురు ● ఎన్నికల్లో ముందు పెట్టుకొని, ఆపై పక్కన పెట్టిన స్థానిక నేతలు ● రాష్ట్ర మహానాడుకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయం! సాక్షి ప్రతినిధి, కడప: ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్లుగా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో.. స్థానిక టీడీపీ నేతలు యూజ్ అండ్ త్రో పాలసీ అందిపుచ్చుకున్నారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో కాపు(బలిజ) సామాజిక వర్గ నేతల్ని క్రమేపీ దూరం చేశారు. ‘ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామ’ని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత విస్మరించారు. అలాంటి బాధితుల్లో ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్బాబు ప్రధానంగా నిలుస్తున్నారని విశ్లేకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే.. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే అభద్రతా భావంతో.. ఎన్నికల్లో వాడుకున్న అనేక మందిని తర్వాత వదిలేశారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. సీనియన్ నేత అయినందు వల్ల.. ఎన్నికల్లో ఆయన బలాన్ని బాగా వాడుకున్నారు. తర్వాత విస్మరిస్తూ వచ్చారు. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా రామచంద్రయ్య చర్యలు ఉండిపోయాయి. ఇంటి వద్దనే ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమాలు చేపడుతూ.. తాను కూడా ఉన్నానని హెచ్చరికలు పంపే చర్యలకు పాల్పడినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సుగవాసి కుటుంబానిదీ అదే పరిస్థితి.. రాయచోటి పాలకొండ రాయుడు పేరు తెలియని రాజకీయ నేత.. రాష్ట్రంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లలో ఆయన రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా గెలుపొందారు. మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య ప్రత్యక్ష యుద్ధం నడిచేది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేసినా.. సుగవాసి పాలకొండరాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పని చేసింది. ఎన్నికల తర్వాత సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్బాబులను ఆ పార్టీ దూరంగా పెట్టింది. రాజంపేట అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచిన సుగవాసి బాలసుబ్రమణ్యానికి కనీసం ఇన్చార్జి పదవి కూడా అప్పగించలేదు. మరోవైపు పాలకొండరాయుడు మృతి చెందితే.. సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ పరిశీలిస్తే కాపులను జిల్లాలో వ్యూహాత్మకంగా దూరంగా పెడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బత్యాల.. ఎక్కడ?రైల్వేకోడూరులో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఇటీవల కాలంలో రాజకీయంగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లల్లో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు ఆయనకు ప్రాధాన్యత లభించింది. తర్వాత రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ పాల్పడుతోంది. గతంలో విశ్వనాథనాయుడుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి దెబ్బ కొట్టగా, తాజాగా ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. కనీసం రైల్వేకోడూరులోనూ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ రామచంద్రయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం మినీ మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. అందుబాటులో ఉండి కూడా.. టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో చొరవ లేకపోవడంతో హాజరు కాలేదని తెలుస్తోంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉండిపోవాలని ఆయా నేతల అనుచరులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆ మగ్గురు మహానాడు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
విజయవంతానికి చర్యలు తీసుకోవాలి
నేతలకు మంత్రుల దిశానిర్దేశంకడప రూరల్: మహానాడు విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తెలిపారు. కడప నగర శివారులోని మహానాడు ప్రాంగణంలో జరుగుతున్న సన్నాహాక కార్యక్రమాలను వారు పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. భద్రత, వసతి, వేదికలు, రవాణాతోపాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిశీలకులు పత్తిపాటి కుసుమకుమారి, నిమ్మల రామానాయుడు, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలు పాల్గొన్నారు. -
ఆర్ఎస్కేల కోత.. రైతుకు వెత
●మూతపడినట్లే.. వైఎస్సార్ జిల్లాలో 81, అన్నమయ్య జిల్లాలో 66 కేంద్రాలు రేషనలైజేషన్ పేరుతో మూతపడనున్నాయి. వీటికి కొన్ని భవనాలు ఉండగా, మరి కొన్ని భవనాలు లేకపోవడం, మరి కొన్ని చోట్ల భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 147 రైతు భరోసా కేంద్రాలు మూతపడనున్నాయి. దీంతో ఆ గ్రామాల్లో రైతులకు ఇక మీదట స్థానికంగా సేవలు అందవు. కడప అగ్రికల్చర్: దేశానికే రోల్ మోడల్గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు నేడు కనుమరుగవుతున్నాయి. ఉన్న ఊరిలోనే రైతులకు అన్ని రకాల సేవలను అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పంట సాగుకు అవసరమైన అన్ని రకాల సేవలు అందేవి. దిగుబడికి గిట్టుబాటు ధర కూడా కల్పించి అండగా నిలిచేవి. దీంతో రైతులు నిశ్చింతగా వ్యవసాయం చేసుకునే వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చారు. వీటి నుంచి ఎలాంటి సేవలు అందించక పోవడంతో నిస్సహాయ కేంద్రాలుగా మారాయి. రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతు సేవా కేంద్రాలను కుదించేస్తోంది. ఉన్న సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తున్నారు. ఇక మీదట ఖాళీ పోస్టుల భర్తీ కాక పోగా.. ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడంతో కర్షకులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో .. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 629 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ జిల్లాలో 423, అన్నమయ్య జిల్లాలో 206 ఉన్నాయి. వీటిలో 629 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది ఉండే వారు. ఇందులో కొందరు పదోన్నతులపై వెళ్లగా, మరి కొంత మంది ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం 305 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, 177 మంది హార్టికల్చర్ అసిస్టెంట్లు, ఒకరు విలేజ్ సెరికల్చర్ అసిసెంట్ ఉన్నారు. మిగిలిన 146 పోస్టులు భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 1257 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఏ.. వైఎస్సార్ జిల్లాలో 1257 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఏ, అన్నమయ్య జిల్లాలో 750 ఎకరాలకు ఒక వీఏఏ, వీహెచ్ఓ ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు కసరత్తు దాదాపు పూర్తి చేశాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఎంపీఈవోలను కేటాయిస్తారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావుతో మాట్లాడగా.. ఆర్ఎస్కేలలో రేషనలైజేషన్ పూర్తయిందని, ఉమ్మడి జిల్లాలో 482 ఆర్బీకేలను గుర్తించామని తెలిపారు. అయితే రైతుల సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆర్ఎస్కేలలో పోస్టులు తగ్గి నా ఎంపీఈవోలతో ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి సేవలు అందడం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నా.. లేనట్లుగానే అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే రైతలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా పథకాలను మార్చడం, సేవలను నిర్వీర్యం చేయడం సబబు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకే సేవలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. – సంబటూరు ప్రసాద్రెడ్డి, రాష్ట్ర ఉద్యాన మాజీ సలహాదారు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి రైతు భరోసా కేంద్రాల సేవల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల సేవలందించే.. రైతు భరోసా కేంద్రాల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. దీంతోపాటు రేషనలైజేషన్ను కూడా ఆపాలి. అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల సేవాలను యథావిఽధిగా కొనసాగించాలి. – దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్బీకేల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు ఉంటారు. ● రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ ● సర్టిఫైడ్ హామీతో కూడిన ఇన్పుట్ల సరఫరా ● ఈ క్రాపు బుకింగ్కు రైతు డేటాబేస్ అప్లోడ్ చేయడం ● పంట సాగుదారుల హక్కు ధ్రువీకరణ పత్రం జారీ, విత్తన సేకరణ కార్యకలాపాలు ● పీఎం కిసాన్, వైఎస్సార్ ఆర్బీ, వైఎస్సార్ సున్నా వంటి పంట రుణాల కోసం డేటా అప్లోడ్ చేయడం ● విత్తనాలు, ఎరువులు, పురుగు నివారణ మందులు, పశువుల దాణా మొదలైనవి ముందుగా పరీక్షించి సరఫరా ● వివిధ పథకాల కింద లబ్ధిదారుల సామాజిక తనిఖీ, అంటే ప్రకృతి వైపరీత్యాలు, సబ్సిడీ విత్తనాలు మొదలైనవి. ● డిజిటల్ లైబ్రరీ ద్వారా తెగుళ్లు, వ్యాధులపై అవగాహన కల్పించడం ● పొలంబడి, సీడ్ విలేజ్ పోగ్రాం, మినికిట్ ట్రయల్ ప్లాట్లు మొదలైన ప్లాగ్షిప్ ప్రోగ్రామ్ల నిర్వహణ ● విత్తన పరీక్ష (భౌతిక స్వచ్ఛత, ఆకురోత్పత్తి పరీక్ష) ● రైతుల సామర్థ్యం పెంపు, ఉత్తమ నిర్వహణ పద్ధతుల వ్యాప్తి, పొలంబడి, పద్ధతి ప్రదర్శనలు మొదలైనవి. ● స్మార్ట్ టీవీ(డిజిటల్ సిగ్నేజ్) క్రాపు నిపుణులచే సాంకేతిక సెషన్ల చిరునామాను ప్రత్యక్ష ప్రసారం చేయడం ● స్ప్రేయర్స్ వంటి చిన్న వ్యవసాయ పరికరాలు అద్దెకు తీసుకోవడం ● బీజామృతం మొదలైన సహజ, ఉత్పత్తులపై ప్రదర్శనలు నిర్వహించడం ● అన్ని ప్రభుత్వ పథకాలకు సేవా కేంద్రం ● రైతుల డేటాబేస్, నేల ప్రొఫైల్ను నిర్వహించడం ● జంతు ఆరోగ్యకార్డుల జారీ ● ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జంతువుల ప్రథమ చికిత్స ● ఇ– క్రాపు బుకింగ్ ద్వారా పశుగ్రాసం అవసరాన్ని లెక్కించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ● ఇక మీదట ఈ సేవలు ఆర్ఎస్ఎస్కేలు లేని ఊర్లలో స్థానికంగా అందవు. దీంతో రైతులకు కష్టాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆర్బీకేల ద్వారా గతంలో అందించే సేవలు రేషనలైజేషన్ పేరుతో కుదింపు రైతు సేవా కేంద్రాల తగ్గింపు కొన్ని ఊర్లలో మూతపడుతున్న వైనం సిబ్బంది సర్దుబాటు ఇక రిక్రూట్మెంట్ లేనట్లే -
టీడీపీలో ఫ్లెక్సీల రగడ
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే కడపలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కొందర్ని సాగనంపాలనే యోచనలో వ్యూహాత్మకంగా ఓ వర్గం అడుగులు వేయగా, అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ వైరిపక్షం ప్రశ్నలను సంధించింది. బాధ్యులు స్పందించకపోగా, కేడర్ను ఉసిగొల్పారు. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఫ్లెక్సీల రగడ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఊటుకూరు బ్రిడ్జి నుంచి రింగు రోడ్డు వెంట పెట్టిన ఫ్లెక్సీలను ఏకంగా కోసేశారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ముందుగా ఎవరు ఆక్రమిస్తే.. మహానాడు సందర్భంగా కడప నగరం పసుపు మయమైంది. నగరంలో భారీ స్థాయిలో పసుపు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. కార్పొరేషన్కు పైసా చెల్లించకుండానే వీటిని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎవరు జాగా ఆక్రమిస్తే.. వారిదే ఫ్లెక్సీ అన్నట్లుగా నేతలు ఉండిపోయారు. ఈక్రమంలో ఎయిర్పోర్టు నుంచి రింగురోడ్డు వెంట కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలే ఉండిపోయాయి. ఇతర నియోజకవర్గాల నేతలకు ఆస్కారం లేకుండా ఏర్పాటు చేశారు. కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా.. ఆ దంపతుల ఫ్లెక్సీలే వెలిశాయి. కాగా ఆదివారం ఉదయానికి ఎమ్మెల్యే మాధవీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలు ఏకంగా కోతకు గురయ్యాయి. ●వర్గ విభేదాలేనా... ఫ్లెక్సీల ఆధిపత్యమా? నగర తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నాయి. అలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నుంచి దూరం చేసేందుకు చర్యలన్నీ పూర్తి అయ్యాయి. అదే స్థాయిలో కార్పొరేటర్ ఉమాదేవితో సహా.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి చర్యలపై తీవ్రస్థాయిలో వారు కూడా ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల ధ్వంసరచన వారిపైకి నెట్టేందుకు ఎవరైనా చేశారా? అనే అనుమానాలు లేకపోలేదు. మరోవైపు కడపతోపాటు కమలాపురం పరిధిలో కూడా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీల ఆధిపత్యం ప్రదర్శించారు. అక్కడి తెలుగుతమ్ముళ్లకు ఆగ్రహం వచ్చి.. ప్రత్యక్ష చర్యలకు పాల్పడ్డరాని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదనడానికి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడి ఫ్లెక్సీల ధ్వంసం నిదర్శనంగా నిలుస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీలు ధ్వంసం ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు మరొకరికి అవకాశం లేకుండా ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణ కార్పొరేషన్కు పైసా చెల్లించకుండానే.. -
సెపక్ తక్రా పోటీలలో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : కేంద్ర పాలిత ప్రాంతమైన డ్యూ లో మే 18 నుంచి జరుగుతున్న ఖేలో ఇండియా సెపక్ తక్రా పోటీలలో వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన పాపన నాగహారికరెడ్డి ప్రతిభను చాటింది. మహిళా సెపక్ తక్రా డబుల్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బాలికలు ప్రత్యర్థులపై వరసగా విజయాలు సాధించి కాంస్య పతకాన్ని సాధించారని సెపక్ తక్రా రాష్ట్ర సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు తెలిపారు.పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యచాపాడు : మండలంలోని ద్వారకానగరం గ్రామానికి చెందిన చింతకుంట దస్తగిరి (33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దస్తగిరి గత కొన్ని రోజులుగా అప్పుల బాధతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని విజయ్కుమార్ సర్కిల్ సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్పృహ కోల్పోయి కింద పడిపోయిన అతను కొద్ది సేపటి తర్వాత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అతను సమీపంలోని దుకాణాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం గడిపేవాడని చెప్పారు. త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాల కోసం స్థానికులను విచారించినా వ్యక్తిగత వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే త్రీ టౌన్ పోలీసులను సంప్రదించాలని సీఐ గోవిందరెడ్డి కోరారు. -
భవిష్యత్తుకు విద్య పునాది లాంటిది
వేంపల్లె : విద్య అనేది భవిష్యత్తుకు పునాది లాంటిదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నా రు. శనివారం స్థానిక మధురెడ్డి కల్యాణ మండపంలో సంసిద్ద్ సతీష్ రెడ్డి పాఠశాలలో టాటా క్లాస్ ఎడ్జ్ ఇంఫ్రింట్స్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నూతన కోర్సుల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప ఎంపీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కోర్సులను ప్రారభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు నచ్చిన విధంగా ప్రోత్సహిస్తే గొప్పవారవుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో సంసిద్ద్ సతీష్ రెడ్డి పేరుతో పాఠశాలను నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యత గల విద్యనందించేందుకు పాఠశాల సిబ్బంది కృషి చేయాలని సంసిద్ద్ సతీష్ రెడ్డి పాఠశాల ఫౌండర్ సతీష్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సంసిద్ద్ పాఠశాల గ్రూపు చైర్మన్ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, సంసిద్ద్ పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ అంజద్బాషా, తుషార్ నాగిరెడ్డి, రోహన్ నాగిరెడ్డి, ప్రిన్సిపల్ పరిమళ, చైతన్యలతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
పంట ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా..!
మైదుకూరు : పంట ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా ఈనెల 29 నుంచి 15 రోజుల పాటు దేశంలోని 700కుపైగా జిల్లాల్లో కృషి సంకల్ప అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్యక్రమాలను నిర్వహించనుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ఆధ్వర్యంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమ లక్ష్యం ప్రధానంగా పంట ఉత్పత్తులను పెంచడమే. గతంలో దేశంలోని ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు లేక ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి మారి ఇప్పుడు దేశ ప్రజల అవసరాలు తీరి మనమే ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్నాం. అయితే పంట ఉత్పత్తులను మరింత పెంచడం ద్వారా ప్రజలకు మరింత పౌష్టికాహారాన్ని అందించాలన్నదే కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను అందించడం, పంటల సాగులో ఆధునిక పద్ధతులను సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించనున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.. పంట దిగుబడులను పెంచడమే కాక రైతు విచక్షణారహితంగా పంటల సాగులో పురుగు మందులను వినియోగించకుండా చూడటం కూడా ఈ కార్యక్రమాల లక్ష్యం. ఇందు కోసం రైతుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా అవగాహన కల్పించడం చేస్తారు. సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని సూచిస్తారు. తద్వారా ప్రమాద రహిత ఆహారాన్ని అందరికి అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు.. ‘‘ప్రయోగశాల నుంచి భూమికి’’ అనే నినాదంతో కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, కొత్త రకాలు, ప్రభుత్వ పథకాలు, సాంతికేక పరిజ్ఞానం, పంటల వైవిధ్యం అంశాలుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడతారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఖరీఫ్లో సాగు చేసే పంటల ఉత్పత్తులను పెంచడం, పెట్టుబడులను తగ్గించడంపై అవగాహన కల్పిస్తారు. రైతుల జీవనోపాధిపై భరోసా కల్పించడం, లాభసాటి వ్యాపార సరళిలో వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు వ్యవసాయంపై మక్కువ కలుగజేయడమే కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం. 29 నుంచి కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు శాస్త్రవేత్తలు, అధికారుల బృందాలతో వ్యవసాయంపై అవగాహన -
మహానాడును విజయవంతం చేయాలి
కడప రూరల్ : కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడును జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. శనివారం ఆ పార్టీకి చెందిన నేతలు మహానాడు ప్రాంగణంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి రెండు రోజులు 23 వేల మంది ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. చివరి రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామని, పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు అనగాని సత్యప్రసాద్, సంధ్యారాణి, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులురెడ్డి, బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు. కరోనా లేదు ఏమీ లేదు కరోనా లేదు ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో మీడియా ప్రతినిధులు కరోనా ఉన్న సమయంలో మహానాడును నిర్వహించవచ్చా అని ప్రశ్నించారు. దీనికి శ్రీనివాసులురెడ్డి స్పందించారు. మహానాడును చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు కరోనాను సాకుగా చూపిస్తున్నారని తెలిపారు. కరోనా లేదు ఏమీ లేదని తెలిపారు. మహానాడును విజయవంతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
మద్యం మత్తులో దాడి
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీవద్ద ఉన్న మద్యం దుకాణం వద్ద మద్యం తాగే సమయంలో అరవింద్, రవితేజ అనే యువకుల మధ్య శనివారం మాటామాటా పెరిగింది. మద్యం మత్తులో ఉన్న రవితేజ అరవింద్పై బాటిల్ పగులగొట్టి దాడి చేశాడు. ఈ దాడిలో అరవింద్కు గొంతు వద్ద తీవ్ర గాయమైంది. దీంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణతంబళ్లపల్లె : స్థానిక టీఎన్.వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ హబ్ సెంటర్ ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, కో ఆర్డినేటర్ చౌడయ్య తెలిపారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారని, 15 సంవత్సరాలకు పైబడి 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 29వ తేదీ లోపు ఐటీఐ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9618655759లో సంప్రదించాలన్నారు. -
కరోనా విజృంభిస్తుంటే మహానాడా?
కడప సెవెన్రోడ్స్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈనెల 27 నుంచి 29 వరకు కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని తక్షణమే వాయిదా వేసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, నగర మేయర్ సురేష్బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ దేశంలో 4097 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని, ప్రభుత్వం మాత్రం 265 కేసులు వచ్చాయని చెబుతోందన్నారు. ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. ఇది కొత్త వేరియంట్ కావడంతో పరిస్థితి క్రిటికల్గా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో లక్షలాది మందిని తరలించి మహానాడు నిర్వహిస్తే కరోనా కొన్ని కోట్ల మందికి చేరే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే టీడీపీకి లెక్కలేదన్నారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది, ఎన్నికల సభలో 8 మంది, గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సమయంలో ముగ్గురు మృతి చెందారని వివరించారు. టీడీపీకి ప్రజల పట్ల బాధ్యత ఉంటే మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ముసుగులో మహానాడు ఏర్పాట్లన్నీ అధికారులే చేస్తున్నారని విమర్శించారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రజలకు ఏం చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఏం ఘనకార్యం చేశారని మహానాడు నిర్వహిస్తున్నారని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 146 హామీలలో పెన్షన్లు తప్ప మిగతా ఏవీ అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. దేశంలో కరోనా వ్యాపిస్తోందని, కడపలో ఇప్పటికే 2 కేసులు నమోదైనట్లు రిమ్స్ సూపరింటెండెంట్ ధ్రువీకరించారన్నారు. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం వాటినే తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మహానాడు వాయిదా వేసుకోవాలని కోరారు. జేసీకి వైఎస్సార్సీపీ నేతల వినతి దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని, ఇప్పటికే పలుచోట్ల మరణాలు సంభవించాయని, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా తదితరులు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై తమ రాష్ట్ర పార్టీ గవర్నర్కు కూడా ఫిర్యాదు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్కుమార్, కార్పొరేటర్ షఫీ, సీహెచ్ వినోద్కుమార్, శ్రీరంజన్రెడ్డి, పాకా సురేష్, దాసరి శివప్రసాద్, యానాదయ్య, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలు మీరే ఉల్లంఘిస్తే ఎలా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసుకోండి వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్బాబు -
బంగారం దుకాణంలో చోరీ కేసు:ముగ్గురి అరెస్టు
ఖాజీపేట : ఖాజీపేటలో బంగారం దుకాణంలో జరిగిన చోరీ సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. శనివారం ఖాజీపేటలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ మోహన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఖాజీపేట టౌన్లోని వీఎస్ జ్యువెలరీ దుకాణంలో ఏప్రిల్ 12న అర్థరాత్రి సమయంలో దొంగలు చోరీ చేసి వెండి ఆభరణాలతో పాటు, బంగారం చోరీ చేశారు. ఈ కేసును ఖాజీపేట సీఐ మోహన్ ఛాలెంజ్గా తీసుకుని ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాల్లో జరిగిన చోరీ రికార్డులను పరిశీలించారు. అందులో ఒక బొలెరో సిటీ పికప్ వాహనం లో చోరీ చేసిన దొంగలు పరారైనట్లు నిర్ధారించారు. ఈ ఫుటేజ్లోని వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనం ఆధారంగా దొంగలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారినిగా తేల్చారు. ఆరుగురు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ముగ్గురు అరెస్టు.. మరో ముగ్గురి కోసం గాలింపు పోలీసులకు అందిన సమాచారం మేరకు చెన్నూరు మండలం ఇర్కాన్ సర్కిల్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని ఖాజీపేట సీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరిలో యర్రగొల్ల బసవరాజు, సంజీవ అలియాస్ కొవ్వూరు సంజీవప్ప, ఎల్లప్పగా గుర్తించారు. వీరితోపాటు శంకరప్ప, మారుతి, బసవమోడేకర్లు చోరీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. ఖాజీపేటలోని వీఎస్ బంగారం దుకాణంతోపాటు చెన్నూరు, కమలాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంగారం, వెండి రికవరీ.. చోరీకి పాల్పడిన వారి నుంచి బంగారం, వెండిని పోలీసులు రికవరీ చేశారు. అందులో 100 గ్రాముల కుంకుమ భరిణ, 232 గ్రాముల 15 వెండి దీపాలు, 500 గ్రాముల 3 వెండి ప్లేట్లు, 293 గ్రాముల వెండి మెట్టెలు, 400 గ్రాముల వెండి గజ్జలు, 3.860 గ్రాముల బంగారు కమ్మలు, 2.430 గ్రాముల బంగారు ఉంగరం, 4.820 గ్రాముల బంగారం కమ్మలు దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదన కోసమే.. చోరీ కేసులోని ఆరుగురు నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై, సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో చోరీలకు పాల్పడేవారు. ఒక బొలెరో సిటీ పికప్ వాహనం ద్వారా పందులను దొంగతనం చేసేవారు. అలాగే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చారు. మొదట చోరీ చేయాలన్న ప్రదేశంలో రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇళ్లు, దుకాణాలను గుర్తించేవారు. తరువాత ఆ దుకాణాలు, ఇళ్లలో చోరీ చేసేవారు. బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ