breaking news
YSR
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని పోస్టు చేశారు. Heartfelt congratulations to the Indian Space Research Organisation and its dedicated team on the successful #LVM3M6 / BlueBird Block-2 mission. Placing the satellite into its intended orbit is a proud moment for India and a testament to our scientific excellence. A Salute to the…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2025 -
రాబోయే రోజులు మనవే
సాక్షి కడప ప్రతినిధి/పులివెందుల: రాబోయే రోజులు మనవేనని, ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి కష్టం విని.. నేనున్నానని ధైర్యం చెప్పి ఊరడించారు. మంగళవారం ఆయన తన సొంత నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్టీఏ నూతన డైరీ, క్యాలెండర్లను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సు«ధ, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగించి గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే పేరు కలిసేలా జి రామ్ జి అని చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్సీపీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలను, గ్రామీణ ఉపాధి కూలీలను పస్తులు ఉంచేలా, వలసలు వెళ్లేలా కేంద్రం చూస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంపన్నులకు వెట్టి చాకిరీ చేసేందుకు మనుషులను సిద్ధం చేసే పనిలో భాగమే ఉపాధి హామీ తొలగింపు అన్నారు. బీజేపీ సంపన్నుల పక్షమే అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. మోడీకి అత్యంత ప్రియమైన వారు ఇద్దరు అయితే పూర్తిగా నచ్చని వారు ఇద్దరు ఉన్నారని, ఒకరు రైతులు, మరొకరు వ్యవసాయ కూలీలు అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టం మార్పుపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మగ్బుల్ బాషా, సిద్ధిరామయ్య, ఆంజనేయులు, అనంతపురం జిల్లా కార్యదర్శి అక్బర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణ, హక్కుల సాధనకు తోడ్పడాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లలు, మహిళల రక్షణతోపా టు వారి హక్కుల సాధనకు మహిళా పోలీసులు పా టుపడాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో బాలలకు ఉన్న చట్టాలు, మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి మహిళా పోలీసులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమాదేవి మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ సచివాలయ పరిధిలోని మహిళలు, పిల్లలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వాటిని నివృత్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శోభారాణి మహిళా పోలీసులు విధి నిర్వహణలో పాటించాల్సిన మెలకువలు, పిల్లల పట్ల వ్యవహరించాల్సిన వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో మహహిళా పోలీసులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ మిషన్ శక్తి సిబ్బంది పాల్గొన్నారు. నైపుణ్య ఆధారిత విద్యను అమలు చేయాలి కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధికి భరోసా ఇచ్చేలా నైపుణ్య ఆధారిత విద్య అమలు చేయాల్సి ఉందని ఆ దిశగా సిలబస్ రూపకల్పన జరగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. రెండు జిల్లాల డిగ్రీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీ ఓఎస్) చైర్మన్లతో మంగళవారం తన ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలిత ఆధారిత విద్యను అమలు చేయాల్సి ఉందన్నారు. డిగ్రీ కోర్సులలో ప్రస్తుత సమాజ అవసరాలను తీర్చే నాణ్యమైన సిలబస్ తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సిలబస్ తో పాటు, ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనంలో సరికొత్త మార్పులు అవసరమన్నారు. ఈ సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు, వివిధ డిగ్రీ సబ్జెక్టుల బీఓఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలకు 41ఏ నోటీసులు
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలను చేపడుతోంది. ఇందుకోసం పోలీసు అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులను బనాయించి తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కడపలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్టాండ్ సమీపంలో నవంబర్ 25వ తేదీన యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం క్రైమ్ నంబర్: 281/2025 కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసే ముందు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి.పుష్పరాజు, కానిస్టేబుల్ రాముడు నాయక్ల దగ్గర స్పెషల్ రిపోర్టు ద్వారా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు కడప కార్పొరేషన్ 25వ డివిజన్ ఇన్చార్జి షేక్ షఫీ, 21వ డివిజన్ ఇన్చార్జి శ్రీరంజన్ రెడ్డి, 23వ డివిజన్ ఇన్చార్జి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ ఐస్ క్రీం రవి, మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య, సీనియర్ లీడర్ జయచంద్రారెడ్డి, యువజన నాయకుడు గుంటి నాగేంద్ర, శంకరాపురానికి చెందిన సింధు, ఇంకా కొంత మందిపై అక్రమ కేసు బనాయించారు. మంగళవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలను పిలిపించి కడప వన్ టౌన్ పోలీసులు 41 ఏ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొందరు కడప పాత బస్టాండ్ సమీపంలో ఉన్న యాదాళ్ల నాగమ్మ సత్రంలో అక్రమ కట్టడాలను నిర్మిస్తుండగా తాము అడ్డుకునే ప్రయత్నం చేశామన్నారు. అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం అప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన తమపై అనుమతులు తీసుకోలేదనే నెపంతో అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలుగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో టీడీపీ నాయకుల అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నందుకు కక్ష సాధింపు -
అంబా అని అరిచినా...
పశు పోషకుల ఇంటి ముంగిటే మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సేవలు సైతం అంతంత మాత్రంగానే అందుతున్నాయని.. సంచార వాహనం ఒక ఊరికే పరిమితం చేస్తున్నారని పలువురు పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలకించరేమయ్యా..!కడప అగ్రికల్చర్: మూగజీవాల సంరక్షణ చర్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. పశు వైద్యశాలకు మందుల సరఫరాను పూర్తిగా అటకెక్కించింది. ఫలితంగా మందుల కోసం పశు యజమానులు ప్రైవేటు షాపులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జీవాల చెంతకే వచ్చి వైద్య సేవలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. దీంతో మూగ జీవాల వేదన అరణ్య రోదనగా మారింది. జిల్లావ్యాప్తంగా... జిల్లావ్యాప్తంగా 79 గ్రామీణ పశు వైద్యశాలలు, 78 పశు వైద్యశాలలు , 17 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు, ఎనుములు కలిసి 4,44,460 ఉండగా, 9,83,684 గొర్రెలు, 3,62,582 మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యంతోపాటు మందులు అందించాల్సి ఉంది. జిల్లాలో వేల మంది పాడి పశువులును నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చాలా మంది పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలం రావడంతో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. జబ్బు చేసిన జీవాలతో పశు వైద్యశాలకు వచ్చిన వారికి మందులు లేవనే సమాధనంతో పశు యజమానులు ఆందోళన చెందుతున్నారు. పాత కడప పశువైద్యశాలలో పశువుకు వైద్యం అందిస్తున్న పశువైద్య సిబ్బంది సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి మందులు రావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకసారి మాత్రమే మందులు వచ్చాయి. తొమ్మిది నెలల నుంచి ఇంకా మందులు రాలేదు. మందుల సరఫరా విషయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశు వైద్యశాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్స్టాక్ యూనిట్లు పరిగణించి డైరెక్టరేట్ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్ పెట్ట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆసుపత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు. పశు వైద్యశాలల్లో వేధిస్తున్న మందుల కొరత తొమ్మిది నెలలుగా సరఫరా కాని మందులు పశు యజమానులపై ఆర్థికభారం బడ్జెట్ కేటాయించారు జిల్లా పశు వైద్యశాలల్లో మందుల కోసం ప్రభుత్వం 2025–26కు సంబంధించి జిల్లావ్యాప్తంగా రూ. 1,59,27,987 బడ్జెట్ కేయించారు. గ్రామీణ పశువైద్యశాలకు రూ. 50 వేలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ. లక్ష, ప్రాంతీయ పశు వైద్యశాలకు రూ.1.25 కేటాయించారు. త్వరలో మందులు వస్తాయి.–శ్రీనివాసులు, జిల్లా పశువైద్యాధికారి, కడప -
స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. మంగళవా రం కలెక్టరేట్ బోర్డు మీ టింగ్ హాల్ నుంచి మధ్యా హ్న భోజన పథకంలో భాగంగా అందిస్తున్న ఆహారం తయారీలో నాణ్యమైన రుచి, పారిశుద్ధ్య మెరుగుపై అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పురోగతిపై నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో ఆరా తీశారు. మహిళా సాధికారతకు చక్కటి వేదిక ఆర్తీ విలేజ్ మహిళా సాధికారత సాధనకు, బాలికల విద్య, నైపుణ్య సామర్థ్యాల పెంపునకు చక్కటి వేదికగా నిలిచిన ఆర్తీ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆర్తి హోమ్ (ఆర్తీ విలేజ్) ప్రాంగణాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించి హోం పనితీరును పరిశీలించారు. సంస్థ వ్యవస్థాపకురాలు పుచ్చలపల్లి సంధ్య సంస్థ ఆర్తీ ఫౌండేషన్ ప్రగతిని కలెక్టర్ కు వివరించారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తరలింపు: కలెక్టర్కు సర్పంచ్ ఫిర్యాదు ఇసుక రీచ్కు ఎలాంటి అనుమతులు లేకున్నా 15 నెలల నుంచి పాపాగ్ని నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందని చక్రాయపేట మండలం కుమారకాల్వ సర్పంచ్ కె.శీధర్రెడ్డి మంగళవారం కలెక్టర్ శ్రీధర్కి ఫిర్యాదు చేశారు. పాపాగ్ని నదిలో సుమారు 1400 మీటర్ల పొడవున 300 మీటర్ల వెడల్పుతో 15 అడుగుల లోతులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అధికారం అండతో ఆక్రమిస్తే అడ్డుకుంటాం
సాక్షి టాస్క్పోర్సు : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే గ్రామమంతా ఏకమై అడ్డుకుంటామని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు శివవర్దన్రెడ్డి, సుధాకర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోట్లదుర్తి గ్రామంలోని పెద్దమ్మ గుడికి సంబంధించి స్థలం సమస్య చాలా కాలంగా ఉందన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారన్నారు. గ్రామంలోని పెద్దలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని వదిలేసి మిగిలిన స్థలంలో ప్రహరీ నిర్మించమని చెప్పారని తెలిపారు. దీనిపై కూడా కోర్టులో ఫైల్ చేశామన్నారు. కానీ కేసు కోర్టులో ఉండగానే అధికారం ఉందని అధికారులను లొంగదీసుకుని జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారని తెలిపారు. ఈ జంగిల్ క్లియరెన్స్ కూడా ఏ అధికారి లేకుండానే ఇష్ట్రపకారం చేస్తున్నారన్నారు. దీనికి దేవదాయశాఖ అధికారులు సహకరిస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
యురేనియం బాధితుల సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో ఆయన చర్చించారు. ఇటీవల తాను లోక్సభలో కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. యూసీఐఎల్ గత 18 ఏళ్లుగా తుమ్మలపల్లె గ్రామంలో మైనింగ్, ప్రాసెసింగ్ లాంటివి నడుపుతోందని తెలిపారు. తీవ్రమైన రేడియేషన్ ముప్పు ఉంటుందని తెలిసినప్పటికీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు తమ విలువైన భూములను యూసీఐఎల్కు ఇచ్చారని తెలిపారు. అయితే యూసీఐఎల్ యాజమాన్యానికి ప్రజల బాధల పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడం దురదృష్టకరమన్నారు. టెయిలింగ్ పాండ్ వద్ద ప్రమాదకర రసాయనాల వ్యర్థాల గురించి, పునరావాస ప్యాకేజీ అందించడం ద్వారా కొట్టాల గ్రామాన్ని తరలించాల్సిన అవసరం గురించి ఆయన కలెక్టర్కు వివరించారు. భూ సేకరణ సమస్యలు, భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన కోటా ఉద్యోగాల కల్పన ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయన్నారు. కోరుకొండ–ముద్దనూరు నాలుగు లేన్ల రహదారి వల్ల ఇళ్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, చిన్నప్ప, రుషికేశ్రెడ్డి, షఫీవుల్లా, సీహెచ్ వినోద్కుమార్, దేవిరెడ్డి ఆదిత్య, యురేనియం బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్కు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వినతి -
Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️
కడప అర్బన్ : పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీ స్ సిబ్బందికి ఐటీ ఆధారిత అప్లికేషన్ల నైపుణ్యాలు పెంపొందించే రిఫ్రెషర్ కోర్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్, సీడీఆర్ ఎనాలిసిస్, టవర్ డంప్ ఎనాలిసిస్, ఏపీ–కాప్స్, ఈ–సాక్ష్య, తదితర సాంకేతికపరమైన దర్యాప్తు నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. ఎన్.సి.ఆర్.పి పోర్టల్, మీ సేవా పోర్టల్, పి.జి.ఆర్.ఎస్ పోర్టల్ లలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకునేలా నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎ.మధుమల్లేశ్వర రెడ్డి, ఐ.టి కోర్ టీమ్ సిబ్బంది, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
నేటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 24 నుంచి 27 వరకు బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ 2025–26 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇరు జట్లు కడపకు చేరుకోగా మంగళవారం ప్రాక్టీస్ చేశాయి. జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీ కడప అర్బన్ : కర్నూలు రేంజ్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వైఎస్సార్ కడప జిల్లా కడప నగరంలో టూ టౌన్ సీఐగా నియమితులైన యు. సదాశివయ్యను కడప స్పెషల్ బ్రాంచ్ వన్ సీఐగా బదిలీ చేశారు. గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న జి.ప్రసాదరావును కడప టూ టౌన్ సీఐగా నియమించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు వల్లూరు : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన నరసింహులు పని మీద మండలంలోని కొప్పోలు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుండి కడప వైపు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వేంపల్లె : భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి క్వాంటం టెక్నాలజీ అవసరమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జరిగిన క్వాంటం కంప్యూటర్ వర్క్ షాప్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా విద్యార్థులు సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ క్వాంటం శిక్షణ ద్వారా యంగ్, సెర్చ్ ఫిలోస్ ఇంటర్న్షిప్స్ ఇచ్చి భవిష్యత్తు తరాలకు కావలసిన క్వాంటం సాంకేతికతను అందరికి చేరే విధంగా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ రమేష్ కై లాష్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఇన్చార్జి సుధాకర్ రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు. సోలార్ కంపెనీలో చోరీ కొండాపురం : మండల పరిధిలోని సెయిల్ సోలార్ కంపెనీలో సోమవారం రాత్రి సోలార్ కంపెనీలో సుమారు రూ. లక్షలు విలువ చేసే కాపర్ కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఫోర్ ఎస్కేయు ఎంఎం సోలార్కు చెందిన 20,050 వేల మీటర్ల కాపర్ కేబుల్ చోరీకి గురైనట్లు సెక్యూరిటీ ఆఫీసర్ రామిరెడ్డి మహేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. -
అగస్త్యేశ్వరా.. ఆభరణాలు ఏవీ !
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఆభరణాలలో కొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ఈ మేరకు దేవదాయశాఖ రాయలసీమ జోన్ జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పాండురంగారెడ్డి నిర్ధారించారు. రెండవ రోజు మంగళవారం ఆభరణాల తనిఖీ పూర్తి చేసిన తరువాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డుల మేరకు ఉన్న ఆభరణాలలో 28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. వాటి విలువ రూ.3.20 లక్షలు ఉంటుదన్నారు. అలాగే భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించిన 2.129 కిలోల వెండి, 3.100 గ్రాముల బంగారు ఆభరణాలను రికార్డుల్లో నమోదు చేయలేదన్నారు. స్వామివారి ఆభరణాలు 15 రోజుల్లో రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. ఈఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తాను ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఈఓగా బాధ్యతలు చేపట్టానని తనకన్నా ముందు ఉన్న ఈఓ రామచంద్రాచార్యులు స్వామివారి, బంగారు, వెండి ఆభరణాలను తనకు అప్పగించలేదన్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఆభరణాలను తనిఖీ చేయాలని లేఖ రాయడంతో తనిఖీ నిర్వహించారని, తనపై ఆరోపణలు రావడం విచారకరమన్నారు. తాను వచ్చినప్పటి నుంచి చేసిన ఖర్చులకు రికార్డులు చూపిస్తానన్నారు. రిటైర్డ్ ఈఓ రామచంద్రాచార్యులు మాట్లాడుతూ తాను 2016లో ఒకసారి, 2024లో ఒకసారి ఆలయ ఈఓగా పనిచేశానన్నారు. ఉన్నతాధికారుల అనుమతి, పాలకమండలి నిర్ణయం మేరకు ఆలయ నిధులను ఖర్చుచేస్తామని తెలిపారు. తనకన్నా ముందు ఉన్న ఈఓ శంకరబాలాజీ రెండు ఆభరణాలు తనకు అప్పగించలేదని దానికి ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చైర్మన్ అయి న తరువాత రికార్డులను పరిశీలించానని స్వామి వారి నిధులలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారించిన తరువాత బాధ్యులపై కేసు నమోదు చేస్తామ న్నారు. సుదీర్ఘ కాలంగా జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివప్రసాద్పై ఆభరణాల గోల్మాల్, నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అప్రైజర్ మాధవస్వామి, ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు మాయం రికార్డుల్లో నమోదు కాని 2.129 కిలోల వెండి, 3.100 గ్రాముల బంగారు ఆభరణాలు -
కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం
కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు కడప సెవెన్రోడ్స్: తిరుమలకు తొలిగడపగా భావించే కడప నగరంలోని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించి కల్యాణ వేదికపైగల ప్రత్యేక పీఠాలపై కొలువుదీర్చారు. అనంతరం ప్రధాన అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సాయంత్రం కల్యాణమూర్తులను ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే అమ్మవార్లతో కలిసి తమ ఇంటి ముంగిటికి రావడంతో భక్తులు పులకించి పూజాద్రవ్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్చకులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి
కడప అగ్రికల్చర్ : రైతుల సంక్షేమానికి మార్కెట్యార్డుల చైర్మన్లు, సెక్రటరీలు కలిసి కట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత సూచించారు. కడప మార్కెట్ యార్డులోని జేడీ కార్యాలయ సమావేశం మందిరంలో మంగళవారం రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, ఆనంతపురం ఉమ్మడి జిల్లాల మార్కెట్యార్డు చైర్మన్లకు మార్కెట్ యార్డు చట్టాలు, విధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయడమే అభివృద్ధి అన్నారు. మార్కెట్యార్డు చైర్మన్లు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా విలువల జోడింపుతోపాటు స్థూల ఆదాయం పెంచే పంటలనే రైతులు సాగు చేసుకునేలా సూచించాలన్నారు. రైతులు అభివృద్ధి చెందితే మార్కెట్యార్డులు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మార్కెటింగ్శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ మార్కెట్యార్డు చైర్మన్లు మార్కెట్కు వచ్చే రైతులకు సౌకర్యాలను కల్పించడంతోపాటు మార్కెట్యార్డులో వసతులను కల్పించి రైతుల మన్ననలు పొందాలన్నారు. మార్కెటింగ్శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య మాట్లాడుతూ అమ్మకందారులు, కొనుగోలు దారుల మధ్య సమన్వయం ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ అజాద్వలీ, కడప మార్కెట్యార్డు సెక్రటరీ శ్రీకాంత్రెడ్డితోపాటు సిబ్బంది, వివిధ జిల్లాల మార్కెట్యార్డు చైర్మన్లు పాల్గొన్నారు. అలా వచ్చి.. ఇలా కారెక్కి..కడప నగరంలోని మార్కెట్యార్డును మంగళవారం ఉదయం మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత సందర్శించారు. మార్కెటింగ్శాఖ సెక్రటరీ, సిబ్బంది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె వారితో కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి కారెక్కి రయ్మని వెళ్లిపోయారు. మార్కెట్యార్డుకు వచ్చిన ఆమె యార్డులో వసతుల గురించి, ఏళ్లుగా ఆగిపోయి ఉన్న షెడ్డు నిర్మాణ పనులు, రైతుల సమస్యలు, మార్కెట్లో మరుగుదొడ్లు, మంచినీటి సమస్య, రైతుల వసతిగృహం తదితర విషయాలు ఏమీ అడగకుండా వెళ్లిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయ సునీత -
తిరుపతి–హిస్సార్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–హిస్సార్ మధ్య కడప మీదుగా నడుస్తున్న రైలు ఫిబ్రవరి 11వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే కమర్షి యల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, పూర్ణ, అఖోల, సూరత్, వడోదర, మదార్, సిఖార్, సాగుల్పూర్ల మీదుగా హిస్సార్కు చేరుతుందన్నారు. 07718 నెంబరుగల రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేది వరకు ఈ రైలును పొడిగించామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్బంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్ధేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 8977716661 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈఈ అమీర్బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
ప్రజలను నమ్మించి మోసం చేసిన బాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు బాబు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టారని.. ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా చిత్తశుద్ధితో అమలు చేశాడని గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. అదే వైఎస్సార్, వైఎస్ జగనన్న పేర్లు చెబితే అనేక పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. అలా కాకుండా ప్రజలను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు తెచ్చుకునే నాయకుడిగా చంద్రబాబు నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూడా ఆయన జగనన్న పథకాలకే పేర్లు మార్చి అవి కూడా అరకొరగా అమలు చేస్తున్నాడని మండిపడ్డా రు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేకుండా తయారైందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలేక అల్లాడుతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేకపోవడం దౌర్భాగ్య మన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఏ–1మోటార్స్ను ప్రారంభించిన ఎంపీ సోమవారం కడప రోడ్డులో వైఎస్సార్సీపీ నాయకుడు నాగూరు అనిల్ బాబా నూతనంగా ఏర్పాటు చేసిన ఏ–1మోటార్స్ షోరూంను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్పలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ షోరూంలో మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
పెట్రోల్ పంపు నిర్వహణలో మున్సిపల్ ఉద్యోగి చేతివాటం
సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ మున్సిపల్ పెట్రోలు బంకు నిర్వహణ బాధ్యతలు చూ సేవారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ వేసి ఇంధనం పక్కదారి పట్టించారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు 2022–25 వరకూ రూ. 1,23,47,318ల విలువగల పెట్రోలు, డీజల్ను అప్పుగా పట్టినట్లు, వారి నుంచి డబ్బులు రావాలంటూ తాపీగా వెల్లడించారు. ఇంత మొత్తం పెండింగ్లో ఉంటే పెట్రోల్ పంపు నిర్వహణ సాధ్యమా?అనేది ప్రశ్నార్థకం. వచ్చే ఆదాయం మొత్తం స్వాహా చేసి ప్రొద్దుటూరులో లేని ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లు పొందుపర్చినట్లు కొందరు వివరిస్తున్నారు. మాతాంగి ట్రావెల్స్ 2023వ సంవత్సరం నుంచి 2025 అక్టోబరు నెల వరకు అప్పు రూ. 13,75,344 ఉన్నట్లు లెక్క రాశారు. ఈ ట్రావెల్స్ ప్రొద్దుటూరులో ఉన్నట్లు రికార్డుల్లో లేకపోవడం విశేషం.అధికారులూ అమ్ముడుబోయారా!ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పెట్రోలు బంకును 2021 ఆగస్టు 18న ప్రారంభించారు. అప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ పెట్రోలు బంకు మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. పెట్రోల్ పంపు ద్వారా మున్సిపాలిటికి ఆదాయం లభించకపోవడంతో ఇటీవల కమిషనర్ రికార్డులు పరిశీలించారు. దాంతో ఒక్కమారుగా వ్యవహారం బహిర్గతం అయ్యింది. రూ.1.23కోట్లు విలువజేసే పెట్రోలు, డీజల్ను ప్రైవేటు వ్యక్తులకు అధికారుల అనుమతి లేకుండా అప్పుగా ఇవ్వడం వెలు గులోకి వచ్చింది. ఎవరి అనుమతి తీసుకుని మేనేజర్గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అప్పులు ఇచ్చా రు అన్న ప్రశ్నలకు సమధానం లేదు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ సైతం మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు లోబడి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.కమిషనరా మజాకా !ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తన సొంతమైనట్లు తాను ఆడిందే ఆట...పాడిందే పాటగా అన్నట్లుగా వ్యవహరించారు. పెట్రోల్ పంపు నిర్వహణలో లెక్కాపత్రం లేని రూ.1.23కోట్ల అవినీతిపై కమిషనర్ నాన్చుడు ధోరణి అవలంబించారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ సీసీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఓబులేసు తనకు తెలియకుండా అజెండాలో లేని అంశాలను పొందుపరిచారని, అతన్నిసస్పెండ్ చేయాలంటూ సిఫార్సులు చేశారు. ఒకే మున్సిపాలిటిలో పని చేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఒకరిపై ఒకలా, మరొకరిపై ఇంకోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెట్రోల్ పంపు నిర్వహణలోని లోపాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆడిట్ ఆఫీసర్ను నియమించాం. సదరు అధికారి క్షుణ్ణంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వారంలో నివేదిక వస్తుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదు పరి చర్యలు తీసుకుంటాం. –రవిచంద్రారెడ్డి,కమిషనర్,ప్రొద్దుటూరు మున్సిపాలిటీ -
రాయచోటి వద్దు... కడపే ముద్దు
కడప సెవెన్రోడ్స్ : ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా వైఎస్సార్ కడపజిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు సోమవారం ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి.రాజగోపాలయ్య, అరవిందకుమార్, జవహర్, మోహన్రెడ్డి, రామకృష్ణయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టీ నెం. 1500ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో కలుపడం వల్ల తమ మండలాలకు చెందిన ప్రజల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందన్నారు. కడప తమకు కూతవేటు దూరంలో ఉందన్నారు. కొత్తగా ప్రకటించిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని కడపజిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చలమయ్య, జేఏసీ నాయకులు రామదాసు, యానాదయ్య, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్ నరసయ్య, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ నాయకులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం ప్రజల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతారు. ఇడుపులపాయలో, పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.తొలిరోజు పర్యటన ఇలా..ఈనెల 23వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరుతారు. సాయంత్రం 4గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.15గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4.15గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.రెండో రోజు పర్యటన ఇలా..24వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని ప్రేయర్ హాలు వద్దకు బయలుదేరుతారు. 10.30గంటలకు అక్క డికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేయర్ హాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 1గంటకు ఇడుపులపాయ ప్రేయర్ హాలు వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2గంటలకు పులివెందుల భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.మూడో రోజు క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న మాజీ సీఎం25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 8.10గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు బయలుదేరుతారు. 8.30గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 10గంటల వరకు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.20గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 127 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజ ఫిర్యాదులు పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, మైదుకూరుడీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
క్రీడలతో శారీరక, మానసికోల్లాసం
కడప ఎడ్యుకేషన్ : క్రీడలతో విద్యార్థులకు శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం లభిస్తుందని జిల్లా పరిషత్తు సీఈఓ ఓబులమ్మ తెలిపారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లాలోని 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్తు సీఈఓ ముఖ్య అతిథిగా హాజరు కాగా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రెయినింగ్(ఎస్బీటీఈటీ) జాయింట్ సెక్రటరీ టి.శేఖర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వారు క్రీడా జెండాను ఊపడంతోపాటు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, పలు డిపార్టుమెంట్ల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేనేతల కష్టాలు విస్మరించిన కూటమి ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేనేతల కష్టాలను పూర్తిగా విస్మరించిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నాగులకట్టలో చేనేతల జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట ప్రతి ఏడాది 24వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలలో జమ చేయడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జగన్ అమలు చేసిన పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మనోహర్, సత్యనారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, ఓబులేసు పాల్గొన్నారు. -
ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి
వేంపల్లె : ఫోటోలోని వ్యక్తి ఆచూకీ కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని వేంపల్లె సీఐ టి.నరసింహులు విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోనీ పిరమిడ్ నగర్లో ఉన్న చౌడేశ్వరిదేవి గుడి వద్ద భిక్షాటన చేస్తూ ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తిరుగుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 4న చౌడేశ్వరిదేవి గుడి సమీపంలో ఏపీ 40 డీటీ 9402 నెంబర్ కలిగిన హోండా ఆక్టివా స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల సాయంతో ఫొటోలోని వ్యక్తి ఆ స్కూటీని దొంగిలించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికాన్ని ప్రకటించారు. అలాగే సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. -
నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు
కడప సెవెన్రోడ్స్ : కడప నగర శివార్లలోని మాచుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈనెల 23న గంధోత్సవం సందర్భంగా రాత్రి 9 గంటలకు గంధం, పూలచాందిని ఫకీర్ల మేళతాళాలతో, బ్యాండు వాయిద్యాలతో గ్రామంలో మెరవణి నిర్వహించి గురువుల మజార్వద్ద సమర్పిస్తామన్నారు. అనంతరం ఫాతెహా ఉంటుందని పేర్కొన్నారు. 24న ఉరుసు సందర్భంగా వివిధ కార్యక్రమాలతోపాటు రాత్రి ఖవ్వాలీ కచేరి ఉంటుందన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం నిర్వహిస్తామన్నారు. 25న తహలీల్ ఫాతెహాతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఒంటిమిట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పుజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, ముత్యాల ఆభరణాలు తొడిగి, పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత పారాయణం చేశారు. -
నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయం
కడప సెవెన్రోడ్స్ : నిరంతరాయ విద్యుత్ సరఫరాను ప్రజలకు అందించడమే లక్ష్యంగా విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ శాఖ ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించి, ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా కడప జిల్లాలో వినూత్నంగా ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి విద్యుత్ శాఖ వారు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారా ల్లో విద్యుత్ శాఖ అధికారులు నేరుగా గ్రామాలు, వాడలు, హాబిటేషన్లను క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సందర్శిస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలను వెంటనే ‘కరంటోళ్ల జనబాట’ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ పీడీసీఎల్ కడప సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
క్షమాపణ కోరిన డీపీఓ రాజ్యలక్ష్మి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా సంస్కృతిని కించపరుస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య, జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, పలువురు సర్పంచుల సమక్షంలో క్షమాపణ చెప్పారు. డీపీఓ వ్యాఖ్యలకు నిరసనగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న రాజ్యలక్ష్మి స్పందిస్తూ తాను తొందరపాటు లో అలా మాట్లాడానని చెప్పారు. కడప బాంబుల గడ్డ అని, తనతో చాలామంది అన్నారని, కానీ ఇక్కడి ప్రజల మంచితనం వల్ల తాను 14 నెలలుగా పనిచేయగలుగుతున్నానన్నారు. జిల్లా ప్రజలు కల్మషం లేని వారని చెప్పాలనుకున్నానని, కానీ సమయం లేకపోవడం వల్ల మరో అంశంపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన వ్యాఖ్యలు జిల్లా ప్రజలను బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానన్నారు. డీపీఓ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేయాలి అంతకుముందు జిల్లా సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జిల్లా పంచాయతీ అఽఽధికారి రాజ్యలక్ష్మిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. కడపజిల్లాలో పనిచేయడమంటే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని సర్పంచులు మండిపడ్డారు. జిల్లా సంస్కృతిపై విషం కక్కిన డీపీఓపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు
పోరుమామిళ్ల : మండలంలోని కవలకుంట్ల దళితవాడలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు నాగార్జునరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి వారు పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ రాజశేఖర్, వైద్యవిభాగం సెక్రటరి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. పార్టీలో చేరినవారిలో వీరపోగు జోజి, మరియమ్మ, గురవయ్య, ప్రసాద్, రవిచంద్ర, పుష్పరాజ్, రవి, ఫాతిమా, రోజమ్మ, అబ్బయ్య, చందు, శంకర్, నారిపోగు రవి, మేరమ్మ, అశోకరాణి, నిర్మలాదేవి, అజయ్, విజయభాస్కర్, యేసు, చిట్టిబాబు, రూతమ్మ, శంకర్, సునీల్, సరిత, నీలిమ తదితరులు ఉన్నారు. -
అగస్త్యేశ్వరాలయంలో ఆభరణాల తనిఖీ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరాలయంలో అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి బంగారు వెండి, ఆభరణాలను సోమవారం దేవదాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్య ఆభరణాల తనిఖీ చేపట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో రాయలసీమ జోన్ జ్యువెలరి వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి తనిఖీ చేశారు. ఆలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శివప్రసాద్పై ఆరోపణలు రావడం, పూర్వ ఈఓ రామచంద్రాచార్యులు రిటైర్డ్ అయిన తరువాత బాధ్యతలు చేపట్టిన వెంకటసుబ్బయ్యకు ఆభరణాలను అప్పజెప్పకపోవడంతో ఆభరణాల గోల్మాల్ జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఆభరణాల తనిఖీ జరిగింది. కొన్ని బంగారు, వెండి ఆభరణాల లెక్కలు తేలకపోవడంతో వాటి రశీదులు, ఆభరణాలను మంగళవారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆభరణాల తనిఖీలో దేవదాయ ఆభరణాల అప్రైజర్ మాధవస్వామి, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
అత్యున్నత ప్రమాణాలతోశిక్షణ పొందేందుకు వచ్చిన అనంతపురం జిల్లా పోలీసు కానిస్టేబుళ్లుమాట్లాడుతున్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, పాల్గొన్న పోలీసు అధికారులుకడప అర్బన్ : కొత్తతరం పోలీసింగ్కు అనుగుణంగా అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు ఇచ్చే శిక్షణను ట్రైనీ కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకుని సమర్థవంతంగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో (డి.పి.టి.సి) లో అనంతపురం జిల్లాకు చెందిన సివిల్ ట్రైనీ కానిస్టేబుళ్లు 194 మందికి, అలాగే 11 వ బెటాలియన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే ఏ.పి.ఎస్.పి కి ఎంపికై న కానిస్టేబుళ్లు 330 మందికి 9 నెలల పాటు ఇచ్చే ట్రైనింగ్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ట్రైనింగ్కు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేశారన్నారు. వంద శాతం క్రమశిక్షణ, నిజాయితీతో విశేష అనుభవమున్న పోలీస్ అధికారులు అందించే శిక్షణను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలోని అత్యాధునిక సైబర్, కంప్యూటర్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకుని సైబర్, ఫైనాన్సియల్ నేరాల దర్యాప్తు విధానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల సౌకర్యం కోసం ’సజెషన్ బాక్స్’ ఏర్పాటు చేశామని, సలహాలు, సూచనలు రాసి అందులో వేయవచ్చన్నారు. ట్రైనింగ్లో భాగంగా నిర్దేశిత ప్రమాణాలతో నిర్వహించే మిడ్ టర్మ్, ఫైనల్ పరీక్షలను తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో 11 వ బెటాలియన్ కమాండెంట్ కె.ఆనంద రెడ్డి, అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ పి అబ్దుల్ కరీం, కడప నగరంలోని సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు. క్రమశిక్షణ, నిజాయితీగా శిక్షణ పూర్తి చేసుకోవాలి ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలి ట్రైనీ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
బాకీ డబ్బు అడిగినందుకు క్రూరంగా హతమార్చాడు
ప్రొద్దుటూరు క్రైం : గాఢ నిద్రలో ఉన్న మహేశ్వరరెడ్డిని స్వీట్ దుకాణం యజమాని రామచంద్రారెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని మూడు ముక్కలుగా కసితీరా నరికాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి పట్టణ శివారులో పడేశాడు. ఈ దారుణ ఘటన 2024 జూన్ 23న ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని ముద్దాయి భూమిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విఽధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ద్వార్శల నాగరత్నమ్మకు 35 ఏళ్ల క్రితం శ్రీనివాసరెడ్డితో వివాహమైంది. వీరికి వెంకటమహేశ్వరరెడ్డి అనే కుమారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎంఆర్కాలనీలో ఓ ఇల్లు బాడుగకు తీసుకొని స్వీట్ల దుకాణం నిర్వహించేవాడు. నాగరత్నమ్మ 15 ఏళ్లుగా దుకాణంలో స్వీట్లు తయారు చేసే పనికి వెళ్లేది. ఇలా రామచంద్రారెడ్డితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని రోజులు గడచిన తర్వాత నాగరత్నమ్మ, ఆమె కుమారుడు మహేశ్వరరెడ్డి, దుకాణ యజమాని రామచంద్రారెడ్డి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. స్వీటు దుకాణం యజమానికి నాగరత్నమ్మ రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు విషయమై నాగరత్నమ్మ కుమారుడు, దుకాణం యజమాని తరచూ గొడవ పడేవారు. రూ.120 కోసం నిలదీశాడని.. తనకు డబ్బు అవసరముందని 2024 జూన్ 23న రూ.120 ఇవ్వమని మహేశ్వరరెడ్డి అడిగితే రామచంద్రారెడ్డి ఇవ్వలేదు. తమకు బాకీ ఉన్న డబ్బులో నుంచి ఇవ్వాలని గట్టిగా దబాయించి అడిగాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడుతుండగా నాగరత్నమ్మ ఇరువురికి సర్ది చెప్పి కుమారుడికి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించింది. కొద్ది సేపటి తర్వాత మహేశ్వరరెడ్డి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఈ క్రమంలో 24న తెల్లవారు జామున నిద్రపోతున్న మహేశ్వరెడ్డి తలపై రాచమంద్రారెడ్డి ఇనుప రాడ్డు తీసుకొని కొట్టడంతో అతను అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు. హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకని మృతదేహాన్ని మూడు భాగాలుగా కోశాడు. శరీర భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి జమ్మలమడుగు బైపాస్రోడ్డు సమీపంలోని కంపచెట్లలో పడేశాడు. మరో గదిలో పడుకున్న నాగరత్నమ్మ తెల్లారాక నిద్రలేచి చూడగా గది నిండా రక్తపు మరకలు ఉన్నాయి. తన కుమారుడు కనిపించకపోవడంతో రామచంద్రారెడ్డి చొక్కా పట్టుకొని నిలదీసింది. నీ కుమారుడుకి పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించి అతను పారిపోయాడు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు వాదనలు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో కొనసాగుతూ వచ్చాయి. నేరం రుజువు కావడంతో ముద్దాయి రామచంద్రారెడ్డికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 3 లక్షలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె.సత్యకుమారి సోమవారం తుదితీర్పు చెప్పారు. అధికారులకు ప్రశంసలు ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి తన వాదనలతో ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. సకాలంలో సాక్షులను కోర్టులో హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ భావన, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్కానిస్టేబుల్ ఏ.నాగరాజు, త్రీ టౌన్ పీసీ పి.పవన్కుమార్రెడ్డి, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవకారాగార శిక్ష రూ.3 లక్షలు జరిమానా ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు తీర్పు మహేశ్వరరెడ్డిని హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికిన రామచంద్రారెడ్డి 2024లో ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో జరిగిన ఘటన -
ఉత్సాహంగా జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో 72వ సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు ఉత్సాహంగా జరిగినట్లు కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్.వెంకటసుబ్బయ్య, జాయింట్ సెక్రటరీ సునీల్ తెలిపారు. ఈ ఎంపికలకు విశేష స్పందన లభించిందన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు వీరే.. పురుషుల జట్టు బ్రహ్మయ్య, అభిలాష్ రెడ్డి, హుస్సేన్, వేణుసాయి, బి. వంశీ, పవన్, మల్లికార్జున, ధనుష్ రెడ్డి, వి. వంశీ, ఎం. వంశీధర్ రెడ్డి, నరేంద్ర, యశ్వంత్, నిఖిల్, కళ్యాణ్ కుమార్, మహమ్మద్ హుస్సేన్. మహిళల జట్టు టి. శ్రీవాణి, ఏ. అపర్ణ, ఎం. లీలావతి, ఎస్. పూజ, జ్యోత్స్న, ఎస్. ఇందు, నీలమహేశ్వరి, విష్ణుప్రియ, జ్యోతి, అక్షయ, అశ్విత, తేజ, అమూల్య, దివ్య. స్టాండ్ బై క్రీడాకారులు ప్రణీత్, నవ్య, దీప్తి, హుస్సేన్, బి. మాధవి, కృపా జ్యోతి, మౌనిక, వాసంతి -
యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కడప ఎడ్యుకేషన్ : యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మాదన్ విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా పాలెం మహేష్బాబు ఎన్నికయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్. నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులుగా వై.రవి కుమార్, డి.సుజాత రాణి, కోశాధికారిగా కె.నరసింహారావు, కార్యదర్శులుగా కె.చెన్నయ్య, సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, వి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసులు, కె.సుధాకర్, కె.ప్రసాద్, ఎస్.షకీల బేగం, డి.సుబ్బారావు, జి.గోపినాథ్, ఎస్.ఫయాజుద్దీన్, సి.సుదర్శన్, ఎ.డి.దేవదత్తం, జె.వెంకటసుబ్బారెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎన్.కంబగిరిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పాలెం మహేష్ బాబు, మాదన విజయకుమార్, డి.కృష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, బి.ప్రసన్నలక్ష్మి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా ఎం.ప్రభాకర్, ఆడిట్ కమిటీ సభ్యులుగా టి.వెంకటరమణ, కె.సి.ఓబులేసు, బి.చంద్రశేఖర్, డి. సెబాస్టియన్, ఎన్.మేరీ ప్రసన్న, సీపీఎస్ జిల్లా కన్వీనర్గా ఎన్.పవన్ కుమార్, కో–కన్వీనర్లుగా ఎస్.కరీముల్లా, ఎస్.అనిల్ కుమార్ రెడ్డి, ఎన్.అయ్యవారు రెడ్డి, పి.మునిశేఖర్, కె.గంగయ్య, కె.రాజశేఖర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్గా టి.శివ ప్రసాద్, ప్రచురణల కమిటీ జిల్లా కన్వీనర్గా ఎ.వీరనారాయణ, అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్గా వీరదాసరి క్రిస్టఫర్, కల్చరల్ కమిటీ జిల్లా కన్వీనర్గా ఎస్.గుర్రయ్య, మున్సిపల్ కమిటీ జిల్లా కన్వీనర్ గా పి.హిఫాజతుల్లా, మహిళా కమిటీ కన్వీనర్గా కె.సరస్వతి, పెన్షనర్స్ విభాగం జిల్లా కన్వీనర్గా ఎస్.శివశంకర్ రెడ్డి, ఎయిడెడ్ స్కూల్స్ జిల్లా కన్వీనర్గా ఎస్.మహమ్మద్ రఫీ, కేజీబీవీ పాఠశాలల జిల్లా కన్వీనర్గా డి.సుజాత రాణి, ఏపీ మోడల్ స్కూల్స్ జిల్లా కన్వీనర్గా పి.నవీన్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా పరిశీలకులుగా, యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
దుష్ప్రచారంలో ‘ఈనాడు’ బరితెగింపు
సాక్షి ప్రతినిధి, కడప: తప్పుడు వార్తలు వండివార్చడంలో ‘ఈనాడు’ మరోసారి ముందు వరుసలో నిలిచింది. ‘వివేకా కుటుంబంపై వైకాపా పగ’ కథనమే అందుకు తాజా ఉదాహరణ. ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట ఆన్లైన్లో ఉన్న భూమిని లేనట్లుగా ఎల్లో మీడియా చిత్రీకరించింది. పైగా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఇతరుల పేరుతో మ్యుటేషన్ చేశారని, అప్పటి తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది.పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 ప్రకారం నాలుగు సర్వే నంబర్లలో 7.03 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 351/ఏలో 2.91 ఎకరాలు, 352–ఏలో 4.05 ఎకరాలు, 353/1ఏలో 0.04 సెంట్లు, 354ఏలో 0.03 సెంట్లు కలిపి మొత్తంగా 7.03 ఎకరాలు వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట వెబ్ల్యాండ్లో కనిపించడం లేదంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.టీడీపీ హయాంలోనే ల్యాండ్ కన్వర్షన్..వైఎస్ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఆమేరకు రూ.65 వేలు చలానా చెల్లించారు. ఆ ఫైలును పరిశీలించిన అప్పటి జమ్మలమడుగు ఆర్డీవో ద్వారా 2018 మార్చి 20న ల్యాండ్ కన్వర్షన్ కూడా అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ల్యాండ్ కన్వర్షన్ చేపట్టారు. ఆమేరకు రెగ్యులర్ ఖాతా 763 నుంచి నోషనల్ ఖాతా నంబర్ 300004కి మారింది.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీభూమి పోర్టల్లో ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట 1బీ నమోదై ఉంది. 351/ఏలో 3.47 ఎకరాలు పట్టాదారు పేరు తెలియదని వెబ్ ల్యాండ్లో నమోదై ఉంది. వైఎస్ సౌభాగ్యమ్మ భూమి ఇప్పటికీ వారి స్వాధీనంలో, వారి అనుభవంలోనే ఉంది. ఈ విషయమై పులివెందుల తహశీల్దార్ నజీర్ను వివరణ కోరగా.. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి వన్టైమ్ కన్వర్షన్ అయ్యిందని.. కాబట్టే నోషనల్ ఖాతా నంబర్కు బదలాయింపు అయ్యిందని వివరించడం గమనార్హం. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
సైన్సు మ్యూజియం సందర్శన
కడప ఎడ్యుకేషన్: కడప చెన్నూరు బస్టాండ్లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్ను ఆదివారం ఉన్నత విద్య ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు. సైన్సు మ్యూజియంలోని ఎక్యూప్మెంట్ గురించి సైన్సు క్యూరేటర్ రెహమాన్ను అడిగి తెలుసుకున్నారు. కడప ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: కడపలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన శిక్షణ కేంద్రంలో వారం రోజుల నుంచి సాగుతున్న స్కౌట్ మాస్టర్ శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఎల్.ఓ.సి డాక్టర్ కమల కన్నన్, శివ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బేసిక్, అడ్వాన్స్ కోర్సు శిక్షణకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి దాదాపు ఎనబై మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, కోశాధికారి శివ శంకర్ రెడ్డి, సహాయ సిబ్బంది శివ ప్రసాద్, అమర్నాథ్ బాబు, అహమ్మద్, పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బహుజన టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున డిమాండ్ చేశారు. కడపలోని బహుజన టీచర్స్ యూని యన్ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కు అనేక హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిటీ వేసి, 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏలు, ఐ.ఆర్, పీఆర్సీ కమిటీలపై ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులలో నెలకొన్న తీవ్ర నిరాశ నిస్పహలను తగ్గించాలని కోరారు. కడప జిల్లా అధ్యక్షుడు యమ్. గంగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కట్టా గంగాధర్, జిల్లా కార్యదర్శి కె. జయరాం తదితరులు పాల్గొన్నారు. సిద్దవటం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. అనంతరం పరమాత్మ సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందాలని, అలాగే పేద కుటుంబాల వారు ఉచిత వైద్యం పొందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తెచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని ప్రైవేట్పరం చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ప్రొద్దుటూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజా సోమశేఖర్రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు. గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తూ మెరుగైన జీతభత్రాలతో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు జీఓ ఎంఎస్ నంబర్ 114ను అమలు చేసి వారి సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు గరుడాచలం, జనరల్ సెక్రటరీ జీఎన్ సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నాగేంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, దివాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు. హైందవ సంస్కృతిని పరిరక్షించాలి ప్రొద్దుటూరు కల్చరల్ : హైందవ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వేదాంత గీత శివం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానందా స్వామిజీ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక బొల్లవరం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి వరకే కులం అని గడప దాటితే అందరూ హిందువులనే భావన అందరిలో రావాలన్నారు. శివదర్శనానంద స్పిరిచ్యువల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శివదర్శనానంద సరస్వతీ మాతాజీ హిందువులంతా కలిసికట్టుగా జీవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, హిందూ సమ్మేళన సమితి సమన్వయకర్త డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, హిందూ ధర్మం గురించి వివరించారు. కార్యక్రమంలో సమ్మేళనం సమన్వయకర్త సుధాకర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలులింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు. కల్వర్టును ఢీకొని ఇద్దరి దుర్మరణం రాయచోటి టౌన్ : రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలోని యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద పల్స్ర్ బైక్పై మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మీప్రసాద్(18) అలియాస్ ప్రతాప్, వెంకటసాయి కుమార్ (25)లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మాధవరం వడ్డెపల్లె నుంచి రాయచోటికి సొంత పనుల నిమిత్తం వస్తున్న సమయంలో యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటసాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీప్రసాద్ను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా అస్మితా లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్ 14, 16 బాలబాలికలకు ట్రియాథ్లాన్ హైజంప్, లాంగ్జంప్, 60 మీటర్ల, 600 మీటర్ల పరుగు పోటీలు, బ్యాక్త్రో, షాట్పుట్, జావెలిన్త్రో, డిస్కస్త్రో విభాగాలలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్తల సుధాకర్రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా లీగ్మ్యాచ్ ప్రతిభ గల క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు. అబ్జర్వర్ రాజా, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అహ్మర్బాషా, వ్యాయామ సంచాలకులు నాగూర్బాషా, రమణయ్య, షేక్బాషా, సుబ్బయ్య, లక్ష్మీ, రాఘవ, సతీష్రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
కడప రూరల్: చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల మందు దోహదపడుతుందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా పులివెందులలో చిన్నారులకు చుక్కల మందు వేశారు. కడపలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ మాట్లాడుతూ తొలిరోజు 94శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామని వివరించారు. వైద్య సిబ్బంది సోమ, మంగళవారం ఇంటింటికి వచ్చి తొలిరోజు వేయించని చిన్నారులకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల కు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.● తొలి రోజు 94శాతం నమోదు -
జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమైన చర్య
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సాయినాథ శర్మ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం పెద్దచెప్పలిలో జరిగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు చించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీనిపై స్పందించిన సాయినాథ శర్మ కమలాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పర్మిషన్ లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయన్నారు. పెద్దచెప్పలికి మాత్రమే పర్మిషన్ కావాలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులు చేసే కార్యక్రమాలను ఏనాడైనా అడ్డుకున్నామా? అన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకుని మళ్లీ వెళ్లి వేడుకలు నిర్వహిస్తామన్నారు. కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపు కోవడం కోసమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు శృంగభంగం తప్పదని టీడీపీ నాయకులు ఇలాంటి ఆటలు సాగిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దచెప్పలిలో గత 30 ఏళ్ల నుంచి ఏ పార్టీ కార్యక్రమమైనా అదే సర్కిల్లో జరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జగనన్న జన్మదిన వేడుకలు అదే ప్రాంతంలో నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు చించడం తగదన్నారు. ఇలాంటి వికృత చేష్టలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్, దాసరి సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు. కడపలో చైన్ స్నాచింగ్ కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రామరాజుపల్లెలో ఆదివారం మధ్యాహ్నం పందిళ్లపల్లి పద్మావతి అనే మహిళ మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్తో పాటు రెండు కాసుల బంగారు చైన్ను గుర్తుతెలియని వ్యక్తి వచ్చి లాక్కెళ్లాడు. రామరాజుపల్లికి చెందిన పద్మావతి తమ బంధువుల ఇంటికి సీమంతం ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా సచివాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బాధితురాలి తల వెనుక భాగాన కొట్టి ఆమె మెడలోని చైన్ను లాక్కెళ్లాడు. చైన్ను లాక్కున్న వెంటనే దూరంగా పరుగు తీసి, వేరే వ్యక్తితో కలిసి మోటార్బైకులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె మెడలోని రోల్డ్ గోల్డ్ చైనుతోపాటు రెండు కాసుల బంగారు చైన్ను నిందితుడు లాక్కెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలుపెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు. అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
మానవతావాది న్యాయవాది లేబాక తులసిరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : దివంగత న్యాయవాది లేబాక తులసిరెడ్డి నిజమైన మానవతావాది అని హైకోర్టు న్యాయవాది రతంగపాణిరెడ్డి తెలిపారు. దివంగత తులసిరెడ్డి జ్ఞాపకార్థం పెన్నానది ఒడ్డున ఉన్న స్వరూప్ ఎస్టేట్లో తులసిరెడ్డి కుమారుడు లేబాక హృతిక్రెడ్డి, తమ్ముడు లేబాక గంగిరెడ్డి, మేనల్లుడు మధుసూదన్రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. న్యాయవా ది లేబాక తులసిరెడ్డి వల్ల ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. పైసా ఆశించకుండా వందలాది మందికి ఉద్యోగాలు, పోస్టింగ్లను ఇప్పించారని తెలిపారు. అనంతపురం ఎస్కే యూని వర్సిటీలో సీట్లు ఇప్పించడంలోను, హాస్టల్ వసతి కల్పించడంలో ఎందరికో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్లో తులసిరెడ్డి చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి హాజరై, తులసిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారు సుమారు 400 మందికి పైగా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ రామగంగిరెడ్డి, హైకోర్టు న్యాయవాది మహేశ్వరరెడ్డి, అనంతపురం అడ్వకేట్లు శ్యామ్, నారాయణరెడ్డి, రామ్మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి (చిత్తూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి), మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ బీవీరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్దన్రెడ్డి, అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి, మెట్టుపల్లె సుధాకర్రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వైద్యులు త్యాగరాజరెడ్డి, స్వరూప్కుమార్రెడ్డి, హెడ్మాస్టర్ రాంభూపాల్రెడ్డి, దొంతిరెడ్డి హనుమంతరెడ్డి, అశ్విన్కుమార్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ స్వరూప్కుమార్రెడ్డి, డాక్టర్ సింగం భాస్కర్రెడ్డి, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ
పులివెందుల : చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ అన్న విధంగా మారారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పనులను చంద్రబాబు నాయుడుతో ప్రారంభించాలని వీళ్లు కాన్సెప్ట్ పెట్టుకున్నారని, అసలు వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, ఆ పథకం వీళ్లే మంజూరు చేసినట్లు, వీళ్ల బిల్డప్ తెలియని వాళ్లు చూస్తే ఆశ్చర్యపోతారన్నారు. రూ.480 కోట్లతో మంజూరు చేసిన తాగునీటి పథకానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే దాదాపు 60 నుంచి 80 శాతం పనులు పూర్తయినా వీళ్లు ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. ఎవరి హయాంలో ఏమి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు వచ్చేదన్నారు. ఈనెల 15వ తేదీన వరి కాకుండా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయిందన్నారు. వరికి ఇంకా కొంచెం గడువు ఉందని, ఏ ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దాని ఫలితంగా రైతులెవరూ బీమా, ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. జనవరి 15వ తేదీ వరకు బీమా గడువు పెంచాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్లు విదేశాలకు వెళతారు.. ఒక గ్రూపు మీటింగ్కు సంబంధించి ఫొటో తీస్తారు, ఆ ఫొటో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించి, మీడియా చానెళ్లలో ప్రసారం చేసి రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారన్నారు. ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, జగనన్న ఇష్టపడే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్ అని అన్నారు. రాజకీయ అరంగ్రేటం నుంచి నేటి వరకు ఆయన జర్నీ చూస్తే ఆదర్శనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు.కూటమి ప్రభుత్వంపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఫైర్ -
తొలి తెలుగు శాసనానికి విశ్వఖ్యాతి
కడప ఎడ్యుకేషన్ : కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనానికి విశ్వఖ్యాతి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కేంద్ర గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ సౌజన్యంతో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) శతజయంతి (1925–2025) సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలుగు శిలా శాసనం‘ నమూనా (రెప్లిక) స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇమ్మణ్ణి దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నా రు. తన తండ్రి గారి జిల్లా పర్యటన అనంతరం కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తమ ట్రస్టు ద్వారా సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ఉచిత విద్యా సదుపాయాలు, ఆరు లక్షల మందికి పైగా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమ్ పూల మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని, తెలుగు శిలా శాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే సత్కార్యంలో భాగస్వాములైన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా వెంకట్ సేవలు అమూల్యమైనవన్నారు. కడప జిల్లాలో వెలసిన మొదటి తెలుగు శిలాశాసన నమూనాను సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ మాట్లాడుతూ సామాజిక సేవకు మారుపేరైన దీపా వెంకట్ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తనయ అన్న గుర్తింపు మాత్రమే కాక ఆయన మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ మేనేజింగ్ ట్రస్టీగా సామాజిక సేవలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్, కలమల్ల ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వర్మ వంశీకుడు పీవీఎల్ఎన్ రాజు, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డాక్టర్ జి.పార్వతి మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులు సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను తిలకించారు. గ్రంథాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ -
సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యలో సంక్షోభం
మైదుకూరు : సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టి వేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా ఆరోపించారు. ఆదివారం మైదుకూరులోని డీసీఎల్ ఫంక్షన్ హాల్లో యూటీఎఫ్ 45వ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు కడప రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి డీసీఎల్ వరకు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మీరాజా మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని హరిస్తూ, బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని చెబుతూనే ప్రభుత్వ విద్యకు పాతరేస్తున్నదని దుయ్యబట్టారు. యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల అండదండలతో గెద్దెనెక్కి ఇప్పుడు ఉద్యోగులను విస్మరించడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేసే కార్యక్రమాలను నిరంతరం రూపొందించి అమలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా -
జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలకు పూర్తి న్యాయం
కడప కార్పొరేషన్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో పార్టీ కార్యకర్తలకు పూర్తిగా న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆదివారం అక్కాయపల్లె 47వ డివిజన్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రజలకు మేలు చేయకపోగా పేద, మధ్య తరగతి వర్గాలకు నష్టం కలిగించేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పేరుతో నెల రోజులు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంజద్బాషా మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కడప శాసన సభ్యురాలు కుర్చీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇసుక, మట్టి, వైన్ షాపులు, వెంచర్ల నుంచేగాక తోపుడు బండ్ల వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీతోనే సాధ్యమన్నారు. మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, రూ.27 కోట్లతో మంచినీటి పథకం తెచ్చామని, రెండు పార్కులు నిర్మించుకున్నామన్నారు. శ్మశానాలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా మేయర్ పాకా సురేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, డాక్టర్ నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, త్యాగరాజు, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
వైఎస్సార్సీపీ దళిత నాయకునిపై టీడీపీ నాయకుల దాడి
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామం దళితవాడకు చెందిన చాట్ల విజయభాస్కర్ (38)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడికి దిగారు. అతని వద్ద ఉన్న మొబైల్ఫోను, డబ్బును లాక్కున్నారు. దీంతో బాధితుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.చాట్ల బాలరాజు వైఎస్సార్సీపీలో దళిత సంఘం నాయకునిగా ఉంటున్నాడు. తుడుమలమదిన్నె గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చందా శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేసి నువ్వు మా గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ కులం పేరుతో, కుటుంబ సభ్యులను సైతం తిట్టాడు. ఫోన్ సంభాషణ రికార్డింగును ఖాజీపేట సీఐ వంశీధర్కు వినిపించి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు స్టేషన్కు వెళ్లాడు. సీఐ న్యాయం చేస్తానని చెప్పడంతో వెనుదిరిగాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చందా శ్రీనివాసులరెడ్డి, మదన్మోహన్రెడ్డి, సుధాకర్రెడ్డి, సంతోష్లు బైక్పై ఉన్న విజయభాస్కర్ను ఈడ్చి తీవ్రంగా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వీపీ రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోలీసు స్టేషన్కు చేరుకుని బాధితునికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.బాధితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. -
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్
ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది.. ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది.. పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే.. సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు.. విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు.. అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్ జగన్మోహనుడు.బద్వేలు : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు. రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి. పడిలేచిన కెరటం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా .. 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు. జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు. నేడు జన్మదిన వేడుకలు..వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.మళ్లీ జగనన్న పాలనే రావాలి ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ లీడర్ అంటే జగనే ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్ కరీముల్లాకు 2021లో లివర్ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు సీఎంఓకి ఫోన్ చేశారు. కరీముల్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ ఆదుకున్న మనసున్న లీడర్ వైఎస్ జగన్..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు మా కుటుంబానికి దేవుళ్లు వైఎస్సార్.. వైఎస్ జగన్ మా కుటుంబానికి దేవుళ్లు. 2004లో వైఎస్ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం మా కుటుంబానికి అందలేదు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్.. వైఎస్ జగన్ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. – పెసల కొండారెడ్డి, చియ్యపాడు, చాపాడు మండలంఎప్పటికీ రుణపడి ఉంటా..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాశినాయన మండలం, వైఎస్సార్ కడప -
తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వాటర్ గ్రిడ్ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘గూగుల్ డేటా సెంటర్ నుంచి అన్నింటిలో క్రెడిట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్ చేపట్టిన వాటర్ గ్రిడ్కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు...ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ...విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్ చోరీకి పాల్పడాలని అర్నాబ్ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్రెడ్డి హెచ్చరించారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్ఓ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఇందుకు సంబంధించి పోలియో చుక్కలు ప్రభుత్వ వైద్య కేంద్రాలతోపాటు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ -
డీజిల్ దొంగతనంపై విచారణ
చాపాడు : బెంగళూరు – విజయవాడ మధ్య జరుగుతున్న గ్రీన్ఫీల్డు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో బుధవారం జరిగిన డీజిల్ దొంగతనంపై శనివారం ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు. ఎర్రగుడిపాడు–ఆదిరెడ్డిపల్లె ప్యాకేజి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మండలంలోని రామసుబ్బమ్మకొట్టాలు గ్రామ సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ రామసుబ్బమ్మ కొట్టాలు–పెద్దగురువళూరు, కుచ్చుపాప, వెదురూరు గ్రామాలకు వెళ్లే క్రమంలో రోడ్డుపై వంతెన నిర్మిస్తున్నారు. పనులు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఇక్కడ ఉన్న హిటాచీ వాహనం నుంచి 200 లీటర్ల మేరకూ డిజిల్ను అపహరించినట్లు రోడ్డు నిర్మాణ ప్రతినిధులు గుర్తించారు. రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం ఏఎస్ఐ సంఘటనా స్థలం వద్ద విచారించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వర్కర్లను విచారించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రెండు ఆటోలు దగ్ధంపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసంటున్న శివ, కుళ్లాయి బాషాలకు చెందిన రెండు ఆటోలకు శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వీరిద్దరూ ఆటోలను పెట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మద్యం తాగుతున్న వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మళ్లీ జగనన్న పాలనే రావాలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ -
ఇంటర్ నూతన పరీక్షా విధానంపై అవగాహన సదస్సు
కడప ఎడ్యుకేషన్ : జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ –2020) అనుగుణంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2025–26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో శనివారం 2025– 26 విద్యా సంవత్సరం నుంచి మారిన ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో తెచ్చిన సమూల మార్పులపై కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, ిపిన్సిపల్స్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఈ 2026 పబ్లిక్ పరీక్షలలో రెండవ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం పూర్తిగా కొత్త విధానంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షల విధానం అమలు చేస్తారన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఈఆర్టీడబ్ల్యూ) జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు గణిత సబ్జెక్టుల్లో 150 మార్కులకు 1ఏ, 1బి లుగా రెండు పేపర్లు వేర్వేరు రోజుల్లో ఉండేవన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం ఒకే పేపర్ గా 100 మార్కులకు ఒకే రోజు ఉంటుందన్నారు. అలాగే గతంలో బాటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు వేర్వేరు పేపర్లు, వేర్వేరు రోజుల్లో పరీక్ష నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం నుంచి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష 85 మార్కులకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఒకేరోజు రెండు విడివిడి సమాధాన పత్రాలలో బాటనీ, జువాలజీకి సంబంధించిన సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అడిషనల్ సబ్జెక్టుగా, బైపీసీ విద్యార్థులు గణిత సబ్జెక్టును అడిషనల్ సబ్జెక్టుగా ఎంచుకొని ఎం బైపీసీ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. గత సంవత్సరం ఉన్న సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. -
వంద బస్తాల వడ్లు ఉచితంగా పంపిణీ
కడప ఎడ్యుకేషన్ : కడప నగరం రామచంద్రాపురం గ్రామంలో శనివారం లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ లేవాకు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 50 కేజీల బరువైన వంద బస్తాల వడ్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న రెండు ఎకరాల్లో సొంత ఖర్చుతో వరిపంటను సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని తమ చుట్టుపక్కల గ్రామాలైన పబ్బాపురం, రామచంద్రాపురం, రామరాజుపల్లెకు చెందిన పేదలకు ఒక్కొక్కరికి 50 కిలోల చొప్పున వంద బస్తాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ పినతండ్రి లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి కొనసాగిస్తున్నామని తెలిపారు. ట్రస్టు వైస్ చైర్మన్ లేవాకు నితీష్రెడ్డి, ట్రస్టు సభ్యులు లేవాకు రఘునాథరెడ్డి, లక్ష్మిదేవి, మహేశ్వరరెడ్డి, శివ, వేమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ సెంటర్పై విజిలెన్స్ దాడులుకడప అర్బన్ : MýSyýlç³ ¯]lVýS-Æý‡…ÌZ° gñæ.G….[ïÜtsŒæÌZ E¯]l² Æ>Ķæ$-ÌS-ïÜÐ]l$ º*Åsîæ òÜ…r-ÆŠ‡Oò³ Ôèæ°-ÐéÆý‡… ÑhÌñ毌SÞ A«¨M>-Æý‡$Ë$, íܺ¾…¨ §éyýl$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D §éyýl$-ÌSÌZ ç³Ë$ Æý‡M>ÌS M>òÜÃ-sìæMŠS ÝëÐ]l${W ç³Ç-Ö-Í…-^éÆý‡$. GÐ]l*Ãȵ «§ýlÆý‡ ÌôæMýS$…yé AÐ]l¬Ã-™èl$¯]l², GMŠS{OòÜీ M>ÝùÃsìæMŠS AÐ]l$Ã-M>Ë$, GÐ]l*Ãȵ Æó‡rϯ]l$ Ð]l*Æó‡aíÜ AÐ]l¬Ã-™èl$¯]l² A…Ô>-ÌS¯]l$ ç³Ç-VýS׿-¯]l-ÌZMìS ¡çÜ$MýS$° ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. D ™èl°T-ÌSÌZ ÎVýSÌŒæ Ððl${sêÌSi C¯ŒS-òܵ-MýStÆŠ‡ G….Ñ Æý‡Ðól$‹Ù MýS$Ð]l*ÆŠ‡ Æð‡yìlz, ÑhÌñ毌SÞ A«¨-M>-Æý‡$Ë$ ¼.X-™éÐé×ìæ, ¼. »êº$ Ððl*òÜ‹Ü, G‹Ü. Rêgê çßæ$õÜÞ¯ŒS ´ëÌŸY¯é²Æý‡$. °º…-«§ýl-¯]lÌZ EÌSÏ…-íœ$…^ól Ķæ$fÐ]l*-¯]l$-ÌSOò³ ^èlrt-ç³-Æý‡…V> ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê-Ð]l$-¯é²Æý‡$. òßæyŠæ M>°-õÜt-º$ÌŒæ G‹Ü.-Æý‡ïœ, M>°-õÜt-º$â¶æ$Ï G‹Ü. sìæç³š çÜ$Ìê¢-¯Œl, çÜ$«§éMýSÆŠæ, Æý‡…™èl$ »êÚë ´ëÌŸY¯é²Æý‡$. -
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆసుపత్రిలో ఈనెల 8 తేదీన అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి (49) చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. యువజనోత్సవాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభకడప ఎడ్యుకేషన్ : యువజన సర్వీసుల శాఖ, విజయవాడ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారని స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఐ.జె. విజయ్ కుమార్ తెలిపారు. కవిత్వంలో ఎస్.హీన ఫిరసత్ ప్రథమ, కథా రచనలో ఎం. వెంకట సాహిత్య ద్వితీయ బహుమతి పొందారని తెలిపారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాలికడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్లో శనివారం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఈయన కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్న తరగతి గదిలో ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న బోధనాభ్యాసన చర్చా విషయాలను పరిశీలించారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రమణమూర్తి, నరసింహరాజు, హెచ్ఎం ముబీన రెహనా తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిఎర్రగుంట్ల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ చీఫ్ మేనేజర్ ఐఆర్పీఆర్ హెచ్ఓడీ పేర్ల భార్గవరెడ్డి తెలిపారు. శనివారం తిప్పలూరులోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్, పెయిడ్ స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భార్గవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీఎస్ఆర్ హెడ్ నితీశ్వర్కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మాజీ సలహదారులు అంబటి కృష్ణారెడ్డి, సంస్థ డైరెక్టర్ చలపతిరావు, ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్మధన్రెడ్డి పాల్గొన్నారు. గువ్వలచెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న నక్షత్ర ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిలైంది. డ్రైవర్ బస్సును అదుపు చేయలేక ముందు వెళుతున్న లారీని ఢీకొన్నాడు. బస్సులోని అయ్యప్ప భక్తులు పదిమందికి, డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. వీరంతా శబరిమలలో దర్శనం ముగించుకొని హైదరాబాద్కు వెళుతున్నట్లు సమాచారం. -
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బా ధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎ స్పీ ఆదేశాల మేరకు ఆర్ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శా ఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మ హేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు. మహేశ్వర్ రెడ్డి (ఫైల్), నివాళులర్పిస్తున్న ఆర్ఐ శివరాముడు -
కరెంట్షాక్తో యువకుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్షాక్తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి – మరొకరికి గాయాలు అర్ధవీడు (ప్రకాశం) : వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
● మద్యం తాగొద్దని మందలించినందుకు.. ● నరసింహుడును దారుణంగా హత్య చేసిన నాగరాజు ● 2021లో జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో జరిగిన ఘటనప్రొద్దుటూరు క్రైం : జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021లో జరిగిన హత్య కేసులో ప్రొద్దుటూరులోని ఎర్రన్నకొట్టాలకు చెందిన ఇల్లూరు నాగరాజు అనే నిందితుడికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021 అక్టోబర్ 24న జ్యోతుల పండుగ నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు గూడెంచెరువు గ్రామానికి చెందిన సర్వ నరసింహుడు అనే బంధువు మిద్దె లక్ష్మిదేవి ఇంటికి వచ్చాడు. వారింటి సమీపంలోనే వెంకటరాముడు నివాసం ఉంది. అతని అల్లుడైన ఇల్లూరు నాగరాజు కూడా పండుగ నిమిత్తం వెంకటరాముడు ఇంటికి వచ్చాడు. నాగరాజు మద్యం సేవించి అందరితో గొడవ పడుతుండటంతో నరసింహుడు అతన్ని వారించాడు. ఎందుకు మద్యం తాగి అందరితో గొడవ పడుతున్నావని సున్నితంగా మందలించాడు. దీన్ని నాగరాజు అవమానంగా భావించి మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మరుసటి రోజున (2021 అక్టోబర్ 25న) నాగరాజు లక్ష్మీదేవి ఇంటి వద్దకు వెళ్లాడు. ‘అలా బయటికి వెళ్దాం రా..’ అని మాయమాటలు చెప్పి నరసింహుడును తీసుకెళ్లాడు. అలా నరసింహుడుతో కలసి వెళ్లిన నాగరాజు రక్తపు మరకలు కలిగిన షర్టుతో సాయంత్రం ఒంటరిగా ఇంటికి వచ్చాడు. అనుమానం కలిగిన లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు నరసింహుడు కోసం వెతికే క్రమంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తారస పడ్డాడు. నరసింహుడు గురించి అతన్ని అడుగగా మామిడి తోటలోకి వెళ్లి చూడమని చెప్పాడు. లక్ష్మీదేవి, ఆమె కుమారుడు రామ్మోహన్తో కలిసి తోటలోకి వెళ్లి చూడగా నరసింహుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు అప్పటి జమ్మలమడుగు అర్బన్ సీఐ జి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. నిందితుడు నరసింహుడును అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో జరుగుతూ వచ్చింది. తుది విచారణలో నేరం రుజువు కావడంతో ఇల్లూరు నాగరాజు అలియాస్ ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె సత్యకుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి వాదనలను వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ప్రస్తుత జమ్మలమడుగు సీఐ సురేష్, కోర్టు హెడ్కానిస్టేబుళ్లు నాగరాజు, మహబూబ్బాషా, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని తన కార్యాలయంలో ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్యచే డ్రైవర్లకు యోగా, ధ్యానం ప్రాధాన్యతను తెలియజేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయించారు. గోపాల్రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు పనితీరుతోనే ఆర్టీసీకి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయన్నారు. నిర్ణీత సమయంలో బస్సును నడిపినపుడే ప్రయాణీకుల మన్ననలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలాగే ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉన్న అంశాలను తెలియజేశారు. పులివెందుల డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ ప్రమాదాలపై సమీక్ష చేశారు. డ్రైవర్లకు బ్లాక్ స్పాట్పై జాగ్రత్తలను తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపోలకు చెందిన 19 మంది డ్రైవర్లు, కండక్టర్లు హాజరయ్యారు. -
రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం
● అరుదైన వన్యప్రాణుల స్మగ్లింగ్లో నలుగురు అరెస్ట్ ● స్థానిక ఎస్సార్కె లాడ్జీలో నిందితులను విచారించిన అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇన్టెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారిని పట్టణంలోని ఎస్సార్కె లాడ్జ్లో మధ్యాహ్నం నుంచి 9 గంటలకు పైగా విచారణ చేస్తుండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమికూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు, అధికారులు, పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జ్ను మొత్తం వారి అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీశాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరాజుపేటకు చెందిన ఆటోడ్రైవర్ మొలకల సుబ్రమణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచారిలను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పూడుపాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారివద్దనుండి కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదుపులోకి తీసుకొన్న వారితో అధికారులు, లాడ్జీ ముందు గుమికూడిన జనం -
మట్కా బీటర్లు అరెస్ట్
కడప అర్బన్ : కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మట్కా బీటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. షేక్ మస్తాన్ షరీఫ్, మొహమ్మద్ గౌస్ అనే ఇరువురు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి దాడులు చేసి వారి నుంచి రూ.6.950 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. టీవీ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు రామాపురం : మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా పోర్టబుల్ టీవీ పేలి పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గూడురు లక్ష్ముమ్మ అనే వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా టీవీ పూర్తిగా దెబ్బతినగా, బీరువా, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానికులు కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధిక వోల్టేజ్, నిరంతరం టీవీ ఆన్లో ఉండటం వలన పేలుడు జరిగి ఉండవచ్చునని లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, వోల్టేజ్ స్టెబిలేజర్లు వినియోగించాలని సూచించారు. కడప వ్యాపారి హత్య రాయచూరు రూరల్ : వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు. ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ
వల్లూరు : వల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకుంది. దీంతో వాహన దారులకు అతి సమీపంలోకి వచ్చే వరకు ఎదురుగా వున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తప్పెట్ల గ్రామ సమీపంలో కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సీ కొత్తపల్లెకు చెందిన రైతు చంద్ర శేఖర్ అలియాస్ చెన్నయ్య బక్కిరెడ్డిపల్లె సమీపంలోని పొలంలో సేద్యం పనులకు ఎద్దుల బండిలో బయలుదేరాడు. అదే సమయంలో కడప వైపు నుండి కమలాపురం వైపు వెళ్తున్న లారీ పొగ మంచు కారణంగా కనిపించక పోవడంతో ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండి బోల్తా పడింది. బండిలో వున్న రైతు చెన్నయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా మంచు కమ్ముకున్న పరిస్థితుల్లో మరో ప్రమాదం జరగకుండా రోడ్డుపైన బోల్తా పడి ఉన్న ఎద్దుల బండిని పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. -
గాంధీ విగ్రహం ఎదుట నిరసన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ఉపాధిని హరించే జీ–రామ్–జీ అనే నూతన బిల్లును బీజేపీ లోక్సభలో బలవంతంగా ఆమోదింపజేసిందని దీనిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఐటిఐ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మకద్రోహమని, ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్వేష్, దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రరెడ్డి జమీల, వెంకటేశ్వర్లు, నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, నారాయణరెడ్డి, శంషాద్, విజయ్, తిమ్మయ్య, ప్రవీణ్ కుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు. -
సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్ డీన్ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 21న సీనియర్స్ జిల్లా స్థాయి నెట్బాల్ ఎంపికలను కడప నగరంలోని జేేఎంజే జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్బాల్ సంఘం కార్యదర్శి రెడ్డయ్య తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరగనున్న రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని శుక్రవారం పెండ్లిమర్రి పీహెచ్సీపీ వైద్యాధికారి ప్రసాద్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లటూరులో నిర్వహిస్తున్న వరదారెడ్డి ప్రథమ చికిత్స కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించామని తెలి పారు. అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికిత్స చేయకపోడంతో చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసీ డీఎంహెచ్ఓకు తెలిపామన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశాల గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 20వ తేదీ పీజీలో ప్రవేశాలు చేసుకునేలా కళాశాలలకు అవకాశాన్ని కల్పించిందన్నారు. అభ్యర్థులు తమ బరిజనల్ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయంలోని డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ –2025 రాసి అర్హత సాధించిన వారు, రాయని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చన్నారు. మదనపల్లె సిటీ: జేఎన్టీయూ సౌత్జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్టీయూ సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు ఉన్నతమైన నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు, నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు. -
వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రతి పాఠశాల పదో తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల (మెయిన్)లోని యాక్షన్ ప్లాన్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో తరగతి గదిలో మమేకమై ప్రిపరేషన్పై అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముబీన రెహనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులుగా పని చేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ వారికి పదోన్నతుల పత్రా లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, పరిపాలన అధికారి చాంద్బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
21న రచ్చబండ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత బలంగా చేపట్టేలా కార్యాచరణ కొనసాగుతోందని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో కమిటీల నియామకం పూర్తయిందన్నారు. కమిటీల నియామకం పూర్తయిన నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా మడకశిర నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోను, అనంతరం వేమూరులోను కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్.. కడప పార్లమెంటులో పూర్తి చేద్దామని పిలుపునివ్వడంతో వాళ్లు కూడా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో 80 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. ఈ నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల ప్రోత్సాహం చెప్పుకోదగినదని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం పటిష్టం జరిగి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కిందిస్థాయిలో ఏది చేయాలన్నా, వాళ్ల ద్వారా చేయడం, లేదా ఇన్వాల్వ్ చేయడం కోసం పటిష్టమైన నాయకత్వం రికార్డు అయి ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, సెంట్రల్ ఆఫీసులో డేటా అందుబాటులో ఉండేందుకు, బీమా, ఐడీ కార్డులు అందించేందుకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు ప్రయారిటీ తెలుస్తుందని వివరించారు. ‘రేపు (ఆదివారం) మన అధ్యక్షులు వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై తీర్మానం, గవర్నర్కు మెమొరాండం ఇచ్చినది ఆయా కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలి. స్థానిక సమస్యలు పెట్టాలి. ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన ప్రభావం గ్రామాల్లో పడుతుంది. కాబట్టి, పేద కూలీలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేయాలి. రైతుల సమస్యలు, మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాలు లేకపోవడం వంటివాటిని చేర్చవచ్చు. సోషల్ మీడియా వేదికలు వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగాం ద్వారా యాక్టివ్గా ఉండేవారిని గుర్తించి షేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ ఇన్చార్జీలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మూడు, నాలుగునెలలు మీటింగులు జరగాలి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహిస్తే అదే గాడిలో పడుతుంది’ అని సజ్జల పేర్కొన్నారు. సంస్థాగత కమిటీలు పూర్తయిన 10 నియోజకవర్గాల్లో నిర్వహణ వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ -
నేడు కెరీర్ ఫెస్ట్
కడప ఎడ్యుకేషన్: స్థానిక వైఎస్సార్ అడిటోరియం పక్కన ఉన్న నూర్జహాన్ షాదిఖానా – ఉర్దూ ఘర్లో శనివారం జిల్లా కెరీర్ యాక్టివిటీ ఎక్స్పో, ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పేమ్రంత్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై శుక్రవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 36 మండలాల నుంచి పాల్గొననున్నారని చెప్పారు. ప్రతి మండలం నుంచి 5 ప్రాజెక్టులు ప్రదర్శించాన్నారు. అందులో 3 కెరీర్ పాత్ మోడల్స్, 1 పెయింటింగ్, 1 వృత్తి విద్య/వృత్తి దుస్తుల పోటీ ఉండాలని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో మండల స్థాయి విజేతలందరూ పాల్గొనాలని సూచించారు. కాగా ఇంటర్మీయెట్ తర్వాత ఏ కోర్సులు చదివితే, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వంటి విషయాలపై ఈ ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల ద్వారా తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇందులో తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో ఆరోగ్య మేరీ, సెక్టోరియల్ అధికారులు, జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బోయనపల్లెను వీడని గంజాయి వాసన!
రాజంపేట: కడప–రేణిగుంట హైవేలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బోయనపల్లె.ఈ ప్రాంతాన్ని గంజాయి వాసన వీడేటట్లు కనిపించడంలేదు.బోయనపల్లెలో వివిధ ఇంజినీరింగ్ విద్యాసంస్ధలు ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులు ఉన్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఈ ప్రంతానికి వస్తుందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు న్యూ బోయనపల్లెలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేది ఓపెన్ టాక్. రూ.350, రూ.450, రూ.550లకు విక్రయిస్తున్నట్లు పలువురు చెపుతున్నారు. యువతను అధికంగా ఆకర్షించేలా రహస్యంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి అవుతోందన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. . పోలీసు సబ్కంట్రోల్ ఉన్నా.. న్యూబోయనపల్లెలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంది. పోలీసు సిబ్బంది కొరత కారణంగానే నిర్వహణ భారంగా మారిందనే భావనలు శాఖాపరంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మూతపడింది. గతంలో బోయనపల్లెలో అటు మద్యం, ఇటు గంజాయి మత్తులో యువత వీరంగాలు సృష్టించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.అనుమానితులపై నిఘా.. తాజాగా గంజాయి అమ్మకాలు విషయంలో మన్నూరు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కొందరిని పట్టుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో స్పెషల్పార్టీ సంచరిస్తోంది. అవాంఛనీయ సంఘటన ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుగా అమ్మకాలు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
బాదుడే.. బాదుడు!
వాహనం సంవత్సరాలు గత రేటు ప్రస్తుత రేటు ● ఫిట్నెస్ పేరుతో చార్జీల మోత ● వాహనదారులపై అదనపు భారం ● ఆందోళన చెందుతున్న యజమానులు ● ఇక వాహనాలు నడపలేమంటున్న వైనం కడప వైఎస్ఆర్ సర్కిల్: వాహనదారులు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ చార్జీలు పెంచింది. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకు పైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెన్స్తోపాటు విడిభాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇటు పెరిగిన ఫిట్నెస్ చార్జీలు అటు ఈఎంఐలు కట్టలేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు నడపలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వివిధ రకాల వాహనాలు, లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు అధికంగా ఉన్నాయి. వాటి యజమానులకు.. పెంచిన చార్జీలు అదనపు భారం కానున్నాయి. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. లైట్ గూడ్స్ వెహికల్స్, మిడిల్ గూడ్స్ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్గా విభజించి ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు హెవీ వెహికల్స్ 10 920 1416 10–13 2360 15–20 16,520 20 ఏళ్లకు పైగా 33,040 ఎంజీవీ 10 920 1416 10–13 2360 15–20 13,334 20 ఏళ్లకు పైగా 26,668 ఆటో 15 620 944 15–20 2360 20 ఏళ్లకు పైగా 10,620 ఎల్జీవీ 15 820 944 15–20 10,030 20 ఏళ్లకు పైగా 20,060 కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్జేటీసీ) కృష్ణ వేణి పేర్కొన్నారు. శుక్రవారం నగర శివారులోని ఊటుకూరులో ఉన్న జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ స్థాయి అర్ధ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ లక్ష్యాలను 82 శాతం మాత్రమే సాధించామని, వంద శాతం సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు పంపించాలని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి వాహన పన్నుల వసూలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాల డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
బ్రిటన్, కువైట్లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై ఎరుపెక్కిన ఉద్యమం
● కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆందోళన ● పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత ● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన శ్రేణులు కడప సెవెన్రోడ్స్: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. చివరికి పోలీసు వలయాన్ని చేధించుకుని ఆందోళనకారులు లోనికి వెళ్లి బైఠాయించారు. సామాన్యులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జీఓ నెం. 590, 107, 108లను జారీ చేసిందని, వాటిని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర స్పష్టం చేశారు. కొత్త వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ధ్వజమెత్తారు. ఇది సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద, మద్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ భూ ములు, భవనాలు, వసతులు, కళాశాలలు, ఆస్పత్రు లు దాదాపు 60 ఏళ్లు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, చంద్రశేఖర్, సుబ్రమణ్యం, మద్దిలేటి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.శివతేజ, ఎల్.చంద్ర, ఏఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలంటూ కలెక్టరెట్ ఎదుట బైఠాయించిన సీపీఐ శ్రేణులు.. కలెక్టరేట్లో దూసుకొస్తున్న, సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు -
ఉత్సాహంగా క్రాస్ కంట్రీ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక టీవీఆర్ హైస్కూల్ సమీపంలో బాల, బాలికలకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ (దూరపు పరుగు) పోటీల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతి చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు బాలుర అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ పోటీలో పి.ఇస్మాయిల్, పి.ఫరీద్ బాషా, అండర్–18 విభాగంలో 6 కిలోమీటర్లు పోటీలో ఎస్.షాహిద్, వి.పవన్, అండర్–20 విభాగంలో 8 కిలోమీటర్లు పోటీలో ఎల్.రాంభూపాల్రెడ్డి, ఎస్.దాదా దస్తగిరి, పురుషుల 10 కిలోమీటర్ల పోటీలో హర్ష, బాలికల అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు పోటీలు ఎస్.లాల్బీ, షేక్ పాతిమా నస్రిన్, అండర్–18 విభాగంలో 4 కిలోమీటర్ల పోటీలో ఎం.రాధా, ఎస్.షాహిన్ ఎంపికయ్యారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా వివరించారు. వీరు ఈనెల 24న బుధవారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ సంచాలకులు లక్ష్మీ, రాఘవ, నాగేశ్వరరావు, సంజీవ్, శివ, సీనియర్ క్రీడాకారులు సికిందర్, సలీం ఈ పోటీల నిర్వహణలో సహకరించారని తెలిపారు. -
పాలకుల కుట్రను అంతం చేసే సంతకం!
పాలకుల కుట్రను అంతం పలకడమే లక్ష్యంగా జన‘కోటి’సంతకంతో సమరమే చేసింది. యువత భవిత కోసం సంతకంతో మద్దతు పలికింది. ప్రై‘వేటు’పై కలంతో పోటెత్తింది. పాలకుల తీరును ఎండగడుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంది. వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపింది. ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణపై గళమెత్తేలా చేసింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న తీరుపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. –కడపఎడ్యుకేషన్/జమ్మలమడుగు/కమలాపురం -
ప్రైవేటీకరణతో తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏపీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాలు ఉంటే.. మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతోంది. అందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులందరం స్వచ్ఛందంగా పాల్గొన్నాం. – పాతకుంట హేమంత్రెడ్డి, విద్యార్థి, చెన్నూరు. ప్రభుత్వమే కాలేజీలు నడిపిస్తే పేదలకు మేలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. నీట్ పరీక్షలు రాసినప్పుడు ప్రభుత్వ కాలేజీలలో మంచి ర్యాంకు సాధించిన వారికి ప్రభుత్వ ఫీజులతోనే సీటు వస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా కాలేజీ యాజమాన్యం లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. –ఆర్షద్, ఇంటర్మీడియట్, జమ్మలమడుగు -
21న తొలి తెలుగు శాసనం నమూనా ఆవిష్కరణ
కడప సెవెన్రోడ్స్: ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని తొలి తెలుగు శాసనానికి తయారు చేసిన నమూనాను ఈనెల21న కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠం మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్, ప్రముఖ రచయిత, చరిత్రకారులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. గతేడాది కలమల్లలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయు డు తొలి తెలుగు శాసనంపై స్పందించారు. శాసనం అందరికీ అందుబాటులో ఉండాలంటే నమూన తయారు చేసి ప్రతిష్ఠించాల్సిన అవసరముందని భావించారు. అందుకు సరైన వేదిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంగా గుర్తించారు. ఆయన మానస పుత్రిక స్వర్ణభారత్ ట్రస్టు తరఫున నమూన తయారు చేయిస్తామని హామి ఇచ్చారు. ఆ మేరకు నమూన సిద్దమైంది. ఈనెల 21న బ్రౌన్ గ్రంథాలయంలో నమూన స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఐ.దీప వెంకట్ ఆవిష్కరించనున్నారు. అధికారభాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రివిక్రమరావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. తొలి తెలుగుశాసన ప్రతిరూపం కలమల్లలోని శాసనం -
అవినీతి నిర్మూలనకు కృషి చేస్తాం
కడప అర్బన్: సమాజంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ‘అవినీతి’కి పాల్పడినా తమ దృష్టికి నేరుగాగానీ, టోల్ ఫ్రీ నెంబర్ ‘1064’కుగానీ, డీఎస్పీ ఫోన్ నెం. 94404 46191కు సమాచారం ఇవ్వాలని, నిరంతరం అందుబాటులో ఉంటామని కడప ఏసీబీ నూతన డీఎస్పీ సీతారామారావు అన్నారు. గురువారం ఆయన కడపలోని అవి నీతి నిరోధకశాఖ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డితో కలిసి అవినీతి నిరోధకశాఖకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు టోల్ఫ్రీ నెంబర్: 1064తో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా 1995 బ్యాచ్కు చెందిన ఆయన వివిధ ప్రాంతాలలో ఎస్ఐగా, సీఐగా విధులను నిర్వర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో స్పెషల్బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తూ కడప అవినీతి నిరోధకశాఖ డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పోలీసుశాఖతో పాటు, ఏ ప్రభుత్వశాఖలోనైనా అవినీతి అధికారులున్నా ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెం ‘1064’కు సమాచారం ఇవ్వండి కడప నూతన ఏసీబీ డీఎస్పీ సీతారామారావు వెల్లడి -
విదేశీ బీమా కంపెనీలు వద్దు..స్వదేశీ ఎల్ఐసీ ముద్దు
కడప సెవెన్రోడ్స్ : బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వ బీమా రంగ పురోగతికి ఆటంకమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. గురువారం కడప బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అవధానం శ్రీనివాస్ అధ్యక్షతన అఖిల పక్ష సంఘాల నిరసన ప్రదర్శనలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లియాఫీ, సీఐటీయూ, ఇతర ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు రఘునాథ్ రెడ్డి, మనోహర్, అజీజ్, నారాయణరెడ్డి, లలిత, జగదీశ్వర్ రెడ్డి, సుధీకర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు 74 శాతం ఎఫ్డీఐ పరిమితి ఉందని, కానీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని అన్నారు. మొత్తం బీమా రంగంలో కేవలం 32.67 శాతం మాత్రమే ఎఫ్డీఐ వచ్చిందని అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే 74 శాతం పరిమితిని పూర్తిగా వాడుకున్నాయని, మరో 6 ప్రధాన కంపెనీలకు విదేశీ ఈక్విటీ ఏమీ లేదన్నారు. ఇప్పుడున్న 74 శాతం పరిమితి బీమారంగవృద్ధికి అడ్డు కాదని ఇది నిరూపిస్తున్నదని అన్నారు. 100 శాతం ఎఫ్డీఐ వస్తే దేశీయ పొదుపులపై విదేశీ కంపెనీల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి హానికరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాల సంఘాల నాయకులు అక్బర్ బాషా, కామనూరు శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బయ్య, లక్ష్మి దేవి, వారిజాతమ్మ, శ్రీకృష్ణ, ప్రశాంతి, శ్రీనివాసులు, కుమార్, సాదక్ వలీ, గౌస్, వెంకట్రామరాజు, నరసింహారెడ్డి, రామాంజుల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడప ఐఎంహెచ్ పీజీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కడప అర్బన్ : జిల్లా రిమ్స్ ఆవరణంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(ఐఎంహెచ్) పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎంఈలో ప్రతిభ కనబరిచారు. ఈనెల 13, 14 తేదీలలో నంద్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మానసిక వైద్య విభాగం సీఎంఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప రిమ్స్ ఆవరణంలోని ఐఎంహెచ్కు చెందిన పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థులు డాక్టర్ ఏ .శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీ చరిత క్విజ్ పోటీలలో పాల్గొని బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఐఎమ్హెచ్ వైద్యులు కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జమునను కలిశారు. ఆమె వైద్య విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ డి. సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ షాహిద్ బాషా, డాక్టర్ సరిత, డాక్టర్ సందీప్, డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ నగేష్, డాక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో జిల్లాకు ప్రథమ స్థానం
కడప రూరల్: నవంబర్ నెల వైద్య సేవలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ప్రథమ స్థానం లభించినట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. డెలివరీలు, ఇన్ పేషంట్, అవుట్ పేషెంట్, ల్యాబ్ టెస్ట్, వ్యాధి నిరోధక టీకాలతో పాటు ఇతర సేవలకు సంబంధించి నవంబర్ నెలకు రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించినట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్యాధికారులు, పారామెడికల్ వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రజలకు వైద్య సేవలందించాలని కోరారు. అట్లూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం జెడ్పీ సీఈఓ సి.ఓబుళమ్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించి తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును పరిశీలించారు. అట్లూరు ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలో ప్రజ లకు ఇబ్బందిగా ఉన్న పాడుబడిన బావిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని పరిశీలించి నూతన భవనానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఏఓ భాస్కర్బాబు, డిప్యూటీ ఎంపీడీఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. వేంపల్లె: ఖాట్మండులో ఈనెల 16 నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ గోల్ షాట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లెకు చెందిన రాచవీటి తేజేంద్ర ప్రతిభ చూపాడు. ఈయన వేంపల్లెలోని వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 2009 నుంచి 2025 వరకు కబడ్డీ, హ్యాండ్ బాల్, తైక్వాండో, షూటింగ్ బాల్ క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. తేజేంద్రను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. మదనపల్లె: మదనపల్లె నుంచి టమాటను రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెటింగ్శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్మన్ శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి జగదీష్ పలు అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. కడప ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ అండర్ 14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ను గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జమ్మలమడుగులోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి అలాగే టోర్నమెంట్ కార్యదర్శి శివశంకర్ రెడ్డిలకు పలు సూచనలు అందించారు. పాఠశాల హెడ్మాస్టర్లు బి. శ్రీనివాసులు రెడ్డి.సుబ్రహ్మణ్యం. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బాబు,ప్రసాద్ రెడ్డి, శివకృష్ణ, చంద్రమోహన్ రెడ్డి, రాయుడు, అంకాల్ రెడ్డి, హేమాంబ రెడ్డి,మహేష్, చరణ్, పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభు త్వం వేగంగా పావులు కదపడం దుర్మార్గం. వైద్య విద్య కళాశాలల పీపీపీ విధానం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది. ఏళ్లపాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే వారికి ఆదాయవనరులుగా మారతాయి. వైద్య విద్య పూర్తిగా వ్యాపారమవుతుంది. మేనేజిమెంట్ కోటా ద్వారా ఇచ్చే 20 శాత సీట్లు (376) ఒక్కో సీటుకు దాదాపు రూ.50 నుంచి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అధిక ఫీజు కారణంగా సామాన్య విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారనడంలో సందేహం లేదు. – అంకన్న, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
బి.కోడూరు : బద్వేలు సీనియర్ సివిల్ కోర్టులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని అక్కుపాలెం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కంబగండ్ల ఓబయ్య అలియాస్ నవీన్ 2019 జనవరి ఆరో తేదీన మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అహోబిలం తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీసు స్టేషన్లో అప్పటి ఎస్ఐ ఘనమద్దిలేటి కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సదరు కేసును బద్వేలు సీనియర్ సివిల్ జడ్జి వై.జె.పద్మశ్రీ విచారణ జరిపి ముద్దాయిపై నేర నిరూపణ కావడంతో 5 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.ఎస్.ఆర్.కృష్ణ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సదరు కేసులో సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్న బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, అప్పటి ఎస్ఐ ఘనమద్దిలేటిలతో పాటు కోర్టు కానిస్టేబుల్ రమణ, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ కిషోర్కుమార్లను జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాధ్ అభినందించినట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంటనే రద్దు చేయాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆయా కళాశాలలను 33 ఏళ్ల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50 శాతం తగ్గించడం, 50 శాతం సీట్లను మార్కెట్ రేట్లతో అమ్మడం వంటి నిర్ణయాలు వల్ల ఫీజులు అమాంతం పెరుగుతాయి. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య సేవలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. – డీయం.ఓబులేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
నేడో రేపో ఆదేశాలు...
పదో తరగతి నూరు రోజుల ప్రణాళిక కార్యక్రమ అమలుకు సంబంధించి ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారి లేదా మండల గెజిటెడ్ అధికారిని నియమించాం. వారు వారానికి రెండు రోజులు వారికి నియమించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత జాబితాను కలెక్టర్కు పంపించాం. ఆయననుంచి ఒకటి రెండు రోజలు సంబంధిత జాబితా విడుదల అవుతుంది. జాబితా విడుదలైనప్పటి నుంచి నియమించిన అధికారులు వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. –షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
పాత కక్షలే హత్యకు కారణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలో స్వరాజ్ నగర్లో ఖాళీగా ఉన్న ఎన్జీఓ ప్లాట్లలో ఈనెల 11వ తేదీన రాత్రి వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ (27) అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అతని బంధువు అయిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు తరలించారు. బాలుడిని జువైనల్ హోం( ప్రభుత్వ బాలుర గృహం)కు తరలించారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్కుమార్ అలియాస్ అరుణ్ హత్యకు గురైన వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ చిన్ననాటి స్నేహితులు. మృతుడికి మొదట వెంకట సుధతో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. తర్వాత అతను భవిత అలియాస్ అక్కమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న సమయంలో అరుణ్ తన మోటార్ సైకిల్ను కుదువకు పెట్టి మృతుడికి ఆర్థికంగా సహకరించాడు. అదే క్రమంలో మృతుడు వెంకట్ కూడా పూచీకత్తుగా ఉండి అరుణ్కు చెందిన మోటార్ సైకిల్ను కుదువ పెట్టి, తనకు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాడు. అయితే చెప్పిన సమయానికి అరుణ్ డబ్బులు చెల్లించక పోయే సరికి వెంకట్, అరుణ్ను అతని కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరంగా తిట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను వెంకట్పై కక్ష పెంచుకున్నాడు. అతనితో స్నేహ పూర్వకంగా ఉన్నట్లు నటిస్తూనే చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ సాయంత్రం అరుణ్ తన చిన్నాన్న కుమారుడైన బాలుని సహకారం తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి వెంకట్కు అతిగా మద్యం తాగించారు. పూర్తిగా మత్తులో ఉండగా, ఇద్దరు కలిసి వెంకట్ను సిమెంట్ ఇటుక దిమ్మెలతో తల పైన రక్తం వచ్చేలా కొట్టి దారుణంగా హత్య చేశారు. తొలుత హత్యకు కారణమైన వారి వివరాలు తెలియరాలేదు. తరువాత క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో ‘సోను’ అనే జాగిలం ప్రధాన నిందితుడి ఇంటిని కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. నేరస్తులను గుర్తించడంలో నేర్పరి ‘సోను ’ జాగిలం.. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్లో చేరిన ‘సోను’ డ్యూయల్ ట్రైనింగ్ పొందింది. పేలుడు పదార్థాలను, నేరస్తులను గుర్తించడంలో నేర్పరిగా పేరు గాంచింది. జిల్లా పోలీస్ శాఖలో చేరిన కొద్ది కాలంలోనే హత్య కేసు ఛేదించి ‘శభాష్.. సోను’ అని పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారి రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ బి.రామక్రిష్ణా రెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్ర బోస్, క్లూస్ టీం ఎస్ఐ ఎస్.వినీల, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మహబూబ్ హుసేన్, సుధీర్ రాజ, సోను జాగిలం, హెడ్ కానిస్టేబుల్ హరి ప్రసాద్, సుధాకర్, కానిస్టేబుల్ ఇస్మాయిల్, సుందర్ను అభినందించారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు పోలీసుల అదుపులో మరో బాలుడు కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ జాగిలం ‘సోను’ వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు -
మహిళ ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఎర్రమాచుపల్లెకు చెందిన బుర్రి లక్ష్మీదేవి (44) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. కడుపునొప్పి, కాళ్ల నొప్పులు భరించలేక స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చూపించుకుంటూ వచ్చింది. నయం కాకపోవడంతో బుధవారం రాత్రి ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు చాపాడు : మండల పరిధిలోని ప్రొద్దుటూరు –మైదుకూరు జాతీయ రహదారిలో నాగులపల్లె సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మిండ్యాల శేషాద్రి (18) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన శ్రీను, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు శేషాద్రి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు నుంచి పల్లవోలుకు బైకులో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిని స్థానిక వాహనదారులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎం.టి. విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి.వసంత్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఏఆర్ ఎస్ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఏఆర్ ఎస్ఐ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య కడప నగరం భాకరాపేట స్వామి నగర్లోని గృహంలో ఉంచిన ఏఆర్ ఎస్ఐ భౌతికకాయంపై పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సు చింతకొమ్మదిన్నె : కడప నగరం ఇందిరానగర్లో ‘నల్సా’ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది అక్బర్ అలీ, పారా లీగల్ వలంటీర్లు దశరథ రామిరెడ్డి, శ్రీనివాసులు, నిర్మల, రాజు, ఆశా, అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు. -
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా !
● ఆరు పథకాలతో ఆర్థిక ప్రయోజనాలు ● తపాలా శాఖ పథకాల విస్తరణ కడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎల్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా పీఎల్ఐ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో నమోదు కంపెనీల ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్.. దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 సంవత్సరాల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులకు సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయలకు రూ. 48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్... ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య గల వా రు అర్హులు. బీమా రూ.20వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకునే అవకాశం కల్పించా రు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకొనే వీలుంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బో నసులు వర్తించవు. కోతలు విధిస్తారు. ప్రతిఏటా 1000కి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఏటా రూ.1000 కి 76 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 18 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. కనీస బీమా రూ.20,000, గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కి అవకాశం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనసుల్లో కోతలు విధింపు తప్పవు. ప్రతి ఏటా రూ.1000 కి 52 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ. 20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్ పై బోనస్ల్లో కోత ఉంటుంది. పాలసీదారుడు మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు వర్తిస్తాయి. ప్రతి ఏటా రూ.1000కి 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయస్సు తప్పనిసరిగా ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనసులు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్ లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనసులు వర్తిస్తాయి. దరఖాస్తు చేయడం ఇలా.... పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి స్కీంలో భాగస్వాములు కావచ్చు. ఉమ్మడి జిల్లాలో 3,79,680 పాలసీదారులు పీఎల్ఐ పథకంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 3,79,680 మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో కడప డివిజన్లో 2,08,722, ప్రొద్దుటూరు డివిజన్లో 1,70,958 పాలసీదారులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పీఎల్ఐ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, ఈ పథకంలో చేరి వివిధ పథకాల్లోని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ బీమాతో ఎక్కువ ప్రీమియంలు పొందవచ్చు. పోస్టల్ ఉద్యోగులు పీఎల్ఐ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – రాజేష్, కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్. -
ఆర్టీపీపీలో నాలుగు ఇళ్లలో చోరీ యత్నం
● ఒక ఇంటిలో 3 తులాల బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు వేలి ముద్రలు సేకరిస్తున్న క్లూస్టీం వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు–525, 535, జీ టైపు–350, 362 క్వార్టర్లలో గరువారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అయితే ఒక ఇంటిలో మాత్రం బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, కొండాపురం సీఐ రాజ, కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి నాలుగు ఇళ్లలో పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు వరుసలో ఎఫ్–525 క్వార్టర్స్లో సుబ్రమణ్యం శ్రేష్టి నివాసం ఉంటున్నారు. ఆయన పని మీద చైన్నెకు వెళ్లారు. అలాగే ఎఫ్–535 క్వార్టర్స్లో నివాసం ఉంటున్న దుగ్గిరెడ్డి రామ్మోహన్రెడ్డి కుటుంబం హైదరాబాదుకు వెళ్లగా, ఆయన తాళాలు వేసి డ్యూటీకి వెళ్లారు. అలాగే జీ టైపు వరసలో ఉండే జీ–350 దేవచంద్ర కుటుంబంతో కలసి చిలంకూరుకు వెళ్లారు. జీ–362 క్వార్టర్స్లో ఉండే ఆదినారాయణరెడ్డి కూడా పనిమీద కుటుంబంతో బయటకు వెళ్లారు. ఈ నాలుగు క్వార్టర్స్లో ఏక కాలంలో ఇంటి తలుపులు పగలకొట్టి ఇంటిలోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఇంటిలోని బీరువాలను పగులగొట్టారు. అయితే జీ–350 క్వార్టర్స్లో ఉంటున్న దేవచంద్ర ఇంట్లో మాత్రం 3 తులాలు బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన మూడు ఇళ్లలో చోరీకి యత్నించారు కానీ ఎలాంటి నగలు, నగదు దొంగలకు దొరకలేదు. ఒకే ఇంటిలో రెండో సారి చోరీ... ఆర్టీపీపీలోని ఎఫ్ టైపు 525లో 2020లో చోరీ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే మరలా అదే ఇంటిలో ఇప్పుడు చోరీ జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో ఆర్టీపీపీలోని ఇదే కాలనీలో ఏకంగా 7 క్వార్టర్లలో చోరీ జరిగింది. అప్పుడు చోరీలను మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన వారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు దొంగలను కూడా పట్టుకుని కొంత మొత్తం రికవరీ చేశారు. భద్రతపై ఉద్యోగుల ఆదోళన.. ఆర్టీపీపీలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలోకి వెళ్లాలాంటే గేటు వద్ద ఎస్పీఎఫ్ సిబ్బంది పహారా ఉంటారు. గేటు దాటి లోనికి పోవాలంటే వారు నిత్యం తనిఖీ చేస్తుంటారు. దొంగలు ఏ విధంగా వస్తున్నారనే సందేహాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏపీజెన్కో యజమాన్యం స్పందించి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
పట్టపగలే దోపిడీ
కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామంలోని లక్ష్మి కాంతమ్మ, నారాయణరెడ్డి ఇంటిలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు 6.5 తులాల బంగారం దోపిడీ చేశారు. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం పెట్టమని అడుక్కుంటూ వచ్చారు. నారాయణరెడ్డి ఇంటివద్దకు వెళ్లగా బాత్రూమ్లో నారాయణరెడ్డి స్నానం చేస్తుండగా, లక్ష్మి కాంతమ్మ ఒక్కతే ఇంట్లో ఉండింది. ఇదే అదనుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి ఆమె ముఖంపై మత్తుమందు చల్లి ఆమెను తాడుతో కట్టేసి నోట్లో వస్త్రాలు పెట్టి బీరువాలోని ఒక నల్లపూసలదండ, ఒక చైన్ మొత్తం 6.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సీఐ రాజా, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుత్త చిన్నాయపల్లె గ్రామానికి చెందిన సింగంరెడ్డి వర లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వరలక్ష్మి బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుంచి కడప వైపు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తస్రావమైంది. స్థానికులతో పాటు అదే సమయంలో అటు వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేత సంబటూరు ప్రసాద్రెడ్డి ఆమెను పరామర్శించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అనంతరం స్థానికులు ఆమెను చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివ నాగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బత్తల శ్రీనివాసరెడ్డికి స్టేషన్ బెయిల్ పులివెందుల : బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బత్తల శ్రీనివాసరెడ్డికి పులివెందులలో స్టేషన్ బెయిల్ మంజూరైంది. మంగళవారం రాత్రి కడప కోర్టులో బెయిల్ మంజూరు కాగానే కోర్టు బయట వేచి ఉన్న పులివెందుల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పులివెందుల స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిపై నమోదైన కేసు సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ కావడంతో బుధవారం రాత్రి అతనికి 41ఏ నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. ఆ వెంటనే అతన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వసంతపేట పోలీసులు పులివెందుల డీఎస్పీ ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు విజయవాడరూరల్ : మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు రెడ్డిస్వాతి
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పరిధిలోని నిర్మల ఫార్మసి కళాశాలకు చెందిన ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. పులివెందుల జేఎన్టీయూలో జరిగిన యూనివర్సిటీ హ్యాండ్బాల్ పోటీలలో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జేఎన్టీయూ యూనివర్సిటీ జట్టుకు ఎంపికై ంది. 2026 జనవరిలో కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొని కళాశాల, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ మోహన్కుమార్ సూచించారు. రెడ్డి స్వాతిని నిర్మల ఫార్మసి కళాశాల చైర్మన్ బి. శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ మెహన్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగరాజు, కళాశాల సిబ్బంది అభినందించారు. -
కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బౌలర్ల ధాటికి ఉత్తరాఖండ్ బ్యాటర్లు తడబడటంతో రెండవ రోజే ఆంధ్రా జట్టుకు విజయం వరించింది. బుధవారం రెండవ రోజు 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 71.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆనంద్ జోషయ్య 58 బంతులకు 1 సిక్సర్, 4 ఫోర్లతో 49 పరుగులు, మన్విత్ కుమార్ రెడ్డి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ జట్టులోని నిషు పటేల్ 5 వికెట్లు, లక్ష్య రాయ్చందాని 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 36 ఓవర్లకు 102 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లక్ష్యరాయ్చందాని 30 పరుగులు, ఆయుష్ దేశ్వాల్ 25 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని ఏఎన్వీ లోహిత్ ఉత్తరాఖండ్ బ్యాటర్లపై చెలరేగి చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు, రాజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 10.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 20 పరుగులు, హానీష్ వీరారెడ్డి 35 పరుగులు చేశారు. దీంతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్ జట్టు ఆంధ్రా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. దీంతో ఆంధ్రా జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఏఎన్వీ లోహిత్, ఆంధ్రా (5 వికెట్లు)రాజేష్, ఆంధ్రా (4 వికెట్లు) -
విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన అవసరం
కడప అగ్రికల్చర్ : విద్యార్థి దశ నుంచే విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇప్పపెంట గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వ్యవసాయ అనుబంధ శాఖల గురించి తెలుసుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.అంకయ్య కుమార్ , ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.కృష్ణప్రియ, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పంటల సాగు, తెగుళ్లు, పురుగుల మందుల వాడకం గురించి తెలియజేశారు. తిరుపతి, మహానంది, ఉదయగిరి వ్యవసాయ కళాశాలల అసోసియేట్ డీన్లు రెడ్డిశేఖర్, జయలక్ష్మి, క్రిష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు రైతుల అనుభవాలను తెలుసుకొని మంచి దిగుబడులు ఎలా సాధించాలో నేర్చు కోవాలని సూచించారు. మండల అధ్యక్షుడు గంధం మోహన్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ -
నజీరుల్లా మఠం, మసీదు వక్ఫ్బోర్డు స్వాధీనం
ప్రొద్దుటూరు కల్చరల్ : మైదుకూరు రోడ్డులోని నజీరుల్లా షా మఠం, ఖాదర్ హుస్సేన్ మసీదులను వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వసీం అక్రం తెలిపారు. బుధవారం ఆయన నజీరుల్లా షా మఠం వద్ద నోటీసులు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది నజీరుల్లా షా మఠం ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని హైకోర్టులో పిటీషన్ వేశారన్నారు. హైకోర్టు, వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వక్ఫ్బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఖాదర్ హుస్సేన్ మసీదును సక్రమంగా నిర్వహించడం లేదని, కమిటీని సక్రమంగా నిర్వహించాలని అనేక సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పులేదన్నారు. దీంతో ఆ మసీదును వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నజీరుల్లాషా మఠం వద్ద అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు వీఎస్ ముక్తియార్, నజురుల్లా షా మఠం ట్రస్టు ప్రతినిధులు, సభ్యులు వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్తో చర్చించారు. కోర్టు తీర్పు మేరకు ఆస్తులపై సర్వే నిర్వహించాలని, నజీరుల్లా షా మఠాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు. -
అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరికి జైలు శిక్ష
ఎర్రగుంట్ల : ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. కలమల్ల ఎస్ఐ డి.సునీల్ కుమార్ రెడ్డి వివరాల మేరకు.. ముద్దనూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీధర్, కుంచెం గోపాల్ అనే యువకులు 2023 సంవత్సరంలో ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కడప పోక్సో కోర్టు జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ కుంచెం శ్రీధర్కు 21 రోజుల జైలు శిక్ష రూ.25 వేలు జరిమానా, కుంచెం గోపాల్కు 17 రోజుల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, ఎస్ఐ సునీల్కుమార్ రెడ్డి , కోర్టు కానిస్టేబుల్ ఎం.నారాయణ, కోర్టు మానిటరింగ్ ఏఎస్ఐ నాగేంద్ర, సీఐ వినయ్కుమార్రెడ్డిలను ఉన్నతాధికారులు ప్రశంసించారు. క్విజ్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కడప కార్పొరేషన్ : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటీ ఆధ్వర్యంలో సంస్థ పరిధిలోని 9 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ తెలిపారు. బుధవారం డివిజన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్విజ్ పోటీల్లో ఖాజీపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి జీవీవీ నాగిరెడ్డి, ఈ. నాగ రిషిత, ప్రొద్దుటూరు ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి వై. ప్రణీత్రెడ్డి, వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్ వి. వైష్ణవ్లు విజేతలుగా నిలిచారని తెలిపారు. -
ఖోఖో జిల్లా జట్టు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా ఖోఖో జూనియర్, సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జె.నరేంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంపిక నిర్వహించామన్నారు. జూనియర్స్ ఖోఖో జట్టు క్రీడాకారులకు కేఎన్ఆర్ ఎస్టేట్ (సుధీర్) స్పాన్సర్ చేశారు. అలాగే సీనియర్స్ జిల్లా ఖో ఖో జట్టుకు పురుషులకు యునిక్స్ బ్యూటీ సెలూన్ నిర్వాహకులు, మహిళల జట్టుకు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి (యోగి వేమన యూనివర్సిటీ) క్రీడా దుస్తులు అందించారు. ఈ ఎంపికలకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శివ బాబు, డాక్టర్ కె.రామ సుబ్బారెడ్డి, నారాయణ పాఠశాల ఏజీఎం హరీష్ బసవరాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో తమ ప్రతిభను చాటి ఉమ్మడి కడప జిల్లా క్రీడాకారులు విజయకేతనం ఎగురవేయాలని కోరారు. జూనియర్స్ బాలుర జట్టు .. అయాన్ బాబు, అశోక్, నాగ చైతన్య, రామకష్ణ, వెంకట అనిల్ కుమార్, హేమంత్, శివ, ధనుంజయ్, మహేష్, ముఖేష్, రాఘవ, శ్రీకాంత్, ఎతీష్ , వెంకటకృష్ణ, హేమంత్ రాజు. జూనియర్స్ బాలికల జట్టు.. ధరణి, సాహితీ, ప్రసన్న, రెహనాబీ, దీక్షిత, జానకి లహరి, వెంకట ప్రణవి, గంగ లావణ్య, అనుపమ, హరిత, లోహిత, యోగ రాయల్, వైష్ణవి, అశ్విని, వెంకట నందిని. సీనియర్స్ మహిళల జట్టు .. గాయత్రి, లక్ష్మీదేవి, ప్రతి, అఖిల, లక్ష్మీ ప్రసన్న, వాసంతి, స్నేహలత, జయశ్రీ, వందన, రంగమ్మ, కమలమ్మ, సత్యవాణి, హాసిని, చైత్ర, రాధిక. సీనియర్స్ పురుషుల జట్టు .. రామ్మోహన్, సుధీర్, రాము, లక్ష్మణ్, గోవింద రెడ్డి, ఖాదర్ రెడ్డి, వీరేష్, అయ్యబాబు, చంద్రశేఖర్, హరి ప్రసాద్, షేక్ సుభాన్, ప్రేమ్ పృథ్వీరాజ్, శ్రీనాథ్, సునీల్, వెంకట నరేంద్ర ఎంపికయ్యారు. -
అన్నివర్గాలకు నష్టమే
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టమే. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే మంచి విద్యతోపాటు వైద్యం కూడా లభిస్తుంది. ఏ ప్రభుత్వమైన ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల వల్ల వైద్య విద్యకు, ఉచిత వైద్యానికి పేద విద్యార్థులు, ప్రజలు దూరమవుతారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ఉన్నత ఆశయంతో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం. – కె.పవన్కళ్యాణ్, విద్యార్థి, ప్రొద్దుటూరు -
బాబు బినామీల జేబులు నింపడానికే ప్రైవేటీకరణ
కడప కార్పొరేషన్: చంద్రబాబు బినామీల జేబులు నింపడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం కడపలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999–24 కాలంలో రాష్ట్రానికి 19 కాలేజీలు మంజూరు కాగా అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక్కటి మాత్రమే వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ అంటే చంద్రబాబుకు ఎంత మక్కువో ఈ ఉదాహరణ చాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేద విద్యార్థులు రూ.70వేలతో మెడిసిన్ పూర్తి చేయవచ్చని, లేనిపక్షంలో ఏడాదికి రూ.1.14లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, నెట్వర్క్ హాస్పిటల్స్కు బిల్లులు చెల్లించపోవడంతో అవి పేదలకు వైద్యం చేయడం మానేశాయన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించిందని, ఆ సంతకాల పత్రాలను ఈనెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందించనున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో చెప్పాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ మాయాజాలం చెబితే చాంతాడంత అవుతుందని, వినడానికి వీధినాటకం అవుతుందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ఆయన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ ఏడాదికి రూ.8వేల సంపదను ఖజానాకు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని 2022లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినప్పటికీ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ విధానంతో పేదలకు మేలు జరగదని భావించారన్నారు. అందుకే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు, వారి ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. ఈ సమావేశంలో వైద్య విభాగం నగర అధ్యక్షుడు సతీష్రెడ్డి, డాక్టర్ పవన్ కుమార్రెడ్డి, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
● కాలువలపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు అధికారుల యత్నం ● నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రశ్న కడప కార్పొరేషన్ : ఆక్రమణల తొలగింపు విషయంలో సాయి కృప నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజీ ఎదుట కాలువపై ఉన్న తాపలను తొలగించేందుకు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం ఆధ్వర్యంలో నగరపాలక అఽధికారులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని కళాశాల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. డ్రైనేజీ కాలువలో నీరు ప్రవహించడమే మీ ఉద్దేశమైతే తామే తొలగిస్తామని చెప్పారు. ఇందుకు అడిషనల్ కమిషనర్ అంగీకరించలేదు. తాపలు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి, అడిషనల్ కమిషనర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మూడు రోజుల్లో తాపలు తొలగించాలని, లేనిపక్షంలో శనివారం తామే వచ్చి తొలగిస్తామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. రాజకీయ కక్షపాధింపునకు పరాకాష్ట వైఎస్సార్సీపీ నాయకులపై కడప ఎమ్మెల్యే కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని పలువురు విమర్శిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పర్యటించిన ఆమె నర్సింగ్ కాలేజీ వద్ద తాపలు తొలగించాలని నగరపాలక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఉన్నఫళంగా జేసీబీ తీసుకురావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. సాయికృప నర్సింగ్ కాలేజీ ఎదుట చాలా ఏళ్ల క్రితమే తాపలు కట్టి ఉన్నారు. కాలువలో నీరు సక్రమంగా పోకపోయినా, కాలువల్లో పూడిక తీయాల్సి వచ్చినా గ్రిల్స్ వేసుకోవాలని చెప్పవచ్చు. లేదా తొలగిస్తామని ముందస్తు నోటీసులు ఇవ్వాలి. అలాకాకుండా రాజకీయ కోణంలో ఆక్రమణల పేరిట తొలగించే యత్నం చేయడం దుమారం రేపుతోంది. గతంలో వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన వాటర్ప్లాంట్లు, కమర్షియల్ షాపులు కూలగొట్టించిన ఎమ్మెల్యే, తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని వారి కళాశాల తాపలను తొలగించడానికి అధికారులను ఉసిగొల్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రైవేటుకు కట్టబెడితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల ఏర్పాటును సంకల్పించి కొన్నింటిని పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ తన ఆలోచనలను పునరాలించుకోవాలి. – యూసఫ్, విద్యార్థి, దువ్వూరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు. ఈ విషయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇందుకు విద్యార్థి లోకం స్వచ్చందంగా మద్దతు ఇస్తోంది. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసేలా చంద్రబాబు సర్కార్ తన నిర్ణయాన్ని పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. – గుత్తిరెడ్డి కార్తీక్రెడ్డి, విద్యార్థి, కడప వైద్య విద్యను దూరం చేయరాదు చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం సరికాదు. వైద్య రంగంవైపు వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థి వైద్య విద్యను అభ్యసించాలని కలలు కంటాడు. అయితే చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో ఆ కల కల గానే మారిపోతుంది. ముఖ్యమంత్రి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. – అబ్దుల్ రోషన్, విద్యార్థి, కడప -
రబీ సాగు సగమే..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుఫాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అను కున్నంత ముందుకు సాగలేదు. రబీసాగు ఆరంభమై రెండున్నర నెలలు దాటినా అతికష్టంపైన సాధారణసాగులో సగం అంటే 50 శాతం కాగా అంతకు మంచి 5 శాతం మాత్రమే ఎక్కువ సాగైయింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 1,39, 796 హెక్టార్లకుగాను జిల్లాలో 1,00,680 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా ఈ ఏడాది అదే సమయానికి 77,121 హెక్టార్లు మాత్రమే సాగయింది. ● ఇక ఆరుతడి పంటలసాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం వేరుశనగ, నువ్వు పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నా భూముల్లో నెమ్ము ఆరక పంటలసాగు ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాసక్తి నెలకొంది. ముందుగా సాగుచేసిన పంటలు మాత్రం వర్షాలకు దెబ్బతిన్నాయి. ముగిసిన శనగ సాగు సీజన్ ... జిల్లాలో శనగ సాగు సీజన్ ముగిసింది. ఈ ఏడాది శనగపంట సాగు ఆశించిన మేర కాలేదు. జిల్లాలో శనగ సాధారణసాగు 76,613 హెక్టార్లకుగాను 58,160 హెక్టార్లలో మాత్రమే సాగయింది. సాధారణంగా ఈ ఏడాది వందశాతానికి మించి శనగసాగు అవుతుందనుకున్న అధికారుల ఆశలు నిరాస అయింది. ● జిల్లాలో జమ్మలమడుగు, తొండూరు, లింగాల, ఎర్రగుంట్ల, ముద్దనూరు, బిమఠం, వల్లూరు, సింహాద్రిపురం, పెండ్లిమర్రి, రాజుపాలెం, వీఎన్పల్లి, పెద్దముడియం, కొండాపురం, మైలవరం మండలాల్లో అత్యధికంగా శనగపంట సాగు అవుతుంది. అలాంటిది ఈ ఏడాది అయా మండలాల్లో అనుకున్న మేర సాగు కాలేదని రైతులు తెలిపారు. కాగా.. జిల్లాలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో సాధారణ సాగుకు మించి శనగపంట సాగయింది. మిగతా మండలాల్లో సగం కూడా సాగు కాలేదు. జిల్లావ్యాప్తంగా 55 శాతం మేరపంటల సాగు వరుస తుపాన్లు ఇందుకు కారణం 1,39,796 హెక్టార్లకుగాను 77,121 హెక్టార్లలో వివిధ పంటల సాగు వేరుశనగ, పత్తి, సన్ప్లవర్ సాగు అంతంతే.. శనగ, మినుము, పెసర సాగుకుముగిసిన సీజన్ ప్రస్తుతం జిల్లాలో వరి, వేరుశనగ, నువ్వుల పంటలకు మాత్రమే అదును ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే ఈ రబీ సీజన్కుగాను వరి సాధారణసాగు 11,645 హెక్టార్లకుగాను ప్రస్తుతం 734 హెక్టార్లలో సాగు అయ్యింది. ముందుగా సాగు చేసిన రైతులు మళ్లీ రెండవ పంట సాగుగా వరిపంటను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. అలాగే వేరుశనగ సాధారణసాగు 5079 హెక్టార్లుకాగా ప్రస్తుతం 926 హెక్టార్లలో సాగయింది. అలాగే నువ్వు పంటకు సంబంధించి సాధారణసాగు 4566 హెక్టార్లుకాగా ప్రస్తుతం 1190 హెక్టార్లలో సాగయింది. అయితే ఈ మూడు పంటలసాగుకు అదను ఉంది కాబట్టి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఈ ఏడాది రబీ ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి. -
నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలి
చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం పేద విద్యార్థులకు శాపంగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు మెరుగైన వైద్యం.డాక్టర్ చదవాలన్న పేద విద్యార్థుల కల నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణం. ప్రజలు కూడా ప్రైవేటీకరణను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. –పోలంరెడ్డిప్రమోద్కుమార్రెడ్డి, విద్యార్థి, రాచాయపేట, గోపవరం మండలం -
టీడీపీ సర్కార్ పునరాలోచించాలి
వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను ప్రైవేట్పరం చేయడం తగదు. ఎంబీబీఎస్ చదవాలంటే ప్రైవేట్ కళాశాలలకు రూ.కోట్లలో ఫీజు, డొనేషన్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే సాధారణ మధ్యతరగతి, పేదలకు మేలు జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేద ప్రజలకు వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. –ఎల్.దస్తగిరి సాయి, విద్యార్థి, ప్రొద్దుటూరు -
డ్రోన్ కెమెరాల వితరణ
కడప అర్బన్ : శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యు.సి.ఐ.ఎల్) తరపున రూ. 3 లక్షల విలువైన రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్కు కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్)లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి కంపెనీ జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్ అందజేయగా వాటిని పులివెందుల సబ్ డివిజన్కు కేటాయించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో సాంకేతికత పాత్ర కీలకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ బి.మురళి, ఆర్.కె. వ్యాలీ సీఐ ఉలసయ్య, వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, యు.సి.ఐ.ఎల్ డీజీఎం కిషోర్ భగత్, సి.ఎస్.ఆర్ ఇన్చార్జి నవీన్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) తారక్ పాల్గొన్నారు. -
ఉద్యాన సాగులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు
కడప సెవెన్రోడ్స్: వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో వైయస్సార్ కడప జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం లో నిలిచేలా సాగుబడి విస్తీర్ణం పెరుగుతోందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం లో భాగంగా మొదటి రోజు బుధవారం జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అభివృద్ధిపై ముఖ్య మంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లా లోని రైతులు ఉద్యాన, వాణిజ్య పంటల పైన ఎక్కువ మొగ్గు చూపుతూ.. ఉత్పత్తి కూడా గణనీయంగా పెంచుతున్నారన్నారు. వాణిజ్య పంటలైన అరటి, చీనీ, నిమ్మ, దానిమ్మ, పండ్ల తోటలతో పాటు ఉల్లి, పసుపు, పూల తోటలను విస్తారం గా సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో పండించిన చామంతి పువ్వులను అధికంగా బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల ఆశించిన మేర ఆదాయాన్ని జిల్లా రైతులు పొందుతున్నారన్నారు. వాణిజ్య పంటల విషయం లో ఇక్కడ రైతులు మార్కెటింగ్ పైన కొంత ప్రత్యేక దష్టి సారించాల్సి ఉందని, ఏ సీజన్ లో.. ఏయే పంటలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ట్రేడింగ్ పైన రైతులకు అవగాహన పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తు లో వైయస్సార్ కడప జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచేలా, ఉద్యాన హబ్ గా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఉద్యోగుల హక్కు పెన్షన్
● డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ● ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం కడప ఎడ్యుకేషన్ : పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాత రిమ్స్లోని బీసీ భవన్లో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ పెన్షనర్స్ అందరూ వివిధ రంగాలలో నాలుగు దశాబ్దాల పాటు కష్టించి ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేసిన వారన్నారు. వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తప్పక పరిష్కరిస్తామని, పెన్షన్ పొందే హక్కు ప్రతి పెన్షనర్కు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ శాసన మండలి మాజీ సభ్యులు పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వాయిదాలు వేస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బిల్లులు కూడా ప్రస్తుత ప్రభుత్వాలు చెల్లించడం లేదన్నారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నిత్యపూజయ్య మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలు తమ సమస్యలు గానే భావించి, వాటి సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘం కార్యదర్శి రామమూర్తి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ పెన్షనర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం 75 వసంతాలు పూర్తి చేసుకున్న 51 మంది విశ్రాంత ఉద్యోగులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతలు నారాయణ, రాయుడు, సుబ్బారెడ్డి, ఉత్తన్న తదితరుల మాట్లాడుతూ తమను సత్కరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కోశాధికారి నాగేష్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆకేపాటి సుబ్బారాయుడు, సుభాన్, చలపతి, నాగరత్నాచారి, మస్తాన్, రామ్మోహన్ రాజు, సత్యరాజు, రామకృష్ణ, సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో కడప- రాయచోటి హైవే టన్నెల్ పనుల ప్రస్తావన
న్యూఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రధాన మార్గమని మేడ రఘునాథ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ హైవేపై సర్వే నిర్వహించి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు. -
జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె : ఉమ్మడి కడప జిల్లాలో జూనియర్స్, సీనియర్స్ బాల బాలికల ఖోఖో జట్ల జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి జె. నరేంద్ర తెలిపారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖోఖో జూనియర్, సీనియర్స్ బాల బాలికల జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 తేదీలలో ప్రకాశం జిల్లా పంగులూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్స్ జిల్లా జట్టు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24 నుంచి 26 వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ఏజీఎం హరి బసవ రాజు, ఖోఖో సంఘం సభ్యులు సుధీర్, లక్ష్మి, రవి, పవన్ కుమార్, కృష్ణయ్య,లక్ష్మణ్, రెడ్డయ్య పాల్గొన్నారు. -
గోడౌన్లో అగ్నిప్రమాదం
– రూ.9 లక్షల మేర నష్టం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని పాత సామాన్ల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షేక్షావలీ కొన్నేళ్లుగా పాత సామాన్ల (గుజరీ) షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు పరిసర ప్రాంత వ్యాపారులు ప్లాస్టిక్, పాత ఇనుప వస్తువులను సేకరించి ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని అతను మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని గోడౌన్లో నిల్వ చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గోడౌన్లో ప్లాస్టిక్ సామాన్లు అధికంగా ఉండి మంటల్లో కాలడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల్లోకి పొగ వెళ్లడంతో వారు భయాందోళన చెందారు. జేసీబీ సాయంతో గోడౌన్ గోడను పగులకొట్టి మంటలను ఆర్పారు. ప్రొద్దుటూరుతో పాటు మైదుకూరు, జమ్మలమడుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 9 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
20న ఎస్హెచ్జీ కుటుంబాలకు జాబ్మేళా
కడప సెవెన్రోడ్స్: ఎస్హెచ్జీ కుటుంబాలలోని నిరుద్యోగ యువత కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వారి ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్దేశించిన ఒక కుటుంబం– ఒక వ్యాపారవేత్త లక్ష్యానికి అనుగుణంగా మెప్మా సంస్థ ఎస్హెచ్జీ సభ్యుల కుటుంబ సభ్యులకు వారికున్న ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా రుణ ఆధారిత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం జాబ్ మేళాల నిర్వహణలో విశిష్ట అనుభవం ఉన్న ‘నిపుణ– హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ’తో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుని జాబ్ మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను సంఘ సభ్యుల కుటుంబాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఈ నెల 20న కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పలు అంశాలను తెలియజేశారు. 5జీ ఫోన్లతో సమర్థంగా సేవలు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తం అవుతాయని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలకు సరఫరా చేసిన ‘శాంసంగ్ 5జీ‘ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 2494 మందికి 5ఎ మొబైల్స్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
బజారుకు వెళ్లొచ్చేసరికి చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మార్తోమానగర్లో గల పునరావాస కాలనీ సమీపంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారు బజారుకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులకొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు అపహరించారు. పట్టణంలోని పునరావాస కాలనీలో నివసించే దిరసంత చెన్నయ్య గత కొద్ది రోజులుగా అయ్యప్పమాల ధరించి ఉన్నా డు. బుధవారం శబరిమలకు ప్రయాణం ఉండటంతో అందుకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు భార్యతో కలిసి బజారుకు వెళ్లాడు. బజారు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులకొట్టి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గ్రహించి వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐ జయరాము లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్లూస్ టీం బృందాన్ని పిలిపించి వేలిముద్రలు సేకరించారు. చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ జయరాములు కేసు నమోదు చేశారు. కాగా బీరువాలోని మరొక అల్మారాలో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి దుండగులు వదిలేసి వెళ్లడం గమనార్హం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసం హరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాసం హరి తన ద్విచక్రవాహనంపై సొంత పనుల మీద కొండూరు గ్రామానికి వెళ్లి తిరిగి రెడ్డిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి గేదెలు అడ్డు రావడంతో ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు. -
హ్యాకథాన్లో ఆర్కేవ్యాలీ విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : జాతీయ మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని పీఎస్సీఎంఆర్ కళాశాలలో బ్రైనోవర్శన్ సొల్యూషనన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జాతీయ స్థాయిలో మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్ జరిగిందన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ హ్యాకథాన్న్లో ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ విద్యార్థులు చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయం నవీనత, పరిశోధన, పరిశ్రమ– ఆధారిత విద్యపై పెట్టే ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా కళాశాల ప్రతిష్టను జాతీయ స్థాయిల్లో మరింతగా పెంచారన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులైన అబ్దుల్ సమద్, సుఫ్ఫియన్, సుహైల్, పఠాన్ ముక్రం ఖాన్లను ట్రిపుల్ ఐటీ అధికారులు అభినందించారు. -
కూచ్బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ మంగళవారం కడప వేదికగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిరోజు ఆంధ్రా–ఉత్తరాఖండ్ రాష్ట్రాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్లు నిర్ణీత 69.5 ఓవర్లకు 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదిత్య నాధని 57 పరుగులు, లక్ష్యనాధని 47 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని సిద్దు కార్తీక్ రెడ్డి 3 వికెట్లు, ఏఎన్వి లోహిత్ 3 వికెట్లు, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 18 పరుగులు, హానీష్ వీరారెడ్డి 17 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో వెలుతురు సరిగా లేకపోవడంతో గంట పాటు మ్యాచ్ నిలిపి వేశారు. వెలుతురు లేక గంట పాటు మ్యాచ్ నిలిపివేత -
ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: ప్రొద్దుటూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్లోని చిన్నచిన్న పట్టణాలకు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో పోల్చుకుంటే ప్రొద్దుటూరు జనాభా పరంగా పెద్దదని, పాలనా పరమైన ప్రాధాన్యత, విద్యా పరమైన అవసరాలు ఉన్నాయన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. రైళ్ల పొడిగింపు, స్టాపింగ్పై వినతి ముద్దనూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మైసూరు–రేణిగుంట ఽమధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్(22135–22136)ను కడప నగరం వరకు పొడిగించాలని కోరారు. ఈ వీక్లీ రైలు రేణిగుంటలో దాదాపు 10 గంటలు పాటు నిరుపయోగంగా నిలిచివుంటుందని, ఈ సమయంలో కడప వరకు రైలు ప్రయాణాన్ని పొడిగిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని కోరారు. కడప ప్రజలు ఎంతో కాలం నుంచి కడప నుంచి బెంగుళూరుకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, మైసూరు–రేణిగుంట మధ్య నడిచే ఈ రైలును కడప వరకు నడిపితే బెంగుళూరుకు వెళ్లడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుందని తెలిపారు. ముద్దనూరులో.. ముద్దనూరు–మచిలీపట్నం (ట్రైన్ నం.17215– 17216)ల మధ్య నడిచే రైలుకు ముద్దనూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పంచాలని కోరారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు ముద్దనూరు ప్రధాన రైల్వేస్టేషన్ అని, ఈ రైలు స్టాపింగ్ వల్ల ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్ జోన్గా మారిందనే అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్మెంట్ లేదని, నైట్ జర్నీ యమడేంజర్గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్ హైవే డబుల్ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది. ప్రయాణం.. భయానకం ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్తోపాటు రకరకాల ఫోర్వీల్ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది. కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. రాజంపేట అర్బన్లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే. అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే ప్రమాదకర మలుపులు ప్రాణాలు పోతున్న వైనం పార్లమెంట్లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్మెంటట్ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు. కడప –రేణిగుంట నేషనల్ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది. -
సహకార ఉద్యోగుల ధర్నా
కడప సెవెన్రోడ్స్ : తమ సమస్యలను పరిష్కరించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ర త్నం మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం. 36ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు జీఓ లు జారీ చేసినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 తర్వాత ఉద్యో గంలో చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. సహకార ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 2019–24 వేతన సవరణ ఇవ్వాలన్నారు. కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ కేర్ లీవ్పై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్కు గరిష్ట వయస్సు పరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హ ర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్ర కటనలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు గతంలో పిల్లల సంరక్షణ సెలవుల వినియోగానికి సంబంధించి పిల్లల గరిష్ట పరిమితి ఉండేదని, అయితే ప్రస్తుతం కూ టమి ప్రభుత్వం ఈ పరిమితిని తొలగించి ఉద్యోగులు తమ మొత్తం సేవా కాలంలో, రిటైర్మెంట్కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉద్యోగులు ఈ సెలవులను పిల్లల సంరక్షణ, పరీక్షల సమయంలో, అనారోగ్య సందర్భాల్లో వినియోగించుకోవచ్చన్నారు. -
మహిమాన్వితం.. మహాప్రసాదం
బ్రహ్మంగారిమఠం : ‘జగన్మాతా.. దీవించు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. మహాదేవి ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ప్రసాదం.. మహిమాన్వితం’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహించిన ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. అమ్మవారికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం మహాప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం, శ్రీఈశ్వరీదేవి మఠం సంప్రదాయాల ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ద్వార పూజ చేశారు. బ్రహ్మంగారిమఠంలో ప్రసాదం తయారు చేసి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి, ముక్కమల్ల భాస్కర్రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవాలు -
మరోసారి విభేదాలు బహిర్గతం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య కొంత కాలం నుంచి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం బీటెక్ రవి కుటుంబ సభ్యుల అధ్యక్షతన జరిగినట్లుగా ఉంది. బీటెక్ రవి, ఆయన తమ్ముడు, చిన్నాన్నలు సమీక్ష చేశారు. దీనిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి సమావేశమా లేక కుటుంబ సమావేశమా అని వారు మథన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఈ మీటింగ్కు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురు నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు అనేక సార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ● బీటెక్ రవి అధ్యక్షతన సమావేశం ● హాజరు కాని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి -
కువైట్ను తాకిన రాజంపేట జిల్లా ఉద్యమ సెగ
రాజంపేట : రాజంపేట,రైల్వేకోడూరుకు చెందిన వేలాది మంది జీవనోపాధి కోసం కువైట్లో దేశంలో ఉన్న నేపథ్యంలో వారు కూడా జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలనే డిమాండ్ లేవనెత్తారు. మాలియాలోని పవన్ రెస్టారెంట్లో ప్రవాసాంధ్రులు రాజంపేట మున్సిపల్ వైస్చైర్మన్, కాపు నేత మర్రి రవికుమార్ పదిరోజులుగా చేస్తున్న అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహారదీక్షలకు కువైట్ వైఎస్సార్సీపీ తరపున మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పుడు రాజంపేటకు అర్హత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ నేతలుు గోవిందు నాగరాజు పాల్గొన్నారు.మాలియాలో రాజంపేట, రైల్వేకోడూరు వాసుల నిరసన -
● వరదాయిని.. జగజ్జనని
ఘనంగా అమ్మవారి ఆరాధనోత్సవాలు బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన సోమవారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య స్వాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేషకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన చిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత ఈశ్వరీదేవిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, దాతలు తమిదల కోటిరెడ్డి, శిల్పా శ్రీకాంత్, కల్లూరు కేశవాచారి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, పోలు పోలేటమ్మగారి సుబ్బారెడ్డి, బాల హుస్సేన్రెడ్డి, యాకశిరి జయలక్షుమ్మ, నొస్సం సుబ్రహ్మణ్యాచారి, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
కళ్లెదుటే వైకుంఠము.. కల్యాణ వైభోగము..
● వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం ● పోటెత్తిన భక్తజనంకడప సెవెన్రోడ్స్ : ‘ఒళ్లంతా కళ్లు చేసుకున్నా ఆ వైభవాన్ని తనివితీరా చూడలేము. ఆ కమనీయ దృశ్యాన్ని తిలకించిన జీవితమే ధన్యము. ఇదిగిదిగో కళ్లెదుటే వైకుంఠము’ అంటూ భక్తులు పరవశించారు. విశాలమైన పందిట్లో మనోహరంగా అలంకరించిన వేదికపై అభయముద్రతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణ ఘట్టాన్ని చూసేందుకు గోవిందమాల దీక్షధారులైన భక్తులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమేతంగా తరలివచ్చారు. కల్యాణాన్ని తన్మయత్వంతో భక్తిపూర్వకంగా తిలకించారు. సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలో శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, అనంతరం తోమాల సేవ, అర్చనలు నిర్వహించారు. 9 గంటల నుంచి కల్యాణోత్సవం ప్రారంభమైంది. కనుల పండువగా.. కల్యాణ ఘట్టంలో భాగంగా కుడివైపున నూతన వరుడిగా శ్రీవారిని, ఎడమవైపు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి మాతలను వధువులుగా అలంకరించి కనుల పండువగా తీర్చిదిద్దారు. వేద పండితుల బృందం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించింది. పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, గణపతిపూజ, ప్రవరలు, యజ్ఞోపవీత ధారణల అనంతరం సంప్రదాయంగా కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రాలను భక్తులందరికీ దర్శింపజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల సుస్వరాలు, వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామి పక్షాన వేద పండితులు అమ్మవార్ల గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా వేద పండితుల బృందాలు తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. పూల చెండులాట ఆడారు. భక్తులందరికీ మంగళాక్షతలను కల్యాణ ప్రసాదంగా అందజేశారు. ప్రారంభం నుంచి కార్యక్రమం ముగిసేంతవరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. భక్తులు అడుగడుగునా చేసిన గోవిందనామ స్మరణలు ఆ ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. హాజరైన వారందరికీ వివాహ భోజనం ఏర్పాటు చేశారు. సందడిగా గ్రామోత్సవం సాయంత్రం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : క్షయ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉందని, ఽధైర్యంగా ముందుకు వచ్చి అవసరమైన చికిత్సను ఉచితంగా పొందవచ్చని ఎర్రగుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.శ్రీనాథ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్ డి. మదన్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం క్షయవ్యాధి సోకిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సీఐపై బదిలీ వేటు.. కూటమిలో విభేదాలే కారణం?
ముద్దనూరు : స్థానిక అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరిని వీఆర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడానికి కూటమి నేతల విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మండలంలో స్థానిక పోలీసుశాఖ వ్యవహారశైలి వల్ల కూటమిలోని ప్రధాన నేతల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటులో ఘర్షణ మొదలుకొని ఇటీవల స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణంలో ఘర్షణ, ఇతర చిన్నచిన్న సమస్యల్లో కూడా స్థానిక పోలీసులు కూటమిలోని ఒక వర్గం వారికే వత్తాసు పలుకుతూ తమ వర్గీయులను చిన్నచూపు చూస్తున్నారనే భావనతో మరో వర్గం నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలుసార్లు నియోజకవర్గస్థాయి కూటమి నేత ఒకరు పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కూటమి వర్గీయుల మధ్య జరిగిన ఓ ఘర్షణ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సీఐపై వేటు పడినట్లు తెలుస్తోంది. కూటమినేతల మధ్య సమన్వయ లోపం తమకు శాపమైందని పోలీసు అధికారులు వాపోతున్నారు. -
చలి చంపేస్తోంది.!
కడప అగ్రికల్చర్ : మొన్నమొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు తాజాగా చలితో వణికిపో తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయా యి. రాత్రి 8 గంటల నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి జిల్లాలో గత పది రోజుల నుంచి నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. మును పెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం పూట పనుల మీద వెళ్లే ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కమ్ముకుంటున్న పొగమంచు.. ఒక పక్క చలి చంపుతుంటే మరో పక్క పొగమంచు కమ్మేస్తోంది. క్రమంగా పొగమంచు తగ్గినా చలి మాత్రం పంజా విసురుతోంది. దీంతో పనుల మీద బయటకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ మొదటి వారం వరకు వాతావరణం సాధారణంగానే ఉండేది. అలాంటిది ఈ ఏడాది డిసెంబర్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలి ప్రారంభమైంది. సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం.. ఈ చలి తీవ్రత జనవరి నెలలో మరింత పెరగనుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో చలి అధికంగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు చలి సంకలెత్తకుండా చంపుతుందని సామెత కూడా ఉంది. ఈ సామెత ఈ ఏడాది నిజమయ్యేలా కనిపిస్తోంది. జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెల 10వ తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు ఉండేది. అలాంటిది డిసెంబర్ 15వ తేదీ నాటికి కనిష్ట ఉష్ణోగ్రత 15.4 చేరగా గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలకు చేరింది. ఒక్కసారిగా ఉష్ణోగత్రల్లో మార్పు రావడంతో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. చలి దుస్తులకు పెరిగిన గిరాకీ.. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కడప నగరంతోపాటు పలు ప్రాంతాలలోని రోడ్ల పక్క స్టాల్స్ను ఏర్పాటు చేసుకుని జోరుగా చలి దుస్తుల విక్రయాలను సాగిస్తున్నారు. ఈ స్టాల్స్లో చలికి సంబంధించిన స్వెట్టర్లు, రెయిన్కోట్లు, శాలువాలు, మంకీ క్యాపులు, గ్లౌజులు, రగ్గులు విక్రయిస్తున్నారు. పెంపుడు జంతువులకు దూరంగా.. ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంటగదిలోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దగ్గరలో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వేడి వస్తువులకు ప్రధాన్యం.. ఈ చలికాలంలో చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్డ్రింక్స్, ఐస్క్రీములకు మరింత దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీరు తాగితే కాసింత ఉపశమనం లభిస్తుంది. వీటికితోడు తాజా ఆహారం తీసుకుంటే మంచింది. ముఖ్యంగా ఈ చలికి చంటి బిడ్డలను బయటకు తీసుకెళ్లకూడదు. చలితో గజగజ వణుకుతున్న జిల్లా వాసులు గత పది రోజుల నుంచి పెరిగిన చలి తీవ్రత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రభావం 15 డిగ్రీలకు చేరిన రాత్రి ఉష్ణోగ్రతలు తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్ముకుంటున్న పొగమంచు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మారిన వాతావరణంలో వివిధ అనారోగ్య సమస్యలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులుదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, ఆస్తమా, మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ చలికి జాగ్రత్తగా ఉండాలి. వీరు ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకూడదు. సాధారణ ప్రజలకు కూడా జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు పచ్చే అవకాశం ఉటుంది. ఒక వేళ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ అవ్వారు అర్జున్కుమార్, రిమ్స్ వైద్యులు, కడప -
మ్యూటేషన్ నిర్వహించాలి
మా గ్రామ పొలం ఎల్పీఎం నంబరు 2042లో ముప్పై ఆరున్నర సెంట్ల భూమిని 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు. కానీ రీ సర్వే నిర్వహించిన తర్వాత అధికారుల తప్పిదం వల్ల సదరు ఎల్పీఎం నంబరులో ఇతరుల పేర్లు నమోదయ్యాయి. కనుక మళ్లీ మ్యూటేషన్ నిర్వహించి కొత్త 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు జారీ చేయాలి. – పి.రాఘవేంద్రకుమార్రెడ్డి, మల్లేపల్లె, బి.మఠం మండలం ఖాతా నంబరు 54, సర్వే నంబరు 923/2బిలో 40 సెంట్ల భూమి మా అనుభవంలో ఉంది. అయితే సదరు భూమి ఆన్లైన్లో కనిపించడం లేదు. ఆ భూమిని ఆన్లైన్ చేయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే కలెక్టర్కు చెప్పుకుంటే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వచ్చాను. – వెన్నపూస వెంకటరెడ్డి, పాత గిరిగెలపల్లె, పెండ్లిమర్రి మండలం చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబరు 908–1ఏలో మా అబ్బ పేరిట 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి రెవెన్యూ అధికారులు 2015 నవంబరు 30న నా పేరిట 1బీని జారీ చేశారు. అయితే ఈ మధ్య ఆన్లైన్లో సదరు భూమికి సంబంధించిన 1బీ రిజిష్టర్ కనిపించడం లేదు. కొందరు తప్పుడు పత్రాలు తయారు చేసి విక్రయిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక దీనిపై విచారణ నిర్వహించి నా పేరిట 1బీ డాక్యుమెంటును ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలి. – సానపురెడ్డి కొండారెడ్డి, హౌసింగ్బోర్డు కాలనీ, కడప -
తప్పుడు రికార్డులతో పరిహారం కాజేశారు
మా గ్రామ పొలం సర్వే నంబరు 102లో నాకు 52 సెంట్ల భూమి యురేనియం కార్పొరేషన్ సేకరించింది. సర్వే నంబరు 742లో రెండు ఎకరాల 85 సెంట్ల భూమి నా పేరిట ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు మాయాజాలం చేసి సదరు రెండు సర్వే నంబర్లలోని భూమిని కొప్పుల వెంకటేశ్ పేరిట చూపెట్టి రూ. 4.37 లక్షలు పరిహారం పొందారు. వెంకటేశ్కు ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క పరిహారం కాజేశారు. – ఉదయగిరి మస్తాన్, రాచగుంటపల్లె, వేముల మండలం -
ప్రజా ప్రదక్షిణ వేదిక
● వ్యయ ప్రయాసాలతో కలెక్టరేట్కు తరలివస్తున్న ప్రజలు ● సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారవేదిక ‘ప్రదక్షిణ’వేదికగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్సెల్లో ప్రజలు సమస్యలు విన్నవిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. భూమికి సంబంధించిన సమస్యలే అత్యధికంగా వస్తున్నాయి. రీ సర్వేలో దొర్లిన తప్పిదాల కారణంగా తమ భూమి విసీ్త్రర్ణం తగ్గిందని, ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేయాలని, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని, ఇతరులు తమ భూములను ఆక్రమించారని తదితర అనేక సమస్యలు వస్తున్నాయి. -
నూతన కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఇందులో జిల్లా అధ్యక్షుడిగా ఎస్. అమర్నాథ్రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా వి. కిరణ్కుమార్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కె. ప్రభాకర్రెడ్డి, కోశాధికారిగా దామోదర్రెడ్డి, మహిళా కార్యదర్శిగా షరీదాభాను, కార్య నిర్వాహక అధ్యక్షులుగా శివశంకరెడ్డి, కర్నాటి రాజశేఖర్రెడ్డి, ఖాదర్ మొహిద్దీన్, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మల్లికార్జునరెడ్డి, పవన్, జయప్రకాస్రెడ్డి, కార్య నిర్వాహక కార్యదర్శిగా సతీష్, ఓబుల్రెడ్డి, విజయమ్మ, గౌరవ సలహాదారులుగా రమేష్బాబు, మైనార్టీ వింగ్ కన్వీనర్గా బాబా రజాక్, సోషల్ మీడియా కన్వీనర్గా జాన్ సుందర్రాజు, ఉపాధ్యక్షులుగా మదార్వలి, వెంకటరామిరెడ్డి, బాలశివారెడ్డి, గంగాధర్రెడ్డి, రాఘవేంద్రమ్మ, భాస్కర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా కరుణాకర్రెడ్డి, రఘనాథరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరరెడ్డి,జేసునాథరెడ్డి, అడిట్ కమిటీ కన్వీనర్గా రమణ, సభ్యులుగా శ్రీనాథరెడ్డి, సూరి, నాగార్జున, రాష్ట్ర కౌన్సిలర్లుగా రమణారెడ్డి, సీకే వెంకటనాథరెడ్డి, జగన్మోహన్రెడ్డి, సురేష్రెడ్డిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిరణ్కుమార్రెడ్డి అమర్నాథరెడ్డి -
డబుల్ ఇంజిన్తో రాష్ట్రానికి ట్రబుల్
డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ట్రబుల్ ఏర్పడింది.రాష్ట్రానికి వెయ్యికోట్లు నిధులు తేలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవాలి. – నరేన్ రామాంజులరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు సేవాభావంతో వ్యవహరించరు. లాభార్జన కోసమే పనిచేస్తారు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. – రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గొప్ప ఆశయంతో మంజూరు చేయించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని నెల రోజులుగా కోటి సంతకాల సేకరణ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – కొండూరు అజయ్రెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు -
ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు
కడప సెవెన్రోడ్స్ : ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ఈనెల 14వ తేదీ నుంచి 20 వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు,కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా జాయింట్ కలెక్టర్ అధితి సింగ్ తో కలిసి విడుదలచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇంధన సామర్థ్యం,పరిరక్షణ ప్రాముఖ్యత,విద్యుత్ ఆదా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసంగాలు,ర్యాలీలు, విద్యార్థులలో అవగాహన కల్పించుటకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు, వర్క్ షాప్, వెబినార్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూతాపం, వాతావరణ మార్పులనుఎదుర్కోవడానికి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమము లో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్రంగా న్యూట్రిషనల్ కన్వర్జెన్స్ పైలెట్ ప్రాజెక్టు సర్వే సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్ను ప్రారంభించడం(ఇనాక్ట్స్)్ఙ అనే పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమ సర్వే జిల్లాలో సమగ్రంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో అమలవుతున్న ఇనాక్ట్స్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వే కార్యక్రమంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాజెక్ట్ అసోసియేట్ స్మతితో పాటు సంబందిత జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మహేశ్వర కుమార్, సీఎన్ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
మేం అధికారంలోకి వస్తే మెడపట్టి గెంటేస్తాం
మెడికల్ కాలేజీ టెండర్లలో పాల్గొని ఎవరైనా వాటిని సొంతం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మెడపట్టి గెంటేస్తాం. విద్య, వైద్యం విషయంలో పేదలు దోపిడీకి గురికాకూడదనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రూ.8500కోట్లతో వాటిని పూర్తి చేసేందుకు సంకల్పించారన్నారు. రూ.5వేల కోట్లు అయితే అన్ని కాలేజీలు పూర్తవుతాయి. చంద్రబాబు చేసే ప్రతి కార్యక్రమం కమీషన్ల కోసమే.. దౌర్జన్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఒప్పకునే ప్రసక్తేలేదు. – ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాయలసీమ ఇన్చార్జి -
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
లాభాల మునగ.!
కడప సిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోంది. 300 రకాల వ్యాధులకు ఉపయోగపడే మునగ (మోరింగా) సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మునగ సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మునగ సాగును చేపట్టారు. ప్రారంభంలో కేవలం 23 మంది రైతులు మాత్రమే 17.43 ఎకరాల్లో 710 మొక్కలు మాత్రమే నాటారు. పూర్తిగా రైతుకు ఎలాంటి భారం లేకుండా గుంతలు తీసే పని నుంచి మొక్కల పంపిణీ రెండు సంవత్సరాలపాటు నిర్వహణ కూడా పూర్తి ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పిస్తోంది. అఽధిక పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు కూడా మునగ మొక్కల్లో ఎక్కువగా ఉన్నాయి. హోస్టెడ్ ప్లాంటేషన్ ద్వారా నర్సరీల్లో పెంచిన మునగ మొక్కలను రైతులకు అందజేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నాటించి విద్యార్థులకు మునగతో ఏ విధంగా ఉపయోగం ఉందో తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31.61 ఎకరాల గుర్తింపు.. జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఈ మునగసాగు చేపట్టారు. ఇందులో భాగంగా 31మంది రైతులకు 31.61 ఎకరాలు గుర్తించారు. 14,190 గుంతలు తీయగా, ఇందులో 29.7 ఎకరాల్లో సాగై 11,850 మొక్కలు నాటారు. రెండు సంవత్సరాలపాటు ఈ పంట ఉంటోంది. తర్వాత సాగు చేసిన రైతులకు రెండవ దఫా ఇచ్చేందుకు అవకాశం ఉండదు. 0.5 ఎకరా నుంచి ఎకరా వరకు నాటేందుకు అనుమతి ఉంది. రెండింతలకుపైగా ఆదాయం.. కొత్తగా రైతులు ప్రారంభంలో మొగ్గు చూపకపోయినా తర్వాత అధికారులు ఆదాయం రెండింతలు వస్తుందని చెప్పగా రైతులు ముందుకు వచ్చారు. సున్నా పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం వీటికి అయ్యే ఖర్చు ఉచితంగానే నిధులు ఇస్తోంది. రైతు చేతి నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక రైతు ఎకరాకు కేంద్ర ప్రభుత్వం మొక్కలు, మెటీరియల్కు కలిపి రూ. 80 వేలు ఉచితంగా ఇవ్వగా, ఆ రైతుకు రెండు సంవత్సరాల కాలంలో రూ.3.50 లక్షల ఆదాయం అందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మునగ ఆకుతో 300 వ్యాధులు దూరం.. మునగ ఆకు, మునక్కాయలు మనం నిత్యం తినే ఆహారమేగానీ, దాని గురించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేదు. అయితే మునక్కాయలే కాకుండా మునగ ఆకులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. మునగ ఆకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో అయితే 300 వ్యాఽ ధులు నయం చేసేందుకు మునగ ఆకును ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తింటే వచ్చే విటమిన్లు 8–10 రెట్లు అధికంగా మునగ ఆకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించి మందుల్లో కూడా వాడతారు. మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగ ఆకు పొడిని మూడు నెలలపాటు వరుసగా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో కూడా తేల్చారు. థైరాయిడ్కు మంచి మందుగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని పిల్లలకు అందిస్తే ఎముకలు బలిష్టంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరిగేందుకు మునగాకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 100 గ్రాముల మునగాకులో నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రాములు, క్యాల్షియం 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 70 మి.గ్రా. ఐరన్ 7 మి.గ్రా, సి–విటమిన్ 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 క్యాలరీల పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. మునగ సాగుతో ఆరోగ్యం.. ఆదాయం సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్న రైతులు ఉపాధి హామీలో పూర్తిగా ఉచితంగా గుంతలు, మొక్కలు అందజేత -
ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి
● ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ● ఎస్టీయూ ఆధ్వర్యంలో మహా ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఎస్టీయూ నాయకులుమాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికడప ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారనే విమర్శ ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్తు వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయల అభ్యున్నతికి ఎస్టీయూ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత పరీక్ష పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసి 2011 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా సంవత్సరం మధ్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విద్యా సంవత్సరం కుంటుపడుతోందని చెప్పారు. ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉచిత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకునేలా పావులు కదుపుతోందన్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 21 జీఓను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్రా సురేష్ బాబు, గాజుల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రాజు, జోసెఫ్ సుధీర్ బాబు, తిమ్మన్న, జనవిజ్ఞాన వేదిక నాయకులు విశ్వనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర నాయకులు కంఘం బాలగంగిరెడ్డి, పిల్లి రమణారెడ్డి, రవిశంకర్రెడ్డి, కొత్తపల్లి శీను, బండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీ కాలువలో మృతదేహం
మైదుకూరు : మైదుకూరు వద్ద కడప – కర్నూలు (కేసీ)కాలువలో ఆదివారం మృతదేహం కనిపించింది. ఉదయం అటుగా వెళ్లిన కొందరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి మృతదేహం ఆచూకీపై వివరించారు. మృతుడు చాపాడు మండలం నాగాయపల్లెకు చెందిన పిచ్చపాటి వీరప్రభాకర్రెడ్డి (38)గా గుర్తించారు. ఆయన ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్టు సీఐ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న కేసీ కెనాల్ నీటిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్టు తెలిపారు. మృతుని భార్య సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యంతొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బైక్లు ఢీ ముద్దనూరు : స్థానిక పోలీసు స్టేషన్ ముందు ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న మోటార్ బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి కాలువిరగగా, మరొకరికి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి కడప కార్పొరేషన్ : సిద్దవటం మండలాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మధుసూదన్, లక్ష్మినారాయణ, దిలీప్రెడ్డి కోరారు. ఆదివారం వారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డికి వినతి పత్రం సమర్పించి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపకు కూతవేటు దూరంలోనే సిద్దవటం ఉందని, దీన్ని అన్నమయ్య జిల్లాకు మారిస్తే 80.కి.మీ చుట్టూ తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. 2009లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గంలో కలిసి చాలా కోల్పోయామని, ఎంతో చరిత్ర కలిగిన ఒక నాటి జిల్లా కేంద్రాన్ని మరింత దిగజార్చవద్దని కోరారు. ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్కు చెందిన శ్రావణ్కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి,అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో శనివారం విషపు గుళికలు మింగాడు. రేణిగుంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు చెల్లించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని సాయిబాబా స్కూల్లో ఆదివారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆధ్యర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చాలా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిషన్ వేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీకే వెంకటనాథరెడ్డి, సజ్జల వెంకట రమణారెడ్డి, జిల్లా నాయకులు రమేష్బాబు, సురేష్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఫరీదాబాను, మాజీ ఎంఈఓలు వీరారెడ్డి, జాపర్సాదిక్లతోపాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్టీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
దువ్వూరు : స్థానిక నల్లవంక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన పెద్ద ఎల్లయ్య (60), నేలటూరు గ్రామానికి చెందిన చాగలేటి వీరప్రతాప్రెడ్డి (62) ఇద్దరు స్నేహితులు. ఆదివారం వీరిద్దరు దువ్వూరుకు ఇంటి సరుకుల కోసం టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్పై వచ్చి తిరిగి సొంత ఊర్లకు బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని నల్లవంక దగ్గర ఉన్న సురేష్ గోడౌన్ వద్ద వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరుకు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. చాలా ఏళ్ల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. పెద్ద ఎల్లయ్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరప్రతాప్రెడ్డికి కోవిడ్ సమయంలో భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధు మిత్రులు, ఇరుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం -
అంగరంగ వైభవం.. పుష్ప రథోత్సవం
● కనుల పండువగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● భారీగా పాల్గొన్న భక్తజనంబ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి, ఊరేగింపు చేపట్టారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న కోలాటం ఇటుకలపాడుకు చెందిన శివపార్వతుల మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి, నొస్సం చంద్రశేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో.. శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు. అలాగే మాత గోవిందమాంబ, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, తదితర ప్రాంతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆదీ.. నీ బతుకంతా అబద్ధాలే!
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. నీ బతుకంతా అబద్ధాలతోనే సాగుతోంది.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని, రాబోయే ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని ముఖ్యమంత్రికి గిఫ్టుగా ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వేలాది మంది అక్కడ దొంగ ఓట్లు వేసి వచ్చారన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆది అంటే అవినీతి, అబద్ధం అని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి గాని అర్హత గాని ఆదినారాయణరెడ్డికి లేవన్నారు. ఆదిలాంటి అవినీతి, దగాకోరు రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు పరుగులు తీసే మనస్తత్వం కలిగిన నీచ చరిత్ర అందరికీ తెలుసన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిత్రావతి, పెన్నానది, ఫ్యాక్టరీల వద్ద కమీషన్లు దండుకుంటూ, ఫ్లైయాష్ను దోచుకుంటూ నెలకు మూడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థులను పోటీలో నిలిపి తీరుతామని, ఎలాంటి బెదిరింపులు, దౌర్జన్యాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో సూదులతో గుచ్చుతా అని ఆదినారాయణరెడ్డి అంటున్నాడని, అయితే ప్రజలు 2029 ఎన్నికల్లో నీకు సూది వేసి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారన్నారు. ఇప్పటికై నా ఆదినారాయణరెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, కౌన్సిలర్ ముల్లాజానీ, విష్ణువర్దన్రెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
న్యాయవాదికి 'సైబర్' వల.. రూ.72 లక్షలు మాయం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు. సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
● ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. -
ఉత్సాహంగా గ్రీన్ హార్ట్ ఫుల్నెస్ 2కే రన్
ప్రొద్దుటూరు కల్చరల్: ఫిట్ ఇండియాలో భాగంగా శ్రీరామచంద్రమిషన్, రోటరీ క్లబ్, రోటరీ కంటి ఆస్పత్రి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రీన్ హార్ట్ఫుల్ నెస్ 2కే రన్ను డీఎస్పీ భావన, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటి పరిరక్షించాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. డాక్టర్ వైవీ స్వరూప్ కుమార్ఱెడ్డి, శ్రీరామచంద్రమిషన్ జోనల్ కోఆర్డినేటర్ ఎన్.బాబు రామచంద్ర, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. ధ్యానం ద్వారా మనిషి మానసిక వికాసం పొందుతారన్నారు. అనంతరం వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 2కే రన్ పుట్టపర్తి సర్కిల్కు చేరుకుని అక్కడ మానవ హారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ నినాదాలు చేశారు. శ్రీకృష్ణాలయం ఆవరణలో అల్పాహారం, 250 జామ, నేరేడు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆప్కాబ్ మాజీ చైర్పర్సన్ ఝాన్సీరాణి,సుధాకర్రెడ్డి, రవిశంకర్, సత్య ప్రవీణ్, రాజశేఖర్, లక్ష్మీకాంతమ్మ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. -
16 నుంచి కూచ్బెహర్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప వేదికగా ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో బీసీసీఐ అండర్–19 కూచ్బెహర్ ట్రోఫీ 2025–26 టోర్నమెంట్ జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర–ఉత్తరఖండ్ రాష్ట్రాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చింతకొమ్మదిన్నె మండలం నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా స్థాయి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ సుబ్బారెడ్డి, నరేంద్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్స్ విభాగానికి సంబంధించి 2008 జనవరి 1 తర్వాత పుట్టి 18 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులు అన్నారు. 18 సంవత్సరాల పైబడి వయసున్న వారు సీనియర్ విభాగానికి అర్హులు అని తెలిపారు. ఈనెల 19, 20 ,21వ తేదీల్లో ప్రకాశం జిల్లా జే. పంగులూరులో జరిగే పోటీల్లో జూనియర్ జట్టు క్రీడాకారులు , ఈనెల 24 నుంచి 26 వరకు కృష్ణాజిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో సీనియర్స్ జట్టుకు ఎంపికై న వారు పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేయవచ్చని డీఆర్వో తెలిపారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. – ఎన్.సుధీర్రెడ్డి, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్బ్యాంకు జిల్లా అధ్యక్షుడుసమస్యలు పరిష్కరించాలి రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. -
సేవలకు అంతరాయం
కడప అగ్రికల్చర్: చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయా రోజుల్లో లావాదేవీలు నిలిచిపోతుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బులు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటంతో ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై రుణాలు తీసుకునే రైతులకు అవస్థలు చాలా మంది రైతులు రబీ పంటల పెట్టుబడి కోసం బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకుంటారు. రూ. 88 పైసల వడ్డికే సహకారం సంఘాల్లో రుణాలు ఇస్తారు.దీంతో రైతులు బంగారు తాకట్టుెపెట్టి రుణాలు పొందుతారు. కానీ ఉద్యోగులు అందుబాటులో లేకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి. 2019, 2024 పెండింగ్లో ఉన్న వేతన సవవరణలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు.చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి డీసీఈబీ ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకారం సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. ఆందోళన కార్యక్రమాల వివరాలు.. డిసెంబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం సమర్పించడం. డిసెంబర్ 22 రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం అందజేయడం. 29వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందించడం. 2026 జనవరి ఽ5వ తేదీ నుంచి 26 జిల్లాలు పూర్తి అయ్యేవరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహాల దీక్షలు. కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన నిలిచిపోతున్న లావాదేవీలు అవస్థలు పడుతున్న అన్నదాతలు -
నియోజకవర్గం సేకరించిన సంతకాలు
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదని..... మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. నేడు జిల్లా కేంద్రంలోభారీ ర్యాలీకి సన్నాహాలు ఊరు–వాడల్లో ఉద్యమ వేడి రగిల్చిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన ప్రతులను జిల్లా కేంద్రానికి చేర్చిన శ్రేణులు బద్వేల్ 60,000 కడప 70,000 కమలాపురం 60,000 మైదుకూరు 50,000 ప్రొద్దుటూరు 1,00,200 జమ్మలమడుగు 49,700 పులివెందుల 90,201 మొత్తం 4,80,101 -
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ కనీసం 12వ పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. జూలై 2024 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవుల బిల్లులను ట్రెజరీలకు సమర్పించి మూడేళ్లయినా ఇంత వరకు డబ్బు చెల్లించలేదన్నారు. 11వ ీపీఆర్సీ బకాయిలు, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, జిల్లా కౌన్సిలర్లు సుబ్బయ్య, ప్రభాకర్రెడ్డి, దామోదర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్ల మొహం కూడా చూడం.. ఊళ్లోనే ఉండం!
వేంపల్లె: వైఎస్సార్సీపీకి ప్రజా మద్దతు మరోసారి స్పష్టమైంది. మూడు కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)తో పాటు టీడీపీ నాయకులు గ్రామంలోకి అడుగుపెట్టగానే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. ఆ గ్రామాన్నే వదిలివెళ్లిన ఘటన వైఎస్సార్జిల్లా వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో చోటుచేసుకుంది. నిరసనను అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ చర్యలు స్థానికులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దేశం కుతంత్రాలకు సమాధానం గత కొన్నేళ్లుగా వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న గ్రామస్తులను రాజకీయంగా చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు తెరలేపుతూ అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్రెడ్డితో పాటు మరో రెండు కుటుంబాలను టీడీపీలోకి చేర్చుకునేందుకు బీటెక్ రవి తదితర టీడీపీ నాయకులు గ్రామానికి వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే విందులో గ్రామంలోని ప్రజలంతా పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసులనూ ఇందుకు వినియోగించుకున్నారు. ఈ రాజకీయ కుతంత్రాలకు గ్రామస్తులు గట్టి సమాధానం చెప్పారు. టీడీపీ నాయకుల ముఖాలను కూడా చూడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరును ఖాళీ చేశారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ వద్ద వైఎస్సార్సీపీకి సంఘీభావంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని పోలీసులు అంతక్రితం గ్రామస్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేదంటూ విందును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు లెక్కచేయలేదు. ఈ ఘటనతో టీడీపీ నాయకులకు తీవ్ర అవమానం ఎదురైంది. గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రవిసహా ఇతర అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఇదిలావుండగా టీడీపీ నాయకులు, పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీలోనే ఉంటామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడుతోందనడానికి అమ్మగారిపల్లె ఘటనే రుజువు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. – ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్సీపీకి వెయ్యి ఏనుగుల బలం.‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు. -
జగనన్న 2.0 పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు గంటమస్తాన్ వీధిలో అనుబంధ విభాగాల కోర్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ వార్డు నాయకులు బండల మురళి, చంద్రమౌళిల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అనుబంధాల కోర్ కమిటీ సమావేశాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రతి నాయకులు, కార్యకర్త సైనికుల్లా పనిచేస్తేనే కూటమి నాయకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చునన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వార్డులోని ప్రజలకు వివరించాలన్నారు. 2.0 జగనన్న పాలనలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే పదవులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కమిటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సోపాల వీరా, కనక, సంపత్, దశరథరామిరెడ్డి, రత్న, కిశోర్, మాబ్జాన్, బాషా, వినోద్, రమేష్, బాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. వేముల : గొందిపల్లె సమావేశంలో మాట్లాడుతున్న మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి , పెద్దముడియం : బీటిపాడులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పులివెందుల రూరల్ : గ్రామస్థాయి కమిటీలతో వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బలరామిరెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బాల గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్రెడ్డి, బాల ఓబుళరెడ్డి, గంగిరెడ్డి, చిన్న, మస్తాన్, ఎంపీటీసీ గంగన్న, రవీంద్రారెడ్డి, గుండాలయ్య, చంద్రమోహన్రెడ్డి, రామకృష్ణ, సూర్యుడు, రామచంద్ర, మనోహర్, వేణుగోపాల్ యాదవ్, రమేష్, అర్జున్, కృష్ణయ్య, రఫి, రజాక్, కొత్తపల్లె గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. లింగాలలో.. లింగాల : ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతోంది. కమిటీలు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోనాల గ్రామంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కమిటీలు అహరి్నశలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, అబ్జర్వర్ పి.శ్రీనివాసులరెడ్డి, ఐటీ వింగ్ సుదర్శన్రెడ్డి, సోషల్ మీడియా సుమంత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బోనాల గ్రామ నాయకులు, సర్పంచ్ రాము కార్యకర్తలు పాల్గొన్నారు. వేములలో.. వేముల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పటిష్టతకు సంస్థాగత కమిటీలతో గ్రామస్థాయి నుంచే శ్రీకారం చుట్టారని ఆ పార్టీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకటబయపురెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గొందిపల్లె గ్రామంలో శనివారం సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే సంస్థాగత కమిటీలే పారీ్టకి పట్టుకొమ్మలన్నారు. గ్రామాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై గ్రామ సమస్యలతోపాటు పార్టీ పటిష్టతపై చర్చించుకోవాలన్నారు. రాబోవు కాలంలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలలో సంస్థాగత కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.0 పాలనలో కమిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, గంగిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్రెడ్డి, నాగేంద్రారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాష్రెడ్డ, శేషారెడ్డి, దేవేంద్రారెడ్డి, రామాంజనేయులు, ముసలయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురంలో.. సింహాద్రిపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో శనివారం సింహాద్రిపురం మండలం సుంకేసుల, బి.చెర్లోపల్లె, లోమడ గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అబ్జర్వర్లు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, నీలవర్థన్రెడ్డి, కె.భాస్కర్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ప్రసాద్రెడ్డి, లోమడ వైఎస్సార్సీపీ నాయకులు పవన్ చంద్రారెడ్డి, హృషికేశవరెడ్డి, జనార్థన్రెడ్డి, బషీర్, జయచంద్రారెడ్డి, దేవపుత్రారెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజబాబు, వి.రాజా, వీరప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, భరత్రెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి, భార్గవ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, రామకోటిరెడ్డి, సోమశేఖరరెడ్డి, చంద్రమౌళి, వివేకానందరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, పార్థసారథిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, సురేష్, షబ్బీర్, మనోహర్రెడ్డి, కృపాకర్రెడ్డి, శాలివాహనరెడ్డి, శంకర్రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, రాజశేఖరరెడ్డి, హాజివలి, గోవర్థన్రెడ్డి, తిరుమన్రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో.. జమ్మలమడుగు : గ్రామ కమిటీలే పారీ్టకి బలమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దముడియం మండలంలోని బీటిపాడు, పాపాయపల్లె గ్రామాల్లో గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గ్రామ స్థాయి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ విష్ణువర్థన్రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షుమయ్య, రామలింగేశ్వరరెడ్డి, చౌడయ్య, వెంకటరామిరెడ్డి, గిరీష్రెడ్డి, విశ్నాథ్రెడ్డి, పాపాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, చిట్టేపు విశ్వనాథ్రెడ్డి, రెండు గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. వీరపునాయునిపల్లెలో వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు గ్రామంలో గ్రామ కమిటీ అనుబంద విబాగాల కమిటీలు సర్పంచు వెంకటేసు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, స్థానిక నాయకులు గోపాల్రెడ్డి, రమేష్రెడ్డి, నందకుమార్రెడ్డి, రాంబాబు. జగన్, వీరపునాయునిపల్లె ఎంపీటీసి రాఘవ యాదవ్, వెంకటరామిరెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసుల్రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరంలో.. మైలవరం : వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాలను గ్రామాలలో ఎగరడంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకుందామని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొమెర్ల, కర్మలవారిపల్లె గ్రామ పరిధిలో ఉన్న గ్రామాల కార్యకర్తలతో ఆయన గ్రామ సభను నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో వైఎస్సార్సీపీ మరింత బలం పెరగాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త మన ప్రభుత్వంలో చేసిన పనిని, ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు, అమలు కాని హామీల గురించి వివరించాలన్నారు. కష్టపడిన ప్రతికార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచిగుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివగుర్విరెడ్డి, రామాంజనేయుల యాదవ్, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లెలో.. వేంపల్లె : మండలంలోని గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, వేంపల్లె 5వ ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ కమిటీ నియామక కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మునీర్బాషా, రవిశంకర్గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, మణిగోపాల్రెడ్డి, కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, నిస్సార్ బాషా, ఎంపీటీసీ ఎం.హెచ్.హబీబుల్లా, బండల షుకూర్, బీఎస్ షేక్షావలి, సురేంద్ర, ముత్యాల రమేష్బాబు, మల్లయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


