breaking news
YSR
-
పదోన్నతి జాబితాలో సీఐలు
కడప అర్బన్: రాయలసీమ జోనల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూనే డీఎస్పీలుగా పదోన్నతుల కోసం వేచివున్న దాదాపు 48 మంది సీఐల జాబితా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. వీరిలో 1995 నుంచి 1996 బ్యాచ్కు చెందిన వారే అధికంగా వున్నారు. 7,8 తేదీల్లో జిల్లాలో షర్మిల పర్యటన కడప వైఎస్ఆర్ సర్కిల్: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు గురువారం డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. 7న కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళి అర్పిస్తారని వివరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన వెంకటయ్యపై ఎలుగుబండి దాడి చేసింది. వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యా యి. ఆయనను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు. రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా చింతకొమ్మదిన్నె: ఊటుకూరు సమీపంలోని ప్రకృతినగర్లోగల రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు యూజీసీ ఈ సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ నెల్సన్ తెలిపారు. నాక్ గ్రేడ్ సాధించినందుకు, మౌళిక వసతులు కల్పించడం, నిష్ణాతులైన ఆచార్య బృందం కలిగి ఉండడం వలన యూజీసీ వారు రామిరెడ్డి ఫార్మసీ కళాశాల కు స్వయంప్రతిపత్తి కల్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ గౌతంరెడ్డి, సెక్రటరీ జయసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ నెల్సన్ కుమార్, కోఆర్డినేటర్ మనోహర్ లను ప్రత్యేకంగా అభినందించారు. కరెస్పాండంట్ గౌతంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు, తల్లితండ్రులకు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహ,రాజారాం,సుచరిత,కల్పన,సలోమి,సుమలత, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొని.. ఈ యాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు ● టికెట్ బుకింగ్, రిజర్వేషన్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ ● ప్లాన్మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం ఎలా.. ● రైలు స్థితి, ప్లాట్ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్, రీఫండ్ ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్ధితి గతులు, టికెట్ పీఎన్ఆర్ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్ స్టేటస్, రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్టరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరజిం కార్పొరేషన్ లిమిటెట్ (ఐఆర్టీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ ఎలా డౌన్లోడ్... ● ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam ఐవోఎస్ యాప్ నుంచి... httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334 ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక. రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ● mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. ● ప్లాన్ మై జర్నీ లేదా మై బుకింగ్ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకే యాప్లో ఐఆర్టీఎస్ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు. ● సరళమైన ఇంటర్సేఫ్, సింగల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● 2025 డిసెంబర్ నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్ బుకింగ్, 40 లక్షల ఎంకై ్వరీలు నిర్వహించగల సామర్థ్యం. స్పీడ్గా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చిన యాప్ ఐఆర్టీఎస్తో ఫుడ్ ఆర్డరింగ్ నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్ లక్ష్యం -
తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళ తన పేరిట ఉన్న ఇంటిపట్టాను ముగ్గురు వ్యక్తులకు అమ్మడం ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో బద్వేలు నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ ఉన్నట్లు తెలిసింది. అనుమానితుల్లో కొందరి వద్ద నుండి నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మళ్ళీ తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం సుమారు మూడేళ్ళ క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేలు నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. బద్వేలు కేంద్రంగా ప్రభుత్వ స్థలాలకు, డీకేటీ పట్టాలకు కొంత మంది వ్యక్తులు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో భారీగా నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలకు పాల్పడ్డారు. దీంతో బద్వేలులో ప్రతినిత్యం రెవెన్యూ, పోలీసు కార్యాలయాలకు స్థలాల సమస్యను బాధితులు తీసుకెళుతుండేవారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకులవెంకటరమణ నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించి కొందరు అనుమానితులను గుర్తించి వారిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి నకిలీ పట్టాల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. 2022 మేలో అర్బన్ పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నెం. 112/22 కేసులో 19 మందిపైన, 118/22 కేసులో 7 మందిపైన కేసులు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా పట్టణంలోని మార్తోమానగర్కు సమీపంలో 812 సర్వే నెంబర్లో తన పేరిట పట్టా ఉన్న ఓ మహిళ మొదట ఆ పట్టాను ఓ వ్యక్తి వద్ద కుదువకు ఉంచింది. తర్వాత అదే ప్లాట్ను నకిలీ పట్టాతో మరో వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగక మరో నకిలీ పట్టాను పొంది మూడవ వ్యక్తికి సైతం స్థలాన్ని విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు అర్బన్ పోలీసులను ఆశ్రయించగా విచారించి సదరు మహిళతో పాటు అందుకు సహకరించిన వారిపై మూడు రోజుల క్రితం అర్బన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో అనుమానితులు నకిలీ పట్టాలు సృష్టించి ముగ్గురికి విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళకు నకిలీ పట్టాలు ఎవరు తయారు చేసి ఇచ్చారో తెలుసుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో గతంలో నకిలీ పట్టాల వ్యవహారంలో రిమాండ్లో ఉండి వచ్చిన పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద, నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ వద్ద కొన్ని నకిలీ సీళ్ళు, నకిలీ పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నకిలీ పట్టాల తయారీలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. అందులో భాగంగా గతంలో నమోదైన రెండు కేసుల్లో ఉన్న ఐదు మందిని, బద్వేలు రూరల్ పరిధిలోని నందిపల్లె సమీపంలో గల ఓ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సైతం అనుమానితులను విచారించినట్లు తెలిసింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు? అనుమానితుల్లో ఓ వీఆర్ఓ నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం అక్రమార్కుల గుండెల్లో గుబులు 2022 మే నెలలో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బద్వేలు పరిసర ప్రాంతాల్లో నకిలీ పట్టాల తయారీ సద్దుమణిగింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బద్వేలులో మళ్ళీ నకిలీ పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది. విలువైన స్థలాలు ఉన్న ఎన్జీవో కాలనీ, నెల్లూరు రోడ్డు, మహమ్మద్కాలనీ, చెన్నంపల్లె తదితర ప్రాంతాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్పర్పస్, రస్తా పోరంబోకు స్థలాలకు కొందరు అధికార పార్టీ నాయకులు నకిలీ పట్టాలు తయారు చేయించుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారం అండదండలతో ప్రశ్నించేవారు లేకపోవడంతో యదేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చి కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో ఎక్కడ తమ పేర్లు బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. -
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగభూషణం, డీఎల్డీఓ, మహిళా సర్పంచులు పాల్గొన్నారు. -
నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి
కడప సెవెన్రోడ్స్: జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో స్వర్ణాంధ్ర విజన్– 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రో యాక్టివ్ గా పని చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల అంశాలను సాధించడానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 78వేల బంగారు కుటుంబాలను గుర్తించామని నియోజకవర్గంలోని మండల వారీగా బంగారు కుటుంబాల మ్యాపింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి చర్యలు తీసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం జిల్లాలో మరో ప్రధాన కీ రోల్ ప్లే చేస్తోందని మున్సిపల్ కమిషనర్లు అందరూ అనుమతులను సులభతరం చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారంలో రెండు రోజులు రియల్టర్లతో ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించాలన్నారు. లేఔట్స్ బిల్డింగ్ నిర్మాణాల వంటి అనుమతుల్లో జాప్యం తగ్గించి త్వరితగతిన మంజూరు చేస్తే మున్సిపాలిటీలకు అధిక రాబడి వస్తుందని ఆ విధంగా మున్సిపాలిటీలు అభివద్ధి చెందుతాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన కడప నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి సాధించాలన్నారు. రాయలసీమలోని కడప నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకు అనుగుణంగా ఎమర్జింగ్ ఏరియాలను గుర్తించి ఓపెన్ లేఔట్లు ట్రేడింగ్ లలో అనుమతులను సరళతరం చేయాలన్నారు. ముందుగా వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, పశుసంవర్ధక, ఫిషరీస్ వంటి శాఖల్లో జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ కనుగుణంగా లక్ష్యాల సాధనకు ఏ విధంగా కృషి చేస్తున్నారన్న అంశాలపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్యా, కడప ఆర్డిఓ జాన్ ఇర్విన్, బద్వేలు ఆర్టీవో చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డిఓ సాయి,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. సంతృప్త స్థాయిలో ప్రజాస్పందనలు ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి స్పందన సానుకూలంగా, సంతృప్త స్థాయి పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. దీంతో గాయపడ్డ పలువురు విద్యార్థులను వెంటనే 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మడమ తిప్పాడని పలువురు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని తాళ్ళపల్లె – ముసల్రెడ్డిపల్లె మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాసం గంగరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసల్రెడ్డిపల్లెకు చెందిన గంగరాజు బైకుపై వేంపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని మోటార్ బైకులో గురువారం రాత్రి వేంపల్లె నుంచి గంగరాజు, దుగ్గన్నగారిపల్లెకు చెందిన బుసిరెడ్డి శివానందరెడ్డిలు ముసల్రెడ్డిపల్లెకు వెళ్తూ గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ వీరి మోటార్ బైకు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే బాసం గంగరాజు మృతి చెందాడు. బుసిరెడ్డి శివానందరెడ్డికి తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు. గురువారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మోటారు సైకిల్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె – ఓదులపల్లి తండా గ్రామాల మధ్యలో గురువారం మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉడుములకుర్తి నుంచి ద్విచక్ర వాహనంలో గంగరాజు తన కుమారులు ఈశ్వర్, దేవేంద్రతోపాటు భార్యతో కలిసి పులివెందులలోని సర్వజన ఆసుపత్రికి వస్తుండగా.. కనంపల్లె గ్రామ సమీపంలోని ఓదులపల్లె తండా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈశ్వర్, దేవేంద్రతోపాటు గంగరాజు, అతని భార్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
తొలి అడుగు కాదు.. చివరి అడుగు
ప్రొద్దుటూరు : ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనకు తొలి అడుగు కాదని, చివరి అడుగేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. 1978లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ జీవితం 2028కి జగన్తో సమాప్తం కానుందని అన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఇంటింటా తిరుగుతూ గొప్పలు చెప్పుకొంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దొరసానిపల్లెలోని శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హాజరవుతారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ అభిమానులందరూ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎన్నికల సందర్భంగా అలివిగాని హామీలు ఇచ్చారని రాచమల్లు వ్యాఖ్యానించారు. సుమారు 143 హామీలు ఇచ్చినా కేవలం నాలుగైదు మాత్రమే అరకొరగా అమలు చేశారని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నేతలు బాండ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ బాండ్లు ప్రామిసరి నోట్తో సమానమని, వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. ఎమ్మెల్యే వరద సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు ఆయన కుమారుడు కొండారెడ్డి తెలిపారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు రాగుల శాంతి, చింపిరి అనిల్ కుమార్, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, గోపవరం ఉపసర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి, వెంకటేష్, రామమోహన్రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
21 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
వేంపల్లి : బద్వేలులో ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న సీపీఐ 25వ జిల్లా మహాసభల జయప్రదానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర కోరారు. గురువారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతోందన్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2014 ఎన్నికల్లో నల్లధనం వెలికితీత, పన్నుల భారం తగ్గింపు, ధరల నియంత్రణ, ప్రతి అకౌంట్లో లక్షల డబ్బు జమ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి వాగ్దానాలు ఇచ్చిందన్నారు. వాటి అమలులో వైఫల్యాన్ని సీపీఐ ఎండగడుతోందన్నారు. సంపద సృష్టిలో భాగస్వాములైన కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందన్నారు. విభజన హామీలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగిన పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్థిక లోటు భర్తీ, విద్యా, వైద్య సంస్థల సాధనకై దశల వారీ పోరాటాలను సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు, ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, వేంపల్లి మండల కార్యదర్శి అంజనప్ప, తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్లతోపాటు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల దేవదాయ శాఖ, తనిఖీ, కార్యనిర్వహణ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలు సూచించారు. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి. ● కార్యనిర్వహణ అధికారుల ఆధీనంలో ఉన్న దేవదాయల ప్రాపర్టీ రిజిస్టర్లపై పరిశీలన ● రెవెన్యూ వివరాలు నమోదు కాని వివరాల పరిశీలన ● ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పీలు చేయవల్సిన వివరాల పైన.. ● 1బి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో దేవాలయాల పేర్లు చేర్చడం, దాని కోసం మీ సేవ ద్వారా తహసీల్దార్లకు అర్జీలు ఇవ్వడం ● సంస్థల సర్వీస్ ఇనామ్ వివరాలు (ఐఎఫ్ఆర్/ఇనామ్–బి రిజిస్టర్/ఆర్ఎస్ఆర్ ప్రకారం ● సంస్థల భూముల లీజు/ షాప్స్, ఇతరత్రా లైసెన్స్ ఆమోదం ఉత్తర్వులు ● దేవదాయ చట్టం సెక్షన్ 83 కింద ఇప్పటి వరకు ఆక్రమణదారులకు జారీ చేసిన (ఎవికే షన్ నోటీస్) తొలగింపు నోటీసులు ● 11/33 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ● జీవో 60 ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన భూ రక్షణ కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు ● సామూహిక ఆక్రమణల (మాస్ ఎంక్రోచ్మెంట్) స్థితి వంటి విషయలపై చర్చించి అధికారులందరికీ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించారు. -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీరెడ్డి గాని పల్లెకు చెందిన వీరభద్ర కుమారుడు వి.చంద్రశేఖర(42) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పలమనేరుకు చెందిన మహిళతో వివాహం కాగా, కొంత కాలం క్రితం ఆమె చంద్రశేఖర్ను వదిలి వెళ్లిపోయింది. అనంతరం రమాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి దీక్షిత(9) చైతన్యకుమార్(5) సంతానం ఉన్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర మద్యానికి బానిసై, పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం ఏర్పడి తీవ్ర గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన విషయం బయటకు తెలియలేదు. అయితే గురువారం రాత్రి చంద్రశేఖర ఇంట్లోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య రమాదేవిని విచారణ చేస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, ఎప్పుడు చనిపోయాడు తనకు తెలియదంటూ సమాధానం దాటవేసింది. అంతేకాకుండా మృతుడి శరీరం, తలపై రక్త గాయాలు ఉండడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలుకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర మృతిపై భార్య రమాదేవిని పోలీసులు ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చంద్రశేఖర తమ్ముడు మహేష్ కుమార్ మాట్లాడుతూ... తన సోదరుడు మృతికి రమాదేవి కారణమని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రెండో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడి -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుచి, శుభ్రత, లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఖాదరబాద్లోని మహ్మద్ బిర్యాని సెంటర్, డీ మార్ట్ ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహా బిర్యాని సెంటర్, సాగర్ రెస్టారెంట్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్, సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడ సెంటర్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. చికెన్ పకోడ తయారు చేస్తున్న వారు వినియోగించే ఆయిల్ బాగలేదని గమనించామన్నారు. కొందరికి నోటీసులు జారీ చేశామని, తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. టీపీసీ మీటర్తో ఆయిల్ను చెక్ చేశామన్నారు. మహ్మద్ బిర్యాని సెంటర్ నుంచి మటన్ బిర్యాని, చికెన్ కర్రీ ఐటమ్స్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోని కొన్ని పదార్థాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్లో ఏమైనా రిమార్క్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నడపకూడదన్నారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకుని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. ఆమె వెంట కొత్తపల్లె, గోపవరం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామమోహన్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15తులాల బంగారు, రూ.10 వేలు అపహరణ మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో గురువారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. వేద వ్యాస హైస్కూల్ పక్కనే ఉన్న ములపాకు జంగంరెడ్డి చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లెకు చెందిన చిన్న సుబ్బారెడ్డి ఆరేళ్ల కిందట మైదుకూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర చోట్ల ఉన్నారు. గురువారం చిన్న సుబ్బారెడ్డి భార్య మునెమ్మ వరి నాట్లకు వెళ్లగా, ఆయన గ్రామం వద్ద సాగు చేసిన పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు.. ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని గడెలతో సహా పెకలించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో కుడి వైపున బెడ్ రూమ్లో ఉన్న బీరువా తలుపులను పగులగొట్టి అందులో ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భార్యభర్తలు తలుపులు పగలగొట్టి ఉండటం చూసి.. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వస్తువులు, నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వేలి ముద్రల నిపుణులను పిలిపించారు. వారు ఇంటిలోని బీరువా, ఇతర వస్తువులపై పడిన వేలి ముద్రలను సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు. -
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఒకే గదిలో ఐదు తరగతులు
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గది ఉండటంతో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు అదే గదిలో ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 25మంది విద్యార్థులు ఉన్నారు. ఏకై క ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు చదువులు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉంది. అలాగే పాఠశాల భవనాలు కూడా వర్షం వచ్చినప్పుడు వర్షపునీరు గదుల్లోకి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరో ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గండి టెండర్లు .. కొన్నింటికే ఆమోదం చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. టెండర్ల కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ, ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, మాజీ చైర్మన్లు కావలి వీరభాస్కరుడు, కల్లూరు వెంకట స్వామి, ఆలయ సూపరింటెండెంట్ సుభాష్, ఆర్కే వ్యాలీ పోలీసులు పాల్గొన్నారు. 8 తులాల బంగారం, రూ.30 వేలు చోరీ సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామంలో రోడ్డు నంబర్ 10వ వీధిలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ఓ ఇంటిలో 8 తులాల బంగారు, రూ. 30 వేల నగదును చోరీ చేశారు. బాధితుడు మోదుగుల నరసింహులు వివరాల మేరకు.. మాధవరం–1 గ్రామంలో ఉన్న తన తండ్రి నరసింహులు(68) ఆదివారం ఉదయం మృతి చెందాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని తన భార్య లక్ష్మిప్రసన్న పొత్తప్పి గ్రామానికి తీసుకెళ్లిందన్నారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని తాను కువైట్ నుంచి సోమవారం పొత్తపికి వచ్చానన్నారు. అంత్యక్రియల అనంతరం బుధవారం మాధవరం–1 గ్రామానికి వచ్చామన్నారు. తమ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న బీరువాను తెరిచి దుస్తులను చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించామన్నారు. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, రూ. 30వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ను అపహరించుకొని వెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ మహమ్మద్రఫీ, ఏఎస్ఐ సుబ్బరామచంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
రుత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
బి.కోడూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లె వద్ద గత ఆదివారం కంపెనీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా బైక్ను రుత్విక్ కంపెనీ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించగా మంగళవారం గుంత జయరామిరెడ్డి మృతి చెందాడు. కొండా జయరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతి చెందిన జయరామిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రజాప్రతినిధులతో కలిసి బి.మఠం మండలంలోని డి.అగ్రహారం వద్ద గల రుత్విక్ కంపెనీ క్యాంపు కార్యాలయం సమీపంలోని నేషనల్ హైవేపై ఽబుధవారం సాయంత్రం మృతదేహంతో ధర్నాకు దిగారు. అంతేకాకుండా రుత్విక్ కన్స్ట్రక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు సుమారు బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన పది మందికిపైగా మృత్యువాతపడ్డారని వారు ఆందోళన నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు ధర్నా నిర్వహించినప్పటికీ కంపెనీ వారు స్పందించలేదు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బద్వేలు అర్బన్ సీఐ, మైదుకూరు సీఐ, బి.మఠం ఎస్ఐలు రంగంలోకి దిగి మృతుని బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో చర్చించారు. మృతుడు జయరామిరెడ్డి, తీవ్రంగా గాయపడిన జయరామిరెడ్డిలకు కలిపి కేవలం రూ.12 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలిపినప్పటికీ మృతుని బంధువులు ఒప్పుకోలేదు. మృతునికి భార్య రమాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని పోషించే నాథుడు కరువవడంతో కంపెనీ వారు ముందుకు వచ్చి వారిని ఆదుకుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. -
అస్థిర పాలనలో తప్పటడుగు.!
కడప రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజే ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగుకు బదులుగా ‘అస్ధిర పాలనలో తొలి తప్పటడుగు’ అనేలా సాగిందనే ఆరోపణలు వినిపించాయి. పరువు నిలబెట్టుకొనేందుకు తంటాలు... కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యుతకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం తదితర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నివాసాలను సందర్శించి పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అదే సందర్భంలో పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. పథకాలు అందలేదని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని గ్రహించి, ఆ తలనొప్పి ఎందుకని పార్టీ నేతలు చాలా నియోజక వర్గాల్లో తమకు అనుకూలమైన, ఎంపిక చేసిన నివాసాలను మాత్రమే సందర్శించారు. కొన్ని చోట్ల పింఛన్లు రాలేదు..తల్లికి వందనం డబ్బులు పడలేదు అంటే, ఇళ్లుందా, కారుందా అని అడిగి చూస్తాం..చేస్తాం అంటూ నేతలు చేతులు దులుపుకున్నారు. ప్రొద్దుటూరులో 1వ వార్డులో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను చెప్పుకుంటూ వెళ్లారు. మైదుకూరులో రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు 31వ వార్డు రఘునాథపురంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ సమన్వయకర్త రితీష్రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల నుంచి పథకాల అమలు తీరు గురించి తెలసుకోవడం కంటే పథకాల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. కడప నగరం 10వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఏకరువు పెట్టారు. జమ్మలమడుగులో పార్టీ ఇన్చార్జి భూపేష్రెడ్డి వెంకటేశ్వర కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన నివాసాలను సందర్శించినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణులకు అగ్ని పరీక్షగా మారింది. ఇటు ప్రజల్లో..అటు అధిష్టానం వద్ద పరువును నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నారని ఆ పార్టీలో చర్చసాగుతోంది. ఎంపిక చేసిన నివాసాల సందర్శన ‘చూస్తాం..చేస్తాం’ ఇదీ నేతల తీరు ప్రజల్లోకి వెళ్లాలంటే తమ్ముళ్ల ఇబ్బందులు టీడీపీ ‘ఇంటింటికీ సుపరిపాలన’లో మొదటి రోజే నైరాశ్యం -
బాలల రక్షణకు సమన్వయంతో పనిచేయాలి
– ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి కడప కోటిరెడ్డిసర్కిల్ : మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాలల సంరక్షణ లోకీలకంగా వ్యవహరించే తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, బాలల సంక్షేమ పోలీసు అధికారులు, ఎంఈఓలు సమన్వయంతో పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సభా భవనంలో బాలల రక్షణలో భాగస్వాముల పాత్రపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మానవీయ దృక్పథంతో సేవలు అందించాలన్నారు. బాల్య వివాహాల నిరోధంలో తహసీల్దార్లు సహకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీఓల పాత్ర ప్రధానమన్నారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న వారికి మహిళా శిశు సంక్షేమశాఖ తరుపున శ్రీలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ సాయిగ్రేస్తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 మల్టీ డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 232 పరుగులు చేసింది. కడప జట్టు మొదటి ఇన్నింగ్స్లో 303 పరుగులు చేసింది. ఒక వికెట్ నష్టానికి 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు రెండవ ఇన్నింగ్స్లో 114.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 419 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ అద్భుతంగా బ్యాటింగ్లో రాణించి 103 పరుగులు (సెంచరీ) చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 80 పరుగులు, రోహిత్ 73 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 4, చరణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 13.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో కడప జట్టు ఆధిక్యత సాధించింది. -
రాయచోటిలో అలజడి
రాయచోటి : ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం. ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది. పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆధారాలు లభ్యం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇరువురి అరెస్టు అనంతరం వారి గృహాల్లో పోలీసులు మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు అణవణువునూ శోధించారు. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ రెండు గృహాలను సీజ్ చేశారు. వివాహాలపై.. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఇద్దరు ఉగ్రవాదులు సంసార సాగరంలో కొనసాగారు. అబూబకర్ గాలివీడు మండల పరిధిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె జన్మించి అనారోగ్యంతో మృతిచెందింది. మహమ్మద్అలీ పట్టణంలోని బిరాంసాహెబ్వీధికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి వివాహానికి, ఇతర కార్యకలాపాలకు సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీవ్రవాదుల భార్యలను, వారి బంధువులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు వీరికి అన్ని రంగాలలో సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిఘా నీడలో రాయచోటి.. దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో జిల్లా ఎస్పీ రాయచోటిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పట్టణంలోకి ప్రవేశిస్తున్న వాహనాలతో పాటు, వివిధ అంశాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు భారీగా పేలుడు పదార్థాల సామగ్రి, సాంకేతిక పరికరాలు, ఉగ్రవాదుల సమాచారం లభ్యం ఉగ్రవాదుల గృహాలను సీజ్ చేసిన పోలీసులు ఎస్పీ అదుపులో ఉగ్రవాదుల కుటుంబసభ్యులు సహకారం అందిస్తున్న వారితో రహస్య విచారణ రాయచోటి పట్టణంలో పటిష్టంగా నిఘా -
సీమకు నీళ్లివ్వండి బాబూ!
‘కరెంట్’ టాపిక్.. ● శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన...రైతుల్లో గుబులు ● సీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు! ● కూటమి ఎమ్మెల్యేలపై సర్వత్రా విమర్శలు కూటమి నేతల నిర్లక్ష్యం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలను విడుదల చేసే విషయంలో సీమకు చెందిన కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యుత ఉత్పాదన చేపట్టారు. వరద ప్రభావం కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఇందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతే కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. –సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, కడప కనీస నీటిమట్టం నిర్వహించాలి శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులను నిర్వహించాలి. ఆపై వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. – దస్తగిరిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతుసంఘం,కడప కడప సెవెన్రోడ్స్: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు బోసిపోయినట్లు అగుపిస్తున్నాయి. వరద ప్రవాహం బాగా ఉన్నప్పుడు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఎమ్మెల్యేలంతా అధికార టీడీపీకి చెందిన వారైనప్పటికీ పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు వద్ద విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. ఆ మేరకు నీరు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయానికి వెళుతోంది. దీంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం ఒక్కసారిగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సీమకు నీటి విడుదలపై ప్రభు త్వం నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడని నేపథ్యంలో బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కర్నూలులోని చీఫ్ ఇంజనీరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ● ఇన్నాళ్లూ ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి వరద ప్రభావం భారీగా వచ్చి చేరడం, విద్యుత్ ఉత్పాదన చేపట్టకపోవడం వంటి కారణాలతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరడంతో రాయలసీమ రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా నీరందితే సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి వీలవుతుందని భావించారు. శ్రీశైలం జలాశయంలో మంగళవారం విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం కుడిగట్టు కాలు వ వద్ద విద్యుత్ ఉత్పాదన ద్వారా 27,708 క్యూసెక్కుల నీరు దిగువనున్న కృష్ణానదిలోకి వదులుతోంది. ఎడమగట్టు కాలువ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ద్వారా 35,315 క్యూసెక్కులు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయం రెండు వైపుల నుంచి 63,023 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. బుధవారం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం 64097 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్ ఉత్పాదన వల్ల కొంత నీరు పోయినా ఇన్ఫ్లో ద్వారా 1074 క్యూసెక్కుల నీరు మిగులు ఉన్నట్లే కదా అని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. అయితే వరద ప్రవాహం స్థిరంగా ఉండదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారమే సోమవారం సుమారు లక్షా 50 వేల క్యూసెక్కులు ఉన్న శ్రీశైలం ఇన్ఫ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 64,097 క్యూసెక్కులకు పడిపోయింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి శ్రీశైలం నీటిమట్టం 875.40 అడుగులుగా ఉంది. ప్రస్తుతం డ్యాంలో 165 టీఎంసీలు ఉన్నాయి. ● తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలకుగాను ప్రస్తుతం 1.83 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 15.12 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ, ఇన్ఫ్లో జీరోగా ఉంది. ఔట్ఫ్లో 80 క్యూసెక్కులు ఉంది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 17.74 టీంఎసీలు కాగా, ప్రస్తుతం 6.24 టీఎంసీ(35.17 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో..అవుట్ ఫ్లో 132 క్యూసెక్కులు ఉన్నాయి. ● గోరకల్లు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.13 టీఎంసీ (25.16 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో, అవుట్ ఫ్లో 70 క్యూసెక్కులు ఉన్నాయి. అవుకు కాంప్లెక్స్ రిజర్వాయర్ సామర్థ్యం 4.15 టీఎంసీకిగాను ప్రస్తుతం 1.68 టీఎంసీ (40.53 శాతం) ఉన్నాయి. గండికోట సామర్థ్యం 26.85 టీంఎసీకిగాను ప్రస్తుతం 14.77 టీఎంసీ (54.99 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 470 క్యూసెక్కులు. మైలవరం సామర్థ్యం 9.98 టీఎంసీకిగాను 2.57 టీఎంసీ గా ఉండగా, ఇన్ఫ్లో 0, అవుట్ ఫ్లో 131 క్యూసెక్కులు. పైడిపాలెం సామర్థ్యం 6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.46 టీఎంసీ ఉన్నా యి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. సర్వరాయ సాగర్ సామర్థ్యం 3.06 టీఎంసీకిగాను ప్రస్తుతం 0.89 టీఎంసీలు ఉండగా, ఇన్ఫ్లో 70, అవుట్ ఫ్లో 48 క్యూసెక్కులు ఉన్నాయి. నోరు మెదపని ప్రజాప్రతినిధులు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూ రు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతి నిద్యం వహిస్తున్న శాసనసభ్యులందరూ అధికార కూటమికి చెందిన వారే. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు మెజార్టీని కట్టబెట్టారు. అయితే, ఈ ప్రాంత సాగునీటి విషయంపై వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఆయకట్టు రైతుల్లో వినిపిస్తున్నాయి. వరద ప్రభావం బాగా వస్తున్న రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాశయాలను నింపేందుకు చర్యలు తీసుకుని ఉండాల్సిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని సాగర్కు విడుదల చేస్తూపోతే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు స్పందిస్తారో లేదో చూడాలి. -
ఏ.ఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్
కడప అర్బన్: కడప పోలీసు కళాజాగృతి బృందం సభ్యులలో మహిళా డ్యాన్సర్పై అసభ్యంగా ప్రవర్తించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రాథమిక విచారణ చేయించారు. విచారణలో కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ తప్పు చేశాడనీ రుజువు కావడంతో అతనిపై వేటు వేశారు. నియామక పత్రాలు అందజేత కడప కోటిరెడ్డిసర్కిల్: రైల్వే ఇన్స్టిట్యూట్ భవన్ ఎన్నికలు వారం రోజుల కిందట ఏకగ్రీవంగా ముగిశాయి. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం రైల్వే పోలింగ్ ఆఫీసర్ రాధాకృష్ణయ్య, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గంగాదేవి ఎన్నికై న వారికి అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీగా రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా నరేష్కుమార్, కోశాధికారిగా వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటింగ్ కమిటీ సభ్యులుగా లక్ష్మినారాయణ, చినబాబు, ఎలక్ట్రికల్ కమర్షియల్ ఇంజనీరింగ్ ఎస్అండ్టీ కమిటీ సభ్యులుగా రాజేష్కుమార్, గీత, అనిల్కుమార్, మస్తాన్లకు నియామక పత్రాలను అందజేశారు. సహకార సంఘాలు అభివృద్ధికి సహకరించాలి కడప అగ్రికల్చర్: జిల్లాలో సహకార సంఘాల భవిష్యత్తు ప్రణాళికలను రచించి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి సిబ్బంది సహకరించాలని జిల్లా సహకార శాఖాధికారి యం. వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా బుధవారం కడప డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు సక్రమంగా పనిచేయడానికి కృషి చేయాలన్నారు. ప్రొద్దుటూరు సీటీసీ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస రావు మాట్లాడారు. అనంతరం సహకార శిక్షణా కేంద్రం ప్రొద్దుటూరులో 10వ బ్యాచ్ డీసీఎం, సీఏ విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి వారిని కోర్సులో నమోదు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ పుష్పలత, కృష్ణరెడ్డి, నాగరత్నం, సత్యనందం, వెంకట రమణ, శ్రీధర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజన్ ప్లాన్ అమలుపై దృష్టి కడప సెవెన్రోడ్స్: జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్లో స్వర్ణ ఆంధ్ర విజన్– 2047 లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియోజకవర్గ స్పెషల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లా, నియోజకవర్గ, మండలాల అభివృద్ధి విజన్ ప్లాన్పై ప్రతి ఒక్క నియోజకవర్గ స్పెషల్ అధికారులు,మండల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో విజయవంతమైన వారు ఇతరులకు సహకారాన్ని అందించడం,నాలెడ్జ్ షేరింగ్ లాంటి అంశాలు పీ4 పాలసీలో ఇమిడి ఉన్నాయన్నారు. అలాగే ప్రతి గ్రామం, మండలాలలో మార్గదర్శులను గుర్తించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 76 వేలకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. అన్ని మండలాలలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. బీఈడీ పరీక్షలు ప్రారంభం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ కళాశాలల రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె. ఎస్ వి కృష్ణారావుతో కలిసి తనిఖీ చేశారు. కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను, వసతులను పరిశీలించారు. 4,551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను పంపామని, ప్రత్యేకంగా హై పవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. -
పేద విద్యార్థులకు వరం.. గురుకులం
బ్రహ్మంగారిమఠం: నాణ్యమైన విద్య, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (బాలుర) మహా గురుకులం విద్యాలయం పేద విద్యార్థుల పాలిట వరం అని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. బుధవారం బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో అకడమిక్ భవనాల్లో తరగతులు, వసతి గృహ భవనాలను కలెక్టర్, మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ లతో కలిసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి.మఠం మండల కేంద్రానికి సమీపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో గురు కులం రూపుదిద్దుకుందన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామ ర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 640 మంది విద్యార్థులతో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ మహా గురుకులం కీర్తి రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 21 కోట్ల వ్యయంతో మహా గురుకులం నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. మైదుకురు నియోజకవర్గ అభివృధ్ధి కోసం కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అన్నింటికీ మూలం ఒక్క విద్యనే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉషశ్రీ మాట్లాడారు. అనంతరం అధికారులు తరగతి , హాస్టల్ గదులు.. వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, డీఈవో షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏసీపీ నిత్యానందరాజు,సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మహా గురుకుల విద్యాలయంలో తరగతుల ప్రారంభోత్సవం -
నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ, సాయిబాబా విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై అధికారుల వేధింపులు అధికమయ్యాయన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలిపేందుకు గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి 4 లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. పేద వర్గాలకు సంబంధించి 25 శాతం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ యాక్టు ఉన్నా అందులోని నిబంధనలు పూర్తి స్థాయిలో అధికారులు పాటించడం లేదన్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 90 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అందులో సగం ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ యాక్టు అనేకచోట్ల దుర్వినియోగమవుతోందన్నారు. ఇలా అనేక సమస్యలతో నిర్వహిస్తున్న బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు గంగయ్య యాదవ్, శివశంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇలియాస్ రెడ్డి, మైథిలి తదితరులు పాల్గొన్నారు. -
కాలయాపనతో... మైండ్ గేమ్!
డబ్బులు ఖర్చుచేశాం.. కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి అంటూ ఓవైపు కాంట్రాక్టర్లు ఏడాదిగా వేడుకుంటున్నారు..! కానీ.. పనుల నాణ్యతపై ఒకసారి విజిలెన్స్ విచారణ.. తప్పేమీ లేదని అందులో నివేదిక రావడంతో టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి.. కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరుకున్నాయి. అయినా ఏడాదిగా కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా కాలయాపన చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ పెద్దలు పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయాలనే ఎత్తుగడ ఎంచున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఎన్నడూ లేని విధంగా మానసికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, సీఎఫ్ఎంఎస్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయకుండా నాన్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసుల నంబర్లు అయ్యాయి. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. సహజంగా జిల్లాకేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఒత్తిడితో వేరేచోట చేశారు. అయితే, అన్ని శాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఎంచుకుంది.» దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించక మునుపే చేపట్టాలి. ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంట్ విధి విధానాల ప్రకారం సంబంధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సరి్టఫికెట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ జాప్యం చేసేందుకు ఒకసారి విజిలెన్స్ ఫర్ క్వాలిటీ, ఆ ప్రక్రియ పూర్తికాగానే మళ్లీ మొదటికి వచ్చి టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి కాలయాపన చేసే ఎత్తుగడను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారని పలువురు వాపోతున్నారు. » ప్రభుత్వం 15 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు తీర్పు దశకు రాగా, దానిని అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వాపోతున్నారు. » పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని ప్రస్తుతం టీడీపీ వారు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్, క్వాలిటీ ఫర్ విజిలెన్స్ అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం విశేషం. » వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిçస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కానీ, కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండడం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
ప్రేమ చిగురించిన చోటే.. ప్రాణమూ పోయింది
ముద్దనూరు/పుట్రేల(విస్సన్నపేట): ఆ రెండు మనసులను పనిచేసే ప్రాంతమే పరిచయం చేసింది.. ప్రేమను చిగురించేలా చేసింది. పెళ్లిపీటల కోసం సిద్ధ పరచింది. మరో రెండు నెలల్లో ఒక్కటి చేయాలని చూసింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆ ఇద్దరినీ కబళించింది. ఆ పనిచేసే ప్రాంతంలోనే పాశాన్ని విసిరింది. అనుకోని విపత్తు వారి ఆశలను ఆహుతి చేసింది. ఎన్నో ఆకాంక్షలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలకున్న ఆ జంట.. ఇంట పెను విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్రెడ్డి(25), ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన రామాల. శ్రీరమ్య ఫార్మా పరిశ్రమలో ఉద్యోగులు. ఇక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ పెద్దలను ఒప్పించారు. మరో రెండునెలల్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణంలో విషాదం వెంటాడింది. సోమవారం ఇద్దరూ పరిశ్రమలో విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో పెనికలపాడు, పుట్రేల గ్రామాల్లో మంగళవారం తీవ్ర విషాదం అలముకుంది.రెండునెలల్లో పెళ్లి చేద్దామనుకున్నాం...రామాల నారయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఆరు నెలల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఘోర విపత్తులో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. నిఖిల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఆషాఢం వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నామని తీరా ఈ విషాద సంఘటనలో ఇరువురు చనిపోయారని మృతురాలి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో కడప–నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. మంగళవారం రెండవ రోజు తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 129 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించగా 67.3 ఓవర్లలో 303 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధీరజ్కుమార్ రెడ్డి 70 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 4 వికెట్లు, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 62 పరుగులు, కారుణ్య ప్రసాద్ 46 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 179 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 58.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిహాన్ 159 బంతుల్లో 29 ఫోర్లు, 2 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. తమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. మంజునాఽథ్ 2 వికెట్లు, తేజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 34.5 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్ నాయుడు 3 వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 4.2 ఓవర్లకు 29 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. 7 వికెట్లు తీసిన అనంతపురం బౌలర్ వరుణ్ సాయి నాయుడు 6 వికెట్లు తీసిన చిత్తూరు బౌలర్ సాయి చరణ్ -
ముందుంది శ్రావణం.. ఏదీ స్వామి దర్శనం.!
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయం అంటే రాయలసీమ జిల్లాల్లో తెలియని వారంటూ ఉండరు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తుకు వచ్చేది కూడా గండిక్షేత్రమే. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. అయితే గండి వీరాంజనేయుడి మూలవిరాట్ దర్శనం కోసం గత నాలుగేళ్ల నుంచి ఎదురు చూసిన భక్త జనానికి ఈ ఏడాది కూడా నిరాశేశే ఎదురవుతోంది. ఇందుకు కారణాలు చూస్తే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయం పట్ల కొందరి నిర్లక్ష్యం. మరి కొందరి పంతాలు పట్టింపులు. ఇంకొందరి అసమర్థత ఇందులో బలంగా కనిపిస్తున్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో విలీనం చేసి కొంత వరకు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా రు.28 కోట్లు నిధులు మంజూరు చేసి చరిత్రను తిరగరాశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి శిలాఫలకం వేశారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే తొలుత పనులు వేగవంతంగా జరిగినా క్రమేపీ మంద కొడిగా సాగాయి. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పుణ్య కాలం కాస్తా పూర్తయింది. ఆలయం పనులు పూర్తవలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.తిరిగి ప్రభుత్వం అదికారం లోకి రాలేదు. ఆలయం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయం పనులు జోరందుకుంటాయని భక్తులు భావించారు. కాని ఇందుకు విరుద్ధంగా గత ప్రభుత్వంలోని పాలక మండలిని రద్దు చేయించి, తాము సీట్లో కూర్చోవాలి తర్వాతనే గుడి పునః ప్రతిష్ట పనులు అనే ధోరణితో కూటమి నేతలు ఉన్నట్లు తెలుసుకొని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభాభిషేకం జరగాలంటే సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కుంభాభిషేకం చేయకూడదని కొందరు చెబుతున్నారు. ఆ నిధులు ప్రభు త్వం నుంచి మంజూరు చేయించాలనే ఆలోచన ఏ ఒక్క కూటమి నేత చేయకపోవడం విచారకరం. పునః ప్రతిష్ట చేస్తే సరిపోతుంది కదా.. ఆలయం పనులు పూర్తయ్యాకే మహా కుంభాభిషేకం అంటున్నారు. ఇందుకు పనులు పూర్తి కాలేదు అంటున్నారు. అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలు మూల విరాట్కు అర్చకులు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఇన్ని చేసేవారు భక్తులకు స్వామి దర్శనం కూడా చేయించవచ్చు కదా అని చర్చించుకుంటున్నారు. పునః ప్రతిష్ట చేసేందుకు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి మహా అంటే వారం పది రోజుల్లో పూర్తవుతాయి. పైగా నిధుల ఖర్చు కూడా తగ్గుతుంది. భక్తులకు మూల విరాట్ దర్శనం చేయించిన వారు అవుతారు. దీనివల్ల ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ కోణంలో అధికారులు ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. పంతాలు పట్టింపులతో సరి.. ఆలయంలో 95 శాతం పైగా పనులు పూర్తయ్యా యని జూన్ నెలాఖరులోపు గుడి పునఃప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసేదుకు ముహూర్తపు తేదీని ఖరారు చేయాలని నాలుగు నెలల క్రితం దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ కర్నూలు డీసీ పట్టెం గురుప్రసాద్లు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులకు ఆదేశించారు. అయితే అర్చకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో ముహూర్తం నిర్ణయించేందుకు వీరు పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండి ఆలయ పునః ప్రతిష్టపై వీడని ఉత్కంఠ నాలుగేళ్లుగా నిరాశలో లక్షలాది మంది భక్తులు ఈ ఏడాదీ అదే పరిస్థితి -
ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు ఈనెల 12, 13 తేదీలలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి, సెక్రటరీ పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూలై 12వ తేదీ రెండవ శనివారం కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో అండర్ 15, అండర్ 17 విభాగాలకు చెందిన బాల బాలికల ఎంపికలు జరుగుతాయన్నారు. అలాగే 13వ తేదీ ఆదివారం ప్రొద్దుటూరు జార్జ్ క్లబ్లో అండర్ 11, అండర్ 13 బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం లోపు 9440107080 లేదా 9440223908 నంబర్కు ఎంట్రీలను పంపాలని అసోసియేషన్ చైర్మన్ బాషా కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మైదుకూరు/బి.కోడూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బి.కోడూరు మండలం గుంతపల్లెకు చెందిన గుంత జయరామిరెడ్డి (42) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతపల్లెకు చెందిన జయరామిరెడ్డి జూన్ 29న ఖాజీపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే రోజు ఆయన శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తన బంధువు కొండా వెంకట రమణారెడ్డితో కలిసి మైదుకూరుకు వస్తున్నారు. జాతీయ రహదారి సర్వాయపల్లె అండర్ పాస్ వద్ద సిమెంట్ మిక్చర్ వాహనం వారిని ఢీ కొంది. సంఘటనలో జయరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొండా వెంకటరమణారెడ్డి చికిత్స పొందుతున్నాడు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ జయరామిరెడ్డి మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైకుల దొంగ అరెస్టుయశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది. -
నేటి నుంచి టోల్ ఫీజు
ముద్దనూరు : నూతనంగా నిర్మాణం పూర్తయిన ముద్దనూరు–తాడిపత్రి 4లేన్ల జాతీయ రహదారిలో బుధవారం నుంచి టోల్ప్లాజా ప్రారంభించి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. మండలంలోని మంగపట్నం గ్రామ సమీపంలో ఈ టోల్ప్లాజా నెలకొల్పారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు సుమారు 55 కి.మీ. రహదారిని 4లేన్ల రహదారిగా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ రహదారి పనులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు,నిధులు మంజూరయ్యాయి. అనంతరం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవలే రహదారి నిర్మాణం పూర్తవడంతో నేటినుంచి వాహనాలకు టోల్ఫీజు కూడా వసూలు చేయనున్నారు. తాడిపత్రి,అనంతపురం,గుత్తి,బళ్లారి తదితర ముఖ్య ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. జలాశయాల్లో చేపల వేట నిషేధం కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి కృషి – మత్య్సశాఖ నూతన డీడీ నాగయ్య కడప అగ్రికల్చర్ : జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్(ఎఫ్ఏసీ) నాగయ్య పేర్కొన్నారు.జిల్లా మత్యశాఖ డీడీ గా నాగ య్య మంగళవారం కడప మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. నాగయ్యకు కార్యాలయ సిబ్బంది అభినందించారు.5న మెగా జాబ్మేళా బద్వేలు అర్బన్ : స్థానిక రాచపూడినాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 5న సియట్ కంపెనీ ద్వారా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఏఓ సాయిక్రిష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీసీఏలలో 2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 8297160304, 9703244614 నెంబర్లను సంప్రదించాలని కోరారు. నియామకం కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లా విద్యార్థి విభాగ కమిటీని నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా సి. సాయి నారాయణరెడ్డి(బద్వేల్), బి. శ్రీకాంత్రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కేసీ పాములేటి(జమ్మలమడుగు, ఆర్. మహేష్(కమలాపురం), శ్యామ్ మంచాల (కడప), నరేంద్రారెడ్డి (ప్రొద్దుటూరు), రాయు డు (మైదుకూరు), జిల్లా కార్యదర్శులుగా టి.మధుసూదన్రెడ్డి(మైదుకూరు), చైతన్య (ప్రొద్దుటూరు), పవన్కుమార్రెడ్డి(పులివెందుల), అబ్దుల్ ఖాదర్ (జమ్మలమడుగు), ఎన్. జయరామిరెడ్డి(కమలాపురం),రాకేష్ (బద్వేల్), మహ్మద్ సొహైల్ (కడప)ను నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి. ధీరజ్ గణేష్, ఎస్. లెన్నీ, వి. కార్తిక్ (కడప), విజయ్భాస్కర్రెడ్డి, కె. శ్రీనివాసులురెడ్డి(కమలాపురం), కె. శివప్రసన్న కుమార్, జి. నారారయణరెడ్డి, కె. రవీంద్రారెడ్డి(బద్వేల్), వి. ఆదిత్యనాథ్రెడ్డి, ఎస్. అఖిల్(ప్రొద్దుటూరు), షేక్ మహ్మద్, ప్రకాష్ వేముల(పులివెందుల), భరత్కుమార్రెడ్డి, షేక్ ఖలీల్బాషా (జమ్మలమడుగు), నరసింహారెడ్డి, వై. చైతన్యరెడ్డి(మైదుకూరు)లను నియమించారు. -
రాష్ట్రంలో విధ్వంసకర పాలన
బద్వేలు అర్బన్ : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారని కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ బయనపల్లె గ్రామంలో ఇటీవల కూటమి నేతల ఒత్తిడితో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన శ్రీకాంత్రెడ్డి ఇంటిని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందనేదానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. అన్యాయంగా ఇంటిని కూల్చి వేసి తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. గుడికి, బడికి 50 మీటర్ల దూరంలోనే మద్యంషాపు ఉండడం అసాంఘికమని..అటువంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిని నిర్మించుకుంటే అప్పుడు చెరువు స్థలమని కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కూల్చివేసిన ఇంటి పక్కనే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేశారని.. అప్పుడు చెరువు స్థలమని ఈ ప్రభుత్వానికి తెలియదా అని అన్నారు. శ్రీకాంత్రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసానిఆదిత్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మాజీ కుడా చైర్మన్ గురుమోహన్, జెడ్పీటీసీ పోలిరెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ గోపాలస్వామి, డీఎల్డీఏ చైర్మన్ మాధవరెడ్డి, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారుశీనయ్య, యద్దారెడ్డి పాల్గొన్నారు. రైతు కుటుంబానికి ఎంపీ పరామర్శ ఖాజీపేట : కూటమి పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. బి. కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి (42) మార్చి 19 న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళవారం రోజున బక్కాయపల్లె గ్రామానికి వచ్చి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సరైన దిగుబడి రాక పోవడం, దిగుబడి వచ్చిన సందర్భంలో గిట్టు బాటు ధర లేక నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ పీవీ రాఘవరెడ్డి, ఎపీఎస్ ఆర్టీసీ కడప మాజీ జోన్ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్రెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ రైతు విబాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి -
ప్రభుత్వ స్థలంపై కన్నేశారు !
వల్లూరు (చెన్నూరు) : ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చ నేతలు వాలిపోతున్నారు. వేలు..లక్షలు కాదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారం అండ చూసుకుంటూ.. అధికారుల తీరును ఆసరాగా మార్చుకుంటూ కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న స్థలం చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామ పొలంలో శాటిలైట్ సిటీ సమీపంలో ఉంది. సర్వే నెంబర్ 405/2 –68 సెంట్లు, 406/1– 47 సెంట్లు,406/2– 2.07 రెండు ఎకరాల ఏడు సెంట్లు, 406/3 –11 సెంట్లు వెరసి మొత్తం 3.33 ఎకరాలను ఆక్రమించేందుకు భూబకాసురులు పథక రచన చేశారు. సర్వే నెంబర్ 405 లో 70 సెంట్ల స్థలం కబ్జా విషయమై గత జూన్ 15న ‘సాక్షి’పత్రికలో పతాక శీర్షికన కథనం రావడంతో వెనక్కి తగ్గిన కబ్జాకోరులు ప్రస్తుతం 1 బి అడంగల్ లో 3.33 ప్రభుత్వ భూమిగా కనబడుతున్న దానిని ఆక్రమించేందుకు మళ్లీ పనులు మొదలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నమాచుపల్లి గ్రామ పొలం ప్రాంతంలో భారీగా వెంచర్లు వెలిసి ఉండడంతో, అక్కడి భూములకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ విషయాన్ని కూటమి నేతలు తమకు అనుగుణంగా మార్చుకొని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూ మి ఆక్రమణదారుల పాలు కాకుండా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. రూ. 10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు -
‘గురుకులం’ పనులు పూర్తి చేయండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో వెనుకబడిన తరగతుల పేద విద్యార్థులకు అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం త్వరలో నిర్వహణలోకి రానుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులు, వసతులు సంబంధిత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని త్వరలో నూతన భవనంలో మారుస్తామని వెల్లడించారు. రెండు నెలల్లో గురుకులంలో ఎలాంటి మౌళిక సదుపాయాల కొరత లేకుండా రోడ్లు, విద్యుత్, నీటి పైప్ లైన్, గ్రీనరీ, డ్రిప్ ఇరిగేషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఆర్ అండ్ బీ ఈఈ మాధవి, డీఈ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ ఎ.నిత్యానందరాజులు, కాంట్రాక్టు ఏజెన్సీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలల విద్యార్థులకు ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం వైవీయూలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆచార్య కె. ఎస్ వి.కృష్ణారావు తనిఖీ చేశారు. పలువురు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మిప్రసాద్, డాక్టర్ ముని కుమారి మాట్లాడుతూ 684 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 99 గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రం అబ్జర్వర్ డాక్టర్ వి.రామకృష్ణ కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పి. చంద్రమౌళి పాల్గొన్నారు. -
●అవే పనులను కొనసాగిస్తున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పెద్దలు కక్ష రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యంగా పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. ‘డబ్బులు వెచ్చించి కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించాలని..’ ఏడాదిగా అడిగి..అడిగి అలసిపోయిన కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరకున్నాయి. ఈ దశలో ఇంకొంత కాలం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడానికి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ వేసింది. టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు అంటూ మరోమారు విచారణకు ఆదేశించింది. పులివెందులలోని పాడా పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లను మానసికంగా, ఆర్థికంగా ఉద్దేశ్యపూర్వకంగా వేధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, ీసీఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం చేసిన పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను (సహజంగా జిల్లా కేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి, కానీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్ల) విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. అన్ని శ్యాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే ఇక బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ ఎంచుకుంది. విజిలెన్సు ఫర్ టెండర్ వ్యాల్యూయేషన్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తి అయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్సు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించకముందే చేపట్టాలి. ఆయా ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంటు చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంటు విధి విధానాల ప్రకారం సంబంఽధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు జడ్జిమెంటు దశకు చేరుకున్న తరుణంలో అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వారు వాపోతున్నారు. పులివెందుల కాంట్రాక్టర్లపై పగబట్టిన ప్రభుత్వ పెద్దలు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు విచారణల పేరిట కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా అడ్డుకుంటున్న వైనం పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్శాఖల పరిధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను ప్రస్తుతం తెలుగుతమ్ముళ్లు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు, క్వాలిటీ ఫర్ విజిలెన్సు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం గమనార్హం. తెలుగుతమ్ముళ్లు ఆయా పెండింగ్ పనులు చేపడుతున్నారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. అంతెందుకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కాగా కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండటం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా అడ్డుకుంటూ మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
రక్తదాన ప్రాధాన్యతను గుర్తించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతి ఒక్కరూ రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రచురించిన రక్త వారోత్సవాల కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల రెండో వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేబీవీఎస్ వ్యవస్థాపకుడు అశోక్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కాశి, సురేంద్ర, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కల.. నిజమైన వేళ !
వారంతా శ్రమజీవుల బిడ్డలు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని.. కన్న వారి కలలను నిజం చేయాలని కలగన్నారు. కష్టపడి చదివారు.. వారి కష్టానికి ఫలితం దక్కింది. మహానేత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది. స్వప్నం సాకారమైన వేళ.. వారి కళ్ల నిండా సంతోషం కనిపించింది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ● రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 1010 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. 878 మంది విద్యార్థులు హాజరై ప్రవేశాలు పొందారు. త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. వైఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. భావిభారత ఇంజినీర్లుగా దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని అడ్మిషన్లు పాందిన విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం 878 మంది అడ్మిషన్లు పొందిన విద్యార్థులు -
కవ్వింపు చర్యలు!
సాక్షి ప్రతినిధి, కడప : అధికార బెత్తం పట్టుకొని ఓ సామాజిక వర్గాన్ని అక్కడ అణగదొక్కారు. వారందర్నీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ ఆలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని వారు పట్టు బట్టారు. చేస్తున్న తప్పును తప్పు అన్నందుకు వివక్ష మరింత అధికమైంది. ఆపై అధికార మదం తోడైంది. ఫలితంగా వెంటవెంటనే కవ్వింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. క్రమం తప్పకుండా వాదులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి పోట్లదుర్తిలో పరస్పర రాళ్లదాడులు తెరపైకి వచ్చాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో కాస్తా ఉపశమనం దక్కినా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎరగ్రుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. తాగుబోతుల మధ్య నెలకొన్న స్వల్ప వాదులాట చిలికి చిలికి గాలివాన లాగా మారి రెండు సామాజిక వర్గాల మధ్య పెద్ద వివాదంగా మారింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. వైన్ షాపులో మద్యం సేవిస్తున్న ఇరువురు ఆ తర్వాత ఖాళీ బాటిల్ను వెనుకకు వేశారు. ఆ వైపు ఉంటూ మద్యం సేవిస్తున్న మరో ముగ్గురు బాటిల్ మా వైపు ఎందుకు వేశారంటూ గొడవ పడ్డారు. చూడకుండా చేసిన పొరపాటును సీరియస్గా తీసుకోవద్దని అక్కడి వారు సర్ది చెప్పారు. అంతటితో వదిలేసి ఉంటే సరిపోయేది. ఊర్లో మీ కథ పెద్దదైంది. మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటూ పరుష పదజాలంతో దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలయ్యాయి. సురేష్నాయుడుపై తిరుగుబాటు.. వైన్ షాపులో చోటుచేసుకున్న వివాదం పోట్లదుర్తి గ్రామంలో సీఎం సురేష్నాయుడు ఇంటిపై తిరుగుబాటుగా మారింది. ఎంతకాలం మీ దౌర్జన్యాలను భరించాలంటూ మరో సామాజిక వర్గం ఆదివారం అర్థరాత్రి తర్వాత సురేష్నాయుడు ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. ఈ క్రమంలో పరస్పర రాళ్ల దాడులు తెరపైకి వచ్చాయి. సుమారు గంట పాటు సురేష్నాయుడు ఇంటి సమీపంలో రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎర్రగుంట్ల పోలీసులు సకాలంలో గ్రామానికి చేరుకొని ఉద్రిక్తతలను శాంతింపజేశారు. ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కవ్వింపు చర్యల కారణంగా ఉత్పన్నమైన ఘర్షణ రెండు సామాజిక వర్గాలకు అంటుకుంది. దీనికి కారణం.. తమకు అడ్డు లేదు అనుకున్న సందర్భంలో పెద్దమ్మ దేవాలయం ప్రాంగణానికి మొత్తం ప్రహారీ నిర్మించాలని కొందరు పట్టుబట్టడమే. వెరసి ఇలాంటి వివాదాలు తరచూ తెరపైకి వస్తున్నాయని పలువురు వివరిస్తున్నారు. అధికారులు వారి విధులను పైరవీలకు తలొగ్గకుండా నిబద్ధతతో నిర్వర్తిస్తే ఇలాంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు. ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామాల్లో సమస్యలకు మూల కారకులుగా అధికారులు మారుతుండటం గమనార్హం. పోట్లదుర్తిలో పోలీసు పికెట్ కొనసాగుతున్నా వ్యవహారం నివురు గప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికై నా నిక్కచ్చిగా వ్యవహరించి కవ్వింపు చర్యలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోట్లదుర్తిలో హైటెన్షన్ మద్యంషాపు వద్ద స్వల్ప వాదులాట రెచ్చగొట్టి దాడికి పాల్పడిన సురేష్నాయుడు వర్గీయులు ఆపై పోట్లదుర్తిలో ఉద్రిక్తత.. పరస్పర రాళ్లదాడులు సకాలంలో స్పందించిన పోలీసు బలగాలు -
సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం
కడప సెవెన్రోడ్స్ : బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకుల పాఠశాలకు తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ సగిలేరు గురుకుల పాఠశాలను యధావిధిగా అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1983లో ఏర్పడిన సగిలేరు గురుకుల పాఠశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి పాఠశాలను బి.మఠంలోని తోట్లపల్లె వద్ద ఉన్న మహా గురుకులంలో విలీనం చేయాలని భావించడం తగదన్నారు. ఇప్పటికై నా అధికారులు తమ నిర్ణయాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీపీఏ నాయకుడు భాస్కర్, ఏఐఎస్బీ రాయలసీమ కన్వీనర్ రాజేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. బాలింత మృతిపై విచారణబద్వేలు అర్బన్ : తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చి బాలింత మృతి చెందిన ఘటనపై సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.నాగరాజు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుండంరాజుపల్లె ఎస్టీ కాలనీలో సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో కాన్పులు చేయడం చాలా ప్రమాదకరమని, ఎలాంటి శిక్షణలేని మంత్రసానులు ఇళ్లల్లో సొంతంగా కాన్పులు చేయకూడదని తెలిపారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలోనే జరగాలని, గర్భిణులను ఆసుపత్రులకు తీసుకొని వెళ్లేందుకు 108 ఉపయోగించుకోవాలని సూచించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి మాత శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బంది పైన ఉందన్నారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు, మృతురాలి బంధువులను అడిగి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఏ. ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది ఖాజామొహిద్దీన్, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీబద్వేలు అర్బన్ : పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఆదివారం అర్ధరాత్రి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మైదుకూరు రోడ్డు వైపున ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ధ్వంసమయ్యాయి. రేణిగుంట నుండి బద్వేలు మీదుగా గోపవరం సమీపంలోని సెంచూరి పరిశ్రమకు కలప లోడుతో వెళుతున్న లారీ నాలుగురోడ్ల కూడలిలోకి వచ్చేసరికి మలుపు తిప్పుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. -
కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమ వారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూ రు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రా రంభించిన నెల్లూరు జట్టు 69.3 ఓవర్లకు 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 116 బంతుల్లో 74 పరుగులు, ఇకాషర్ 44 పరుగులు చేశారు. కడప జట్టులోని చరణ్ 4 వికెట్లు, నాగ కుళ్లాయప్ప 2 వికెట్లు, ధీరజ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 18 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు విఘ్నేష్ 53 పరుగులు, రణధీర్ రెడ్డి 47 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్లో అనంతపురం–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లకు 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 55 పరుగులు, లోహిత్ లక్ష్మీ నారాయణ 33 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. వరుణ్ సాయి నాయుడు 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిహాన్ చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 103 బంతుల్లో 108 పరుగులు చేశాడు. హమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, మంజునాఽథ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. ఉత్సాహంగా త్రోబాల్ పోటీలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగర శివార్లలోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ బీ–జోన్ , సీఐఎస్సీఈ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జోనల్ త్రోబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ త్రోబాల్ క్రీడాకారుడు డి. రేవంత్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు, క్రమశిక్షణ, జట్టు సమన్వయం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా –అండర్–17 విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప , ద్వితీయ స్థానంలో శ్రీ వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లి, అండర్–14 విభాగంలో విజేతలుగా స్విస్ రిఫరల్ హాస్పిటల్ స్కూల్ పలమనేరు, రన్నరప్ లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కడప, మూడవ స్థానం స్టెమ్ పబ్లిక్ స్కూల్, గుంటూరు నిలిచాయి. పాఠశాల ప్రిన్సిపాల్ అమిత్ సింగ్ ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెన్నేపల్లిలోనే పాఠశాల కొనసాగించాలి కడప సెవెన్రోడ్స్ : అట్లూరు మండలం చెన్నేపల్లె ప్రాథమిక పాఠశాలను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎస్.వెంకటాపురం పాఠశాలలోకి తరలించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చెన్నేపల్లెలోనే కొనసాగించాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. -
మహిళా పోలీసు కౌన్సెలింగ్లో నిబంధనలకు పాతర
కడప సెవెన్రోడ్స్ : సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్లో ఉన్నతాధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు మహిళా పోలీసులు సోమవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియేట్ మహిళా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమాదేవి, కార్యదర్శి కె.సత్యకుమారి, దీప్తి మాధురిలు మాట్లాడుతూ ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 646 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా లేదన్నారు. నిబంధనలు పాటించకుండా కేవలం స్పౌజ్కే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీఓ నెంబరు 6ను ఉల్లంఘించారని ఆరోపించారు. మెడికల్, పీహెచ్ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. కౌన్సెలింగ్ జాబితా కూడా ముందుగా నోటీసు బోర్డులో ప్రదర్శించలేదని చెప్పారు. ఒకే స్టేషన్లో పనిచేస్తున్న వారు, వేరే మండలాల నుంచి కూడా పనిచేస్తున్న వారు కడప యూఎల్బీలో పోస్టింగ్ తీసుకున్నారని వివరించారు. ఇందువల్ల మెరిట్ జాబితాలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కౌన్సెలింగ్ సమయంలో అన్ని సచివాలయాల పేర్లు చూపించలేదన్నారు. స్పౌజ్ కేటగిరీ కింద 14,215 ర్యాంకు వచ్చిన వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ మేరకు న్యాయమంటూ ప్రశ్నించారు. కౌన్సెలింగ్ రద్దుచేసి నిబంధనల ప్రకారం పారదర్శకంగా రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.జేసీకి మహిళా సంరక్షణ కార్యదర్శుల ఫిర్యాదు -
శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు
కడప వైఎస్ఆర్ సర్కిల్/ కడప అర్బన్ : నిరంతరం శ్రమజీవుల పక్షాన, అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన, కపటం లేని ప్రముఖ సామాజిక కార్యకర్త, సీహెచ్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పుత్తా శివారెడ్డి(65) ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటని పలువురు రాజకీయ, సామాజిక, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థల నేతలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన శివారెడ్డి భౌతికకాయానికి నగరంలోని బాలాజీ నగర్లోని ఆయన నివాసంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు చంద్ర, చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం శక్తికి మించి శివారెడ్డి పని చేశారన్నారు. సమాచారం పొందడం ప్రజల హక్కు అని రహస్యాలు లేని పరిపాలన కోసం సమాచార హక్కు చట్ట రక్షణకు కృషి చేశారన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజాతంత్ర ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యేవారన్నారు. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టేందుకు ఎన్నికల నిఘా వేదికలో సభ్యులుగా తమ వంతు పాత్ర నిర్వహించేవారన్నారు. రిమ్స్లో శివారెడ్డి మరణించిన కొద్ది సమయంలోనే వారి కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు నేత్రదానం చేశారు. శివారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం రిమ్స్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దేహ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ, హేతువాద సంఘం నాయకులు సిఆర్వీ ప్రసాద్, నాగార్జున రెడ్డి, విరసం వరలక్ష్మి, శ్రీనివాసుల రెడ్డి, ప్రజానాట్యమండలి, నాస్తిక సంఘం నేత పల్లవోలు రమణ, లోక్ సత్తా శ్రీకృష్ణ, ఆప్ నేత డాక్టర్ శ్రీనివాసులు, రాయలసీమ ఎస్సీ ,ఎస్టీ మానవ హక్కుల వేదిక నాయకులు జేవీ రమణ, రిటైర్డ్ అధికారులు గోపాల్, ఫణిరాజు తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే ఫిర్యాదులను పరిశీలించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఆమె అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపారు. ● తమ కుమారులు తమ వద్ద ఉన్న డబ్బు, బంగారం, స్థలాలు తీసుకుని తమను పోషించకుండా వదిలేశారని కడప విజయదుర్గ కాలనీకి చెందిన కుప్పం లక్ష్మినారాయణశ్రేష్టి ఫిర్యాదు చేశారు. వృద్ధులమైన తాను, తన భార్య జీవించడం కష్టంగా ఉందన్నారు. తామిచ్చిన స్థలాలు తమకు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ● వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ డీలర్లు ఇవ్వడం లేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్, కార్యదర్శి సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ● ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాలు మంజూరులో జాప్యం తగదని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ అన్నారు. దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల ద్వారా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారని, తర్వాత అర్హుల జాబితా విడుదల చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డీఆర్వో వెంకటపతి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిజిల్లాలో ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. సంతృప్తికరమైన ఆర్థిక పరిపుష్టిపై మూడు నెలలపాటు జిల్లాలో క్యాంపెయిన్ నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, బ్యాంకింగ్ రంగం ప్రచురించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో జేసీ ఆవిష్కరించారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, బ్యాంకింగ్ యాక్సెస్ విస్తరించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా నైపుణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్తోపాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
అయ్యో దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..
కురబలకోట : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన మూడు కుంటుంబాల వారు డ్రైవర్తో కలిపి 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రావెల్ టెంపోలో స్వగ్రామానికి వస్తుండగా మండలంలోని చెన్నామర్రి వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మేఘర్ష్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నరసింహారెడ్డి (49), రూప (40) ఆదర్స్ (19), రామంద్రప్ప (45), కళావతి (40), దర్సన్ (16), శివప్ప(42), సునందమ్మ (38) చైత్ర (19) తోపాటు ట్రావెల్ టెంపో ఢ్రైవర్ మంజునాధ (42) ఉన్నారు. అర్తనాదాలు, విలాపాలతో సంఘటన స్థలం శోకతప్తమైంది. విషాదంతో కర్నాటకలోని బాగేపల్లె, కొత్త ఉడుంపల్లె గొల్లు మన్నాయి. పెనుప్రమాదం సంభవించడంతో కురబలకోట, మదనపల్లె ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గాయపడిన వారిని 108 వాహనం, పోలీసు వాహనంలో తరలించారు. డ్రైవర్ మంజునాథ తీవ్రంగా గాయపడడంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. నరసింహారెడ్డి, శివప్ప కుటుంబాలకు చెందిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నాటక రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా ట్రావెలర్ టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.టాప్తో సహా లేచిపోయిందిట్రావెలర్ టెంపో జరిగిన ప్రమాదం చూస్తే గండెలు తరుక్కుపోతాయి. ట్రావెలర్ టెంపో డ్రైవర్ పక్కగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అటు వైపు ఉన్న వారు ముగ్గురు చనిపోగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ వేగంగా ఢీ కొట్టడంతో టెంపో ట్రావెలర్ వాహనం టాప్ ఏమాత్రం లేకుండా లేచిపోయింది. సీట్లలోనే తీవ్ర గాయాలతో అంగలార్చడం చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. సంఘటనఽ స్థలం రక్తసిక్తమంది. పోలీసులు సకాలంలో స్పందించారు. స్థానికులు కూడా సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక్కో కుటుంబలో ఒక్కరు..మండలంలోని చెన్నామర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందడం కలవరాన్ని కల్గిస్తోంది. బాగేపల్లె నుండి నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుటుంబాల వారు తిరుమల యాత్ర వెళ్లారు. నరసింహారెడ్డి కుటుంబంలో అతని కుమారుడు మేఘర్స్ (16), రామచంద్రప్ప కోడలు శ్రావణి (24), శివప్ప కుటుంబం నుండి చరణ్ (17) మృతి చెందారు. వీరిలో శ్రావణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. మిగిలిన వారు విద్యార్థులు.అదృష్టవంతులుప్రమాదానికి గురైన ట్రావెలర్ టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32) కూర్చున్నాడు. ఇతని వెనుక సీట్లో బాగేపల్లె దగ్గరున్న ఎ. కొత్తపల్లెకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమల గుండు చేయించుకున్నారు. వీరు డ్రైవర్కు ఎడమ పక్కన సీట్లలో ఉండడం వల్ల పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 15 మందిలో వీరిద్దరికి రక్త గాయాలు కాలేదు. అంత ప్రమాదంలో వీరు బతికి బట్టకట్టడం అధృష్టమేనని చెబుతున్నారు. -
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కైలాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులు ప్రదానం చేశారు. 8 కౌంటర్లు.. ఉదయం 6 గంటలకే ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఎంట్రెన్స్ విభాగంలో ఉన్న రాజీవ్ సర్కిల్ వద్ద ముందుగా వచ్చిన విద్యార్థులకు టోకన్లను అందజేశారు. వివిధ దశలలో స్క్రీనింగ్ చేయడానికి 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ● తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు. ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి రవికుమార్, ఫైనాన్స్ అధికారి కోటేశ్వరి, అధికారులు లింగమూర్తి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, రఫి, జ్ఞాన వెంకట్, నవీన్, పవన్ కుమార్, ఆనంద్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ● మంగళవారం రోజు మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. తొలి రోజు 481 మందికి అడ్మిషన్లు -
ప్రజాస్వామ్యానికి ‘కూటమి’ తూట్లు
పులివెందుల : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక భాకరాపురంలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను తుంగలో తొక్కి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపిందన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి.. ఎట్టి పరిస్థితులలోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పనిచేయవద్దని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. పార్టీలనేవి కేవలం ఎన్నికల వరకేనని తర్వాత ప్రజలందరూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగమేనని గట్టిగా నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఎంపీ అవినాష్రెడ్డి విమర్శించారు. సోమవారం కొంతమంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీని కలిశారు. తమను అకారణంగా తొలగిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఆ పథకంలో అవినీతికి అంతులేకుండా పోయిందని.. కూలీలతో చేయించాల్సిన పనులను మిషన్ల ద్వారా కొద్ది గంటలు మాత్రమే చేయించి బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. వ్యవస్థలను దిగజారుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవస్థలను దిగజారుస్తోందని ఎంపీ మండిపడ్డారు. ఇటీవల పులివెందులలో టీడీపీ తోరణాలు తొలగించారన్న కారణంతో మైనర్ బాలురులపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. బెయిల్పై వచ్చిన మైనర్ బాలురు, వారి కుటుంబ సభ్యులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ పిల్లలు చదువుపై దృష్టి సారించాలని, మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా మైనర్ బాలురపై అక్రమ కేసు పెట్టడం నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇలాగే అక్రమ కేసు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తోపాటు ఇతర నాయకులకు ఆయన మనో ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
బద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్సీ ఏఎన్ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్సీకి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హుటాహుటిన పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. తన భార్య పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవ డం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది మాత్రం డాక్టర్ వచ్చేలోపే వారు వెళ్లిపోయారని చెబుతున్నారు. -
వేమన పద్యం ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది
కడప ఎడ్యుకేషన్ : వేమన నిజమైన ప్రజాకవి అని, అందువల్లనే ఆయన పద్యం కులాలను దాటి, మతాలను దాటి, ప్రాంతాలను దాటి, భాషలను దాటి విస్తరించిందని తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో 144వ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సజీవ సంప్రదాయంగా వేమన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వేమన పద్యం ఏ భాషకూ లేనంత గొప్పతనాన్ని తెలుగు భాషకు కలిగించిందన్నారు. తమిళకవి తిరువళ్ళువర్తోనూ, కన్నడకవి సర్వజ్ఞునితోనూ వేమనను పోలుస్తుంటారని, సమాజంలో మంచిని పెంచి, చెడును తుంచే విషయంలో ఆ ముగ్గురికీ పోలిక ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ వీళ్లకన్నా వేమనే గొప్పవాడని అన్నారు. తెలుగువాళ్లు బతుకు పోరాటంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు వాళ్ల నోళ్లల్లో నానుతున్న వేమన పద్యాలు కూడా వాళ్లతోపాటు వెళ్లిపోయి తరాలు మారినప్పటికీ కాలానుగుణంగా వాళ్ల సంప్రదాయాల్లో కూడా నిలిచిపోయాయన్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని అంబలత్తాడియర్లు అనే ఆశ్రిత కులం వాళ్లు తమిళులైనప్పటికీ ధనుర్మాసంలో ఊరంతా తిరుగుతూ ‘వేమనానంద పదిగం’ అనే పేరుతో తెలుగులో వేమన పద్యాలను చెప్పడమే కాక, వేమనానందస్వామి తమ కులగురువని చెప్పుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు జి.శివారెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, విజయానందరెడ్డి, డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్ -
పిచ్చికుక్క స్వైర విహారం
బద్వేలు అర్బన్ : పట్టణంలో అబ్బరాతివీధిలో ఆదివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అబ్బరాతివీధికి చెందిన మోహన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా మీద పడి దాడి చేసింది. తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అలాగే పట్టణంలోని కోటవీధిలో కృతిక్ అనే బాలుడు, పప్పుల వీధిలో సన్విన్ అనే బాలిక పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి కుక్కను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బందిని పురమాయించారు. ఎట్టకేలకు అబ్బరాతివీధిలో మున్సిపల్ సిబ్బంది పిచ్చికుక్కను పట్టుకుని అంతమొందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. గుంటూరు కొట్టాలులో చోరీమైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గుంటూరు కొట్టాలు గ్రామంలో నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వసారాలో నిద్రిస్తున్నారు. ఇంటి వెనుక వైపున గోడకు కన్నం వేసిన దుండగులు ఇంటిలోకి ప్రవేశించి బీరువా పగలగొట్టారు. అందులోని 15 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి వస్తువులు, రూ.25 లక్షల నగదును దోచుకెళ్లారు. ఉదయం లేచి ఇంటిలోకి వెళ్లిన వెంకటసుబ్బారెడ్డి బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సంఘటనపై మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బాధితుని ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఇంటిలో వేలిముద్రలను సేకరించారు. అర్బన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు. డిజిటల్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, డీపీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఖాదర్బాషలు హాజరై డిజిటల్ అసిస్టెంట్ల పత్రాలను పరిశీలించారు. జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఇందులో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారు 274 మంది, రిక్వెస్ట్ బదిలీ కోసం 40మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చని తెలిపారు. ● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చున న్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు. తాము డబ్బులిచ్చిన రవి అలియాస్ రఫిని ప్రశ్నించగా తాను కూడా గుంటూరుకు చెందిన వలీ అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పాడు. దీంతో బాధితులు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు రవి అలియాస్ రఫీపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితులు ఏజెంట్ రవి ఇంటి వద్ద ఆందోళన చేస్తుండగా తాలూకా ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జమ్మలమడుగులో రవిపై కేసు నమోదైందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆందోళన విరమించాలని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఏజెంట్ రవిని వివరణ కోరగా తనకు రూ.80 లక్షలు డబ్బులు రావాలన్నారు. ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తే, తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారు పారిపోతారని తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.మోసగించిన వ్యక్తి ఇంటివద్ద బాధితుల ఆందోళన -
నిబంధనలు గాలికి..
కడప అగ్రికల్చర్: కడప కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యాన, వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండోరోజు ఉమ్మడి కడపజిల్లా సచివాలయ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు బదిలీ కౌన్సెలింగ్ కొనసాగింది. రెండోరోజు కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. కూటమి నేతలు ఇచ్చిన లెటర్లతోపాటు వారి ఫోన్లకే ప్రాధాన్యత కల్పించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే మంచి స్థానాలను కేటాయించారని చర్చించుకున్నారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి 269 మందికిగాను మొదటి రోజు 175 మందికి కౌన్సెలింగ్ను పూర్తి చేశారు. మిగతా 94 మందికి ఆదివారం నిర్వహించారు. ఇందులో కూడా స్పౌజ్, మెడికల్ కేసులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను కూడా పరిగణలోకి తీసుకోకుండా తమకు అన్యాయం చేశారని పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక డిజేబుల్ అమ్మాయిని లక్కిరెడ్డిపల్లె నుంచి రాజుపాలెం మండలానికి బదిలీ చేసినట్లు, మరో మెడికల్ గ్రౌండ్ ఉన్న అబ్బాయిని పెద్దముడియం నుంచి వీఎన్పల్లెకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మెరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని తెలిసింది. అలా ఒకరిద్దరికి కాకుండా చాలా మందికి అన్యాయం జరిగినట్లు తెలిసింది. కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిపించి వారికి వచ్చిన స్థానాలను కేటాయించారు. అయితే ఈ స్థానాలను తరువాత ఇచ్చే అర్డర్లో కనపరుస్తారా లేక అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు కట్టుబెడతారా అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బదిలీల్లో అన్యాయం జరిగిన వ్యవసాయ సహాయకులంతా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెండవ రోజు కూడా సరైన వసతులు లేక వ్యవసాయ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమన్నారాయణ, డీఏఓ కార్యాలయ ఏడీ మాధవి, ఏవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉద్యానశాఖ సహాయకులకు సంబంధించి 177 మందికి మొదటి రోజు, మిగిలిపోయిన వారికి రెండోరోజు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఉద్యాన, వ్యవసాయ సహాయలకు బదిలీలకు సంబంధించి డీఏఓ చంద్రనాయక్ డీహెచ్ఓ రవిచంద్రబాబులు మాట్లాడుతూ రెండో రోజు బదిలీల కౌన్సిలింగ్ను కూడా సిఫారస్సులకు తావు లేకుండా పారదర్శకంగానే నిర్వహించామని తెలిపారు. ● రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులును విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా గతంలో కొందరు వ్యవసాయ సహాయకులు సొంతానికి వాడుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో డబ్బులు వాడుకున్న వారికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. బకాయి డబ్బులను చెల్లిస్తేనే బదిలీకి అనుమతి ఇస్తామని, లేకుంటే లేదని ముందుస్తుగానే అధికారులు వారికి సూచించినట్లు తెలిసింది. దీంతో బకాయిలు ఉన్న కొంతమంది డబ్బులు చెల్లించగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారు మాత్రం చెల్లించలేకపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు వారితో ఒప్పందం తీసుకుని బదిలీల్లో చోటు కల్పించినట్లు సమాచారం. రెండోరోజు మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ కేసులకు అన్యాయం అధికారి పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట అన్యాయం జరిగిందని ఆందోళన -
డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు
పులివెందుల : పట్టణంలోని భాకరాపురంలో గల డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రి(దినేష్ మెడికల్ సెంటర్)లో ఆదివారం నుంచి డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన డయాలసిస్ యూనిట్ను డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇ.సి.దినేష్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుందని నాన్న (డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి) చెప్పేవారన్నారు. ఆయన కోరిక ప్రకారం ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. నాన్నగారు పులివెందుల నియోజకవర్గంలోని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రిని అప్పట్లో ఏర్పాటు చేశారన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి ప్రజలు పులివెందులకు వచ్చి వైద్య సేవలు పొందేవారన్నారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలోని వైద్య ఖర్చులకు మన ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి బావ ప్రజలకు ఎంతో వైద్య సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గంగిరెడ్డి సార్ వద్దకు వెళితే ఎలాంటి రోగమైనా నయమవుతుందని ఆయన హస్తవాసి చాలా మంచిదని ప్రజలు నమ్మేవారన్నారు. డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఇ.సి. గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఇంతకుమునుపు దూరప్రాంతాలకు వెళ్లేవారని అలా కాకుండా ఇప్పుడు పట్టణంలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డాక్టర్ హర్షవర్దన్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నప్పటికి పడకలు సరిపడక కర్నూలు, నంద్యాల వంటి దూర ప్రాంతాలకు రోగులు వెళ్లేవారన్నారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇక్కడ డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రిలోని డాక్టర్ల పాత్ర ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వాసు, డాక్టర్ గంగాదేవి, డాక్టర్ పవన్కుమార్, డాక్టర్ రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ సుకన్య, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సుప్రజ, డాక్టర్ షబానా, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి సన్నిహితులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, శశికాంత్రెడ్డి, దశరథరామిరెడ్డి, రసూల్, సర్వోత్తమరెడ్డి, హాలు గంగాధరరెడ్డి, రజనీకాంత్రెడ్డి, కోడి రమణ తదితరులు పాల్గొన్నారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తాం : డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి పాల్గొన్న వైఎస్ మనోహర్రెడ్డి, వైద్యులు, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి సన్నిహితులు -
పారదర్శకంగా మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్
కడప అర్బన్ : సాధారణ బదిలీల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి కడప జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు మొత్తం 646 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు. దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్, తదితరులను వారి సమస్యల ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని, వైద్యుల పర్యవేక్షణలో నిజ నిర్ధారణ చేసుకుని పారదర్శకంగా బదిలీలు చేపట్టామని తెలిపారు. అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పి. బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, డి.పి.ఓ ఏ.ఓ జ్యోతి, సూపరింటెండెంట్లు, శ్రీనివాస నాయక్, సురేష్, క్లర్కులు ఏ8 అగస్టీన్, ఏ10 గురప్ప, ఐ.టి.కోర్ టీమ్ కానిస్టేబుల్ విశ్వనాథ్, డి.పి.ఓ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
వచ్చేనెల 12 నుంచి జేవీవీ రాష్ట్ర మహాసభలు
కడప ఎడ్యుకేషన్: కడపలో జులై 12, 13 తేదీల్లో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. జన ఈ విషయాన్ని విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు బి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కడప ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి జేవీవీ పోరాడుతోందన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి తమ వేదిక ప్రధానంగా కృషి చేస్తోందన్నారు. జేవీవీ సమాచార కార్యదర్శి పి. సలావుల్లా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఆరోగ్యం, విద్యా కేంద్రీకృతంగా తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. కడపలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు కె. సురేష్ బాబు, సుధాకర్, ఇలియాస్బాషా,వెంకటరామిరెడ్డి, శేషారెడ్డి,భాస్కర్, నాగార్జునరెడ్డి, గౌరీ శంకర్, మహబూబ్ బాషా,వెంకటశివ,వలిరాజు,భాగ్యలక్ష్మి, ఎల్లేశ్వర రావు,హైదర్ అలీ, రమణారెడ్డి,సుబ్బారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. వీఆర్కు సీఐ నాగార్జున కడప అర్బన్: కడప నగరంలోని టూటౌన్ సీఐగా పనిచేస్తున్న బి.నాగార్జునను కడప వీఆర్కు తరలిస్తూ కర్నూలు– కడప రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులను జారీ చేశారు. సీఐపై వచ్చిన పలు రకాల ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీఆర్కు పంపినట్లు సమాచారం. ఈ మేరకు సీఐ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ వద్ద హాజరై ఉత్తర్వులను ఆందుకున్నారు. -
గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లక్కిరెడ్డిపల్లెలోని అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంగమ్మా ..కరుణించమ్మా.. సకాలంలో వర్షాలు కరుపించు తల్లీ అంటూ భక్తులు అంటూ వేడుకున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు -
● శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ రాష్ట్రాల్లో మే, జూన్ నెలల్లోనే వర్షాలు బాగా కురవడంతో కృష్ణా, తుంగభద్ర ద్వారా వరద ప్రభావం శ్రీశైలం జలాశయానికి భారీగానే వస్తోంది. శ్రీశైల జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను ఆదివారం నాటికి 869.8 అడుగులకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుత స్టోరేజీ 140.65 టీఎంసీ (65.17 శాతం)లకు చేరింది. ఫ్లడ్ కుషన్ 75.16 టీఎంసీలుగా నమోదైంది. ఇక డ్యాంలోకి 1,35,100 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గత 20 ఏళ్ల నుంచి ఇంత సానుకూల పరిస్థితి ఎన్నడూ లేదని అంటున్నారు. ప్రభుత్వం కూడా నీటిని దిగువకు విడుదల చేయకుండా నిల్వ ఉంచడం వల్ల నీటిమట్టం పెరుగుతోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే వారం లేదా పది రోజుల్లోనే డ్యాం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నీటిని కేసీ కెనాల్కు విడుదల చేయాలని ఆయకట్టు రైతాంగం కోరుతోంది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మొత్తం కేసీ కింద 2.65 లక్షల ఎకరాలు ఉంది. ఇందులో వైఎస్సార్ కడపజిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది ఆగస్టులో సాగునీరు విడుదల చేసేవారు. ఇప్పుడు ముందుగానే శ్రీశైలంలో ఎండీడీఎల్కు మించి నీటిమట్టం చేరుకుంది. కాబట్టి జులై ప్రథమార్థంలోనే నీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీటి ప్రకటన చేస్తే నారు నారుమడులు సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఖరీఫ్ ప్రారంభంలోనే పంటల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుందని, దిగుబడి బాగా ఉంటుందని రైతులు అంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, సాగునీటి సంఘాల నేతలు చెరువుల్లో మట్టిని అమ్ముకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప కేసీ నీటి విడుదల విషయం ఆలోచించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
మానవత్వం చాటుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
పులివెందుల : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె నుంచి పాల ఆటో పులివెందులకు వస్తుండగా జేఎన్టీయూ సమీపంలోకి రాగానే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆ వ్యక్తిని ఆటో ఢీకొట్టి ఆటో పల్టీ పడింది. ఈ ప్రమాదంలో కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారిపల్లెకు చెందిన షబానా, శంషాద్ అనే మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారి పల్లెకు చెందిన హనుమంత్ రెడ్డికి నడుము భాగంలో గాయం కావడంతో అతను లేవలేని స్థితిలో రోడ్డుపైనే పడిపోయాడు. ఆ సమయంలో అటువైపుగా పులివెందులకు వస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన కాన్వాయిని ఆపి కిందికి దిగి గాయాలపాలైన హనుమంత్ రెడ్డిని పరామర్శించి అప్పటికి అక్కడికి 108 వాహనం గాని చేరుకోకపోవడంతో తన సెక్యూరిటీ వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించాలని అనుచరులకు ఆదేశించారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెక్యూరిటీ వాహనంలో హుటాహుటిన గాయాలైన హనుమంత్ రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
వేంపల్లె: గ్రామీణ పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనలకు రూపమే ట్రిపుల్ ఐటీలు. వీటిని ఆర్జేయూకేటీ నిర్వహిస్తోంది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 23న రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈనెల 30 వ తేదీ, జులై 1వ తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ పక్రియ ఉంటుంది. ఈ పక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమార స్వామిగుప్తా తెలిపారు. రెండు రోజుల్లో 1,060 మందికి కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో భాగంగా రెండు రోజుల్లో ప్రత్యేక కేటగిరీ మినహా 1060మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30వ తేదీ (సోమవారం) 530 మంది అభ్యర్థులకు, జూలై 1వ తేదీన 530 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైల్స్కు సందేశాలు పంపించారు. కౌన్సెలింగ్కు అవసరమైనవి పదోతరగతి హాల్ టికెట్, పదోతరగతి మార్కుల జాబితా, 10వ తరగతి టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసు పోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అందజేయాలి. విద్యార్థులు ఎలా రావాలంటే .. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర జిల్లాల వైపు నుంచి వచ్చేవారు వేంపల్లె బస్టాండుకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రతి నిమిషానికి ఇడుపులపాయకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. వేంపల్లె నుంచి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 15 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా వేంపల్లె బస్టాండు, నాలుగు రోడ్ల కూడలిలో దిగిన తర్వాత అక్కడనుండి వీరన్నగట్టుపల్లి మీదుగా ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. విద్యాభ్యాసం గురించి ‘అన్ని సబ్జెక్టులకు ప్రతినెల పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. వేసవి సెలవులు 3 వారాలు మాత్రమే ఉంటాయి. జూలై 15వ తేదీ తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఆరు సబ్జెక్టులుంటాయి. ఆంగ్లం (రెండు పేపర్లు), గణితం (రెండు పేపర్లు), భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులుంటాయి. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో 530 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు భోజనం వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు. జూలై 15 తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. క్రమశిక్షణ..ఉత్తమ విద్యాబోధన ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. ఉదయం 7గంటలకు అల్పాహారం, అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, ఒంటిగంట వరకు భోజన విరామం, మళ్లీ ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఇవి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్ కు సమానమైన పీయూసీ కోర్సును, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ‘ట్రిపుల్ ఐటీలో చేరిన తర్వాత విద్యార్థులు మొదటి, రెండు సంవత్సరాలు (పీయూసీ) ఏడాదికి రూ.45 వేలు, తర్వాత నాలుగేళ్లు (ఇంజనీరింగ్) ఏడాదికి రూ.50వేల చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదుపోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
ఒక భూమి అమ్మితే మరో భూమి ఆక్రమించారు
కడప రూరల్ : అధికార పార్టీ నేతల అండతో భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చింతకొమ్మదిన్నె మండలం, లింగారెడ్డిపల్లెకు చెందిన బి.ఈశ్వర్రెడ్డి కోరారు. మండల పరిధిలోని బుగ్గలేటిపల్లె గ్రామ పంచాయతీలో చిత్తూరు ప్రధాన రహదారికి ఆనుకొని తనకు మొత్తం 3.70 ఎకరాల భూమి ఉందన్నారు. ఇరవై ఏళ్ల కిందట రోడ్డుకు ఆనుకొని ఉన్న తన మొత్తం భూమిలో వెనుకవైపున ఉన్న 70 సెంట్లను కడప నగరం ఐటీఐ సర్కిల్లో నివాసముంటున్న ఒక వ్యక్తికి విక్రయించానని పేర్కొన్నారు. తరువాత తాను ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లానని తెలిపారు. కాగా ఇటీవల నాలుగు నెలల క్రితం తన భూమిని పరిశీలించగా, తన నుంచి 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అక్రమంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ఫినిషింగ్ వేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆక్రమించిన వ్యక్తిని ప్రశ్నించగా ఇది తన స్ధలం, ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకోపో నువ్వు వెనక ఉన్న స్థలం తీసుకోపో అని బెదించారన్నారు. సర్వేయర్ వచ్చి కొలతలు వేసి చెప్పినా కూడా ఆక్రమించిన వ్యక్తి వినుకోవడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్కు రెఫర్ చేశారని తెలిపారు. అక్కడికి వెళితే పోలీసులు ఏ మాత్రం స్పందించలేదని వాపోయారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఆక్రమించిన వ్యక్తికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ విషయమై మరోమారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాగమునెమ్మ, ఈశ్వర్రెడ్డి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.న్యాయం కోసం బాధితుడి వేడుకోలు -
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరుకు వెళ్లే రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆటో ఢీకొని రోడ్డుపై కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులకు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చెందిన బాలాజి పాల డెయిరీ ఆటో పులివెందులకు ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా ముద్దనూరు రోడ్డు సమీపంలోని హనుమాన్ గోల్డెన్ సిటీ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి (57) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న షబానా, శంషాద్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రా కువైట్గా ప్రసిద్ధికెక్కిన రాజంపేటలో ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) కార్యాలయం ఎత్తివేశారు. దీంతో గల్ఫ్ వాసులను ఆదుకునే పరిస్ధితులు లేకుండా పోయాయి. కువైట్ దేశం వలన రాజంపేటలోని ఎస్బీఐ రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్ఆర్ఐ ఖాతాలను బట్టి రాజంపేట ఆంధ్రా కువైట్గా పేరు గడించింది. ఈ నేపథ్యంలో రాజంపేటను గుర్తించి, గల్ఫ్ దేశాలలో ఉండే వారి కోసం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో న్యూ బోయనపల్లె(కడప–రేణిగుంట జాతీయరహదారి)లో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఖాళీ చేశారు. రాయలసీమ జిల్లాల కోసం రాజంపేటలో ఏర్పాటు.. రాయలసీమ జిల్లాలలోని గల్ఫ్వాసుల కోసం రాజంపేటలోనే ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పుడు భవన యజమాని టూ లెట్ బోర్డు పెట్టేశారు. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయం ఎత్తివేసినట్లుగా గల్ఫ్వాసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు.. రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి అధికంగా ఎడారి దేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధి కోసం నాలుగు దశాబ్దాలుగా ఎడారి దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారి కోసం.. మోసానికి గురై జైలుపాలై అనేక సమస్యలలో ఇరుక్కున్నవారు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్ను బలోపేతం చేశారు. సీమలో గల్ఫ్వాసులు అధికంగా ఉన్న కారణంగా రాజంపేటలో సొసైటీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది మంది గల్ఫ్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపారు. గల్ఫ్దేశాలలో జీవించేందుకు, వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేవారు, నివసిస్తున్న వారి కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత వలసలపై వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను సొసైటీ నిర్వహించింది. సొసైటీ ద్వారా దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మందిని కో–ఆర్టినేటర్లను నియమించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఏమేమి చేసిందంటే.. ప్రవాసాంధ్రులకు సహాయనిధి, భరోసా బీమా, ఆన్లైన్ ఐటీ శిక్షణ, ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్, ఫ్రీ–డిపార్టుమెంట్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కనెక్టు టు ఆంధ్రా, పెట్టుబడులు సలహాలు, పవిత్ర నాణేలు, ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కేంద్రం, పాస్పోర్టులో సలహాలు, మరణించిన ఎన్ఆర్టీఎస్ బంధువులకు ఎక్స్గ్రేషియా, అధునాతన ఐటీ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ , అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ కంపెనీలలో నియామకాల సౌకర్యం వంటి ఉచిత సేవలను అందజేశారు. జగన్న పాలనలో గల్ఫ్ బాధితులకు భరోసా ఏపీఎన్ఆర్టీఎస్తో ఎందరికో ఆపన్నహస్తం కూటమి పాలనలో సేవలకు మంగళంఏపీఎన్ఆర్టీఎస్తో విదేశాలలో ఉన్నవారికి భరోసా ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా విదేశాలలో ఉన్నవారికి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీ ద్వారా విస్తతృంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ దిశగా అనేక మంది విదేశీ బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ముందుకు నడిచేలా జగనన్న ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ను తీర్చిదిద్దింది. చిల్లా కిరణ్, యూఎస్ఏ, వెంకటరెడ్డిపల్లె, రైల్వేకోడూరుజగనన్న పాలనలో ఏపీఎన్ఆర్టీఎస్ బలోపేతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలనలో ఏపీఎన్ఆరీటీఎస్ బలోపేతం చేశారు. అప్పటి వరకు ఇలాంటి సొసైటీ ఒకటి ఉందనేది చాలా వరకు తెలియదు. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీ ద్వారా ఎందరో గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు. కోవిడ్–19లో తనదైన రీతిలో సేవలందించారు. రాయలసీమలో గల్ఫ్ వాసుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆ దృష్ట్యా రాజంపేటలో సొసైటీ ఏర్పాటు చేశారు. –గోవిందు నాగరాజు, వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్, కువైట్ -
పంజంకు కన్నీటి వీడ్కోలు!
సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64)కి పార్టీ నేతలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయం అంత్యక్రియుల నిర్వహించా రు. అంతకుముందు అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతితో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కన్నీటి నివాళి అర్పించారు. నేతల నివాళి రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లిలో పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, కడప పార్లమెంట్ పరిశీలకులు, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, ఆర్టీసీ మాజీ రాష్ట్ర చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ తదితరులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకుని శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పంజం సుకుమార్రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సుకుమార్రెడ్డి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. పంజం సందీప్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపాన్ని తెలియజేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఘనంగా అంతిమ వీడ్కోలు తూర్పుపల్లిలోని పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర సాగింది. పార్టీ శ్రేణులు, నేతలు, గ్రామస్తులు, కుటుంబీకులు పాల్గొన్నారు. పంజం సుకుమార్రెడ్డి వ్యవసాయ పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు సుకుమార్రెడ్డి పార్థివదేహం వద్దనివాళులర్పించిన పెద్దిరెడ్డి, అంజద్బాషా తదితరులు -
రేపు కౌన్సిల్ సమావేశం
ప్రొద్దుటూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో ఈనెల 30న సోమవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, మన్సిపల్ అధికారులు పాల్గొనాలని ఆమె కోరారు.రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా జనార్దన్కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా జనార్దన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న బి.సురేంద్రారెడ్డి తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. ఎర్రగుంట్లలో పనిచేస్తున్న జనార్దన్ను కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా నియమించారు.11 నుంచి పీజీ పరీక్షలుకడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈఎడీ, ఎం.సి.ఎ రెండో సెమిస్టర్ విద్యార్థులకు జులై నెల 11 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.పక్కాగా బదిలీ ప్రక్రియకడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ జీవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శనివారం తమ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. 377 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, రాజంపేట ఈఈ రామచంద్ర నాయక్, రాయచోటి ఈఈ దయాకర్రెడ్డి, బద్వేలు ఈఈ లక్ష్మిపతిరెడ్డి పాల్గొన్నారు.కొనసాగిన కౌన్సెలింగ్కడప కార్పొరేషన్: వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ రెండో రోజు కొనసాగింది. శనివారం ఉదయం 7.30 గంటల నుంచి వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. అత్యధిక శాతం మందికి ఏ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోనే బదిలీలు చేశారు. స్సౌజ్ కేసులు, మెడికల్ సంబంధిత కేసులు, ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఒక మున్సిపాలిటీ నుంచి మరొక మున్సిపాలిటీకి కూడా బదిలీలు నిర్వహించారు.కమిషనర్ మనోజ్రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదలకడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాల యం అనుబంధం కళాశాలల డిగ్రీ హానర్స్ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాసరావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు తో కలసి విశ్వవిద్యాలయంలోని తన చాంబర్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvu exam s.in/results.aspx అనే వెబ్సైట్ను సందర్శించాలని కృష్ణారావు సూచించారు. పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు సుభోస్ చంద్ర, గణేష్ పాల్గొన్నారు. -
విద్యార్థినికి టీసీ ఇవ్వడంపై ఆందోళన
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కె.లోకేశ్వరి అనే విద్యార్థినికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపడంపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన లోకేశ్వరి గురుకుల పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుంది. 7వ తరగతిలోకి ప్రవేశించాల్సి ఉన్న ఆ విద్యార్థిని పాఠశాల పునః ప్రారంభమై నెల రోజులు దాటినా పాఠశాలకు రాలేదు. శుక్రవారం లోకేశ్వరి పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ వి.నిర్మల టీసీ ఇచ్చి ఇంటికి పంపారు. ఆ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు వసంత, వీరయ్య పాఠశాల వద్దకు చేరుకుని తమ కుమార్తెను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని ప్రిన్సిపాల్ను కోరగా ఆమె ససేమిరా అన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో శనివారం పాఠశాల వద్దకు వెళ్లిన విలేకరులు లోకేశ్వరి విషయంపై ప్రిన్సిపాల్ను వివరణ కోరారు. లోకేశ్వరి సక్రమంగా చదవడం లేదని, పాఠ్యపుస్తకాలను చించడం, యూనిఫాం వేసుకోకుండా క్లాసులకు రావడం చేస్తూ ఉండేదని ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. తోటి విద్యార్థినులను కొట్టేదన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థినులు చాలా సార్లు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థిని విషయంపై కమిటీలో చర్చించి టీసీ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా గురుకుల పాఠశాల సంఘటనపై డీఈఓ ఆదేశాలతో శనివారం సాయంత్రం మైదుకూరు మండల విద్యాశాఖాధికారి పద్మలత పాఠశాలకు చేరుకుని విచారించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. ఆ మేరకు డీఈఓకు నివేదిక పంపుతామని ఎంఈఓ తెలిపారు. -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక లక్ష్మీహాలు సమీపంలో నివాసముంటున్న రాజకుళ్లాయమ్మ అనే మహిళ ఈనెల 18న కడప రిమ్స్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం రాజకుళ్లాయమ్మ కడప రిమ్స్ నుంచి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పసికందును రాజకుళ్లాయమ్మ స్నేహితురాలు కుమారి అపహరించి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు కుమారి తమ బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో పులివెందుల పోలీసులు ఆమెను అరెస్టు చేసి పులివెందుల స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ రాజకుళ్లాయమ్మ, కుమారి ఇద్దరూ పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. కుమారి శుక్రవారం రాజకుళ్లాయమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందును అపహరించి తీసుకెళ్లిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే పసికందును కిడ్నాప్ చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.పసికందును అపహరించిన మహిళ అరెస్టు -
రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం
కడప సెవెన్రోడ్స్ : జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉద్యాన పంటలు, వృక్షాలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణలో ఉద్యాన పంటలు, చెట్లు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అంచనా ప్రక్రియపై శనివారం కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి సంబంధిత అధికారులు, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షకు ఎస్డీసీ, ఎన్హెచ్ పీడీ వెంకటపతి, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్నయ్య సంబంధిత రీజియన్ల ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ పీడీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బెంగళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేపడుతున్నామన్నారు. అందుకు సంబంధించి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ శాఖకు చెందిన పలు భూములను కొను గోలు చేసి భూములు కోల్పోయినవారికి పరిహా రం కూడా ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో జమ్మలమడుగు, వి.ఎన్. పల్లె మండలాల్లో ఉద్యాన పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా.. భూసేకరణ చట్టంలోని సంబంధిత ప్రామాణికాలను పక్కాగా పాటిస్తూ.. పరిహారం అంచనాలను నివేదించాలన్నారు. చెట్ల వయస్సు, చెట్ల పెంపకానికి ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇతర నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు రైతులు వెచ్చించిన వ్యయం తదితర అంశాలను ఉద్యాన వన శాఖ అధికారులు కచ్చితంగా, పారదర్శకంగా వ్యాల్యూయేషన్ చేయాలన్నారు. ఇం పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్, ఆర్–బి నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్హెచ్ ప్రాజెక్టుల ప్రతినిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతం చేయాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగే అడ్మిషన్ల ప్రక్రియను ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్యోగులు విజయవంతం చేయాలని ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా కోరారు. శనివారం మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ అడ్మిషన్ల ప్రక్రియపై ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని సెంట్రల్ లైబ్రరీలో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఈనెల 30, జూలై 1న రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్లకు ఎంపికై న విద్యార్థులకు ఇప్పటికే కాల్ లెటర్లు కూడా పంపామన్నారు. కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్లు జిరాక్స్ పత్రాలను, విద్యార్థి ఫొటోతోపాటు తల్లిదండ్రుల, సంరక్షకుల ఫొటోలను కూడా వెంట తీసుకుని రావాలన్నారు. సమావేశంలో అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, అసోసియేట్ డీన్స్, సెక్యూరిటీ అధికారులు, పీఆర్ఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నా కుమారుడు మఠాధిపతిగా అర్హుడు
బ్రహ్మంగారిమఠం: పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి తన పెద్ద కుమారుడు గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని పూర్వపు మఠాధిపతి ద్వితీయ భార్య మారుతీ మహాలక్షుమ్మ తెలిపారు. శనివారం బి.మఠంలో మహా నివేదిన మందిరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారులు నలుగురిలో ఏ ఒక్కరూ మఠం ఆచారాలు పాటించలేదని అందుకు వారికి అర్హత లేదనేది పూర్వపు మఠాధిపతి వాదన అన్నారు. తన పెద్దకుమారుడు గోవిందస్వామి మఠం ఆచారాలపై ఎక్కువ మక్కువగా ఉండడంతో 2018లో పూర్వపు మఠాధిపతి వీలునామా రాశారన్నారు. తన తరువాత మఠాధిపతిగా తన రెండవ భార్య మొదటి సంతానం గోవిందస్వామి నియామకం జరగాలనేది పూర్వపు మఠాధిపతి ఆదేశం అన్నారు. వీలునామా ప్రకారం మఠాధిపతి నియామకం జరగాలని తాను కోరుతున్న సమయంలో పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య కుమారులు అడ్డుతగలడంతో కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కోర్టు కూడా మఠాధిపతిని నిర్ణయించే బాధ్యత ధార్మిక పరిషత్కు అప్పజెప్పిందన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా తమకు న్యాయం జరగక పోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె వివరించారు.విలేకరుల సమావేశంలో మారుతీ మహాలక్షుమ్మ -
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో భాగంగా శనివారం మూడో రోజు కడప –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 97 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 134 బంతుల్లో 100 పరుగుల సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. సాయి గణేష్ 72 పరుగులు చేశాడు. కడప జట్టులోని శివశంకర్ 3 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో 765 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన నెల్లూరు–అనంతపురం మ్యాచ్లో ఆనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం మూడో రోజు 173 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 211 బంతుల్లో 135 పరుగులు, షాహుల్ హమీద్ 89 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 24.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి 37 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని షాహుల్ హమీద్ 2 వికెట్లు తీశాడు.కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం -
స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన
జమ్మలమడుగు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూ కేటాయింపులు చేసిన ప్రాంతంలోనే స్టీల్ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ కంపెనీ ముందుకొచ్చింది. ఇటీవల కడప లో జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో స్టీల్ప్లాంట్ పనులను జిందాల్ కంపెనీ యాజమాన్యం మొదటి విడత పనులు రూ.4500 కోట్లతో చేపడుతుందని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం కడపకు చెందిన ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిందాల్ ప్రతినిధులు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద స్టీల్ప్లాంట్కు కేటాయించిన భూముల వివరాలను మ్యాప్ల ద్వార పరిశీలించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజులు ఇక్కడే ఉండి పరిశీలిస్తారని.. సోమ వారం నుంచి కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే అవకాశం ఉన్న ట్లు అధికారులు వివరించారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ పనులకు మోక్షం రాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సర్వేయర్ హరి ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో రెగ్యులర్గా పనులు ప్రారంభించే అవకాశం భూములు పరిశీలించినజిందాల్ ప్రతినిధులు -
●కనీస వసతులు కరువు
కడప అగ్రికల్చర్: బదిలీల్లో నేతల సిఫారస్సులకే పెద్ద పీట వేస్తున్నారా..? పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నాయా? లెటర్ల పేరిట పచ్చ నేతలు దందా సాగిస్తున్నారా?... అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకుల కౌన్సెలింగ్ కేంద్రానికి ‘దేశం’ నేతల రాక దీనికి మరింత బలం చేకూరిస్తోంది. వెరసి కూటమి హయాంలో బదిలీలంటనే ఉద్యోగులు హడలెత్తిపోతున్న పరి స్థితి నెలకొంది. వివరాలల్లోకి వెళితే.. గ్రామ సచి వాలయాల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు శనివారం కలెక్టరేట్లోని ఉద్యాన, వ్యవసాయశాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఈ ప్రక్రియలో అధికార ఎమ్మెల్యేల సిఫారస్సు లేఖలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తమకు అనుకూల స్థానాలకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి లెటర్లతోఫాటు ఫోన్లలో కూడా సిఫారస్సు చేసినట్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చర్చ సాగింది. అధికారులు వాటికే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందుకు బలం చేకూరుస్తూ కడప నగరానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు హరిప్రసాద్ కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి అధికారులతో మాట్లాడి తనకు అనుకూలమైన వారికి వారు కోరుకున్న స్థానాలను ఇప్పించినట్లు చర్చసాగింది. ఉద్యోగుల్లో అసంతృప్తి ఈ బదిలీల్లో స్పౌజ్కు అసలు ప్రాధాన్యత కల్పించలేదని వ్యవసాయ, ఉద్యోగశాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లగా దూర ప్రాంతంలో పని చేసి ఇప్పుడు ‘స్పౌజ్’ కేటగిరీలో ఉన్నా మళ్లీ దూరప్రాంతాలకే వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంతమంది వికలాంగులకు కూడా అన్యాయం జరిగినట్లు తెలిసింది. అసలు మెడికల్ గ్రౌండ్స్ పరిగణలో లోకి తీసుకోలేదని పలువురు వాపోయారు. ఈ బదిలీల్లో ఎలాంటి నిబంధనలను పాటించకుండా కౌన్సెలింగ్ను నిర్వహించారని పలువురు ఉద్యాన, వ్యవసాయ సహాయకులు వాపోయారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి... జిల్లావ్యాప్తంగా పలు రైతు సేవా కేంద్రాలలో పనిచేసే 264 మంది వ్యవసాయ సహాయకులు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఈ బదిలీలకు అర్హత సాధించారు. ఇందులో తొలి రోజు 175 మందికి కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఇందులో సీనియా రిటీ ప్రకారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ర్యాంకులు కేటాయించారు. అ ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్కు పిలిపించి స్థానాలను కేటాయించారు. ఈ బదిలీల్లో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఎమ్మెల్యేల లెటర్స్కే ప్రాధాన్యత కల్పించారని పలువురు వ్యవసాయ సహాయకులు తెలిపారు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్తో మాట్లాడుతూ ఈ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని ఎలాంటి రెకమండేషన్లను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఏడీఏ మాధవి, అన్నమయ్య జిల్లా ఏడీ మజీద్ ఆహ్మద్, సూపరెండెంటెంట్ విజయశ్రీ, ఏవో శ్రీహరి పాల్గొన్నారు. ద్యాన సహాయకులకు సంబంధింది... ఉద్యాన సహాయకులకు సంబంధించి కూడా 177 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని బదిలీలకు అర్హత సాధించారు. వీరికి సంబంధించిన బదిలీలలో కూడా పలు ఆరోపణలు వినిపించాయి. ఈ బదిలీ కౌన్సిలింగ్ గురించి జిల్లా ఉద్యానశాఖ అదికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ బదిలీలను చాలా పారదర్శకంగా నిర్వహించామన్నారు. అన్నమయ్య డీహెచ్ఓ సుబాషిణి, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సెలింగ్ కేంద్రంలో ‘దేశం’ నేతలు వ్యవసాయశాఖ బదిలీల్లో సిఫారస్సులకే పెద్ద పీట! స్పౌజ్ కేసులకు, మెడికల్ గ్రౌండ్స్కు ప్రాధాన్యత కరువు కౌన్సెలింగ్ కోసం వచ్చిన వ్యవసాయ, ఉద్యోగ సహాయకులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలను కల్పించలేదు. కూర్చొనేందుకు కుర్చీలు లేక కొంత మంది నేలపై, , కార్యాలయ వసారాలలో కూర్చొని ఊసూరుమన్నారు. మరి కొంతమంది చిన్న బిడ్డల తల్లులు తమ పిల్లలకు పాలు తాపించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని ఉద్యోగులు వాపోయారు. -
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కడప అర్బన్ : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్లు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
ఖైదీల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం
కడప అర్బన్ : ఖైదీలు తమ ఆరోగ్యంలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడప నగర శివార్లలోని కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాన్ని ఆమె జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాన్నారు. కారాగారం పరిసరాలను, వంటగదులను, వసతి గదులను, టాయిలెట్లను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఇన్చార్జి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ రాజేశ్వర్ రావు, ప్రత్యేక మహిళా కారాగారం సూపరింటెండెంట్ కృష్ణవేణి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి
కడప సెవెన్రోడ్స్ : తమపై విపరీతంగా మోపిన పనిభారాన్ని తక్షణమే తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ పంచాయతీరాజ్శాఖకు విధించడం ఏమిటంటూ నిలదీశారు. పెరిగిన పనిభారాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కడప అంబేడ్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పంచాయతీ కార్యదర్శులు తరలివచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అన్వర్బాషా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తాము విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి పారిశుద్ధ్య పనులు మొదలుకొని గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు, గూగుల్ మీటింగ్లు, వాట్సాప్ మెసేజ్లు, స్ప్రెడ్ షీట్, వివిధ యాప్స్లో ఫొటోలు, వీడియోలు అప్డేట్ చేయడం, ఇందుకోసం ప్రజల మొబైల్ ఫోన్ల నుంచి ఓటీపీలు సేకరించడం తదితర పనులు అప్పగిస్తున్నారని తెలిపారు. సత్వరమే ఐవీఆర్ఎస్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ అంబాసిడర్లు, క్లాప్ మిత్రలను పంచాయతీలకే అప్పగించి పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కేవలం రూ. 6 వేలు మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తుండడంతో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఈ గౌరవ వేతనాలను గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. చెక్పవర్ సర్పంచ్కు ఉన్నప్పటికీ వారి గౌరవ వేతనాలు చెల్లించడానికి పంచాయతీ కార్యదర్శులను ఒత్తిడికి గురిచేయడం తగదన్నారు. తమను గ్రామ పంచాయతీ విధుల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య నాయకుడు సాయిప్రతాప్రెడ్డి, సునీల్, లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు, మానవ వనరులను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల మూల వేతనం సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు జి.భాస్కర్, సీఎం గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి ఐవీఆర్ఎస్ రద్దు చేయాలి సచివాలయ విధులు మాకొద్దు ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా -
దేవుని కడప ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తిరుమల–తిరుపతి దేవస్థానం జేఈఓ వల్లూరు వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దేవుని కడప ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గర్భాలయం, పోటుగదిలో వర్షపు నీరు లీకేజీలు లేకుండా చూడాలన్నారు. పుష్కరిణి వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి, విద్యుత్శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓలు నటేష్బాబు, ప్రశాంతి, ఈఈలు నాగరాజు, సుమతి, ఆలయ అర్చకులు, ఆలయ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం -
మీరు నాకు వద్దు.. ఆమెతోనే కలిసి ఉంటా..!
జమ్మలమడుగు: ‘నా భర్త జైపాల్ రెడ్డి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నా బంగారు నగల్ని, ఆస్తులన్నింటినీ ఆమెకు ఇచ్చాడని.. నన్ను, నా ముగ్గురు ఆడపిల్లల్ని రోడ్డున పడేశాడు. మాకు న్యాయం చేయండి’ అంటూ బాధితురాలు స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో తన కుమార్తెలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘16 సంవత్సరాల క్రితం జైపాల్రెడ్డితో నాకు వివాహం జరిగింది. మాకు ముగ్గురు కుమార్తెలు. గీత, పావని, ప్రసన్న. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో జీవనం ప్రశాంతంగా సాగింది. అయితే ఇటీవల కొంత కాలం నుంచి మరో మహిళతో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకని తమని పట్టించుకోవడం మానేశాడు. ఇంటికి కూడా రావడంలేదు. విషయం తెలియడంతో నా భర్తను నిలదీశానని.. ఇలా పిల్లల్నివదిలిపోతే ఎలా అంటూ ప్రశ్నించాను. అయితే మీరు నాకు అవసరం లేదని.. నేను ఉంచుకున్న దాంతోనే ఉంటానని చెప్పి వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలతో ఏం చేయాలో నాకు దిక్కుతోచడం లేదు. పిల్లల పోషణ భారం అవుతోంది. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉంది. నా భర్త తమ కుటుంబాన్ని పోషించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.. న్యాయం చేయండి.. లేకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య ఒక్కటే శరణ్యం’ అంటూ స్వర్ణలత కన్నీటి పర్యంతైమంది. ఈ మేరకు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
పేదలకు పౌష్టికాహారం అందించేందుకు కృషి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల పౌష్టికాహారం మెరుగు పరిచేందుకు ఐఎస్బీ, బిల్గేట్స్ ఫౌండేషన్స్ బాసటగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఎనాక్ట్స్ ప్రాజెక్ట్, ఎనేబుల్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ కన్వర్జేన్స్ త్రు టెక్నికల్ సపోర్ట్లో భాగంగా భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) భాగస్వామ్యంతో జిల్లాలో పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో గురువారం ఆన్లైన్ జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఐఎస్బీ వారి ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని పౌష్టికాహార లోపంతో ఉన్న మహిళలు, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు ఎనాక్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ఆకాంక్షిత జిల్లాలో భాగంగా మొదటగా చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాలలో అమలు చేసి తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పోషక అంశాలపై భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో జిల్లాలో అధ్యయనం చేయనున్నారని తెలిపారు. పౌష్టికాహార, ప్రోటీన్ ఆహార పదార్థాలను కొనలేని స్థితిలో చాలా మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో పౌష్టికాహారం బహుళ రంగ మార్కెట్ల ద్వారా అందించడానికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాసటగా ఐఎస్బీ, బిల్గేట్స్ ఫౌండేషన్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పరుగుల సునామీ సృషించిన కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో రెండవ రోజు కడప జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 401 ఓవర్నైట్ స్కోర్తో శుక్రవారం రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 175.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 765 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆర్. ప్రణీల్రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 477 బంతుల్లో 39 ఫోర్లతో 353 భారీ పరుగులు చేశాడు. టి.సుదర్శన్ 161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు, ఎన్. విష్ణు సాయి 68 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 7 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 194 ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 77 ఓవర్లలో 524 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎ. జయంత్ కృష్ణ 37 ఫోర్లు, 3 సిక్సర్లతో 221 అత్యధిక పరుగులు చేశాడు. కెహెచ్ వీరారెడ్డి 175 బంతుల్లో 157 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ 4 వికెట్లు, లోకేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 72 పరుగులు చేశాడు. 353 పరుగులు చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్రెడ్డి 765 భారీ స్కోరు చేసిన కడప జట్టు -
నకిలీ విలేకరిపై ఎస్పీకి ఫిర్యాదు
కడప అర్బన్ : సింహాద్రిపురం, బ్రహ్మంగారిమఠం, రాజంపేట, గువ్వలచెరువు ప్రాంతాలలో టీవీ9 విలేకరి అంటూ బెదిరింపులకు దిగుతున్న పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన ఓబులేష్ యాదవ్పై ఆ ఛానెల్ సిబ్బంది శుక్రవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్కు ఫిర్యాదు చేశారు. టీవీ9 పేరు చెప్పుకొని ఇతను చేసే వ్యవహారాలన్నీ ఉమ్మడి కడప జిల్లా సీనియర్ కరస్పాండెంట్ సుధీర్ కు సమాచారం అందడంతో ఈ విషయాన్ని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్పీ బ్రహ్మంగారిమఠం పిఎస్ లో అతనిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఓబులేష్ యాదవ్ అనే వ్యక్తి పై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో టీవీ9 కడప జిల్లా సిబ్బంది సురేష్ బాబు (ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు) సురేష్ (జిల్లా కార్యవర్గ సభ్యుడు), సుబ్బారెడ్డి, కార్తీక్లు వున్నారు.ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు రామసముద్రం : రామసముద్రం మండలం దాసర్లపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామసముద్రం బోయ వీధికి చెందిన అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం రామసముద్రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గండి ఆలయ అధికారిపై విచారణ
చక్రాయపేట : ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యపై శుక్రవారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ) పట్టెం గురుప్రసాద్ విచారణ నిర్వహించారు. వెంకట సుబ్బయ్యపై ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేసినందున కమిషనర్ ఆదేశాల మేరకు తాను విచారణకు వచ్చినట్లు డీసీ తెలిపారు. విచారణ సందర్భంగా డిప్యూటీ కమిషనర్.. చైర్మన్, పాలక మండలి సభ్యులను, ఆలయ అధికారిని వేరు వేరుగా విచారించారు. తొలుత చైర్మన్ పాలకమండలికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఇంత వరకు ఎలాంటి పాలకమండలి సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు. పాలక మండలి తీర్మాణాలు లేకుండా ఆయన వెంకటస్వామి అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని ఇష్టారాజ్యంగా నిధులను డ్రా చేస్తూ ఖర్చు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా చైర్మన్కు, పాలక మండలికి ఆహ్వానం లేదని వెంకటస్వామి అనే వ్యక్తిచే జెండా ఆవిష్కరించారని ఫొటో చూపించి ఫిర్యాదు చేశారు. ఈనెల 26న జరిగిన షాపింగ్ గదులు, టోల్ గేట్ల టెండర్లలో ఏ అధికారం ఉందని వెంకటస్వామిని డయాస్పై తన పక్కనే ఏసీ ఎలా కూర్చోబెట్టుకుంటారని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వం మారింది కదా.. మీరు ఇంకా పదవుల్లో ఎందుకున్నారు. రాజీనామా చేసి వెళ్లి పోండి అంటూ పాలక మండలి సభ్యులను హేళన చేస్తూ మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ మాస ఉత్సవాలకు టెండర్లు పిలవకనే.. నిరుడు గండిలో జరిగిన శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రు.కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు. పాలక మండలి తీర్మాణం లేకుండా, ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా టెండర్లు నిర్వహించకనే చలువ పందిళ్లు, క్యూలైన్లు, డెకరేషన్లు తదితరాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. వాటి జమా ఖర్చులు పాలక మండలి అడిగితే మీకెందుకు ఇవ్వాలి అంటూ అవమానాలకు గురి చేస్తున్నాడని వారు డీసీకి ఫిర్యాదు చేశారు. నిరాహార దీక్ష చేస్తా.. గండి వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం శ్రావణ మాసం మొదటి వారం నాటికి భక్తులకు కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానని చక్రాయపేట జడ్పీటీసీ సభ్యడు శివప్రసాదరెడ్డి డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్కు స్పష్టం చేశారు. ఆలయ అధికారి వెంకట సుబ్బయ్య నిర్లక్ష్యం కారణంగానే ఆలయం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అనంతరం ఆయన ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యను కూడా పాలక మండలి చేసిన ఆరోపణలపై విచారించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చక్రపాణిరెడ్డి, మధు, బిందు సాగర్, జయమ్మ, మునీశ్వరి, సుగుణమ్మ, వెంకటరామిరెడ్డి, కుమారి, కళావతి, మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తా .. గండి ఆలయ అధికారి వెంకటసుబ్బయ్యపై విచారణ చేసిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని కర్నూలు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విని రాత పూర్వకంగా తీసుకున్నానని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. అక్రమాలను డీసీకి వివరించిన చైర్మన్, పాలకమండలి శ్రావణమాసంలో మూలవిరాట్ దర్శనం కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానన్న జడ్పీటీసీ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానన్న డిప్యూటీ కమిషనర్ -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు
కడప సెవెన్రోడ్స్ : బద్వేలు నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆరోపించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులను ఉసిగొల్పి వలంటీర్ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో విచారించి న్యాయం చేయాలంటూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రాన్ని సమర్పించారు. ● ఈ సందర్భంగా డీసీ గోవిందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు నమోదు, ఇల్లు కూల్చివేత లాంటి సంఘటలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు. ఒక దళిత కౌన్సిలర్ బంకును ఇటీవల కూల్చివేశారన్నారు. బద్వేలు–కడప రహదారిలో చెరువు బఫర్జోన్లో నిర్మించుకున్న శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారన్నారు. అధికారులు చెబుతున్న విధంగా ఆ ఇల్లు చెరువు పోరంబోకులో నిర్మించుకుని ఉంటే డీ–మార్కేషన్ చేసి, నోటీసులు జారీ చేసిన అనంతరమే తొలగించాలన్నారు. చట్టబద్దంగా వ్యవహరించకుండా అధికారులు రాత్రివేళ వచ్చి శ్రీకాంత్రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్, ఏసీ, ఫ్రిజ్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఇటీవల తమ పార్టీ పిలుపు మేరకు కడపలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో యువతను శ్రీకాంత్రెడ్డి తరలించారన్న కక్షతోనే అధికార పార్టీ నేతలు ఇలాంటి అరాచకాలకు దిగారని విమర్శించారు. చెరువు పోరంబోకు స్థలంలో చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారని, తొలుత వారి ఇళ్లు తొలగించకుండా వైఎస్సార్ సీపీ నాయకుని ఇంటిని తొలగించే యత్నం ఎందుకు చేశారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే బద్వేలు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లోని భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సుమారు 300 మంది బద్వేలు చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్వగ్రామమైన చెన్నకేశంపల్లెలో వైఎస్సార్ సీపీ గణనీయంగా ఓట్లు నమోదయ్యాయన్నారు. దీంతో ఆయకట్టు బంజరు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు నోటీసులు జారీ చేయించడం అన్యాయమన్నారు. టీడీపీ అరాచకాలు ఎదుర్కొంటాం – ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పాల్పడుతున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. చెరువులో నిర్మించుకున్న ఇళ్లను తొలగించకుండా శ్రీకాంత్రెడ్డి ఇంటిని తొలగించేందుకు అధికారులు రావడం తగదన్నారు. కనీసం సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇంటిని తొలగిస్తామనడం దారుణమని విమర్శించారు. శ్రీకాంత్రెడ్డి వైఎస్సార్సీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారన్న కక్షతోనే ఇంటి కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు టీడీపీ వాళ్ల ఇళ్లు కూల్చడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడలేదన్నారు. బి.కోడూరు మండలంలో తమ పార్టీ సానుభూతి పరులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ● బాధితుడు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తాను ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. ఆ స్థలం సుమారు 70 సంవత్సరాలుగా తమ కుటుంబ ఆధీనంలో ఉందని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు శుక్రవారం తెల్లవారుజామున కూడా వచ్చారని తెలిపారు. ప్రజలు అఽధికారం ఇచ్చింది కక్ష సాధింపులు తీర్చుకోవడానికి కాదని, సుపరిపాలన అందించేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. ● ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్కుమార్, సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య, ఎస్సీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్రెడ్డి ఇల్లు కూల్చేయత్నం డీ–మార్కేషన్, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారుల వీరంగం ఫర్నీచర్, ఇతర సామాగ్రి ధ్వంసం బద్వేలులో పరాకాష్ఠకు అధికార పక్షం అరాచకాలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ -
త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు
బద్వేలు: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ సాధారణ బదిలీలు జరిగినప్పుడల్లా.. భాషా పండితులకు స్థానచలనం కలుగుతోంది. రెండేళ్లకోసారి జరిగే బదిలీల్లో భాషా పండితులే సమిధలవుతున్నారు. ఏదో ఒక చోట నాలుగైదేళ్లు కూడా ఉంచడం లేదు. కనీసం సమీప ప్రాంతాలకు కూడా బదిలీ చేయడం లేదు. మహిళలను కూడా అడవి ప్రాంతాలు, రవాణా సౌకర్యం సరిగా లేని గ్రామాలకు బదిలీ చేస్తుండటంతో.. వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మండలం (వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం) నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దులోని (అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం) మారుమూల గ్రామానికి (దాదాపు 190 కిలోమీటర్ల దూరం) రవాణా సౌకర్యం బొత్తిగా లేని గ్రామానికి బదిలీ చేశారు. అలాగే అదే కలసపాడు మండలానికి చెందిన మరో ఉపాధ్యాయుడిని నెల్లూరు సరిహద్దు మండలమైన చిట్వేలి (160 కిలో మీటర్ల దూరం)కి బదిలీ చేశారు. పులివెందుల దగ్గర పని చేస్తున్న ఉపాధ్యాయుడిని (107 కిలోమీటర్ల దూరం) సంబేపల్లె మండలానికి బదిలీ చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు మండలానికి చెందిన మహిళా ఉపాధ్యాయురాలిని 123 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెనగలూరు మండలానికి బదిలీ చేశారు. పోరుమామిళ్ల మండల మహిళా ఉపాధ్యాయురాలిని 153 కిలో మీటర్ల దూరంలో నెల్లూరు సరిహద్దున ఉన్న చిట్వేలి మండలం పోలుపల్లికి బదిలీ చేశారు. ఇలా వందల కిలో మీటర్ల దూరానికి అధిక సంఖ్యలో మహిళలను బదిలీ చేయడంతో.. వారి బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. జీవో 77 తెచ్చిన తంటా 2008, 2012లలో మెగా డీఎస్సీ ద్వారా తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, సంస్కృతం భాషల ద్వారా ఎంపికై న భాషోపాధ్యాయుల్లో ఎక్కువ మందికి గ్రేడ్–1 పండిట్లుగా పదోన్నతి లభించింది. 2019లో ప్రభుత్వం జీవో ఎంఎస్: 91 ద్వారా భాషోపాధ్యాయులందరికీ గ్రేడ్ 1 ఉన్నతీకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు(ఎస్జీటీ)తమకు భాషో పాధ్యాయుల కేడర్ కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమీ లేక అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్ 77 ద్వారా గ్రేడ్ 2 కేడర్ను రద్దు చేసింది. ఫలితంగా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 113 మంది డీఈవో పూల్లోకి వెళ్లారు. అందులో 68 మంది తెలుగు భాషా పండితులు మిగిలిపోయారు. కేడర్ రద్దు చేసినప్పుడు ఆ పోస్టుల్లో ఉన్న వారందరికీ పదోన్నతి కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో గడిచిన ఆరేళ్లలో నాలుగు సార్లు బదిలీలకు గురయ్యారు. నిబంధనల మేరకు ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయిన పాఠశాలలో ఎనిమిదేళ్లు పని చేయవచ్చు. దానికి భిన్నంగా పండిట్లను ఎప్పుడు పడితే అప్పుడు బదిలీ చేయడం పరిపాటిగా మారింది. భాషోపాధ్యాయుల పోస్టులన్నీ మాయం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగు, ఉర్దూ, సంస్కృతం, కన్నడ, తమిళం తదితర భాషా పండితులు 113 మంది ఉన్నారు. అందులో తెలుగు పండితులు 68 మంది ఉండగా, తెలుగు పండిట్ పోస్టుల ఖాళీలు 79 చూపించారు. అందులో వైఎస్సార్ కడప జిల్లాలో 11 ఖాళీలు చూపించి.. మొత్తం ఖాళీలన్నీ (68 ఖాళీలు) అన్నమయ్య జిల్లాలో చూపించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాల్లో 11 ఖాళీలు మాత్రమే చూపించి.. అన్నమయ్య జిల్లాలో 4 మండలాల్లో (చిట్వేలి, ఓబులవారిపల్లె, గాలి వీడు, పెనగలూరు) 39 ఖాళీలు చూపించారు. మరో 4 మండలాల్లో (టి.సుండుపల్లె, వీరబల్లి, సంబేపల్లి, రైల్వేకోడూరు) మండలాల్లో 21 ఖాళీలు చూపించారు. ఇవ్వన్నీ కూడా వైఎస్సార్ కడప జిల్లా నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం పైమాటే. ఇలా అన్నమయ్య జిల్లాలో ఖాళీలన్నింటిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దాదాపు 50 మంది భాషా పండితులతో భర్తీ చేశారు. మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో భాషా పండితుల ఖాళీలు ఏమైనట్లో విద్యాశాఖాధికారులు చెప్పాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలిపోయిన పోస్టులు ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎక్కువ శాతం మంది పట్టణాలు, మండల కేంద్రాలు కోరుకోవడంతో.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు.. విద్యార్థులు రాక మూతపడే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులూ అమలు కాని వైనం వైఎస్సార్ కడప జిల్లాలోని 113 మందితో సహా రాష్ట్రంలోని 1199 మంది భాషా పండితులు హైకోర్టును ఆశ్రయించారు. భాషా పండితుల బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ గౌరవ జస్టిస్ మన్మధరావు 2024 డిసెంబర్ 20న భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా 2019 నుంచి భాషాపండితులకు ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులో పదోన్నతులు కల్పించాలని కూడా ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఆరు నెలలు కావస్తున్నా.. కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ ఖాళీలు లేవని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రభుత్వం తాత్సారం చేయడంతో తమకు కూడా భాషోపాధ్యాయులుగా పదోన్నతులు కావాలని సెకండ్ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తమకు న్యాయం చేయాలని భాషాపండితులు మరల కోర్టుకు విన్నవించుకోగా.. జూలై 15వ తేదీకి కేసు వాయిదా ఇచ్చినట్లు సమాచారం. గ్రేడ్ 2 కేడర్ రద్దుతో ఇబ్బందులు డీఈవో పూల్లో కొనసాగుతున్న వైనం ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ సెలవుల వైపు.. చూపు రెండేళ్లకోసారి డీఈవో పూల్ ఉపాధ్యాయులు బదిలీకి బలి అవుతున్నారు. దీంతో పిల్లల చదువులు సక్రమంగా ముందుకు సాగడం లేదు. సంసారం మొత్తం అక్కడికి మార్చడం కుదరక.. తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ హక్కుగా ఉన్న వివిధ రకాల సెలవులపై దృష్టి పెట్టారు. ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో తెలుగు భాషా పండితుల కొరత ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని సమాచారం. న్యాయం జరుగుతుంది జిల్లాలో డీఈవో పూల్లో ఉన్న భాషా పండితులకు న్యాయం జరుగుతుంది. విద్యా శాఖ కమిషనర్ కూడా వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్జీటీ ఉపాధ్యాయ ఖాళీలు 700 వరకు ఉన్నాయి. అందులో నూతనంగా జరిగిన డీఎస్సీకి 217 ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్ట ప్రకారం నడుచుకుంటాం. – షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి, కడప -
పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి (64) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. అనారోగ్యంతో చైన్నెలో శుక్రవారం పంజం సుకుమార్రెడ్డి మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు అనంతరాజుపేటలో పంజం మృతదేహాన్ని సందర్శించారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పంజం సుకుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్గా, డీఆర్యూసీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అనంతరాజుపేట సర్పంచ్గా, ప్రైవేట్స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పలు పదవులు చేపట్టారు. తనదైన శైలిలో వాటికి వన్నె తెచ్చారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ప్రముఖుల నివాళి పంజం సుకుమార్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనుంజయరెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, భూమన అభినయ్రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, వత్తలూరు సాయికిశోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి తదితర నాయకులు పంజం స్వగ్రామానికి చేరుకున్నారు. సుకుమార్రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముస్తాక్, సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, రామనాథంలు పంజం సుకుమార్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు: వైఎస్సార్సీపీ నాయకులు పంజంసుకుమార్రెడ్డి భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం అనంతరాజుపేటకు రానున్నారు. పంజం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటీ పేలి మహిళ మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ స్కూటీ పేలి మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ పేలిపోయింది. పక్కనే సోఫాలో నిద్రిస్తున్న ఉండేలా వెంకటలక్ష్మమ్మ(62) మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఎలక్ట్రిక్ స్కూటర్లు బాంబుల్లా పేలిపోతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బ్యాటరీలు కారణంగానే బ్లాస్ట్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ నిర్వహణ సరిగా చేయకపోవడం, ఛార్జింగ్ పెట్టడంలో తప్పుడు పద్ధతులు కారణంగా బ్యాటరీలు పేలతాయని అంటున్నారు. -
అశ్రునయనాలతో హవల్దార్కు అంత్యక్రియలు
తొండూరు : మండల కేంద్రమైన తొండూరు గ్రామానికి చెందిన హవల్దార్ బూచుపల్లె శివప్రకాష్రెడ్డి బుధవారం సాయంత్రం గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం హవల్దార్ అధికారి శివప్రకాష్రెడ్డి మృతదేహం వద్ద సబ్ మేజర్ దిలీప్ పాల్ జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాష్రెడ్డి యూనిఫాం, జాతీయ జెండాను భార్య నాగేశ్వరి, కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం స్మశాన వాటిక వరకు శివప్రకాష్రెడ్డి అంతిమ యాత్ర జన సందోహం మధ్య జరిగింది. స్మశాన వాటిక వద్ద గాలిలోకి కాల్పులు జరిపి భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, ప్రకాష్రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మిలటరీ అధికారులు హవల్దార్లు సి.ఎల్.రెడ్డి, ఎన్.కె.ఎస్.హరీష్, మాజీ హవల్దార్లు రామమణిరెడ్డి, నరసింహారెడ్డి, ఎన్.కె.శ్రావణ్రెడ్డి, ఎస్ఐ ఘన మద్దిలేటి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల బదిలీలలు
కడప కార్పొరేషన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పురపాలక శాఖ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేసే అధికారం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే కమిషనర్కు కట్టబెడుతూ పురపాలకశాఖ ఆర్డీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లెక్కన కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జిల్లాలోని ప్రొద్దు టూరు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం మున్సిపాలిటీల్లోని సుమారు 256 వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులందరికీ కడపలోనే కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు నిర్వహించనున్నారు. ● కడప కార్పొరేషన్లో ఇంతవరకూ ఉద్యోగుల మెరిట్ లిస్టుగానీ, ఖాళీలను గానీ చూపలేదు. కనీసం హెల్ప్డెస్క్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈలోపే అత్యధికమంది సచివాలయ ఉద్యో గులు సిఫారసు లేఖల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరెవరిని ఏ వార్డులో వేయాలో, ఎవరిని బదిలీ చేయాలో తమ లెటర్ హెడ్లో జాబితాలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు తమ జాబితాను కమిషనర్కు పంపినట్లు ప్రచారం సాగుతోంది. కడపలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇదివరకే వార్డు సచివాలయ ఉద్యోగులను ఎక్కడికి పడితే అక్కడ బదిలీ చేశారు. ఈ సారి బదిలీల్లో కూడా ‘ఆమె జాబితా’కు ఆమోద ముద్ర తప్పదని తెలుస్తోంది. టీడీపీ ఇన్చార్జులకు ఆయుధంలా... అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారు. అయినా టీడీపీ ఇన్చార్జులు తమ మాటే నెగ్గాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులను బెదిరించి, భయపెట్టి తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ బదిలీలను ఒక ఆయుధంలా వాడుకొని తమకు నచ్చిన వారిని, తాము ఏది చెబితే అది చేసేవారిని వార్డు సచివాలయాల్లో నియమించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పారదర్శకంగా ... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం చాలా పారదర్శకంగా మెరిట్ ప్రకారం పక్కాగా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతే పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే కమిషనర్కు బదిలీ చేసే అధికారం మెరిట్ లిస్టు ప్రకటించని అధికారులు బదిలీలు ఎలా జరుగుతాయోనని ఉద్యోగుల్లో ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల చుట్టూ ప్రదక్షిణలు -
‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం
కడప కోటిరెడ్డిసర్కిల్: దేశంలో అధిక వేగంతో నడుస్తున్న రైళ్లలో ఒకటైన వందే భారత్ రైలు గురువారం కడప– రేణిగుంట మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాచిగూడ–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. కాగా 130 కి.మీ. స్పీడ్తో రైలు నడిచినా ఎలాంటి సమ స్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారులు గుర్తించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో వందేభారత్ రైలు నడిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 220 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన కౌన్సెలింగ్కు 86001వ ర్యాంకు నుంచి 104000 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 220 మంది అభ్యర్థులు తమ కౌన్సెలింగ్ను పూర్తి చేసుకుని ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎస్ఆర్ లక్ష్మి ప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్లు వసుంధర, మల్లేశ్వరమ్మ, లావణ్య, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... నేడు నిర్వహించబోయే కౌన్సెలింగ్కి జిల్లావ్యాప్తంగా 104001 నుంచి 120000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు రావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. 5 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు రాజంపేట: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో కలిసి గురువారం తాళ్లపాక, సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలునటేష్బాబు, ప్రశాంతి పాల్గొన్నారు. -
భారీ స్కోరు దిశగా కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు భారీ స్కోరు దిశగా ఆడుతోంది. తొలి రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 93 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 291 బంతుల్లో 23 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. గురు విఘ్నేష్ 147 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 50.4 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్రెడ్డి 48, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి, 107 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేయగా జయంత్ కృష్ణ 78 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.డబుల్ సెంచరీ చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్ రెడ్డి -
2 నుంచి తరగతులు
కడప సెవెన్రోడ్స్: పేద విద్యార్థులకు అధునాతన వసతులు, నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో జిల్లాలోని బి.మఠంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర మహా గురుకులంలో జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో బి.మఠం మండలంలో ఏర్పాటైన డా.బి.ఆర్.అంబేద్కర్ మహా గురుకులం (బాలుర) విద్యా లయంలో తరగతుల ప్రారంభానికి సంసిద్ధత, విద్యార్థుల అడ్మిషన్ అంశాలపై సమావేశం నిర్వహించారు.అత్యాధునిక సదుపాయాలు, వసతులతో రూపు దిద్దుకున్న ఈ గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి 800 మంది విద్యార్థులతో అడ్మిషన్లు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
కలసపాడు : స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో గురువారం టీడీపీ జిల్లా మైనారిటీ పార్లమెంట్ అధ్యక్షుడు, కలసపాడు పార్టీ అబ్జర్వర్ ఖాదర్బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు జి.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ల, పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. మండలంలోని ఇ.తంబళ్లపల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద రెడ్డికి, ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన నారాయణ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీకి కోవర్టుగా ప్రహ్లాదరెడ్డి పనిచేస్తున్నాడని నారాయణరెడ్డి ఆరోపించాడు. తాను ఈ పార్టీలో ఉన్నానని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చి తనను విమర్శిస్తావా అని ప్రహ్లాదరెడ్డి నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు సాధనకారి రంతు జోక్యం చేసుకోవడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పార్టీ కార్యాలయంలోనే తన్నులాట కొనసాగించి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ చొక్కాలు చించుకుని వీరంగం సృష్టించారు. మండలంలో గత కొంత కాలంగా ప్రహ్లాదరెడ్డి టీడీపీలో జరుగుతున్న అన్యాయాలపై స్థానిక మీడియా ద్వారా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న ప్రహ్లాదరెడ్డి అంటే నియోజకవర్గ యువ నాయకుడికి నచ్చలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక విధంగా ప్రహ్లాదరెడ్డిపై దాడి చేయాలని ముందుగా నిర్ణయించుకుని పథకం ప్రకారం దాడి చేసినట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు కలసపాడుకు చేరుకుని కొంత మేర సమస్యను సద్దుమణిగేలా చూశారు. తర్వాత ప్రహ్లాదరెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించినట్లు తెలిసింది. మండలంలో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఇటీవల విమర్శలు గుప్పించడంతోపాటు ఆధిపత్యానికి తెరతీశారు. మండలంలో అంతంత మాత్రమే బలం ఉన్న టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. కలసపాడులో ఉద్రిక్తత ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు -
డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
కడప సెవెన్రోడ్స్: వైఎస్సార్ కడపను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని, అందుకోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని జేసీ అదితిసింగ్ పిలుపునిచ్చారు. గురువారం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం,ఈగల్ (ఎలైట్ యాంటి–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వాకథాన్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడం కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. విద్యార్థుల వసతి గృహాలు, కాలేజీలు, పాఠశాలల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతినిత్యం తల్లిదండ్రులు తమ పిల్లల చెడు వ్యసనాలపై అప్రమత్తంగా వ్యవహరించి వారిలో మంచి అలవాట్లపై అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు,వినియోగాన్ని నిరోధించడానికి 1972 టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాటాడారు. అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు,ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు, ఆర్డీవో జాన్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు. జేసీ, ఎస్పీల పిలుపు నగరంలో వాకథాన్ ర్యాలీ -
నెత్తురోడ్లుతున్నాయ్!
రహదారులు నెత్తురోడుతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిద్ర లేమి.. వెరసి రోడ్డు ప్రమాదాలతో ఎరుపెక్కాయి. ఇటీవల జిల్లాలో జరిగి న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. 2025 మే 26న గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు లారీ ఢీ కొన్న ప్రమాదాలల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ● గత వారంలో రాయచోటి నుంచి హైదరా బాదుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.జాతీయ రహదారి వెంబడి ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. నిబంధనల మేరకు ముందు, వెనుక వాహనాలకు రిఫ్లైక్టింగ్ స్టిక్కర్లు అతికించాల్చిన అవసరం ఉంది. ఇవి రాత్రి వేళల్లో వాహనచోదకునికి ముందు వాహనం ఉందనే విషయాన్ని సృష్టంగా కనిపించేలా చేస్తుంది. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతి వేగంతో దూసుకెళుతున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. బ్లాక్ స్పాట్లలో సూచిక బోర్డులు, విద్యుద్దీపాలు, రహదారి మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలి. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో సమారు 307 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 172 మంది మృత్యువాత పడగా 364 మంది క్షతగాత్రులయ్యారు. వేగ నియంత్రణ అమలు చేయకపోవడం, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు ఈ విషయాల్లో పున: సమీక్షించాల్సిన అవసరం ఉంది. కారణాలెన్నో...... మితి మీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్ టేక్, అకస్మాత్తుగా వాహనం నిలపడం, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర విషయాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై లారీలను ఇష్టానుసారంగా నిలిపేస్తున్నారు. హోటళ్లు, డాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి అనుకొని ఆపుతున్నా రు. ఈ క్రమంలో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక వాటిని ఢీ కొంటున్నాయి. లారీలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా విశ్రాంతి స్థలాల్లో మాత్రమే నిలపాల్సి ఉన్న అక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లకు అనుకొని, చెట్ల కింద ఆపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు అధికంగా రాత్రి వేళ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అందులో క్లీనర్గా పని చేసే వారు అరకొర డ్రైవింగ్తో అప్పుడప్పుడు వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం, ముందు వెళుతున్న వాటిని వేగంగా అధిగమించే క్రమంలో పట్టుకోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తీర్మానం చేసినా.... ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 70 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్ సేప్టీ సమావేశాల్లో తీర్మానించారు. అది కార్యరూపం దాల్చినా కేవలం ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. అనంతరం అధికారులు అటు వైపు దృష్టి సారించిన దాఖల్లా లు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పదించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గతంలోనే గుర్తించారు. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు తొలగేలా వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టా యి. కాలక్రమంలో దీనికి బ్రేక్ పడింది. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు ఇలా చేస్తే... ఒకరి నిర్లక్ష్యం..మరొకరికి ప్రాణ సంకటం మితిమీరిన వేగంతోనేరోడ్డు ప్రమాదాలు ఐదు నెలల్లో172 మంది మృత్యువాత రోడ్డు నిబంధలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం రోడ్డు నియమ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాల వేగ నియంత్రణను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్లతో తనిఖీలు చేపడుతున్నాం. మద్యం మత్తుల్లో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. –నిరంజన్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా 2020 825 307 970 2021 861 368 949 2022 801 403 837 2023 631 372 730 2024 664 321 737 2025 307 172 364 మే వరకు -
అత్యుత్తమ నాణ్యతకు హామీ భారతి సిమెంట్
పులివెందుల రూరల్ : నాణ్యతా ప్రమాణాలలో మేటి భారతి సిమెంట్ అని భారతి సిమెంట్ కంపెనీ డీజీఎం ఓబుళ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని స్థానిక మైరా రెస్టారెంట్లో కాంట్రాక్టర్లకు భారతి సిమెంట్ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. ఇతర కంపెనీ సిమెంట్తో పోలిస్తే తక్కువ సమయంలోనే భారతి సిమెంట్ సెట్ అవుతుందన్నారు. వేగంగా కట్టే బిల్డింగ్లకు అత్యుత్తమ పరిణామాలను, నాణ్యతను భారతి ఆల్ట్రా పాస్ట్ సిమెంట్ రెండు గంటల్లోనే సెట్ అవుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి ఉన్న భారతి సిమెంట్తో కట్టడాలు త్వరగా పూర్తవుతాయన్నారు. మార్కెట్లో చాలామంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు భారతి సిమెంట్ వాడుతున్నారన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ కంపెనీ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్రబాబు, డీలర్ అశోక్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బయనపల్లెలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని చింతపల్లె పంచాయతీ బయనపల్లె గ్రామంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి చెందిన ఇంటిని అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసేందుకు భారీగా పోలీసులను మోహరింపచేసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారుల తీరును తప్పుపట్టడంతో పాటు కూల్చివేతను అడ్డుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత నాయకులతో మాట్లాడారు. కూల్చివేతకు యత్నం.. బద్వేలు–కడప రహదారిలోని బయనపల్లె గ్రామంలో సర్వే నెం. 27ఎ, 27బిలలో కొంత గ్రామ నత్తం ఉంది. సదరు స్థలాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తాతల కాలం నుండి సుమారు 60 ఏళ్ల కిందటి నుండి 8 సెంట్ల స్థలాన్ని స్వాధీనానుభవంలో ఉంచుకున్నారు. సదరు స్థలం పక్కనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీసీరోడ్లు సైతం నిర్మించారు. అయితే గత పదేళ్ల క్రితం శ్రీకాంత్రెడ్డి అందులో ఒక ఇంటిని నిర్మించుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో పాటు రెండు రోజుల క్రితం జరిగిన యువతపోరు కార్యక్రమానికి బద్వేలు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువతను కడపకు తరలించారు. దీనిని జీర్ణించుకోలేని రూరల్ పరిధికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత వద్ద శ్రీకాంత్రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్న గ్రామస్థులు టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో శ్రీకాంత్రెడ్డి నివసిస్తున్న ఇంటిని కూల్చివేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు భారీగా పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల్లో చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ముందు వాటిని తొలగించి తర్వాత ఇక్కడికి రావాలని అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామస్థులు పెద్త ఎత్తున తరలిరావడంతో ఇంటిని కూల్చివేసే చర్యలు కొంతసేపు ఆపారు. ఇదే సమయంలో బద్వేలు రూరల్, బి.కోడూరు, అట్లూరు మండలాల నుండి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించడంతో పాటు అడ్డుకునే వారిపై నీళ్లు కొట్టేందుకు ఫైరింజన్ను సైతం పిలిపించారు. అయితే గ్రామస్థులు వారి చర్యలకు బెదరకుండా గట్టిగా నిలబడడంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే కాపుకాశారు. పరామర్శించిన ఎమ్మెల్సీ.. కక్షపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు యత్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్రెడ్డి, మాజీ కుడా ఛైర్మన్ గురుమోహన్, జడ్పీటీసీ పోలిరెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున బయనపల్లెకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ ఛైర్మన్ ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దారు ఉదయభాస్కర్ రాజు, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్లతో చర్చించి కొంత సమయం ఇచ్చి అక్రమ నిర్మాణమని తేలితే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని తెలిపారు. ఇంతలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపటికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ తహసీల్దారు, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీకి చెందిన శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులపై ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తుందని అన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిని కూల్చివేసేందుకు యత్నించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న గ్రామస్తులు పరామర్శించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి -
ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని శ్రీలక్ష్మీసాయి ఫర్నీచర్ దుకాణంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. పట్టణానికి చెందిన సి.హెచ్ గోపాలక్రిష్ణ నెల్లూరు రోడ్డులో కొన్నేళ్లుగా ఫర్నీచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరే గురువారం దుకాణం తెరిచి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి సమయంలో దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. కొద్ది సేపటికి దుకాణం నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల వారు గమనించి దుకాణ యజమానికి తెలిపారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్పటికే బయనపల్లె గ్రామంలో ఉన్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సోఫాసెట్లు, పరుపులు, కూలర్లు, డబుల్కాట్మంచాలు కాలిపోయాయి. మంటలను అదుపు చేయడంతో కొంత సామగ్రిని కాపాడుకోగలిగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
వేంపల్లె : స్థానిక శ్రీరాంనగర్లో నివాసముంటున్న వరలక్ష్మి అనే మహిళను ఆమె భర్త రవి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం దుగ్గన్నగారిపల్లెకు చెందిన గంగోజి, గీత దంపతుల కుమార్తె వరలక్ష్మికి వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు దేరంగులరవితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు మన్విక ఉన్నది. ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. గత కొన్ని నెలలుగా వరలక్ష్మి భర్త రవి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. అయితే ఈనెల 2వ తేదీన ఆమె తల్లిదండ్రులు వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బాధితురాలి భర్త రవికి స్థానిక టీడీపీ నేతల అండదండలు ఉండడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఆ తర్వాత కడప మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తన ఇంటి వద్దకు వచ్చిన వరలక్ష్మి భర్త డేరంగుల రవి, అతని చిన్నాన్న కొడుకు కృష్ణమూర్తి, తండ్రి వెంకటసుబ్బయ్య, చిన్నాన్న వెంకటరమణలు వరలక్ష్మిని విచక్షణ రహితంగా కాలితో కడుపుపైన కొట్టారన్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలిపులివెందుల టౌన్ : ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడిపల్లి కిశోర్ కోరారు. గురువారం పట్టణంలోని స్థానిక ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పునరాలోచించి రోస్టర్ విధానం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లలో అవకాశం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేవిధంగా అవకాశం ఇస్తే విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవనం మీద నుంచి కింద పడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతికడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేపు జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈనెల 28న కడప జిల్లా కోర్టులో గల కడప బార్ అసోసియేషన్ హాలులో భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష నిర్వహించనున్నట్లు భారత న్యాయవాదుల సంఘం కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఇ.సుబ్రహ్మణ్యం కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. ఈశ్వర్ తెలిపారు. గురువారం నగరంలోని బసవతారకం లా కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరు కానున్న యువ న్యాయవాదులకు ఈ మోడల్ టెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కడప బార్ అసోసియేషన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 99633 28876, 70137 40055, 94411 21181 నంబర్లకు ఫోన్ చేసి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. బద్వేల్ మండలం బయనపల్లిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు ల్యాండ్లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఇల్లును ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. -
బీటెక్ రవి బంధువు వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు. ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్ పరిధిలో ఉన్న జైస్వాల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్ కంపెనీ మేనేజర్ ఖాన్పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
సీటు వదలని అక్రమార్కుడు!
సాక్షి టాస్క్ఫోర్స్ : సాధారణంగా ఎవరైనా ఎనిమిదేళ్లు ఒక చోట పనిచేస్తే ప్రభుత్వం నిర్వహించే బదిలీల్లో కచ్చితంగా స్థాన చలనం పొందాలి. కానీ కడప ఇంటర్మీడియట్ డీఐఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఎనిమిది సంవత్సరాలు సర్వీసు పూర్తి కావడంతో ఇటీవల నిర్వహించిన బదిలీల్లో పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేశారు. దీంతో ఆయన ఈ నెల 13వ తేదీ పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధుల్లో చేరారు. అయితే ఇంతవరకు కళాశాలకు వెళ్లకుండా అనధికారంగా డీఐఈఓ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలా కొనసాగడానికి తగిన ఉత్తర్వులు కూడా లేవు. ఇతను బదిలీ అయినా తిరిగి డిప్యుటేషన్ మీద డీవీఈఓ ఆఫీసుకు తెచ్చుకునేందుకు తగిన ప్రతిపానదలను ఆర్జేడీకి సంబంధం లేకుండా కమిషనర్ కార్యాలయానికి నేరుగా డీఐఈఓ కార్యాలయం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల పోరుమామిళ్ల నుంచి డిప్యుటేషన్ మీద డీవీఈఓ ఆఫీసుకు తెచ్చుకునేందుకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అలా కూడా చేయకుండా అనధికారికంగా డీఐఈఓ కార్యాలయంలోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈయన జిల్లాలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చేసేందుకు కూడా మామూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డీఐఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్కు బదిలీ అయినా తిరిగి డీఐఈఓ కార్యాలయంలో కొనసాగించే విషయంపై విద్యార్థి సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఐఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఈ జిల్లాకు తాను కొత్తగా వచ్చానని, ఈయన సేవలు కార్యాలయంలో తనకు అవసరం కనుక ఇక్కడే కొనసాగించుకుంటున్నానని తెలిపారు. ఇతనిని డీఐఈఓ కార్యాలయానికి డిప్యుటేషన్పై తెచ్చుకునేందుకు ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు. పోస్టింగ్ పోరుమామిళ్లలో.. పనిచేసేది కడప డీఐఈఓ ఆఫీసులో బదిలీ వచ్చినా అక్కడికి వెళ్లి చేరి మళ్లీ డీఐఈఓ ఆఫీసులోనే విధులు -
గ్రేడ్ –2 జేఎల్ఎంల బదిలీల ఉపసంహరణ
కడప కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్ఎంల బదిలీలను ప్రభుత్వం ఉపసంహరించిందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగసుబ్బయ్య తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల విధివిధానాలను అనుసంధానం చేస్తూ ఈపీడీసీఎల్ ఇచ్చిన ఉత్తర్వులు సరి కాదని, గ్రేడ్–2 జేఎల్ఎంలను విద్యుత్ ఉద్యోగులతో సమానంగా చూడాలని, విద్యుత్ సంస్థ సర్వీసు రెగ్యులేషన్స్, ఆ సంస్థ నిర్వహించే బదిలీలే వారికి కూడా వర్తిస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. ఈ మేరకు గ్రేడ్–2 జేఎల్ఎంల బదిలీలను నిలుపుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, కడప డివిజన్ నాయకులు సురేంద్ర, శివ ప్రసాద్ రెడ్డి, గోపి, శీలం సుబ్బరాయుడు నందీశ్వర్ రెడ్డి, నాగ శేష, రమణాచారి, శివ, నిఖిల్, పాల్గొన్నారు. -
దొంగలున్నారు జాగ్రత్త!
జమ్మలమడుగు : పట్టణంలోని ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న కెనరా బ్యాంకులో దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం బ్యాంకులో ఖతాదారులు ఎక్కువ సంఖ్యలో లావాదేవీల కోసం క్యూ కట్టారు. బ్యాంకు చిన్నది కావడం ఖాతాదారులు సంఖ్య ఎక్కువ కావడంతో ఇదే అదనుగా భావించిన కొంత మంది దొంగలు ఖాతాదారుల సెల్ ఫోన్లతోపాటు జేబుల్లో ఉన్న నగదుకు కత్తెర పెట్టారు. ఖాతాదారులు పనులు పూర్తి అయిన తర్వాత బ్యాంకు బయటికి వచ్చి ఫోన్లు కనిపించలేదు. బ్యాంకులో మొత్తం గాలించినా ఫలితం కనిపించలేదు. మైలవరం మండలం నార్జాంపల్లి గ్రామానికి చెందిన రైతు రామసుబ్బారెడ్డికి సంబంధించిన కీప్యాడ్ కలిగిన సెల్ఫోన్ పోగా, ఎర్రగుడికి చెందిన రైతు మాబుసా అ జేబులో ఉన్న రెండు వేల నగదు పోయింది. గతంలో మండల పరిధిలోని పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన మహిళ వద్ద నుంచి పది తులాల బంగారాన్ని ఇదే బ్యాంకులో దొంగిలించారు. గతంలో కెనరా బ్యాంక్ ఒక్కటే ఉండటంతో ఖాతాదారులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. అయితే సిండికేట్ బ్యాంక్ను కెనరా బ్యాంక్లో విలీనం చేయడంతో ఖాతాదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకు చిన్నదిగా ఉండటం ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటం దొంగలకు కలిసి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఖాతాదారులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. బైక్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని నాలుగు రోడ్లు కూడలిలో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు బైక్ను ఢీ కొన్న సంఘటనలో పల్లె రంగయ్య అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాపాడు దళితవాడకు చెందిన పల్లె రంగయ్య చియ్యపాడులోని తన సోదరి ఇంటికి వెళ్లి బైక్లో రాత్రి 9.20 గంటల ప్రాంతంలో చాపాడుకు వస్తుండగా.. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు నుంచి చైన్నెకి వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుకుంటున్న రంగయ్యను ప్రమాదవశాత్తు ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా తీవ్ర రక్త స్రావం అయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న పెద్దయ్య సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా దీశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు, బైక్ను అదుపులోకి తీసుకున్నారు. వేడినీళ్లు పడి బాలుడికి గాయాలు మదనపల్లె రూరల్ : వేడినీళ్లు పడి బాలుడు గాయపడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. వేంపల్లె క్రాస్కు చెందిన రవి కుమారుడు మౌనిష్ (6) ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదశాత్తు వేడినీళ్లు ఉన్న పాత్రలో పడ్డాడు. ప్రమాదంలో బాలుడికి గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జమ్మలమడుగు కెనరా బ్యాంకులో దొంగల హస్త లాఘవం ఖాతాదారుల సెల్ ఫోన్లు, నగదు చోరీయువకుడికి తీవ్ర గాయాలు -
పశువుల పెంపకం కోసం భూములు
మైదుకూరు: భూమిలేని పేదలకు వ్యవసా యం కోసం భూములు ఇచ్చినట్టుగా పశువుల పెంపకం కోసం కూడా అర్హులకు భూములివ్వాలని ప్రణాళిక తయారు చేస్తున్నట్టు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం మైదుకూరులోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పశువుల పెంపకంతో ఆదాయం పొందాలనుకునే వారికి భూములు ఇవ్వాలనే ప్రణాళిక ఉందని.. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మైదుకూరు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఒక పాలిచ్చే గేదె ఒక ఎకరా భూమితో సమానమని నానుడి ఉన్నట్టు ఒక కుటుంబం ఒక గేదెను పెంచుకుంటే ఒక ఎకరా ద్వారా వచ్చేంత ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. పశువుల పెంపకం కోసం ఎన్ఎల్ఎఫ్ పథకం ద్వారా బ్యాంకు నుంచి రూ.50లక్షల వరకు రుణం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇందు కు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు ఉత్సాహవంతులైన యువకులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. సమావేశంలో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్, బద్వేలు, జమ్మలమడుగు ఆర్డీఓలు చంద్రమోహన్, సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగామైదుకూరులో అమలు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
టీడీపీలో కలవరం!
● వైఎస్ జగన్ సమక్షంలోపార్టీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం ● అన్నమయ్య జిల్లాలో ఇదే బాటలో మరికొందరు సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ అధిష్ఠానం కీలక నేతలను పట్టించుకోకపోవడం....పట్టున్న నేతలను విస్మరిస్తుండడం పరిస్థితి బట్టి చూస్తే భవిష్యత్తులో మరికొంతమంది టీడీపీ నేతలు వలసబాట పట్టనున్నారు. టీడీపీలో గట్టి పట్టున్న వారిని పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జిలనుప్రకటించకపోవడం, ప్రస్తుత సర్కార్లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా మిన్నకుండిపోతుండడం వంటి ఘటనలతో పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని.. పార్టీనే దైవంగా భావించిన వారికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ అధిష్ఠానం పదవులు కట్టబెడుతుండడంపై కూడా పార్టీ లోని సీనియర్ నాయకులు రగలిపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది మెజార్టీ ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీ అంటిపెట్టుకుని పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్, టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంను పార్టీ అధిష్టానం అవమానాలకు గురి చేయడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో కలవరం మొదలైంది. రాజంపేట నుంచి పోటీ చేసినా ఇన్ఛార్జి ఇవ్వని టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నుంచి రాయచోటికి అవకాశం పరిశీలించాలని పదేపదే అడిగినా కాదని, రాజంపేట నియోజకవర్గం అప్పగించారు. అయినా సుగవాసి బాలసుబ్రమణ్యం వెనుకంజ వేయకుండా రాజంపేట టీడీపీ టిక్కెట్పై పోటీ చేశారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఎన్నికలకు ముందు ఒక తరహాలో, ఎన్నికలు తర్వాత మరో తరహాలో టీడీపీ అధిష్టానం వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టకుండా నాన్చుడు ధోరణితో ముందుకు వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా మరోపక్క ఇంకో నాయకుడిని అదే నియోజకవర్గంలో ప్రోత్సహించడం వెనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లు అర్థమవుతోంది. ఎన్నికల సందర్భంగా భారీగా ఖర్చు చేసుకుని పార్టీ కోసం అన్ని విధాల అగచాట్లు పడిన వారిని కాదని, ఇతరులను ప్రోత్సహించడంపై తెలుగు తమ్ముళ్లలో చర్చకు దారి తీసింది. అవమానాలు ఎదుర్కొంటూ...పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న సుగవాసిని టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. ● రాయచోటిలో ‘సుగవాసి’ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎంపీ, దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నమ్ముకునే పాలకొండ్రాయుడు కుటుంబం రాజకీయాలు చేసింది. అంతేకాకుండా రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లెలో కూడా సుగవాసి కుటుంబాన్ని అభిమానిస్తూ వారి వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేసి పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన పాలకొండ్రాయుడిని చివరి గడియల్లో కూడా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించకపోయినా టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేసిన పాలకొండ్రాయుడు ఇటీవల మృతి చెందినంతరం కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీలో ప్రధాన నేతలు రాకపోవడం, మహానాడు కార్యక్రమంలో సంతాపాన్ని తెలియజేయకపోవడం అభిమానులతోపాటు కుటుంబంలోనూ బాధను నింపింది. అంతేకాకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన పాలకొండ్రాయుడు కుటుంబాన్ని అధోగతిపాలు చేసేలా అధిష్ఠానం తీసుకున్న చర్యలపై సుగవాసి బాలసుబ్రమణ్యం కినుకు వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సంబేపల్లెకు వచ్చిన సందర్భంలోనూ, ఒంటిమిట్ట కల్యాణం సందర్భంలోనూ, ఇతర సందర్భాల్లోనూ బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇవ్వకుండా చేయడంపై కుటుంబంలో కలకలం రేగింది. ఈ నేపధ్యంలో పొమ్మనకుండానే పొగబెడుతున్న అధిష్టానం తీరు నచ్చక సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
నా ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలి
పులివెందుల టౌన్ : తన ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని బాధితురాలు శ్రీపతి రామమునెమ్మ కోరారు. బుధవారం పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థలం విషయంలో తనకు అన్యాయం చేసిన టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎస్పీ అశోక్కుమార్లకు విన్నవించానన్నారు. తన స్థలాన్ని పునరుద్ధరించి రక్షణ కల్పించాలన్నారు. అలాగే ప్రభుత్వ కాలువ ఆక్రమణలతో పాటు సంబంధిత మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులపై కూడా విచారణ జరపాలని కోరారు. తన ప్లాటు నెంబర్ 10ను మల్లెల రాజేశ్వరి నుంచి కొనుగోలు చేశానని, రెవెన్యూ ఖాతాలో తన పేరు కూడా నమోదైందన్నారు. అయితే టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి అసలైన అమ్మకందారుతో కలిసి అక్రమ లాభార్జన కోసం అదే లింక్ డాక్యుమెంట్ను ఉపయోగించి దొంగ రిజిష్టర్ చేయించుకున్నారన్నారు. అలాగే తన స్థలంతోపాటు పక్కన ఉన్న ప్రభుత్వ కాలువ భూమిని కూడా విజయ్కుమార్రెడ్డి ఆక్రమించాడని, మున్సిపల్ అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారన్నారు. ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి విజయ్కుమార్రెడ్డి, లక్షుమయ్యలతోపాటు మరికొంతమంది రాత్రివేళ నిబంధనలకు విరుద్ధంగా తన స్థలంలోకి ప్రవేశించి సిమెంట్ నిల్వ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ధ్వంసం చేసి జేసీబీ ద్వారా తన స్థలాన్ని చదును చేశారన్నారు. ఇది పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరిగిన చర్య అన్నారు. ఈ ఆక్రమణల అనంతరం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అండ చూసుకుని తనను తప్పుడు కేసులలో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డిపై పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. వీరి ద్వారా తనకు ప్రాణ హాని ఉందని మీడియా ఎదుట వాపోయింది. సమావేశంలో భర్త శ్రీపతి చిన్నబాలుడు, కుమారుడు శ్రీపతి చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడి దౌర్జన్యాలను అరికట్టండి మీడియాతో బాధితురాలు శ్రీపతి రామమునెమ్మ ఆవేదన -
వన్యప్రాణులను వేటాడుతున్న వ్యక్తి అరెస్టు
మైదుకూరు : మండలంలోని గంగాయపల్లె అటవీ బీట్ పరిధిలో వన్యమృగాలను వేటాడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు వనిపెంట అటవీ రేంజ్ అధికారి ప్రణీత్ రావు బుధవారం తెలిపారు. మండలంలోని జాండ్లవరం గ్రామానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా గంగాయపల్లె బీట్లో నాటు తుపాకులతో వన్య మృగాలను వేటాడుతున్నారని ఆయన తెలిపారు. వారి కోసం నిఘా ఉంచి మంగళవారం ఓ వ్యక్తిని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి నాటు తుపాకీ, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితుడిని బుధవారం కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అన్వర్ హుస్సేన్, ఎఫ్బీఓ సురేఖ, ఏబీఓ సునీత పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. బుధవారం విజయవాడలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నట్టేట ముంచిన సీడ్స్ యాజమాన్యం
పోరుమామిళ్ల : మొక్కజొన్న పంటకు పొలంలోనే డబ్బులు ఇచ్చి తీసుకెళతామని చెప్పి లక్ష్మీప్రసన్న సీడ్స్ యాజమాన్యం రైతులను నమ్మించి నట్టేట ముంచిందని సీపీఐ ఏరియా కార్యదర్శి పాడుగు మస్తాన్ ఆరోపించారు. బుధవారం ఆయన రైతులతో కలసి మొక్కజొన్న సీడ్స్ ఏజెంట్లు, యాజమాని నిర్వాకం వివరించారు. పోరుమామిళ్ల మండలంలో మొక్కజొన్న సీడ్స్ డీలర్ వెంకటేశ్వరరెడ్డి, ఏజంట్లు గురయ్య, శ్రీను, ప్రసాద్ రైతులకు విత్తనాలు ఇచ్చి, పండిన పంటకు క్వింటాకు రూ. 60 వేలు ఇస్తామని చెప్పారన్నారు. రామాయపల్లెలో వారి మాటలు నమ్మి మొక్కజొన్న సాగు చేసి వచ్చిన పంటను వారికి అందజేశారన్నారు. పంట తీసుకెళ్లిన సీడ్స్ యాజమాన్యం రైతులకు డబ్బు ఇవ్వలేదన్నారు. రామాయపల్లె రైతులతో పాటు సిద్దవరం, అగ్రహారం, క్రిష్ణంపల్లె, కలసపాడు, బి.మఠం మండలాల్లో కొన్ని గ్రామాల్లోని రైతులు కూడా మోసపోయారన్నారు. సీడ్స్ కంపెనీ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించాలని ఆయన కోరారు. -
సర్పంచ్ అవినీతిపై ప్రమాణానికి సై
ప్రొద్దుటూరు : కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అవినీతిని నిరూపించడానికి తాను ఎక్కడ ప్రమాణం చేయడానికై నా సిద్ధంగా ఉన్నానని ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ తెలిపారు. టైం, డేట్ను ఆయనే ఫిక్స్ చేయాలని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో ఉన్న తన స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తాను నిర్మిస్తున్న కట్టడాన్ని కూల్చారన్నారు. దీనిని తాను అడ్డుకున్నానన్నారు. తన స్థలం ఖాదరాబాద్లో ఉండగా టీడీపీ కౌన్సిలర్ మునీర్ అహ్మద్ తయారు చేసిన డాక్యుమెంట్లోని సర్వే నంబర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాందీ షాపు సిద్ధయ్య ఇంటి వద్ద ఉందన్నారు. సర్పంచ్ శివచంద్రారెడ్డి ప్రమేయంతోనే తన స్థలంలోని నిర్మాణాన్ని కూల్చారన్నారు. ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ అయ్యాక శివచంద్రారెడ్డి భూ కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులతో కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. శివచంద్రారెడ్డి సర్పంచ్ కాకముందు ఆయనకు ఎంత ఆస్తి ఉందో.. ఇప్పుడు ఆస్తి ఎంత ఉందో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సహకారంతో తాను సర్పంచ్ నుంచి ఎంపీపీ స్థాయికి ఎదిగానన్నారు. సమావేశంలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, సానబోయిన శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. -
వాకథాన్ ర్యాలీని జయప్రదం చేయండి
కడప సెవెన్రోడ్స్: అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గురువారం కడప నగరంలో నిర్వహించే వాకథాన్ ర్యాలీని జయప్రదం చేయాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ అంశంపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు కడప కోటిరెడ్డిసర్కిల్ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా ర్థులు, యువత, ప్రజలు, వివిధ శాఖల అధికా రులు పాల్గొనాలని కోరారు. పాలిసెట్ కౌన్సెలింగ్కు 240 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్కు జిల్లావ్యాప్తంగా 68001వ ర్యాంకు నుంచి 86 వేల ర్యాంకులకు సంబంధించిన 240 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆఫీసర్ పద్మజ, వెరిఫికేషన్ ఆఫీసర్లు ప్రసాద్, ప్రశాంతి, ప్రసన్న, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... జిల్లావ్యాప్తంగా 86001 నుంచి 104000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు గురువారం కౌన్సెలింగ్ ఉంటుందని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. వర్థిని కన్స్ట్రక్షన్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ కె. సురేష్ బాబు తనయుడు రిజిస్టర్ చేసిన వర్థిని కన్స్ట్రక్షన్స్ సంస్థను రద్దు చేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 625ను జారీ చేశారు. వర్థిని కన్స్ట్రక్షన్స్ సంస్థ ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు చేయడంపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి సమర్పించారు. వారి నివేదిక మేరకు పురపాలక శాఖ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మేయర్ సింగిల్ బెంచ్ను, ఆ తర్వాత డివిజనల్ బెంచ్ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ విచారణ జరిపిన అధికారులు వర్థిని కన్స్ట్రక్షన్స్ సంస్థను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. 29న బీసీ మహాసభ మదనపల్లె సిటీ: మదనపల్లెలో ఈనెల 29న జరిగే బీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ జనసభ వ్యవస్థాపకుడు బోడే రాజశేఖర్ తెలిపారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బొల్లి మచ్చలు అంటువ్యాధి కాదు కడప కోటిరెడ్డిసర్కిల్: బొల్లిమచ్చలు ఒకరినుంచి సంక్రమించే అంటువ్యాధి కాదని రిమ్స్ డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ పెంచలయ్య అన్నారు. ప్రపంచ బొల్లి మచ్చల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్లోని చర్మవ్యాధుల(డెర్మటాలజీ) విభాగంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ బొల్లి మచ్చలు వంశపారపర్యంగా, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదన్నారు. బొల్లి మచ్చలతో ఒక వ్యక్తి శారీరక, మానసిక సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ప్రారంభ దశలోనే చర్మవ్యాధుల నిపుణుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలున్న వారిపై వివక్ష చూపకుండా సమాజంలో అందరితో సమానంగా ఆదరించాలన్నారు. డెర్మటాలజీ విభాగం వైద్యులు డాక్టర్ సుభాషిణి, డాక్టర్ నరోత్తమరెడ్డి, డాక్టర్ విజయకుమారి పాల్గొన్నారు. -
సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నందలూరు : టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 5న ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈఓలు నటేష్బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణుడు శ్రీరాముడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం -
గుండెపోటుతో మిలటరీ అధికారి మృతి
తొండూరు : మండల కేంద్రమైన తొండూరు గ్రామానికి చెందిన హవల్దార్ బూచుపల్లి శివప్రకాశ్రెడ్డి (43) గుండెపోటుతో మృతి చెందారు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తొండూరు నుంచి పులివెందులకు కారులో ప్రయాణిస్తుండగా పులివెందుల సమీపంలోని టి.తుమ్మలపల్లి గ్రామం వద్దకు రాగానే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు. ప్రకాష్రెడ్డి పంజాబ్లోని కుర్రోల్పూర్ లో 7 ఆర్టీ బ్రిడ్జి అధికారిగా పనిచేసేవాడన్నారు. సెలవు మీద ఇంటికి వచ్చి వ్యక్తిగత పని మీద పులివెందుల వెళ్తుండగా మార్గ మధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య నాగేశ్వరితోపాటు ముగ్గురు పిల్లలు అక్షిత, జ్యోత్స్న, రిత్విక్ రెడ్డి ఉన్నారు. -
అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్కు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్తో పాటు 18 మందిపై తప్పుడు కేసులను నమోదు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగిస్తే.. హత్యాయత్నం చేసినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్కు పంపించారు. తాజాగా ముగ్గురు బాలురుతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా టీడీపీ వారిపై హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.బాలురుపై హత్యాయత్నం కేసు పెట్టి జువైనల్ హోమ్కు పోలీసులు తరలించారు. ఈ రెండు కేసులపై హైకోర్టుకు వెళ్లిన బాధితులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు నివేదించారు. రెండు కేసుల్లో విచారణను వెంటనే నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. -
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీనం
చాపాడు: ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీన ప్రక్రియ జరిగిందని ఈ క్రమంలో చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్లో గల 3, 4, 5 తరగతులను సమీపంలోని మోడల్ స్కూల్లో విలీనం చేశామని జిల్లా విద్యాధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ నుంచి మండలంలోని చియ్యపాడు దళితవాడ, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్ల విలీనంపై తల్లిదండ్రుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. రెండు గ్రామాల్లోని స్కూల్ల నుంచి మోడల్ స్కూల్లకు విద్యార్థులను తమ తల్లిదండ్రులు పంపించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా విద్యాధికారి షంషుద్దీన్ ఆయా గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ జీఓ నెంబర్–27 ప్రకారమే విలీనం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపమని నిరసన తెలియజేస్తుండటంతో వారితో చర్చిస్తున్నామన్నారు. మోడల్ స్కూల్కు విద్యార్థులను పంపడం వల్ల ప్రతి తరగతికి అన్ని రకాల వసతులతో ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారన్నారు. నిరసన తెలిపే గ్రామాల్లోని పాఠశాలలను కొనసాగించాలా లేక మోడల్ స్కూల్లో విద్యార్థులను విలీనం చేయాలా అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉంటుందన్నారు. పాఠశాల కమిటీ, తల్లిదండ్రులతో కలసి సమావేశాన్ని నిర్వహించుకుని నివేదికను తమకు ఇస్తే దీనిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రవిశంకర్, వంశీకృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని యథావిధిగా పాఠశాలలను తమ గ్రామంలోనే కొనసాగించాలని మండలంలోని సిద్దారెడ్డిపల్లెకు చెందిన దళితవాసులు, గ్రామ పెద్దలు మంగళవారం ఎంపీడీఓ వీరకిషోర్, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. విలీనంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను ఉన్నతాధికారులుదృష్టికి తీసుకెళ్తాం చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లెదళితవాసులతో సమావేశమైనడీఈఓ షంషుద్దీన్ -
పాలిసెట్ కౌన్సెలింగ్కు 220 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న మంగళవారం నాల్గవ రోజు కౌన్సెలింగ్కు 220 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 50001వ ర్యాంకు నుంచి 68 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆపీసర్ పద్మజ, వెరిఫికేషన్ ఆఫీసర్లు ప్రసాద్, ప్రశాంతి, ప్రసన్నలతోపాటు రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... నేడు నిర్వహించబోయే కౌన్సిలింగ్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 68001 నుంచి 86 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. పర్యాటక వ్యయంపై జాతీయ సర్వే కడప సెవెన్రోడ్స్: దేశీయ పర్యాటక వ్యయం, జాతీయ గృహస్థ ప్రయాణంపై జాతీయ గణాంక శాఖ 80వ విడత సర్వే చేపడుతోంది. ఈ సర్వే ఈ ఏడాది జులై నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగనుంది. వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు ఆ శాఖ సహాయ సంచాకులు గంపా శ్రీనివాసరావు తెలిపారు. గృహస్తుల రోజువారి ప్రయాణాలు, వాటిపై ఖర్చు, రవాణా మార్గాలు, వసతులు, ఆహార వసతులు తదితర విషయాలను సర్వేలో తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించిన శిక్షణ తరగతులు కడపలో నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. -
జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు
వేంపల్లె : జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ తెలిపారు. మంగళవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, గృహేతరాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి విద్యుత్ బకాయలు ఉన్నాయన్నారు. అందులో రూ.21 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులు సుమారు రూ.700 కోట్లు వసూలు చేశామన్నారు. ప్రతినెలా లో టెన్షన్ విద్యుత్, హై టెన్షన్ విద్యుత్తు సరఫరాకు సంబంధించి దాదాపు రూ.200కోట్లు వసూలు అవుతుందన్నారు. జిల్లాలో 60 విద్యుత్ సబ్ స్టేషన్లు(33/11కేవీ) అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్కు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే కనెక్షన్ ఇచ్చేందుకు ఇబ్బందులు లేవన్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలవల్ల వినియోగదారులకు అధిక బిల్లులు వస్తాయని, ఈ బిల్లులు 2026 మార్చి వరకు కొనసాగుతాయన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధంగా కూడా అధిక బిల్లులు రావన్నారు. ప్రస్తుతం 200 యూనిట్లు పైబడిన వారికి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నామని, త్వరలోనే ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లను బిగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6.75 లక్షల గృహాలకు మీటర్లు ఉన్నాయని, అంతేకాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సోలార్ బిగించుకోవాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇదివరకే జిల్లా వ్యాప్తంగా 700 గృహాలకు సోలార్ ప్యానల్ను బిగించినట్లు తెలిపారు. రెండు నెలల్లో 10వేలు సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గృహాలకు సోలార్ కనెక్షన్ బిగించుకోవడం వల్ల 90 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. పీఎం సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీతో ఇచ్చే సోలార్ రూఫ్ టాప్కు చెందిన పీఎం సూర్య ఘర్ యోజనను గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో కేజీ సోలార్ సిస్టం ఇంటలేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ పవర్ నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా కరెంటు బిల్లును 90 శాతం తగ్గించుకోవచ్చునన్నారు. ప్రతి ఇంటి రూఫ్ టాప్ మీద 1 కిలో వాట్కు రూ.30 వేలు, 2 కిలో వాట్లకు రూ.60వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు,. అలాగే బీసీ కులాలకు చెందిన వారికి అదనంగా 20 శాతం అంటే రూ.98వేల చొప్పున ప్రభుత్వ రాయితీ లభిస్తుందన్నారు. గృహాలపై సోలార్ పలకలు పెట్టుకోవడం వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ.400లోపే ఉంటాయన్నారు.విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ -
4 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో ఒకటైన సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ వరకు 10 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 4న ఉద యం తిరుమంజనం, రాత్రి అంకురార్పణ, 5న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 6న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 7న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహవాహనం, 8న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతు వాహనం, 9న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 10న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయని తెలిపారు. 11న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 13న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కాశినాయన : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని వరికుంట్ల కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, నరసాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరికుంట్ల కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో వంటశాల, స్టోర్ రూంను ఆయన పరిశీలించారు. నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ రిజిస్టర్ రాయకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ బాబుకు మెమో ఇచ్చారు. అనంతరం నరసాపురం మోడల్పాఠశాలను తనిఖీ చేసి స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు గుడ్డు ఇవ్వలేదని తెలుసుకుని ప్రిన్సిపాల్ సౌజన్యను ప్రశ్నించారు. కలసపాడు : మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో టిఫెన్ మెనూలో మార్పులు ఉంటాయన్నారు. -
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్దేశ పూర్వకంగా తమపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా భూ ఆక్రమణలను, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయన మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్పై సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేశారన్నారు. సోమవారం రాత్రి ఎంపీపీ స్థలంలోని నిర్మాణాలను కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి అనుచరులు, టీడీపీ కౌన్సిలర్ మునీర్ జేసీబీతో పడగొట్టారన్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్థలం తనదని శేఖర్ వద్దకు మునీర్ రాగా ఆయన నిజం నిగ్గు తేల్చాలని పోలీస్ స్టేషన్కు దాదాపు 10 మార్లు తిరిగారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు కావడంతో పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి నిజాలను బయటికి వెల్లడించలేదన్నారు. వాస్తవానికి రూ.500 స్టాంప్ పేపర్పై టీడీపీ వర్గీయులు చూ పించిన డాక్యుమెంట్కు సంబంధించిన సర్వే నంబర్ 547 ప్రొద్దుటూరు మున్సి పాలిటీ పరిధిలోని రామేశ్వరం గ్రామ పొలానికి సంబంధించిందన్నారు. ఈ ఆఽ దారాలు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లేవని, కేవలం దొంగ సంతకాలు, సీళ్లు వేసి తయారు చేసిన వాటిని చూపుతున్నారన్నారు. ప్రొద్దుటూరులో నకిలీ స్టాంప్లు, దొంగ సంతకాలు వ్యాపారం జోరుగా సాగుతోందని తెలిపారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విచ్చల విడిగా కబ్జాలు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివచంద్రారెడ్డి ఎన్నికై నప్పటి నుంచి విచ్చల విడిగా భూ కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ ప్రభావం కారణంగానే అక్కడ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఒక ముఠా ఏర్పడి దొంగ సంతకాలు, నకిలీ స్టాంప్లు తయారు చేస్తోందన్నారు. ఈ విషయంపై విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఎంపీపీ, సర్పంచ్ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండాపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎన్నో భూ ఆక్రమణలను, కబ్జాలు జరిగాయని తెలిపారు. అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్, ఉప సర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, తొగటవీరక్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, ఎంపీటీసీ ఓబయ్య యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు శివ పాల్గొన్నారు. ఎంపీపీ స్థలానికే దిక్కు లేదు ఫేక్ డాక్యుమెంట్లపై ఐజీకి ఫిర్యాదు కొత్తపల్లె పంచాయతీలో విచ్చలవిడిగా భూ కబ్జాలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
పాము కాటుతో మహిళ మృతి
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురంలో మంగళవారం పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. మృతురాలి కుమారుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రమీల (57) ఇంటి వద్ద మధ్యాహ్న సమయంలో దుస్తులు ఉతుక్కుంటున్న సమయంలో పెద్ద నాగు పాము ఆమెను కాటేసింది. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి హుటాహుటిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పులివెందుల తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. అయితే పాము కాటు వేసిన ప్రాంతాన్ని ప్రమీల తెలపడంతో చుట్టుపక్కల వారు ఇటుకలు తొలగించి ఆ పామును చంపివేశారు. ముంబై–చైన్నె రైలులో దోపిడీకడప కోటిరెడ్డిసర్కిల్ : ముంబయి నుంచి చైన్నె వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22159) రైలులో మంగళవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి వద్ద ఎస్1, ఎస్2 కోచ్లలో దోపిడీ జరిగింది. కడప రైల్వే సీఐ సుధాకర్రెడ్డి కథనం మేరకు.. తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద దుండగులు సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో రైలు ఆగిపోయింది. బోగీల్లోకి దుండుగులు చొరబడ్డారు. రైలులో విశాలాక్షి అనే మహిళ డీఎస్సీ పరీక్ష విధుల నిమిత్తం కడపకు వస్తుండగా ఆమె మెడలో ఉన్న 2.7 గ్రాముల బంగారు చైనును దుండగులు లాక్కెళ్లారు. ఈమేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తిరిగి గుత్తికి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేస్తానని రైల్వే పోలీసులకు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తాము గుత్తి పోలీసులకు కూడా సమాచారం అందించామని సీఐ వివరించారు. -
తల్లీబిడ్డలు అదృశ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైనట్లు రిమ్స్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన కథనం మేరకు...రాజేశ్వరి అనే మహిళ తన బిడ్డలైన గురు రాజేశ్వరి, గురు ఈశ్వరితో కలిసి ఈనెల 13వ తేదీన పిల్లలకు స్కూలులో వదిలి పెడతామని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.బంగారు గొలుసు చోరీవల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని ఎస్సీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఎస్సీ కాలనీకి చెందిన బూసిపాటి శ్యామల తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా దుండగులు ప్రహరీ దూకి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ పెద్ద ఓబన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించి తనిఖీలు నిర్వహించారు.అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకలసపాడు : మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన రాచకొండు వెంకటరమణ (55) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ గ్రామంలో రెండు ఎకరాల సొంత పొలంతోపాటు 10 ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశాడు. ఈ క్రమంలో పంటల సాగుకు రూ.18లక్షలు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేక మంగళవారం తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఇద్దరు మట్కా బీటర్ల అరెస్టుకడప కోటిరెడ్డిసర్కిల్ : స్థానిక నాగరాజుపేటలో ఇద్దరు మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ అమరనాథ్రెడ్డి తెలిపారు. సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు తన బృందంతో నాగరాజుపేట సమీపంలో మట్కా ఆడుతున్న సంజామల మధు, కోడేదుల మాబుసుబాన్లను అరెస్టు చేసి రూ. 2850 నగదు, మట్కా స్లిప్పులను స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
చాపాడు : స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటీవల విడుదల చేసిన డిప్లొమో ఫస్టియర్, సెకెండియర్ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డిప్లమో హెచ్ఓడీ జే.రమేష్బాబు తెలిపారు. ఫస్టియర్ సీఎంఈలో ఎం.కళ్యాణి 98.30, ఎం.శ్రీవర్ని 94.20, బీఎస్.బీబీ ఖతీజా, పి.అజయ్కుమార్ 91.60, షేక్ బాబా రియాజ్ 90.90, సయ్యద్ లిక్తియా 90,50, ఈసీఈలో కె.పూర్ణ అక్షయ 98.27, ఎం.ఉషశ్రీ 94.72, బి.వెంకట అనూష 90.90, పి.లక్ష్మి సుజన 95.72, ఎన్.భవిత 94.54, పి.ఆదికేశవరెడ్డి 94.54, ఎస్కే సనాఅఫీఫా 93.90 శాతం మార్కులు సాధించారన్నారు. ఈఈఈలో షేక్. మహమ్మద్ జుబేర్ 95.70, బి.మహ్మద్ యాసిన్ 86 శాతం మార్కులు సాధించగా, సెకెండియర్ సీఎంఈలో జి.కీర్తితేజ 98.88, ఎం.వెంకటలక్ష్మి 95.44, జి.చంద్రిక 95.22, పి.గంగశృజన 97.11, పి.స్నేహ 95.55, పి.అంజనీదేవి 93.77, ఈసీఈలో బి.లాస్య 98.90, కె.వెంకటస్వప్న 97.90, కె.జాహ్నవి 97.10, కె.మెహజాబి 98.90. పి.రమ్యశ్రీ 97.50, ఎన్.గురుశ్రావ్య పూజిత 95.80, ఎస్.రహిమున్నీస 95.80, ఈఈఈలో సి.మునికుమార్ 97.60, ఆర్.దినేష్రెడ్డి 96.00, ఎన్.లోకేష్ 92.30 శాతం మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ కాలేజీ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల కరస్పాండెంట్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి, సీఈఓ వి.లోహిత్రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డాక్టర్ జి.శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శృతి, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. -
ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో మంగళవారం మూడో రోజు కడప జట్టు చిత్తూరు జట్టుపై ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 30.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో 329 పరుగులతో కడప జట్టు ఘన విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని సోహన్రెడ్డి 47, సాయి చరణ్ 30 పరుగులు చేశారు. కడప జట్టులోని నాగకుళ్లాయప్ప 5 వికెట్లు, చరణ్ 4 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 399 పరుగులు చేయగా చిత్తూరు 97 పరుగులకు ఆలౌట్ అయింది. కడప జట్టు రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డ్రాగా ముగిసిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్ వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 78.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 415 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 155 బంతుల్లో 170 పరుగులు, మన్విత్రెడ్డి 106 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని నౌషన్ కళ్యాణ్ 3 వికెట్లు, మల్లికార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 9 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 464 పరుగులు చేయగా కర్నూలు జట్టు 171 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. -
గురుకుల హాస్టల్ టెండర్లలో ఉద్రిక్తత
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని గురుకుల పాఠశాల హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే టెండర్ల దాఖలు విషయంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప, వేంపల్లె, మైలవరం గురుకులాల హాస్టళ్లకు కోడిగుడ్లు, చికెన్, పాలు, కూరగాయలు, అరటిపండ్లు తదితర సరుకులు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ వద్ద టెండరు బాక్సును ఏర్పాటు చేశారు. టెండర్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు తుది గడువు విధించారు. దీంతో అధికార పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు టెండరు దాఖలు చేసేందుకు వచ్చారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం వనిపెంటకు చెందిన కొందరు కడపకు సంబంధించి టెండరు దాఖలు చేసేందుకు వచ్చారు. దీనికి కమలాపురం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డు తగిలారు. తాము మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన టెండర్లు దాఖలు చేయలేదు గనుక మీరు కూడా కడపకు సంబంధించి టెండరు వేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరెవరి నియోజకవర్గాల పరిధిలో వారు టెండర్లు దాఖలు చేసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. దాఖలైన టెండర్లను బుధవారం పరిశీలించనున్నారు. కలెక్టరేట్లోనే బాహాబాహీకి యత్నం పోలీసు బందోబస్తు ఏర్పాటు -
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన బీసీ నేతలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, వైఎస్సార్ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు ఎన్. శివరామ్ కలిశారు. మంగళవారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పలు విషయాలను వివరించారు. ముఖ్యంగా జిల్లా బీసీ విభాగం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్లో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా బీసీ విభాగం ఎలా పనిచేస్తుందో విధి విధానాల గురించి వివరించారు. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ మీలాంటి వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మోస పూరిత హామీలపై ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఎన్ఆర్ఐలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ ఎన్ఆర్ఐలు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు ఆయనను కలిసి ప్రవాసాంఽధ్రుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మన తెలుగువారు జాగ్రత్తలు తీసుకోవాలని, భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ద్వారా సందేశం ఇవ్వాలని వారికి సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఏ. సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ ఐటీ ఇన్చార్జి షేక్ అఫ్సర్ అలీ, బీసీ సభ్యుడు నరసింహ యాదవ్, మైనార్టీ సభ్యుడు షేక్ నాసర్, ఖతార్ మైనార్టీ ఇన్చార్జి షేక్ దర్బార్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం తగదు
కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం డివిజన్ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక డివిజనల్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం మరోమారు చేపట్టనుందని, దీనిని ప్రతిఘటిస్తున్నామన్నారు. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. 3,4 తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాలన్నారు. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు సిద్ధపడుతున్నాయని, ఎల్ఐసీలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు వసుప్రద, వారిజాతమ్మ, కేసీఎస్ రాజు, అమీనా పర్వీన్, రత్న కిషోర్, శ్రీవాణి, శశికళ, కుమార్, రఘు, చిన్నయ్య, గౌస్, హనుమ తదితరులు పాల్గొన్నారు. జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం నిరసన ప్రదర్శనలో ఎల్ఐసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి -
అంతులేని దోపిడీ.. అరికట్టేవారేరీ!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఒకవైపు అధిక ఫీజుల వసూళ్లు, మరోవైపు విద్యాసామగ్రి అమ్మకాల పేరుతో దోపిడీ పర్వం యమ దర్జాగా సాగుతోంది. దీంతో పేద, మద్య తరగతి తల్లిదండ్రులకు దిమ్మతిరుగుతోంది. దీనికితోడు కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు బలవంతంగా అంటగడుతున్నారు. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు వందల్లో ఉంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ముద్రించిన పుస్తకాల ధరలు మాత్రం వేలల్లో ఉంటున్నాయి. ఇదేమని అడిగేవారే కరువయ్యాయని తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పుస్తకాలే కొనాలి.. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ సూళ్ల యాజమాన్యాలు తాము ముద్రించిన తమ సిలబస్ పుస్తకాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్డర్ వేస్తున్నారు. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు 5000 నుంచి 6500 వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు 6 వేల నుంచి 10 వేలు పైనా వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్కై తే మరింత ఎక్కువ ఉంటుందని వాపోతున్నారు. దీంతోపాటు నీట్, ఐఐటీ, ఒలంపియాడ్, సీ బ్యాచ్, టెక్నో వంటి పలు రకాల పేర్లతో అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఇదంతా ఆర్థిక భారమైనా.. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తుందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల బ్రాంచు పుస్తకాలు, యూనిఫాం ఇతర సామగ్రితో వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అరికట్టేవారే కరువు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాసామగ్రిని తమ పాఠశాలల్లోనే దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా అరికట్టడంలో విఫలమవుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు స్వయంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు విద్యార్థి సంఘాలు కూడా పాఠశాలల వద్ద, డీఈఓ కార్యాలయం, ఆర్ఐవో కార్యాలయం వద్ద పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు రద్దు చేయాలి చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లోనే పుస్తకాలు, విద్యాసామాగ్రి అమ్మకాలు చేస్తున్నా పాఠశాలలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో అధికారుల ధోరణి సరికాదు. నిబంధనలు పాటించకుండా అమ్మకాలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – జయవర్థన్, అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికళాశాలల్లో కూడా... జిల్లాలో కార్పొరేట్, ప్రై వేటు కళాశాలల్లో కూడా ఫీజుల దొపిడీ సాగుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారుల కు పిర్యాదు చేసిన స్పందన లేదు. – అంకన్న, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అధిక ఫీజుల విషయంలో... జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు పలు రకాల ఫీజుల పేరుతో తల్లితండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రైవేటు, కార్పోరేటు యాజమాన్యలు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. – సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి విద్యాలయాలా...వ్యాపార కేంద్రాలా? ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో యథేచ్ఛగా పుస్తక విక్రయాలు అధిక ధరలకు పుస్తకాలు,యూనిఫాం, ఇతర సామగ్రి నిద్దురపోతున్న విద్యాశాఖ అధికారలు -
పంచాయతీరాజ్ ఎస్ఈకి పదోన్నతి
కడప సెవెన్రోడ్స్: పంచాయతీరాజ్ జిల్లా పర్యవేక్షక ఇంజనీరుగా పనిచేస్తున్న జీవీ శ్రీనివాసులురెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీఓ ఆర్టీ నెంబరు 528 జారీ చేసింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఈనెల 30న రిటైర్ కాబోతున్న ఎన్.కృష్ణారెడ్డి స్థానంలో జీవీ శ్రీనివాసులు రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నేడు నిరసన కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు బుధవారం నిరసన చేపడుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద వైఖరితో ఇజ్రాయులకు మద్దతుగా ఇరాన్ పై ప్రత్యక్ష యుద్ధానికి దిగడం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన వైఖరి అని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ, ఇజ్రాయిల్ మారణ హోమాన్ని ఆపాలని, దేశవ్యాప్తంగా జూన్ 25వ తేదీ అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, అంతర్జాతీయ న్యాయ చట్టాలు కాపాడాలని, సామ్రాజ్యవాదం నశించాలని తెలియజేస్తూ దేశ ప్రజల నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బాదుల్లా, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి కే.సుబ్బరాయుడు, జిల్లా నాయకులు డి.గోపి, నరసింహారావు, సీపీఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ రాము, ఆర్.ఎం.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రమణయ్య, సీపీఐ (ఎంఎల్) లేబరేషన్ జిల్లా కార్యదర్శి బి.ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎంఏలో 44వ ర్యాంకు లక్కిరెడ్డిపల్లి: మండల పరిధి అనంతపురం పంచాయతీలోని గుడ్లవారిపల్లికి చెందిన గూడె వెంకటరమణ సీఎంఏలో ఆల్ ఇండియా కోటాలో 44వ ర్యాంకు సాధించారు. ఈ విద్యార్థి మంగళవారం ఢిల్లీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వెంకటరమణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఐదో తరగతి వరకు లక్కిరెడ్డిపల్లి విశ్వభారతి హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి వరకు, ఇంటర్ గుంటూరు మాస్టర్ మైండ్ కళాశాలలో చదివారు. ఉత్తమ ర్యాంకు సాధించేందుకు తల్లిదండ్రులు సహదేవరెడ్డి, రెడ్డమ్మ, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. వెంకటరమణ దేశ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఉర్దూ’ నేర్చుకోవడానికి దోహదం రాయచోటి టౌన్: ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ‘ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోండిలా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అజీజియా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో రచయిత అబ్దుల్ వహీద్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, త్వరగా నేర్చుకునే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండవ భాషగా ఉర్దూను ఎంచుకున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అనంతరం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ షేక్ మహమ్మద్ హషీం, పాలం రాజ, గోపాల్, బాబా ఫకృద్దీన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎంపీపీపై దాడి
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్యాదవ్, ఆయన సతీమణి సోములవారిపల్లె సర్పంచ్ శాంతిపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఖాదర్బాద్లో ఉన్న తమ స్థలంలోని నిర్మాణాలను కూలుస్తున్నారని సమాచారం తెలియడంతో శేఖర్యాదవ్ దంపతులు హుటా హుటీన ఘటనా వెళ్లారు. అక్కడికి వెళ్లగానే 19 వార్డు కౌన్సిలర్ మునీర్, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పెద్ద గండం తప్పినట్లైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సానబోయిన శేఖర్యాదవ్ ఆరు నెలల క్రితం కొత్తపల్లె పంచాయతీలోని ఖాదర్బాద్ గ్రామంలో 489–2 సర్వే నంబర్లో 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇటీవల తాత్కాలిక షెడ్డు పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 19 వార్డు కౌన్సిలర్ మునీర్, శివచంద్రారెడ్డి అనుచరులు ఆ నిర్మాణాలను రాడ్డులతో కూల్చే ప్రయత్నం చేశారు. అయితే రాడ్డులతో నిర్మాణాలు కూలకపోవడంతో జేసీబీని తెప్పించారు. అప్పటికే విషయం తెలుసుకున్న ఎంపీపీ సానబోయిన శేఖర్యాదవ్, ఆయన భార్య సర్పంచ్ శాంతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎందుకు కూలుస్తున్నారని వారిని ప్రశ్నిస్తుండగా ఇక్కడ నీ స్థలం ఎక్కడ ఉందంటూ టీడీపీ నాయకుల అనుచరులు వారిపై దాడి చేశారు. విషయం తెలియడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డితో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సూచన మేరకు ఎంపీపీ శేఖర్యాదవ్ రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. తనతో పాటు తన సతీమణి ఎస్సీ కులస్తురాలైన శాంతిని కులం పేరుతో ధూషించారని శేఖర్యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వరద’ రాజ్యంలో విధ్వంసం .. తాను శాంతి కాముకుడను.. నిజాయితీగా పని చేస్తానని ఎప్పుడు గొప్పలు చెప్పుకునే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నియోజకవర్గంలో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఎంపీపీ శేఖర్యాదవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బీసీ ఎంపీపీతో పాటు దళిత మహిళా సర్పంచ్పై దాడికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలు చెప్పే మాటలకు, జరిగే సంఘటనలకు సంబంధం ఉండదన్నారు. ఆరు నెలల క్రితం ఖాదర్బాద్లో టీడీపీ నాయకుల వద్దనే 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్ కొనిరెడ్డి చంద్రారెడ్డి, కౌన్సిలర్ మునీర్లు కలిసి సబ్రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన సీళ్లను తయారు చేశారన్నారు. ఇప్పుడు వెళ్లి చూసినా పంచాయతీ కార్యాలయంలో దొంగ సీళ్లు ఉంటాయన్నారు. వాటి ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కొండారెడ్డి చెప్పారని ఎస్ఐ అరుణ్రెడ్డి కేసును పట్టించుకోలేదన్నారు. రెండు నెలలుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానన్నారు. తన స్థలం వద్దకు వెళ్తే ఇది శివచంద్రారెడ్డి అడ్డా అంటూ తమపై దాడి చేశారని తెలిపారు. షరీఫ్, గౌస్, మునీర్ తమ్ముడు, మరో 15 మంది శివచంద్రారెడ్డి అనుచరులు తమపై దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. స్థల వివాదంలో ఎంపీపీ, ఆయన సతీమణి శాంతిపై దాడి చేసిన టీడీపీ అనుచరులు కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలోనే సబ్రిజిష్టర్ ఆఫీసు సీళ్లు తయారి తద్వారా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించిన టీడీపీ నాయకులు మీడియాతో ఎంపీపీ శేఖర్యాదవ్, ఆయన సతీమణి సర్పంచ్ శాంతి -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ మైనార్టీ ఐటీఐలో రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ ఐటీఐ ప్రధానచార్యులు జ్ఞానకుమార్ తెలిపారు. ఇందులో ఎలక్ట్రీషన్, కంప్యూటర్(కోపా), డిజిటల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి పాస్, లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వారి 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్లో ఆన్లైన్లో iti.apgov.inలో రిజిస్టర్ చేసుకోవాలని తెలి పారు. దరఖాస్తు చేయుటకు జులై 15వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వివరాలకు 9642602764, 8074577318 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ వివరించారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశాలకు... కడప ఎడ్యుకేషన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు జులై 27వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలు www.navodaya. gov.in అను వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈఓ వివరించారు. ఆసుపత్రి సీజ్ పోరుమామిళ్ల: పట్టణంలోని సాయిలీల ఆసుపత్రిని సోమవారం ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేయడంతో పాటు తాళం వేశారు. ఇటీవల ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మల్లేష్, విచారణ అధికారి డాక్టర్ శివప్రసాదరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. రిజిష్ట్రేషన్ గడువు ముగిసినా ఆసుపత్రి కొనసాగిస్తున్నారని గుర్తించి ఆసుపత్రిని మూసివేశారు. వారి వెంట పోరుమామిళ్ల మెడికల్ ఆఫీసర్ శ్రీవిద్య, ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ వెంకటేష్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో 163 మందికి చోటు కడప ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ప్రవేశాలకు సంబంధించి వైఎస్సార్ జిల్లా నుంచి 163 మంది విద్యార్థులకు చోటు లభించింది. ఇందులో నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 28 మందికి, ఆర్కేవ్యాలీ క్యాంపస్లో 69 మందికి, ఒంగోలు ట్రిపుల్ఐటీ క్యాంపస్లో 46 మందికి, శ్రీకాకులం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 20 మందికి సీట్లు లభించాయి. చెమ్ముమియాపేట బాలికల హైస్కూల్లో 5 మందికి... కడప నగరంలోని చెమ్ముమియాపేట బాలికల హైస్కూల్కు చెందిన ఐదు మంది విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇందులో యువశ్రీ, మానస, బాను, గాయత్రి, లక్ష్మి సుస్మ ఉన్నారు. వీరికి పూర్వపు ప్రధానోపాధ్యాయురాలు మేరీ అభినందించారు. ప్రశాంతంగా మూడో రోజు కౌన్సెలింగ్ కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న మూడోరోజు పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 32001వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. మూడవ రోజు కౌన్సెలింగ్కు 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆపీసర్ దామోధర్, వెరిఫికేషన్ ఆఫీసర్లు అనిత, బాగ్యశ్రీ, రేణుకా, రాజేష్లతోపాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... నేడు నిర్వహించబోయే కౌన్సెలింగ్ కార్యక్రమా నికి జిల్లావ్యాప్తంగా 50001 నుంచి 68 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు హాజరుకావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఇచ్చే వరకూ పోరాటం
రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చే వరకూ పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పోరాటం చేస్తేనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, అందులో కూడా 50 శాతం మందికి నగదు జమ కాలేదన్నారు. విద్యాకానుక, వసతి దీవెన పథకాలు సక్రమంగా అమలు కాలేదన్నారు. విద్యార్థులకు యూనిఫారం ఇచ్చారే తప్పా షూ, బ్యాగ్, టై, బెల్టు వంటివి ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
అంగన్వాడీలకు పథకాలు వర్తింపజేయాలి
కడప సెవెన్రోడ్స్: రాష్ట్రంలోని అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి, మనోహర్, అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, లక్ష్మిదేవి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వేతనాలు పెంచలేదన్నారు. రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ, అంగన్వాడీ వర్కర్లు రూ. 11,500, హెల్పర్లు, మినీ వర్కర్లు రూ. 7000 మాత్రమే గౌరవ వేతనం పొందుతున్నప్పటికీ వారికి సంక్షేమ పథకాలు అందించకపోవడం విచారకరమన్నారు. అంగన్వాడీలకు తల్లికి వందనం ఇవ్వాలని, రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వ ఉద్యోగులంటూ తిరస్కరించడం భావ్యం కాదన్నారు. వీటితోపాటు లేబర్ కోడ్స్ రద్దు చేసి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగలుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీఓ జారీ చేయాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి ఆదిరెడ్డి రామ్మోహన్రెడ్డి, సీఐటీయూ నాయకులు చంద్రారెడ్డి, సత్యనారాయణ, ఐఎన్సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా -
భవితకు ఆదరువు
ఓపెన్ స్కూల్ చదువు.. ● ఓపెన్ స్కూల్స్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు జులై 31 వరకు గడువు ● 14 ఏళ్లు నిండిన వారు పదికి,15 ఏళ్లు నిండిన వారు ఇంటర్కు అర్హులు ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అపరాధ రుసుం లేకుండా జులై 30 తేదీలోగా ఆన్లైన్లో అడ్మిషన్ పొందవచ్చు. పదవ తరగతికి సంబంధించి జనరల్ పురుషులకు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కలిపి రూ. 1550, అన్ని వర్గాల స్ట్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్సీ పురుషులకు రిజిస్ట్రేషన్, అడ్మిఫన్ పీజు రూ. 1150 చెల్లించాల్సి ఉంది. అలాగే ఇంటర్కు సంబంధించి జనరల్, పురుషులకు రూ. 1800, అన్ని వర్గాల మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మైనార్టీలకు రూ. 1500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కడప ఎడ్యుకేషన్: చదువు మధ్యలో ఆగిందనో.. వయసై పోయిందనో దిగులు చెందాల్సిన అవసరం లేదు.. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు... చదువు కోవాలనే తపన ఉండాలేకానీ చదువు కోవడానికి.. సర్టిఫికెట్లు పొందడానికి వయసు అడ్డంకి కానేకాదిప్పుడు. వివిధ కారణాలలో విద్యకు దూరమైన వారు తిరిగి తమ చదువు కొనసాగించేందుకు విద్యాశాఖ దూర విద్యా విధానంలో సార్వత్రిక విద్యాపీఠం(ఏపీ ఓపెన్ స్కూల్) ద్వారా పది, ఇంటర్ విద్యను కొనసాగించే అవకాశం కల్పించింది. ఉన్నత విద్యకు సోపానం ఉద్యోగాల పదోన్నతులకు, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఈ పథకం 1991లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అప్పట్లో దీనికి పెద్దగా ఆదరువు లేకపోయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకానికి మహర్దశ పట్టింది. దూర విద్య ద్వారా పదవ తరగతి అనే పథకం తిరికి అమలు లోకి తీసుకోచ్చారు. దీంతోపాటు తిరిగి 2010–11లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ సొసెటీ ద్వారా పొందే ఇంటర్, పదవ తరగతి సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్, కళాశాలల్లో పొందే సర్టిఫికెట్లతో సమానం అని ప్రభుత్వ ప్రకటించింది. దీంతో మరింత ఆదరణ లభించింది. జిల్లాలో స్టడీ సెంటర్ల వివరాలు ఇలా ... జిల్లావ్యాప్తంగా పదవ తరగతికి 70 స్టడీ సెంటర్లు, ఇంటర్మీటియట్కు సంబంధించి 70 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఈ విధానంలో విద్యా విషయక సబ్జెక్టులతోపాటు వృత్తి విద్యా సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూల్ ధ్రువపత్రం ద్వారా ఉన్నత చదువులు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించవచ్చు. ఇంటర్కు సంబంధించి సైన్సు గ్రూపులతోపాటు ఆర్ట్స్ గ్రూపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసేందుకు వయో పరిమితి లేదు. అర్హతలు ఇవే... పదిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్ట వయో పరిమితి ఉండదు. చదవడం, రాయడం తెలిసి ఉండాలి. దరఖాస్తుతోపాటు టీసీ, రికార్డు సీటు, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే ఇంటర్మీడియట్లో చేరే వారికి ఆగస్టు 31వ తేదీ నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇంటర్కు 10వ తరగతి మార్కుల జాబితా, పదవ తరగతి టీసీని దరఖాస్తుతోపాటు అందజేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, విద్యాంగ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాన్ని అందచేయాల్సి ఉంటుంది. ఇతర సమాచార కోసం www. apopenschool.org వెబ్సైట్ను సంప్రదించాలి. సెలవుల్లో తరగతుల నిర్వహణ... ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ అడ్మిషన్ పొందిన వారికి సాధారణ విద్యకు భిన్నంగా సార్వత్రిక తరగతులను నిర్వహిస్తారు. ఓపెన్ స్కూల్ చదువు సంబంధించిన క్లాసులను సెలవు రోజుల్లో నిర్వహిస్తారు. ఎంపిక చేసిన స్టడీ సెంటర్లలో జరిగే తరగతులకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్ సైన్సు గ్రూపునకు సంబంధించి ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షల క్లాసులకు హాజరుకావాలి. ప్రతి అభ్యాసకుడు కనీసం 30 తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రవేశ వివరాలు తేదీ ప్రవేశాలు ఇలా... అడ్మిషన్లు ప్రారంభం తేదీ 12–06–2025 ఆన్లైన్ చేయడానికి చివరితేదీ 30–07–2025 ఫీజు చెల్లించడానికి చివరితేదీ 31–07–2025 అడ్మిషన్ల వివరాలు... 2023–23 విద్యా సంవత్సరం: 6885 2024–25 విద్యా సంవత్సరం: 7694 నోటిఫికేషన్ వెలువడింది ఈ ఏడాదికి సార్వత్రిక విద్యా ప్రవేశాలకు సంబంధించి నోటిపికేషన్ వెలువడింది. గ్రామీణ బాలికలు, మహిళలకు, యువత,గృ హిణులు, ఉద్యోగులు సైతం సద్వినియోగం చేసుకోవచ్చు. మహిళలకు రాయితీ ఉంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులకు ఫీజుల్లో కూడా రాయితీ ఉంది. –సాంబశివారెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ సద్వినియోగం చేసుకోండి వివిధ కారణాలతో చదువలేక పోయినవారికి, చదువు మద్యలో నిలిపివేసిన వారికి సార్వత్రిక విద్య ఓ వరం లాంటింది. పది, ఇంటర్ పూర్తిచేయడానికి ఈ ఏడాది నోటిఫికేషన్ వెలువడింది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఓపెన్ స్కూల్ను ప్రవేశపెట్టింది. ఓపెన్ స్కూల్ రెగ్యులర్ విద్య సర్టి ఫికెట్తో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి . వైఎస్సార్కడపజిల్లా -
విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్ను దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులుతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ విఫలమైందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజు నియంత్రణతోపాటు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
పాఠశాల తరలించవద్దు
కడప సెవెన్రోడ్స్ : తమ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలించవద్దని అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీలోని రంగంపల్లె కాలనీ వాసులు డిమాండ్ చేశారు. పాఠశాల తరలింపునకు నిరసనగా సోమవారం ఆ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ పాఠశాలను చెన్నంపల్లె నుంచి ఎస్.వెంకటాపురం గ్రామానికి తరలించారన్నారు. ఆ గ్రామానికి పిల్లలు వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదని, చుట్టూ కంపచెట్లు ఉన్నాయని, ఇందువల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే చెన్నంపల్లె గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తే 350 కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. అధికారులు తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాఠశాలను చెన్నంపల్లెలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 399 పరుగులు చేసింది. సోమవారం రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 31.3 ఓవర్లలో 97 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. చిత్తూరు జట్టులో లోహిత్ లక్ష్మీ నారాయణ 22 పరుగులు చేశాడు. కడప జట్టులోని చరణ్రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. శివశంకర్ 2 వికెట్లు, ఆర్దిత్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 44.1 ఓవర్లలో 169 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. కడప జట్టులోని కుళ్లాయప్ప 37, ఆర్దిత్ రెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని తేజేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. సాయి చరణ్ 2 వికెట్లు, ప్రకాశ్రాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం చిత్తూరు జట్టు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 362 ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 123.3 ఓవర్లలో 464 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సయ్యద్ షాహుల్ హమీద్ 89, చైతన్య తేజ 72 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సౌషన్ కళ్యాణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 46.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 49, రోహిత్ 38 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తోషిత్ యాదవ్ బౌలింగ్లో రాణించి 5 వికెట్లు తీశాడు. తేజ, భార్గవ్ మహేష్ రెండేసి వికెట్లు తీశారు. మా కుమారుడిని క్షమాభిక్షపై విడుదల చేయండి కడప కోటిరెడ్డి సర్కిల్ : ఒక హత్య కేసులో గత 15 ఏళ్లుగా కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న తమ కుమారుడు జి.యుగంధర్ (ఖైదీ నెంబర్ 3980)ను క్షమాభిక్షపై విడుదల చేయాలని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన జి.చెంగమ్మ వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. హోం మంత్రి అనితలకు వినతి పత్రాలను పంపారు. వివరాలు ఇలా.. తన కుమారుడు యుగంధర్ జైలులో డిగ్రీ, పీజీ ఎం.ఏ సోషియాలజీ చదివి బంగారు పతకం సాధించాడన్నారు. మూడేళ్లుగా పీఎల్వీగా పనిచేసి జడ్జి మన్ననలు పొందారన్నారు. తన కుమారుడు జైలుకు వెళ్లడం వల్ల తన భర్త కుమారుడి మీద బెంగతో మరణించాడన్నారు. గత ప్రభుత్వంలో తాను, తన భర్త పలుమార్లు అర్జీలు సమర్పించామని తెలిపారు. తన కుమారుడిని విడుదల చేసేందుకు యూ/ఎస్ 364 ఐటీసీ, 302 ఐటీసీ, మైనర్ల సెక్షన్లు అడ్డుపెట్టి విడుదల కాకుండా గత 15 ఏళ్లుగా కడప జైలులో ఉంచారన్నారు. తన భర్త మరణించిన తర్వాత కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 65 ఏళ్లు ఉండటం వల్ల కళ్లు సరిగా కనిపించడం లేదని, మెరుగైన వైద్యం చేయించేవారు ఎవరూ లేరని తన కుటుంబానికి తన కొడుకే దిక్కు అని తెలిపారు. మానవతా దృక్పథంతో తమ కుమారుడికి క్షమా భిక్ష ప్రసాదించి విడుదల చేయాలని ఆమె కోరారు. రిమ్స్లో అనాథ మృతదేహంకడప కోటిరెడ్డి సర్కిల్ : కడప రిమ్స్ మార్చురీలో అనాథ మృతదేహం ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వ తేదీ ఆర్కే నగర్కు చెందిన యు.బాల వెంకటేష్(68) అనే పేరుతో ఓ వ్యక్తిని రిమ్స్లో అడ్మిట్ చేశారన్నారు. ఆయన సోమవారం మృతి చెందాడన్నారు. మృతునికి సంబంధించిన వారు రిమ్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
● చెరువు మట్టి.. చెరబట్టి!
కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది అనడానికి దేవుని కడప చెరువు నుంచి అక్రమంగా తరలిపోతున్న మట్టి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నిబంధనల ప్రకారం సమీప రైతులు ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిను పంటలో సత్తువ కోసం తోలుకుంటారు. కానీ కడప నగరంలో టీడీపీ నేతలు అక్రమంగా టిప్పర్ల ద్వారా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లలలో మట్టిని తోలుకుని లక్షలాది రూపాయల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చేరకుండా కొల్లగొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. దేవుని కడప చెరువు నుంచి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా నిత్యం టిప్పర్లు తరలిపోతున్నాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు భారీ వాహనాల రద్దీతో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ఎస్.కె.మహమ్మద్ రఫీ, సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
కడప ఎడ్యుకేషన్: వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు అందించిన సర్టిఫికెట్ సోమవారం సాయంత్రం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజి అశోక్ కుమార్తో కలిసి అందుకున్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 21న వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ‘ఫ్యామిలీ యోగ థీమ్‘ తో యోగా నిర్వహణకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. -
అర్జీలకు సకాలంలో పరిష్కారం
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేయాలని డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పరిష్కార నిమిత్తం పంపారు. ● జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డెన్ల అక్రమాస్తులపై ఏసీబీ దాడులు చేయించాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎం ఓబులేశు యాదవ్, ఏపీ దళిత మిత్ర సంఘం అధ్యక్షుడు కె.రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. హాస్టళ్లలో కనీస వసతులు లేవని, మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, ఖాజీపేట ప్రాంతాల్లో కొంతమంది వార్డెన్లకు రెండు, మూడు హాస్టల్స్ ఇన్ఛార్జిగా ఇవ్వడంతో అవినీతికి ఆస్కారం కలుగుతోందన్నారు. అధికారులకు ఇవ్వాలంటూ ప్రతినెల ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 50–100 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ● భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన జిల్లా మైనార్టీ శాఖ అధికారి ఇమ్రాన్ను సర్వీసు నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఏ సత్తార్, నజీర్ అహ్మద్, ఆప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ(ఎంఎల్) జిల్లా కన్వీనర్ ఓబయ్య తదితరులు కోరారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఇమ్రాన్ను డిప్యుటేషన్పై జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా నియమించి వక్ఫ్బోర్డు బాధ్యతలు కూడా అప్పగించారన్నారు. ఆ శాఖకు చెందిన రూ. 3.70 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని తినేశారని ఆరోపించారు. ఆయనపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా డబ్బు రికవరీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, డీఈఓ షంషుద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో చెలరేగిపోయిన యువకులు
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల పట్టణం కడప రహదారిలో యువకులు మద్యం తాగి కత్తులు, రాడ్లతో చెలరేగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామానికి చెందిన కొంత మంది యువకులు ప్రత్యేక వాహనంలో ఎర్రగుంట్లకు వచ్చి కడప రహదారిలో ఉన్న మద్యం షాపులో మద్యం తాగారు. బయటికి వచ్చిన తర్వాత ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన యువకులతో గొడవకు దిగారు. దీంతో చాగలమర్రికి చెందిన యువకులు కారులో ఉన్న రాడ్లు, కత్తులను బయటికి తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారు నగలు అపహరణజమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని పాతబస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 6 తులాల బంగారు చోరీ జరిగినట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రవళ్లిక తన భర్తతో కలసి స్వగ్రామమైన పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి వెళ్లేందుకు జమ్మలమడుగు బస్టాండ్కు వచ్చింది. కొద్ది సేపటికి బస్సు రావడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భర్తతో కలసి బస్సు ఎక్కింది. కాసేపటి తర్వాత బ్యాగ్ చూసుకోగా అందులో బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్ కనిపించలేదు. వెంటనే భర్తతో కలసి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. -
పదోన్నతులు కల్పించాకే బదిలీలు నిర్వహించాలి
కడప కార్పొరేషన్ : పదోన్నతులు కల్పించిన తర్వాతే సచివాలయ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఽవారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండానే వివిధ సచివాలయాలకు డిప్యుటేషన్లు వేశారని, ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తెరిచిన నేపథ్యంలో వేరే మండలాలకు, మున్సిపాలిటీలకు బదిలీలు చేస్తే తమ పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు విధుల్లో చేరినప్పటినుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, స్థానిక మండలం, స్థానిక మున్సిపాలిటీల్లోనే బదిలీలు కల్పించాలన్నారు. గుర్తింపు పొందిన అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలన్నారు. రేషనలైజేషన్ తర్వాత మిగిలిన ఉద్యోగులను ఎక్కడ సర్దుబాటు చేస్తారో చెప్పాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న విధంగా డీఏలు, పీఆర్సీ సచివాలయ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు మేయర్ మద్దతు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు మేయర్ సురేష్ బాబు మద్దతు తెలిపారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయన వారికి సంఘీభావంగా ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక మండలాలు, మున్సిపాలిటీల్లోనే వారిని బదిలీ చేయాలని కోరారు. భవిష్యత్లో వారి పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.సచివాలయ ఉద్యోగుల డిమాండ్ -
గంగమ్మకు బోనాల సమర్పణ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా లక్కిరెడ్డి పల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఆదివారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా ..కరుణ చూపు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా దీవించమ్మా అంటూ రైతులు వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. 27 నుంచి ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు మదనపల్లె సిటీ: కేరళలోని కొజికోడ్లో జూన్ 27 నుంచి 30 వరకు ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి అన్నారు. ఆదివారం మహాసభలకు సంబంధించిన పోస్టర్స్ను స్థానికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 50లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థిసంఘంగా ఎస్ఎఫ్ఐ ఉందన్నారు. -
కౌలు రైతులకు కార్డులందేనా
కడప అగ్రికల్చర్: అన్నదాతలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఖరీఫ్ మొదలై 20 రోజులు దాటినా కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర అలసత్వం చూపిస్తోంది. ఫలితంగా కార్డులందక.. రుణాలు దక్కక కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సీజన్కుగాను జిల్లాలో 11000 వేల కౌలు రైతులకు గుర్తింపుకార్డుల పంపిణీ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు కేవలం 102 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. నిజానికి జిల్లావ్యాప్తంగా అధికారంగా 40 వేల మందికిపైగా కౌలు రైతులు ఉన్నట్లు అంచనా కాగా అంతకంటే ఎక్కువగానే జిల్లాలో కౌలు రైతులు ఉన్నారు. కాగా కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించలేదు. గ్రామ సభలు ఏవీ? సాధారణంగా పంటల సీజన్ మొదలవ్వగానే కౌలు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామా ల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేస్తారు. కానీ అలాంటి ప్రక్రియ జరగడం లేదని కౌలు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు పంటలసాగుకు బయట వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కడపజిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 11,000 కౌలు కార్డులు మంజూరు లక్ష్యంగా ఉండగా ఇప్పటికి 102 కార్డులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది కౌలు కార్డుల లక్ష్యం.. 11,000 ఇప్పటి వరకు పంపిణీ చేసిన కౌలు కార్డులు: 102 కౌలు రైతులకు అండగా జగన్ సర్కార్ ఖరీఫ్ మొదలై 20 రోజులు దాటినా అరకొర కార్డులే పంపిణీ బ్యాంకు రుణాల కోసం కౌలు రైతుల ఎదురు చూపులు సకాలంలో కౌలు కార్డులను మంజూరు చేయాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు దాటింది. ఇంత వరకు వందకుపైగా మాత్రమే కార్డు లు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం ముమ్మరం కావాలంటే వ్యవసాయ, రెవిన్యూశాఖలు గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతులకు కార్డుల పంపిణీ ముమ్మరం చేయాలి. కౌలు కార్డులను సకాలంలో ఇవ్వకపోతే రైతు భరోసా, పంట రుణాల పెట్టబడి, పంటలబీమా, సబ్సిడీ విత్తనాలు వంటి అందే పరిస్థితి ఉండదు. – బి. దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కార్డుల పంపిణీ మొదలైంది కౌలు రైతుల కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమైంది. ఈ విషయమై వీఆర్ఓలు, వ్యవసాయ అధికారులతో పర్యవేక్షిస్తున్నాం. ఈ ఏడాది 11 వేల కార్డుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా వందకుపైనే కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేశాం. మిగతా కార్డులను కూడా వీలైనంత త్వర గా పంపిణీ చేసేందుకు కృషి చేస్తాం. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారికౌలు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించి ఒక సారి జారీ చేసిన కార్డును మళ్లీ యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారులు జారీ గణనీయంగా పెరిగింది. అసలు రైతులు మాదిరిగా కౌలు రైతులకు పంట రుణాలు అందించడంతోపాటు రైతు భరోసా, పంటల భీమా పరిహారం అందించి అండగా నిలిచింది. -
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు
రాజంపేట టౌన్: చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాడని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. మండలంలోని బాలరాసపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఆదివారం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్లకు పైగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నా, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. యోగాంధ్రకు చేసిన ఖర్చుతో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. చంద్రబాబునాయుడు పాలన పచ్చ పత్రికల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదయినా ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏడాది కాకముందే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజలు వేలాదిగా తరలి రావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో జగన్కు ఉన్న స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా సాధించలేవన్నారు. ● నందలూరుకు చెందిన రిటర్డ్ రైల్వే డాక్టర్ భాస్కర్ కుమారుడు ధీరజ్కుమార్ గత సివిల్స్ ఫలితాల్లో ర్యాంకు సాధించి మహారాష్ట్రలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి ఆదివారం ఆయనను ఎస్టేట్కు ఆహ్వానించి సత్కరించారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
వీరబల్లి : చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడం నాగభూషణం కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికుల ఖాతాలో సంవత్సరానికి రూ. 24 వేలు జమ చేసేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న మోడం నాగభూషణంను గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శి గాలివీటి వీరనాగిరెడ్డి సన్మానించారు. -
అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా అచీవర్స్ డే
చింతకొమ్మదిన్నె : కడప నగరం రాయచోటి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీలైన టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎంఎఫ్సిస్, ఎంకోరేటా, మెగా స్మార్ట్ సొల్యూషన్స్లలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో అచీవర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2024–2025 విద్యా సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యధిక ఉద్యోగాలు పొందడంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. తమ కళాశాల చైర్మన్ సి.గంగిరెడ్డి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్–ఎస్ విభాగాధిపతి కేఎన్ శశికుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఓ.హోమకేశవ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.