breaking news
YSR
-
జాతరకు వచ్చే మార్గాలు..
గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి భక్తులు చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా మూడు రహదారుల్లో భక్తులు రావొచ్చు. కడప నుంచి రామాపురం మీదుగా చేరుకోవచ్చు. రాయచోటి–కడప జాతీయ రహదారిలో ఉన్న చిట్లూరుకు పడమర వైపు నుంచి రావచ్చు. లక్కిరెడ్డిపల్లి–రాయచోటి మార్గంలోని మర్రిచెట్టు నుంచి తూర్పు వైపున ఉండే రోడ్డు నుంచి, లక్కిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఎదురుగా ఉన్న రోడ్డు నుండి గద్దగుండ్లరాచపల్లి, ఈడిగపల్లి, కౌటపల్లి మార్గాలు ద్వారా గంగమ్మ జాతరకు భక్తులు చేరుకోవచ్చు. తిరునాల కార్యక్రమాలు.. ఈనెల 17వ తేదీ చాగలగుట్టపల్లిలో అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల అమ్మవారికి సిద్దులపూజ, సర్వదర్శనం, బోనాలు, చాందినీ బండ్లు, అమ్మవారి ఊరేగింపు,19న గురువారం మైల తిరునాల ఊరేగింపుతో, గంగ స్నానాలతో అభిషేకంతో తిరునాల ముగుస్తుంది. 18వ తేదీ రాత్రి చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని నాగులకట్టవీధిలో మూడు రోజుల క్రితం జరిగిన సుబ్రమణ్యం హత్య కేసులో నిందితున్ని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను ధూషించినందుకే సుబ్రమణ్యంను వినయ్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ వివరాలను త్రీ టౌన్ పోలిస్స్టేషన్లో ఆదివారం సాయంత్రం సీఐ టీవీ కొండారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గువ్వల సుబ్రమణ్యం కార్పెంటర్గా పని చేస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ రావడంతో యాక్టింగ్ డ్రైవర్గా కూడా వెళ్తుంటాడు. అతను 15 ఏళ్ల క్రితం రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామంలో పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా సుబ్రమణ్యం పనులు చేసుకుంటూ ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. అతను ప్రతి రోజు మద్యం తాగేందుకు వైన్ షాపునకు వెళ్లే క్రమంలో నాగులకట్ట వీధికి చెందిన నవీన్ పరిచయమయ్యాడు. ఇటీవల ఇద్దరు మద్యం తాగే సమయంలో గొడవ పడ్డారు. అక్కడ వారి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని మనసులో పెట్టుకున్న వినయ్ సుబ్రమణ్యంను ఎలాగైనా హతమార్చాలని పథకం రచించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 13న మద్యం తాగేందుకు తన ఇంటికి రావాలని సుబ్రమణ్యంను వినయ్ పిలిచాడు. అతను రాత్రి 8 గంటల సమయంలో నాగులకట్ట వీధిలోని వినయ్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మద్యం తాగేందుకు సిద్ధం అవుతుండగా సుబ్రమణ్యం గొంతు భాగంలో కత్తితో పొడిచి వినయ్ పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని భార్య గువ్వల రమాఅనిత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసులోని నిందితుడు వినయ్ జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం బస్స్టాప్ వద్ద ఉండగా సీఐ కొండారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడ్ని రిమాండుకు తరలించినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. -
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
లక్కిరెడ్డిపల్లి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత జాతర రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి మరుసటి రోజున ప్రారంభమై మూడురోజులపాటు జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనెల 17వ తేదీ రాత్రి చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల, 19న మైల తిరునాల జాతర జరగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆలయ ప్రాశస్త్యం.. గంగమ్మ తల్లి అనారోగ్యానికి గురైన వారికి అభయమిస్తూ, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ భక్తుల పాలిట కల్ప తరవుగా శోభిస్లుతోంది. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం, అనంతపురం గ్రామంలో కొలువుదీరి ఉంది. మహాశివరాత్రి ముగిసిన రెండోరోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూరురాజుగారిపల్లి గ్రామంలోని చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ దేవత ఉత్సవ విగ్రహాన్ని బ్యాండు మేళాల మధ్య అప్పలరాజుగారిపల్లి, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లిల మీదుగా గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. దారి పొడవునా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సిద్దులపూజతో సిద్దుల ప్రసాదాన్ని సంతానం లేక వరపడిన మహిళలకు అందజేస్తారు. ఇప్పటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. పూజలతోపాటు, బండలాగుడు పోటీలు, రాత్రికి చాందినీ, కుంకుమ బండ్లు తిప్పుతారు. చెక్కభజన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా చేయడాన్ని నిండు తిరునాలగా భావిస్తారు. రెండోరోజు మైల తిరుణాల రోజున స్థానిక ప్రాంత భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంతోపాటు సాయంత్రం చాగలగుట్టపల్లె గంగమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తిని అమ్మవారి ఇంటికి చేర్చడంతో తిరునాల పరిసమాప్తం అవుతుంది. రాయలసీమ ప్రాంతానికే తలమానికం అనంతపురం గంగమ్మ జాతర ఈనెల 17న చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం 18న నిండు తిరుణాల, 19న మైల తిరునాలభక్తులకు మెరుగైన సౌకర్యాలు ఈనెల 18, 19వ తేదీల్లో జరిగే శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరలో ఎక్కడికక్కడ తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాది టోల్గేట్లు వసూలు చేయకుండా జాతరకు వచ్చే దుకాణాదారులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. – సోడి వెంకటేశ్వర్లు, గంగమ్మ ఆలయ చైర్మన్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లావీఐపీ పాసు రద్దు చేశాం ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 300లు టికెట్లను తీసుకొచ్చాం. రూ. 100 టికెట్లతోపాటు రూ. 10లు టికెట్లు, ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశాము. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. రెండు రోజులపాటు దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా చూస్తున్నాము. సామాన్య భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. – శ్రీనివాసులు, ఆలయ ప్రత్యేకాధికారి, అనంతపురం గంగమ్మ ఆలయ, అన్నమయ్య జిల్లా -
వెన్నుపోటు బాబు
సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత లేదు కూటమి సర్కార్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత పూర్తిగా లోపించింది. ఇది పూర్తిగా అబద్దాలు, మోసాల బడ్జెట్గా మారింది. కూటమి ప్రభుత్వం మూడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 4 హామీల గూర్చి పట్టించుకోలేదు. నిరుద్యోగులను, మహిళలను, రైతులను, ఉద్యోగులను ఈ బడ్జెట్ మోసగించింది. నిరుద్యోగ భృతిగానీ, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఈ రెండేళ్లల్లో 8 లక్షల ఉద్యోగుల హామీకి ఎక్కడా చోటు కల్పించలేదు. – పాకా సురేష్ కుమార్, మేయర్, కడప ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యం రాష్ట్ర బడ్జెట్ వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యమని చెప్పవచ్చు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అమలుపైనా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. 2 సెంట్ల ఇళ్ల స్థలం ప్రస్తావనగానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి పట్టించుకోలేదు. సంక్షేమానికి 17.3 శాతం నుండి 16 శాతానికి తగ్గిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు నిధుల కేటాయింపులు లేవు. చిన్న తర హా పరిశ్రమల కింద ఎస్సీ,ఎస్టీలకు రావాలిసిన రాయితీలపై స్పష్టత ఇవ్వలేదు. – సీహెచ్ వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు -
బైక్ల ఢీ : ఒకరిమృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ఐసీఎల్ క్వారీ సమీపంలో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హేమంత్ కుమార్(25) మృతి చెందగా, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య కుమారుడు హేమంత్ కుమార్ సమీపంలో ఓ ట్రాన్స్ఫోర్టులో పనిచేస్తున్నాడు. సాయంత్రం పని ముగించుకుని బైక్లో ఇంటికి బయలు దేరాడు. అలాగే సీకేదిన్నే మండలం పరిధిలోని ఉటూకురుకు చెందిన సత్యనారాయణ కూడా పని ముగించుకుని ముద్దనూరు వైపు నుంచి స్కూటర్లో ఇంటికి బయలుదేరారు. వీరిద్దరు ఐసీఎల్ క్వారీ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై కింద పడి పోయారు. హేమంత్కుమార్కు తల పగిలి రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. కొన ఊపిరితో ఉండటంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్కూటర్లో బేల్దారి పనికి సంబంధించిన సామాన్లు ఉండటంతో బేల్దారి అయి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న స్కూటర్లను తొలిగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. ● కదిరివారిపల్లి గ్రామానికి చెందిన హేమంత్కుమార్కు పది రోజు కిందట ఆడ బిడ్డ పుట్టిందని, ఇంతలోనే మృతి చెందాడని అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి పుల్లయ్యకు కూడా ఇటీవల కాళ్లు విరిగి ఇబ్బందులు పడ్డారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు హేమంత్ కుమార్ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నిరుగా విలపించారు. -
కార్మికులకు, నిరుద్యోగులకు మొండిచేయి
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం నిలువునా దగా చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కార్మికులకు మేలు జరుగుతుందనే ఆశ కొంతైనా ఉండేది. అలాంటిదేమీ లేకుండా కార్మికులకు మొండిచేయి చూపించారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు భృతికి ఈ బడ్జెట్లో మంగళం పలికారు. ఎలక్షన్లకు ముందు మాత్రం తీర్చలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ఖాళీ అయిందని చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇలాంటి పాలకులను మరొకసారి అధికారం ఇవ్వకూడదు. – పి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు, కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణాన్ని మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించారు. తరువాత నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. -
రాయలసీమకు తీరని అన్యాయం
బడ్జెట్లో రాయలసీమకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా మోసం చేశారు. జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు జీవన భృతి (స్టైఫండ్) ఇస్తామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పథకం గురించి ఊసే ఎత్తలేదు. పథకాలు కేవలం మోసాలని తేలిపోయింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేకమైన నిధులను కేటాయించకపోవడం దురదృష్టకరం. – జీవి రాఘవరెడ్డి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు
లింగాల : లింగాల మండలం రామనూతనపల్లె గ్రామ సమీపంలోని శివాలయం వద్ద ఆర్టీసీ బస్సును పులివెందుల శ్రీచైతన్య హైస్కూలు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుణకణపల్లె గ్రామానికి చెందిన డేరంగుల సిద్ధమ్మ గాయపడింది. వివరాలలోకి వెళితే.. శనివారం సాయంత్రం కోమన్నూతల నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సును పులివెందుల నుంచి స్కూలు పిల్లలను గ్రామాలకు తీసుకెళుతున్న శ్రీచైతన్య హైస్కూలు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సిద్దమ్మపై బస్సులో ఉన్న స్టెప్నీ టైరు పడి రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్కు స్టీరింగ్ తగలి స్వల్ప గాయాలయ్యాయి. అయితే స్కూలు బస్సులోని పిల్లలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్కూలు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు, స్థానికులు తెలిపారు. గాయపడ్డ మహిళను వెంటనే పులివెందుల ఆసుపత్రికి తరలించారు. -
ముగిసిన దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన లీగ్, ఫైనల్ మ్యాచ్లు ముగిశాయి. శనివారం అనంతపురం, కర్నూల్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కర్నూలు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. సాధిక్బాషా 62 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు ప్రధాన స్కోరు అందించారు. కర్నూల్ బౌలర్లలో ప్రభాకర్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, యానాక్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూల్ జట్టు 13 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. అనంతపురం బౌలర్లలో రోషిరెడ్డి 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకొని అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రోషిరెడ్డి ఎంపికయ్యారు. అనంతరం నెల్లూరు, అనంతపురం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హుడా 29 బంతుల్లో 39 పరుగులు, సాధిక్బాషా 20 బంతుల్లో 19 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లలో అఖిల్ రెడ్డి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కిట్టు 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజేతగా నిలిచి చాంపియన్గా అవతరించింది. కిట్టు 38 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాకేష్ గౌడ్ 19 బంతుల్లో 23 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లలో సాధిక్ బాషా 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. విజేతలకు ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్ రవి కుమార్, మార్కెటింగ్ ఆఫీసర్ రాకేష్, కడప ఏబీజీ బ్యాంకు మేనేజర్ ఇ. రామమోహన్, భాస్కర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మిసెస్ శర్మ, కడప క్రికెట్ అసోసియేషన్ ఏవో నాగేష్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ విన్నర్స్, రన్ర్స్కు బహుమతులను అందజేశారు. -
బ్రహ్మంగారిమఠానికి ఉత్సవ శోభ
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం ఉత్సవ శోభ సంతరించుకుంది. స్వామి, అమ్మవారి కల్యాణ వేడుకలకు సిద్ధమైంది.మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం నామ సంకీర్తన, ఉపనిషత్ పారాయణం, అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్రస్వామి మఠం మఠాధిపతుల మూలపురుషుడు పెద్ద గోవిందస్వామి ప్రథమ పుత్రుడు గోవిందస్వామి ధర్మపత్ని వీరపాపమాంబ ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హరికథ కాలక్షేపం, రాత్రి కలశోత్సవం, శేషవాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగాయి. నేటి కార్యక్రమాలు ఉదయం సుప్రభాతం, మధ్యాహ్నం దీక్షాబంధనాలంకారోత్సవం, నామసంకీర్తన, భజనలు, సాయంత్రం కర్నూలు హరిప్రియ కళాకారుల సంగీత విభావరి, ఉత్సవం, స్థానిక ఆస్థాన పండితుల ఉపన్యాసం ఉంటాయి. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణం మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి కందిమల్లాయ్యపల్లె పుర ప్రజలు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం ఏటా జిల్లాలోని పెద్దపుత్తకు చెందిన తాడిగొట్ల నారాయణరెడ్డి, వీరారెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా కల్యాణ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం నరనంది ఉత్సవం, జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈశ్వరీదేవి మఠంలో.. స్థానిక శ్రీ ఈశ్వరీదేవి మఠంలోని శివాలయం సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉదయం కలశస్థాపన, శ్రీ పార్వతీపరమేశ్వరుల విగ్రహ మూర్తులకు ప్రభాతసేవ, అభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, మంత్రపుష్పం, నీరాజన తీర్థప్రసాద వితరణ, సాయంత్రం అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్య, మంత్రపుష్ప, నీరాజన తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి తరించారు. వారి సౌకర్యార్థం ఏర్పాట్లను మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నారు.నేడు స్వామి, అమ్మవారి కల్యాణం -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. కడప సెవెన్రోడ్స్: దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105 జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తోపాటు ఎస్డీసి వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతీ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖులు, ప్రత్యేక అతిధులు దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
కల్యాణం.. కమనీయం!
రాయచోటి టౌన్: రాయచోటి రాచరాయుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా రెండవ రోజు ఉదయం 9గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదపండితులు రాచరాయ యోగీస్వామి, ప్రణవానందగిరి స్వామి వారి శిశ్యులు మఠం ఓంకార స్వామి వారి ఆచార్యత్వంలో నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో గణపతి హోమం, ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి వారి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి ముత్యాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ మంటపం వేదికపై స్వామి వారి కల్యాణ క్రతువు క్రమంగా నిర్వహించారు. -
రాష్ట్ర సిలబస్కు అనుగుణంగా ఏటీఎల్ అనుసంధానం
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర సిలబస్కు అనుగుణంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ అనుసంధానం చేస్తూ ఏపీ ఎస్సీఈఆర్టి వారు దేశంలోనే మొదటి సారిగా హ్యాండ్ బుక్స్ తయారు చేసినట్లు డిప్యూటి ఈఓ రాజగోపాల్రెడ్డి తెలిపారు. కడప డీఈఓ కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) స్కూళ్లపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కేంద్ర అడిట్ టీం ఏటీఎల్ స్కూళ్లను విజిట్ చేస్తాయని తెలిపారు. అందువల్ల క్యాష్ బుక్, రిజల్యూషన్ బుక్, చెక్బుక్, బ్యాంకు స్టేట్మెంట్ అన్ని సరిచూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ రామక్రిష్ణ, జిల్లా సైన్సు ఆఫీసర్ వేపరాల ఎబినైజర్, ఏటీఎల్ స్కూల్స్ హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ , ఏటిఎల్ ఇంచార్జు టీచర్స్ హాజరయ్యారు. -
మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
ప్రొద్దుటూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు రోగులకు తాత్కాలిక ఉపశమనం పేరుతో నకిలీ మందులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ షాపులకు ఒక షీట్పై 40 శాతం రాయితీ ఇచ్చి వీధి వ్యాపారానికి అడ్డదారులు తొక్కుతున్నానని అన్నారు. ప్రజల నుంచి మాత్రం వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ రేట్లకు అమ్ముతున్నారన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని, వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్న మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది మెడికల్ షాపుల యజమానులు ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ లేకపోయినా వేరొకరి సర్టిఫికెట్లతో నడుపుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారన్నారు. వీటిని నివారించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆ పై అధికారులు నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు షాపుల వారికి, కొంత మంది డాక్టర్లకు గిఫ్ట్ల పేరుతో ఎరవేస్తూ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారన్నారు. వెంటనే మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రశేఖర్, మచ్చా శ్రీను, మద్దిలేటి, హరి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని పెద్దచెప్పలి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్ఐ విద్యా సాగర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె మండలం ముతుకూరుకు చెందిన మాచునూరు శ్రీనివాసులు (38), అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డిలు బైక్లో కమలాపురం మండలం విభరాపురంలో సొంత పనుల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతుండగా పెద్దచెప్పలి క్రాస్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బైక్ నడిపే శ్రీనివాసులురెడ్డి స్లో చేశాడు. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బైక్ను వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక వైపు కూర్చున్న మాచునూరు శ్రీనివాసులు కింద పడ్డాడు. అతడిని తొక్కించుకుంటూ లారీ వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాసులు నడుము నుంచి మోకాళ్ల వరకు ఉన్న భాగమంతా నుజ్జు నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శ్రీనివాసులురెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీని ఎర్రగుంట్ల వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. -
ఘరానా మోసగాడు అరెస్ట్
కడప అర్బన్ : ఆన్లైన్లో ‘పోలో’,‘వాల్లా’అనే గే యాప్లలో సభ్యులను తాను పోలీసునంటూ బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఘరానా మోసగాడు చదువుల ప్రసన్నకుమార్ రెడ్డి అలియాస్ ప్రసన్న అలియాస్ కొప్పును కడప చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రధానంగా కడపలోని ఎం.ఎస్ కొట్టాలకు చెందిన వ్యక్తిని తాను అలిపిరి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ను అని బెదిరించి దాదాపు రూ.6,95,500 నగదును, రూ. 30 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కడప చిన్నచౌక్ సీఐ ఏ. ఓబులేసు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన 30 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు ‘పోలో’, ‘వాల్లా’అనే ఆండ్రాయిడ్ ’గే యాప్’లలో మెంబర్గా ప్రవేశించి ఆ యాప్లలో నమోదైన మిగిలిన సభ్యుల మొబైల్ నంబర్లు సేకరించుకొని వారికి పోలీసును అంటూ బెదిరింపు కాల్ చేస్తాడు. సభ్యులు యాప్లో నేరపూరిత మెసేజ్లు పెట్టారు, తమ పైన పోలీస్ కేసు నమోదు చేశామని చెప్పి, తనకు డబ్బులు ఇస్తే కేసులు లేకుండా చేస్తాను అని నమ్మిస్తాడు. చాలామంది అమాయకుల నుంచి డబ్బులు, బంగారు నగలు వసూలు చేస్తాడు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తూ చాలామందిని మోసం చేశాడు. ఇతను బీటెక్ వరకు చదువుకున్నాడు. అతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తో తిరుపతి, అనంతపురం, బెంగళూరు పట్టణాలను కేంద్రాలుగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై చిన్నచౌక్, కడప వన్ టౌన్, అనంతపురం, నార్పల పోలీస్ స్టేషన్లలో సుమారు ఐదు కేసులు వున్నాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఎ. ఓబులేసు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిపై ప్రత్యేకమైన నిఘా ఉంచారు. కడప చిన్నచౌక్ పిఎస్ పరిధిలో పాతబైపాస్ సర్కిల్ వద్ద నిందితుడు ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్చేసి, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను రికవరీచేసినట్లు సీఐ తెలియజేశారు.రూ.4.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం -
విద్యార్థి ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాచకొండుగురుతేజ (16) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాచకొండుచిన్నగురయ్య, గురమ్మల కుమారుడైన గురుతేజ కలసపాడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురుతేజకు కొన్నేళ్ల నుంచి చర్మవ్యాధి కారణంగా ఆసుపత్రిల్లో వైద్యం అందించినా తగ్గకపోవడంతో చదువుపై శ్రద్ధ చూడపం లేదన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేనని మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చర్మవ్యాధికి సంబంధించిన ఆయింట్మెంట్ క్రీమ్ను పూసు కుని చదువుకుకోవాలని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తల్లి చూడగా గదిలోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లి చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు వచ్చి కలసపాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వారు తెలిపారు. గురుతేజ తండ్రి చిన్నగురయ్య 14 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి గురమ్మ రోదన వర్ణనాతీతం. తల్లి గురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు కలసపాడు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని బేల్దారి మృతిజమ్మలమడుగు : పట్టణంలోని నేతాజినగర్ కాలనీకి చెందిన తలారి రామసుబ్బరాయుడు ఆలియాస్ బాబు(48) అనే బేల్దారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం బాబు ముద్దనూరు మండలంలో బేల్దారి పని నిమిత్తం బైక్లో వెళ్లాడు. సాయంత్రం వరకు పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మండల పరిధిలోని కొత్తరోడ్డు సమీపంలోకి రాగనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తృటిలో తప్పిన ప్రమాదంగోపవరం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి భక్తులు ట్రాక్టర్లో మండలంలోని మల్లెంకొండకు వెళుతున్న సమయంలో శనివారం సూరేపల్లె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భక్తులు తెలిపారు. స్థానికుల సహాయంతో ట్రాక్టర్ను బయటికి తీసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మల్లెంకొండకు పంపడం జరిగింది. -
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొలతలకు 165 బస్సులు, నిత్యపూజ కోనకు 40, లంకమల 23, బి.మఠం 17, మల్లెంకొండ 10, హత్యరాల 22, జ్యోతి 6, కన్యతీర్థం 8, అల్లాడుపల్లె దేవలాలు 12, తలకోన 5, మల్లెంకొండ 10, సంగమేశ్వర దేవలాలు 2, భానుకోట 3, అగస్తేశ్వరకోనకు 8 బస్సులు చొప్పున నడుపుతున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్లలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, చలువపందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను నియమించామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
సంక్షేమ హాస్టల్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వ సంక్షేమ బీసీ, ఎస్సీ,ఎస్టీ వసతి గృహాల్లో 10, 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కేసి బాదుల్లా, కార్యదర్శి రాజేశ్ పేర్కొన్నారు. శనివారం కడపలోని హోచిమిన్ భవన్లో ఏఐటీయూసీ 12 జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోజువారీ పనులు చేసే కార్మికులకు రోజుకు రూ. 600 చొప్పున నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్నట్లు అదే విధంగా నగరాల్లో అడ్డా కూలీలు నెలకు రూ 24 వేలు వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. అంతకంటే తక్కువ హాస్టల్ కార్మికులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు. పెరిగిన ధరల ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని వెంటనే జీతాలు రూ.26 వేలకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వర్కర్ల సంఖ్యను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి యు మద్దిలేటి హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చండ్రాయుడు భాస్కర్ ప్రసాదు చంద్రశేఖర్ జానీ భారతి విజయ్ కుమారి మంజుల తదితరులు -
శివోహం!
● జిల్లా అంతటా మార్మోగుతున్న శైవనామం ● శైవ క్షేత్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ● ఇప్పటికే కొండ కోనలకు చేరుకున్న భక్తజనం ● నేడు మహా శివరాత్రి పర్వదినం కడప సెవెన్రోడ్స్: శివుడు....భోళాశంకరుడు...భక్తవ శంకరుడు...ఆకు, పండు, పువ్వు, నీరు ఇలా ఏమిచ్చి మనసారా మొక్కినా భక్తులను కరుణిస్తాడు...వరాలు కురిపిస్తాడు....ఆపదలో ఆదుకుంటాడు....అందుకే ఆయన భక్తవ శంకరుడు. ఆ స్వామి వారిని తలుచుకునే మహాశివరాత్రి భక్తులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులు శివాలయాలను అందంగా తీర్చిదిద్దారు. ● మన జిల్లాలో ప్రముఖ శివాలయాలు అందులోనూ అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల సంఖ్య 15కు పైగానే ఉంది. ఒకప్పుడు ఈ జిల్లాలో శైవం బాగా విస్తరిల్లింది. జిల్లాలో వీరశైవ ఆలయాలు కూడా ఉండడంతో అటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా శివరాత్రి సందర్భంగా భక్తులు ఈ జిల్లాకు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్బంగా జిల్లా అంతటా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో శివరాత్రి పూజలు నిర్వహించడానికి జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య, పంచాయతీ, అగ్నిమాపకశాఖ, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే పలుమార్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలను పరిశీలించారు. పోలీసు అధికారులు కూడా తమ పరిధిలోని శైవ క్షేత్రాలకు బందోబస్తు కోసం తరలివెళ్లారు. శనివారం ఉదయం నుంచే అటవీ క్షేత్రాల మొక్కులుగల భక్తులు ప్రత్యేక వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లేందుకు పలువురు భక్తులు ద్విచక్ర వాహనాలను ఉపయోగించడంతో దారులన్నీ రద్దీగా మారాయి. నడక శ్రమ తెలియకుండా భక్తులు చేసే శివనామ స్మరణతో ఆయా క్షేత్రాలు మార్మోగాయి. శివ పూజలకు ఘనంగా ఏర్పాట్లు శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలలో శివయ్యకు విశేష పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో లక్షల మంది హాజరయ్యే క్షేత్రా లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలతల, నిత్యపూజస్వామికోన, అత్తిరాల, భైరవకోన, కపర్థీశ్వరకోన, కన్యతీర్థం, భానుకోట తదితర ప్రాంతాలకు భక్తులు భారీగా హాజరవుతారు. అటవీ ప్రాంతాలతోపాటు గ్రామాలు, పట్టణాలు, కడప నగరంలోని శివాలయాలలో కూడా వైభవంగా పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు అన్ని ఆలయాలలో పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేయనున్నారు. రాత్రి 8 నుంచి అర్థ రాత్రి వరకు భజనలు, ప్రవచనాలు, భక్తి గీతాలాపనలు నిర్వహించనున్నారు. అర్దరాత్రి 12 గంటల నుంచి లింగోద్భవం సందర్బంగా మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల వెలుగులో ఆలయంకడప సెవెన్రోడ్స్: మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జేసీ నిధి మీనా పేర్కొన్నారు. శనివారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో చేసిన ఏర్పాట్ల నిర్వహణపై దేవాదాయ శాఖ, రెవెన్యూ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణతోపాటు భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రతి క్షేత్రంలో అన్నదానం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు భక్తులకు సమాచార, సహాయం నిమిత్తం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని 21 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందన్నా రు. కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
విద్యారంగానికి కేటాయింపులు తక్కువే
పాఠశాల విద్యారంగానికి తగినంత మేర నిధులు కేటాయించకపోవడం అన్యాయం. విద్యకు జీడీపీలో మూడు శాతం బడ్జెట్ పునరాలోచించాలి. మోడల్ ప్రాథమిక విద్య వ్యవస్థకు తాజా నిధుల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయా లి. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తీర్చాలి. మన బడి, మన భవిష్యత్ కింద ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ నాణ్యత ఉండేలా మరింత బడ్జెట్ పెంచాలి. – సీపీ ప్రసాద్, ఏపీపీఎస్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
పొలతలకు తరలివచ్చిన భక్తజనం
పెండ్లిమర్రి : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం ప్రముఖమైంది. క్షేత్రానికి శనివారం జిల్లా నలుమూల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. డీఎంహెచ్ ఓ నాగరాజు, తహసీల్దార్ అనురాధ, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డిలు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిఘా నేత్రంలో పొలతల క్షేత్రం పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అంసాఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పొలతల క్షేత్రం చూట్టు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. క్షేత్రంలో అత్యాధునిక డ్రోన్ కెమెరాతో నిఘా చేపట్టారు. నేడు శివపార్వతుల కల్యాణోత్సవం మహశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్లు తెలిపారు. అనంతరం రాత్రి 10గంటలకు రథోత్సవం అక్కదేవతల గుడి వరకు ఉంటుందన్నారు.ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు -
బడ్జెట్ కేవలం అంకెల గారడీ
అసెంబ్లీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ చూస్తే అంతా ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమను తాము పొగుడుకోవడం, గత ప్రభుత్వం పేరుతో మా మీద నిందలు వేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ప్రజలు అధికారమిచ్చిన విషయాన్ని విస్మరించారు. గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగాకు, మిర్చి, మామిడి, జొన్న ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరను అందించలేకపోయారు. అంతా అంకెల గారడీ. వాస్తవికత ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర చరిత్రలో మూడో వంతు లోటు బడ్జెట్ ఉండటం ఇదే తొలిసారి. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ బడ్జెట్ మొత్తం అంకెల గారడీయే. అన్ని అబద్ధాలు, మోసాలతో బడ్జెట్ను నింపేశారు. ఆడబిడ్డ నిఽధి, నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు.. కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. సీబీఎస్ఈ, టోఫెల్ వంటి వాటిని రద్దు చేయడం దారుణం. ధరల స్థీరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రజలకు ప్రయోజనకారిగా లేదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం -
● ప్రాజెక్టులపై చిన్నచూపు
చంద్రబాబు సర్కార్ 2026–27 వార్షిక బడ్జెట్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేసింది. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఊసే లేదు. గాలేరి–నగరి సుజల స్రవంతి పథకంపై చిత్తశుద్ధి కన్పించలేదు. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేసి కుప్పానికి సైతం నీరు ఇవ్వాలని వైఎస్సార్సీపీ సర్కార్ భావిస్తే, కూటమి సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే జీఎన్ఎస్ఎస్ దాదాపు రూ.2వేల కోట్లు పనులు పూర్తయి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా రూ.665.37కోట్లు బడ్జెట్ కేటాయింపు చేశారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలో పనులు ముందడుగు పడే అవకాశమే లేద ని నిపుణులు వివరిస్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ రూ.2,621 కోట్లు కేటాయించగా, అందులో 25శాతం మాత్రమే జీఎన్ఎస్ఎస్ కేటాయించడం వెనుక కూటమి సర్కార్ దుర్భుద్ధి తేటతెల్లమౌతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నా యి. జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనుల పురో గతి ప్రశ్నార్థకంగా మారింది. కేసీ కెనాల్ ఆయక ట్టుకు ప్రాణప్రదమైన రాజోలి ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపులే లేకపోవ డం సర్కారు కక్షపూరిత విధానానికి నిదర్శనం. నీటి ప్రాజెక్టుల కేటాయింపులు...రూ.కోట్లలో.. -
అన్ని వర్గాలను మోసగించారు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసగించేదిలా ఉంది. తన ఆప్తుడు, శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేందుకు బడ్జెట్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాలను నిధులు కేటాయింపు లేనేలేదు. 2.95 టీఎంసీలు సామర్థ్యంతో నిర్మిస్తున్న రాజోలు జలాశయానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. విద్యుత్ ఉత్పాదక రంగంపై మనసు పెట్టని కూటమి సర్కార్ తీరు స్పష్టంగా కనబడుతోంది. – రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్ సీపీ -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్ఎమ్ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
అద్దాల షాపులో చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో చందమామ డాబా సమీపంలో ఉన్న అద్దాల షాపులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. జీవనోపాధి కోసం శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన పాపారావు 15 ఏళ్ల క్రితం పులివెందులకు వచ్చి అద్దాలు, టోపీలు, హెల్మెట్లు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అద్దాలు, టోపీలు అమ్మిన వచ్చిన డబ్బులతో తమ పిల్లలను చదివించుకుంటూ ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు యువకులు ఆటోలో వచ్చి కడప రోడ్డులో ఉన్న అద్దాల షాపును పగులగొట్టి అందులోని టోపీలు, ఇళ్ల అద్దాలు, హెల్మెట్లు అపహరించి తీసుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అద్దాల షాపును పగులగొడుతుండగా.. పక్కనే ఉన్న కల్యాణ మండపం సిబ్బంది కేకలు వేయడంతో ఆటోలో వచ్చిన యువకులు షాపులో ఉన్న అద్దాలు, టోపీలు, హెల్మెట్లు తీసుకుని పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందులలో ఆగని చోరీలు పులివెందుల పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణంలోని మారుతి హాలు, ఎస్బీఐ కాలనీ, నగరిగుట్ట ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా కడప రోడ్డులోని ఓ అద్దాల షాపులో కొంత మంది యువకులు ఆటోల్లో వచ్చి షాపులోని అద్దాలు, హెల్మెట్లు, టోపీలు అపహరించి తీసుకెళ్లారు. ఇలా పట్టణంలో ఏదోక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు.. దొంగలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక శ్రీరామ హాల్ రోడ్డులో రోడ్లపై ఉన్న కారు అద్దాలు కూడా పగలగొడుతూ కొంత మంది యువకులు వికృత చేష్టలు చేస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రూ.30 వేల వస్తువుల అపహరణ -
హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం
కడప సెవెన్రోడ్స్ : ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. సంగమేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 25న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇలియాస్బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పాలకొండయ్య, కడప యూనిట్కు చెందిన వి.షుగుప్తా యాస్మిన్, చప్పిడి సుభాషిణి, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్రెడ్డి, దాదాపీర్, భాస్కర్, సురేష్బాబు, జయరామయ్య, సుబ్రమణ్యం, రమణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడపలో ఎస్టీయూ మహా ధర్నా -
నాడు– నేడు పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు పథకం కింద పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ నాడు–నేడు కింద పాఠశాలల భవనాలు 90 శాతం పూర్తయ్యాయని, కిటికీలు, ఎలక్ట్రిక్ ఫిట్టింగులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా హెడ్మాస్టర్ అకౌంట్లలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే వారు ఆ పనులు పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే మూడేళ్లలో 70 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు పోయారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారిని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారని, వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని గుర్తించి తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు దీన్ని పక్కన పెట్టాయని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని కోరారు. -
మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్ మృతి
● వృత్తి పరమైన ఒత్తిళ్లా? కుటుంబ సమస్యలా? ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు కడప అర్బన్ : కడప నగరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హెడ్మాస్టర్ జింకా జమీమా సుందరం(49) వారం రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి మృతి చెందింది. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న జింకా జమీమా సుందరం ఈ నెల 6న ఉదయం ఇంటిలో ఎవరూ లేరు సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు హెడ్మాస్టర్ మృత్యువుతో పోరాడి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగిన రోజున ఆమె తండ్రి జింకా సామెల్, భర్త పుష్పరాజ్ ఫిర్యాదు మేరకు అదే రోజున కడప వన్టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హెడ్మాస్టర్ జింకా జమీమా సుందరం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 12వ తేదీ రాత్రి 11:50 సమయంలో కడప రిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ 13వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. ప్రస్తుతం మృతురాలి భర్త, బంధువుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసి, మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తర్వాత పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. కాగా ప్రధానోపాధ్యాయురాలు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తమ వృత్తిలో ఇన్చార్జ్ హెడ్మాస్టర్గా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్లకు మానసికంగా తీవ్ర ఆవేదన చెంది ఈ చర్యకు పాల్పడిందా? లేక కుటుంబ సమస్యల వల్ల ఈ అఘాయిత్యం చేసుకుందా? లేక ఈ రెండు సమస్యలను అధిగమించలేక ఇలా చేసుకుందా? అనే అంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది. -
పాన్ ఐఐటీ హ్యాక్థాన్లో ప్రతిభ
వేంపల్లె: జాతీయస్థాయి పాన్ ఐఐటీ హ్యాక్ థాన్లో ఇదుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్, డెమో సమర్పణ వంటి అంశాల్లో నిర్వహించిన ఈ హాక్ థాన్లో సుమారు 8000 మంది పాల్గొనగా.. మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అంశంలో ఉత్తమ 15 జట్లను ఎంపిక చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐఐటీ మద్రాస్, క్యూడ్రెంట్ సంస్థ సంయుక్తంగా ఫైనల్స్ నిర్వహించారు. ఈ హ్యాక్ థాన్లో బిట్స్ పిలానీ, ఐఐటీ విద్యార్థులు పోటీ పడగా ఆర్కే వ్యాలీ జట్టు ‘ట్వైలైట్‘ పడిగల కృష్ణ కౌశిక్, కొండ్రా స్వర్ణాంజలి విజేతలుగా నిలిచారు. విజేతలకు రేబాన్ మెటా గ్లాసిస్ షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థులను డైరెక్టర్, పరిపాలన అధికారి రవికుమార్, విభాగాధిపతులు రత్నకుమారి, సుధాకర్ రెడ్డి, కోనప్ప అభినందించారు. -
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం
బ్రహ్మంగారిమఠం : మండలంలోని నరసన్నపల్లెకు చెందిన కొనిరెడ్డి నాగ వీరప్రతాప్రెడ్డి (20) అనే విద్యార్థి శుక్రవారం ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపల్లెలోని దేవరకొండ కృష్ణయ్యకు చెందిన ట్రాక్టర్కు ఆశ్రమానికి చెందిన రామోహన్రావు యాదవ్ (బాజీ) డ్రైవర్గా ఉన్నాడు. శుక్రవారం నరసన్నపల్లె నుంచి డ్రిప్ పైపులు దాదాపు 20 కట్టలతో ఆరుగురు కూలీలతో అంబవరానికి తీసుకువెళ్తున్నాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో గంగిరెడ్డిపల్లె కాలనీ దగ్గర పెద్దరాయిని ట్రాక్టర్ టైర్ ఎక్కడంతో.. అందులో ఉన్న నాగవీరప్రతాప్రెడ్డి జారి పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ టైర్ తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వీరప్రతాప్రెడ్డి ఇంటర్ చదువుతూ కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. డ్రైవర్కు కనీసం లైసెన్స్ లేదని, అటువంటి వ్యక్తిని డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రతాప్రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. ప్రతాప్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తీసుకువెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులు నరసన్నపల్లెలో అంత్యక్రియలు చేశారు. పోలీసులు ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రౌద్రాయ.. వీరభద్రాయ..
● వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి విశేష పూజలు ● భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు, ప్రత్యేక అలంకరణలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు రాయచోటి టౌన్ : ‘భద్రకాళీ ప్రియాయ.. రౌద్రాయ.. వీరభద్రాయ నమః’ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. తమను చల్లగా చూడాలని వారు స్వామి, అమ్మవారిని వేడుకున్నారు. రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు నర్రావెంకట భాస్కర్ సిద్ధాంతి నేతృత్వంలో ఆయన శిష్యులు (రుత్వికులు), ఆలయ ప్రధాన అర్చకులు యాగశాలలో హోమాలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి తరువాత హోమం చేశారు. అక్కడి నుంచి కలశపూజతో స్వామివారికి సమర్పించారు. తరువాత స్వామి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. బంగారు ఆభరణాలతోపాటు వెండి కిరీట ధారణతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వస్త్రాలు అందజేత బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(అర్చకులు, రుత్వికుల)కు ఆలయ సంప్రదాయం ప్రకారం వస్త్రాలు అందజేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆజ్ఞ పొందుతూ ఆ వస్త్రాలను వారికి అందజేశారు. వాటిని ధరించిన తరువాత పూజలకు సిద్ధమయ్యారు. కంకణధారణ స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(ఆలయ పాలక మండలి సభ్యులు, అధ్యక్షుడు, మహానైవేద్య నిర్వాహకులు, రుత్వికులు, ప్రధాన అర్చకుల)కు కంకణధారణ చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కంకణధారణ చేసిన వారు నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసే వరకు ఆలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్లకూడదని వేదపండితులు వెల్లడించారు. శైవాచారం ప్రకారం ధ్వజారోహణ వీరశైవాచారం ప్రకారం కంకణధారణ చేసిన బ్రహ్మోత్సవాల నిర్వాహకులు శైవ ఆగమనం ప్రకారం.. రుత్వికులు శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నందీశ్వరుడి ద్వారా పరమ శివుడి ఆజ్ఞ కోరుతూ విన్యాసాలు ప్రదర్శించారు. వారితోపాటు కన్నడ భక్తులు, స్థానిక భక్తులు నిర్వహించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నందీశ్వరుడిని వస్త్రంపై చిత్రీకరించి ధ్వజారోహణ చేశారు. దీంతో శ్రీవీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
ధర లేక ...
శనగ పంటకు సరైన ధర లేదు. క్వింటా రూ. 4800 నుంచి రూ. 5100 పోతుంది. దీంతో చేసేందేమి లేక సంచుల్లో నింపుకుని ఇళ్లలో వేసుకుంటున్నాం. సంచుల్లో నింపినందుకు, తూకం వేసినందుకు ఒక్కో క్వింటాపైన వంద రూపాయల ఖర్చు వస్తుంది. మద్దతు ధర ఉంటే ఈ ఖర్చు తగ్గేది. పది రూపాయలు వచ్చేది. – బోధం కుళ్లాయిరెడ్డి, మాలేపాడు గ్రామం, ఎర్రగుంట్ల మద్దతు ధరతో కొనుగోలు చేయాలి 7 ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాను, ప్రస్తుతం ఒకటిన్నర ఎకరాలో కొత కోశాను. ఎకరాకు 10 క్వింటాళ్లు చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ధర మాత్రం బాగా లేదు. ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుంచి శనగలను కోనుగోలు చేయాలి. లేకుంటే నష్టపోతారు. –శివరామిరెడ్డి,కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం ప్రభుత్వ నిర్ణయం సరికారు ప్రభుత్వం శనగ సాగు చేసిన ప్రతి రైతు నుంచి పంట కొనుగోలు చేయాలి. కానీ అలాకాకుండా ప్రతి గ్రామంలో 50 మంది చొప్పున ప్రతి రైతు నుంచి 25 క్వింటాళ్లు లేదా 5 ఎకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు సంబంధించిన దిగుబడిని మాత్రమే కొనుగోలు చేస్తామని పేర్లు నమోదు చేయించుకుంది. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. – దస్తగిరి రెడ్డి, జిల్లా రైతు సంఘ నాయకులు. -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
లింగాల : మండల పరిధి ఇప్పట్ల గ్రామ సమీపంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొని షేక్ ఆలీ మౌలా(58) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇప్పట్ల గ్రామ సమీపంలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పొలానికి కాపలాగా ఉన్న ఆలీ మౌలా.. పొలం నుంచి పార్నపల్లె – పులివెందుల ప్రధాన రహదారిపైకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో కోమన్నూతల గ్రామానికి చెందిన గంట వెంకట శివ మరో ఇద్దరు ఒకే మోటారు సైకిల్పై అతి వేగంగా పులివెందులకు వెళ్తూ ఆలీ మౌలాను వెనుక వైపు నుంచి ఢీకొన్నారు. దీంతో ఆలీ రోడ్డుపై బోర్లపడి నుదిటికి బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలీ మౌలాను ప్రైవేట్ వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బతినగా, వాహనం నడుపుతున్న వెంకట శివ గాయాలపాలయ్యాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ శుక్రవారం సాయంత్రం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ ఎన్వీ రమణ, ఎస్ఐ జగదీశ్వరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో లింగాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జేసీ డాక్టర్ నిధి మీనా సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల సన్నద్ధత, మహాశివరాత్రి ఉత్సవాలలో వసతులు, భద్రతా ఏర్పాట్లు, సానుకూల ప్రజా దృక్పథం, డాక్యుమెంట్ అప్ లోడ్, కోర్టు బిల్డింగుల కోసం స్థల సేకరణ, కొత్త జిల్లాల్లో నూతన కోర్టు భవనాల కోసం స్థల సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరు కాగా, స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రత్యేక అమలు కార్యక్రమాలతోపాటు ప్రధానంగా పారదర్శకంగా పీజీఆర్ఎస్ అమలు, సజావుగా గ్యాస్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు సంతప్తికరమైన సేవలు అందించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని 16 ప్రధాన శైవ క్షేత్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఎలాంటి కొరత లేకుండా వసతులను సమకూర్చేలా రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జేసీ డాక్టర్ నిధి మీనా -
రైతుకేదీ శనగ!
కడప అగ్రికల్చర్: శనగ రైతును ధరాఘాతం వెంటాడుతోంది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ధర లేదు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. దిగుబడులు అరంభమైనా ఇంత వరకు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కూటమి సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. దీంతో రైతులు దళారులకు పంటను అప్పజెప్పి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. శనగకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రూ.5875 కేటాయించగా దళారీలు మాత్రం నాణ్యతను బట్టి క్వింటా రూ.4800 నుంచి 5100 తో కోలుగోలు చేసి రైతులకు శఠగోపం పెడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్కు సంబంధించి సాధారణ సాగు 79613 హెక్టార్లుకాగా 75775 హెక్టార్లలో శనగపంట సాగైంది. ప్రస్తుతం కోతలు ప్రారంభమయాయి. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ రైతులకు మద్దతు ధర కరువైంది. కేంద్ర ప్రభుత్వం శనగలకు రూ. 5875 మద్దతు ధర ప్రకటించింది. పోనీ ఆఽ ధరకై నా అమ్ముకుందామంటే ఎక్కడ ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో శనగపంట రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో అత్యధికంగా సాగు చేస్తారు. కేవలం మంచు ప్రభావంతో పూర్తయ్యే పంటను జిల్లాలో పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, వీఎన్పల్లి, రాజుపాలెం, దువ్వూరు, వేములు, వేంపల్లె మండలాల్లో ఈ ఏడాది అత్యధికంగా సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో జేజే –11 అత్యధికంగా సాగు చేశారు. ఒకటి రెండు నీటి తడులతో ఈ ఏడాది ఎకరాకు 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. రాసిపోసిన శనగలు ఈ ఏడాది జిల్లాలో శనగ విస్తీర్ణంతోపాటు దిగుబడి కూడా పెరిగింది. దీంతో రైతులు సంతోషపడుతున్నారు. ధర బాగా ఉటుందని ఆశ పడ్డారు. కానీ పంట చేతి కోచ్చే సరికి చంద్రబాబు సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. దీంతో చేసేందేమిలేక చాలా మంది పొలంలోనే దళారీలకు అమ్ముకుంటున్నారు. వాళ్లు క్వింటాకు 4800 రుపాయల నుంచి నాణ్యతను బట్టి రూ. 5100 కొనుగోలు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమేమో రైతులకు క్వింటా మద్దతు ధరను 5875 రుపాయలు ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా క్వింటాపై 800 నుంచి 1000 రుపాయల తగ్గించి దళారీల చేతులో పెడుతున్నారు. అంటే ఒక్కో ఎకరాపైన రూ.8000 వేల నుంచి 10 వేలకుపైగా రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర వచ్చే వరకు పంట నిల్వ ఉంచుదామంటే సరైన వసతులు లేవు. దీంతో చేసేదేమి లేక ఎంతకు పడితే అంతకు అమ్ముకుంటున్నారు. దీనికితోడు గింజ నాణ్యత, తేమశాతం పేరు చెప్పి క్వింటాకు అదనంగా రెండుమూడు కింటాలు దండుకుంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. -
అరటి పంట దగ్ధం.. రూ. లక్షల్లో నష్టం
పులివెందుల రూరల్ : అరటి పంట దగ్ధం కావడంతో రైతుకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓబయ్య అనే రైతు 4 ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. అరటి పిలకలు నాటినప్పటి నుంచి గెలలు వేసే వరకు చెట్లను సొంత కన్న బిడ్డల్లాగా చూసుకొని సాగు చేస్తే.. పక్కనే ఉన్న కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు వచ్చి అరటి పంటకు అంటుకున్నాయి. దీంతో అరటి పంట అగ్నికి ఆహుతైందని బాధిత రైతు ఆవేదన వ్యక్త చేస్తున్నాడు. మార్కెట్లో అరటి ధరలు బాగా ఉన్న సమయంలో చేతికొచ్చిన అరటి పంట ఇలా బూడిద కావడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. నాలుగు ఎకరాల్లో అరటి పంటతోపాటు డ్రిప్ పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. స్పందించని అగ్నిమాపక శాఖ అధికారులు అరటిపంటకు అగ్ని అంటుకుందని రైతు అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే వారు సకాలంలో స్పందించకపోవడంతో పంట పూర్తిగా కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
● నీకు నేను... నాకు నువ్వు..
పుంగనూరు ‘మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది... ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్ ఉందా.. ’ అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన బి.నరేంద్రరాజు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయనకు 1996లో కర్ణాటకకు చెందిన ఎస్ఐ గోపాలక్రిష్ణ కుమార్తె శిల్పతో పరిచయం ఏర్పడింది. ఆమె బంధువుల ఇంటికి వచ్చేది. అలా పుంగనూరుకు వచ్చివెళ్తుండగా పరిచయం కాస్తా పెరిగి పెద్దదై ప్రేమలో పడ్డారు. కులాలు ఒకటైనా పెద్దలు స్థాయీబేధాలతో ప్రేమజంటను విడదీశారు.ఏడాది పాటు పోరాటం సాగించారు. చివరకు ప్రేమే జయించింది. 1997 జూన్ 27న అతికష్టం మీద వివాహం జరిగింది. అదే ఏడాది నరేంద్రరాజుకు ఉద్యోగం పర్మినెంట్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరు కుమారు లు పునీత్రాజు,మనోజ్రాజుతో ప్రస్తుతం ఆ ప్రేమజంట సంతోషంగా జీవిస్తూ, ఆదర్శంగా నిలిచారు. –నరేంద్ర, శిల్పా, పుంగనూరు -
పొలతలలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
పెండ్లిమర్రి: జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాలల్లో ప్రముఖమైనది పొలతల క్షేత్రం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ కృష్ణానాయక్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కడప,పులివెందుల, ప్రోద్దుటూరు, రాయచోటి డిపోల నుంచి బస్సు సర్వీస్లను కేటాయించారన్నారు. ఉత్సవాలకు ట్రాఫిక్, అసాంఘిక కార్యాకలాపాలు, జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారన్నారు.ఉత్సవ ఏర్పాట్లను ఆర్డీఓ జాన్ ఇర్విన్ శుక్రవారం పర్యవేక్షించారు. శనివారం ఉదయం స్వామివారికి వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, కుంకుమార్చనలతో ఉత్సవాలు ప్రారంభవపుతాయన్నారు. ఆదివారం చండీ హోమం, పూర్ణాహూతి, రథ ప్రతిష్ట, కుంకుమార్చన అనంతరం ఉదయం 10గంటల నుంచి ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల సందర్బంగా జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, తరలివచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు, భద్రతా ఏర్పాట్లను కల్పించామని పేర్కొన్నారు. పార్వతీపరమేశ్వరుల కళ్యాణోత్సవాలు, ఊరేగింపు తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదా య, రెవెన్యూ, పోలీసు శాఖల ద్వారా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు సమాచార, సహాయం నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, 21 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి నేపథ్యంలో ఈనెల 14 నుంచి 16వ తేది వరకు 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ సేవలు ఉంటాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాలకు గట్టి బందోబస్త్ ఏర్పాటు: ఎస్పీ పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధికారులకు సూచించారు. పొలతల క్షేత్రంలో చేపడుతున్న ఉత్సవాల ఏర్పా ట్లను గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతూ పర్యవేక్షించాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు సదాశివయ్య, చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఈఓ క్రిష్ణానాయక్ పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప కోటిరెడ్డిసర్కిల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప రీజియన్ పరిధిలో వివిధ శైవ క్షేత్రాలకు 347 బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. రీజియన్ పరిధిలోని పొలతలకు 165, నిత్యపూజకోన 52, లంకమల 38, బి.మఠం 17, హత్యరాల 22, జ్యోతి క్షేత్రానికి 6 బస్సులతోపాటు ఇతర శైవ క్షేత్రాలకు 47 బస్సులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోని శివయ్య కృపను పొందాలని సూచించారు. -
ఈ సారైనా నిధులిస్తారా!
కడప సిటీ: జిల్లాలోని సాగు,తాగునీటిప్రాజెక్టులపై ‘పచ్చ’నీడ కమ్ముకుంది. ‘పైసల్లేక..’ పనులు జరగడమే గగనమైంది. ఫలితంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల ఉన్నతినీ గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబేమో ప్రతి సమావేశంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని డప్పు కొడతారు. వాస్తవ రూపం లో అది అమలు కావడం లేదు. ● రాజంపేట పరిధిలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. కమిటీలతో కాలయాపన చేసి మళ్లీ కొత్త టెండరు పిలువడంగానీ లేదా అదే కాంట్రాక్టర్కు అప్పగించడంగానీ జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగాలంటే 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో జిల్లా ప్రాజెక్టుల సీఈ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే సమయం ఆసన్నమైంది. కనీసం అధికారులు పంపిన నివేదిక ప్రకారం నిధులను మంజూరు చేస్తారా? లేక ఎగనామం పెడతారా? అనేది వేచి చూడాల్సిందే. రాయలసీమ వాసిగా.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వట్టి మాటలు చెప్పడం ఆపి.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చి సీమ గొంతు తడపాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య కావాలంటే రూ.100 కోట్లు కావాలి అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కోసం 2021 నవంబరులో అప్పటి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లకు అనుమతులు ఇచ్చి టెండర్లను కూడా పిలిచింది. ఈ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ సంబంధించిన డిజైన్పై ఆమోదం లభించకపోవడంతో ప్రాజెక్టుకు బీజం పడలేదు. కమిటీ నెపంతో నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు పరిశీలించి ప్రాజెక్టు పూర్తికి నిధులు అవసరమని తేల్చడం జరిగింది. 2021 నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట వరదకు గురైంది. స్పిల్వే 94 మీటర్లు దెబ్బతింది. ఇతర ప్రాజెక్టులకు.. మైలవరం జలాశయానికి రూ. 1.60 కోట్లు, ఝరికోనకు రూ. 7 కోట్లు, వెలిగల్లుకు రూ.5.20 కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టుకు రూ. 0.20 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. రూ.10 కోట్లు ప్రణాళికేతర పద్దు కింద అవసరమని అధికారులు కోరారు. ఈ నిధులు వస్తేగానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అలాగే పులివెందుల నియోజకవర్గ ప్రాజెక్టు పనులకు రూ. 430 కోట్లు, దిగువ సగిలేరుకు రూ. 30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సర్కార్ నిర్లక్ష్యం ప్రాజెక్టులకు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరం! బడ్జెట్లో నిధుల కేటాయిస్తారా....ఎగనామం పెడతారా? ఒకవైపు పోతిరెడ్డిపాడు పనులు సాగుతూనే ఉన్నా...అవుకు జలాశయం నుంచి గండికొట సొరంగం వరకు వరద కాలువ, సొరంగం పనులు వైఎస్సార్ సీపీ పాలనలో జరిగాయి. కూటమి హయాంలో సర్వరాయసాగర్, వామికొండ, జీఎన్ఎస్ఎస్ ఫేస్–2 ప్యాకేజీలు ఉండగా, 3–7 వరకు పనుల్లో పురోగతి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సివిల్ పనులు, భూ సేకరణ, అధికారులు, సిబ్బంది వేతనాలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రతిపాదనలు అందజేశాం జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు దాదాపు రూ. 3 వేలకోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. నిధులు మంజూరు కాగానే జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు సంబంధించి పనులను శరవేగంతో పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతాం. –వరప్రసాద్, ప్రాజెక్టుల సీఈ, కడప -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాలలో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్పార్సీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఇందిరెడ్డి రాజశేఖర్రెడ్డి(కమలాపురం), విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా గొడ్లవీటి సుబ్రమణ్యం(మైదుకూరు), జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పి. మహేశ్వర్రెడ్డి, జిల్లా వలంటీర్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె. బయక్రిష్ణారెడ్డి, జిలాల మున్సిపల్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా షేక్ మహ్మద్ వారిష్, జిల్లా రైతు విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎల్. వెంకట సుబ్బారెడ్డి(కమలాపురం)లను నియమించారు. బద్వేల్ నియోజకవర్గ పరిశీలకుడిగా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులుగా ఉన్న అబ్బిగారి మల్లికార్జునరెడ్డిని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఈయన గతంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. మదనపల్లె సిటీ: శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాఽధికార సంస్థ నిర్వహించే జిల్లా స్థాయి చెస్ బాల,బాలికల జట్ల ఎంపికలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు డిఎస్డీఏ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీలు మదనపల్లెలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అండర్–13,15,17,19 జట్ల ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న జట్లు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ల్లో పాల్గొంటాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ఫిబ్రవరి 21,22 తేదీల్లో తిరుపతిలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు రవీంద్రనాథ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 8639957954, మస్తాన్, సీనియర్ అసిస్టెంట్ 7386901200 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. గురువారం శాననమండలిలో ఆయన ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. 12వ పీఆర్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదని, దీనితోపాటు మధ్యంతర భృతి చెల్లింపుపై కూడా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. వారికి 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యూటీ, పెన్షన్ బకాయిలు, ఇతర బెనిఫిట్లు భారీగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, టీఏ, సరెండర్ లీవుల బకాయిలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. గ్రంథాలయ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు, పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకూ ఉన్న 3.64 శాతం డీఆర్ బకాయిలను ఏప్రిల్ 2026 నుంరరి విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇంతవరకూ చెల్లించలేదన్నారు. ఈ బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
సమీక్షకే సమయం లేదా!
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. సరిగ్గా మరో 45 రోజుల్లో ఉత్సవాలకు శ్రీకారం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్త జనం తరలిరానుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగే బ్రహ్మోత్సవ వేడుక ఇది. ఇంతటి మహోత్సవంపై ఉన్నత స్థాయి అధికారులు ఇంతవరకు సన్నాహాక సమీక్షలు నిర్వహించక పోవడంపై భక్తులు నిట్టూర్చుతున్నారు. ఇది టీటీడీ అధికారుల నిర్లక్షాన్ని చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల ఉత్సవాల్లో ముందస్తు చర్యల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు.. మృత్యువాత పడుతున్న ఘటనలను ఉటంకిస్తున్నారు. ● ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 26న అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేది వరకు నిర్వహించాలని ఇప్పటికే అధికారికంగా అనుమతిచ్చారు. సరిగ్గా 42 రోజుల సమయం ఉంది. గతంలో ఏటా మూడు నెలల ముందు నుంచి బ్రహ్మోత్సవాలు వచ్చే వరకు నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించే వారు. ఈ ఏడాది ఇంతవరకు ఉన్నతాధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఈపాటికి కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలయ్యేవి. సీతారాముల కళ్యాణ వేదిక ప్రాంగణంలో కంపచెట్లు, కలుపు మొక్కలు తొలగించి, చదును చేసేందుకు గుత్తపత్రాలు ఆహ్వానించినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. మొక్కలను తొలగించి చదును చేయాల్సి ఉంటుంది. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ శుభ్రం చేయాల్సి ఉన్నా కదలిక లేదు. విద్యుత్ నియంత్రికలు అమర్చాలి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, తాగునీరు, సేవకులకు భోజన వసతి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరణలు, విద్యుత్ కాంతులు, స్వాగత తోరణాలు ఏర్పాటు, ప్రసాదం పంపిణీ, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు వంటి అంశాలు చర్చకు రావాల్సి ఉంది. ఉత్సవాల వేల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది, సేవకులకు బస వసతి కల్పించడంపై శ్రద్ధ వహించాల్సి ఉంది. నెలన్నర రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు గోడ, కర, ఆహ్వాన పత్రాల ఊసే లేదు? కల్యాణ వేదిక ప్రాంగణమంతా పిచ్చిమొక్కలే ఇదీ కోదండ రాముడి ఉత్సవ ఏర్పాట్ల తీరు ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవ వేడుకల సమాచారాన్ని దశదిశలా తెలిపేలా విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందజేసేందుకు చిరు సంచులు, రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్యాకెట్లలో తలంబ్రాలు నింపి అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోడపత్రాలు, ప్రముఖులకు ఆహ్వాన పుస్తకాలు(వీఐపీ, వీవీఐపీ), రంగుల కరపత్రాలు, ప్రత్యేక ఆహ్వానాలు పత్రాలు వేల సంఖ్యలో ముద్రించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నా... గోడ, కర, ప్రచార పత్రాలు ఇంకా ఇక్కడికి చేరలేదు. సాధారణంగా గత వేడుకల్లో జరిగిన తప్పిదాలను మరలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉంది. సమీక్షలే చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఏటా ఉత్సవాలు ప్రారంభమవడానికి ముడు నెలల ముందే ఒంటిమిట్టలో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమీక్ష నిర్వహిస్తూ వచ్చేవారు. లోటు పాట్లు లేకుండా ముందస్తుగా కసరత్తు చేసి, విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఆ దిశగా అడుగులేసేవారు. ఈ దఫా ఎందుకనో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇక్కడికి జేఈవో, ఈవో ఉన్నత స్థాయి అధికారులెవరూ రాలేదు. -
భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలి
సిద్దవటం : మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంత వాతావరనంలో శ్రీ నిత్యపూజ స్వామి దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. సిద్దవటం పోలీస్స్టేషన్ పరిధిలో 15వ తేదీన జరిగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం బందోబస్తు ఏర్పాట్లను రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ మనోజ్హెగ్డేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యపూజ కోనలో స్వామి దగ్గరికి భక్తులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ నిత్యపూజస్వామిని దర్శనం చేసుకోగా ఆలయ పూజారులు ఆయన్ను శాలువాతో సత్కరించి, దేవాలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, కడప స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్, సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, రేంజర్ కళావతి, కడప స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు సదాశివయ్య, ఈదుర్బాషా, తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు, నిత్యపూజ స్వామి ఆలయం ఈఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
ఆల్మట్టి ఎత్తు పెంపును చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి నీటిని నిలువ చేసి దిగువ రాష్ట్రాల నీటి వాటాను గండి కొట్టడాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. చంద్ర పేర్కొన్నారు. బుధవారం కడపలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించగా, మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ ఆంధ్రప్రదేశ్కు కల్పించిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం మొదటినుంచి తమ కేటాయించిన నీటిని వాడుకున్న తర్వాతే దిగువ ప్రాంతానికి విడుదల చేస్తామంటూ వితండవాదానికి దిగుతోందని, అయితే ఈ వాదన బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నమైనదని ట్రిబ్యునల్ తోసి పుచ్చిందన్నారు.ఎగువ రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా కేటాయింపులకు భిన్నంగా నీటిని తరలించుకుని పోతుంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే మరో మారు హక్కులు అవకాశాలు కోల్పోయిన రాయలసీమ శాశ్వత ఎడారి కావడం తథ్యమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, కేసి బాదుల్లా, యు మద్దిలేటి జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపల్లె గ్రామానికి చెందిన మార్పురి సుధీకర్ను 2017లో హత్య చేసిన నిందితలకు గౌరీగాలే ఈశ్వరమ్మ, షిండే చంద్ర అలియాస్ చందు, సయ్యద్ ముబారక్ అలియాస్ పండులకు కడప 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.దీనబాబు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేలు జరిమానా విధించారు. కేసుకు సంబంధించిన పూర్వ పరాలు పరిశీలిస్తే 2017లో వివాహేతర సంబంధం, ఇతర కుటుంబ కలహాల నేపథ్యంలో మార్పురి సుధీకర్ను నిందితులు పెద్దచెప్పలికి చెందిన గౌరీగాళ్ల ఈశ్వరమ్మ, కమలాపురానికి చెందిన షిండే చంద్ర అలియాస్ చందు, అప్పాయపల్లె కు చెందిన సయ్యద్ ముబారక్ అలియాస్ పండు కలసి పథకం ప్రకారం కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పట్లో కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాలను, దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి జి.దీనబాబు నిందితులపై మోపిన హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులకు జీవిత కాల కఠిన కారాగాన శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరుపెట్టిన కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ను వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రాయుడులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. -
బార్ బరి.. గెలుపెవరిదోమరి !
● ఏడేళ్ల తర్వాత ఏపీ బార్ కౌన్సిల్కు ఎన్నికలు ● 13న పోలింగ్కు సన్నద్ధం రాజంపేట : జిల్లాలోని న్యాయవాద వర్గాల్లో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. మొదటి ప్రాధాన్యత ఓటు కోసం న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఏడేళ్ల తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణ ఈ ఏడాది జనవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి విధితమే. జనవరి 5 నుంచి 13 మధ్య నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయి. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. బరిలో 143 మంది అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 23 స్ధానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. 143మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 23మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నుంచి చైర్మన్ అభ్యర్ధిని ఎంపిక చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 39409 ఓట్లు ఉన్నాయని స్టేట్బార్ కౌన్సిల్ వెల్లడించింది. జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో.. జిల్లాలో కడప, బద్వేలు,జమ్మలమడుగు,నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి , రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బార్ అసోసియేషన్ల పరిధిలో ఏపీ బార్ స్టేట్ కౌన్సిల్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలింగ్ అధికారులను కూడా త్వరలో నియమించి, ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారుల ఎంపిక కొనసాగిందని న్యాయవాదులు చెబుతున్నారు. జిల్లా వారీగా ఓట్లు ఇలా.. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (154), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. మాడల్బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స
కడప అర్బన్ : రిమ్స్ ఆవరణలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మూత్ర నాళాల సమస్యతో బాధపడుతున్న 9 సంవత్సరాల బాలిక ప్రోక్షిత కు మినిమల్ ఇన్వేసివ్ విధానంలో పునర్నిర్మాణ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సను శ్రీవేసుకో స్కోపిక్ బై లేటరల్ యురేటరిక్ రీ ఇంప్లాంటేషన్ఙ్అంటారు. ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేయడానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. ఈ తరహా చికిత్స చాలా అరుదుగా కడప జిల్లాలో తొలిసారిగా నిర్వహించారు. ఈ పేషెంట్కు వీయు ఆర్ వల్ల కుడివైపు కిడ్నీ పనితీరు తగ్గింది. వీయుఆర్ కు శస్త్ర చికిత్స చేయకపోతే రెండు కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్కు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండేది. ఈ అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్స వల్ల పేషంట్ కోలుకోవడం, నొప్పి లేకపోవడం, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించామని సాధారణంగా ఈ ఆపరేషన్కు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేదని డాక్టర్లు తెలియజేశారు. ఈ శస్త్ర చికిత్స అనంతరం బాలిక ప్రోక్షిత ఆరోగ్యం మెరుగుపడి, డిశ్చార్జ్ సమయంలో సాధారణ స్థితిలో ఉంది. ఈ శస్త్ర చికిత్సను నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ సి. సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ పి.వి రమణ, డాక్టర్ పి. సుకుమార్, డాక్టర్ ప్రీతి, డాక్టర్ సులక్షణతో కూడిన వైద్య బృందం నిర్వహించారు. వైద్య సేవల పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనస్తీసియా విభాగం, హాస్పిటల్ పరిపాలన విభాగం సహకారానికి శస్త్ర చికిత్స బృందం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పురిటి, చిన్నపిల్లలకు అన్ని రకాల సాధారణ, అధునాతనమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారని, ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. -
అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. బుధవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా లు గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వెల్లువెత్తుతుందని నాయకులు హెచ్చరించారు. రాజకీయ ప్రతీకార చర్యలను అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి, ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అంబటి ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం -
కన్నతల్లిని కడతేర్చిన కొడుకు అరెస్టు
ఎర్రగుంట్ల : అప్పు కట్టమని చెప్పిన కన్నతల్లి చాప సుందరమ్మపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన కేసులో కుమారుడు జాకోబ్ను అరెస్టు చేసినట్లు ఎర్రగుట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.... పోట్లదుర్తి గ్రామం క్రిస్టియన్లేన్ కాలనీలో నివాసం ఉన్న సుందరమ్మ (80), అబ్రహాం(లేట్)లకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. సుందరమ్మ తన కుమారుడైన జాకోబ్ వద్ద ఉంటుంది. జాకోబ్ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాకోబ్కు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు. కుమార్తె లత ఉన్నారు. లతను ప్రొద్దుటూరు మండల పరిధిలోని కానపల్లెకు ఇచ్చి వివాహం చేశారు. పోట్లదుర్తిలోని తన ఇంటి నిర్మాణంనకు కుమార్తె లత వద్ద రూ.18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును ఇవ్వాలని లత తన తండ్రి జాకోబ్ను అడిగింది. ఈ విషయంలో జాకోబ్ కుమార్తెతో గొడవ పడ్డాడు. ఈ విషయంపై జాకోబ్ తల్లి సుందరమ్మ మనవరాలు లతతో గొడవ వద్దు.. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా ఇవ్వమని కుమారుడైన జాకోబ్కు చెప్పింది. మనవరాలికి సపోర్టు చేస్తావా అని సుందరమ్మపై ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. బంధువులు గమనించి సుందరమ్మను ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్సకు తీసుకెళ్లారు. అక్కడ సుందరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాకోబ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ మెరుగైన వైద్యం కోసం సుందరమ్మను కడప రిమ్స్కు తరిలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. సుందరమ్మ చనిపోయిన కారణంగా జాకోబ్పై హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ కరువైందని,కడపలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక హిట్లర్ పాలన సాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు విమర్శించారు. కడప ఎరమ్రుక్కపల్లె సమీపంలోని కందిపాళెంలో మాజీ సైనికుడు సట్టి నరసింహులు ఇంటిని అక్రమంగా కూల్చిన ఘటనను నిరసిస్తూ అఖిలపక్ష్యం అధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్ష శిబిరాన్ని అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు ఆర్ధరాత్రి ఓ మాజీ సైనికుడి ఇంటిని కూల్చడం దారుణమన్నారు. ఈ పరిస్ధితిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు. ప్రత్యేకించి కడప నగరంలో కుటిల రాజకీయాలు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు అధికమయ్యాయని విమర్శించారు. ఇంటిని కూల్చివేసిన వారిపై కేసులు పెట్టాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ చేస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు పెడితే నోరు మూసుకుంటారన్న ఉద్దేశ్యంతోనే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా 35 కేసులు కట్టారని, కడప నగరంలో మరీ శృతిమించిందన్నారు. దళితులతో పెట్టుకున్న వారు పతనమే – కిశోర్ బూసిపాటి దళితులపై దాడులు చేసి బాధపెట్టిన వారంతా పతనం కాకతప్పదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. ఇంటి కూల్చివేతను నిరసిస్తూ స్వయంగా దీక్షలో కూర్చొన్న కిషోర్ మాట్లాడుతూ ఓ వైపు రాజ్యాంగం అమలైన రోజని అందరూ పండుగ చేసుకుంటుంటే, టీడీపీ నాయకులు మాజీ సైనికుడి ఇంటిని కూల్చి ఆ కుటుంబానికి విషాధం మిగిల్చారన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల ప్రోద్బలంతోనే గంజాయి బ్యాచ్ ఆర్ధరాత్రి అడ వారిని, పిల్లలను బయటకు లాగేసి అరాచకం సృష్టించి ఇంటిని నేలకూల్చారన్నారు. కానీ ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, దీన్ని చూస్తే కడపలో ఆటవిక పాలన సాగుతుందనిపిస్తొందన్నారు. ఈ ఆటవిక చర్యను వైఎస్సారేసీపీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణం అధికారులు బాధ్యులపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు సీహెచ్ వినోద్, సుబ్బరాయుడు, కె. బాబు, త్యాగరాజు, కంచుపాటి బాబు, పి. సంపత్ కుమార్, డా. పెంచలయ్య, తిలక్ నగర్ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు కె.సురేష్ బాబు -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో షేక్ దర్బార్ వల్లి అనే దొంగను రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ వివరాలను తెలియజేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసామన్నారు. సత్యసాయి జిల్లా గౌకనపల్లి చెందిన షేక్ దర్బార్ వల్లి (42) గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన పాత పద్ధతి మార్చుకోకుండా మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. అరెస్తయిన దర్బార్వల్లిని విచారించగా కడపలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన పది మోటార్ సైకిళ్ల గురించి సమాచారం ఇచ్చాడని, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామన్నారు. దొంగను పట్టుకున్న కడప తాలూకా సీఐ టి రెడ్డెప్ప, ఎస్ఐలు మోహన్ కుమార్ గౌడ్, మహమ్మద్ రఫీలను జిల్లా ఎస్పీ అభినందించారు. లోయలోకి దూసువెళ్లిన లారీ – ఒకరి మృతి, డ్రైవర్కు గాయాలు చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఖార్జురచెట్ల లోడుతో సేలం నుంచి పూణేకు వెళుతున్న టీఎన్ 52కే 9747 నంబరుగల లారీ బుధవారం కడపకు వస్తుండగా ఘాట్ నాలుగో మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకవెళ్లినట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. విషయంతెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక అధికారి యోగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్ గోపినీ ప్రాణాలతో కాపాడారు. గాయపడిని అతన్ని అంబులెన్సు ద్వారా రిమ్స్కు తరలించారు, లారీలోని మరో వ్యక్తి శరవణ్ కుట్టి అప్పన్ ( 37) ఖార్జుర చెట్ల కింద పడి ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు యంత్రాల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి యోగేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలిసి లారీలో చిక్కుకున్న డ్రైవర్ గోపి ని ప్రాణాలతో కాపాడటం పట్ల పలువురు అభినందించారు.కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ బాలమద్దిలేటి,ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. -
పాఠశాలలో వ్యాయాయ ఉపాధ్యాయుడు కీలకం
కడప ఎడ్యుకేషన్ : పాఠశాల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతో కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని 40 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విషయంలో వ్యాయామ ఉపాధ్యాయుడి పాత్ర కీలకం అన్నారు. అలాగే ఈ సంవత్సరం రెండు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఒక జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించారన్నారు. ఇందుకుగాను ఆయన వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డిప్యూటి ఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి దేవాలయాలు కాదు క్రీడా మైదానాలు కావాలి అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రస్తుతం భారతదేశ యువతకు వ్యాయామ శిక్షణ, ఫిజికల్ యాక్టివిటీస్ అవసరమని చెప్పారు. అనంతరం జిల్లాలో ప్రతిభ కనబరిచిన 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ శిక్షణ సేవ అవార్డుతో సత్కరించారు. అలాగే 2025లో పదవీ విరమణ చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ పీఈటీ అండ్ శాప్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, స్టూడెంట్ కార్యదర్శులు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, సంఘ ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అగ్గిరప్పతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వడ్డీ రాయితీకి ఎగనామం...
కడప అగ్రికల్చర్: వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం...అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రైతన్నలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే ఎసరు పెట్టింది. అంతేకాకుండా మోసపూరిత వాగ్దా నాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ నిధులను(రైతు భరోసా) ఎగరగొట్టింది. అది చాలదన్నట్లు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 18 నెలల కాలంలో ఇప్పటి వరకు నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోయారు. వైఎస్ జగన్ హయాంలో నిరాటంకంగా.. వడ్డీ రాయితీ పథకంలో భాగంగా రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ ప్రభుత్వం చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో రైతులకు వడ్డీ రాయితీ అందచేసింది. వ్యవసాయ అవసరాలకు కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్లపాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కాలు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి జిల్లాలో... ఉమ్మడి జిల్లాలో 72 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)లు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 1,65,000 మంది సభ్యులున్నారు. వీరంతా కనిష్టంగా లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వ్యవసాయ అవసరాల కోసం పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2024–25 సంవత్సరంలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వ్యవసాయ పంట రుణాల కింద రైతులు సుమారు రూ. 530 కోట్లు తీసుకున్నారు. అలాగే 2025–26 సంవత్సరంలో కూడా 550 కోట్లు పంట రుణాల తీసుకున్నట్లు డీసీసీబీ అధికారులు తెలిపారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల రైతులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ధపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వడ్డీ రాయితీకి ఎగనామం పెట్టింది. సకాలంలో రుణాలు చెల్లించినా రైతులకు ఫలితం శూన్యం 18 నెలలుగా పైసా విదిల్చని కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులకు నష్టం రైతులపై కోట్లలో భారం ... ఆందోళనలో అన్నదాతలు -
త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రాజంపేట టౌన్: పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో బుధవారం ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుంటే త్రేతేశ్వర స్వామి బ్రహో త్సవాలను మండలంలోని హత్యరాలతో పాటు పోలి, మందరం, సీతారాంపురం పంచాయితీల పరిధిలోని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ తరహాలో జరుపుకుంటారు. కాగా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హత్యరాల గ్రామంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లాకు బుధవారం 1000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 400 మెట్రిక్ టన్నులను ప్రైవేట్డీలర్లకు, మరో 600 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. -
వైభవంగా లూర్దుమాత తిరునాల
కడప సెవెన్రోడ్స్: కరుణామయి, ప్రేమమూర్తి ఏసుక్రీస్తును ఈ లోకానికి అందించిన దయగల తల్లి లూర్దుమాత తిరునాల బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం మరియాపురంలోని పాత గుడివద్ద బిషప్, కడప కథోలిక పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాశ్ను మరియాపురం ప్రధాన వీధుల్లో భక్తులు తేరుపై ఊరేగించారు. క్రైస్తవ భక్తిగీతాలతో బాలికలు నృత్యం చేస్తూ పీఠంపైకి సాద ర స్వాగతం పలికారు. బిషప్ సగినాల పాల్ ప్రకాశ్తోపాటు వివిధ విచారణకు చెందిన 30 మంది గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. అనంతరం బిషప్ ప్రసంగిస్తూ వినయం, విధేయతే మరియమాత సుగుణాలని చెప్పారు. క్రైస్తవులు కూడా వినమ్రతతో కలిగిన ప్రత్యేక శైలిని అలవర్చుకోవాలని సూచించారు. నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విజేతలకు బిషప్ బహుమతి ప్రదానం చేశారు. తిరునాల కమిటీ సభ్యులు బిషప్ను ఘనంగా సత్కరించారు. సమిష్టి దివ్య బలిపూజలో విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు సుధాకర్, వికర్ జనరల్ ఎండీ ప్రసాద్రావు, కడప డీన్ జోసెఫ్ రాజు, ప్రొక్యూరేటర్ సంబటూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తిరునాల సందడే సందడి లూర్దుమాత నవదిన ఉత్సవాల ముగింపు సందర్భంగా పాత చర్చి ఆవరణలో ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు. వాలీబాల్ పోటీల్లో విజేతలైనవారికి అతిథులు బహుమతులు అందజేశారు. తిరునాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆ ఆవరణం సందడిగా మారింది. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ముగిసిన ఉత్సవాలు -
7 శాతం వడ్డీ...
రైతు తన వ్యవసాయ అవసరాల కోసం లక్ష రుపాయలు రుణం తీసుకుంటే సంవత్సరానికి 7 శాతం వడ్డీ అంటే రూ. 7 వేలు రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వాటా ఉంటుంది. అంటే రైతు చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో కేంద్ర భరించాల్సిన 3 శాతం వడ్డీ అంటే 3 వేలు యథావిధిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా స్థానిక సహకార సంఘాలకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 4 శాతం అంటే రూ.4 వేలు మాత్రం ఈ 18 నెలలగా ఇవ్వడం లేదు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో 72 సహకారం సంఘాలతోపాటు డీసీసీబీ బ్రాంచిల ద్వారా రైతులు చాలా మంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. వీరికి సంబంధించిన వడ్డీమాత్రం చెల్లించలేదు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీకి వడ్డీ కూడా కలిసి బ్యాంకులు వసూలు చేస్తాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహకార సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. -
నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్: స్వర్ణాంధ్ర అంతర్ జిల్లాల సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ గురువారం నుంచి ఈ నెల 14 వరకు కడపలోని వైఎస్ రాజా రెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ సుగాలి మధుసూదన్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్వానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటాయన్నారు. . దివ్యాంగ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ పోటీలు నిలుస్తాయని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి డిగ్రీ చదివి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించాలని పూర్వ విద్యార్థులు, పలు సంఘాల నుంచి, కళాశాల నుంచి అభ్యర్థనలు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పందించి అనుమతి ఇచ్చారని తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి సబ్జెక్టులు పెండింగ్లో ఉంచుకున్న విద్యార్థులకు ఇదొక అద్భుత అలానే చివరి అవకాశమన్నారు. అలాగే 2015 నుండి 2019 బ్యాచ్లలో 1,2,3,4,5,6 సెమిస్టర్ విధానంలో చదివిన విద్యార్థులు ఆ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 12 నుంచి మార్చి 16 లోపు ఆన్లైన్లో పరీక్ష దరఖాస్తును అప్లోడ్ చేయాలని తెలిపారు. అపరాధ రుసుంతో మార్చి 25వ తేదీ వరకు గడువు ఉందన్నారు. వివరాలకు www.yvuexams.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారిగా ఉప్పాల శరత్ బాబు బుధవారం కడప కలెక్టరేట్ లోని జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు, ఇతర ప్రకతి విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తి నష్టం జరగకుండా కృషి చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈయన 1993 లో కృష్ణాజిల్లా అవనిగడ్డ ఫైర్ ఆఫీసర్గా విధుల్లో చేరారు. 2014లో డీఎఫ్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లెలోని ఏపీ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు. తర్వాత అనంతపురం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా విధులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఏపీ సీఆర్డీఏ లో విధులను నిర్వహిస్తుండగా ఇటీవల వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారులు యోగీశ్వర్రెడ్డి, బసివి రెడ్డి, జిల్లాలోని ఫైర్ స్టేషన్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కడప సెవెన్రోడ్స్: గ్రంథాలయ మరమ్మతు పనులకు మంజూరు చేసిన నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర సంచాలకులకు పంపాలని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాశ్ అధ్యక్షతన కడపలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. జిల్లా గ్రంథాలయ పరిధిలోని ఏడు బ్రాంచి లైబ్రరీల్లో ఫ్యాన్లు, లైటింగ్, పెయిటింగ్స్,టేబుళ్లు, ఫర్నీచర్ తదితర పనుల కోసం ప్రభుత్వం రూ. 40,30,000 కేటాయించిందని భానుప్రకాశ్ ఈ సందర్బంగా తెలిపారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతనాలు, పెన్షన్లు, గ్రంథాలయ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమోదించారు. వేముల నూతన గ్రంథాలయా న్ని జిల్లా గ్రంథాలయ సంస్థ పేరిట స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు.కార్యక్రమంలో డీఈఓ షంషుద్దీన్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి, డీఎల్పీఓ మస్తాన్వలీ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.అమీరుద్దీన్, పి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించాలి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ను బుధవారం ఢిల్లీలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలిశారు. లేఖ ద్వారా రైల్వే సమస్యలను విన్నవించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం రైల్వే స్టేషన్లో చైన్నె – ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని, అలాగే మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో నిలుపుదల చేయాలని ఎంపీ అందులో పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని అవినాష్ రెడ్డి కోరారు. -
ఎంట్రీఫీజు వసూలుకు టెండర్ రికార్డు
రుసుము రూ.25కు పెంచడంతో రూ.31 లక్షలు పలికిన పాట బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఉన్న అటవీశాఖ సముదాయంలోకి ప్రవేశ రుసుం వసూలుకు బుధవారం రాజంపేట డీఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించిన టెండర్లలో రికార్డుస్థాయి ధర దాఖలైంది. వివరాలు. హార్సిలీహిల్స్పై అటవీశాఖ పర్యావరణ సముదాయంలో జంతుప్రదర్శనశాల, మొసళ్లపార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రం, పురాతన నీలగిరి వృక్షం ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారి నుంచి రూ.20 ఎంట్రీఫీజును నిర్దేశించిన అటవీశాఖ వాటిని వసూలు చేసుకునేందుకు ఏటా టెండర్లు నిర్వహిస్తోంది. 2026–27 ఏడాదికి నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొన్నారు. టెండర్ ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించగా వీరిలో కాండ్లమడుగుకు చెందిన ఇడగొట్టు రమేష్బాబు 31 లక్షల ఐదు రూపాయలకు టెండర్ దాఖలు చేయగా ఇదే అత్యధిక టెండర్ కావడంతో అధికారులు దీన్నే ఖరారు చేశారు. అలాగే క్యాంటిన్ నిర్వహణ కోసం రూ.1.75 లక్షలతో టెండర్లకు ఆహ్వనించగా శివన్న అనే వ్యక్తి అత్యధికంగా రూ.3.25 లక్షలకు టెండర్ దాఖలు చేయడంతో ఖరారు చేశారు. కాగా కొండపై అటవీశాఖ ఎంట్రీఫీజు వసూలుకు 2018 నుంచి అమలు చేస్తోంది. 2022 వరకు ఏటా రూ.ఆరేడు లక్షల ఆదాయం దక్కేది. 2022–23లో తొలిసారిగా 13,000,786 పలికింది. తర్వాత వరుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంలో 2023–24లో రూ.14 లక్షలు, 2024–25లో రూ.16.50 లక్షలు, 2025–26లో రూ.19.60 లక్షలు పలికింది. ఇప్పుడు 2026–27కు 40శాతానికిపైగా ఆదాయంతో రూ.31లక్షలు పలకడం రికార్డు. కాగా మొదట రూ.10గా ఎంట్రీ రుసుము, రూ.20కి పెంచగా ప్రస్తుతం రూ.25గా చేయడంతో ఈ స్థాయిలో రూ.31 లక్షలు పలికింది. -
మంత్రి ఇలాకాలో ‘104’ వాహనాలు మాయం
సాక్షి, అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా రాయచోటిలో ‘104’ వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు అదృశ్యమయ్యాయి. రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం కాగా.. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు కొంతమంది సిబ్బంది తరలించినట్లు సమాచారం.104లను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో 104లను ధ్వంసం చేస్తున్న వీడియో.. సాక్షి చేతికి చిక్కింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, 104లను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేశారు. -
14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు
● 15న గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం ● కల్యాణంను నిర్వహించనున్న నూతన మఠాధిపతి దంపతులు బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవ కార్యక్రమంలో 14న ఉదయం 6 గంటలకు నామ సంకీర్తన , ఉపనిషత్ పారాయణం, 8 గంటలకు అభిషేకం, 12 గంటలకు వీరమాంబ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు హరికథ, రాత్రి 8 గంటలకు కలశోత్సవం, 9 గంటలకు హరికథ, 10 గంటలకు శేషవాహనోత్సవం తదితర పూజలు నిర్వహించనున్నారు. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాతం, 12 గంటలకు దీక్షాబంధనాలంకారోత్సవం, 2గంటలకు నామసంకీర్తన , భజనలు, సాయంత్రం 4 గంటలకు హరిప్రియ కర్నూల్ వారిచే సంగీత విభావరి, 4 గంటలకు ఉత్సవం, 6 గంటలకు స్థానిక ఆస్థాన పండితుడిచే ఉపన్యాసం, రాత్రి 9 గంటలకు పెద్దపుత్త గ్రామ ఉభయదాతలుచే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంను నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 11 గంటలకు నరనంది ఉత్సవం, 12 గంటలనుంచి జాగారణ ఉంటుంది. 16వ తేదీ సోమవారం ఉదయం నామసంకీర్తనలు, 8 గంటలకు అభిషేకం, 10 గంటలకు మోహినీ అలంకారోత్సవం, 12 గంటలకు భజనలు, రాత్రి 7గంటలకు హరికథ, 8 గంటలకు నంది ఉత్సవం చేపట్టనున్నారు. 17వ తేదీ మంగళవారం ఉదయం పారాయణం, అభిషేకం, 10 గంటలకు నిత్యహోమం, గజోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం, రాత్రి 9 గంటలకు పుష్పరథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
అయ్యో పాపం..
● గుండెపోటుతో తండ్రి మృతి ● గతంలో కరోనాతో తల్లి మృతి ● అనాథలైన ముగ్గురు పిల్లలు పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డు సమీపంలోని హెచ్పీ గ్యాస్ గో డౌన్ వద్ద మోపూరి రాజా అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తూ కు టుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం రాజా ఛాతి నొప్పితో బాధపడుతూ గుండె పోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు. మృతుడు రాజా భార్య ఆరేళ్ల క్రితం కరోనాతో మృతి చెందింది. రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం వారు అనాథలయ్యారు. దీంతో పిల్లలు అనాథలు కావడంతో అయ్యో పాపమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహాశివరాత్రికి భారీ బందోబస్తు
కడప అర్బన్ : మహాశివరాత్రి పర్వ దిన నేపథ్యంలో ఈనెల 15న దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశంను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నిర్వహించారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలపై మంగళవారం మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. జిల్లాలో ప్రధానంగా కడప సబ్ డివిజన్ పరిధిలోని పొలతల, మైదుకూరు సబ్ డివిజన్ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిత్యపూజ కోన, రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్యరాల క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటూ వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి దేవాలయంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, వాటిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్న్స్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, రాజంపేట ఎ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఎస్బీ డీఎస్పీ ఎన్. సుధాకర్ , కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య, సీఐ లు చల్లని దొర, బాల మద్దిలేటి, నరసింహ రాజు, మన్నూరు సి.ఐ ప్రసాద్ బాబు, ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, శివరాముడు, ఎస్ఐ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం
ప్రొద్దుటూరు క్రైం : రూ.35 లక్షలు ఇస్తే ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో రూ. 50 లక్షలు జమ చేస్తామని మోసగాళ్లు నమ్మించారు. వారి ట్రాప్లో పడిన గంగాప్రసాద్ రూ.35 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతికి అందగానే కత్తితో బెదిరించి మోసగాళ్లు పరారయ్యారు. ఏడాది తర్వాత ప్రొద్దుటూరు పోలీసులు వారి ఆటకట్టించారు. ఈ కేసులోని ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ వివరాలను మీడియాకు వెళ్లడించారు. ప్రొద్దుటూరులోని గోకుల్నగర్కు చెందిన చెందిన ఆదిమూలం గంగాప్రసాద్ క్లర్క్గా పని చేస్తున్నాడు. గతేడాది జనవరి 7న కొందరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఎంత డబ్బు నగదు రూపంలో ఇస్తే అంతకు రెట్టింపు డబ్బును ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో ఆశపడిన గంగాప్రసాద్ అందుకు అంగీకరించి రూ. 33 లక్షల నగదును వారికి ఇచ్చాడు. అతను ఇచ్చిన డబ్బును బ్యాగ్లో నింపి ప్రసాద్ ఎదురుగానే వారు ఒక షూట్కేసులో పెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆన్లైన్లో డబ్బు పంపడం ఆలస్యం అవుతోందని నీ డబ్బు వాపసు తీసుకో అని చెప్పి మరో బ్యాగ్ను ప్రసాద్కు ఇచ్చారు. అతను ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరచి చూసుకోగా అందులో తెల్లకాగితాల బండిళ్లు ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్ట్ ఈ క్రమంలో నిందితులను మంగళవారం ప్రొద్దుటూరులోని దానంబట్టి క్రాస్రోడ్డు సమీపంలో టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పులివెందుల మండలంలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన కొమ్మడ్డి గంగులయ్య, బెంగళూరుకు చెందిన పఠాన్సత్తార్, శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామానికి చెందిన అంకం నాగేశ్, హైదరాబాద్లో ఉంటున్న మల్రెడ్డి గోపాల్రెడ్డి, నెల్లూరు జిల్లా ఆల్లూరు మండలానికి చెందిన తిరుపతి పెంచలయ్యలు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదుతో పాటు కత్తి, షూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు రైస్పుల్లింగ్, పవర్కాయిన్స్ లాంటి మోసపూరిత విధానాల ద్వారా అమాయకు ప్రజలను మోసగిస్తునట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆశకు పోయి మోసపోవద్దన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. రూ. 33 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లు ఏడాది తర్వాత పోలీసులకు దొరికిన నిందితులు ఐదుగురు అరెస్ట్, రూ.8.50 లక్షలు స్వాధీనం అరెస్ట్ వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ -
తమలపాకు తోటల పరిశీలన
కడప అగ్రికల్చర్ : వైఎస్సార్ జిల్లా సికెదిన్నె మండలంలోని కొలుములపల్లి గ్రామంలో మంగళవారం తమలపాకు తోటలను మండల ఉద్యాన, వ్యవసాయ అధికారులతో కలిసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎస్. మానస పరిశీలించారు. ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉందని గుర్తించారు. నివారణకు సమగ్రంగా యాజమాన్యం చేపడితే తప్ప నియంత్రించడం కష్టమని తెలిపారు. ఈ తెగులు నియంత్రణకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయాలని తెలిపారు. ఎకరానికి ఒక టన్ను చొప్పున జిప్సమ్ వేసి అవిశ నాటటానికి ముందే కలియదున్నాలని చెప్పారు. తెగులు ఎక్కువగా ఆశించే తోటలలో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు నెలకు ఒకసారి చొప్పున 4 సార్లు 1% బోర్డో మిశ్రమాన్ని పాదుల్లో పోసుకుంటూ 15 రోజుల కొకసారి చొప్పున 8 సార్లు ఆకులపై పిచికారి చేయాలని తెలిపారు. వీటిలోపాటు మరికొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి రెడ్డయ్య, వ్యవసాయ అధికారి ఈశ్వర్ , డీఆర్సీ పద్మజ, సెరికల్చర్ పాల్గొన్నారు. -
బద్వేలులో దొంగల హల్చల్
– ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీ బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో దొంగలు మంగళవారం పట్టపగలే ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టణంలోని చెన్నంపల్లె మిట్టకు చెందిన చిన్నవీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా దుండగులు లోనికి ప్రవేశించి బీరువా పగులకొట్టి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.44 వేలు నగదు, కొన్ని వెండి వస్తువులు అపహరించుకుని పోయారు. అలాగే సురేంద్రనగర్లోని గొడుగునూరు గోపి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. తన భార్యకు పరీక్ష ఉండటంతో ఇంటికి తాళం వేసి కడపకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు బీరువా పగులకొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గోపి ఇంట్లో 6 తులాలు బంగారు ఆభరణాలు, రూ.20 వేలు నగదు, కొంత వెండి సామాగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే చెన్నంపల్లె సమీపంలోని తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో కూడా దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేలు నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సురేంద్రనగర్లోని ప్రైవేటు ఉపాధ్యాయుడు గోపి ఇంట్లో గల సీసీ కెమెరాలో ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నట్లు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో కలెక్టర్కు తప్పిన ప్రమాదం
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో చాపాడు మీదుగా కడపకు వెళుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కలెక్టర్ కారు ముందు వెళుతున్న స్కూటీ, లారీ వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీంతో కలెక్టర్ కారు సైతం వేగం తగ్గించింది. దీని వెనకాలే వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం(ట్రక్కు) కలెక్టర్ కారును వెనుకవైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుకవైపు దెబ్బతింది. కారులో ఉన్న కలెక్టర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈయనతోపాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
మత్స్యశాఖ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్ : మత్స్యశాఖను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అందరి డైరెక్టర్స్తో కలిసి కృషి చేస్తామని ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ పేర్కొన్నారు. కడపలోని మత్స్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా డైరెక్టర్లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లా మత్స్య శాఖ అధికారి రవి కుమార్, ఎప్డిఓలు, వీఎఫ్ఏలతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సొసైటీల ఆడిట్, న్యూ సొసైటీల ఏర్పాటు, పథకాల అమలు, డీఎఫ్సీఎస్ ఆదాయం పెంచుట తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఫిష్ మార్కెట్, మత్స్యకారుల సమస్యలు, తదితర అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
– ఇద్దరికి గాయాలు పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని పాతసంగటిపల్లె రోడ్డు వద్ద మంగళవారం రాత్రి ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో పాతసంగటిపల్లె హరిజనవాడకు చెందిన మురళి, నాగయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మురళి, నాగయ్యలు పాతసంగటిపల్లె హరిజనవాడ నుంచి పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెల్లటూరుకు వస్తుండగా పులివెందుల నుంచి కడపకు వెళుతున్న ఇన్నోవా కారు పాతసంగటిపల్లె రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కడప అర్బన్ : కడప నగరం జిల్లా కోర్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాళెం మండలం గోపాయపల్లికి చెందిన బీరం నాగేశ్వర్ రెడ్డి (53) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఈసంఘటన వివరాలను కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. మృతుడు తమ స్వగ్రామం నుంచి కడపలో తన మనువడి పుట్టినరోజుకు వచ్చారు. కడప కోటిరెడ్డిసర్కిల్ నుంచి ఆర్టీసి బస్టాండ్ వద్దకు మోటార్సైకిల్లో వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. జెఎస్డబ్ల్యూ పరిశ్రమ భూముల పరిశీలన జమ్మలమడుగు : మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూముల రికార్డులను జాయింట్ కలెక్టర్ నిధిమీనన్ మంగళవారం పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె సమీపంలో ఉన్న స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిన భూములకు సంబంధించిన రికార్డులను ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డితో కలసి పరిశీలించారు. ఇంత వరకు కేటాయించిన భూముల్లో ఎటువంటి పనులు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఇండస్ట్రీయల్ పేరుమీద ఉన్న భూములను జిందాల్కు బదాలింపు జరిగిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్వేయర్ గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్మట్టి ఎత్తుపై నోరు మెదపని బాబు
కడప సెవెన్రోడ్స్: కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం తలపెడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1995లో అల్మట్టి సామర్థ్యం 17.82 టీఎంసీలేనని పేర్కొన్నారు. దేవెగౌడను ప్రధానమంత్రిని చేసింది తానేనంటూ జబ్బలు చరుచుకునే చంద్రబాబు అప్పట్లో దేవెగౌడ అల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్లకు పెంచడం ద్వారా 129 టీఎంసీలను వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టినా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 519.6 మీటర్ల నుంచి 524.6 మీటర్ల ఎత్తుకు అల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తద్వారా 279 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం డీపీఆర్ చేపట్టి దానికి టెండర్లు సైతం పిలిచిందన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఆ రాష్ట్రం 279.72 టీఎంసీలను వాడుకుంటుందన్నారు. అల్మట్టి ఎత్తు పెంపుపై మహరాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన సందర్భంలో తెలంగాణలోని టీడీపీ నాయకులతో చంద్రబాబు పిల్ వేయించారన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమతో ధర్నా నిర్వహింపజేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు కలిగించింది కూడా చంద్రబాబే అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోతానన్న భయంతోనే ఆయన రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మేల్కొకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి నష్టమే జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్రెడ్డి, రైతు నాయకుడు వాసుదేవరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్కుమార్, ఫయాజ్ పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాష్ట్రానికి నష్టమే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
కడప–బెంగళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి
కడప సెవెన్రోడ్స్: కడప–బెంగుళూరు రైల్వే మార్గం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులను ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఈ అంశంపై లోక్సభలో మాట్లాడుతూ 2010లో ఈ రైల్వేలైన్ పనులను రూ. 2700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని తెలిపారు. నేటికీ 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పరిపూర్తికి కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తన వాటాగా ఇవ్వాల్సిన 50 శాతం నిధులను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తెలిపారు. కేంద్రమే వంద శాతం నిధులను విడుదల చేసి రైల్వే లైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఏపీ విభజన చట్టం 2014లో హామీ ఇచ్చిన విధంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ ప్రాజెక్టులకు ప్రాణప్రదమైందన్నారు. కేంద్ర బృందం రీ విజిట్ నిర్వహించి ఈ పథకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని చెప్పారు. ‘సీమ’ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలి కడప స్టీల్ ప్లాంటు నిర్మించాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
●మాస్టర్ ప్లాన్పై పున ఃపరిశీలన చేయాలి: మేయర్
కోవిడ్–19 సమయంలో ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను పునఃపరిశీలన చేయాలని మేయర్ పాకా సురేష్కుమార్ అన్నారు. వైజాగ్లో ఏకంగా రద్దు చేశారని, మనం కూడా ఆ విధంగా చేయవచ్చేమో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టతరమవుతుందని, కార్పొరేషన్ స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. గతంలో పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని సాయి మౌర్యకు లీజుకు ఇచ్చామని, ఆర్బిట్రేటర్ను నియమించుకొని ఆ సమస్య పరిష్కరించుకోవాలని న్యాయస్థానం చెప్పినా, ఇంతవరకూ అధికారులు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 10వ తేదీతో ముగిశాయి. చివరిరోజు మంగళవారం 36 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 796 మంది విద్యార్థులు హాజయ్యారు ఆర్ఐవో వెంకటేశ్వర్లతోపాటు స్క్వాడ్్ బృందాలు, డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చినట్లు తెలిపారు. కడప అగ్రికల్చర్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ మండల స్థాయి ( కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల స్థాయిలో) భారీ ‘‘ కిసాన్ మేళా ’ ఫిబ్రవరి 12న తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వి. సుమతి కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్లు తెలిపారు. ‘సమగ్ర వ్యవసాయం – లాభదాయకం‘ అనే నినాదంతో జరిగే ఈ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఇప్పటివరకు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్ టిక్కెట్టు కొనేవారని, మార్చి 1 నుంచి వాటిని నిలిపి వేస్తున్నామని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూటీఎస్ స్థానంలో రైల్ వన్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మార్చి 1వ తేది నుంచి ఈ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తిస్తూ ఆయా టిక్కెట్లను యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. మంగళవారం జిల్లాకు 1710 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో 1150 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు కేటాయించగా మరో 560 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కడప అర్బన్: మిస్ గ్రాండ్ – ఏపీ–2026 మొదటి రన్నరప్గా బోడగల మహిమాన్విత విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రామదాస్పల్లెలో ఈనెల 7న జరిగిన ఫైనల్స్లో మొదటి రన్నర్ గా కిరీటం గెలుపొందారు. కడప జిల్లా కొత్త మాధవరం గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాసులు,రమ్యశ్రీల కుమార్తె అయిన మహిమాన్విత ప్రస్తుతం నెల్లూరులో బీడీఎస్ అభ్యసిస్తున్నారు. మహిమాన్వితను తల్లిదండ్రులు, అన్న డాక్టర్ హరికష్ణ కౌశిక్, సహచర విద్యార్థులు అభినందించారు. చాపాడు: మండలంలోని అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శాశ్వత హుండీ ఆదాయాలను లెక్కించారు. అన్నమయ్యజిల్లా దేవాదాయశాఖ అసిస్టెట్ కమిషనర్ విశ్వనాథ్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్, ఏఓ శంకర్ బాలాజీ మాట్లాడుతూ 3 నెలల 28 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.8,59,761 నగదు, 1.500 గ్రాముల బంగారు, 416.500 గ్రాముల వెండి, అన్నదాన సత్రంలో ఉన్న హుండీని లెక్కించగా రూ.62,390 వచ్చిందన్నారు. మొత్తం నగదు రూ.9,22,151 వచ్చిందని వారు తెలిపారు. కమిటీ సభ్యులు, రెవెన్యూ, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
లోకానికి వెలుగు చుక్క లూర్దుమాత
భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కడప సెవెన్రోడ్స్: లోకానికి వెలుగు చుక్క పరిశుద్ధ లూర్దుమాత అని వికార్ జనరల్ ఫాదర్ ఎండీ ప్రసాద్రావు అన్నారు. లూర్దుమాత తిరునాల మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక డాన్ బోస్కో ఐటీఐలో ఉన్న అంతోని చర్చిలో ఫాదర్ ప్రసాద్ రావు దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భక్తులందరికీ మేరిమాత మార్గదర్శకంగా ఉందన్నారు. పూర్వం నౌకా యాత్రికులకు మరియమాత సముద్రపు నక్షత్రంలా దారి చూపేదని చెప్పారు. అందుకే ఆమెకు సముద్రపు నక్షత్రమని పేరు కూడా ఉందని చెప్పారు. అనంతరం ఆ పూజలో డయాసిస్ ప్రొక్యురేటర్ ఫాదర్ ఎస్.సురేష్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం సంధ్య సర్కిల్ వద్ద ఉన్న అంతోని వారి చర్చి నుంచి భక్తిశ్రద్ధలతో మరియమాతను నగరంలోని ప్రధాన కూడళ్లు గుండా మరియాపురం పాత చర్చి ఆవర ణం వరకు భారీగా ఊరేగింపు చేశారు. అనంతరం దువ్వూరు విచారణ గురువు సల్లా మనోహర్ ఆధ్వర్యంలో అక్కడున్న ఫాదర్ క్రంబ్లిష్ వేదిక పై యువకులు, పిల్లల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్,ఫాద ర్ సిప్రియన్,, ఫాదర్ జార్జ్,తిరుణాల కమిటీ అధ్యక్షుడు గుంతమళ్ల బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాది జోసఫ్ ,ఉపాధ్యక్షుడు పి.లూర్దు, ట్రెజరర్ నంది మండలం విజయరాజు, పుల్ల గుజ్జు శేఖర్లతోపాటు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్సిగ్నల్
కడప కార్పొరేషన్: కడప– రాయచోటి రహదారిలో గువ్వల చెరువు ఘాట్ వద్ద సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి 2025 డిసెంబర్ 17న రాసిన లేఖకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప– రాయచోటి మార్గంలో 4లేన్ల రహదారి, దాని అనుబంధ మార్గాల నిర్మాణానికి సంబంధించి పీఎంసీ సేవలు, డీపీఆర్ తయారీ, నిర్మాణానికి ముందు పనులు, నిర్మాణం, నిర్వహణ పర్యవేక్షణ కోసం రూ.10.95కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ పనులు 2025– 26, 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చా మని వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి రాజంపేట: తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నడపాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కోరారు. ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి లేఖకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం -
మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 14, 15 తేదీల్లో కడప జోన్లోని ఎనిమిది జిల్లాల నుంచి 1454 ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జోన్ వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో 51 డిపోలు, 4249 బస్సులు ఉన్నాయన్నారు. వీటిలో మహా శివరాత్రిని పురస్కరించుకుని 1454 ప్రత్యేక సర్వీసులను నడపుతున్నామన్నారు. వీటిలో అత్యధికంగా శ్రీశైలంకు 460 బస్సులు, వైఎస్సార్ జిల్లాలోని పొలతలకు 130, నిత్యపూజకోన 40, లంకమల 34 బస్సులను నడుపుతున్నామన్నారు. వీటిలో వైఎస్సార్ జిల్లా నుంచి 318బస్సులు, కర్నూలు 276, నంద్యాల 275, చిత్తూరు 71, సత్యసాయి 30, తిరుపతి 182, అన్నమయ్య 245, అనంతపురం నుంచి 57 బస్సులు చొప్పున శివరాత్రికి నడుపుతున్నామన్నారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ● శ్రీశైలానికి 460 బస్సులు ● జిల్లాలోని పొలతలకు 130 సర్వీసులు ● కడపజోన్ ఈడీ ఎస్టీపీ రాఘవకుమార్ -
‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’
సాక్షి ప్రతినిధి, కడప : కూటమి పాలన ‘కమ్మ’గా సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా... ఇంటా బయట పెరిగిన రాజకీయ ముప్పే అందుకు కారణమా అంటే... ‘అవును’ అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు జమ్మలమడుగులో పైచేయి సాధించడం, మరోవైపు పక్కలో బల్లెంలాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి నియామకం .. ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకొస్తున్నారు. భవిష్యత్లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉండడంతోనే వాంటెడ్ అటాక్కు సిద్ధమయ్యారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తిరుపతిలో బీజేపీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పక్కనే ఉండగా, కేవలం ‘కమ్మ’ వారికి ప్రయోజనం కలిగేలా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఎందుకిలా కఠినంగా, కుల కోణంలో మాట్లాడారనే విషయమై ఎన్డీయే కూటమిలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందుకు అనేక కారణాలు లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ అన్నట్లుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు కని్పస్తోందని వివరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆది సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు కాంట్రాక్టు పనులతో పై చేయి సాధించారు. మరోవైపు సోదరుడు కుమారుడు భూపేష్రెడ్డికి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత దక్కింది. ఇది జీరి్ణంచుకోలేకే ఆది ఇలా మాట్లాడుతున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. బీజేపీ, టీడీపీలో సీఎం రమేష్ హవా... బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్నాయుడు స్వగ్రామం పోట్లదుర్తి. తన పరపతితో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదానీ హైడెల్ ప్రాజెక్టు పనులు చేజేక్కించుకున్నారు. ఆ పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే ఆది పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఏకంగా తన అనుచరులు వెళ్లి రితి్వక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి వాటాలు దక్కలేదు. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలో ఎంపీ రమేష్నాయుడు హవా కని్పస్తోంది. మరోవైపు సోలార్ పనులు ఎర్త్వర్క్ పనులు కూడా ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి చొరవ నామమాత్రమే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు’గా పలువురు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు ఓ హెచ్చరిక సంకేతమని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని సీఎం రమే‹Ùను కట్టడి చేయకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా హెచ్చరికలు చేస్టున్నట్లు తెలుస్తోంది. భూపేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే... జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ చేజారడం.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు... వెరసి చదిపిరాళ్ల భూపేష్రెడ్డికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈనెల 7న జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే అంటే 8వ తేదిన తిరుపతిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు సర్కార్ను టార్గెట్ చేశారు. జమ్మలమడుగులో ఇదివరకే దేవగుడి కుటుంబం నుంచి ఆదినారాయణరెడ్డికి ప్రత్యామ్నాయంగా భూపేష్రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అభ్యరి్థగా ఆది తెరపైకి వచ్చి అవకాశాన్ని తన్నుకుపోయారు. కాగా, ఇటీవల తన కుమారుడు సుధీర్రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొస్తానంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే టీడీపీ అధ్యక్షుడు భూపేష్రెడ్డిని బలోపేతం చేయాలనే ఎత్తుగడ ఆ పార్టీ అధిష్టానం అవలంబించడం ఎమ్మెల్యే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఆది’ వ్యాఖ్యలు ఎంతవరకెళ్లి అంతమవుతాయో వేచి చూడాలి. -
బి.మఠం పీహెచ్సీలో డీఎంహెచ్ఓ విచారణ
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి కె.నాగరాజు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం ఆస్వస్థతకు గురైన ఓ భక్తుడిని బి.మఠం పీహెచ్సీకి తీసుకెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది ఎవరూ లేరు. దీంతో అతడిని మైదుకూరుకు తీసుకువెళ్లేలోపు మృతి చెందాడు. ఈ వార్త సాక్షిలో ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా వైద్యాధికారే విచారణకు వచ్చారు. ఆరోజు విధులలో ఉన్నవారు ఎవరు... ఎందుకు లేరు అనేదానిపై విచారణ జరిపారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై అదికారులకు నివేదిక పంపుతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ విడిజన్ డిప్యూటీ వైద్యఅధికారి మల్లేష్, వైద్యఅధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రిమ్స్ పీజీ విద్యార్థుల ప్రతిభ
– ప్రిన్సిపల్ డాక్టర్ టి.జమున అభినందనలు కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్) జనరల్ సర్జరీ విభాగ పీజీ విద్యార్థులు జాతీయస్థాయి సదస్సు ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి–85వ జనరల్ సర్జరీ విజ్ఞాన సదస్సు డిసెంబర్ 17,18,19 తేదీల్లో కలకత్తాలో నిర్వహించారు. ఈ సదస్సులో రిమ్స్ జనరల్ సర్జరీ పీజీ విద్యార్థులు పోస్టర్ విభాగంలో డాక్టర్ వంశీ కళ్యాణ్ మొదటి స్థానం, డాక్టర్ సత్యబ్రత్ పాణిగ్రహి, డాక్టర్ ఉపేంద్ర రెడ్డి ద్వితీయ స్థానం, డాక్టర్ వైష్ణవి మూడోస్థానం సాధించా రు. వీరిని సోమవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి జమున ప్రత్యేకంగా అభినందించారు. వీరిని గైడ్ చేసిన జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ వినయ్, ఫ్యాకల్టీలందరినీ అభినందించారు. హంస వాహనంపై శ్రీరంగనాథుడు – ముగిసిన బ్రహ్మోత్సవాలు పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ సమీపంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 9వరోజు సోమవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పగలు శ్రీరంగనాథస్వామికి ఆలయ ప్రధాన అర్చకు లు కృష్ణరాజేష్శర్మ విజేష పూజలు జరిపించా రు. చక్రస్నానం చేయించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరంగనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈఓ కేవీ రమణ, సభ్యులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడి యట్ జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో 73 పరీక్షా కేంద్రాలకుగాను 2172 మంది హాజరుకాగా 43 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐవో టీఎన్వీ వెంకటేశ్వర్లు, రెండు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలతోపాటు డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎగ్జామినర్స్కు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. విద్యార్థుల డేటా మార్పునకు మరో అవకాశం – డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాలో కొన్ని మార్పులకు యూడైస్ ప్లస్ పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని డీఈఓ షేక్ షంషు ద్దీన్ తెలిపారు. తల్లిపేరు, తండ్రిపేరు, కులం, ఉపకులం, ఫొటోగ్రఫీ, సంతకం, గుర్తింపు చిహ్నా లు (పుట్టుమచ్చలు) వివరాలలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ నెల 12లోగా వినియోగించుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. పాలకమండలి సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దేవదాయ శాఖ డిప్యూటి కమిషనర్, ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఆసక్తిగల వారు కడప దేవదాయ శాఖ కార్యాలయంలో ధరఖాస్తు ఫారం తీసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును గండి ఆలయ కార్యాలయంలో గాని కడప దేవదాయ శాఖ కార్యాలయంలోగాని ఈనెల 26 లోపు అందజేయాలని సూచించారు. -
అంబేడ్కర్ భవన్ ప్రైవేటుపరం తగదు
కడప సెవెన్రోడ్స్ : పీపీపీ విధానం ముసుగులో కడప నగరంలోని అంబేడ్కర్ భవనాన్ని ప్రైవేటుపరం చేయడం తగదని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. సోమవారం నగర మేయర్ పాకా సురేష్కుమార్, ఉప మేయర్ నిత్యానందరెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గతంలో దళిత, బీసీ సంఘాలు చేసిన సుదీర్ఘ పోరాటంతో అంబేడ్కర్ భవనాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. అలాగే నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం, పాత మున్సిపల్ ఆఫీసు స్థలం, వైఎస్సార్ ఆడిటోరియంను అభివృద్ది పేరుతో ప్రైవేటుపరం చేయడం సమంజసం కాదన్నారు. మంగళవారం జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్వీ ప్రసాద్, వినోద్, లోక్సత్తా నాయకుడు దేవరశ్రీకృష్ణ, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, వివిధ సంఘాల నాయకులు జేవీ రమణ, డాక్టర్ శ్రీనివాసులు, దస్తగిరి, షేక్ మహమ్మద్ జాకీర్ హుసేన్, పీవీ రమణ, అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీ4ను పటిష్టంగా అమలు చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : పీ4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయడంతో పాటు అన్ని శాఖలు అన్ని ప్రామాణీకాల్లో వందశాతం పురోగతిని సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావ తి నుంచి జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా సంబంధిత కార్యదర్శులు, మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్లోని బోర్డు రూమ్ నుంచి కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. సా యంత్రం ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ అక్షరాశ్యత శాతాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, ఫైళ్లు భద్రత కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, సీపీవో హాజరతయ్య, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, మెప్మా,, డ్వామా పిడీలు రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్, అదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహనపెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిరూపొందించిన పోస్టర్లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వ నాథ్, జేసీ నిధి మీనాలతో కలిసి ఆవిష్కరించారు. -
విశ్వాసంతో ప్రార్థనలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : విశ్వాసులు మరియమాతపై విశ్వాసంతో ప్రార్థనలు చేయాలని ఫాదర్ జంపంగి రవిరాజ్, ఫాదర్ సల్లా మనోహర్ సూచించారు. స్థానిక మరియాపురంలో కొనసాగుతున్న లూర్దుమాత తిరునాల మహోత్సవంలో ఎనిమిదవ రోజు సోమవారం పాత చర్చి ప్రాంగణంలో ఫాదర్ జంపంగి రవిరాజ్ దివ్య బలి పూజ చేయగా దువ్వూరు విచారణ గురువు సల్లా మనోహర్ దైవ సందేశాన్ని అందించారు. ముందుగా పీఠం మీద జ్యోతిప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు ఈ సందర్భంగా ఫాదర్ సల్లా మనోహర్ ప్రసంగిస్తూ లూర్దు మాత భక్తులుగా మనం ఆ తల్లి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ కెథిడ్రల్ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్ ఎండీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర లూర్దుమాత మహోత్సవాల్లో ప్రధాన ఉత్సవమైన తిరునాల నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. బిషప్ సగిణాల పాల్ ప్రకాష్ పర్యవేక్షణలో మంగళ, బుధ వారాలలో రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు తిరుణాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. -
●భూపేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే...
సాక్షి ప్రతినిధి, కడప : కూటమి పాలన ‘కమ్మ’గా సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా... ఇంటా బయట పెరిగిన రాజకీయ ముప్పే అందుకు కారణమా అంటే... ‘అవును’ అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు జమ్మలమడుగులో పైచేయి సాధించడం, మరోవైపు పక్కలో బల్లెంలాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి నియామకం .. ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకొస్తున్నారు. భవిష్యత్లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉండడంతోనే వాంటెడ్ అటాక్కు సిద్ధమయ్యారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తిరుపతిలో బీజేపీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పక్కనే ఉండగా, కేవలం ‘కమ్మ’ వారికి ప్రయోజనం కలిగేలా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఎందుకిలా కఠినంగా, కుల కోణంలో మాట్లాడారనే విషయమై ఎన్డీయే కూటమిలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందుకు అనేక కారణాలు లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ అన్నట్లుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు కన్పిస్తోందని వివరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆది సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు కాంట్రాక్టు పనులతో పై చేయి సాధించారు. మరోవైపు సోదరుడు కుమారుడు భూపేష్రెడ్డికి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత దక్కింది. ఇది జీర్ణించుకోలేకే ఆది ఇలా మాట్లాడుతున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. బీజేపీ, టీడీపీలో సీఎం రమేష్ హవా... బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్నాయుడు స్వగ్రామం పోట్లదుర్తి. తన పరపతితో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదానీ హైడెల్ ప్రాజెక్టు పనులు చేజేక్కించుకున్నారు. ఆ పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే ఆది పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఏకంగా తన అనుచరులు వెళ్లి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి వాటాలు దక్కలేదు. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలో ఎంపీ రమేష్నాయుడు హవా కన్పిస్తోంది. మరోవైపు సోలార్ పనులు ఎర్త్వర్క్ పనులు కూడా ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి చొరవ నామమాత్రమే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు’గా పలువురు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు ఓ హెచ్చరిక సంకేతమని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని సీఎం రమేష్ను కట్టడి చేయకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా హెచ్చరికలు చేస్టున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ చేజారడం.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు... వెరసి చదిపిరాళ్ల భూపేష్రెడ్డికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈనెల 7న జిల్లా అధ్యక్షుడిగా భూపేష్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే అంటే 8వ తేదిన తిరుపతిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు సర్కార్ను టార్గెట్ చేశారు. జమ్మలమడుగులో ఇదివరకే దేవగుడి కుటుంబం నుంచి ఆదినారాయణరెడ్డికి ప్రత్యామ్నాయంగా భూపేష్రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా ఆది తెరపైకి వచ్చి అవకాశాన్ని తన్నుకుపోయారు. కాగా, ఇటీవల తన కుమారుడు సుధీర్రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొస్తానంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే టీడీపీ అధ్యక్షుడు భూపేష్రెడ్డిని బలోపేతం చేయాలనే ఎత్తుగడ ఆ పార్టీ అధిష్టానం అవలంబించడం ఎమ్మెల్యే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఆది’ వ్యాఖ్యలు ఎంతవరకెళ్లి అంతమవుతాయో వేచి చూడాలి. -
గ్రామాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కడప సెవెన్రోడ్స్ : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించడంలో కీలకభూమిక పోషించాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం స్థానిక జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో గ్రేడ్–4, గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీలు తొలుత చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందించాలని కోరారు. ఈనెల 14 వరకు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి మైథిలి, ఎంపీడీఓలు వీర కిశోర్, వెంగమునిరెడ్డి, దివిజ తదితరులు పాల్గొన్నారు. -
గురువు దాతృత్వం
ఖాజీపేట : ప్రతి మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు..విద్యనేర్పిన పాఠశాల గురువు .. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీరి రుణం ఈ జన్మలో ఎవ్వరూ తీర్చుకోలేనిది.. తమకు భవిష్యత్ను ఇచ్చిన పాఠశాల రుణం తీర్చుకోవాలని చాలా మంది ఆలోచించరు. కానీ ఖాజీపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థి.. అక్కడే గురువుగా పనిచేసిన ఒక ఉపాధ్యాయడు తాను చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలని భావించారు. వెంటనే ఏం కావాలో అలోచించి విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేడు రూ 1.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెలితే ఖాజీపేటలో బత్తెన మల్లారెడ్డి(94) తనకు తెలిసిన విద్యను అందించి వారికి వెలుగు నింపిన గురువు. ఈయన ఖాజీపేట లోని బాలుర ఉన్నత పాఠశాలలో 1947 నుంచి 1951 వరకు 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నారు. 1951 నుంచి 52 లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. తాను చదువుకున్న స్కూల్లోనే 1975 నుంచి 1980లో రెండు సార్లు మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. ఈ పాఠశాల తన జీవితాన్ని మార్చిందని, ఆ పాఠశాల రుణం కొంతలో కొంతైనా తీర్చుకోవాలని భావించారు. తన కుమారులతో సంప్రదించి రూ 1.50కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల స్థితి గతులను గమనించి సరైన ఆడిటోరియం, అలాగే గ్రంథాలయం లేదని భావించారు.వెంటనే ఇంజనీరింగ్ ప్లాన్తో, అధికారుల అనుమతులతో వేగంగా పనులును చేపట్టారు. భవనం పూర్తి కావస్తోంది తాను చదివిన, అలాగే జీవితాన్ని ఇచ్చిన పాఠశాల రుణం కొంతైనా తీర్చుకుంటూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.చందువుకున్న స్కూల్కు రూ 1.50 కోట్లతో భవననిర్మాణం -
నీటికుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
పోరుమామిళ్ల/కలసపాడు : పోరుమామిళ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్యార్డు సమీపంలో ఉన్న రెడ్డికతువ (నీటికుంట)లో ఇంటర్ విద్యార్థి సగిలి ఇమ్మానుయేలు(18) శవమై తేలాడు. సోమవారం సాయంత్రం సమాచారం పోలీసులకు చేరడంతో ఎస్ఐ హనుమంతు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. కలసపాడు మండలం ముద్దంవారిపల్లె ఎస్సీకాలనీకి చెందిన అన్వేటర్ భాస్కర్ మొదటిభార్య కుమారుడు ఇమ్మానుయేలుగా గుర్తించారు. ఈ విషయమై ఎస్ఐని విచారించగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడన్నారు. మృతికి ఎలాంటి కారణాలు లేవని, జారి పడటం వల్లే మృతి చెందాడన్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగిందని, దాంతో ఇమ్మానుయేలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడా? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మానుయేలు పోరుమామిళ్లలోని ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కళాశాల యాజమాన్యాన్ని విచారించగా ఇతను తెలివైన విద్యార్థి అని తెలిపారు. అయితే ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడని, కాలేజీకి తాగి వస్తుండటంతో తండ్రికి చెప్పామన్నారు.ఒకటి రెండు సార్లు ఊరు వదిలి వెళ్లి పోయాడని, మళ్లీ వచ్చాడన్నారు. మూడు రోజుల క్రితం కళాశాల వార్షికోత్సవానికి కూడా తాగి రావడంతో వాళ్ల నాన్నకు చెప్పి, అతన్ని ఇంటికి తీసుకుపోవాలని చెప్పామన్నారు. తెలివైన విద్యార్థి తాగుడుకు అలవాటు పడటం, ఇలా అకాల మరణం చెందటం బాధగా ఉందని కళాశాల యాజమాన్యం తెలిపింది. -
కడప ఉక్కు కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు?
పులివెందుల : రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని, అలాగే కడప – బెంగళూరు రైల్వే లైన్లపై పాలకులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రతిఘటించేదుకు విద్యార్థులు, యువత, ప్రజలు సిద్ధం కావాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్, ఆర్ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు వంశీ, ఉపాధ్యక్షులు బాలు, సాయి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని స్థానిక శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఈనెల 11, 12, 13వ తేదీల్లో జరిగే బైకు జాతకు సంబంధించి ఆర్ఎస్ఎఫ్ రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బైకు జాత జమ్మలమడుగులో ప్రారంభమై కన్యతీర్థం నుంచి ముద్దనూరు, తొండూరు మీదుగా పులివెందుల మెడికల్ కళాశాల, కడప – బెంగళూరు రైల్వే లైన్ ఆగిన పెండ్లిమర్రి వరకు ఉంటుందన్నారు. అనంతరం కడపలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ, కడప – బెంగళూరు రైల్వే లైన్, పులివెందుల మెడికల్ కళాశాల ప్రైవేట్పరం చేయడం ఆపాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కీలకమైందన్నారు. ఇది పూర్తయితే 10వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా, దీనికి అనుబంధంగా ఇంకా వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలపై ప్రభుత్వాలా నిర్లక్ష్యం వల్ల పరిశ్రమ శిలాఫలాకానికే పరిమితమైందన్నారు. అదేవిధంగా కడప – బెంగళూరు రైల్వే లైన్ కూడా రూ.2700 కోట్ల బడ్జెట్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తిచేయాలని 2008 లో ఐదు ఏళ్లకు పూర్తి చేయాలని శిలాఫకం వేశారని, ఇప్పటికి రూ.358 కోట్లు ఖర్చు చేసి పెండ్లిమర్రి వరకు రెల్వే లైన్ పూర్తి చేశారన్నారు. రాయచోటి, మదనపల్లి ప్రాంతాల్లో భూసేకరణ కూడా జరిగిందని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రైల్వే లైన్ నిరూపయోగంగా ఉందన్నారు. అదేవిధంగా వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు మరొక వరం పులివెందుల మెడికల్ కళాశాల అని, దీనిల్ల ఈ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను పూర్తి చేసుకోవచ్చునని, వైద్యం కూడా పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గరవుతుందన్నారు. కానీ ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్పరం చేస్తే వైద్య విద్య, వైద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళుతుందని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు నష్టమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు యాదవ్ -
చంద్రబాబు ఇప్పటికై నా క్షమాపణ చెప్పాలి
● సీబీఐ కంటే పెద్ద సంస్థ ఉంటే దానితో జరిపించాలి కానీ ఏక సభ్య కమిషన్ ఎందుకు..? ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డికడప కార్పొరేషన్ : తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం దర్యాప్తు చేసి సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికై నా ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ పవిత్రత గురించి పదే పదే మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందన్నారు. వైఎస్సార్సీపీని భూస్థాపితం చేయాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సర్వనాశనం చేయాలనే కుట్రతో గాలి వార్తల ఆధారంగా 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారన్నారు. జంతు కొవ్వు కలిసిందని, చేపనూనె కలిపారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై గౌరవం, వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉన్న వారెవరూ ఇలాంటి ప్రకటన చేయరన్నారు. భక్తుల మనోభావాలు తెలిసి ఉంటే తనకున్న అధికారంతో దర్యాప్తు చేయించి, నిజ నిర్ధారణ జరిగాక చెప్పి ఉండాలన్నారు. అలాకాకుండా రూ.120కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేలా నిందారోపణలు చేశారన్నారు. దీంతో తమ పార్టీ సుప్రీం కోర్టు తలుపుతట్టిందని, ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తారని సుప్రీం కోర్టు కూడా తలంటిందన్నారు. సీబీఐ వేసిన సిట్ బృందంలో ఏపీ అధికారులు కూడా ఇద్దరు ఉన్నారని, కేంద్రలో కూడా వీరు పొత్తు పెట్టుకున్న ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. 210 పేజీలతో సిట్ నివేధిక ఇవ్వగా పేజీ నంబర్ 44,62 లలో లడ్డుకు వాడే నెయ్యిలో జంతుకొవ్వులు కలవలేదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఇంత జరిగాక లెంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడితో సమావేశమై.. బాత్రూములు శుభ్రపరిచే రసాయనాలు కలిశాయని మరో అబద్ధం ఆడటం దుర్మార్గమన్నారు. 2024 జూలై 12,21,25, జూలై 24లో నెయ్యి ట్యాంకర్లలో నాణ్యతా లోపం ఉన్నందున టీటీడీ అధికారులు వాటిని తిప్పి పంపారన్నారు. అవి రాఘవేంద్ర క్రషర్ మిషన్ వద్ద ఉండి 20రోజుల తరా్వాత అవే ట్యాంకర్లు తిరిగి లోపలికి వచ్చాయన్నారు. అంటే టీటీడీ ఆ ట్యాంకర్లు వద్దని వెనక్కి పంపితే టీడీపీ వెల్కమ్ చెప్పిందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలో నెయ్యి రూ.320కి కొంటే, చంద్రబాబు హయాంలో రూ.290కే కొన్నారని గుర్తు చే శారు. బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని, 2019 మార్చి 6న ఆ సంస్థకు రూ.82వేల కిలోల నెయ్యిని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. సీబీఐ సిట్ దర్యాప్తు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లు ఇచ్చిన రిపోర్టులు నిజం కాదట, చంద్రబాబు చెప్పేదే నిజమట.. అని ఎద్దేవా చేశారు. సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అని, దానికంటే పెద్ద సంస్థ ఏదైనా ఉంటే దానితో దర్యాప్తు చేయించకుండా ఏక సభ్య కమిషన్ ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. చంద్రబాబుకు ఆత్మలేదని, అంతరాత్మ అంతకంటే లేదన్నారు. పాలు లేకుండా పెరుగు అమ్మిన వాళ్లు భూమ్మీద ఎవరూ లేరని, అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. లడ్డూలో మేం కల్తీ చేసింటే మా చేతులు పడిపోతాయని, మేం చేయకపోతే చంద్రబాబు మాట పడిపోతుందన్నారు. ఆనాడు ఎన్టీఆర్కు ద్రోహం చేశారని, ఇప్పుడు ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు స్వామిపట్ల భక్తి ఏమాత్రం లేదని, ఇంత దుష్ప్రచారం చేసి ఏడుకొండలవాడికి తీరని అపచారం చేసిన చంద్రబాబు చరమాంక దశ ఘోరంగా ఉండబోతుందని హెచ్చరించారు. -
ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తాలి
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాల్లో ఉపాధ్యాయల సమస్యలపై గళమెత్తాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరారు. సోమవారం సాయంత్రం కడపలోని సాయిబాబా స్కూల్లో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమకాలీన విద్యారంగ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేలా శాసనమండలిలో చర్చించాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పనిభారం ఎక్కువవుతోందన్నారు. దీంతో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపాధ్యాయులకు బోధరేతర పనుల నుంచి మినహాయింపు విషయంపై చర్చించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఎఫ్ నాయకులు సజ్జల రమణారెడ్డి, వెంకటనాథరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రమేష్, ప్రేమకుమార్, సుదర్శన్రెడ్డి, యూటీఎఫ్ నాయకులు మహేష్బాబు, కృష్ణారెడ్డి, ఎజాజ్ అహ్మద్, చంద్రశేఖర్, మహబూబాషా, ఆపస్ నాయకులు కొండారెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆర్జేయూపీ నాయకులు నరసింహారెడ్డి, పీఆర్టీయూ నాయకులు శివారెడ్డి, తిరుపాల్, సుబ్బారెడ్డి, లక్ష్మినరసయ్య, మధసూదన్రెడ్డి, ఎస్టిఎప్ నాయకులు రామాంజనేయులు, ఎస్ఆర్టిఎప్ నాయకులు నాగేశ్వరావు, ఏపీటీఎఫ్ సుబ్బారెడ్డి, పెంషనర్ల సంఘ నాయకులు నాగమునిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీకి ఉపాధ్యాయ సంఘాల నాయకుల వినతి -
ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్బాబు సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలతో అదనపు ఎస్పీ మాట్లాడారు. వారి ఫిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికా రులకు ఆదేశాలు జారీ చేశార మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. -
వక్ఫ్ భూముల స్వాధీనం చట్ట విరుద్ధం
కడప సెవెన్రోడ్స్ : మంగళగిరి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్బోర్డుకు చెందిన 71.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్దమని వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు విమర్శించారు. సోమవారం కలెక్టరేట్ పరిపాలనాధికారి కె.విజయ్కుమార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. వక్ఫ్బోర్డు లేదా భూమి యజమానులైన అంజుమిన్–ఇ–ఇస్లామియా అనుమతి లేకుండానే స్వాధీనం చేసుకున్నారని ఈ సందర్బంగా వారు తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ప్రభుత్వం పేపరు నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్పు చేశారని, వాస్తవానికి అది వక్ఫ్కు చెందిన భూమి అన్నారు. అలాగే మల్లయ్యపాలెం ప్రాంతంలో 232 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అత్యంత విలువైన ఈ భూములను సరైన వినియోగంలోకి తీసుకు వస్తే ముస్లిం సమాజానికి భారీ ఆదాయ వనరుగా ఉంటాయన్నారు. సీఆర్డీఏ పరిధిలో 50 వేల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా తీసుకున్న ప్రభుత్వం ఏపీఐఐసీ కోసం ఖరీదైన వక్ఫ్ భూములను తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అనుకూల వర్గాలకు ఈ భూములను కేటాయించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, వైఎస్సార్ సీపీ నాయకులు షఫీవుల్లా, ఎస్ఏ కరీముల్లా, బీహెచ్ ఇలియాస్, ఎస్.జమీల్, షేక్ అసిఫ్బాబా, ఫిరోజ్ఖాన్, మహమ్మద్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష
తొండూరు : తొండూరు పోలీస్స్టేషన్లో గతంలో ఇమాంబీ దర్గాలో హుండీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు సోమవారం ఏడాది జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కేసులో షేక్ జిన్నాభిగారి హిదయతుల్లా, షేక్ గైబూషావలిపై 305కింద కేసు నమోదు చేయగా.. విచారణ అనంతరం కోర్టు వారిని దోషులుగా నిర్ణయించిందన్నారు. అయితే సెక్షన్ 317(2) బీఎన్ఎస్ కింద నేరం రుజువు కావడంతో పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజి స్ట్రేట్ చంద్ర శేఖర్ రెడ్డి తీర్పు ఇచ్చారన్నారు. ఇద్దరు నిందితులకు ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.1,000చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒకనెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు గతంలో అనుభవించిన నిర్బంధ కాలాన్ని శిక్షాకాలంలో మినహాయించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీ జి.మధుసూదనాచారి, పులివెందుల రూరల్ సీఐ ఎన్వీ రమణ, తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటి కేసు చేధనకు కృషి చేశారు. ముగిసిన క్రికెట్ పోటీలు కమలాపురం: మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసింది. ఫైనల్ పోరులో కడప వారియర్స్ జట్టు ట్రోఫీని అందుకుంది. గత మూడు రోజులుగా భారతి సిమెంట్స్ క్రీడా మైదానంలో ఆల్ ఓవర్ ఇండియాలోని వైకాట్కు చెందిన 7 టీములు నాకౌట్ మ్యాచ్లు ఆడాయి. చివరి రోజు సోమవారం కడప వారియర్స్, పులి ప్యాకర్స్ జట్లు ఫైనల్లో తల పడ్డాయి. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పులి ప్యాకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప వారియర్స్ 173 పరుగులు చేసి గెలుపొందింది.. కాగా తమ స్టేడియంలో మూడు రోజులుగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పండుగలా జరిగిందని ప్లాంట్ హెడ్ రామమూర్తి తెలిపారు. తమ సిబ్బంది ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లాగా నిర్వహించారని అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం విన్నర్స్, రన్నర్స్లకు ట్రోఫీలు, ప్రైజ్మనీ అందించారు. ప్రతి క్రీడాకారుడిని మెడల్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు భార్గవ్రెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. కమిషనర్కు వినతిప్రొద్దుటూరు : స్థానిక వెల్లాల టిఫెన్స్ యజమాని గోవిందరెడ్డి సోమవారం మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4న ఏసీపీ నాగరాజు తమ హోటల్కు వచ్చి వన్ బై టు కాఫీ ఇవ్వాలని అడుగగా దానిని నిరాకరించినట్లు తెలిపారు. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీపీ వెంటనే జేసీబీని తీసుకొచ్చి హాటల్ వద్ద ఉన్న ర్యాంప్ను తొలగించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జేసీబీ డ్రైవర్ వెంకటేశ్వర్లు దురుసుగా వ్యవహరించారన్నారు. ఈ సంఘటనతో తాము భయబ్రాంతులకు గురయ్యామని, తమ ఇమేజ్కు పెద్ద నష్టం కలిగించిందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా ఏసీపీ నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా, ఔట్సోర్సింగ్ జేసీబీ డ్రైవర్ వెంకటేశ్వర్లును విధుల నుంచి తొలగించారు. -
నీకు.. బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా!
● బర్త్డే కేక్ తేస్తానని కూతురు పుట్టినరోజు నాడే ఆత్మహత్య ● బి.కొత్తకోటలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉదంతంబి.కొత్తకోట : ఆఫీసుకు వెళ్తున్నా.. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుట్టినరోజుకు బర్త్డే కేక్ తీసుకొస్తానని చెప్పిన భర్త కానరాని లోకానికి వెళ్లిపోయాడు. నా పుట్టినరోజుకు కేక్ తీసుకొస్తాడని వెళ్లిన నాన్న ఇంకెప్పటికి కేక్ తీసుకురాలేడని ఆ బిడ్డకు, సాయంత్రం తిరిగి వస్తానని చెప్పిన వెళ్లిన భర్త ఇక ఎన్ని సాయంత్రాలు గడిచినా ఆ మాటలు ఇక వినిపించవని తెలిసి ఆ కుటుబం కుప్పకూలిపోయింది. నీకు..బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా అని భార్యకు మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్బడిన భర్త గురించి గంటల వ్యవధిలో మరణవార్త వినడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు, భార్య తనపై ఆధారపడి ఉన్నారన్న విషయం తెలిసినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.సుబ్రమణ్యం (36) ఉదంతం ఆవేదనకు గురి చేస్తోంది. సోమవారం ఉదయం బి.కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు. రామసముద్రానికి చెందిన బి.సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గతేడాది జూలైలో బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లె సచివాలయానికి బదిలీ అవ్వగా స్థానిక బైపాస్రోడ్డులో కుటుంబంతో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సౌమ్య, ఐశ్వర్య (4), హైందవి (2) సంతానం. తల్లి నీలమ్మ ఉండగా తండ్రి రత్నప్ప మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి బి.కొత్తకోట సమీపంలోని కర్ణాటకకు చెందిన నాగిరెడ్డిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండగా సోమవారం ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకు బి.కొత్తకోట వెళ్తున్నానని, కుమార్తె ఐశ్వర్య జన్మదినం కావడంతో సాయంత్రం వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తానంటూ చెప్పి ఉదయం ఏడు గంటలకు నాగిరెడ్డిపల్లె నుంచి బి.కొత్తకోటకు బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 7.50 గంటలకు రామసముద్రంలో ఉంటున్న తల్లి నీలమ్మతో ఫోన్లో మాట్లాడాడు. ఈరోజు బిడ్డ ఐశ్వర్య పుట్టినరోజని, కేక్ తీసుకోవాలని చెబుతూనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని భారంగా మాట్లాడాడు. డబ్బులు లేవని, ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకున్నాడు. ఈ మాటలకు ఆందోళనకు గురైన నీలమ్మ విషయాన్ని కోడలు సౌమ్యకు చెప్పడంతో 8 గంటలకు సౌమ్య, నీలమ్మ, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడేందుకు కాల్ చేసినా తీయలేదు. ఆత్మహత్యకు సిద్ధం కావడంతో అంతకుముందు భార్య సౌమ్య ఫోన్కు.. నీకు, బిడ్డలకి నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను.. క్షమించండి అంటూ మెసేజ్ టైప్ చేశాడు కాని సెండ్ చేయలేదు. ఆ తర్వాత ఇంటిలోనే శ్లాబుకు ఉన్న కొక్కీకి వేసిన చీర, తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 8–9.15 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం ఆత్మహత్యకు పాల్బడిన విషయాన్ని స్థానికులు గుర్తించి ఇంటి యజమానికి, పొరుగు వాళ్లకు చెప్పడంతో వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు.. సుబ్రమణ్యం అర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, ఇప్పటికే పలుమార్లు ఆర్థికంగా సహయ పడ్డామని, మళ్లీ ఆర్థిక సమస్యలతో తమతో చెప్పుకోలేని ఆత్మహత్యకు పాల్బడినట్టు పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.మొబైల్లో పెట్టిన మెసేజ్ఆత్మహత్యకు పాల్బడిన సుబ్రమణ్య -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు మండలపరిధిలోని దైవ క్షేత్రమైన కన్నెతీర్థం వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తగుంటపల్లె 4 రోడ్ల కూడలి సమీపంలోని మలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ తిరగక పోవడంతో అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ఘటనలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల కథనం మేరకు. సొమవారం 40 మంది భక్తులతో కలసి రైల్వే కోడూరు నుంచి బస్సు జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం అమ్మవారి అలయానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసుకోని భోజనం అనంతరం తిరిగి తాడిపత్రిలోని అలూరు వద్ద ఉన్న రంగనాథస్వామి అలయానికి వెళుతుండగా జమ్మలమడుగు మండలపరిధిలోని కొత్తగుంటపల్లె గ్రామ సమీపాన రహదారిలో న్న మలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ తిరగకపోవడంతో బస్సు అదుపు తప్పి బొల్తా పడింది. ఈ సంఘటనలో రైల్వేకోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్య, దీక్షీత్, విజయలక్ష్మీ, నరసింహ్ములు, రమణయ్య, నాగేంద్ర మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నట్లు వారు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.బస్సు బోల్తా : 9 మందికి గాయాలు -
హెరిటేజ్ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మేము అబద్ధాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజూ ఆయనతో కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజూ మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలనే చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెర లేపారు. జంతువుల కొవ్వు కలిసింది అని మొట్టమొదటి అబద్దం చెప్పాడు. స్వామి వారి పవిత్రతకు భంగం కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయం మాట్లాడరు.గోప్యంగా విచారణ చేసి నిజాలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టులో సిదార్థ్ లూథ్రా వాదిస్తుంటే జడ్జీలు మాట్లాడిన మాటలు వింటే అన్నీ తెలుస్తాయి. ఆనాడు సుప్రీంకోర్టు మందలించినా మీకు బుద్ధి రాలేదు. సీబీఐ విచారణ వేసినా దర్యాప్తు చేసింది మీ అధికారులే కదా. వారిచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పారు. అప్పుడన్నా నన్ను క్షమించి స్వామీ అని దేవదేవుడిని కోరాల్సింది. అప్పుడు జంతు కొవ్వు అన్నావు.. ఇప్పుడు బాత్రూం కడిగేవి వాడారు అంటున్నావు. భోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా?.82వేల కేజీల నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు అనుమతించారు. సీబీఐ రిపోర్టు కాదని ఏకసభ్య కమిషన్ ఎలా వేస్తారు?. సీబీఐ దర్యాప్తు తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడమేంటి?. భోలే బాబా ఫ్రాడ్ అయినప్పుడు 82వేల కేజీల నెయ్యి ఎలా ఆర్ఢర్ ఇచ్చారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులే సరికాదని ఎలా చేప్తావు చంద్రబాబు?. బాబూ నీకు ఆత్మే లేనప్పుడు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఏంటి?. వైఎస్ జగన్ హయాంలో నెయ్యి నాణ్యతలో ఎక్కడా పొరపాటు చేయలేదు. బరితెగించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు.ఇది కూడా చదవండి: చంద్రబాబు హెరిటేజ్ గురించి తెలుసా.. నాసిరకం పెరుగు.. సీబీఐ సిట్ చెప్పినా, ల్యాబ్స్ చెప్పినా నారా వారి మాటే కరెక్ట్ అనాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు.. సీబీఐ విచారణ చేసినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు నీ హెరిటేజ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా కట్టావు. దీనికి పుల్ స్టాప్ పడాలంటే ఒక్కటే మార్గం.. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఇక నిరూపించుకోవాలి. దీనికి మేము జంతు కొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. జంతు కొవ్వు కలవకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలి. మీ ముగ్గురికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష తప్పకుండా విధిస్తాడు. స్వామి వారికి నువ్వు చేసిన అపచారానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ తర్వాత నీ జీవితంలో మంచి రోజులే ఉండవు. నీకు స్వామి వారి పట్ల భక్తి లేదు.. ప్రజల మనోభావాలపై గౌరవం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
జాతీయ స్థాయిలో ‘ఆర్కే వ్యాలీ’ ప్రతిభ
వేంపల్లె : అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్ థాన్ జాతీయ స్థాయిలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఈనెల ఆరో తేదీన జాతీయ హ్యాక్ థాన్లో తమ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతిని కై వసం చేసుకోగా, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చెందిన రెండు జట్లు రన్నర్గా నిలిచాయన్నారు. 10 ముఖ్యమైన క్వాంటం అంశాలపై ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఈ హ్యాక్ థాన్లో పాల్గొనగా.. ఉత్తమంగా 100 జట్లు జాతీయస్థాయి ఎంపికై అర్హత సాధించినట్లు తెలిపారు. ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉండగా మొత్తం 600 మంది యువ ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. విజేతలకు ప్రతి సమస్యకు 50 వేల రూపాయల నగదు బహుమతి, రన్నర్స్కు 30 వేల రూపాయలు నగదు బహుమతితోపాటు జాతీయస్థాయి గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారన్నారు. ఈ విజయానికి కొనసాగింపుగా గత శనివారం ఏడవ తేదీన అమరావతిలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ ఫౌండేషన్ కార్యక్రమంలో విజేతలకు, రన్నర్స్– అప్లను ప్రముఖులు సత్కరించి అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రీసెర్చ్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ రత్నకుమారి, డీన్ అకాడమిక్స్ రమేష్ కై లాస్, ఫైనాన్స్ ఆఫీసర్ జి.రమేష్, పరీక్ష నియంత్రణ అధికారి అరుణ్కుమార్రెడ్డి, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ కోఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు. -
తవ్వేకొద్దీ.. అవినీతి
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా కడప జీజీహెచ్తోపాటు ప్రొద్దుటూరు కేంద్రంగా జిల్లా ఆసుపత్రి, నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో దివ్యాంగుల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతోంది. రీ వెరిఫికేషన్ తర్వాత మరలా దివ్యాంగుల విజ్ఞప్తితో రీ–రీ వెరిఫికేషన్ పెట్టారు. రిమ్స్లో దివ్యాంగుల సర్టిఫికెట్లలో ప్రధానంగా అర్హులైన వారిలో కొందరికి అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అంతంత మాత్రం అర్హులు, పూర్తి స్థాయిలో అనర్హులకు మాత్రం కొందరు దళారుల పుణ్యమా అంటూ పింఛన్ దక్కినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దివ్యాంగుల సర్టిఫికెట్లను డబ్బులు వసూలు చేసుకుంటూ జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని విభాగాలలో ఈఎన్టీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాలతోపాటు, మరికొన్ని విభాగాలలో కూడా దళారులు వెంపర్లాడి సర్టిఫికెట్లను చేయించుకోవడంలో తమ వంతుగా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న కొందరు దళారులే మళ్లీ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఒక్కో రీవెరిఫికేషన్ సర్టిఫికెట్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని, తర్వాత రీ–రీ వెరిఫికేషన్ సమయానికి తమకు న్యాయం జరగలేదని కొందరు దివ్యాంగులు దళారులే తమకు ముక్తి ప్రసాదిస్తారని వారిని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలు, మండలాలలో దాదాపు 150 నుంచి 180 మంది దళారులుగా మారి గతంలో దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అక్రమార్జన చేసినట్లుగా రుజువులు కూడా బయటపడ్డాయి. ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంగా ఉన్న జీజీహెచ్లో ఓపీ విభాగంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు దివ్యాంగుల సర్టిఫికెట్ల కోసం దళారుల ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ లక్షలు కాస్త కోట్ల రూపాయల అక్రమార్జనకు దారి తీసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలుపత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. రిమ్స్ అధికారులు కొందరు ఉద్యోగులపై ఇటీవల చర్యలకు సిద్ధమయ్యారు. ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. వీరిలో ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అనే ముగ్గురిపై ప్రాథమికంగా వారి తప్పులు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. పై ముగ్గురు తమ ఫోన్ పేలలో దివ్యాంగుల సర్టిఫికెట్లకు సంబంధించి పలువురి దళారుల దగ్గర నుంచి డబ్బులు వేయించుకున్నట్లు సమాచారం తెలిసింది. వీరిలో ఒక ఉద్యోగి అకౌంట్లో ఏకంగా కోటి 86 లక్షలు, ఒక ఉద్యోగి అకౌంట్లో కోటి రూపాయలకు పైగా డబ్బులు దళారుల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరో ఉద్యోగి ఖాతాలో కూడా డబ్బులు విరివిగా దళారులు వేసినట్లుగా సమాచారం. ఇంకా కొందరు చిరుద్యోగులు ఇందులో దళారులుగా వ్యవహరించి దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో తమ వంతుగా అక్రమార్జనకు పాల్పడినట్లు సమాచారం. దివ్యాంగుల సర్టిఫికెట్లలో అవినీతి, అక్రమార్జన అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఒకవైపు అధికారులు తమ వంతుగా చర్యలు చేపడుతున్నా.. సస్పెన్షన్కు గురైన ఉద్యోగులు మాత్రం కొందరు కీలక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా చర్యలు ఉండేందుకు అన్ని విధాలుగా వారు గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు అనుకూలమైన దళారుల ద్వారా ‘పైసా వసూల్’ చేస్తూనే వున్నారని తెలుస్తోంది. ముగ్గురిపై విచారణకు ఏసీబీకి సిఫారసు దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ముగ్గురు అవినీతి ఉద్యోగుల పట్ల విచారణ కోసం అధికారులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు అవినీతి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాల సేకరణ సమగ్రంగా జరిపించేందుకు అవినీతి నిరోధక శాఖకు రిమ్స్ పరిపాలన అధికారులు ఇప్పటికే సిఫారసు చేశారు. విచారణకు సంబంధించి రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారంలో అవినీతి ఉద్యోగులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ విభాగానికి సిఫారసు చేశామని తెలియజేశారు. తాజాగా ఏసీబీ దాడులతో హడల్ కడప జీజీహెచ్లో బుధవారం మధ్యాహ్నం సదరం సర్టిఫికెట్ కోసం వీరపునాయునిపల్లెకు చెందిన వీరపుశేఖర్ తన భార్య చెవుడుకు సంబంధించిన సర్టిఫికెట్ కోసం ఆ విభాగానికి సంబంధం లేని ఆఫీస్ సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్యకు రూ.30 వేలు లంచంగా ఇచ్చాడు. అతను ఆ డబ్బులను తీసుకుని వెళ్లి సదరం కార్యాలయంలో ఇన్చార్జిగా వున్న మాదా వెంకటేశ్వర్లుకు రూ.25 వేలు ఇచ్చి, తాను మిగిలిన రూ.5 వేలను తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ డిఎస్పీ సీతారామారావు, సీఐ నాగరాజు, సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటనతో రిమ్స్ పరిపాలన విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ అధికారులు ఓపీ పరిపాలనా విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందితో స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు కేవలం చిన్నపాటి చేపలతో సమానం అని, ఇంకా అవినీతి తిమింగలాలు కొన్ని పట్టుబడితేనే బాధితులకు, నిజమైన దివ్యాంగులకు సరైన న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అక్రమాలు ప్రధాన విభాగాల్లో దళారులదే హవా కలెక్టర్ ఆదేశాలతో విచారణ ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ తాజాగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ జీజీహెచ్ యంత్రాంగందివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో తవ్వేకొద్దీ.. అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. కడప జీజీహెచ్లో ఏడుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురిని సస్పెన్షన్ చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఏసీబీకి సిఫారసు చేశారు. తాజాగా ఏసీబీ దాడులు నిర్వహించడంతో.. రిమ్స్ యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే ఇప్పటి వరకు దొరికింది చేపలేనని, తిమింగళాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
సైన్స్ ప్రయోగాల పోటీలకు ఎంట్రీల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8,9,10 తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి ‘యురేకా సైన్స్ ఎక్స్పో’ సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జేేవీవీ ప్రధాన కార్యదర్శి ఎన్.శివరాం తెలిపారు. కడప నగరం ద్వారకా నగర్లోని జేవీవీ కార్యాలయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ విస్త్తృత స్థాయి సమావేశం సమీర్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గత కార్యక్రమాల సమీక్షతోపాటు భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇన్నోవేషన్ – టెక్నాలజీ, పర్యావరణం – వ్యవసాయం, అపోహలు – శాసీ్త్రయ వివరణ అనే మూడు అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. తక్కువ ఖర్చుతో చేసిన ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక వీడియోలో గరిష్టంగా ముగ్గురు విద్యార్థులు పాల్గొనవచ్చని, నిడివి ఐదు నిమిషాలు మించకూడదని తెలిపారు. ఒక పాఠశాల నుంచి ఎన్ని టీమ్స్ అయినా పాల్గొనవచ్చని చెప్పారు. ప్రవేశ రుసుం రూ.50గా నిర్ణయించామని పేర్కొన్నారు. వీడియోలను గూగుల్ ఫామ్ లింక్ ద్వారా మార్చి 8లోపు పంపాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి అంశంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇస్తామని చెప్పారు. జిల్లా ప్రథమ విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. మార్చి 28న ఫలితాలు ప్రకటిస్తారన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజశేఖర రాహుల్, బాల బయన్న, సరస్వతి, జిల్లా నాయకులు రౌఫ్ బాష, ఖాసిం వలీ, సుబ్బయ్య, గురవయ్య, నగర కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, సమతా కన్వీనర్ రామసుబ్బమ్మ, డేవిడ్, రమణ, కుమారస్వామిరెడ్డి పాల్గొన్నారు. -
సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
● ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఎవరూ లేని వైనం ● మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుబ్రహ్మంగారిమఠం : సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో తమ కుటుంబ సభ్యుడు మృతి చెందాడంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనం కోసం శ్రీకాళహస్తి నుంచి శనివారం రాత్రి రామయ్యతో పాటు కూతురు, కోడలు కారు తీసుకొని వచ్చారు. దేవస్థానం పరిధిలో ఉన్న గోవిందమ్మ సదనంలో రూమ్ తీసుకుని ఉన్నారు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని సిద్దయ్యమఠం వెళ్లాలని అనుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రామయ్య ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. బి.మఠంలో ఎక్కడా ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఆర్ఎంపీలు ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అక్కడికి రామయ్యను తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్లగా.. డోర్ తీసి ఉంది తప్ప, ఏ ఒక్కరూ లేరు. కనీసం స్టాఫ్ నర్సు కూడా లేరు. రామయ్య కుటుంబ సభ్యులు అరుస్తున్నా పలికే దిక్కులేకపోవడంతో.. కారులో మైదుకూరుకు తరలించారు. దారిలోనే రామయ్య(61) ప్రాణాలు విడిచారు. అనంతరం బి.మఠం చేరుకున్న కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠంలో ఉన్న ఆసుపత్రిలో కనీసం నర్సు ఉన్నా ప్రాణాలు దక్కేవని ఆవేదన వెలిబుచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడంతోనే తమ పెద్ద దిక్కు మృతి చెందినట్లు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికై నా బి.మఠం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో చోరీ
రాజంపేట : చెయ్యేరు నది ఒడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు మొదట సోలార్ లైటింగ్ సిస్టమ్ను లాగేశారు. తలుపుల తాళాలు పగులగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రధాన అర్చకులు శివయ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ తలుపులు తెరిచి వుండటం చూసి, దొంగతనం జరిగిందని భావించారు. వెంటనే ఆలయ ధర్మకర్త నూకా చెంగల్రెడ్డి, మన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారణ చేశారు. హుండీ దగ్గరలో వేసి ఉంటారని పలువురు గాలించారు. అయినా దొరకలేదు. సాఫ్ట్బాల్ నూతన కార్యవర్గం ఎన్నికరాజంపేట రూరల్ : వైఎస్సార్ కడప జిల్లా సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఆర్అండ్బీ కార్యాలయంలో ఆ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు రామకృష్ణ(సత్యసాయి జిల్లా), విజయ్(కర్నూలు జిల్లా), కామేశ్వరమ్మ (నెల్లూరు జిల్లా)లు ఈ ఎన్నికకు అబ్జర్వర్లుగా వ్యవహరించారు. చైర్మన్గా డి.సుధాకర్యాదవ్, అధ్యక్షుడిగా శ్రీకాంత్రెడ్డి, సెక్రటరీగా రామసుబ్బారెడ్డి, ట్రెజరర్గా శివకుమార్, జాయింట్ సెక్రటరీలుగా రామకృష్ణారెడ్డి, జగదీశ్వరయ్య, ఉపాధ్యక్షుడిగా శివశంకరరెడ్డి, ఈసీ మెంబర్లుగా జేసునాథ్రెడ్డి, పి.కల్యాణ్, బి.పద్మావతి, సీవీ రమణారెడ్డి, అరుణ కుమారీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా శివాజీ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుబ్రమణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, నాజీ వ్యాయామ ఉపాధ్యాయులు షామీర్బాషతో పాటు సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దువ్వూరు : మండలంలోని ఐ.బయనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె గ్రామానికి చెందిన వరికూటి బాబు(45) ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లా చాగలమర్రికి ట్రాక్టర్లో ఇటుకులు తీసుకుని పోతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కడప – కర్నూలు జాతీయ రహదారిపై ఐ.బయనపల్లె మెట్ట వద్దకు రాగానే ట్రాక్టర్ను.. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ అదుపు తప్పి రహదారిపై ఉన్న బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ వరికూటి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్య, పిల్లలు, తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. శనగ పంట దగ్ధం లింగాల : అగ్ని ప్రమాదంలో చేతికొచ్చిన 2 ఎకరాల శనగ పంట దగ్ధమైంది. ఈ సంఘటన లింగాల మండలం పరిధిలోని రామన్నూతలపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చామ గంగిరెడ్డి 4 ఎకరాలలో సాగు చేసిన శనగ పంట కోతకు వచ్చింది. అయితే ప్రమాదవశాత్తు ఆదివారం రెండు ఎకరాల పంట పూర్తిగా కాలిపోయి బూడిద అయింది. లక్ష రూపాయలకు పైగా నష్టం వచ్చిందని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు. చౌక బియ్యం పట్టివేతచింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని పవర్ గ్రిడ్ చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న చౌక దుకాణం బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కడప నుంచి రాయచోటికి అక్రమంగా తరలిస్తున్న 70 సంచుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని, రవాణా చేస్తున్న వాహనాన్ని, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందుకు కారణమైన నలుగురిపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మద్యం బాకీ విషయమై పరస్పర దాడులు
బద్వేలు అర్బన్ : మద్యం బాకీ విషయమై ఆదివారం మద్యంషాపు యజమాని, కొనుగోలుదారుడు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మద్యంషాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండారెడ్డివీధికి చెందిన విష్ణుమోహన్రెడ్డి పోరుమామిళ్ళ బైపాస్ రోడ్డులో కార్తీక్ వైన్స్ పేరుతో మద్యం షాపు నిర్వహిస్తున్నాడు. బి.కోడూరు మండలానికి చెందిన రామిరెడ్డి రోజూ కార్తీక్ వైన్స్లోనే మద్యం కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో రామిరెడ్డి కార్తీక్ వైన్స్లో మద్యం అప్పునకు తీసుకుని వెళ్లాడు. దీనిపై మద్యం దుకాణ నిర్వాహకుడు విష్ణుమోహన్రెడ్డి తన దుకాణంలో పని చేసే గుమస్తాతో బాకీ విషయమై రామిరెడ్డికి ఫోన్ చేయించాడు. దీంతో దుకాణం వద్దకు వెళ్లిన రామిరెడ్డికి, షాపు నిర్వాహకుడికి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రామిరెడ్డి తన గ్రామం నుంచి బంధువులను పిలిపించి ఆదివారం సాయంత్రం హెచ్పీ పెట్రోలు బంకు సమీపంలో ఉన్న విష్ణుమోహన్రెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో విష్ణుమోహన్రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి వచ్చేసరికి గొడవ సద్దుమణిగింది. గాయపడిన విష్ణుమోహన్రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుమోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డితోపాటు మరో నలుగురిపై అర్బన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేశారు. ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి.. వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోట నగర్కు చెందిన రిటైర్డ్ లెక్చరర్ అందలం రంగనాయకులు ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తులు మార్చి 30 వేలు అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగి రంగనాయకులు ఈ నెల రెండవ తేదీన తన పెన్షన్ డబ్బుల కోసం వేంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్లారు. పెన్షన్ డబ్బులు పడ్డాయా, లేదా అని తమ పక్కనే ఉన్న వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి చూడమన్నారు. ఆ తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు పడలేదు అని తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డును మార్చి ఇచ్చారు. ఆ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి వెళ్లిన గంట తర్వాత రూ.20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. మరలా రూ.10 వేలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లి చూడాలని కోరారు. మీకు వచ్చిన పెన్షన్ డబ్బులు గంట క్రితమే డ్రా చేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి అవాక్కయ్యారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా.. ఇది మీది కాదని మీ ఏటీఎం కార్డు ఎవరో దొంగలించారని వివరించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వృద్ధుడు తెలిపారు. ఏ విధంగానైనా పోయిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.మద్యం షాపు యజమానికి తీవ్ర గాయాలు -
చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులుమాట్లాడుతున్న మాజీ మేయర్ కె.సురేష్బాబుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జనగణనలో సమగ్రంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మేయర్ కె.సురేష్ బాబు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం బీసీలు క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. కడప నగరంలోని బీసీ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు, సమగ్ర కులగణన చేపట్టాలని కోరుతూ ఆదివారం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టి, అందుకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణనలో కులగణన చేపట్టి, కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలనేది దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వెనుకబడిన తరగతులు ఎల్లప్పుడూ వెనుకబడే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణనలో కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందని, బీసీలలో సమాంతరమైన అవకాశాలు కల్పించేందుకు ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులగణనలో సమగ్రంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, నాయకులు యానాదయ్య, సానే శ్రీనివాసులు, డాక్టర్ మల్లెల భాస్కర్, ప్రతాప్ యాదవ్, ఖాదర్ బాషా, వెంకటేశ్వర్లు, బసవరాజు, గోపాల్, సంగటి మనోహర్, వెంకటశివ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ స్టేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్రావు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఈయూ జోనల్ అధ్యక్షుడు కేకే కుమార్ అధ్యక్షతన 10వ జోనల్ నిర్మాణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు పేరుకుపోయి రూ.40 వేల కోట్ల వరకు చేరుకున్నాయన్నారు. రిటైర్డు అయిన ఉద్యోగులు, మృతి చెందిన కుటుంబాలకు చెల్లించాల్సిన సెటిల్మెంట్ డబ్బు వెంటనే చెల్లించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పెన్షనర్లు, సేవలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, డీఏ, లీవ్ ఎన్క్యాష్మెంట్, సరెండర్ లీవు బకాయిలు దశల వారీగా చెల్లించడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సీ్త్ర శక్తి మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. ఓవర్ లోడ్ కారణంగా జరిగిన చిన్న పొరపాట్లకు తనిఖీ అధికారులు నమోదు చేసిన కేసులపై వాస్తవాలను పరిశీలించకుండా డిపో మేనేజర్లు సస్పెండ్, రిమూవ్, తీవ్రమైన పనిష్మెంట్లు విధించడం అన్యాయమన్నారు. ఈ విధానం మారకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే రాష్ట్ర స్థాయి ఆందోళనకు వెళతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున 3 వేల కొత్త బస్సులను పెంచాలని, డ్రైవర్, కండెక్టర్, మెకానికల్ తదితర కేటగిరిల్లో ఉన్న సుమారు 8 వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని కోరారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి : ఈడీ కడప జోన్లోని అన్ని కేటగిరిల ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. కడప జోన్లోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు, జోనల్ కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు అర్జున్, నబీ రసూల్, ఈఆర్ కుమార్, మద్దిలేటి, పీఏ మజీద్, వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, విజయ్కుమార్, మురళీధరన్, మురగమ్మతోపాటు జోనల్ కమిటీ సభ్యులు, 8 జిల్లాల నాయకులు, 51 డిపోల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఈ నెల 17 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించారు. ఇప్పటికే అన్ని స్కూళ్లలో మోడల్ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ● ప్రీ ఫైనల్ పరీక్షలను ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఫిజికల్ సైన్సు 50, బయాలజీ 50 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరిన ప్రశ్నపత్రాలు పరీక్షకు గంట ముందు స్కూళ్లకు... -
నేటి గ్రీవెన్స్సెల్ రద్దు
కడప సెవెన్ రోడ్స్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్సెల్ రద్దు చేసినట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్వహించే వర్చువల్ సమావేశానికి కలెక్టర్, ఎస్పీ, సహా జిల్లా అధికారులు పాల్గొననున్న నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్ రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. కడప కోటిరెడ్డి సర్కిల్: మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో కడప పాత బస్టాండ్ నుంచి సోమ వారం పొలతలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు కడప డిపో మేనేజర్ కన్యాకుమారి తెలిపారు. కడప పాత బస్టాండ్ నుంచి ఉదయం 6.30, 9.00 గంటలకు, 11.30, 2.15, 4.45 గంటలకు ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయ న్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం 80 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలకు 92 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్ పరీక్షల తనిఖీలో భాగంగా ఆర్ఐవో టీఎన్వీ వెంకటేశ్వర్లు, రెండు ప్లయింగ్ స్వ్కాడ్ బృందాలతోపాటు డీఈసీ సభ్యులు కలిసి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎగ్జామినర్స్కు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. కడప కోటిరెడ్డి సర్కిల్: ఎంప్లాయీస్ యూనియన్ కడప జోన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జోనల్ అధ్యక్షుడుగా పీఎస్ ఖాన్ (అనంతపురం డిపో), జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సి.మధు(చిత్తూరు–1 డిపో), వైస్ ప్రెసిడెంట్గా రామాంజనేయులు (కడప జోనల్ వర్క్షాప్), జోనల్ కార్యదర్శిగా ఎన్.రాజశేఖర్(డిపోటీఓ కార్యాలయం, కడప), కోశాధికారిగా పీఎన్పీ రెడ్డి (ప్రొద్దుటూరు డిపో), పబ్లిసిటీ సెక్రటరీగా ఓబుళరత్నం (అనంతపురం డిపో), మరో 20 మందిని ఉపాధ్యక్షులుగా, జాయింట్, ఆర్గనైజింగ్, అసిస్టెంట్ సెక్రటరీలుగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు కడప జోనల్ అధ్యక్షులుగా కొనసాగిన కె.కృష్ణకుమార్ను, అన్నమ్య జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న నాగభూషణం రెడ్డిలను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారని జోనల్ అధ్యక్షుడు కేకే కుమార్ తెలిపారు. మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. రాజుపాళెం: ప్రమాదాన్ని పసిగట్టి డ్రైవర్ బస్సును ముందే ఆపిన సంఘటన రాజుపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రోజూ మాదిరిగా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో నుంచి వయా రాజుపాళెం మీదుగా టంగుటూరు నుంచి చాగలమర్రి మండలంలోని చింతలచెరువు గ్రామానికి బస్సు వెళ్లాల్సి ఉంది. అయితే రోజూ వెళ్లే ఆర్టీసీ బస్సు మరమ్మతుల కారణంగా ఆదివారం డిపో సిబ్బంది వేరే బస్సును పంపించారు. ప్రొద్దుటూరులోని పాతబస్టాండు నుంచి మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవరు రాజుపాళెం గ్రామ సమీపంలోని కేసీ చాపాడు కాలువ దాటగానే టక్ అని శబ్ధం రావడంతో.. ఈ విషయాన్ని చాకచక్యంగా గమనించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ ‘మీరంతా ధైర్యంగా ఉండండి’ అని చెప్పి కొద్దిసేపటికి బస్సును నిలబెట్టాడు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే డీజిల్ ట్యాంకుకు రంధ్రం పడటంతో కొద్దిమేర డీజిల్ నష్టమైందని ప్రయాణికులు తెలిపారు. ఇందులో డ్రైవర్ తెలివి తేటలకు 30 మంది ప్రాణాలు నిలబడ్డాయని, అక్కడున్న వారంతా ‘సలాం... డ్రైవరన్న’ అంటూ సెల్యూట్ చేయడం విశేషం. అయితే క్షేమంగా గమ్యం చేరాలంటే కండిషన్లో ఉన్న బస్సులను తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట రూరల్: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటయిన అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేది నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. 19వ తేది వరకు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15,16,17వ తేదీల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సబ్కలెక్టర్ భావన, తహసీల్దార్ పీర్మున్నీ, మున్సిపల్ కమిషనర్ జీ.శ్రీనివాసులు, దేవస్థాన కమిటీ చైర్మన్ పూల నాగమణీ, మన్నూరు సీఐ మస్తాన్లతో సమావేశమై సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ శివరాత్రి, 16న కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి కల్యాణం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు వైభవంగా నిర్వహించనున్నారు. 17వ తేది ఉదయం 10 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది. 15న శివరాత్రి, 16న కళ్యాణం, 17న రథోత్సవం ముస్తాబవుతున్న ఆలయం -
పీపీపీకి స్వస్తి చెప్పకపోతే ఆందోళన
కూటమి ప్రభుత్వం నగరపాలక సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తే సహించం. ప్రభుత్వం పీపీపీ ప్రతిపాదన నుంచి వైదొలగకపోతే అన్ని పార్టీలు సంఘాలతో ఆందోళనలు చేపడతాం – సీఆర్వీ ప్రసాద్, జిల్లా కార్యదర్శి, హేతువాద సంఘం కూటమికి పతనం ప్రారంభమైంది కడపలోని విలువైన ప్రజా ఆస్తులను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ ,కార్పొరేట్లకు అప్పగించేందుకు ఈ నెల 10న జరిగే కడప మున్సి పల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం అజెండాలో పెట్టడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు స్థానిక కార్పొరేటర్లు చరమగీతం పాడాలి. –ఎన్. వెంకట శివ, నగర కార్యదర్శి, సీపీఐ -
లక్ష్యం చేరేనా?
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల సెస్సు వసూలు మంద కొడిగా సాగుతోంది. జిల్లాలో 2025–26 ఏడాదికి రూ. 1427.00 లక్షలు వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఫిబ్రవరి 05వ తేదీ నాటికి జిల్లాలో రూ. 1037.30 లక్షలు సెస్సు వసూలు చేశారు. ఇంకా ఈ ఏడాది 389.70 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలకు సంబంధించిన సెస్సు వసూలుకు కేవలం 54 రోజులో గడువు ఉంది. అంటే ఈ లెక్కన రోజుకు రూ. 7.21 లక్షలు వసూలు చేస్తే కాని మార్చి చివరి నాటికి లక్ష్యం పూర్తి చేయలేరు. మరి ప్రతి రోజు అన్ని మార్కెట్ కమటీలు కలిసి రూ. 7.21 లక్షల వసూలు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది. జిల్లాలో కడప, పొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, సిద్దవటం, ఎర్రగుంట్ల, రాజంపేటలలో మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశశగకు సంబంధించిన క్రయవిక్రయాలు జరుగగా మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు ఇతర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతాయి. కడప మందంజ... జిల్లాలో 11 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సెస్సు వసూళ్లలో కడప ముందంజలో ఉంది. కడప మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు ఉండగా ఫిబ్రవరి 5వ తేదీ నాటికి రూ. 187.08 లక్షలు వసూలు చేసి 91.26 శాతానికి చేరుకుంది. పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం 108 లక్షలు కాగా ఇప్పటి వరకు 92.28 లక్షలు వసూలు చేసి జిల్లాలో 85.44 శాతంతో రెండోస్థానంలో, బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు ఉండగా ఇప్పటి వరకు 151.74 లక్షలు వసూలు చేసి 74.07 శాతంతో జిల్లాలో మూడోస్థానంలో నిలిచింది. సింహాద్రిపురం మర్కెట్ కమిటీ సెస్సు వసూళ్లలో జిల్లాలో వెనకపడింది. ిసిద్దవటం మార్కెట్యార్డు లక్ష్యం రూ. 28 లక్షలు కాగా ఇప్పటి వరకు 14.24 లక్షలు వసూలు చేసి 50.86 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. జిల్లాలో 21 చెక్ పోస్టులు.... జిల్లాలోని మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ, మిగతా 10 మార్కెట్ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయి. పులివెందుల మార్కెట్ కమిటీ నుంచి బత్తాయి, అరటి, నిమ్మ వంటివి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్సు చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. ఇతర ఉత్పత్తుల ధరలో ఒక శాతం, వసూలు వరిధాన్యంపై 2 శాతం సెస్సు పసూలు చేస్తున్నారు. ఇంకా వసూలు చేయాల్సింది: రూ.389.70 లక్షలు ఫిబ్రవరి 5 నాటికి వసూలు చేసింది: రూ.1037.30 లక్షలు లక్య సాధనకు కృషి జిల్లాలోని మార్కెట్ కమిటీలు, చెక్ పోస్టుల ద్వారా వార్షికాదాయం ఏడాదికి రూ. 1427 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. అయితే ఇప్పటివరకు 1037.30 లక్షలు వసూలు చేశాం. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాం. – మురళీ మోహన్, మార్కెటింగ్శాఖ ఏడీ, వైస్సార్జిల్లా పడి లేస్తున్న మార్కెట్ కమిటీ సెస్సు వసూలు గడువు సమీపిస్తున్నా వదలని అధికారుల నిర్లక్ష్యం -
భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు
కడప సెవెన్రోడ్స్: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న లూర్దుమాత మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు నవదిన పూజా ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఏడవ రోజు స్థానిక మరియాపురం నుంచి గురువులుగా అభిషిక్తులైన ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ దివ్యబలిపూజను సమర్పించగా, వల్లూరు విచారణ ఫాదర్ శరత్ దైవ సందేశమిచ్చారు. సాతానుతో సహవాసం నరకానికి మూలమని, ఏసుక్రీస్తు సువార్త సందేశం రక్షణ మార్గమని అన్నారు. మరియమాత సన్నిధిలో విశ్వాసంతో వేడుకుంటే మనకున్న అన్ని సమస్యలు సమసిపోతాయని చెప్పారు. సెయింట్ మేరీస్ కెథిడ్రల్ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్లు హృదయ రాజు, ఫ్రాన్సిస్, ధర్మయ్య, గువ్వల మనోహర్, పీటర్ , వరప్రసాద్ లతో పాటు తిరుణాల కమిటీ అధ్య క్షుడు గుంతమళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్ ,ఉపాధ్యక్షుడు లూర్ధు, ట్రెజరర్ నంది మండలం విజయరాజు, ఎండీ అల్ఫోన్స్, ఇల్లూరి జయరాజు, గొట్లూరు జ్వాన్నేష్, విశ్వాసులు పాల్గొన్నారు. -
● కార్పొరేషన్ ఆస్తుల ధారాదత్తం తగదు
కడప సెవెన్రోడ్స్: కడప నగరపాలక సంస్దకు చెందిన అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియం, నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం, పాత మున్సిపల్ కార్యాలయాలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించబోమని, దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు సృష్టం చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్వీ ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త విధానంలో భాగంగానే పీపీపీ కింద ఇటీవల మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు ఇస్తోందన్నారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఆస్తులను కూడ అదే పద్ధతిలో ప్రైవేట్కు అప్పజెప్పే కుట్రపన్నడం దారుణమన్నారు. ిపీపీపీ కింద ఆస్తులను అప్పగించబోమంటూ మంగళవా రం జరగనున్న కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు కారు ఆంజనేయులు, వినోద్, బాషా, జేవీ రమణ, షిండే భాస్కర్, సీపీఐఎంఎల్ నాయకులు ఓబయ్య, డీఎం ఓబులేసు యాదవ్, లోక్సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ, ఆప్ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకుడు బండి జకరయ్య తదితరులు మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు శివారులోని మారెమ్మ దేవాలయం సమీపంలో ఉన్న పొలంలో విద్యుదాఘాతంతో బడుగు పుల్లయ్య(66) అనే రైతు శనివారం దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దనూరుకు చెందిన పుల్లయ్య గతంలో ఆర్టీసీలో డ్రైవరుగా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం పొలంలో పంటకు నీరు వదిలేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు మార్లు ఫోన్ చేసినా స్పందనలేదు. దీంతో రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు వారు గుర్తించారు. మోటరు బోరు ఆన్ చేయడానికి వెళ్లి స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్కు గురవడంతో పుల్లయ్య మరణించినట్లు భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్ వేంపల్లె : వేంపల్లె పరిధిలోని ఓ ఇంట్లో చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె పోలీసుస్టేషన్లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం వేంపల్లెకు చెందిన నామా నరసింహులు అనే డెలివరీ బాయ్, మరో మైనర్ బాలుడితో కలిసి శ్రీచైతన్య పాఠశాల వెనుక వైపు నివాసం ఉన్న వరికూటి రఘునాథ్రెడ్డికి చెందిన ఇంటికి ఉన్న తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆల్మారాలో ఉన్న రూ.25 వేల డబ్బుతోపాటు రూ.22 వేల విలువ చేసే 11 చీరలు దొంగలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో సీఐ నరసింహులు, ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాహిర్ హుస్సేన్లు కలిసి శనివారం హనుమాన్ సర్కిల్లో నిందితులైన నరసింహులు, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. తరువాత కోర్టులో హాజరుపరచి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి డబ్బులను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. -
వక్ఫ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక
● ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కడప కార్పొరేషన్ : వక్ఫ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆరోపించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలోని అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలు, మల్లారెడ్డిపాలెంలో 232 ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం అన్యాయంగా భూ సేకరణ చేసి ఏపీఐఐసీకి ఇవ్వాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా పత్రికా ప్రకటన జారీ చేసిందన్నారు. ఆన్లైన్ రికార్డుల్లో వక్ఫ్ భూమిగా ఉండాల్సిన దాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయడం అన్యాయమన్నారు. వందల కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను ఇలా ఏపీఐఐసీకి ఇవ్వడాన్ని ముస్లిం మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వైఎస్సార్సీపీ కూడా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాఽజధాని కోసం సీఆర్డీఏ ద్వారా 50 వేల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించిందని, ఈ 300 ఎకరాలు అలా ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. ఈ భూముల్లో ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడే విధంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయకుండా.. ఇలా టీడీపీ అనుకూల వర్గాలకు అప్పనంగా అప్పగించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. దీనివల్ల ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. ఈ భూమిని దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదన చేశారని, వక్ఫ్ బోర్డు సభ్యులెవరూ దీన్ని అంగీకరించలేదని.. అందుకే వారు బోర్డు మీటింగ్కు హాజరు కాలేదన్నారు. అయినా ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లడం చూస్తే ముస్లిం మైనార్టీల పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిగా ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉన్నారని, ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఆయన ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముస్లిం సమాజ ఆకాంక్షలకు విరుద్ధంగా కమిటీపై ప్రభావం చూపుతూ అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వక్ఫ్ భూములు కాపాడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
దొరికిన ఎర్రచందనం దొంగలు
రాజంపేట : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్ప డుతున్న ఐదుగురు స్మగ్లర్లు పోలీసులకు దొరికారు. నందలూరు, మన్నూరు పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 36 ఎర్రచందనం దుంగలు పట్టుకుని, ఐదుగురి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేతన్ విశ్వనాథ్ శనివారం మీడియాకు వెల్లడించారు. మన్నూరు అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాజంపేట మండలం రేణింతల అ రంధతివాడ సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్య లు చేపట్టారు. పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు పరారీ అయ్యేందుకు యత్నించారు. వారిలో ఒకరు పట్టుబడ్డారు. విచారణలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నేరాన్ని అంగీకరించారు. దాచిపెట్టిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి టీసుండుపల్లె మండలం మాచిరెడ్డిపల్లె గ్రామం పాలెంగడ్డ బిడికి చెందిన చౌదా రవికుమార్గా గుర్తించారు. గతంలో ఇతనిపై 12 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. నందలూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం నందలూరు మండలం మూతపడ్డ ఆల్వీన్ ఫ్యాక్టరీ వద్ద ఎర్రచందనం చెట్లు నరికి, దుంగలుగా మార్చి వాటిని అమ్ముటకు వస్తుండగా, నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో నందలూరు మండలం కోనాపురం కొత్తచాపలవారిపల్లెకు చెందిన ఆవుల రవికుమార్ ఉన్నారు. ఇతనిపై ఎర్రచందనానికి సంబంధించి 16 కేసులు ఉన్నాయి. పీడియాక్టు కూడా నమోదు చేశారు. నందలూరు మండలం ఎంఎంపురం పంచాయతీ కోనాపురం అరుంధతీవాడకు చెందిన పొత్తపి పెంచలయ్య, నందలూరు మండలం వెంకటరాజంపేటకు చెందిన చుక్కా మురళీ, నందలూరు మండలం కోనాపురం గ్రామం కొమ్మూరుకు చెందిన గుమ్మళ్ల రమేష్ ఉన్నారు. వీరి వద్ద నుంచి 21 దుంగలు, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విధులలో ప్రతిభ చూపిన రాజంపేట ఏఎస్పీ మనోజ్రామ్నాథ్ హెగ్డే, మన్నూరు సీఐ ప్రసాద్బాబు, నందలూరు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మన్నూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు, రెడ్శ్యాండిల్ ఇన్స్పెక్టరు సి.శంకర్రెడ్డిలను ఎస్పీ అభినందించారు. దారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ వల్లూరు(చెన్నూరు) : దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన మండలంలోని ఉప్పరపల్లె క్రాస్ రోడ్ వద్ద ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చింతకుంట సత్యనారాయణరెడ్డి అనే వృద్ధుడు నిలుచొని ఉండగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి గ్రామంలో దించుతానని చెప్పి మోటార్ సైకిల్పై ఎక్కించుకున్నాడు. కొంత దూరంలో ఉన్న బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి దించాడు. తాను పోలీసునని చెప్పి వృద్ధుడి వద్ద ఉన్న సుమారు 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ. 3,500 నగదు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన పోరుమామిళ్ల పట్టణం పెద్ద మసీదు వీధికి చెందిన షేక్ షఫీ అలియాస్ మహబూబ్ షఫీని మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4.6 గ్రాముల బంగారు ఉంగరం, రూ.3500 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్పై ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందారు. వారు ఆత్మహత్యకు పాల్పడేందుకే పట్టాలపై ఉండగా రైలు ఢీకొనడంతో.. పక్కనున్న ముళ్లపొదల్లోకి ఎగిరి పడిపోయి మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి జీఆర్పీ కడప సీఐ సుధాకర్రెడ్డి, ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగభూషణం చేరుకుని, పరిశీలించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన వారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సిద్దవటం మండలం మాధవరం గ్రామంలోని రోడ్డు నంబర్ :16లో నివాసం ఉండే తల్లీకూతుళ్లు రాజురామలక్ష్మమ్మ(80), పట్టెం లక్షుమ్మ(60)గా గుర్తించారు. వీరు ఇద్దరే నివసిస్తుంటారు. అయిన వారు ఎవరూ లేరు. వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన రాజురామలక్ష్మమ్మ, పట్టెం లక్షుమ్మ -
మెరుగు పేరుతో బంగారం అపహరణ
సింహాద్రిపురం : రాగి, ఇత్తడి సామాన్లకు మెరుగుపెడతామంటూ.. మహిళ మెడలోని బంగారును లాక్కెళ్లిన సంఘటన సింహాద్రిపురంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న శ్రీనివాసుల ఆచారి భార్య పద్మాలయ రంగనాయకమ్మ తన ఇంట్లో పని చేసుకుంటుండగా, ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి రాగి, ఇత్తడి సామాన్లకు మెరుగుపెడతామని చెప్పారు. రంగనాయకమ్మ రాగి చెంబు తెచ్చి ఇచ్చింది. దానికి మెరుగు పెట్టే పౌడర్ మా వద్ద ఉందని, ఇది తీసుకుని మీరే మెరుగు పెట్టుకోవచ్చునని నమ్మించారు. ఆమె వచ్చి ఆ పౌడర్ తీసుకునే లోపు మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైకుపై పరారయ్యారు. బాధితులు వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్ఐ అనిల్కుమార్కు తెలిపారు. సంఘటన స్థలానికి డీఎస్పీ మురళీ నాయ క్, సీఐ, ఎస్ఐలు చేరుకుని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. పులివెందుల, తొండూరు, లింగాల, కొండాపురం పోలీస్స్టేషన్లను అలెర్ట్ చేసి సీసీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రజలు కొత్త వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. -
బాబు పాలనలో ఆలయాలకు రక్షణ కరువు
ప్రొద్దుటూరు క్రైం : చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందువుల ఆలయాలకు భద్రత లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో రెండు రోజుల క్రితం ఆటవీ శాఖ అధికారులు కూల్చిన వారాహి మాత ఆలయానికి శనివారం రాచమల్లు వెళ్లి అక్కడ కూల్చిన కట్టడాలు, ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను పరిశీలించారు. ఆలయ సమీపంలో చుట్టుపక్కల టీడీపీ కౌన్సిలర్, ఇతర నాయకులు నిర్మించుకున్న ఫామ్ హౌస్లు, గెస్ట్హౌస్లు, భారీ విలాసవంతమైన భవనాలు చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వారాహి మాత ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫారెస్ట్ భూమిలో ఉందంటూ రాత్రి సమయాల్లో అటవీ అధికారులు వచ్చి ఆలయంలోని కట్టడాలను కూల్చడం దారుణమన్నారు. ఒక రోజు ఆగండి.. మండపాన్ని కూల్చొద్దంటూ పేద బ్రాహ్మణుడైన పూజారి కాళ్లు పట్టుకుంటానన్నా అధికారులు కనికరించలేదని తెలిపారు. జేసీబీతో కొత్తగా నిర్మాణం చేస్తున్న మండపాన్ని కూల్చారన్నారు. ఈ క్రమంలోనే నవగ్రహ మండపంపై రాళ్లు పడటంతో ఆ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తేనే చంద్రబాబు పాలనలో ఆలయాలకు ఉన్న భద్రత ఏ పాటిదో తెలుస్తోందని అన్నారు. టీడీపీ నాయకుల గెస్ట్హౌస్లు కనిపించలేదా? వారాహి మాత ఆలయంతోపాటు పరిసర ప్రాంతమంతా ఏటిపోరంబోకు, అటవీ భూమలు ఉన్నాయని రాచమల్లు అన్నారు. అయితే ఇందులో నిరుపయోగంగా ఉన్న 20–30 సెంట్ల స్థలంలో ప్రజల కోసం వారాహి అమ్మవారి ఆలయం నిర్మిస్తే అటవీ స్థలాన్ని ఆక్రమించారంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చినట్లు తెలిపారు. ఆలయం చుట్టూ టీడీపీ కౌన్సిలర్, నాయకులు రూ.కోట్లు వెచ్చించి ఫాం హౌస్లు, విలాస భవంతులు నిర్మించారన్నారు. వాటిలో స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసి రోజు వారి రూ. 5 వేలకు బాడుగకు ఇస్తున్నారని చెప్పారు. మందు పార్టీలు, విందులు, వ్యభిచారం, వినోదాలతో అర్ధరాత్రి సమయాల్లో కేరింతలు వేస్తుండటంతో ఆ ప్రాంత మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారని తెలిపారు. రాచమల్లు అక్కడున్న సమయంలోనే ఆ ప్రాంత మహిళలు వచ్చి ఇబ్బంది పడుతున్నట్లు వాపోయారు. గెస్ట్హౌస్ నిర్మించుకొని ఒక వ్యక్తి ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడన్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కనపడలేదా.. వారాహి ఆలయమే కనిపించిందా అని ప్రశ్నించారు. తన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్కల్యాణ్ ఇక్కడ వారాహి అమ్మవారి ఆలయాన్ని తన శాఖ అధికారులే కూలుస్తుంటే నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. ఆలయాలను కూల్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన భూములకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. భవిష్యత్తులో వారాహి అమ్మవారి ఆలయానికి ఆటంకం కలిగించరాదని అన్నారు. నూతన మండప నిర్మాణానికి సహకారం అటవీ అధికారులు కూల్చిన స్థానంలో ప్రత్యంగిరాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కోసం నిర్మించనున్న మండపానికయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఇందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆలయ నిర్వాహకుడు రవిశాస్త్రి తెలిపారు. ఈ మొత్తాన్ని తానే ఇస్తానని నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని రాచమల్లు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మండలాధ్యక్షుడు సానబోయిన శేఖర్యాదవ్, పార్టీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారాహి మాత ఆలయంలో మండపం, విగ్రహాలు ధ్వంసం చేశారు పేద బ్రాహ్మణుడు వేడుకున్నా అటవీ అధికారులు కనికరించలేదు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
అర్ధరాత్రి ఇల్లు కూల్చివేత దారుణం
– బద్వేలు శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ కడప వైఎస్ఆర్ సర్కిల్ : భారత రాజ్యాంగ దినోత్సవం జనవరి 26న అర్ధరాత్రి మాజీ సైనిక దళిత కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేయడం దారుణమని బద్వేలు శాసనసభ్యురాలు దాసరి సుధ అన్నారు. ఇల్లు కూల్చివేత ఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల ప్రారంభంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత మాజీ సైనికుడు సట్టి నరసింహులు కుటుంబానికి భారత రాజ్యాంగ దినోత్సవం అర్ధరాత్రి కాళరాత్రిగా మారడం దురదృష్టకరమన్నారు. కడప కలెక్టర్ బంగ్లాకు కుతవేటు దూరంలో ఎర్రముక్కపల్లె కందిపాలెం వద్ద, కలెక్టరేట్ మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్న ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేసిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ దౌర్జన్యకాండకు కారకులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పూర్తి పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను, వారికిచ్చే పరిహారాలను ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యేగా, మహిళగా అండగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. కారులో చెలరేగిన మంటలు బద్వేలు అర్బన్ : బద్వేలు– మైదుకూరు రహదారిలోని నందిపల్లె సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఇందుకు సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గోపవరం మండలం చెన్నవరం గ్రామానికి చెందిన ప్రతాప్రెడ్డి తన టీఎస్07 జేఏ 4799 నంబరు గల కారును మరమ్మతుల నిమిత్తం ట్రాలీ వాహనానికి కట్టి తీసుకెళుతుండగా.. నందిపల్లె సమీపంలోని దొడ్ల డెయిరీ వద్దకు వచ్చేసరికి కారులో మంటలు చెలరేగాయి. వెంటనే ట్రాలీ డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపి ట్రాలీని పక్కకు తప్పించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా ఫైర్ ఆఫీసర్ చంద్రుడు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో బ్యాటరీ సామగ్రి రాపిడి వల్ల అగ్నిప్రమాదంలో చోటు చేసుకుందని, దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన సమీక్షించారు.వంద శాతం పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 2059 పనులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు. ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ఎంపికై న మండలాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అదిశేషారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దయ్య, ఆయా శాఖల డివిజనల్ స్థాయి ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీపీ నాగరాజు సస్పెన్షన్
ప్రొద్దుటూరు: స్థానిక జార్జికారొనేషన్ క్లబ్ వద్ద ఉన్న వెల్లాల టిఫెన్ సెంటర్కు గురువారం వెళ్లిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఐ.నాగరాజు 1/2 కాఫీ ఇవ్వాలని అడిగాడు. టిఫెన్ సెంటర్ నిర్వాహకుడు రామగోవిందరెడ్డి తమ షాపులో అలా ఇవ్వడం కుదరదన్నారు. దీంతో అహం దెబ్బతిన్న ఏసీపీ టిఫెన్ సెంటర్ ముందున్న ర్యాంప్ను డ్రైనేజీ కాలువపై నిర్మించావంటూ నిమిషాల్లోనే జేసీబీని తెప్పించి ర్యాంప్ను కూల్చే ప్రయత్నం చేయడం.. యజమాని జేసీబీ అడ్డుగా పడుకోవడం జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని చోట్ల ఆక్రమణలను తొలగించిన తర్వాత తనది తొలగించాలని యజమాని పట్టుబట్టాడు. సమస్యను అధికారులకు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ అదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఏసీపీకి షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ● ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పనిచేస్తున్న ఐ.నాగరాజును సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రిప్లానింగ్ డైరెక్టర్ ఆర్జే విద్యుల్లత శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణకు సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఏసీపీ సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. విధుల నుంచి డ్రైవర్ తొలగింపు టిఫెన్ సెంటర్ వద్ద ర్యాంప్లను తొలగించేందుకు జేసీబీని తీసుకొచ్చిన ఔట్సోర్సింగ్ డ్రైవర్ వెంకటేశ్వర్లును విధుల నుంచి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తొలగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఏసీపీ సస్పెండ్ కావడంతోపాటు ఆయన మాట విన్న డ్రైవర్ సైతం ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. -
పరిపూర్ణ విశ్వాసంతోనే మానవాళికి రక్షణ
కడప వైఎస్ఆర్ సర్కిల్: పరిపూర్ణ విశ్వాసంతోనే మానవాళికి రక్షణ భాగ్యం కలుగుతుందని, సకల జనులను రక్షించేందుకు లూర్దుమాత తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించిందని రెవ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజ్, ఫాదర్ ధర్మరాజు అన్నారు. నవదిన పూజ ప్రార్థనల్లో భాగంగా ఆరవ రోజు శనివారం మరియాపురం పాత చర్చి ఆవరణలో ఫాదర్ ఆరోగ్య రాజ్ దివ్యబలి పూజను సమర్పించగా, ఫాదర్ ధర్మరాజు సీజేఏ దేవుని వాక్య సందేశాన్ని అందించారు. క్రీస్తు ప్రభువు నిర్దేశించిన మార్గం లోనే మనందరం నడవాలని సూచించారు. పాపకూపంలో కూరుకుపోయిన నేటి రోజుల్లో ప్రజలు దేవుడిని మరచిపోయి, ఇహలోక వ్యామోహాలతో బతుకుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని అన్నారు. మనుషులలో ఉన్నది దైవ క్రియలా? రాక్షస క్రియలా..? అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారు సూచించారు. ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న లూర్డుమాత తిరుణాల మహోత్సవంలో మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ సగిణాల పాల్ ప్రకాష్ దివ్య బలి పూజ సమర్పించనున్నారని, ఆ ప్రార్థనల్లో వేలాదిగా విశ్వాసులు పాల్గొని లూర్దుమాత దీవెనలు అందుకోవాలని కోరారు. పూజ ప్రారంభంలో ప్రత్యేకంగా అలంకరించబడిన లూర్డుమాత తేరును మరియాపురం పుర వీధుల గుండా భక్తిశ్రద్ధలతో జపమాలను జపిస్తూ ప్రదర్శించారు. -
తీవ్ర మానసిక ఒత్తిడి
కూటమి ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల పేరుతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూ ఒక వైపు ప్రకటనలు చేస్తూనే, మరోపక్క నిరంతరం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయలేక, మరో పక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు బోధనేతర కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నది. –మాదన విజయకుమార్, యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఒత్తిడి తగ్గించాలి ప్రభుత్వ టీచర్లు, ప్రధానోపాధ్యాయుల మీద ప్రభు త్వం ఒత్తిడిని తగ్గించాలి. బోధనకు ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమాల వల్ల టీచర్లు, ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల అనేక మంది ఉపాధ్యాయులు పాఠశాలలో, శిక్షణా కార్యక్రమాలలోనే గుండెపోటుతో మరణించారు. ఇప్పటికయినా ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తగ్గించి ప్రశాంత వాతావరణంలో బోధన కొనసాగేలా చూడాలి. – ఆదిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా పనిభారం
నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ఏ కమిషనైనా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని చెప్పినా ప్రభుత్వం మారడం లేదు. ఉపాధ్యాయులను రకరకాల యాప్లతో, వెబ్ కాన్ఫరెన్స్లతో, రిపోర్టులతో ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఒత్తిడి పెంచి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను ప్రశాంత వాతావరణంలో విద్యార్థులతో మమేకమై బోధించే వాతావరణాన్ని కల్పించాలి. అలాగే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. – లెక్కల జమాల్ రెడ్డి, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. -
రామయ్యకు స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్లు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. నందలూరు: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్థానిక పోలీస్స్టేషన్ను శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ను పరిశీలించడంతో పాటు రికార్డులను పరిశీలించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాలు, ఉపాధి అవకాశాలు, క్రైం రేట్, యాంటీ సోషల్ యాక్టివిటీస్పై ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. వల్లూరు(చెన్నూరు): మండల కేంద్రమైన చెన్నూరులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శనివారం జెండా ఊపి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యంతో ఏపీని పరిశుభ్రంగా ఉంచాలన్న ధ్యేయంతో గ్రామాల్లో ఇంటింటి నుంచి పొడి చెత్త సేకరణకు ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ప్రారంభించిందన్నారు. ఈ రథాల ద్వారా పొడి చెత్తను కిలోల రూపంలో విలువ కట్టి, 20 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. మైదుకూరు: ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.చంద్రానాయక్ తెలిపారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఆర్ఎస్కే సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రానాయక్ మాట్లాడుతూ రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ద్వారా రైతుల పేర్లను నమోదు చేయా లని ఆర్ఎస్కే సిబ్బందిని ఆదేశించారు. విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే పీఎంకిసాన్, రైతు పథకాలు వర్తించవని పేర్కొన్నారు. ప్రతి రైతు ఈనెల 15లోపు పంట నమోదు చేయించుకోవాలన్నారు. అప్పుడే క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్ట పరిహారం, వ్యవసాయ పరికరాలు, ఎరువులు సబ్సిడీపై రైతులకు వర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, మైదుకూరు, చాపాడు, దువ్వూరు, రాజుపాళెం ఏఓలు. ఏఈఓలు పాల్గొన్నారు. -
రంగ రంగ..వైభవంగా..
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో శ్రీరంగ నాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజాద్రవ్యాలు సమర్పించారు. ఆ దేవదేవుడిని దర్శించి తరించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అక్కడక్కడా భక్తులకు ప్రసాదాలు, శీతల పానీయాలను పంపిణీ చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కో–ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణలతో పాటు వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఈఓ వెంకటరమణ వారిని శాలువాలతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం గోవింద నామస్మరణతో శ్రీరంగనాథుని రథోత్సవాన్ని భక్తులు కదిలించారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్కు చేరుకుంది. స్థానిక పూల అంగళ్ల సర్కిల్లో తిరుణాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుణాలలో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. రథోత్సవం వెంబడి అళ్లగడ్డ లక్ష్మీ తేజశ్విని కోలాట బృందం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తిరుణాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ప్రజలు బొమ్మలు, ఇతర ఆట వస్తువులను కొనుగోలు చేశారు. కదిలింది శ్రీరంగనాథుని బ్రహ్మరథం దారిపొడవునా గోవింద నామస్మరణలు,భజనలు ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన -
యాప్ల భారం తగ్గించాలి
కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక బడుల్లో అనేక రకాల యాప్లను ప్రవేశ పెట్టింది. దీంతో ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బోధనకు సంబంధించిన పనులను వదులుకుని యాప్ల పనితోనే సమయం గడపాల్సి వస్తుంది. దీంతోపాటు ఉన్నతాధికారుల నుంచి ఒకటే ఒత్తిడి. దీంతో చాలా మంది ప్రధానోపాధ్యాయులు మానసిక అందోళనకు గురువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాప్ల భారాన్ని తగ్గించాలి – ఎస్.అమర్నాథరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. -
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీలతో కలిసి దేవదాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శైవక్షేత్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ మహా శివరాత్రి పండుగ సందర్భంగా అన్ని శైవక్షేత్రాలలో పోలీసు బందోబస్తు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలు సంబంధించి జిల్లా కలెక్టర్.. ఎస్పీ, అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. కడప నగర కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్ కడప జిల్లాను వ్యర్థ రహితంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జి ల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి.. మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని పట్టణ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలను వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పర్యావరణానికి, ప్రజలకు అసౌకర్యం, హాని లేకుండా నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశంపై జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో చర్చించినట్లు చెప్పారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తేనే దేవుడు ఆలకింపు
కడప సెవెన్రోడ్స్ : భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రార్థనలను మాత్రమే దేవుడు ఆలకిస్తారని ఫాదర్ ఈరి సుందర్ అన్నారు. కడప నగరంలో లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శుక్రవారం మరియాపురం పాత చర్చి ఆవరణలో ఆయన దివ్య బలిపూజ నిర్వహించారు. దయ, ప్రేమ, కరుణ కలిగిన సద్గుణ రాసి మరియమాత అని కొనియాడారు. అందరూ ఆమె కృపకు పాత్రులు కావాలన్నారు. ఫాదర్ ధర్మరాజ్ సీజేసీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. 1858లో ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో బెర్నదత్ అనే 14 ఏళ్ల బాలికకు దర్శనమిచ్చినందున ఆమెకు లూర్దుమాత అనే పేరు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ప్రార్థనలు చేసి తల్లి దీవెనలు పొందాలని సూచించారు. తిరునాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. తొలుత లూర్దుమాత స్వరూపాన్ని మరియాపురం వీధుల్లో ఊరేగించారు. దీప స్తంభానికి ఫాదర్లు, సిస్టర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్య బలిపూజలో విచారణ గురువులు ఈరి లూర్ధు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్ హృదయరాజు, ఫాదర్ సిప్రి యన్, ఫాదర్ సంబటూరు సురేష్, తిరునాల కమిటీ అధ్య క్షుడు గుంత మళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్, ఉపాధ్యక్షడు లూర్దు, ట్రెజరర్ నంది మండలం విజయరాజు, ఎండీ అల్ఫోన్స్, ఇల్లూరి జయరాజు, మేత్రాసన గురువులు, సిస్టర్లతోపాటు వివిధ విచారణలకు చెందిన గురువులు, ప్రజలు పాల్గొన్నారు. -
లడ్డూ ప్రసాదంతోనే కూటమి సర్వనాశనం
ప్రొద్దుటూరు : దేవదేవుడైన శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంతోనే కూటమి ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం మహా కుట్రకు తెరతీసిందన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా మూడు పార్టీలు మహా అపచారం చేస్తున్నాయన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడానికి కారణం అప్పటి ఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు అని ప్రచారం చేశారన్నారు. రాజకీయ స్వార్థంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే జగన్పై హిందువుల్లో వ్యతిరేకత కలిగించేలా విష ప్రచారం చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేశారని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైవీ సుబ్బారెడ్డి సుంప్రీకోర్టును ఆశ్రయించగా ఆ మేరకు విచారణ జరిగిందన్నారు. తప్పు చేసి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు కోర్టును ఆశ్రయిస్తుందని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత గొప్పదైన సీబీఐ విచారణ చేసి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చిందన్నారు. అప్పటి పాలకమండలికి, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని సీబీఐ సిట్ నివేదిక ఇవ్వడంతో వెంకన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేశారన్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లాంటి వారికి మాత్రం ఎంతో బాధ కలిగిందన్నారు. చంద్రబాబు కమిటీలను వేస్తూనే ఉంటాడు ఏ సంస్థ దర్యాప్తు లేకుండానే గాలి మాటలు మాట్లాడిన కూటమి పార్టీ నేతలు అబద్ధాన్ని నిజం చేసేందుకు మరిన్ని కుట్రలకు తెర తీశారన్నారు. సిట్ నివేదికతో సంతృప్తి చెందకుండా మళ్లీ ఏక సభ్య కమిషన్ను నియమిస్తానని చంద్రబాబు చెప్పడం దేనికి నిదర్శనమన్నారు. లడ్డూ ప్రసాదంపై ఆయన అనుకున్నది రాయించుకునే వరకు విచారణ కమిటీలను వేస్తూనే ఉంటారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
కమనీయం.. రంగనాథుని కల్యాణం
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద జరుగుతున్న శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. పురోహితులు మంగళసూత్రాలను భక్తులకు చూపించి స్వామివారి చేతికి తాకించి అమ్మవార్ల మెడలో వేశారు.శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులతో కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. అలాగే సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఆలయ ఈఓ రమణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
పని ఒత్తిడితోనే హెచ్ఎం ఆత్మహత్యాయత్నం
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప ఎడ్యుకేషన్ : కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్) ఇన్చార్జి హెచ్ఎంగా పని చేస్తున్న జమీనా సుందరం పని ఒత్తిడి, కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం కడపలో ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందేటట్టు ప్రభుత్వం తరఫున చూడాల్సిందిగా డీఈఓ షేక్ షంషుద్దీన్, నగరపాలక కమిషన్ మనోజ్కుమార్రెడ్డిలను సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో యాప్ల భారం అధికమవడం కారణంగానే జమీనా సుందరం పని ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ఆమె త్వరగా కొలుకోవాలని ఆయన కోరారు. -
● ఏసీపీకి షోకాజ్ నోటీసు
కడప కార్పొరేషన్: ‘రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లపై నడుస్తుందట’ఈ సామెత కడప నగరపాలక సంస్థకు అతికినట్లు సరిపోతుంది. పట్టించుకునే వారు లేకపోవడంతో కార్పొరేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కీలక విభాగాలైన రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్ విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో ఇంటి పన్ను వేయాలన్నా, ఖాళీ జాగాకు పన్ను వేయాలన్నా, ఆస్తిపన్నులో పేరు ఒకరి నుంచి మరొకరికి మ్యూటేషన్ చేయాలన్నా డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎవరైనా తమ పాత ఇంటిని పడగొట్టుకుంటే ఎప్పుడైతే పడగొట్టారో అప్పటి నుంచి ఖాళీ జాగా(వీఎల్టీ)కు పన్ను వేయాలి. కానీ ఇప్పుడు ఇంటిని కూల్చివేస్తే రెండున్నర సంవత్సరాలు వెనక్కిపోయి పన్నులు వేస్తున్నారు. కొత్తగా వేసే ఇంటి పన్నులకు కూడా ఇలాగే వేస్తున్నారు. దీంతో రూ. లక్షల్లో కార్పొరేషన్కు చెల్లించే బదులు అధికారులకు మామూళ్లు ఇస్తే సరిపోతుంది కదా...అని ప్రజలే లంచాలు ముట్టజెప్పే పరిస్థితిని కల్పిస్తున్నారు. కడపలో చాలా గ్రామ పంచాయితీలు విలీనమయ్యాయి. గ్రామ నత్తం భూములకు లింకు డాక్యుమెంట్లు ఉండే అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని టైటిల్ ట్రాన్స్ఫర్ చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పాత మున్సిపల్ ఏరియాలో వెస్ట్–1, నార్త్–1, సౌత్–1, చెమ్ముమియ్యాపేట, ఇందిరానగర్, పుట్లంపల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్ఐలు, అడ్మిన్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వార్డు అడ్మిన్ సెక్రటరీలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించారు. వారు మున్సిపల్ నిబంధనలు అర్థం చేసుకోలేక, అవగాహన లేక ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శలొస్తున్నాయి. టౌన్ప్లానింగ్ సెక్రటరీలను ఇన్చార్జి టీబీబీఓలుగా, ఎమినిటీస్ సెక్రటరీలను ఇన్చార్జి ఏఈలుగా నియమిస్తూ ఆయా శాఖలే ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ అడ్మిన్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా నియమించాలని సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు జారీ చేయకపోయినా కడప నగరపాలక సంస్థలో మాత్రమే కొందరిని ఉన్నత స్థానంలో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. గతంలో రెగ్యులర్ ఉద్యోగులే ఆర్ఐలుగా విధులు నిర్వహించేవారు. ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తారన్న భయంతో వారు కూడా బాధ్యతతో పనిచేసేవారు. కానీ సచివాలయ వ్యవస్థ వచ్చాక సంఖ్యాబలం ఉండటంతో కొందరు సెక్రటరీలు తప్పు చేసి కూడా చేయలేదని బుకాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉన్నతాధిరకారులకు డబ్బులు సంపాదించి పెట్టేందుకు ఉపయోగపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● పబ్లిక్ హెల్త్ సెక్షన్ పరువు గంగపాలవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో క్లాప్ యూజర్ చార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వం చెప్పినప్పటికీ కొందరు సెక్రటరీలు, సిబ్బంది అనధికారికంగా యూజర్ చార్జీలు వసూలు చేసి, వాటిని కార్పొరేషన్కు చెల్లించకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అసిస్టెంట్ సిటీప్లానర్గా పనిచేస్తున్న ఐ.నాగరాజుకు మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్థానిక జార్జిక్లబ్ ఎదురుగా ఉన్న వెల్లాల టిఫెన్ సెంటర్కు వెళ్లారు. తన మిత్రుడుతోకలిసి టిఫెన్ సెంటర్కు వెళ్లిన ఏసీపీ 1/2 కాఫీ ఇవ్వాలని అడిగాడు. తమ షాపులో ఆ సౌకర్యం లేదని షాపు యజమాని తిరస్కరించాడు. దీనిపై ఆగ్రహించిన ఏసీపీ తన మనుషులతో జేసీబీని తీసుకొచ్చాడు. టిఫెన్ సెంటర్ ముందు ర్యాంప్ డ్రైనేజీ కాలువపై నిర్మించారని తొలగించాలని ఏసీపీ తెలిపాడు. దీంతో షాపు యజమాని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ రవిచంద్రారెడ్డి ఏసీపీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో ‘ముదుర్లు’ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు చోద్యం చూస్తున్న అవినీతి నిరోధక శాఖ టౌన్ప్లానింగ్లో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సివిస్ సిస్టమ్ వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, టీపీబీఓల పాలిట వరంలా మారింది. కొత్తగా ప్లాన్ తీసుకోవాలన్నా, ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా ఎల్టీపీలు ప్లాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్ సెక్రటరీలు వాటిని వెరిఫై చేస్తారు. టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారులతో పనిలేకుండానే ప్లాన్లు వచ్చేస్తున్నాయి. దీంతో టీపీబీఓలు, కొందరు ప్లానింగ్ సెక్రటరీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం కూడా వీరికి కాసులు కురిపిస్తోంది. కడపలోని వైవీ స్ట్రీట్, చిన్నచౌకు వంటి ప్రాంతాల్లో చాలా వాటిని బీపీఎస్గా చూపి ఒక్కో బిల్డింగ్కు లక్ష నుంచి రెండు లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చోద్యం చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాాలంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఆపుకోలేని ఆవేదన
రాజంపేట: ఉమ్మడి జిల్లా రైలుమార్గంలో నంద్యాల–రేణిగుంట మధ్య నడిచే డెమోరైలులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మహిళలు చెప్పుకోలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఒక్కోసారి చాలా మంది మరుగుదొడ్లలో ఉండగానే రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణికులు సంక్షేమానికి పెద్దపీట అని చెప్పుకునే మోదీ ప్రభుత్వంలో రైల్వేశాఖ పనితీరుకు డెమోలో నరకప్రయాణం అద్దంపడుతోంది. సప్తగిరిలో పెట్టిన తరహాలో.. తిరుపతి–చైన్నె మధ్య నడిచే సప్తగిరిలో మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ఆ తరహాలో డెమోలో ఏర్పాటుచే యాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రయాణికులు కూడా సప్తగిరిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే వారు ఈ విషయంపై తరచూ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రయాణికుల ఆవేదనను అర్థం చేసుకొని పరిష్కారదిశగా విశాఖ జోన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. డెమోకు పెరుగుతున్న ఆదరణ పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రాముఖ్యత కలిగిన స్టేషన్లలో హాల్టింగ్స్ను ఎత్తివేశారు. కోవిడ్–19 ముందు ఉన్న హాల్టింగ్స్ ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు నంద్యాల–రేణిగుంట ఽమధ్య నడిచే డెమో రైలుపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ఈ రైలు రద్దీగానే తిరుగుతోంది. 8 గంటల ప్రయాణంలో నరకం.. నంద్యాలలో 5.30కు బయలుదేరి రేణిగుంటకు 12.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.45 కు బయలుదేరి రాత్రి 9.30గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. దాదాపు 8 గంటలకుపైగా డెమోలో ప్రయాణం కొనసాగుతుంది. నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లా వాసులు ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైలు ఆగితే స్టేషన్లోకి పరుగులు.. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో తమ అవససరాలు తీర్చుకునేందుకు రైలు ఆగగానే సేష్టన్లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు పరుగులు తీసుకున్నారు. ఇటీవల రాజంపేట, రైల్వేకోడూరు స్టేషన్లో ఇటాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికుల చెప్పుకోలేని ఆవేదనను రైల్వేశాఖపరిగణనలోకి తీసుకోలేదు. స్టేషన్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. నీటిసౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల గంటలతరబడి వృద్ధులు, పిల్లలు, మహిళలు అవస్థలు పడుతున్నారు. డెమో రైలులో ప్రయాణికులు డెమో ప్యాసింజర్ డెమో రైలును కాకుండా సాధారణ బోగీల (ఫార్మిసిన్)తో నడిపించాలని నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. డెమో రైలులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. అయితే యాత్రీకులు డెమోలాంటి రైళ్లలో ప్రయాణం బరువని, జనరల్ బోగీలతో నంద్యాల–రేణిగుంట రైలును నడిపించే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలించాలని కోరుతున్నారు. డెమో రైలులో మరుగుదొడ్లు కరువు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు పట్టించుకోని రైల్వేశాఖ రైల్వే అధికారులు స్పందించాలి కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలను కలుపుతూ నడిచే డెమో రైలులో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రైలులో మరుగుదొడ్డు ఏర్పాటుచేయాలి..లేదా ఫార్మిసిన్ మార్చాలి. సమస్యలపై రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి. –రాజశేఖర్రెడ్డి, డీఆర్యూసీసీ మాజీసభ్యుడు, నందలూరు మౌలిక సదుపాయాలు కల్పించాలి డెమో రైలు బాత్రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆపుకోలేని ఆవేదనతో ప్రయాణం చేయాల్సిన దుస్ధితి నెలకొంది. ఈ రైలు ప్రారంభం నుంచి సమస్య కొనసాగుతోంది. రైల్వే అధికారులు స్పందించి డెమోలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. –షమీవుల్లాఖాన్, న్యాయవాది, నందలూరు -
● ఇంజినీరింగ్ శాఖ‘ఇజ్జత్’పోతోంది
ఇక ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు పూర్తయ్యాక అగ్రిమెంట్ నుంచి మొదలుకొని పనులు చేసి, బిల్లులు పెట్టేంత వరకూ ప్రతి ఒక్కరి చేతులు తడపాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్ ఓపెన్ చేయడానికి, అగ్రిమెంట్ చేయడానికి, బిల్లు పెట్టడానికి, ఆ బిల్లు ఆమోదం పొందాలంటే కమిషనర్ పేషీలో, అకౌంట్ సెక్షన్లో ప్రతిచోటా మామూళ్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. దాని కోంస ఫోన్లు చేసి మరీ అడుగుతున్న పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి. -
గాయపడిన యువకుడి మృతి
మైదుకూరు : మండలంలోని జీవీ సత్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంచాల సూర్య (21) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని జాండ్లవరం గ్రామానికి చెందిన సూర్య గురువారం మైదుకూరు నుంచి బైక్పై గ్రామానికి వెళుతుండగా జీవీ సత్రం హైస్కూల్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో కారు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని మైదుకూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ట్రాక్టర్ ఢీకొనివృద్ధురాలి దుర్మరణంఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాశ్నగర్ గ్యాస్ గోడౌన్ వద్ద ట్రాక్టర్ ఢీకొని షేక్ కమాల్బీ(80) అనే వృద్ధురాలు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సున్నపుబట్టీల వీధిలో నివాసం ఉండే శ్రీను అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఉదయం ట్రాక్టర్ తీసుకుని రాళ్ల కోసమని ప్రకాశ్నగర్లోకి వెళ్లాడు. రోడ్డుపైన ట్రాక్టర్ తిప్పుతుండగా అదే సమయంలో రోడ్డు పక్కన ఇంటిలో ఉన్న షేక్ కమాల్బీ అనే వృద్ధురాలు కసువు ఊడ్చడానికి ఇంటి బయటికి వచ్చింది. ట్రాక్టర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు ట్రాక్టర్ అదుపులోకి తీసుకున్నారు.తెలుగుగంగ కాలువలో మరో యువకుడి మృతదేహంబ్రహ్మంగారిమఠం : మండలంలోని ముడమాల ఎస్సీ కాలనీకి చెందిన కోడూరు సతీష్కుమార్(20) అనే యువకుడు శుక్రవారం చిన్నాయపల్లె వద్ద గల తెలుగుగంగ కాలువలో శవమై తేలాడు. స్థానికులు సమాచారంతో ఎస్ఐ శివప్రసాద్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే కాలువలో గురువారం కూడా గుండాపురం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. 24 గంటలు కాక ముందే మరో యువకుడి శవం బయటపడటంతో పలు రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకుల మృతి సమస్యలతో కూడిన ఆత్మహత్యలా లేక హత్యలా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మృత దేహాలకు చెందిన కుటుంబీకులు సరిగా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలపై ఎస్ఐ కేసు నమోదు చేసి, శవాలను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అధైర్య పడొద్దు.. తగిన గుణపాఠం చెబుదాం
చక్రాయపేట: కూటమి నేతల ఆగడాలు మితి మీరి పోతున్నాయి..మనకూ సమయం వస్తుంది అప్పుడు తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉందని, అధైర్యపడొద్దని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గడ్డంవారిపల్లె గ్రామం గొందిలో టీడీపీ నేతల దుశ్చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న మబ్బు బాలయ్య ,రామయ్య, బాబు, వెంకటరమణ,,రేపన లక్షుమయ్య, డేరంగుల ఈశ్వర య్య,వీరాంజనేయులు నాయుడులను శుక్రవారం పరామర్శించారు, ఈసందర్భంగా తమ పట్టా భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా దారి వేసిందే కాకుండా తమపైనే తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు.తాము కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఎస్ఐకి ఇస్తే ఆయన దాన్ని తీసుకోలేదని చెప్పారు.తమ స్థలాలను సైతం ఆక్రమించు కున్నట్లు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.అలాగే వీరాంజనేయులు నాయుడు అనుభవంలో ఉన్న భూమిలో బోరు పైపులు కోసి వేసి మోటారును బోరులో వేయడమే కాకుండా భూమిని సైతం ఆక్రమించుకున్నారని చెప్పారు.వెంకటసుబ్బారెడ్డి,యోగీశ్వరరెడ్డిల పొలం వద్ద తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టించారని ఎంపీకి వివరించారు. ఈసందర్భంగా ఆయన సంఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని చెప్పారు.ఎప్పటికీ కాలం ఒకేలా ఉండదని రానున్న కాలం మనదే నని, అప్పుడు మనం కూడా తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అనంతరం పడకోన వంక నారవ వద్ద పైపులు వేసి తూముకుంటకు నీరు మళ్లిస్తే రైతుల పొలాలకు మేలు కలుగుతుందని మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కల్లూరు పల్లె గ్రామం ఉక్కుశిలవాండ్లపల్లెకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేత మనోహర్ నాయుడు నూతన గృహప్రవేశ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.కాట్లగంటి వారిపల్లెలో మండల గ్రాంటు కింది వేసిన తాగునీటి బోరును ప్రారంభించారు..కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి తనయుడు రోహన్ నాగిరెడ్డి, మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ,జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, పార్టీ గ్రీవెన్స్సెల్ కార్యదర్శి ప్రసాద రావు,జిల్లా కార్యదర్శులు ఈశ్వరరెడ్డి,రామాంజులరెడ్డి,మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి,రైతు విభాగం కార్యదర్శి కృష్ణారెడ్డి,గడ్డంవారిపల్లె సర్పంచ్ సురేష్కుమార్రెడ్డి, రంగారెడ్డి, శివారెడ్డి,రమణారెడ్డి,ఎంపీటీసీ కిరణ్కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి భరోసా -
26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం
● మూడు రోజుల పాటు కార్యక్రమాలు ● ఘనంగా ఏర్పాట్లు బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతిగా శ్రీ వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న శివైక్యం చెందారు. తదుపరి మఠాధిపతి పదవీ కోసం వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు ఒకరికొకరు పోటీ పడటంతో జాప్యం జరిగింది. ప్రధానంగా పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ట పుత్రుడు వెంకటాద్రిస్వామి, రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామి తీవ్రంగా పోటీ పడ్డారు. కోర్టు కేసులు నడిచాయి. చివరికి ధార్మిక పరిషత్ వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించింది. ఆయన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం మునిమనవడు. ఇప్పటి వరకు బ్రహ్మంగారిమఠానికి 11 మంది మఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వెంకటాద్రిస్వామి 12వ మఠాధిపతి. 24 నుంచి కార్యక్రమాలు వెంకటాద్రిస్వామి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నాయి. 24న ఉదయం సుప్రభాతం, మంగళతోరణ బంధన, మృత్తికా స్నపనం, సర్వ ప్రాయశ్చిత్తాలు, ప్రత్యక్ష కృఛ్రత్రయాలు, వేదోపనిషత్ పారాయణ, మంగళద్రవ్యాలతో అధిష్టాన మూర్తి దైవదర్శనం, అనుజ్ఞ, సప్త గోప్రదక్షిణ పూర్వక గోపూజ, ప్రధాన సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, అఖండ స్థాపన, రుత్విగ్వరణ, ధీక్షాధారణ, ప్రధాన కలశ స్థాపన, ఆయుష్య సూక్త పారాయణ, రుగ్వేద, యజుర్వేద పారాయణ, సర్వతోభద్ర మండల, కాలచక్ర, నవగ్రహ, దిక్పాలక, అధిష్టాన మూర్తుల, పూర్వ మఠాధిపతుల స్మరణ ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, అష్ట ద్రవ్య సహిత విశేష గణపతి హోమం, షోడశోపచార పూజలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, నిత్య విధులు, వేద పారాయణం, నిత్య హోమం, మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితరాలు నిర్వహించనున్నారు. ● 25న ఉదయం వేదోపనిషత్ పారాయణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచగవ్య ప్రాశన, ఆవాహిత మండపార్చనలు, కూష్మాండ సూక్త పారాయణ, సూర్యోపాశన, సూర్య నమస్కారాలు, హోమం, సప్తసాగర జీవనదుల వైదిక పూర్వక కలశా వాహనములు, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కాలజ్ఞాన చూర్ణికా హోమాలు, దూపదీప నైవేద్య మంత్ర పుష్ప నీరాజన తీర్థ ప్రసాదాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం నిత్య విధులు, సామ్రాజ్య మహాలక్ష్మీ సూక్త పారాయణం, హోమాలు, సప్తసాగర జీవ నదులు మంత్ర జలాలతో విశేష స్నపనం, వైదిక హోమం, వేదపారాయణం, మంత్ర పుష్పం, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ● 26న ఉదయం వేద సూక్త పారాయణ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, ఆవాహనాది దేవతా హోమాలు, సర్వశాంతర్థ్యం, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి బీజాక్షర సహిత చూర్ణికా హోమం, జయాది హోమం, మహా పూర్ణాహుతి, సాగర నదీ జలాల ఆవాహిత జలాలను సమంత్రకంగా, ప్రధాన కలశంలోనికి సమ్మేళన చేయుట, అవబృథస్నానం, పట్టాభిషేక వేదిక ప్రవేశం, కిరీట, ఛత్ర, చామర, ఆందోళిక అంగుళ్యీభరణ, మకరకుండల, శిఖాముద్రిక, సింహతలాట, సంహాసనాది, పేనదండ, రుద్రాక్షమాల, పాదుకా పూజ, సుమూర్తానికి ధారణ, అధిష్టాన మూర్తిదర్శనం, వేద స్వస్తి పండిత సత్కారం కార్యక్రమాలు చేపడుతారు. సాయంత్రం నూతన మఠాధిపతుల అనుగ్రహ భాషణం, వేదోక్త మంగళశాసనాలు ఉంటాయి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి బ్రహ్మంగారిమఠం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నూతన మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి తెలిపారు. ఇంత వరకు అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగాయి, ఇంకా ఏమి చేయాలి అనే దానిపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే దానిపై పరిశీలిస్తామన్నారు. మఠం ప్రగతి కోసం కందిమల్లయ్యపల్లె పుర ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ అధికారుల సహకారం తీసుకుంటామన్నారు. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం పట్టాభిషేకంపై చర్చిస్తున్న మఠాధిపతి, ఆస్థాన పండితులు (ఫైల్) మూడు రోజుల పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం అధికారులు, సిబ్బంది, స్వామి వారి శిష్యులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆహ్వాన పత్రికలను మఠం వారు అందజేసి పిలుస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
వారాహి అమ్మవారి ఆలయంలో నిర్మాణాల కూల్చివేత
ప్రొద్దుటూరు క్రైం: గతంలో రకరకాల సాకులతో రాష్ట్రంలోని ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు మరో ఆలయంపై పడింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలోని కొన్ని నిర్మాణాలను గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు జేసీబీతో కూల్చేశారు. అదే సమయంలో అక్కడున్న నవగ్రహ మండపం కూలిపోవడంతో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వెనుక భాగంలో కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వారాహి మాత ఆలయాలను దాతల సాయంతో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే కొత్తగా మరొక మండపం నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, అది అటవీశాఖ స్థలమని చెప్పి గురువారం రాత్రి అటవీశాఖ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో) హేమాంజలి సిబ్బందితో వచ్చి నూతన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నవగ్రహ మండపం, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలిసి వీహెచ్పీ, ఇతర హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అటవీశాఖ అధికారుల తీరును తప్పుపట్టారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం కూడా హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా వచ్చారు. ‘ఇది ఇక్కడి అటవీశాఖ అధికారులు చేసినపని కాదు... కర్నూలు నుంచి వచి్చన అధికారులు తొలగించారు.’ అని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తంచేసి.. స్థానిక అధికారులే కూల్చారని స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘ఈ ప్రాంతమంతా అటవీశాఖకు చెందినది. అనుమతి లేకుండా ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు’ అని చెప్పారు. దీనిపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం బయట కొత్తగా నిర్మాణాలు చేపట్టలేదని, లోపలే మండపం నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం ఇక ఈ ఘటనను ఎవరూ వివాదం చేయొద్దని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు ఆలయం ఎదుట ఎర్రగుంట్ల రోడ్డుపై బైఠాయించి ఆటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాతల సహకారంతో ఆలయం లోపల నిర్మాణాలు చేపడితే ఎలా కూల్చివేస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా భక్తులు వినలేదు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సుమారు గంటన్నర తర్వాత తహసీల్దార్ గంగయ్య వచ్చి ఆలయంలో కూల్చిన కట్టడాలను 15 రోజుల్లో తిరిగి నిర్మిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
కడపలో మహిళా హెచ్ఎం ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్: కడపలోని మున్సిపల్ హై స్కూల్ (మెయిన్)లో ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు.పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్ప రాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. వారు ఐఐటీల్లో చదువుతున్నారు. కొన్నేళ్లుగా మున్సిపల్ హైసూ్కల్ మెయిన్లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జమీమా సుందరం ఇటీవల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయులు, సిబ్బంది రికార్డుల వ్యవహారాలు, జీతభత్యాల నిర్వహణ వంటి బాధ్యతలతో పని ఒత్తిడి పెరిగింది. భర్త పుష్ప రాజ్ మొదట్లో రికార్డుల నిర్వహణలో సహాయం చేసినా.. ఇటీవల పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో హెచ్ఎం జమీమా సుందరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వాయిస్ మెసేజ్ పాఠశాల గ్రూప్లో పెట్టడంతో సహచర ఉపాధ్యాయులు వెంటనే ఇంటికి వెళ్లారు. వేలాడుతున్న ఆమెను కిందికి దించి ఎర్రముక్కపల్లె రహదారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీఈవో షంషుద్దీన్, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పని ఒత్తిడా.. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు యతి్నంచారా అన్నది తేలాల్సి ఉంది. -
సీమ ప్రజల్లో ఆందోళన
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోతే సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు వచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశానని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులతో రాయలసీమ ప్రజల్లో అభద్రత భావం నెలకొంది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల, రైతుల ప్రయోజనాలను కాపాడాలి. – ఎస్వీ.సతీష్రెడ్డి , వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరాలను దొంగలించిన నిందితున్ని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. జనవరి 29న సాయంత్రం పట్టణంలోని మేదరవీధికి చెందిన టంగుటూరు ఎల్లాలు అనే వ్యక్తి మద్యం సేవించాడు. ఈ క్రమంలో హోమస్పేటలో ఉన్న అతను స్కూటీలో వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి స్కూటీలో ఎల్లాలును స్కూటీపై కూర్చోపెట్టుకొని ఒక పథకం ప్రకారం పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను తీసుకొని అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మరుసటి ఉదయం మద్యం మత్తు వదలిన తర్వాత తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు ఎల్లాలు గుర్తించాడు. దీంతో అతను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో నేరస్తుడిని త్వరితగతిన గుర్తించారు. దస్తగిరిపేటకు చెందిన పాత నేరస్తుడైన జేస్టాది రాజేష్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, రెండు ఉంగరాలతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా నిందితుడిపై పలు ప్రాంతాల్లోని పోలీస్ష్టేషన్లలో కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో హత్య కేసుతో పాటు త్రీ టౌన్, రూరల్, రాజుపాళెం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందులలో చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించి సొత్తును రికవరీ చేసిన ఎస్ఐ, సీఐతో పాటు హెడ్కానిస్టేబుల్ దాస్, కానిస్టేబుల్ సునీల్లను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ అభినందించారు. బంగారు నగలు, స్కూటీ స్వాధీనం -
ప్రాణం తీసిన ఇన్స్టా రీల్స్ మోజు
వల్లూరు(చెన్నూరు) : రీల్స్ ఫిచ్చి రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రీల్స్కు ఎక్కువ వ్యూస్, లైక్లు ఆశిస్తున్న వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. అయితే తాము రీల్స్ మోజులో చేసే విన్యాసాల వలన ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్న యువత తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగుల్చడమే కాక ఇతరులకు కూడా ఇబ్బందులు కలగిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కడప– తాడిపత్రి ప్రధాన రహదారిపై కడప విమానాశ్రయం సమీపంలో చెన్నూరు మండల పరిధిలోని శాటిట్ సిటీ వద్ద బుదవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కడప పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన సయ్యద్ ముబారక్ అనే యువకుడు తన స్నేహితుడైన లతీఫ్తో కలిసి బైక్లో బయలు దేరారు. ఇన్స్టా రీల్స్ కోసం విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైక్తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించగా ముబారక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన లతీఫ్ చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజుల క్రితం కడప – మైదుకూరు రోడ్డులో చెన్నూరు వద్ద పలువురు యువకులు పట్టపగలే బైక్ విన్యాసాలు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తర్వాత కూడా పలువురు యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా బైక్ విన్యాసాలు చేస్తూ హల్చల్ చేయడం రివాజుగా మారింది. పోలీసులు ఇలాంటివాటిని చూసీ చూడనట్లు వ్యవహరించడం వారికి అలుసుగా మారుతోంది. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారో గమనిస్తూ వారిని అదుపుచేసి సక్రమ మార్గంలో నడిచేలా చూడాల్సిన అవసరం వుంది. లేక పోతే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుంది. -
అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల తనిఖీ
సిద్దవటం : సిద్దవటం మండలంలోని అంగన్వాడీ, రేషన్షాపులు, సంక్షేమ వసతిగృహాలు తనిఖీ చేసినట్లు ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ్ప్రతాప్రెడ్డి తెలిపారు. సిద్దవటం దిగువపేట రేషన్షాపు తనిఖీల కోసం వెళ్లిన సమయంలో రేషన్ డీలర్షాపు మూసి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. రేషన్షాపుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దవటంలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతిగృహాన్ని తనిఖీ చేసిన ఆయన హాస్టల్లోని భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం తప్పనిసరిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట సిద్దవటం తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్లు ఉన్నారు.సిద్దవటం మండలం మాధవరం–1 పరిధిలోని వెంకటేశ్వరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం విజయ్ప్రతాప్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శోభారాణి, సూపర్వైజర్ శ్రీవిద్యలు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో.. ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని జెడ్పీహెచ్ఎస్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ చౌక దుకాణాలు 1,2ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఒంటిమిట్ట జెడ్పీహెచ్ఎస్ కు వెళ్లిన ఆయన విద్యార్థులతో మాట్లాడి, మధ్యాహ్న భోజనంలోని లోటు పాట్లను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఎంఈవో–2 డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య, తునీకల సీఐ రమేష్ రెడ్డి, సివిల్ సప్లై డిపూటీ తహసీల్దార్ సౌజన్య, అంగన్వాడీ సూపర్ వైజర్ సుగుణ, ఒంటిమిట్ట ఆర్ఐ భాస్కర్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ ఇంచార్జి హెచ్ఎం రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించబోయే దక్షిణ మండల క్రికెట్ టోర్నమెంట్కు హాజరు కావాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాసమూర్తిని కడపజిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి మనోహర్రాజు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.మధుసూదన్ నాయక్లు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం శ్రీనివాసమూర్తిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ మండల క్రికెట్ టోర్నమెంట్కు హాజరయ్యే దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. శ్రీనివాసమూర్తి స్పందిస్తూ దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి సహకారాలు అందిస్తానని తెలియజేశారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు గుర్తు తెలియని వ్యక్తిని చికిత్సకోసం ఈనెల 4వతేదీన తీసుకొచ్చారు. వచ్చిన కొంతసేపటికే మృతి చెందాడు.మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
బైక్ను తప్పించబోయి కారు బోల్తా
లక్కిరెడ్డిపల్లి : ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల వంక బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు..వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె సర్పంచ్ శ్రీనివాసులు, దివాకర్రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉదయం కాణిపాకం వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వేంపల్లెకు బయలుదేరారు. మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనం వచ్చింది. దీనిని తప్పించబోయి రోడ్డుపక్కన ఉన్న మామిడితోటలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దివాకర్రెడ్డికి తీవ్రంగా, సర్పంచ్ శ్రీనివాసులు,డ్రైవర్ మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సర్పంచ్ శ్రీనివాసులు లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్రెడ్డికి సమాచారం అందించండంతో ఆయన అనుచరులు సంఘటన స్థలానికి చేరుకుని 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివాకర్రెడ్డికి కాలు ఫ్రాక్చర్ కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి వేంపల్లె నుండి లక్కిరెడ్డిపల్లికి కారులో వస్తున్న బంధువులు ప్రమాదానికి గురయ్యారు. మండల కేంద్రంలోని చింతకుంటవాండ్లపల్లి వద్ద మరమ్మతులు జరుగుతున్న జాతీయ రహదారికి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని కారు ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సబ్ స్టేషన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని లక్కిరెడ్డిపల్లి ఆసుపత్రికి తరలించారు. వేంపల్లె సర్పంచ్కు గాయాలు -
మార్కెటింగ్శాఖ ఏడీగా మురళీమోహన్
కడప అగ్రికల్చర్: కడప మార్కెటింగ్శాఖ ఏడీగా మురళీమోహన్ నియమితులయ్యారు. ఈయన పల్నాడు జిల్లాలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ పదోన్నతిపై కడప ఏడీగా వచ్చారు. కాగా, ఇదివరకు అజాద్వల్లి ఇన్చార్జు ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఏడీగా మురళీమోహన్ బాధ్యతలు స్వీకరించారు. రాజంపేట టౌన్: రాజంపేటలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9వ తేదీన అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కన్వీనర్ సి.రామ్మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: హెడ్మాస్టర్ అకౌంట్ టెస్టు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు వరకు నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్టు 14వ తేదీ రెండు పూటలా నిర్ణయించిన పరీక్షా కేంద్రాలలో జరుగుతుందని తెలిపారు. వివరాలకు www.bs.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. అలాగే డిసెంబర్ 2015లో జరిగిన clisc పరీక్ష ఫలితాలను www.bs.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. కడప ఎడ్యుకేషన్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద మరో అవకాశం కల్పించారని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత తత్కాల్ ఫీజును ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చెల్లింవచ్చని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ ద్వారా మాత్రమే www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించడంతో పాటు నామినల్ రోల్స్ సమర్పించాలని సూచించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించలేక పోయిన విద్యార్థులకు మాత్రమే అ అవకాశం వర్తిస్తుందని డీఈఓ వివరించారు. ఒంటిమిట్ట: మండల పరిధిలోని మంటపంపల్లి గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య కుమారుడు మండ్ల జగదీష్ ఈ నెల 4న సికింద్రాబాద్ లో జరిగిన ఓపెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇతను నందలూ రులో వీఆర్వో కూడా విధులు నిర్వహిస్తూ, రాజంపేట బాక్సింగ్ క్లబ్ సీనియర్ స్టూడెంట్గా కూడా ఉన్నాడు. కడప సెవెన్రోడ్స్: ఓపెన్ కేటగిరీకి సంబంధించి జిల్లాలో పెండింగ్లో ఉన్న బార్లకు గురువారం లాటరీ డ్రా నిర్వహించారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో మొత్తం ఆరు బార్లు నోటిఫై చేయగా, అందులో నాలుగు బార్లు కేటాయించారు. ప్రొద్దుటూరు స్టేషన్పరిధిలో నోటిఫై చేసిన మూడు బార్లలో రెండు కేటాయించారు. అదేవిధంగా ఎర్రగుంట్ల పరిధిలో నోటిఫై చేసిన రెండు బార్లు కేటాయించారు. జమ్మలమడుగు స్టేషన్ పరిధిలో ఒక బార్ నోటిఫై చేయగా, దరఖాస్తులు రానందున కేటాయించలేదు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమి షనర్ జయరాజ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, డీపీఈఓ రవికుమార్, ఏఈఎస్ వినోద్కుమార్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నేత.. కష్టాల కలబోత
నేతన్నలకు కష్టకాలం దాపురించింది. ప్రభుత్వం నుంచి సాయం అందడంలేదు. చేనేత కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని, చేనేత ఉత్పత్తులపై 90శాతం రిబేట్ ఇస్తామంటూ 2024 ఎన్నికలముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలలకే చేనేత కార్మికులు మగ్గం విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది. కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల బతుకు భారంగా మారుతోంది. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంతో చేనేత వర్గాలను అన్ని విధాల ఆదుకోగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 సంవత్సరానికి ముందు నేతన్నలు దయనీయ స్థితిలో ఉండేవారు. కనీస ప్రోత్సాహం లేక చాలా మంది కుల వృత్తికి దూరమయ్యారు. నూలు ధర పెరిగిపోవడం, ప్రభుత్వం నుంచి నూలు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వకపోవడం, రుణ సదుపాయం లేకపోవడంతో నేతన్నకు మగ్గం భారమైంది. వైఎస్ జగన్ హయాంలో వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో నేతన్నల జీవన చిత్రం మారిపోయింది. ఐదేళ్ల కాలంలో మగ్గాలకు మహర్దశ వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీమేరకు చతికిలబడిన నేతన్నకు ఊతమిచ్చి తిరిగి మగ్గం చేత పట్టేలా జగనన్న చర్యలు చేపట్టారు. నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి నెలకు రూ. 2 వేలు చొప్పున ఏటా రూ. 24 వేల ఆర్థికసాయం అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నేతన్నల ఆశలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఐదేళ్లపాటు ఆదుకున్న జగన్ సర్కారు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మగ్గానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా చేనేత కష్టాలు స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు పెట్టుబడి సాయంగా నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఒకే విడతలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాడే నేతన్న నేస్తం పథకాన్ని అమలులోకి తెచ్చారు. మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు చొప్పున జమ చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ సొమ్ముతో చేనేత కార్మికులు ముడి సరుకు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందారు. దీంతో కులవృత్తికి దూరమై కూలీ పనులు చేస్తూ జీవనం గడిపే నేతన్నలంతా తిరిగి మగ్గం బాట పట్టారు. నేతన్నలకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. పథకాలు తారుమారవుతున్నాయి. ఈ జాబితాలో నేతన్న నేస్తం పథకం కూడా చేరింది. దీంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేతన్నలను ఆదుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యామ్నాయంగా మగ్గాలు వాడే కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ తమకు ఏమాత్రం ఉపయోగపడదని, నగదు రూపంలో ఇస్తే తాము ముడి సరుకు కొనుగోలు చేసి కులవృత్తిని చేసుకుంటామని నేతన్నలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచిఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. మళ్ల మగ్గం వదిలి కూలీ బాట పట్టాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని వారు వాపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వలో నేతన్నలకు అందిన ఆర్థికసాయం సంవత్సరం లబ్ధిదారులు అందించిన మొత్తం 2019–20 10,184 24,44,16,000 2020–21 10,492 25,18,08,000 2021–22 8241 19,77,84,000 2022–23 8545 20,50,80,000 2023–25 9446 22,67,04,000 చేనేత కార్మికులను పట్టించుకోని బాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం 20 నెలల్లో పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు సాయం అందింది. ఈ నిధులతో ముడిసరుకు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసి ఉపాధి పొందాం. ప్రస్తుత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి బదులుగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారు. దీని వల్ల మాకు ఉపయోగం ఉండదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఉచిత విద్యుత్పాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. – నామాల వెంకట సుబ్బయ్య, చేనేత కార్మికుడు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కింద ప్రతి ఏడాది రూ. 24 వేలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అందుకు సంబంఽధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చంద్రబాబు ఎన్నికల ముందు చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని, 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ. 1500 ఇస్తానని అబుద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీ గురించి మరిచిపోయారు.చేనేత కార్మికులను ఆదుకోవాలి. – మామిళ్ల దేవా, మాధవరం –1, సిద్దవటం, మండలం.


