breaking news
YSR
-
బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ
వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు అభిప్రాయం విన్నవించేందుకు బారులు తీరిన భక్తులు బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ మఠాధిపతి నియామకంపై ఉత్కంఠ వీడడం లేదు. పలువురు పోటీ పడుతూ కోర్టును ఆశ్రయించడంతో ధార్మిక పరిషత్ చివరికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చింది. మఠంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్య వివాదం తలెత్తడంతో కోర్టును ఆశ్రయించారు. ఆరు వారాల లోపు మఠాధిపతి నియామకం జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రత్యేక అధికారిగా ఆర్జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్ను నియమించింది. దీంతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పూర్వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దభార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, వీలునామా ప్రకారం తనకే దక్కాలని రెండో కుమారుడు భద్రయ్యస్వామి మరోవైపు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ పెద్దకుమారుడు గోవిందస్వామి ఇంకోవైపు తమకే మఠాధిపతి కావాలని పట్టుపడ్డారు. పోటీ పెరగడంతో ప్రజా ప్రతినిధులు గతంలో సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణచేవారు. తుఫాన్ను లెక్కచేయకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు, వివిధ మఠాల నిర్వకులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందిమల్లాయపల్లె పుర ప్రజలు 1600మంది వినతిపత్రాల ద్వారా తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డీసీ పట్టెం గురుప్రసాద్ , వైఎస్సార్ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ , ఈఓలు శంకర్బాలాజీ, జగన్మోహన్రెడ్డి ఎండోమెంట్ అధికారులు, మైదుకూరు డీఎస్పీరాజేంద్ర ప్రసాద్, సీఐ శివశంకర్, రమణారెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సీఎన్ఆర్ నర్సింగ్ హోంలో ఉన్న నేహా స్కానింగ్ సెంటర్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత మంగళవారం స్కానింగ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతో స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసి సంబంధిత మిషన్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి తీసుకెళ్లినట్లు డాక్టర్ గీత తెలిపారు. నిబంధనల ప్రకారం రిజిష్టర్ చేయించుకున్న సెంటర్లోనే స్కానింగ్ మిషన్ ఉంచాలని, మరోచోటికి తరలించరాదని తెలిపారు. లింగనిర్ధారణ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, విజయకుమారి, కన్సల్టెంట్ పాలేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామాల్లో విచారణ చింతకుంట గ్రామంలోని ఓ క్లినిక్లో లింగ నిర్ధారణపరీక్షలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల క్రితమే ఆర్ఎంపీ క్లినిక్ను ఖాళీ చేసినట్లు గుర్తించారు. అయినా ఓ ఇంట్లో స్కానింగ్ మిషన్ పెట్టుకొని లింగనిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు ఈ ఘటనను సీరియస్గా పరిగణిస్తున్నారు. అనుమానిత గ్రామాల్లో విచారణ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇంతేగాక ప్రొద్దుటూరు నుంచి ఓ డాక్టర్ కూడా మొబైల్ స్కానింగ్ మిషన్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇందుక అసలు సూత్రధారులను గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. -
దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు. రక్షణ కల్పించాలని పట్టాదారుడి వేడుకోలు -
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య కడప అర్బన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఎందరో అభాగ్యులు ఆపద సమయాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ టెక్నీషియన్ స్వరూప రాణి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జీజీహెచ్ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం
కడప అర్బన్ : కడప జిజిహెచ్(రిమ్స్)లో పనిచేస్తున్న శానిటేషన్, సూపర్వైజర్లను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఆప్కాస్ జిల్లా అధ్యక్షుడు పవన్, రిమ్స్ నాయకులు ఏసన్న ,రాజమ్మ, పెంచలమ్మ, విజయలతో కలిసి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్.వెంకటేశ్వరరావును మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కడప ఆస్పత్రిలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్మావతి శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ వారు పనులు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లను తొలగిస్తామని యాజమాన్యం తరఫున సురేష్ చెప్పడం సరికాదన్నారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తవారిని తీసుకోవాలేగానీ, గతంలో పని చేసే వారిని తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు వీక్లీ ఆఫ్లు, సెలవులు తప్పనిసరిగా మంజూరుచేయాలని కోరారు. లేబర్ ఆక్ట్కు భిన్నంగా వేతనాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బాలాజీ రావు, సీపీ.రమణ, శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అనంతరం సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాసులుకు విన్నవించగా ఆయన స్పందిస్తూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఎవరిని తొలగించవద్దని మౌఖికంగా తెలియజేశామని పేర్కొన్నారు. -
సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?
ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైలు మార్గం అత్యంత పొడవైనది. ఈ మార్గంలో చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని కొండవద్ద ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో దాదాపు 6.6 కిలో మీటర్ల మేర అతి పెద్ద సొరంగ మార్గం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో 5 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం 11.21 కిలోమీటర్ల మేర జుమ్మూ కశ్మీర్లోని పీర్ పంచాలో ఉంది. సొరంగం ఉన్న ఈ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. రాయలసీమ ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది.రూ.2 వేల కోట్లతో రైలు మార్గంఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు 1.33 కిలో మీటర్ల రైలు మార్గాన్ని రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2005–2006లో ఈ మార్గం మంజూరుకాగా, 2019 జూన్ 10న తొలి రైలును నడిపించారు. అప్పటినుంచి ఈ మార్గంలో సరకు రవాణా చేసే 25కు పైగా గూడ్స్ రైళ్లు నిత్యం ఈ మార్గంలో నడుస్తున్నాయి. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ తప్ప ప్యాసింజర్లు ప్రయాణించే వీలుగా నిర్మించలేదు. ఈ మార్గంలో కడప నుంచి ఓబులవారిపల్లి మీదుగా రైల్వే అధికారులు ప్యాసింజర్ డెమో రైళ్లు నడిపించాలని ప్రజలు ప్రతిసారీ కోరుతున్నారు. ఈ రైలు నడిపతే కడప–నెల్లూరు మధ్య వాణిజ్యపరంగా, విద్యా పరంగా వ్యాపారం అన్ని విధాలా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేగాక దక్షిణ భారతదేశ అతి పెద్ద సొరంగ మార్గంలో ప్రయాణించాలనే సీమ వాసుల కల నెరవేరుతుంది. రైల్వే అధికారులు స్పందించి ఈ మార్గంలో రైలు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జల వనరుల శాఖ డీఈ చెంగల్రాయుడు మంగళవారం పరిశీలించారు. పింఛా ప్రాజెక్టు నుంచి మంగళవారం 3632 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లు ఏఈఈ నాగేంద్ర తెలిపారు. కడప కార్పొరేషన్: జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6.59కోట్ల రాయితీలు విడుదలయ్యాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చాంద్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేది ‘ఎంఎస్ఎంఈలపై చిన్నచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇండస్ట్రియల్ పాలసీలలో రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, రాయితీలన్నీ ఒకేసారి చెల్లించాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు ఏడేళ్లుగా ఎలాంటి రాయితీలు విడుదల చేయలేదని, జిల్లాలో ఎంఎస్ఎంఈలకు రూ.156కోట్ల బకాయిలు ఉండగా రూ.6.59 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. -
ఒంటిమిట్టలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి జరిగిన బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యం కోసం రూ. 37 కోట్లతో 100 గదులు ఉన్న నూతన ఆధునిక వసతి భవనాన్ని నిర్మించేందుకు, అలాగే రామాలయం వద్ద మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ. 2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు -
వ్యాపారుల సిండికేట్... ప్రభుత్వ ఆదాయానికి గండి
చక్రాయపేట : వీరాంజనేయుడి ఆదాయానికి గండి పడింది. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి మంకుపట్టు వీడకపోవడంతో అధికారులు వచ్చిన కాడికి అంటూ గత ఏడాది కంటే తక్కువ మొత్తానికి కట్టబెట్టేశారు. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో గత ఏడాది కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది టెండరు వేంపల్లెకు చెందిన నాగరాజు రూ.73,35,000కు దక్కించుకున్నారు. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి రూ.50 లక్షలకు మించి తమకు వద్దని భీష్మించుకు కూర్చోవడంతో కాసేపు చర్చ సాగింది. అయితే అనధికారికంగా రూ.60కి అమ్ముకోవచ్చునంటూ అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కొబ్బరికాయల విక్రయం టెండర్ రూ.80 లక్షలకు దక్కించుకోగా.. జీఎస్టీతో కలిపి రూ.94 లక్షలు చెల్లించాలి. అయితే టెండరు దారుడు తనకు నష్టం వస్తోందని జీఎస్టీ చెల్లించలేదు. పైగా రూ.35 టెంకాయలు తెచ్చి రూ.60కి విక్రయించారు. దీనిపై భక్తులు పలుమార్లు అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది కూడా 30 నుంచి 35 సెంటీమీటర్లు గల టెంకాయ రూ.35కు అమ్మాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే జీఎస్టీ ఊసే ఎత్తలేదు. దీంతో టెండరు దారులు మార్కెట్లోనే రూ.40నుంచి రూ.45 ఉంటే రూ.35కే ఎలా అమ్మాలంటూ ఎదురుప్రశ్నలు వేశారు. పోటీకి ఎవరూ రాకపోవడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారు. చివరికి ఆలయ వర్గాలు మెట్టు దిగి పూజా సామగ్రితో కలిపి రు.42కు అమ్ముకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చివరకు రూ.60కు అమ్మవచ్చునని అనధికారిక హామీ రావడంతో అందరూ సిండికేట్గా మారి నామ మాత్రంగా పాడుతూ రూ.75,35,000లకు ముగించేశారు. నాగరాజుకు హక్కు కల్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దీంతో గత ఏడాది కంటే తక్కువగా టెండరు పాడడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం జరిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ కార్యాలయ అధికారి భారతి, మాజీ ఛైర్మన్లు వీరభాస్కరుడు, వెంకటస్వామి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే తక్కువగా రూ.75 లక్షలకే అప్పగించేశారు -
● పంట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్ల పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మొక్కజొన్న, పోరు మామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బి.మఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు. సిద్దవటం మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వేంపల్లె : మండలంలోని బోలగొందిచెరువు బీట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్కుమార్ తెలిపారు. వేంపల్లె అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎరచ్రందనం రవాణాపై నిఘా పెట్టామని, వేంపల్లె ఎఫ్ఆర్ఓ పర్యవేక్షణలో సిబ్బంది బోలగొందిచెరువు బీట్ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారని తెలిపారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన వ్యక్తులు ఎర్రచదనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్దం చేస్తుండగా దాడులు చేశామన్నారు. వేములగొందికి చెందిన పోతలపల్లె మల్లికొండ, కాయలపల్లెకు చెందిన వీరాంజనేయులు, చినన్న వారిపల్లెకు చెందిన చెన్నకేశవులను అరెస్టు చేశామని, కాయలపల్లెకు చెందిన కలువపల్లె మనోహర్నాయుడు పరారీలో ఉన్నారన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. వారి నుంచి రూ.2,13,692 విలువగల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరచ్రందనం స్మగ్లింగ్ చేస్తే సమస్యల్లో పడతారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేసి.. అక్రమ రవాణాపై ఎక్కువగా నిఘా పెట్టామని తెలిపారు. టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బందతో కలిసి దాడులు చేసి డంప్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులు, అడవి జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, డీఆర్ఓలు సుబ్బయ్య, శేషయ్య, బీవీ.సుబ్బయ్య, ఏబీఓ.శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. డీఎఫ్ఓ వినీత్ కుమార్ -
రోడ్ల మరమ్మతులకు రూ. 74.20 కోట్లు
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఆర్అండ్బీ అధికారి వై.సహదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని 218 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేసేందుకు రూ. 74.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నాబార్డు, ప్లాన్ వర్క్, నిమ్మనపల్లి–వాల్మీకిపురం – గుర్రంకొండ, కలకడ–గుర్రంకొండ, పొంతల చెరువు–తిమ్మాపురం, చిత్తూరురోడ్డు–మదనపల్లి రోడ్డు వయా కేశపురం బోనమల రహదారితోపాటు ఇతర గ్రామాల రహదారులల్లో మరమ్మతు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని వాటర్ ట్యాంకు వీధిలోని టవర్ వద్ద ఈ నెల 21న జరిగిన బ్యాటరీ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. కోవెలకుంట్ల రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న పత్తూరిప్రశాంత్, పత్తూరు జగన్, అక్కలి పవన్సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. సీఐ మాట్లాడుతూ మద్యం, చెడు అలవాట్లకు వ్యసనపరులై బ్యాటరీలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వివాహిత మృతి ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని చౌడూరులో విద్యుత్ షాక్కు గురై వివాహిత సునీత (32) మృతిచెందారు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని సునీత ఇంటి పక్కనే పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. షెడ్డులో ఇనుపరాడ్డుకు ఫ్యాన్ను అమర్చారు. ఈ క్రమంలో సర్వీసు వైర్కు చుట్టిన టేప్ సరిగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పశువుల పాకలోకి వెళ్లిన సునీత విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రజా సమస్యలపై కేంద్ర స్థాయిలో పోరాటం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పోరాటం చేపడతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయనకు నగరంలోని హరిత హోటల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తానన్నారు. చిన్నతనం నుంచి పోరాటం అనే పదం అట్టిపెట్టుకున్నానని, గిరిజన, దళిత, పేద, బడుగు వర్గాలకు విద్యార్థులకు, కార్మిక కర్షక రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రశ్నించే హక్కు గతంలో లెఫ్ట్ పార్టీలకు ఉండేదని, అలాంటి రోజులు రావాలనే తపనతో ముందుకు వెళతానన్నారు. కూటమి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోదీ, అమిత్షా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెడుతోందని వివరించారు. అమరావతిలో 64 వేల ఎకరాలు సేకరించినా.. మరో 44 వేల ఎకరాలు అవసరమంటూ పంట భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగులకు టీఏ, డీఏలను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రైలులో జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కంపార్టుమెంట్లు పెంచాలని అడిగితే ఎయిర్పోర్టులు కడతాం.. విమానాలలో తిరగండి అనడం ఎన్డీఏ పాలకులకే చెల్లిందన్నారు. నక్సలైట్ల ఏరివేత ముసుగులో దమనకాండ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పట్టుదల, అంకుఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన ఈశ్వరయ్య రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. కృషి పట్టుదల, సామాజిక స్పృహ, సమస్యలపైన పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి నిదర్శనం గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య -
15 మంది జూదరుల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల–కడప రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో జూదమాడుతున్న హోంగార్డు గిరినాయక్, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుభాన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న 11మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. వైవీయూ అభివృద్ధికి సహకరించండి కడప ఎడ్యుకేషన్ : వైవీయూ అభివృద్ధికి సహకరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఎపిఎస్సిహెచ్) ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిని మంగళవారం ఆయన ఛాంబర్లో వీసి కలిసి విన్నవించారు. విద్య, పరిశోధనాపరమైన అనుభవాలతో విద్యా సంస్థను తీర్చిదిద్దాలని, ఎపీఎస్సీహెచ్ పూర్తిగా వెన్నంటి ఉంటుందని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు, కె.రత్న శైలామణి, సెక్రటరి బి.తిరుపతిరావులనులాయన కలిశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా కడప వైఎస్ఆర్ సర్కిల్ : కర్నూల్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్ఛార్జి డీటీసీ వీర్రాజు ఆధ్వర్యంలో ఇప్ప టి వరకూ గత నాలుగు రోజుల్లో 61 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకపోవడం, పన్ను చెల్లించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి నడపడం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం, సుత్తి లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం, సరిగా తెరుచుకోకపోవడం వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
వెలిగల్లు నుంచి ..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపా ఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలో ని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. -
పెన్నాకు నీరు విడుదల
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటిని విడుదుల చేసినట్లు మైలవరం జలాశయం ఈఈ రమేష్ తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జలాశయం నుంచి సుమారు 4300 క్యూసెక్కుల నీటిని అధికారులతో కలసి ఆయన విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 5 టీఎంసీల నుంచి మైలవరం జలాశయానికి ఇన్ఫ్లో ఉండడంతో.. వచ్చిన నీటిని అలాగే పెన్నాకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.01 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు.జలాశయం సహయం ఈఈ మూర్తి, ఏఈ సుబ్బారావు, రూరల్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్ కొట్టు.. సబ్సిడీ పట్టు
● పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో భారీగా అవకతవకలు ! ● ఒక ప్రామాణికం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా జమ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక వేత్తలు సాక్షి టాస్క్ఫోర్స్ : ఆషాఢం సేల్...దీపావళి ధమాకా...దసరా బంపర్ ఆఫర్ అంటూ వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి వినియోగదారులకు బహుమతులు (గిఫ్ట్)లను ఎరగా వేస్తుంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ ప్రకటిస్తుంటారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మంజూరు చేయడంలో పరిశ్రమల శాఖలో ఇదే తరహా సేల్ రివర్స్లో జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే క్యాష్ కొడతారో వారికే రాయితీలు బహుమతులుగా వచ్చాయన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సమ్మిట్లో పారిశ్రామిక వేత్తలకు తాము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకుల నుంచి రూ.2వేల కోట్లు రుణంగా పొంది, అందులో రూ.1500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు దీపావళి రోజు ప్రకటించారు. ఆ ప్రకటనతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు సంబరపడి పోయారు. వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు...ప్రోత్సాహకాల విడుదలలో ప్రభుత్వం చేసిన అసలు మోసం బట్టబయలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిలువునా మోసపోయామని, ఈ దెబ్బతో చాలా చిన్న యూనిట్లు ఖాయిలా పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒక ప్రామాణికం, విధానం అంటూ లేకుండా... పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో పరిశ్రమల శాఖ అధికారులు ఒక ప్రామాణికం, పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ కమ్...ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అయితే సీనియారిటీ మేరకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి మొదట రాయితీలు ఇవ్వాలి. అలాకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నవారికే ఇచ్చారని అనుకుంటే అంతకుముందు దరఖాస్తు చేసుకున్నవారిని పక్కనబెట్టాలి. కానీ అటూ ఇటూ కాకుండా 2023లో రాయితీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కొందరికి, 2024లో దరఖాస్తు చేసుకున్న వారికి మరికొందరికి, 2022లో చేసుకున్న కొందరికి మంజూరు చేయడంతో పారిశ్రామిక వేత్తలు అయోమయంలో పడిపోయారు. ఎవరైతే కాసులిచ్చి విజయవాడలోని పరిశ్రమల శాఖ అధికారులను ప్రసన్నం చేసు కున్నారో వారికి మాత్రమే ప్రోత్సాహకాలు విడుదల చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం పాలసీలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాతాల్లో కూడా భారీ తేడా ఎవరికి ఎంత శాతం రాయితీలు పడ్డాయన్నది కూడా మిస్టరీగా మారింది. ఒక యూనిట్కు రావాల్సిన మొత్తం రాయితీలో 20 శాతం, 40 శాతం మేర ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు సమాచారం. బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకున్నవారికి 20 శాతం, మ్యాన్యుపాక్చరింగ్ సెక్టార్ వారికి 40 శాతం రాయితీలు ఇచ్చారని తెలిసింది. కానీ కొంతమందికి 10 శాతమే రాయితీలు పడ్డాయని చెబుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం ఏ సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతెంత రాయితీలు ఇచ్చారో ప్రకటించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
బీఎడ్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల య పరిధిలోని వైఎస్సార్ కడప, అన్న మయ్య జిల్లాలోని 17 కేంద్రాల్లో బీఎడ్ పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను అన్ని కేంద్రాల్లో కలుపుకొని 21,665 మంది విద్యార్థులు రాస్తున్నారు. తొలిరోజు కడపలోని నాగార్జున డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిబంధనలను అనుసరించి జరపాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి.కృష్ణారావు వివరిస్తూ రెండు జిల్లాల్లోని అన్ని కేంద్రాలకు విశ్వవిద్యాలయం తరఫున అబ్జర్వర్లను నియమించామని తెలిపా రు. అలాగే స్క్వాడ్ బృందాల సభ్యులు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని వి.సికి వివరించారు. యూనివర్సిటీ సెంటర్ అబ్జర్వర్ తుమ్మలూరు సురేష్బాబు, చీఫ్ సూపరింటెండెంట్ రెడ్డప్ప పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గుంటిమడుగు పెద్ద చెరువుకు గండి రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు -
శంభో శివ శంభో !
నిండు మనసుతో చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు.. అడిగిన వరాలిస్తాడు... భక్తితో ఒక మారేడు దళం సమర్పిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు.. మా శివయ్య భోళా శంకరుడు... అంటూ భక్తులు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ కార్తిక దీప కాంతులతో శోభిల్లాయి. తొలి దర్శనం చేసుకున్నా...తొలిదీపం పెట్టినా అధిక పుణ్య లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము 3.30 గంటల నుంచే ఆలయాలకు క్యూ కట్టి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ● కార్తీక దీప కాంతులతో శోభిల్లిన శైవ క్షేత్రాలు ● భక్తిశ్రద్ధలతో కార్తిక తొలి సోమవారం బి.కోడూరులోని అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంలో 108 శివలింగాలు .. కడప అక్కాయపల్లెలో కోటి దీపోత్సవం.. పుష్పగిరిలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ -
మోంథాపై ఆందోళన వద్దు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్ : మోంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉందని ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, సంసిద్ధతపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తగు సూచనలు చేశారు. రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, చెరువులు.. ఉప్పొంగే అవకాశాలు ఉన్నందున.. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సంబంధిత సిబ్బందితో 24 గంటలు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిలో పోలీసు, అగ్నిమాపక సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలలో సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యు లు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపడుతున్న ముందస్తు సంసిద్ధత ఏర్పాట్లపై ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్ : తుపాన్ కారణంగా జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో అత్యధికంగా 11.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చక్రాయపేట, ఎర్రగుంట్లలలో 10, వీఎన్పల్లిలో 7.2, వేంపల్లిలో 6.2, సిద్దవటంలో 3.4, మైదుకూరులో 1.8, కడపలో 1, దువ్వూరులో 0.3 మి.మీ వర్షం కురిసింది. -
వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!
కడప అగ్రికల్చర్ : మొంథా తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.సతీష్ ఉద్యాన రైతులకు సూచించారు. కూరగాయల పంటలు.. ● వర్షం ధాటికి పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదోయాలి. ● మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలతో ఉన్నట్లయితే 0.3 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె) లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2–3 సార్లు మొక్క తడిచేటట్లుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ● కూరగాయ పంటలు కొత్తగా విత్తిన లేదా నాటినట్లయితే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి. ● పంటకు ఆకుపచ్చ, కాయకుళ్లు, బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2.5 గ్రాముల సాఫ్ మందును కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి. ● వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు లేదా కర్బండిజమ్ 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపు పంట.. ● వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే, 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు అన్నభేది ఒక నిమ్మచెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ● నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్తో పాటు 200 కిలోల వేపపిండి వేయాలి. ● ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రాప్తికోన జోల్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● దుంపకుళ్లు ఆశించినట్లయితే పాదుల్లో మొక్కలు చుట్టూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాములు రిడోమిల్ మందును కలిపిన ద్రావణంతో తడపాలి. పూల తోటలు.. ● మొక్కలపై 2 శాతం యూరియా లేదా 1 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె)ను 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1–2 సార్లు పిచికారీ చేయాలి. ● కోతకు సిద్ధంగా ఉన్న పువ్వులను వీలైనంత త్వరగా కోసుకోవాలి. ● పువ్వులను కోసిన తరువాత, మార్కెట్కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి. ● వీలైనంత త్వరగా పువ్వులను మార్కెట్టుకు పంపాలి. ఉల్లి పంట.. ● మురుగు నీటిని బయటకు పంపాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లి కోత దశలో.. ● తుపాను హెచ్చరిక ఆధారంగా తుపాను రాక ముందే వీలైనంత తొందరగా గడ్డలను కోసుకోవాలి. ● వర్షం ఆగిన వెంటనే గడ్డలను కోయరాదు / పీకరాదు. కోత అనంతరం.. ● గడ్డలను పీకిన తరువాత 1 గ్రాము థయోఫాసేట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. ప్రొఫికోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నిల్వలో గడ్డ కుళ్లును నివారించవచ్చు. ● కోసిన గడ్డలను వర్షంలో తడవకుండా టార్పాలిన్ పట్టలు కప్పాలి. ● సోలారు డ్రైయర్స్ను ఉపయోగించి గడ్డలను తొందరగా ఆరబెట్టుకోవాలి. లేదా గడ్డలను 7 నుంచి 10 రోజులు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ● వీలైనంత తొందరగా గడ్డలను గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచకుండా మార్కెటింగ్ చేసుకోవాలి.రైతులు జాగ్రత్తలు పాటించాలంటున్న ఉద్యానశాఖ అధికారులుసస్యరక్షణ చర్యలు తప్పనిసరి.. వర్షాల నేపథ్యంలో రైతులు తప్పని సరిగా ఉద్యాన పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టినప్పుడే ఉద్యాన పంటలను రక్షించుకోగలరు. ఆయా పంటలు సాగుచేసిన రైతులు తప్పని సరిగా ఆయా చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలి. – జి. సతీష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
ఉత్సాహంగా ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు సోమవారం ఉత్సాహంగా సాగా యి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్సార్ కడప, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎంపిక లు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి జనార్ధన రెడ్డి ఎంపికలను పర్యవేక్షించారు. సబ్ జూనియర్స్ ఇండియన్ రౌండ్–బాలుర జట్టు: కె. అరవింద్, ఎస్. శశి వర్ధన్, జి. సిద్ధార్ధ, టి.గణేష్, సి దినేష్ కుమార్ బాలికల జట్టు: టి.శివ దుర్గ, కె.నవ్య శ్రీ, వి.మధులిక సబ్ జూనియర్స్ రికర్వ్ రౌండ్ బాలుర జట్టు: వై.నవనీష్, ఎ.యశ్వంత్ రెడ్డి, ఎల్. కౌశల్ దేవ రాయల్, పి.విఘ్నేష్ చరణ్, బి.ఖ్యాతేష్, షణ్ముక బాలికల జట్టు: టి. సుశ్రుత సభ జూనియర్స్ కాంపౌండ్ బాలుర జట్టు: సి. అభినయ్, పివి. పాయి శ్రీనివాస్, కె. వెంకట కార్తీక్ -
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం
వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణ అన్నారు. సోమవారం మండలంలోని అయ్యవారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అధికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించా రు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడు తూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్ కార్యాలయం కడప, కడప డివిజన్, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్ రూమ్లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు యల్యమ్సి సర్కిల్ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్, ఏఈ హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
కొప్పర్తి చెరువు కట్ట కాలువకు గండి
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి చెరువు నుంచి తాడిగొట్ల చెరువుకు నీరు వెళ్లే కట్ట కాలువకు సోమవారం గండ్లు పడడంతో నీరు వృథాగా పోయింది. సాయంత్రానికి స్పందించిన రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు జేసీబీ సహాయంతో కాలువకు పడిన గండ్లను మట్టితో పూడ్చివేశారు. కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి కడప ఎడ్యుకేషన్: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణమూర్తి అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అతనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నంకమలాపురం : కమలాపురం విద్యుత్ సబ్స్టేషన్కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. కడప–ముద్దనూరు ఫోర్లేన్ రోడ్డు మంజూరు కావడంతో కబ్జాకోరులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ఈ స్థలం నాదని, పిల్లర్ల కోసం 9 గుంతలు సైతం కొట్టించాడు. దీనిని చూసి సబ్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమవారం విద్యుత్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది సబ్ స్టేషన్ స్థలమని తమ స్థలంలో గుంతలు కొట్టించాడని ఆ గుంతలను అధికారులు పూడ్పించారు. కార్మికుల సమస్యలపై పోరాటంఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు. కాగా భారతి సిమెంట్స్ ప్లాంట్ హెడ్ ఎం. రామమూర్తి, హెచ్ఆర్ గోపాల్ రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ.. సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు. పతకాలు అందుకున్న విద్యార్థులను ప్లాంట్ ప్రతినిధులు అభినందించారు. -
మెడికల్ కాలేజీల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కువైట్లో కోటి సంతకాల సేకరణ
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కువైట్ దేశంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసాంఽధ్రులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కువైట్లోని మాలియా ప్రాంతంలో మాక్స్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడూరు మండల కన్వీనర్ రామిరెడ్డి, ధ్వజారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ కల్లూరు రమణారెడ్డి, కువైట్ పిస్తా హౌస్ అధినేత ఎస్బి అహ్మద్బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యాన్ని అందించడానికి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు ఎన్. మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్లు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, షేక్ రహమతుల్లా, అఫ్సర్ అలీ, యు.వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అట్లూరు : ప్రమాదవశాత్తు ఆదివారం సగిలేరు నదిలో గల్లంతైన ప్రభాకర్ మృతదేహం లభ్యమైంది. మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) ఓ మహిళ అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు సగిలేరు నదిలో గల్లంతైన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ, ఎస్ఐ రామకృష్ణయ్య, సీఐ కృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి చీకటి పడే వరకు గాలించినా మృతదేహం లభించలేదు. తిరిగి సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, అగ్నిపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఎట్టకేలకు ప్రభాకర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముడమాల ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబాన్ని ఓదార్చి మేమున్నామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
● రూ. 10.2 లక్షల విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం ● 14 మంది నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లిరాయచోటి : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సొత్తు కేసు వివరాలు.. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు. కఠిన చర్యలు తప్పవు.. జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి.రామాంజనేయులు, పీఎస్ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లె రూరల్ : మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్ ఆనంద్ కుమార్(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీంసాబ్ కుమారుడు జాఫర్ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్ అలీ, గంగిశెట్టి శివకుమార్ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. -
రైల్వేసమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమితులై తొలిసారిగా విచ్చేసిన ఎంపీ మేడా రఘునాథరెడ్డిని మేడా భవన్(రాజంపేట బైపాస్ క్రాస్)లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్ కమిటీలో సభ్యునిగా చోటు కల్పించినందువల్ల రైల్వేపరంగా ఈ ప్రాంతానికి అవసరమైన అంశాలపై దృష్టి సారించగలిగే అవకాశం కలిగిందన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దృష్టికి ఉమ్మడి కడప జిల్లాలోని రైలుమార్గంలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లనున్నట్లు గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. మేడాభవన్లో ఎంపీ మేడాను కలిసి బొకేను అందచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి,మార్కెట్మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు కృష్ణారావు, నందలూరు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు పాలగిరి సుధాకర్రెడి సౌమ్యనాధాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్,్డతోపాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ మేడా -
కర్నూలు బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
– వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటన ప్రమాదం కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయని, కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రఽథమ ముద్దాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. జాతీయ రహదారి సమీపంలోని బెల్ట్షాపులో మద్యం తెల్లవారుజామునే అమ్మడంపై ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం (ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ఫిట్నెస్ సహా ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారుశ్రీ అని దుయ్యబట్టారు. ఈ ఘటనతో పాటు మద్యం వల్ల ఇకపై ఏ ప్రమాదం జరిగినా అది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే భావించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తానన్నారు. వీటిని హత్యలుగా భావించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. -
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు
వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపిన దర్బార్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్ బైకులపై చర్యలు తీసుకోవాలని పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో మహిళ మృతి మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్ కనెక్షన్ తగలడంతో షాక్కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారు కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై ముద్దనూరు వైపు వెళ్లే ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేట గ్రామానికి చెందిన చంద్ర ఓబులేసు తన కుమారుడు శశి విఖ్యాత్కు మూర్ఛ వస్తుండటంతో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామంలో వాయి బిళ్ల వేయించుకొనేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి వైపు నుంచి వచ్చే కారు వెనుక నుంచి ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దామని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసీ తెలియని వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వాడినా, అమ్మినా నేరమని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. యువత సన్మార్గంలో నడిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరణాల.శివకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు వృద్ధురాలి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్కు ఈనెల 26వతేదీన తన కుమార్తె ఇంటికి రాజుపాలెం మండలం అర్కటవేములకు చెందిన గంటల నాగమ్మ(82)అనే వృద్ధురాలు వచ్చింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయిందని అల్లుడు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకుగానీ, వేణుగోపాల్ సెల్ నెంబర్: 80740 22422కు తెలియజేయాలని పోలీసులు కోరారు. చెరువులో వ్యక్తి గల్లంతు అట్లూరు : చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి గల్లంతైన ఉదంతం మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) డప్పు కళాకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు ప్రభాకర్ వెళ్లాడు. ఆ మహిళ అంత్యక్రియల అనంతరం ప్రభాకర్ ఇంటికి వస్తూ కాళ్లు, చేతులు కడుక్కొనేందుకు సమీపంలోని వేమలూరు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో అక్కడున్న వారు బంధువులకు సమాచారం ఇచారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, తహసీల్దార్కు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఐ రమణ, వీఆర్ఓ సుబ్బన్న బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి ఆదివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గజ ఈతగాళ్లు మళ్లీ ఉదయం గాలిస్తామని తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. జాతీయ స్థాయి అబాకస్లో సత్తా చాటిన నాగార్జున విద్యార్థులు కడప ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి అబాకస్ పోటీలలో కడప నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి క్యూబాటిక్ అబాకస్ పరీక్షల్లో 5వ తరగతికి చెందిన తబితాశ్రేష్ఠ, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞలు ద్వితీయ బహుమతులను సాధించగా 5వ తరగతికి చెందిన భారతి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే 6వ తరగతికి చెందిన రేయాన్ఖాన్, 5వ తరగతికి చెందిన మోక్షితారెడ్డి, 3వ తరగతికి చెందిన సోహిత్, లక్ష్మి కాస్వీరెడ్డిలు నాలుగో స్థానంలో నిలిచారు. మరో నాలుగు మెరిట్ బహుమతులను పొందారు. జాతీయస్థాయి అబాకస్ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ శివ తులశమ్మ, డైరెక్టర్ శివప్రసాద్రెడ్డి, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, హెడ్మిసెస్ సుశీలదేవి అభినందించారు. కుటుంబ సభ్యులకు మహిళ అప్పగింత మైలవరం : మండల పరిధిలోని బుచ్చంపల్లి గ్రామానికి చెందిన మూడే తేజేశ్వరిని ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ తేజేశ్వరి జూన్ 19వ తేదీన భర్త కేశాలు నాయక్తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కింటి వారితో ఉపాధి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. అయితే ఇంటికి భార్య తిరిగి రాకపోవడంతో భర్త కేశాలు నాయక్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆచూకీ లభ్యం కావడంతో ఆదివారం కుటుంబ పెద్దలను పిలిపించి అప్పగించారు. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని కోటిరెడ్డినగర్లో నివసిస్తూ బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుండే మన్నెం మల్లేశ్వరి (28) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి.మఠం మండలం మలుగుడుపాడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, ఇంద్రావతిల రెండవ కుమార్తె అయిన మల్లేశ్వరిని మూడేళ్ల క్రితం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెలకు చెందిన రామనరసారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేశ్వరి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో తలుపును పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా మల్లేశ్వరి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే .. మృతురాలు మన్నెం మల్లేశ్వరి స్వగ్రామం బి.మఠం మండలం మలుగుడుపాడు కావడంతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మల్లేశ్వరి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.మఠం మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మండల నాయకులు వెంకటరామిరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాగమునెమ్మ మృతదేహం లభ్యం
రాజుపాళెం : రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో శనివారం గల్లంతైన నాగమునెమ్మ (76) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఉదయం నుంచి ప్రొద్దుటూరు ఫైర్ సిబ్బంది బోట్ సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెల్లాల పాతవంతెనకు సమీపంలో ఆ వృద్ధురాలి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో వెంటనే బోటులో ఒడ్డుకు చేర్చారు. పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామసుబ్బారెడ్డి, గొంగటి నాగమునెమ్మ అనే వృద్ధ దంపతులు జీవితంపై విరక్తి చెందడంతో పాటు అనారోగ్య కారణాలతో శనివారం వెల్లాల కుందూనది పాత వంతెనపై నుంచి నదిలోకి దూకిన విషయం విదితమే. నది ఉధృతిలో కొట్టుకుపోతున్న రామసుబ్బారెడ్డిని స్థానికుడైన గుర్రప్ప ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయింది. ఆదివారం లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని జగతి మాంటిస్సోరి స్కూల్లో అండర్–14, 17 జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఆరు డివిజన్ల నుంచి 300 మంది క్రీడా కారులు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శులు చంద్రావతి, శ్రీకాంత్రెడ్డి తెలిపారు. వారిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. అండర్–17 బాలికల జట్టు: నమిత, ఆఫ్రిన్, నాగ తనూజ, భువనేశ్వరి, భార్గవి, భావన, శ్రావణి, శివ మంజుల, యశస్విని, భవ్యశ్రీ, నేహ, సరిత, హర్షిత, యాస్మిన్, దీపిక అండర్–17 బాలుర జట్టు: ఓంకార్, సురేష్, రామశేఖర్ రాజు, కృష్ణార్జున్, జశ్వంత్, రఘువరన్, కార్తీక్, నాగ చైతన్య రెడ్డి, టోని, చరిత్ సాయి రెడ్డి, శివరామ్, ఆకాష్, విశ్వనాథ్, ఏడు కొండలు అండర్–14 బాలికల జట్టు: భాగ్యలక్ష్మీ, ఏసుప్రియ, హారిక, సుష్మిత, నాగ సుజాత, నక్షత్ర, వైష్ణవి, గంగా భానుశ్రీ, హార్షిక, మల్లిక, ఇందు, చంద్రిక, సంధ్య, జానకి, కార్తీక, అండర్–14 బాలుర జట్టు: జాఫర్, నిఖిల్, సాయినాథ్, అభినయ్, తరుణ్తేజ్, అశోక్, తరుణ్తేజ్ రెడ్డి, యుఎల్ నారాయణ, లోహిత్ కుమార్రెడ్డి, వెంకట మణి, అనిరుధ్, హర్షవర్దన్, లక్ష్మీ ప్రసాద్, వినోద్ -
శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి
వల్లూరు : త్రిమూర్తుల్లో ఒకరుగా , భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోలా శంకరునిగా ప్రఖ్యాతి గాంచిన పరమ శివుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో పిలువ బడుతూ భక్తులకు దర్శనమిస్తుండడం పరిపాటి. దాదాపు ప్రతి చోట లింగాకారంలోనే ఆయన దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అరుదుగా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉమా శంకరుడుగా, ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అయితే పుష్పగిరిలో మాత్రం పరమ శివునికి విశిష్ట స్థానం వుంది. శివ కేశవ అభేద క్షేత్రమైన పుష్పగిరిలో ప్రసిద్ధి గాంచిన అనేక శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో శంకరుడు ఒక్కో ఆలయంలో ఒక్కో పేరున పిలువ బడుతూ భక్తులచే పూజలందుకుంటుండడం విశిష్టత సంతరించుకుందని చెప్పవచ్చు. 108 శివలింగాలు.. పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి 108 శివలింగాల ప్రతిష్టితంగా పేరుగాంచింది. ఎన్నో ఆలయాలకు నెలవై ఆలయ నగరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో ఒక చోళరాజు 108 శివలింగాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాడని ప్రతీతి. ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తున్న ఎన్నో శిథిలమైన ఆలయాలు, లింగాలు, వృషభ విగ్రహాలు, శిల్పాలు, పాను పట్టాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. పుష్పగిరి గ్రామంలో వైద్యనాథేశ్వరుని ఆలయ ప్రాంగణంలో త్రికుటేశ్వర స్వామి, భీమలింగేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి మొదలైన శివాలయాలు ప్రశస్తి గాంచాయి. కొండపైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సాక్షి మల్లేశ్వర , సంతాన మల్లేశ్వర ఆలయాలతో బాటు రుద్రపాద ఆలయాలు భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న వైద్య నాథేశ్వరుడు..పురాణ పురుషుడైన శ్రీ రామ చంద్రుడు సాక్షాత్తూ తన చేతుల మీదుగా పూజలు చేసిన శివలింగంగా పుష్పగిరిలోని వైద్యనాథేశ్వరుడు ప్రశస్తిగాంచాడు. వనవాసంలో సీతను అపహరించిన రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంత కాలం వున్నాడు. ఆయన ప్రతి రోజూ ఇక్కడి వైద్యనాథున్ని పుష్పాలతో పూజించేవాడు. ఈ సందర్భంలో ముందు రోజు పూజకు ఉపయోగించిన పూలను తీసి ఇక్కడి పెన్నా నదిలో వేసేవారు. ఆ పూల రాశి క్రమంగా కొండంత పెరిగి నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో వుంది. త్రికుటేశ్వర స్వామి ఆలయం..వైద్యనాథ ఆలయ సముదాయంలో వాయువ్యాన మూడు శివుని ఆలయాల సమూహమైన త్రికుటేశ్వర స్వామి ఆలయం వుంది. ఇక్కడ తూర్పు ముఖంగా వున్న గుడిలో దేవతా మూర్తిని త్రికుటేశ్వరుడని, దక్షిణ ముఖంగా ఉన్న గుడిలోని దేవతా మూర్తిని భీమేశ్వరుడని, ఉత్తర ముఖంగా వున్న గుడిలోని దేవతా మూర్తిని ఉమా మహేశ్వరుడని ిపిలుస్తారు. త్రికుటేశ్వర స్వామి ఆలయానికి తూర్పు వైపున భీమ లింగేశ్వర ఆలయం వుంది. వైద్యనాథ ఆలయం ప్రాంగణంలోనే నైరుతి మూలన తూర్పు ముఖంగా రాఘవేశ్వరాలయం వుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో శివ లింగం ఏమైందో తెలియడం లేదు. పుష్పగిరి కొండపైన ఆలయాలుపుష్పగిరి కొండపైన గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ సముదాయంలో చెన్నకేశవ, సంతాన మల్లేశ్వర, ఉమా మల్లేశ్వర ఆలయాలు మూడూ ఒకే ముఖ మండపాన్ని కలిగి వుండడం విశేషం. ఇక్కడి సంతాన మల్లేశ్వర ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఉమా మహేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు వృషభారూఢుడై పార్వతీ దేవి (ఉమ) తో కూడి ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో వుంటాడు. చెన్న కేశవ ఆలయ ప్రాంగణంలో ఈశాన్యంలో సాక్షి మల్లేశ్వర ఆలయం వుంది. రుద్రపాద ఆలయంకొండపై చెన్నకేశవ ఆలయ ప్రధాన గోపుర ద్వారానికి దక్షిణం వైపున రుద్ర పాద ఆలయం వుంది. నీటిపై తేలుతున్న కొండను త్రిమూర్తులైన విష్ణు , ఈశ్వర, బ్రహ్మలు ముగ్గురూ తలో చోట తొక్కి పట్టి అణిచారని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ సందర్భంగా ఏర్పడిన శివుని పాదమే ఈ రుద్రపాదమని భక్తుల విశ్వాసం. చెన్న కేశవ ఆలయ ప్రాంగణానికి కుడి వైపున కమలా శాంభవేశ్వర ఆలయ సముదాయం వుంది. శిథిలమైన ఈ ఆలయ సముదాయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఇందులోని ఒక ఆలయంలో పంచలింగాలతో కూడిన విగ్రహం వుంది. మరో ఆలయంలో శివ లింగం వుంది. చెన్న కేశవ ఆలయ ప్రాంగణ మెట్లకు కుడి వైపున కొండకు మలచబడ్డ ఆలయంలో పాపవినాశేశ్వరుడు వున్నాడు. కొండపై దుర్గమ్మ ఆలయం సమీపంలో ఉమామహేశ్వర ఆలయం వుంది. ఇంద్రనాథేశ్వర ఆలయం..పెన్నా నదికి ఉత్తరం వైపున కొండ భాగంలో పశ్చిమంలో చింతలపత్తూరు వద్ద ఇంద్ర నాథేశ్వర ఆలయం వుంది. పుష్పాలేశ్వర ఆలయం..పుష్పగిరి కొండపై శిఖరాగ్రాన పుష్పాచలేశ్వర స్వామి ఆలయం వుంది. కాల క్రమంలో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ పునరుద్ధరణకు కొందరు భక్తులు తమ శాయ శక్తులా కృషి చేస్తున్నారు. దక్షిణ కాశిగా ఖ్యాతి..పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో గ్రామానికి కొండకు మధ్య ప్రవహిస్తున్న పవిత్ర పెన్నా నది కాశీలోని గంగా నది వలె దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్థ చంద్రాకారంలో సాగిపోతుంది. దీంతో ఇది దక్షిణ కాశిగా ఖ్యాతి గడించింది. పరమ శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం..కార్తీక మాసం పరమ శివునికి ఎంతో ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసంలోని సోమవారాలలో, పౌర్ణమి దినాన స్వామిని దర్శించుకుని, అభిషేకాలను నిర్వహించి పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ సోమవారాలలో ఆలయాలను దర్శించి శివునికి పూజలు చేస్తారు. నేడు మొదటి కార్తీక సోమవారం కొండపైన వున్న శివ లింగం వైద్యనాథేశ్వర ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం సంతాన మల్లేశ్వర స్వామి మూల విరాట్ పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసంతో వుండి ఆయా దేవతా మూర్తులను దర్శిస్తే విశేష ఫలం లభిస్తుందని, సూర్య గ్రహణ సమయంలో కానీ, అక్షయ తృతీయ రోజున కానీ సంకల్ప పూర్వకంగా ఇక్కడి పినాకినీ నదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శిస్తే వంద అశ్వమేథ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని నానుడి. వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో కానీ, మిగిలిన మాసాలలో ఏకాదశి, పౌర్ణమి రోజులలో పినాకినీలో స్నానమాచరిస్తే అనాయాసంగా కై వల్యం లభిస్తుందని పినాకినీ మహత్యం చెబుతోంది. -
పోలీసుల విధులపై అవగాహన కార్యక్రమం
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీఓపెన్ హౌస్శ్రీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్ల, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బాంబు డిస్పోజబుల్ టీం, ఫింగర్ ప్రింట్, పోలీసు కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందాలు, ఆయుధాల విడి భాగాల సమాచారం గురించి ( ఏకే 47 , విల్ పిస్టల్, గ్లో 17, కార్బన్ , ఇన్సాస్ రైఫిల్, గ్యాస్ గన్, గ్రేనేడ్, సి.సి.టి.ఎన్.ఎస్, ఫోరెన్సిక్, ఆర్ఎఫ్ఎస్ఎల్ తదితర విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. బాడీ వర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరా, వి. హెచ్. ఎఫ్ సెట్, రోబో డ్రెస్ను ప్రదర్శనలో ఉంచారు. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. నగరంలోని వివిధ స్కూళ్లకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు స్వామినాయక్, అప్పలనాయుడు, రామస్వామిరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోంథాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కడ సెవెన్రోడ్స్: మోంథా‘తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 27,28వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తుపాన్ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం అదితిసింగ్ జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ నేపద్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. తుపాన్ ప్రభావం వల్ల జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయి లోని అధికారులను సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టే విషయంలో ఆర్డీఓ పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గుర్తించిన పునవాస కేంద్రాలలో మౌలిక వసతులు, త్రాగు నీరు,ఆహార సరఫరా, విద్యుత్,వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదకర స్థాయిలో వాగులు,వంకలు పొంగే ప్రాంతాల వైపు ప్రజలు వెళ్ల కుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలనన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనన్నారు. భారీ వర్షాల వల్ల అన్ని గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యంపై జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంటలను కాపాడుకునే చర్యలతో పాటు.. చేతికందిన పంట దాన్యాన్ని గోడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. అత్యవసర సహాయ చర్యలను అందించేందుకు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 27,28వ తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం! పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రజలు ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్: మోంథా తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని.. భయభ్రాంతులను చేసే పుకార్లను నమ్మకుండా.. ప్రశాంతంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. -
ప్రత్యేక బలగాలు సిద్ధం
● అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేస్తే తక్షణం సహాయక చర్యలు ● ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లాలో ’మోంథా’ తుఫాను నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో 3 ప్రత్యేక బృందాలతో పాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్ లో ఒక రెస్క్యూ టీమ్ సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బాటన్ లతో సంసిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్.పి పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రయాణించేందుకు అనువుకాని మార్గాల్లో, నీట మునిగిన రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నదుల్లో ఈత కొట్టేందుకు ఎవ్వరూ వెళ్లొద్దని ప్రజలను సూచించారు. -
ముంచుకొస్తున్న మోంథా!
కడప అగ్రికల్చర్: జిల్లాకు మోంథా రూపంలో తుపాను గండం పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో నాలుగు రోజుల పాటు వర్షాలు ముంచెత్తాయి. చాలా వరకు పంటలు ఇంకా నీటిలోనే ఉన్నా యి. వరుస వానలతో జిల్లావ్యాప్తంగా 8682 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిని రైతుల పెట్టుబడులు వర్షార్పణం అయ్యాయి. దీంతో రైతుల కష్టం నీళ్లపాలై లక్షల మేర నష్టం వాటిల్లింది. శని, ఆదివారాలు వర్షాలకు కాసింత తెరపి రావడంతో ఉపశనమం కలిగిందని సంతోషించే లోపే మళ్లీ సోమవారం నుంచి మోంథా తుపాన్ ఉందని అధికారులు ప్రకటించడంతో అన్నదాతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే జిల్లా అధికారులు పజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులను కూడా ప్రకటించారు. అలాగే అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను కూడా ప్రకటించారు. వాతావరణ శాఖ ఈ నెల 27,28 తేదీలలో జిల్లాకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. శని, ఆదివారాల్లో కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు తగిన సూచ నలు చేశారు. వర్షం నుంచి పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో సలహాలు అందించారు. ఇప్పటికే జిల్లాను ముంచెత్తిన వర్షాలు తాజాగా మోంథా రూపంలోతుపాను గండం వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా అధికార యంత్రాంగం ఆందోళనలో జిల్లా రైతులు, ప్రజలు -
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని మత్య్సకారులు నదులు, జలశయాలలోకి చేపల వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు నాగయ్య తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారులు తమకు సంబంధించిన వలలు, పుట్టీలు, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో వరద ఆపద సమయంలో ఉన్నప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖ ఇతర ఏశాఖవారు పిలిచినా వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి సబ్సిడీ బుడ్డ శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా 14 మండలాల పరిధిలోని 95 రైతు సేవా కేంద్రాలలో 5801 మంది రైతులు శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల28వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపేస్తారు. అనంతరం రైతులకు విత్తన పంపిణీ చేస్తారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కొండాపురం: గండికోట ప్రాజెక్టు నుంచి రెండు క్రస్ట్ గేట్లు ద్వారా 5 వేల క్యూసెక్కులనీటిని మైలవరం జలాశయానికి విడుదల చేశామని జీఎన్ఎస్ఎస్ఈఈ ఉమా మహేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ఆవుకు రిజర్వాయర్ నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఉందన్నారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం లోని చాగల్ల రిజర్వాయర్ నుంచి వేయ్యి క్యూసెక్కులనీటిని పెన్నానదికి వదలడంతో గండికోట జలాశయంలోకి రాత్రి వచ్చి చేరుతాయన్నారు. ప్రస్తు తం గండికోట జలాశయం పూర్తినీటిసామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 5 వేల క్యూసెక్కులనీటిని ఆదివారం సాయంత్రం దిగువకు వదిలినట్లు వెల్లడించారు. -
●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..
కడప కార్పొరేషన్: ఎంఎస్ఎంఈలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మాటల్ని వల్లె వేస్తూ చిన్న పారిశ్రామికవేత్తల నోట్లో మట్టి కొడుతోంది. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గొప్పగా చెబుతూనే నిధుల విడుదలలో మెలికలు పెడుతోంది. దీపావళి కానుకగా రూ.1500 కోట్లు తొలి విడతగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు అందరికీ కాదు...కొందరికే పడ్డాయని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. తమకు ప్రోత్సహకాలు పడతాయా....పడవా...పడకపోతే తమ పరిస్థితి ఏంటని చాలా మంది అధికారులను ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తుందో పరిశ్రమల శాఖ అధికారులకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ‘ఎంఎస్ఎంఈలను ఆదుకుంటాం...రూ.5వేల కోట్లు బకాయిలన్నీ పూర్తిగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇస్తా’మని మంత్రులు, అధికారులు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. తీరా ప్రోత్సాహకాల విడుదలకు దగ్గరికి వచ్చేసరికి ఎంఎస్ఎంఈలకు ఎంగిలి మెతుకులు విదిల్చి భారీ పరిశ్రమలపై మమకారం కనబరిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. ● రాష్ట్ర వ్యాప్తంగా 15,822 యూనిట్లకు రూ.1916. 74కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల రూపంలో సకాలంలో సాయమందిస్తే అవి నిలదొక్కుకునే అవకాశం కలుగుతుంది. ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది కూడా. అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వమైనా ఎంఎస్ఎంఈలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కేవలం 2538 యూనిట్లే అర్హత సాధించినట్లు పేర్కొంటూ అతితక్కువగా రూ. 275.47కోట్లు మాత్రమే విడుదల చేసింది. అలాగే భారీ, మెగా పరిశ్రమల్లో 182 యూనిట్లకు రూ. 694.44కోట్లు అత్యధికంగా విడుదల చేయడం గమనార్హం. దీనిద్వారా ఎంఎస్ఎంఈల కంటే తమ ప్రభుత్వానికి బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్టీ, ఎస్టీల రాయితీల్లో భారీగా కోత ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు ఆచరణలో వారికి చేసేది శూన్యమని మరోసారి నిరూపితమయ్యింది. భారీ పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహకాలు అందించిన ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీల్లో భారీగా కోత కోసినట్లు సమాచారం. ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్న నమ్మకంతో జీవితాంతం కూడబెట్టుకున్న సంపాదనను, అప్పులు సప్పులు చేసిన తెచ్చిన మొత్తాన్నంతా పరిశ్రమల్లో పెట్టి అవి సక్రమంగా నడవక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందైతే యూనిట్లు ప్రారంభించిన కొద్ది నెలలకే మూతేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మానవత్వం వ్యవహరించి దరఖాస్తు చేసుకున్న అందరికీ 100 శాతం ప్రోత్సాహకాలు అందించాలని పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల విజయవాడలో ఆందోళన కూడా నిర్వహించారు. తమకు వ్యతిరేకంగా గళమెత్తారన్న అక్కసుతోనే ప్రోత్సాహకాల విడుదలలో ఎస్సీ, ఎస్టీలకు భారీగా కోత విధించినట్లు పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతి కొద్దిమందికి మాత్రమే ప్రోత్సాహకాలు 20 శాతం మాత్రమే జమ అయ్యాయని తెలుస్తోంది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని పారిశ్రామిక వేత్తలు మండిపడుతున్నారు. ఏ ఏడాది ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇచ్చేస్తాం...ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ తెరిచి మరీ బకాయిలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు అంటున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.2000కోట్లు రుణం తీసుకుంది. ఇందులో కేవలం రూ.1500 కోట్లు ప్రోత్సాహకాల కోసం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మిగతా రూ.500కోట్లు కోత కోశారు. ఇస్తామని ప్రకటించిన రూ.1500 కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం రూ.1030 కోట్లేనని... ఇందులో కూడా రూ.470 కోట్లు కోత విధించారని చెబుతున్నారు. మొత్తంగా రూ.970 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలుస్తోంది. బస్సులకు సంబంధించి 306 యూనిట్లకు రూ.56కోట్లు మాత్రమే విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించి 1935 యూనిట్లకు 150.71 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ఇందులో బస్సులు, ఇతర వాహనాలు అన్నీ ఉన్నాయి. అయితే కొందరికి 40 శాతం, మరికొందరికి 20 శాతం ప్రోత్సాహకాలు ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది. చాలామందికి అసలే పడలేదని సమాచారం. -
● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
మోంథా తుపాన్ వల్ల ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ● అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి. ● నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు. ● విద్యుత్ తీగలు, పోల్లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు. ● ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయాలను శుభ్రం చేసుకోండి. ● చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి. ● నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి. ● వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ● పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి. ● పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు. ● మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపండి. ● పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి. ● ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది. ● భారీవర్షాలకు సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఈ క్రింద తెలిపిన కంట్రోల్ రూమ్ నంబర్లకు లేదా డయల్ 112 కు గాని ఫోన్ ద్వారా తెలియ జేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సూచించారు. ● జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, కడప కంట్రోల్ రూమ్ :08562 – 246344 ● ఆర్డీవో కార్యాలయం,కడప: 08562– 295990 ● ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 95028 36762 ● ఆర్డీవో కార్యాలయం, బద్వేలు : 6301432849 ● ఆర్డీవో కార్యాలయం, పులివెందుల : 8919134718 -
అక్రమ ప్రాజెక్టులపై చేష్టలుడిగిన చంద్రబాబు
కడప సెవెన్రోడ్స్: కృష్ణానదిపై కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.కర్ణాటక అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నా, తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీచేసి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి డీపీఆర్ తయారు చేస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తారు.› సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం..’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు తెలంగాణ జారీచేసిన జీవో నంబరు 34పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు.పోలవరం–బనకచర్ల పథకం మరో కాలేశ్వరం ప్రాజెక్టు వంటిదని, ఇది కాంట్రాక్టర్లకు సిరులు కురిపించేందుకేనని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెద్ద కదలిక వచ్చిందని కొనియాడారు. ఏపీ రైతు సేవాసమితి అధ్యక్షుడు అక్కినేని భవానిప్రసాద్, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సైతం చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
అదే కర్నూలు బస్సు ప్రమాదానికి మూల కారణం: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఒంటరితనం భరించలేక.. యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీరి్ణంచుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది.దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క..చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
కుందూ నదిలో దూకిన వృద్ధ దంపతులు
● వృద్ధుడిని కాపాడిన స్థానికుడు ● వృద్ధురాలి కోసం గాలింపురాజుపాళెం : కలకాలం తోడుంటానని పెళ్లిలో మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటివరకు ఏ కష్టమొచ్చినా వారు కలిసి ఉన్నారు. చివరకు కలిసే చనిపోవాలని నిర్ణయించుకొని ఇద్దరూ కుందూనదిలో దూకారు. ఈ సంఘటన శనివారం రాజుపాళెం మండలం వెల్లాల సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామ సుబ్బారెడ్డి (81), గొంగటి మునెమ్మ (76) దంపతులు శనివారం ఉదయం రాజుపాళెం మండలం వెల్లాలలోని ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నది వద్ద ఉన్న గంగమ్మకు పూజలు చేసి ఆ వృద్ధ దంపతులు నదిలోకి దూకారు. అయితే ఈ సంఘటనను చూసి అక్కడే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో వెల్లాలకు చెందిన గుర్రప్ప అలియాస్ (శేషు) ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు కుందూ నదిలోకి దూకాడు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డిని ఎలాగోలా కాపాడి ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కుందూనదిలో భారీగా నీటి ప్రవాహం ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది నది వద్దకు బోటును తీసుకొచ్చి గాలింపు చర్యలు చేపట్టాలని చూశారు. ఈ నీటి ఉధృతికి సాధ్యం కాలేదు. తహసీల్దార్ మనోహర రెడ్డి, ఎంపీడీఓ రామనాథరెడ్డి, ఆర్ఐ హుసేన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై గొంగటి రామసుబ్బారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ నాగకీర్తి తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు టెలికాంలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించామని రామసుబ్బారెడ్డి పోలీసులకు తెలిపాడు. ప్రాణాలకు తెగించి.. కుందూనదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకి వృద్ధ దంపతులను కాపాడిన మొద్దుల గుర్రప్పను అందరూ అభినందించారు. క్షణాల్లోనే సమాచారం తెలుసుకున్న గుర్రప్ప ఈత కాయలు కట్టుకొని కొట్టుకుపోతున్న దంపతులను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో గుర్రప్పను అధికారులు, గ్రామస్తులు అందరూ శభాష్.. గుర్పప్ప అంటూ అభినందనలతో ముంచెత్తారు. -
యువతి ఆత్మహత్య
● ఒంటరితనం భరించలేక..● చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి ● తోడుగా ఉన్న అక్కకు ఇటీవల వివాహం ● మనస్థాపంతో తనువు చాలించిన వైనంప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది. దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క.. చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతపరచాలి
కడప అగ్రికల్చర్ : క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత పరిచి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. కడపలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయిలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ రైతులకు సీజన్ బట్టి పంటలు ఎంపిక చేసుకుని ఆ పంటలకు సంబంధించిన ఇన్పుట్స్ ముందుగా తయారు చేయించి మంచి దిగుబడి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీపీఎం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుల అరెస్టుతొండూరు : మండలంలోని మల్లేల ఇమాంబీ దర్గాలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం తొండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఘన మద్దిలేటితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన్నె బీసీ కాలనీకి చెందిన షేక్ హిదయతుల్లా, జమ్మలమడుగు పట్టణానికి చెందిన షేక్ గైబుసావలీ ఈనెల 21వ తేదీన మల్లేల ఇమాంబీ దర్గాలోని హుండీని పగులగొట్టి రూ.30వేల నగదును అపహరించారన్నారు. వారిని శనివారం తొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని భద్రంపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30వేల నగదుతోపాటు హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్కు వెళ్లె క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక విద్యుత్ స్తంభానికి ఆనుకుని వచ్చింది. కొద్దిగా ఆదమరిచి ఉంటే విద్యుత్ స్తంభం తగిలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భయపడ్డారు. ఈ క్రాస్ వద్ద రోడ్డును ఆనుకొని దుకాణాలు, తోపుడు బండ్లు అడ్డంగా ఉంటాయి. వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్రాస్ రోడ్డులోని అడ్డంకులను, ఆక్రమణలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షానికి కూలిన మట్టి మిద్దె వేంపల్లె : వేంపల్లె పట్టణం 12వ వార్డు జెండామాను వీధిలో ఉన్న మాబు ఖాతున్కు చెందిన మట్టి మిద్దె గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలింది. ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలిందన్నారు. వస్తువులు ధ్వంసం కావడంతో దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందన్నారు. -
వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పులి సునీల్
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పులి సునీల్ కుమార్ను ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ నగర అధ్యక్షుడిగా, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి జోన్–5లోని వైఎస్సార్, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ తన నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మహబూబ్ బాషావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ మహబూబ్బాషా పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉత్సాహంగా బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన అండర్ 14,17 బాస్కెట్ బాల్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు దాదాపు 150 క్రీడాకారులు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ చంద్రావతి పేర్కొన్నారు. దాదాపు 12 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇజ్రాయిల్, సుబ్బయ్య, గణేష్, విశ్వనాథ్, సుబ్బ మ్మ, ఉమా, సుభద్ర పాల్గొన్నారు. నేడు వాలీబాల్ ఎంపికలు నేడు నగరంలోని మాంటిస్సోరి పాఠశాలలో వాలీబాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరి చంద్రావతి పేర్కొన్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల లోపల హాజరు కావాలన్నారు. -
పొలతల క్షేత్ర అభివృద్ధికి కృషి
పెండ్లిమర్రి: పొలతల పుణ్యక్షేత్రం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలో దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణాస్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రంలో చేపట్టాల్సిన పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కమలాపురం నియోజకవర్గంలోని 90 ఆలయాలకు ధూప–దీప నైవేద్యం కింద నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం క్షేత్రంలో నాలుగు జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ర్లు, ఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొలతల దేవస్థానం చైర్మన్గా సి.రాజారెడ్డిని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు టీడీపీ ఇన్చార్జి రితేష్రెడ్డి, దేవదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. పుష్పగిరిని సందర్శించిన మంత్రి వల్లూరు: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వాములను దర్శించుకుని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ పుష్పగిరి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
నేడు విద్యుత్ బిల్లులు చెల్లింపునకు అవకాశం
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 26వ తేది ఆదివారం సెలవుదినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యఽథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈనెల 27న ఆర్చరీ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వీవీ జనార్దన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలు డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్ జూనియర్స్ బాల బాలికలకు నిర్వహించే ఈ ఎంపిక ల్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాలు ఉంటాయని వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాకు శనివారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. సంబంధిత యూరియా రేక్ పాయింట్ను కడప మండల వ్యవసాయ అధికారి సురేష్కుమార్రెడ్డితో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పరిశీలించారు. ఇందులో 2200 మెట్రిక్ టన్నులను వైఎస్సార్జిల్లాకు కేటాయించగా మరో 400 మెట్రిక్ టన్నులను అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలు మీ కోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వైబ్సెట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ.. కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 27న నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని సూచించారు. కడప సెవెన్రోడ్స్: తనను సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కడప హెచ్అండ్టీ కాంట్రాక్టర్ ఆర్ఎన్ సంజీవరాయుడు శనివారం ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్కు ఫిర్యాదు చేశారు. తమకు కాంట్రాక్టు దక్కలేదన్న కక్షతో కొందరు తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టించి తన కాంట్రాక్టును తానే రద్దు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. హమాలీలు పనిచేయకుండా ఆటంకం కల్పిస్తున్నారని చెప్పా రు. రోజూ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము విధులను సక్రమంగా నిర్వర్తించలేమని పేర్కొన్నారు. ఏదైనా తమపైన ఆరోపణలు వస్తే తక్షణమే సంబంధిత అధికారులతో పరిశీలన చేయించాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలో రవాణా శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పై దాడులు చేశారు. 34 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ ఉప రవాణాశాఖ కమిషనర్ వీర్రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలో 10 బస్సు లపై, ప్రొద్దుటూరులో 9 బస్సులపై, బద్వేల్ లో 9 బస్సులపై, పులివెందులలో 6 బస్సులపై మొత్తం 34 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ 34 కేసులలో అగ్ని ప్రమాద నివారణ పనిముట్లు లేని కారణంగా 19 బస్సులపై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై నిఘా ఉంచి నత్యం తనిఖీలు చేపడతామని వివరించారు. ప్రైవేట్ బస్సులు అన్ని రకాల పత్రాలను సక్రమంగా ఉంచుకొని బస్సులను నడపాలని ఆదేశించారు. -
శుభపరిణామం
అన్నమాచార్యుల జన్మస్థలిలో శ్రీవారి ఆలయాన్ని భక్తు లకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ఏర్పాటు తరుణంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి బీజంపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నమయ్య థీంపార్కును సందర్శించి, ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. అలాగే పూర్తయింది. ఇప్పుడు భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. – అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కడప సెవెన్రోడ్స్: తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రాజెక్టుల జలాశయాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదితిసింగ్ మాట్లాడుతూ కాలువలు, కుంటలు, చెరువుల్లో యువకులు, పిల్లలు ఈతకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారు లు మొదలు నియోజకవర్గ,మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని కుందూ, పెన్నా పరివాహక ప్రాంతాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అందుకు సంబంధించి అధికారులు పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల గ్రామీణ రోడ్లు, కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయా లని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం అయితే వెంటనే పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా తాత్కాలిక షెల్టర్లను సిద్ధం చేసుకోవాలని మండల తహశీల్దార్లను ఆదేశించారు. సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయ సమాచార నిమిత్తం కలెక్టరేట్లోని కంట్రోల్ రూంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అధికారులను ఆదేశించినజిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఈశ్వరరెడ్డినగర్లోని ముక్తియార్ ఆయిల్మిల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ మహీర్ (14) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహీర్ శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఈశ్వరరెడ్డినగర్లోని బైపాస్రోడ్డులో ఆడుకుంటున్నాడు. అదే వీధిలో ఉంటున్న తెలిసిన వారి ట్రాక్టర్ వెళ్తుండగా తాను కూడా వస్తానని మహీర్ ట్రాక్టర్ ఇంజిన్ వద్ద ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో రామేశ్వరం బైపాస్రోడ్డులోని రెండు కుళాయిల దారి వద్దకు వెళ్లగానే ప్రమాదవశాత్తు మహీర్ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహీర్ తండ్రి గైబూసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ తెలిపారు. సూది మందు వికటించి మహిళ మృతి బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లె పంచాయతీ చెంచయ్యగారిపల్లెకు చెందిన బాలగాని రమాదేవి (45) అనే వివాహిత ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత వారం రోజులుగా రమాదేవికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లింగాలదిన్నెపల్లె కాలనీలోని ఆర్ఎంపీ చిట్టిబాబు దగ్గరకు శనివారం సాయంత్రం వెళ్లింది. ఆయన ఆమెకు అలర్జీ ఉందని ఇంజక్షన్ వేశారు. కొద్ది సేపటికి నోట నురుగు రావడంతో భయపడి రమాదేవిని అక్కడే ఉంచి వైద్యశాలకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఆమె కుటుంబ సభ్యులు ఇంకా రాలేదని ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. అక్కడ తలుపు వేసి ఉండడంతో కిటికీలో నుంచి చూడగా బల్లపై పడిపోయి రమాదేవి కనిపించింది. ఇంటికి వేసిన తాళాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రమాదేవి మృతి చెంది ఉంది. ఇంజక్షన్ వల్లే మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి.మఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. బి.మఠం పోలీసులు ఆర్ఎంపీ చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, పంచాయతీ ఉపసర్పంచ్ కొండారెడ్డిలు మృత దేహాన్ని సందర్శించారు. -
నేనూ జింకా రవి బాధితుడినే
ప్రొద్దుటూరు : గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ నిర్వాహకుడు జింకా రవి బాధితుల వరుసలో తాను కూడా ఉన్నానని జమ్మలమడుగు మున్సిపాలిటీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జె.ప్రసాద్ తెలిపారు. 2016లో తాను రూ.50వేలు తీసుకుని చెల్లించానన్నారు. తాను తీసుకున్న సమయంలో రూ.50వేలుకు బాండు రాయించుకోవడంతోపాటు సమయానికి వడ్డీ చెల్లించలేనని మూడు ఖాళీ చెక్కులు తీసుకున్నాడన్నారు. సమయం ప్రకారం తాను అసలు, వడ్డీ చెల్లించానని, బదిలీలో భాగంగా మైదుకూరుకు వెళ్లానన్నారు. 2017లో జింకా రవి రూ.5 లక్షలకు ఒక చెక్కు, రూ.8 లక్షలకు ఒక చెక్కు కోర్టులో ఫైల్ చేశాడన్నారు. మరో రూ.5లక్షల చెక్కును జింకా రవి బంధువు జింకా వెంకటసుబ్బయ్య కోర్టులో కేసు వేశాడన్నారు. గడువు ముగిసిన తర్వాత బాండు వెనుక అతనే జమ రాసుకుని కోర్టులో వేయడంతో సివిల్ కేసు ఫైల్ అయిందన్నారు. రూ.5లక్షలు, రూ.8లక్షలకు సంబంధించిన కేసులు కోర్టులో కొట్టివేశారని, మరో రూ.5లక్షలతోపాటు బాండ్ కేసు కోర్టులో నడుస్తోందన్నారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఐపీ దాఖలు చేయలేదు : తన ఇంటికి సంబంధించి తాను ఐపీ దాఖలు చేయలేదని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి అనే వడ్డీ వ్యాపారి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షిలో ఇటీవల ప్రచురితమైన ‘ఖాళీ చెక్కులతో కాసుల బేరం’, ‘న్యాయం చేయండి’ వార్తలపై ఆయన స్పందించారు. అడ్వకేట్ ఫోర్జరీ సంతకాలతో ఐపీ దాఖలు చేసినట్లు తెలిసిందన్నారు. దీంతో తాను సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు విన్నవించగా కోర్టు వారు కేసును డిస్మిస్ చేశారని తెలిపారు. ఈ విషయంపై అడ్వకేట్పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. తన ఇంటిని ఎవరూ కొనలేదని, ఇప్పటికీ ఆ ఇంటిలో నివసిస్తున్నానని తెలిపారు. తాను ఉద్యోగులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని, డబ్బు తీసుకున్న ఉద్యోగులు సమయానికి చెల్లించకపోవడంతోనే తాను లీగల్ నోటీసు జారీ చేసి కేసు వేశానని తెలిపారు. తనపై తప్పుడు ప్రకటనలు చేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
రూ.8 లక్షల విలువైన నగల బ్యాగు అప్పగింత
● ఆటోలో పోగొట్టుకున్న వృద్ధ దంపతులు ● సకాలంలో స్పందించిన పోలీసులుకడప అర్బన్ : రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి నగలున్న బ్యాగును ఆటోలో మరచిపోయి వదిలేసి వెళ్లిన వృద్ధ దంపతులకు తిరిగి గంటలోపే వాటిని అప్పగించి కడప చిన్నచౌక్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకెళితే... శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కడప నగరం, శ్రీనగర్ కాలనీలో నివాసం ఉన్న దాసరి సంటెన్న(65), దాసరి గంగులమ్మ (60) దంపతులు వారి మనుమడితో కలిసి నంద్యాలలో ఉన్న తమ కుమారుడు డాక్టర్ రమేష్ ఇంటికి వెళ్లేందుకు ఇంటి వద్ద నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు బయలుదేరారు. ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చేసరికి అప్పటికే బస్టాండ్లో నంద్యాల వైపు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండడంతో ఆ గాబరాలో బంగారాన్ని ఉంచిన తమ బ్యాగును ఆటో వెనుక భాగంలో వదిలి గబగబా ఆటో దిగి బస్సు ఎక్కారు. కొంతసేపటికి తమ బ్యాగును ఆటోలో మరిచిపోయిన విషయం వారు గ్రహించారు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్ అవుట్ పోస్టులో విధులలో ఉన్న కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎ.ఓబులేసు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారుల సూచనల మేరకు వెంటనే రంగంలోకి దిగిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి, బ్లూకోల్ట్ సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్ , పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చిన ఆనవాళ్లను బట్టి ఆటోను పాతబైపాస్ రోడ్డులో గుర్తించి, ఆటో వెనుక భాగంలో బంగారంతో ఉన్న బ్యాగులోని మొత్తం 8 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. వాటిని చిన్నచౌక్ సీఐ ఎ. ఓబులేసు బాధితులైన దాసరి సంటెన్న, దాసరి గంగులమ్మ దంపతులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని, బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి, హోమ్ గార్డ్ గురివిరెడ్డిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. -
అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!
రాజంపేట: అదివో..అల్లదివో..శ్రీహరివాసం..బ్రహ్మకడిగిన పాదం..అంటూ సులువైన పదాలతో కీర్తనలు అలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో తాజాగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు,యాత్రికులు శ్రీవారి దర్శించుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) కల్పించింది. వైఎస్సార్సీపీ పాలనలో అన్నమయ్య జన్మస్థలం అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ఫలితంగా శ్రీవారి ఆలయం నిర్మితమైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 3 వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. సాక్షి వరుస కథనాలు శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో లేకుండా పోయిందనే ఆవేదనపై సాక్షి వరుస కథనాలను ప్రచురించింది. ఈ మార్గంలో నిత్యం టీటీడీ ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్న చూస్తూ పోతున్నారని, భక్తులకు శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్నారనే కోణంలో కథనాలు ప్రచురించింది. అవి టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఎట్టకేలకు శ్రీవారి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవాలను తలపెట్టింది. 600 జయంత్యుత్సవాల నుంచి.. అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలు అప్పటి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో జరిగాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత అన్నమయ్య థీంపార్కు అభివృద్ధిని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అటకెక్కించాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కృషి ఫలితంగా చైర్మన్ థీంపార్కును సందర్శించారు. ఎన్నికల ముందు అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో మళ్లీ అన్న మయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు. అన్నమయ్య ఉద్యానవనంలో దశాబ్బంన్నర తర్వాత వైఎస్సార్సీపీ పాలనలో మళ్లీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికిపైగా వ్య యం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణభారత యాత్రికులు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహాదానందగా భావిస్తున్నారు. ఆలయం నిర్మాణం పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి టీటీడీ సన్నద్ధం కావడం శుభపరిణామంగా భక్తులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయం పూర్తి ఎట్టకేలకు శ్రీవారి ఆలయం ప్రారంభం ఈనెల 31 నుంచివిగ్రహప్రతిష్టమహోత్సవాలు ఆనందదాయకం అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ఆలయం నిర్మించి, విగ్రహప్రతిష్ట మహోత్సవాలు చేయడం శుభపరిణామం. ఈ మార్గంలో వెళ్లే యాత్రికులు, భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ వీలు కల్పించడం హర్షణీయం. శ్రీవారి ఆలయం అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులను ఇదివరకే కోరాం. –చొప్పా గంగిరెడ్డి, ఏయూ అధినేత, రాజంపేట -
● శభాష్.. ఎస్ఐ!
కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో వారితో గొడవపడి ఆత్మహత్యా యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ సకాలంలో అంబులెన్సు రప్పించి బాధితుడని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. వివరాలలోకి వెళితే..శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కడప ట్రాఫిక్ ఎస్.ఐ జయరాముడు టూ టౌన్ పరిధిలో వెళుతున్న దారిలో జియారా ఫంక్షన్ హాల్ సమీపంలోని ఓ ఇంట్లో పీరుల్లా (29) అనే యువకుడు మద్యం మత్తులో ఇంట్లో వారితో గొడవపడి విష ద్రావణం తాగాడు. ఆపై ఇంట్లోని అద్దాన్ని చేతులతో పగులగొట్టడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో వారు చికిత్స కోసం రోడ్డుపై ఉండడాన్ని గమనించిన ఎస్.ఐ జయరాముడు వెంటనే 108 కు ఫోన్ చేసి అంబులెన్సును రప్పించి అతన్ని రిమ్స్కు తరలించారు. సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు సహకరించిన ఎస్.ఐ జయరాముడుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.యువకుడికి సకాలంలో వైద్య సేవలు -
నేరాలలో శిక్షల శాతం పెంచడమే లక్ష్యం
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ● పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్షా సమావేశంకడప అర్బన్ : జిల్లాలో నమోదయ్యే ముఖ్యమైన కేసులలో ముద్దాయిలను రిమాండ్కు తరలించే విషయంలోను, రిమాండ్ ఖైదీలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టులో హాజరు పరిచే విషయమై, అదే విధంగా కేసు విచారణ సందర్భంగా ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యల గురించి, జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదై కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్న కేసులకు సంబంధించిన పలు విషయాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శనివారం జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసులలో దర్యాప్తు మొదలుకొని కోర్టులలో ఆ కేసులు పూర్తయి నిందితులకు శిక్ష పడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేసులు ఫైలింగ్ చేసే విధానం తదితర విషయాలను చర్చించారు. సాక్ష్యాల సేకరణ, ప్రాపర్టీ సీజ్, అటాచ్మెంట్, కోర్టులలో ట్రయల్ జరిగే సమయంలో తలెత్తే సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నివృత్తి చేశారు. ఎప్పుడైతే నేరం చేసిన వారికి శిక్ష పడుతుందో అప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తద్వారా ప్రజలకు పోలీసులపై, న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఖదీరున్బీ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ● జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్08562 – 246344 ఏర్పాటు కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా చెరువు కట్టలు, కాలువ గట్టుల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, వాగులు, వంకలు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మొదలు నియోజకవర్గ, మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని.. ఈ మేరకు రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం అయితే.. వెంటనే దానిని పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది మరింత బాధ్యతతో వారి విధులను నిర్వర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్ సిలలో సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అత్యవసర సహాయ సమాచార నిమిత్తం 08562 – 246344 కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
కళా ఉత్సవ్ పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు
రాయచోటి జగదాంబసెంటర్: విజయవాడలోని మురళి రిసార్ట్స్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ –2025 పోటీలలో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికను అందించడం, ప్రాంతీయ స్థాయిలో కళలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో కళా ఉత్సవ్ –2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, కథాకథనం పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 23 మంది పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కార్ట్ ఉపాధ్యాయులు భ్రమరాంబ, ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. -
జలపాత సోయగం!
ఉరకలై గోదావరి ఉరికెనా మదిలోనికి.. అని సినీకవి అన్నట్లు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కడప సమీపంలోని పాలకొండల్లో జలపాతం ఉరకలెత్తి ప్రవహిస్తోంది. తెల్లటి నురగలు కక్కుతూ హొయలొలుకుతూ శరవేగంగా ప్రవహిస్తున్న జలపాతం అందాలను చూసేందుకు యువతీ, యువకులు ఉత్సాహంగా వస్తున్నారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడంతో జలపాతాన్ని చూసేందుకు విద్యార్థులు, పిల్లలు, పెద్దల సంఖ్య పెరిగింది. ఈ సమయంలోనే వర్షం దంచికొట్టడంతో జలపాతం ఉధృతి కూడా పెరిగింది. జలపాతాన్ని చూసేందుకు వస్తున్న యువత ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఫొటోలు: సాక్షి ఫోటోగ్రాఫర్.కడప -
పూల తోటంతా దెబ్బతినేలా ఉంది
వరుస వర్షాలతోపాటు నిన్నామొన్నా కురిసిన భారీ వర్షంతో పొలంలో నీరంతా నిలిచింది. కార్తీక మాసం కావడంతో ఇప్పుడిప్పుడే పూలధర కాసింత పెరిగింది. నాలుగు రూపాయలు వస్తుందని ఆశపడేలోపు ఈ వర్షం నట్టేట ముంచింది. – కొమ్మద్ది. వెంకటసుబ్బయ్య, లింగారెడ్డిపల్లె, సీకేదిన్నె మండలం పెట్టుబడికూడా రాలే.. నేను ఎకరాలో చామంతి పూల తోట వేశా. ఇప్పటికీ పెట్టుబడి కూడా రాలేదు. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ధరలు బాగా ఉన్నాయి. పది రూపాయలు వస్తుందిలే అనుకుని ఆశపడ్డా. ఈ వర్షం ముంచేసింది. పెట్టుబడి కూడా రాలే. నష్టపోవాల్సిందే. – లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, లిక్కిరెడ్డిపల్లె, సికెదిన్నె -
ప్రమాణస్వీకారం
సిద్దవటం: సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గురువారం శ్రీ నిత్యపూజస్వామి పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్గా జంగిటి రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులుగా పి.మల్లేశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, కె.మల్లీశ్వరి, సి.వెంకటసుబ్బయ్య, జె.శివారెడ్డి, కె.రూప, ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు రంగసముద్రం సుబ్రమణ్యంశర్మల చేత ఈఓ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట: వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చొప్పా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మే రకు నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పా ఎల్లారెడ్డి గతంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ చాన్సులర్ జయరామిరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు డిప్లిమాలో ఓ బ్రాంచ్ పాసైన వారైన అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కలలను సాకారం చేసే సృజనాత్మక విశ్వవిద్యాలయం ఏఎఫ్యూ అని తెలిపారు. ఇక్కడ Creativity. Technology, Arts , Design సమన్వయంతో రూపొందిన కోర్సులు విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ , ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం 99855 88105, 90524 60323 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా పరిధిలో వాహన యజమానులు వివిధ రకాల సేవల కోసం వాహన్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 867 దరఖాస్తులు క్లియర్ చేశామని.. ఇంకా 387 పెండింగ్లో ఉన్నాయని జిల్లా ఇన్చార్జ్ ఉపరవాణా శాఖ కమిసనర్ వీర్రాజు పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫైనాన్షియర్ వెరిఫై చేస్తే తప్ప, ఈ దరఖాస్తులు రవాణా శాఖ కార్యాలయాలలో అప్రూవ్ చేయడానికి అవకాశం ఉండదన్నారు. ఈ దరఖాస్తుల వివరాలు జిల్లాలో గల రవాణా శాఖ కార్యాలయాలలో డిస్ప్లే చేశామని తెలిపారు. గత 50 రోజులలో ఫైనాన్సియర్ల నుంచి వెరిఫై అయిన 867 దరఖాస్తులు క్లియర్ చేశామని వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న వారు ఒక లేఖ, ఫామ్ 35 జిరాక్స్, వాహన యజమాని ఆధార్ జిరాక్స్, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్ కలిపి తమ కార్యాలయానికి ఈనెల 31లోపు సబ్మిట్ చేయాలన్నారు. ఈ నెల 31 లోపు సబ్మిట్ చెయ్యని దరఖాస్తులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరు కల్చరల్: మహాకవి డాక్టర్ గడియారం వేంకటశాస్త్రి 44వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను ఈనెల 26న అరవిందాశ్రమంలోని అరబిందో ఇంటిగ్రల్ హైస్కూల్లో సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించనున్నట్లు రచన సాహిత్యవేదిక ఉపాధ్యక్షుడు గడియారం వేంకట శేషశర్మ తెలిపారు. గురువారం పురస్కార ప్రదాన సభ ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడియారం బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, అవధాని, విమర్శకులు అని.. ఆయన ఎన్నో కావ్యాలు రచించారన్నారు. ఆ మహానీయుని పేరుతో రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి 44 ఏళ్లుగా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది హైదరాబాద్కు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిమి శ్రీరామనాథ్ రచించిన జీవాతువుకు పురస్కారం ప్రదానం చేస్తున్నామన్నారు. సాహితీ ప్రియులు, అభిమానులు పురస్కార ప్రధానోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
కార్తీక మాసంలో భక్తుల కోసం విశేష ఏర్పాట్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి 60 బస్సు సర్వీసులు, అన్నమయ్య 56, తిరుపతి 10, చిత్తూరు 20, కర్నూలు 110, నంద్యాల 127, అనంతపురం 66, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 102 బస్సులు నడపనున్నామన్నారు. భక్తులకు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీ సులను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. అలాగే దూర ప్రాంతాల వారికి ఆయా బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు. కడపజోన్ నుంచి 551 సర్వీసులు ఆర్టీసీ కడపజోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ -
విద్యుత్ సమస్యలపై తక్షణం స్పందించాలి
బద్వేలు అర్బన్/అట్లూరు: విద్యుత్ సమస్యలపై తక్ష ణం స్పందించాలని అధికారులకు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ తెలిపారు. గురువారం బద్వేలు, అట్లూరు విద్యుత్ కార్యాయాల్లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యుత్ సంబంధిత సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయం, లో ఓల్టేజ్ వంటి సమస్యలపై ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని, ఫీడ ర్లు, ట్రాన్స్ఫార్మర్లను పర్యవేక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, నెట్ వర్క్ బలోపేతం ద్వారా లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుల్లాయప్ప, ఏఈలు షర్మిల, శివ, విజయ్ కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి ఒంటిమిట్ట: గత రెండు రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ ఎస్.రమణ సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రజల భద్రత, సేవల పునరుద్ధరణ కోసం ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్,హెల్ప్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్.రమణ -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానిని ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని ఆరోపించారు. టూరిజంలో 42 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తుంటే కమీషన్లకు కక్కుర్తి పడి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయంలో ఎన్నో ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీలను ప్రైవేటుకు అప్పగించారని విమర్శించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేసేందుకు సిద్దం చేశారని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో సాధ్యపడలేదన్నారు. కడపలో పాతరిమ్స్ను కూడా అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారన్నారు. అలాగే ఒక ఎకరా ఏడాదికి 99పైసలకు 66 ఏళ్లకు లీజుకు ఇవ్వడం దారుణమన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ చేతులెత్తేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా ఎలా వైద్యం అందించారో అందరూ చూశారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితి మళ్లీ తలెత్త కూడదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచి ఒక్కో జిల్లాకు ఒక్కో బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఏడు కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరిగాయని, మరో మూడు కాలేజీల్లో 90 శాతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.1000కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలు పూర్తవుతాయన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తులని, వీటిని ప్రైవేటు వారికి అప్పనంగా అప్పగిస్తామంటే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 28వ తేది జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నామని, వీటిని ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, కార్పొరేటర్ షఫీ, ఫయాజ్ పాల్గొన్నారు. ఈనెల 28న అన్నినియోజకవర్గాల్లో ర్యాలీలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు గంగనపల్లి విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ 19 స్కూల్ గేమ్స్లో భాగంగా పోల్ వాల్ట్ ఈవెంట్ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా పెదవేగి మండలం బాలయోగి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అండర్ 19 స్కూల్ గేమ్స్ పోల్ వాల్ట్ ఈవెంట్ పోటీలలో విద్యార్థులు వి.సుహానా ఫాజియా 2.30 మీటర్ల ఎత్తు దూకి బంగారు పతకాన్ని సాధించింది. అలాగే వి. మోసిన 1.65 మీటర్ల ఎత్తు దూకి వెండి పతకాన్ని సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటారు. వీరు నవంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని భవానిలో జరిగే 69వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. వీరి ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇక్బాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవిశంకర్రెడ్డి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో మహిళలకు కరువైన రక్షణ
బద్వేలు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు, విద్యార్థినులకు, బాలికలకు రక్షణ కరువైందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. గురువారం ఎన్జీఓ కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడటం దారుణమన్నారు. అలాగే ఈ ఘటనతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతుందని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఊరూరా బెల్టుషాపులు ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మహిళలు, విద్యార్థినులు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి
చాపాడు : మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మార్తల ఓబులరెడ్డి అనే రైతుకు చెందిన చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు గురువారం రాత్రి ఉన్నట్టుండి ఓబుల్ రెడ్డికి చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. ఈ ఇంట్లో ఉన్న మూడు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక్క గేద విలువ లక్ష పైగా ఉంటుందని మూడు గేదెలు మూడు లక్షలకు పైగా విలువ చేస్తాయని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. -
డబ్బులు చెల్లించాలంటూ మహిళల ఆందోళన
కడప అర్బన్ : స్థలం కొనిస్తామంటూ చెప్పి తమ కుమారుని వద్ద నుంచి రూ. 70 లక్షలకు పైగానే డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, తన భర్తను బెదిరిస్తున్నారంటూ శ్వేత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె తమ బంధువులతో కలిసి గురువారం ఆందోళనకు దిగారు. సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకుడి ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న చిన్నచౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శ్వేత మాట్లాడుతూ పెట్రోలు బంకు నిర్వాహకుడు తమకు స్థలం ఇప్పిస్తానంటూ రూ. 70 లక్షలకు పైగానే తీసుకున్నాడన్నారు. స్థలం ఇవ్వాలని అడిగితే స్థలం లేదని దానికి బదులుగా పెట్రోల్ బంకు లీజుకు ఇస్తానని చెప్పాడన్నారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడని తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
మద్యం మత్తులో రైలులో వీరంగం..
కడప కోటిరెడ్డిర్కిల్ : తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం (కమ్యూనిటీ సర్వీసు) చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దొనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలులో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ యాక్టు 355 ప్రకారం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్ సెకండ్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు.రైల్వేస్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని శిక్ష విధించిన న్యాయమూర్తి -
భూములకు రక్షణ కల్పించండి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కలికిరి మండలం పేత్తగడ గ్రామ పంచాయతీ మజరా పాలెంకు చెందిన గుండ్లూరు రాజగోపాల్ తనకు ప్రాణహాని ఉందని, భూములను రక్షించాలని బుధవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామంలో రెండు చింతచెట్లతో సహా సర్వే నెంబర్ 294లో 0.02 సెంట్ల భూమిని 1991లో కొనుగోలు చేశానన్నారు. అయితే ఇదే భూమిపై తమ గ్రామానికి చెందిన బందం గుర్రప్ప, అతని కుమారుడు బందం రాజు అలియాస్ పురుషోత్తంల కన్ను పడిందన్నారు. ఈ విషయమై తనను అనేకమార్లు అడిగినా తాను ఇవ్వనని చెప్పానన్నారు. అయితే ఈ నెల 21వ తేదీన తాను పొలం పనులకు వెళ్లగా బందం గుర్రప్ప, బందం రాజు, బందం రమణ, బందం రమేష్, బందం చెన్నకేశవులు మరికొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా తనను బంధించి దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల రెండు చింతచెట్లను దౌర్జన్యంగా, అక్రమంగా నరికివేశారన్నారు. దీంతో తమకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. తనపై దాడి చేసే సమయంలో ప్రాణభయంతో గట్టిగా అరుపులు వేయడంతో పక్కనే ఉన్న మదన, గంగరాజులు వచ్చి వారి బారి నుంచి తనను కాపాడారన్నారు. -
బద్వేలు టీడీపీలో ఐవీఆర్ కాల్కలం!
● సర్వే పేరుతో అభిప్రాయ సేకరణ ● రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ శ్రేణులు ● పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులుఅట్లూరు : ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ఐవీఆర్ సర్వే బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో దివంగత మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి మనుమడు రితీష్రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య చిచ్చు రేపింది. బద్వేలు నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా రాణించారు దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి. ఆయన మరణానంతరం 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె విజయమ్మ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో అక్కడ ఎస్సీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ప్రధాన పార్టీల నాయకులు తీసుకున్నారు. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాన్ని వరుసగా డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కై వసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న విజయమ్మ ఆమె తనయుడు రితీష్రెడ్డి పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ పరిస్థితిలో తల్లీ తనయులకు తోడుగా నేనున్నానంటూ అట్లూరు మండలం వేమలూరు గ్రామానికి చెందిన రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణరెడ్డి టీడీపీలో చురుకై న పాత్ర పోసిస్తూ వచ్చారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం డీసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. కట్టబెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను కలిసి పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టడంతో పాటు బద్వేలులో పార్టీ ఓటమికి విజయమ్మ, ఆమె తనయుడు రితీష్రెడ్డి కారకులని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐవీఆర్ కాల్తో కలకలం.. బద్వేలులో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో ఇటీవల జరిపిన ఐవీఆర్ ఫోన్ కాల్ సర్వే మరింత సంక్షోభాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు. బద్వేలు టీడీపీ ఇన్చార్జిగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ రితీష్రెడ్డి అయితే 1 నొక్కండి.. డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్ సర్వే కాల్ నియోజకవర్గ ప్రజలకు వస్తుండటం కలకలం రేపింది. వీరారెడ్డి వారసులకు కాకుండా ఇతరులకు ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారంటూ విజయమ్మ, రితీష్రెడ్డి వర్గం వాదిస్తుంటే.. పార్టీ కోసం కష్టపడుతూ ఖర్చు పెడుతున్న సూర్యనారాయణరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాల్సిందే నంటూ మరో వర్గం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్రెడ్డి వర్గం ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసి దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన రితీష్రెడ్డినే ఇన్చార్జిగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఐవీఆర్ సర్వే పుణ్యమా అని బద్వేలు టీడీపీ బీటలు వారిందనే చెప్పవచ్చు. -
సీటీఎం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం స్టేషన్లోని రెండో ఫ్లాట్ఫాంపై సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పరిశీలించారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్బాషా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైల్వే డాక్టర్లతో కలిసి పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిది సహజ మరణమేనని, అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రైల్వే హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా ఫోన్ నెంబర్.9133109537ను సంప్రదించాలన్నారు. -
జేఎల్ఎంకు విద్యుత్ షాక్
వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని చింతలమడుగుపల్లె సబ్ స్టేషన్లో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్ఎం హరి నారాయణకు నేలవరం తండా వద్ద విద్యుత్ స్థంభం వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ షాక్ తగిలిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జేఎల్ఎం హరినారాయణ లైన్ మెన్ నుంచి ఎల్సీ తీసుకొని విద్యుత్ స్థంభాన్ని ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్థంభంపై నుంచి కిందపడటంతో హరినారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హరినారాయణ వెనుక భాగమంతా విద్యుత్ షాక్ తగిలి చర్మం కాలిపోయింది. స్థానికుల సహాయంతో 108 వాహనంలో హరి నారాయణను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. లైన్ క్లియరెన్స్ ఇవ్వకుండానే విద్యుత్తు స్థంభాన్ని ఎక్కించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు వాపోతున్నారు. డిప్యుటేషన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిరాయచోటి టౌన్ : రాయచోటి డైట్ కళాశాలలో డిప్యుటేషన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–2026 సంవత్సరానికి సంబంధించి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు. స్క్రూట్నీ 30–31వ తేదీలలో జరుగుతుందన్నారు. రాత పరీక్ష నవంబర్ 5–8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామన్నారు. -
హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు
చింతకొమ్మదిన్నె : స్థానిక చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులైన ఇందిరానగర్కు చెందిన రౌడీషీటర్ చిలకల చాంద్బాషా, అతని అనుచరులైన మరో ముగ్గురు ఎర్రవల్లి అబ్దుల్, షేక్ జాకీర్ హుస్సేన్, వలీ అలియాస్ ఖాదర్ హుస్సేన్లను గురువారం అరెస్టు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. నిందితులను ఇందిరానగర్ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువచ్చి, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండు నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. -
భర్తపై భార్య ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వక్కలపేటలో నివాసం ఉంటున్న రేవతికి, బాలాజీ నగర్కు చెందిన లోకేష్కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తన భర్తతో పాటు, అత్తమామలు, అక్కా బావ వేధిస్తున్నారని ఆవేదన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కడప టూ టౌన్ ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్ ఐదుగురిపై వరకట్నం వేధింపు కేసు నమోదు చేశారు. జార్జి క్లబ్లో పోలీసుల తనిఖీలుప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని జార్జికారోనేషన్ క్లబ్లో గురువారం సాయంత్రం త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. క్లబ్లో పేకాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. క్లబ్లో పేకాట నిర్వహించరాదని సీఐ క్లబ్ నిర్వాహకులకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువకుడి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం చెన్నయ్య వీధికి చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్(26) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెల 16వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. తండ్రి మున్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడంపల్లె దళితవాడలో పేకాట ఆడుతున్న ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో టౌ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6390 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. రూ. 33 లక్షలకు ఐపీ దాఖలుపీలేరు రూరల్ : పీలేరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కలికిరికి చెందిన దంపతులు రూ. 33 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కలికిరి పట్టణం, రామ్నగర్ కాలనీకి చెందిన షేక్ ఖాదర్బాషా కలికిరిలో కూల్డ్రింక్స్, టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబం పోషించేవాడు. అలాగే కలికిరి, పరిసర ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుని టమాట పంటసాగు చేసేవాడు, ఆయన భార్య షేక్ ముంతాజ్ ఇంటిలో చీరల వ్యాపారం నిర్వహించేది. ఖాదర్ బాషా 23 మంది వద్ద రూ. 17,76,500, ముంతాజ్ ఆరుగురి వద్ద రూ. 15,50,000 అప్పు చేసింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఇద్దరూ ఐపీ దాఖలు చేశారు. -
జాతీయ స్థాయి పోటీలో ఏయూ విద్యార్థుల ప్రతిభ
రాజంపేట : కడప కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎక్స్లియర్–2025 జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యార్థుల మీట్లో అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు వారిని గురువారం ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏయూ వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి అభినందించారు. మార్కెటింగ్ గేమ్, హెచ్ఆర్ గేమ్, ఫైనాన్స్ గేమ్ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గేమ్లో భారత్కుమార్, కార్తీక్, కిషోర్ల బృందం రెండవ బహుమతిని దక్కించుకుంది. మార్కెటింగ్ గేమ్లో వరలక్ష్మీ, వర్ష, కావ్య బృందం మూడవ బహుమతిని సాధించారు. కార్యక్రమంలో పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జె.సమతనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఏయూ విద్యార్థులు ప్రతి చోట ప్రతిభను సాధించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : వెనుకబడిన వర్గాలు(బీసీ)ల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పాత రిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బీసీ భవన్లోని స్టడీ సెంటర్, లైబ్రరీ, మూడో అంతస్తులో ఉన్న విడిది రూములను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక భవనం ఉండాలనేది చిరకాల వాంఛ అని, అన్ని ప్రభుత్వాలకు అనేక మార్లు విన్నవించినా ఏ ప్రభుత్వం స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ వల్ల బీసీ భవన్ సాకారమైందన్నారు. కడప శివార్లలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తామని అధికారులు చెబితే తాము కడప నగరంలోనే కావాలని పట్టుబట్టి పాతరిమ్స్ ప్రాంగణంలో సెంటు రూ.20 లక్షలు పలికేచోట 0.20 సెంట్ల స్థలాన్ని కేటాయింపజేశామన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఎంపీ నిధుల నుంచి రూ.6కోట్లు భవన నిర్మాణానికి మంజూరు చేయగా, అత్యంత సుందరంగా బీసీ భవన్ను నిర్మించారన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో బీసీ భవన్ పనులు ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సరైన పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు వంటివి ఏవీ లేవన్నారు. స్టడీ హాల్లో విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ భవన్లో విశ్రాంతి గదుల్లో ఏసీలు, మంచాలు, పరుపులు, స్టడీ హాల్లో కుర్చీలు, టేబుళ్లు వంటివి ఏవీ లేవన్నారు. రూ.50లక్షలు ఖర్చు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెబితే, తాము జోలె పట్టుకొని బీసీ భవన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సింధే రవి, గంగరాజు, మహిళా నాయకురాలు నారాయణమ్మ పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులు -
కొండల్ని పిండి చేస్తున్నారు!
● అనధికారిక తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికారులు ● పంచాయతీలకు భారీ నష్టమంటున్న స్థానికులుఖాజీపేట : గ్రామీణ రోడ్ల కోసం లేదా ఇంటి బేస్మట్టం కోసం మట్టిని తీసుకెళితే వెంటపడి వేధించి కేసులు నమోదు చేసే అధికారులు ఎలాంటి అనుమతులు లేకున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తుంటే మౌనం వహిస్తున్నారు. అది కూడా ఫారెస్ట్ భూముల నుంచి తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి జాతీయ రహదారి నిర్మాణం కోసం అనధికారికంగా లక్షల క్యూబిక్ మీటర్లను తవ్వేస్తున్నారు. ఇందు కోసం అడవుల్లోని కొండలు సైతం పిండి అవుతున్నాయి. ఈ తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డుకుంటున్న సంఘటనలు ఖాజీపేట మండలంలో నిత్యం జరుగుతున్నాయి. మైదుకూరు నియోజకవర్గం మీదుగా ఎక్స్ప్రెస్ హైవే వెళుతోంది. ఆ రహదారి నిర్మాణం కోసం ఒక ప్రముఖ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఆ రహదారి నిర్మాణం కోసం ఖాజీపేట మండలం నాగసానిపల్లె సమీపంలోని కొండలను తవ్వి మట్టిని నిత్యం వందలాది టిప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు. వారికి తొలుత కేవలం 300 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు మాత్రమే అనుమతులు లభించాయి. అయితే ఆ మట్టితో పాటు చుట్టు పక్కల కొండలను సైతం పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో పిండి చేసి మట్టిని తరలిస్తున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు.. వాస్తవానికి కంపెనీ మట్టి తరలింపు విషయంలో కొందరు వ్యక్తులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు సమాచారం. వారు అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో తవ్వడంతో పాటు అనధికారికంగా అనుమతులు లేని చోట భారీగా మట్టిని తరలిస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ పైభాగాన అటవీ కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో సైతం అనధికారికంగా భారీగా మట్టిని తవ్వేస్తున్నారు. 300 క్యూబిక్ మీటర్లు తవ్వాల్సింది పోయి ఇప్పటికే సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీలకు అందని రాయల్టీ.. రోడ్డు నిర్మాణం కోసం మట్టిని తరలించే క్రమంలో కంపెనీ వారు అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటారు. క్యూబిక్ మీటరుకు సుమారు రూ.140 నుంచి రూ.150 చొప్పున రాయల్టీ కడతారు. అలా కట్టిన రాయల్టీలో కొంతభాగం పంచాయతీకి వస్తుంది. అయితే రాయల్టీ కట్టకుండా తరలించడంపై అప్పనపల్లె పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో మట్టి వాడకంపై నేషనల్ అథారిటీ వారు క్యూబిక్ మీటరుకు డబ్బును నిర్ధారించి కంపెనీ వారితో కట్టించుకుంటారు. అయితే వారు వేరే ప్రాంతంలో మట్టిని తరలించినట్లు చూపుతారు. దీంతో మట్టిని తరలించుకు పోయేది ఒక చోట.. పంచాయతీకి జమ అయ్యేది వేరొక చోట. ఈ కారణంగా మట్టిని తరలించుకు పోయిన పంచాయతీకి ఎలాంటి నిధులు రావు. అటవీ కొండల్లో సైతం.. చిలక కనం దగ్గర ఉన్న కొండలు పూర్తిగా అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. అలాంటి కొండలు తవ్వాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే చాలా దూరం తవ్వినట్లు తెలుస్తోంది. అడ్డుకున్న టీడీపీ నాయకులు.. రోడ్డు నిర్మాణం కోసం ఎలాంటి అమనుతులు లేకుండా మట్టిని తరలించడంపై టీడీపీ నాయకులు కొందరు అడ్డుకున్నారు. ఖాజీపేట మండలానికి చెందిన ఒక నాయకుడు, తెలుగుగంగ మాజీ ఏఈ కలసి మట్టిని తరలించే విషయంలో కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారే మట్టిని తరలిస్తున్నారు. అయితే అనుమతులు లేకుండా మట్టిని తరలించడంపై ఇటు అప్పనపల్లెలోని టీడీపీ నాయకులు, ఖాజీపేటకు చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మట్టిని తరలించే చోట రహదారికి అడ్డుగా మట్టి కట్టలను వేశారు. మరో చోట వాహనాలను అడ్డు పెట్టి మట్టిని తరలించకుండా పనులను తాత్కాలికంగా నిలిపేశారు. చాలా రోజులుగా మట్టిని తరలిస్తున్నా అడ్డు చెప్పని నాయకులు ఇప్పడు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు చర్చించుకోవడం విశేషం.మట్టి తరలింపును నిలిపి వేయమని చెప్పాం.. అనుమతుల మేరకు మట్టిని తరలించాలి. అనుమతులు మించి మట్టిని తరలించరాదు. కంపెనీ వారు కొంత మేరకు రాయల్టీ చెల్లించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ వారికి మేం లేఖలు రాశాము. మట్టి తరలింపును తాత్కాలికంగా ఆపేయమని చెప్పాం. పూర్తి అనుమతులు వచ్చిన తరువాతనే మట్టి తవ్వకాలు చేపట్టాలని సూచించాం. – వెంకటరామయ్య, డీఈ, గనుల శాఖఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.. రోడ్డు నిర్మాణ పనుల కోసం మేము ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదు. ఎవ్వరికి సిఫార్సు చేయలేదు. అలా ఎవరైనా మట్టిని తరలిస్తే అది అనధికారిక తరలింపే అవుతుంది. వాటిని మేం అడ్డుకుంటాం. – వెంకట రమణమ్మ, తహసీల్దార్, ఖాజీపేట -
విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ సచివాలయాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ తీగలు కిందకు జారిపోయి కేంద్రం ఇనుప గేటుకు తగులుకున్నాయి. దీంతో గేటుకు విద్యుత్ ప్రసరించింది. బుధవారం ఉదయం కేంద్రం వద్ద సంచరిస్తున్న మూడు పందులు గేటుకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో పాటు ఆ సమయానికి మనుషులు అటువైపు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. పందులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య
పోరుమామిళ్ల : అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లెలో జరిగింది. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు కమ్మవారిపల్లెకు చెందిన యువరైతు కలవకూరి నాయుడుబాబు(37) చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో పాటు సుమారు రూ. 15 లక్షల దాకా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక భయంతో ఈనెల 18న పురుగుల మందు తాగాడు. అతన్ని బంధువులు నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తీసికెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి తీసికెళ్లమని చెప్పడంతో మంగళవారం ఇంటికి తెచ్చారు. బుధవారం ఉదయం నాయుడుబాబు మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు మైనర్ కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ పరిశీలనకడప అర్బన్ : కడప నగరం మోచంపేటలోని ఆధార్ సెంటర్ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ బుధవారం పరిశీలించారు. సాథి క్యాంపెయిన్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిరుపేద పిల్లల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డుకు పట్టే సమయం, ఆధార్లో ఏమైనా సమస్యలు వస్తే తిరిగి ఎలా చేయించుకోవాలి తదితర అంశాలను విచారించారు. నిరుపేద పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి విజేతలుగా మైదుకూరు విద్యార్థులు
మైదుకూరు : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో మైదుకూరు మండలానికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కావలిలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ జిల్లాల మధ్య జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలిచిందని మండలంలోని వనిపెంట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా జట్టులో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు హిమబిందు, దివ్య, స్నేహ, అమీరూన్, 10వ తగరతి విద్యార్థినులు కుసుమ, అపూర్వలు ప్రతిభ కనపరిచి వైఎస్సార్ కడప జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేశారని ప్రిన్సిపాల్ వివరించారు. విజేత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపాల్ నిర్మల, పీఈటీ శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు. -
స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నం
● ఫిర్యాదు చేసిన సర్పంచ్, ప్రజలు ● విచారించిన తహసీల్దారుబద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లె పంచాయతీలోని 186 బూత్లో గ్రామానికి చెందిన కొందరు స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వంకెల జయరామిరెడ్డి, స్థానిక ప్రజలు డివిజన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో దరఖాస్తు చేసిన వ్యక్తులు సైతం తమ వారి ఓట్లు నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ సూచనల మేరకు బుధవారం పుట్టాయపల్లె సచివాలయంలో తహసీల్దారు ఉదయభాస్కర్రాజు గ్రామసభ నిర్వహించి గ్రామస్తులను విచారించారు. గ్రామంలో నివాసం లేని చెన్నంపల్లె, అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె, మణ్యంవారిపల్లె, బద్వేలు టౌన్ ఎన్జీఓ కాలనీలకు చెందిన పలువురిని పుట్టాయపల్లె గ్రామ బూత్ నెంబర్ 186లో ఓటర్లుగా నమోదు చేయించేందుకు గ్రామానికి చెందిన బీరం జయరామిరెడ్డి, బీరం విజయనరసింహారెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారని పుట్టాయపల్లె సర్పంచ్ జయరామిరెడ్డి మండల ఉప ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తమ వారి ఓట్లు బీఎల్ఓ నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదులు అందాయి. ఇరువురి వాదనల మేరకు ఆర్డీఓ ఆదేశాలతో గ్రామంలో విచారణ చేపట్టామని, తుది నివేదికను ఆర్డీఓకు అందజేస్తామని తహసీల్దారు తెలిపారు. -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
కమలాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని నిరసిస్తూ వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో నల్లింగాయపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమానులతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకై క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను అతి తక్కువ ధరలకు సింగిల్ టెండర్లోనే అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఎకరా భూమి 99 పైసలకే కూటమి ప్రభుత్వం అమ్ముతోందని, ఏడాదికి రూ.4వేలు అద్దె ప్రకారం ధారా దత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటి అద్దె కూడా ఇంత దారుణంగా ఉండదన్నారు. 50 ఎకరాల ప్రభుత్వ ఆసుపత్రిని ఏడాదికి రూ.4వేలకు ఇవ్వడం దారుణం అన్నారు. విద్య వైద్యంపై చిత్తశుద్ధి లేదు: నరేన్ ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే అంశాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువస్తే ప్రజా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత విస్తరించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారన్నారు. 10 మెడికల్ కళాశాలలతో పాటు హాస్పిటల్స్ను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇదే జరిగితే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు లభించవన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య విద్య భారం: రాజోలి వీరారెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ సలహాదారుడు రాజోలి వీరారెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ జరిగితే రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ఫీజు చెల్లించే వైద్య విద్యార్థులు కోటి రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తోందని మండి పడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యంరెడ్డి, రామ లక్ష్మీరెడ్డి, మోహన్ రెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, మహ్మద్ సాదిక్, చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న కారు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారి కొలుములపల్లి సమీపంలోని కొత్త రోడ్డు వద్ద బుధవారం ఉదయం చెత్తను తరలించే లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీనాథ్, చెత్తను తరలించే లారీ డ్రైవర్ ఏసుదాసు ప్రసాద్కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప వైపు నుంచి మద్దిమడుగు వద్ద ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కు చెత్తను తరలిస్తున్న ఏపీ 04 టీఎక్స్ 8410 నెంబర్ గల లారీని రాయచోటి వైపు నుంచి కడప వైపు వస్తున్న కేఏ 04 ఎంక్యూ 8105 నెంబర్ గల మారుతీ సియాజ్ కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ మరోసారి బలంగా అదే లారీని ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతింది. కారుకు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గాయపడిన రెండు వాహనాల డ్రైవర్లను హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించాలికడప రూరల్ : హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా, మనో థెరిస్కోవా తెలిపారు. ఆ మేరకు బుధవారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు చాలా మంది పదవీ విరమణ పొందే దశలో ఉన్నారని తెలిపారు. కనుక హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధమ్మ, అమరావతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
పడకేసిన పల్లె వైద్యం
● మూడు వారాలకు పైగా సమ్మెలో గ్రామీణ పీహెచ్సీ వైద్యులు ● ఇన్ఛార్జి వైద్యులతో అంతంతమాత్రంగా వైద్య సేవలు గ్రామీణ వైద్యం అటకెక్కింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టడంతో పల్లెవాసులకు వైద్య సేవ అందని దుస్థితి నెలకొంది. వైద్యులు సమ్మెలోకి వెళ్లినా..వైద్యం పడకేసినా పాలకులకు పట్టకపోవడంపై గ్రామీణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కడప రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా లభించే ప్రాథమిక వైద్యం పూర్తిగా గాడి తప్పింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 28 నుంచి విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. దీంతో కొద్దిరోజులపాటు పూర్తిగా వైద్య సేవలకు ఆటంకం కలిగింది. ఆ సమయంలో స్థానికంగా ఉన్న నర్సులే వైద్యుల పాత్ర పోషించారు. అనంతరం జిల్లా యంత్రాంగం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని వైద్యులను ఇన్చార్జిలుగా పీహెచ్సీలకు పంపించారు. పీహెచ్సీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. అయితే ఇన్ఛార్జి వైద్యులు చాలా ప్రాంతాల్లో ఆస్పత్రికి వచ్చిన వైద్యులను చూసి గంట, రెండు గంటల తర్వాత వెళుతున్నట్లుగా తెలిసింది. దీంతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడినట్లయింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం నడుస్తోంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. దీంతో పల్లెవాసులు పీహెచ్సీలకు వెళ్లినా అక్కడ సక్రమంగా వైద్య సేవలు లభించకపోవడంతో చేసేదీలేక సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు. -
వర్షపాతం వివరాలు
● జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ● వరుస వానలతో పట్టణ, గ్రామాల్లో లోపిస్తున్న పారిశుధ్యం ● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు మొలకొచ్చిన మొక్కజొన్న గింజలు అధిక వర్షాలతో ఎర్రగుంట్ల మండలం చిన్నదన్నూరు, ఇట్లూరు గ్రామాల్లో నేలకొరిగిన వరిపంట కడప అగ్రికల్చర్ : వరుస వానలు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేతికందిన పంటలు నీళ్లపాలవుతుండడంతో కర్షకుడి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనం, తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అల్పపీడనం బలపడటంతో 24 గంటల నుంచి వాన జడి పట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇక వరుస వానలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దీంతో దోమల బెడద అధికమై జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసిన రైతుల్లో గుబులు నిత్యం కురుస్తున్న వర్షాలకు భూమి తడారక ఆరుతడి పంటలు ఎర్రగా మారి దెబ్బతింటున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కలుపు మొక్కలను తొలగించుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. పైగా కలుపును తొలగించాలంటే ఖర్చులు భారీగా వస్తాయని.. ప్రధాన పంటలకు తెగుళ్లు కూడా సోకుతున్నాయని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు నీటి వసతి ఉన్న రైతులు బోర్ల కింద చాలా మంది ముందస్తుగా వరిపంట సాగు చేశారు. చిరుపొట్ట దశలో ఉన్న వరికంకి తాలుపోతోంది. అలాగే ఎన్ను దశలో ఉండే వరికి కంకిపైన ఉండే సుంకు రాలి ఎన్ను దెబ్బతింటోంది. దీంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పటికే కోత కోసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రధాన రహదారుల వెంబడి, కళ్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. ఉన్నట్లుండి వచ్చిన వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. మినుము, శనగ రైతులకు నష్టం.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో మినుము, శనగ పంటలను విత్తుకున్నారు. విత్తుకున్న వెంటనే వరుస వానలు కురుస్తుండడంతో నేలంతా బాగా తడెక్కింది. దీంతో భూమిలో విత్తిన మినుము, శనగ విత్తనాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస వానలకు పత్తికాయలోకి నీరు చేరి పత్తి(దూది) దెబ్బతింటోందని పత్తి సాగు చేసిన రైతుల్లో కలవరం మొదలైంది. పాత ఇళ్లు, మట్టి మిద్దెలతో అప్రమత్తం వారం నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాత చవుడు మిద్దెలు కూలుతున్నాయి. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్కు చెందిన లక్ష్మిదేవికి సంబంధించిన మట్టిమిద్దె కూలింది. ఇలా చవుడు మిద్దెలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మట్టి , పాత దంత మిద్దెలు ఉన్న వారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం... అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పగలంతా వర్షం కురిసింది. ఒంటిమిట్టలో అత్యదికంగా 66.4 మి.మీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కడపలో రహదారులు నీటితో నిండిపోయాయి.మొక్కజొన్న గింజలపై పట్టలు కప్పిన రైతులు ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రకాష్నగర్కాలనీలో కూలిన మట్టిమిద్దె నేను నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చింది. కల్లంలో మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుని ఉండగా ఉన్నట్లుండి వచ్చిన ఎడతెరిపి లేని వర్షాలతో గింజలు తడిచిపోయాయి. అక్కడక్కడ గింజలు మొలకలు వస్తున్నాయి. ఇక వ్యాపారులు ధర తగ్గించి అడుగుతారు. ఎకరాలకు రూ. 40 వేలదాకా వస్తుందని ఆశపడ్డాము. మరి ఎంత వస్తుందో చూడాల. – పంజగల ఓం ప్రసాద్. దూలంవారిపల్లె , కలసపాడు మండలం నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేశాను. దిగుబడి పర్లేదు. మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుంటే వర్షానికి తడిచి పోయాయి. దీనికితోడు ఎర తెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో పట్టలు కూడా తీసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో పట్టకింద ఉక్కకు గింజలు మొలకలు వచ్చాయి. ఏం చేయాలో ఆర్థం కావడం లేదు. దాదాపు లక్షన్నర వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు పరిస్థితేందో అర్థం కావడం లేదు. గ్రామానికి చెందిన చాలామంది రైతులకు సంబంధించిన దాదాపు 600 క్వింటాళ్ల విత్తనాలు తడిచాయి. – నామాల వెంకటరమణ, దూలంవారిపల్లె. కలసపాడు మండలం. -
2296 హెక్టార్లలో పంట నష్టం
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 15 మండలాల పరిధిలోని 2296 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరిపంట 1489 హెక్టార్లు, కంది 258 హెక్టార్లు, మినుము 329 హెక్టార్లు, వేరుశనగ 134 హెక్టార్లు, పత్తిపంట 81 హెక్టార్లు, మొక్కజొన్న 05 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. సంబంధిత ప్రాథమిక నివేదకలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.... వర్షాలకు లోతట్టు పాంతాల్లో ఉన్న పంటలు మునకకు గురి అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.కోత దశలో ఉన్న వరి, మినుము పంటలకు గింజలు మొలకలు వచ్చి పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున సూచనలు పాటించి పంట నష్ట నివారణ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ -
శివాలయాలకు కార్తీక దీపశోభ
కార్తీక దీపాలతో శైవక్షేత్రాలు కళకళలాడాయి. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. శివ భక్తులకు ప్రియమైన కార్తీకమాసం బుధవారం ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైందని చాటుతూ ఆలయాల ధ్వజ స్తంభాలపై కార్తీక దీపాన్ని వెలిగించారు. కాగా జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. కడప నగరంలోని శైవ క్షేత్రాల్లో నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లు చేశారు. – ఫొటోగ్రాఫర్, సాక్షి,కడప -
ఎర్రగుంట్లలో క్షుద్ర పూజల కలకలం
వైఎస్ఆర్ కడప జిల్లా: ఎర్రగుంట్ల పట్టణం 17వ వార్డులోని న్యూకాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు గేటుకు ఎదురుగా బొమ్మ, దానిపై ఇనుప రేకులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున బయటకు వచ్చిన కాలనీ వాసులు వీటిని చూసి భయాందోళన చెందారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల క్రితం అదే కాలనీలో ఇంటి బయట టెంకాయతో పూజలు చేసి ఉంచారన్నారు. మళ్లీ అదే తరహాలో జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోమవారం రాత్రి వర్షం కారణంగా బయటకు రాలేదని, మంగళవారం తెల్లవారుజామున బయటకు రాగానే ఈ దృశ్యం కనిపించిందన్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియలేదని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
వివాహిత అదృశ్యం
వైఎస్ఆర్ కడప జిల్లా: పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన కేతనగరి వెన్నెల అనే వివాహిత రెండు రోజులుగా కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తల్లి ఇంటికి రాలేదని, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదని ఆమె ఆచూకీ తెలపాలని కోరుతూ వెన్నెల కుమారుడు వెంకటరమణ మంగళవారం ఫిర్యాదు చేసిట్లు సీఐ వివరించారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ తెలిసిన వారు 9121100618 (మైదుకూరు సీఐ), 9121100619 (ఎస్ఐ) నంబర్లకు తెలియజేయాలని కోరారు. కాగా తాను ఆత్మహత్యకు పాల్పడుతూ ఓ మహిళ స్వయంగా తీసిన ఓ వీడియో మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై వివాహిత తీసిన వీడియో లొకేషన్ కోసం గాలిస్తున్నామని, వీడియోలో ఉన్న వివాహిత, అదృశ్యమైన వెన్నెల అనే వివాహిత ఒకరేనా కాదా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.విద్యార్థి..కొండాపురం: మండల పరిధిలోని దత్తాపురం గ్రామానికి చెందిన జి. రామ్చరణ్ కనిపించడం లేదని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ ఆర్,శివనాగిరెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు దత్తాపురం గ్రామానికి చెందిన జి.జ్యోతి, చిన్నపెద్దులయ్య దంపతుల పెద్ద కొడుకు రామ్చరణ్ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోమని మందలించడంతో ఇంటిలో నుంచి సోమవారం మధ్యాహ్నం తాడిపత్రికి బస్సులో వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కార్తీకం... శుభకరం
కడప సెవెన్రోడ్స్: పరమేశ్వరుడు, మహావిష్ణువులకు ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలు, అయ్యప్ప, ఇతర దేవుళ్ల మాలధారణలు.. ఇలా ఈ నెలరోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రధానంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. అందుకు తగినట్లుగా ఆలయాలను తీర్చిదిద్దారు. ● కడప నగరంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరులోగల శ్రీ భుజంగేశ్వరస్వామి ఆలయం, అత్తిరాల పరుశురామాలయం, సిద్దవటం మండలంలోని నిత్యపూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి, పొలతల శ్రీ మల్లికార్జునస్వామి, కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం, అల్లాడుపల్లె, రాయచోటిలలోని వీరభద్రస్వామి ఆలయాలు, ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సజావుగా దర్శనాలు అవసరమైన మేరకు ప్రోటోకాల్ పాటించినా దర్శనాలలో సాధారణ భక్తులకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నామని దేవాదాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా ఆలయాల ఈఓలు, ఇన్స్పెక్టర్లను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని బట్టి వారు పోలీసు బందోబస్తును కోరవచ్చన్నారు. మండల స్థాయిలో ఈఓలు, ఇతర ఎండో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశుధ్య చర్యలు ఆలయాల వద్ద పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నామని, భక్తులు కూడా ఈ విషయంగా తమకు సహకరించాలని దేవాదాయశాఖ అధికారులు కోరుతున్నారు. పొలతల, అల్లాడుపల్లె, నిత్యపూజకోనలోని కోనేర్లను శుభ్రం చేయాలని ఆదేశించామన్నారు. కోనేర్లలో తగిన మోతాదులో బ్లీచింగ్ కలపాలని, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఇటీవల వర్షాలకు కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి ఉన్నాయన్నారు. నదీ తీరాలు, అటవీ ప్రాంతాల ఆలయాలకు వెళ్లే సమయంలో కుంటలు, వాగుల్లో ఈతకొట్టడం మంచిది కాదని, పిల్లలు, యువకులను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేలా పెద్దలు శ్రద్ధ చూపాలని అఽధికారులు కోరుతున్నారు. శివకేశవులకు ఇష్టమైన మాసం శివకేశవులిద్దరికీ ఇష్టమైనది కార్తీకమాసం. అందుకే దీన్ని దామోదర మాసంగా కూడా పిలుస్తారు. మంగళవారం సాయంత్రం నుంచే కార్తీక శుద్ధ పౌడ్యమి వచ్చింది. బుధవారం నుంచి అభిషేక సేవలు ప్రారంభమవుతాయి. – చంద్రమౌళిశర్మ, అర్చకులు, శ్రీ సోమసుందరేశ్వరస్వామి దేవస్థానం, గడ్డిబజారు, కడప కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం అభిషేకాలు, అలంకారాలు, విశేష పూజలు, సర్వదర్శనం నిర్వహిస్తారు. ప్రత్యేకించి ప్రతి సోమవారం ఆలయాల్లో ప్రత్యేక పూజోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్బంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆయా ఆలయాలలో శివ కల్యాణాలు నిర్వహించి రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాలు చేపట్టనున్నారు. పవిత్ర మాసోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ముస్తాబైన శైవ క్షేత్రాలు, విష్ణు ఆలయాలు మాసమంతా కొనసాగనున్న విశేష పూజలు నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం -
యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని ఫాతిమానగర్లో మంగళవారం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కాశినాయన మండలం వడ్డమాను గ్రామానికి చెందిన యంబడి ప్రసాద్ (34) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య ప్రతిమతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల చదువు కోసం నాలుగు నెలల క్రితం పట్టణంలోని ఫాతిమానగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చేరారు. అయితే మంగళవారం భార్య పనికి, పిల్లలు స్కూలుకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని బంధువులు అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రకృతి అందం
పండుగ ఢూం.. ఢాం..పిల్లల అల్లరిని సూచిస్తూ తారాజువ్వలు రివ్వుమని ఆకాశానికి ఎగిరాయి. పెద్దల ఆనందానికి ఉదాహరణగా మతాబులు, చిచ్చుబుడ్లు, వెలుగులు చిమ్మాయి. పెద్దల ఆధ్వర్యంలో పిల్లలు సంబరంగా టపాసులు కాల్చారు. తెలుగు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో.. దీపాలతో కళకళలాడాయి. కాంపౌండ్ గోడలపై దీపాల వరుసలు కనుల పండుగ చేశాయి. దీపావళి పండుగను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇళ్లు, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం లక్ష్మిపూజ చేశారు. మహిళలు ఇళ్లు, ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించడంతో కాంతులు నిండాయి. దీంతో ఊరూవాడ దీప కాంతులతో వెలిగిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచే వీధులన్నీ పటాసుల ధ్వనులతో మార్మోగాయి. –కడప సెవెన్రోడ్స్ఆకాశాన మబ్బు మెరిసింది.. చినుకై నేల రాలింది.. ఇలపై ఇలా పూల సోయగం కనువిందు చేసింది. మంగళవారం కురిసిన వాన జల్లులకు వైవీయూలోని బొటానికల్ గార్డెన్ కొత్త అందాలు సంతరించుకుంది. మొక్కలపై నీటి బిందువులు ముత్యాల్లా దర్శనమిచ్చాయి. పొగమంచు అందాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేశాయి. – ఫొటోగ్రాఫర్, సాక్షి ,కడప -
ప్రతిభాన్వేషణ!
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులలో దాగి ఉన్న నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్రదేశ్ సైన్సు సిటీ, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి(ఏపీ కాస్టు) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ –2025 పోటీల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. పిల్లల్లో సైన్సు పరిజ్ఞానాన్ని గుర్తించడం, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. విద్యార్థుల వివరాలు పంపేందుకు ఈ నెల 24 తేదీ వరకు ఆన్లైన్ నమోదుకు గడువు నిర్ణయించారు. ఈ ప్రతిభాన్వేషణ పోటీలలో భాగంగా విద్యార్థులకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రాం, జ్ఞాపికలను అందజేయనున్నారు. అర్హులెవరంటే.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ కౌశల్ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే. సదరు విద్యార్థులు ప్రత్యేకంగా క్విజ్ టీమ్గా ఏర్పాటు కావాలి. తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్సు సబ్జెక్టుల టీచర్ల ద్వారా తరగతికి ముగ్గురు విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయాలి. ఇందులో గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘీక శాస్త్రం, విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి అనే అంశంపై విద్యార్థులకు పోటీలు ఉంటాయి. పోస్టర్ కాంపిటీషన్కు సంబంధించి.. ● పోస్టర్ 1 పోటీలు 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. ఇందులో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. వికసిత్ భారత్ కోసం సుస్థిర, హరిత ఇంధనం వనరులు సబ్జెక్టుపైన పోటీలు ఉంటాయి. ● పోస్టర్ 2 పోటీలు 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు. సత్యేంద్రనాథ్ బోస్ జీవితం, ఆయన చేసిన కృషిపై జరిగే ఈ పోటీలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. బహుమతులు ఇలా.. ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు(వ్యక్తిగతం–2 పోస్టర్లకు విడివిడిగా) ఇస్తారు. రీల్స్, షార్ట్స్ పోటీలు.. ఆంధ్ర వైజ్ఞానిక వైభవం(సంప్రదాయ విజ్ఞానం, ప్రాచీన – ఆధునిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక సంస్థలు) పోటీలలో 10వ తరగతి సంబంధించి ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. ఈ పోటీలకు సంబంధించిన వీడియో నిడివి రెండు నిమిషాలు ఉండాలి. ఇందులో విజేతలకు ప్రశాంసాపత్రం, జ్ఞాపిక, నగదు(నగదు వ్యక్తిగతం) ఇస్తారు. పరీక్ష షెడ్యూల్ ఇలా.. పాఠశాల స్థాయిలో 8వ తరగతికి నవంబర్ 1వ తేదీ, 9వ తరగతికి 3వ తేదీ, 10వ తరగతికి 4వ తేదీ పరీక్ష ఉంటుంది. జిల్లా స్థాయిలో.. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27వ తేదీ, 10వ తరగతికి నవంబర్ 28వ తేదీ పరీక్షలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఈవెంట్ జిల్లా స్థాయిలో బహుమతి ప్రదాన కార్యక్రమం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీలోపు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి ఈవెంట్.. రాష్ట్ర స్థాయి ఈవెంట్ను డిసెంబర్ 27వ తేదీ తిరుపతిలోని జాతీయ సాంస్కృతిక యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళన్–2025 నిర్వహిస్తారు. సృజనాత్మకత వెలికి తీసేందుకు కౌశల్ సైన్సు క్విజ్ పోటీలు 8, 9, 10 తరగతుల ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేకం సైన్సుపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా అడుగులు ఈ నెల 24వ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు తుది గడువు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచనప్రతిభ గల విద్యార్థులను గుర్తించాలి గణితం, సైన్సు, సాంఘీకశాస్త్రం సబ్జెక్టులలో ప్రతిభ గల విద్యార్థులను ఉపాధ్యాయులు, పాఠశాల కో ఆర్డినేటర్లు గుర్తించాలి. ఇందులో సైన్సు క్విజ్ పోటీలకు, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలకు, వైజ్ఞానిక లఘు చిత్రం పోటీలకు 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో తరగతుల వారిగా ప్రతిభగల విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలి. ఈ పోటీల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. వైఎస్సార్జిల్లాఅక్టోబర్ 24వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతూ ఆసక్తిగల విద్యార్థుల వివరాలను పాఠశాలలో కో ఆర్డినేటర్లు అక్టోబర్ 24వ తేదీలోపు www.bvmap.org ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ విషయంలో గణితం, సైన్సు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలి. వివరాలకు 9440507133 నంబర్లో సంప్రదించాలి. – కేవీ విజయమోహన్రెడ్డి, కౌశల్ జిల్లా కో ఆర్డినేటర్ -
సంపన్నులు, వ్యాపారవేత్తల పిల్లలే టార్గెట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సంపన్నులు, వ్యాపార వేత్తల పిల్లలను లక్ష్యంగా చేసుకొని క్యాషినో టూర్ పేరుతో టీడీపీ నాయకులు జూదాలు ఆడేందుకు గోవాకు తరలిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో గతంలో ఈ తరహా క్యాషినో గేమ్లు ఎప్పుడూ లేవని, టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు వాసులకు వీటిని పరిచయం చేసి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో మంగళవారం రాచమల్లు శివప్రసాద్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట తదితర జూదాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి నేతృత్వంలో కొంత మంది కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు కలిసి పాత అసాంఘిక కార్యకలాపాలతో పాటు ప్రొద్దుటూరు వాసులు గతంలో ఎన్నడూ వినని, చూడని విలాసవంతమైన, ఖరీదైన జూదాలను ఆడిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో కడప, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి ఇండిగో ఫ్లైట్లలో గోవాకు తీసుకెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే 100 మందికి పైగా ప్రొద్దుటూరులోని యువకులు గోవాకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఏడాది నుంచి జరిగే ఈ తంతు ఇక్కడి పోలీసులకు తెలుసునని, అయినా ఇక్కడి రాజకీయ నేతల జోక్యంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రారంభ దశలోనే దీన్ని అణచివేయకుంటే ధనవంతుల పిల్లలను సర్వనాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలకు గేట్లెత్తేశారు.. టీడీపీ నాయకులు ప్రొద్దుటూరును జూదాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే.. ఇక్కడ మాత్రం ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి అన్ని రకాల జూదాల నిర్వహణకు గేట్లు ఎత్తేశాడన్నారు. చౌకదుకాణాల్లోని రేషన్ బియ్యాన్ని టీడీపీ నాయకులు, కొందరు కౌన్సిలర్లు ప్రొద్దుటూరు కేంద్రంగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్యెల్యే వరద, కొండారెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి ప్రొద్దుటూరులో జరుగుతున్న అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల గురించి వివరిస్తానని రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, గుర్రం లావణ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్యాషినో టూర్ పేరుతో విమానాల్లో గోవాకు తరలింపు ప్రొద్దుటూరులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రాసాద్రెడ్డి -
సాహితీ పరిమళాన్నందించిన ‘జానమద్ది’
కడప ఎడ్యుకేషన్: ‘తెలుగు సూర్యుడు’సి.పి.బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, అనేక కార్యక్రమాలు నిర్వహించి, సాహితీ పరిమళాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా వైవీయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, పరిశోధన కేంద్రం సిబ్బంది కలసి పరిశోధన కేంద్రం ప్రాంగణంలోని జానమద్ది కాంస్య విగ్రహానికి, సమావేశ మందిరంలోని చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జానమద్ది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేది నుంచి టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు ఇందుకు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో కొందరిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా కల్లూరు రుద్రసేనారెడ్డి(జమ్మలమడుగు), జిల్ల రైతు విభాగం కార్యదర్శిగా పి.చెన్నారెడ్డి(బద్వేల్), జిల్లా ఎస్టీ విభాగం ఎగ్యిక్యూటివ్ సభ్యుడిగా వనం చిన్నగంగాధర్(ప్రొద్దుటూరు)లను నియమించారు. కడప రూరల్: జోనల్ మలేరియా అధికారిగా బి.నిర్మల అలెగ్జాండర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన పదోన్నతిపై టెక్కలి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇన్నాళ్లు ఇంచార్జ్ జెడ్ఎంఓ గా శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ స్థానంలోకి నిర్మల అలెగ్జాండర్ వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 28 నుంచి 2025–26 అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గౌస్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీ సెస్ విభాగాల ఉద్యోగులకు 19 విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, టెబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ తదితర క్రీడల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఈటోర్నమెంట్లో పాల్గొనే సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (పురుషులు–మహిళలు) ఈ నెల 27 సాయంత్రం 5 గంటల లోపల తమ డిపార్ట్మెంట్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 5 నుంచి 8 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయని వివరించారు. సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంకలు, వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు రావడంతో అధికారులు మంగళవారం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలోని పింఛా నది, ఎనుపోతుల వంక, తలకోన ఏటితో పాటు సమీపంలోని వంకల ద్వారా వర్షపు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తూ మిగతా నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేశశారు. మంగళవారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోనికి 1819 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండటంతో 1640 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. -
పోలీసుల సేవలు అజరామరం
జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి కడప అర్బన్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి కొనియాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళి అర్పించారు. కడప నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన అమరవీరుల స్మృతి పెరేడ్కు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో పాటు, జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి మాట్లాడుతూ పోలీసు యూనిఫాంకు సమాజంలో అత్యంత గౌరవం ఉందన్నారు. దేశానికి సైనికులు, పోలీసు వ్యవస్థ రెండు కళ్లు వంటివన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజలు సాధారణంగా ఆర్మీ, పారా మిలిటరీలలో అంతిమ త్యాగం ఉంటుందని అనుకుంటారని, కానీ వాస్తవంగా పోలీసులే ఎక్కువ సంఖ్యలో అమరులవుతారని పేర్కొన్నారు. పండుగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటే పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారని, నిరంతరం ప్రజల పరిరక్షణకు అంకితమవుతారన్నారు. ఈ ఏడాది కాలంలో జిల్లాలో 10 మంది సిబ్బంది, ముగ్గురు హోమ్ గార్డులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారు అందించిన సేవలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. భాగంగా జిల్లాలో విధినిర్వహణలో అమరులైన పోలీసు, హోమ్ గార్డుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందచేశారు. ఛాయా చిత్ర ప్రదర్శన జిల్లా పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలకు సంబంధించిన ఛాయా చిత్రా లతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ప్రారంభించగా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఒక్కో ఛాయా చిత్రానికి సంబంధించి వివరాలను విశదీకరించారు.అనంతరం పోలీసులు వినియోగించే ఆయుధాలు, సామగ్రి ప్రదర్శన ’ఓపెన్ హౌస్’ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందంలోని డయానా, రూబీ, లూసీ, జిమ్మీ, సోనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదనపు ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, డీఎస్పీలు, సీఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కనుమలోపల్లె రైల్వే స్టేషన్ల మధ్య కడపకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, తమిళనాడుకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. మృతికి సంబంధించి వివరాలు తెలియరాలేదని, మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు కడప రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే సీఐ 94406 27398, ఎస్ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు. వాహనాల బ్యాటరీలను దొంగిలిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో నిలిచి ఉన్న ట్యాంకర్ బ్యాటరీని దొంగిలిస్తుండగా దొంగను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఎర్రగుంట్ల పట్టణంలోని కాలువ సమీపంలో హనుమనగుత్తి గ్రామ కాస్ వద్ద నిలబడి ఉన్న ట్యాంకర్లో నుంచి బ్యాటరీని దొంగిలిస్తుండగా స్థానికులు గమనించారు. స్థానికులు వస్తున్నారని గమనించి ఆ దొంగల్లో ఒకడు కంపచెట్లల్లో పడి పరారయ్యాడు. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడే ఉండి స్థానికులకు దొరికాడు. అతనికి దేహశుద్ధి చేసి ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి కానిస్టేబుల్ శివప్రసాద్ చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. దొంగ పేరు రవీంద్రనాయక్ అని జమ్మలమడుగు మండలం బొమ్మేపల్లి గ్రామానికి చెందిన వాడిగా విచారణలో తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైవీయూను మేటి యూనివర్సిటీగా నిలపడమే లక్ష్యం
కడప ఎడ్యుకేషన్ : ‘యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సరికొత్త ప్రణాళికలతో దేశంలో మేటి యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తా.. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో నంబర్ వన్ విశ్వ విద్యాలయంగా నిలబెట్టడం కోసం అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేస్తా’ అని యోగివేమన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య బొల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాణ్యమైన బోధన, పరిశోధన, ఉద్యోగ నైపుణ్యాల ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నానన్నారు. ఈ మూడేళ్లలో వైవీయూను వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి వ్యూహాలు రచిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలో 98 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని, అంతర్జాతీయ స్థాయిలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లు కలిగి ఉండటం, 1700 పరిశోధన పత్రాలు స్కోప్, వెబ్సోర్ట్ వంటి ప్రామాణిక జర్నల్స్లో పబ్లిష్ అవడం విశ్వవిద్యాలయ ప్రగతికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో వీరు నిర్వహించే క్రియాశీలక పాత్రతో విశ్వవిద్యాలయం నంబర్ వన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2027వ సంవత్సరంలో నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్(ఎన్.ఎ.ఎ.సి) ఎ ప్లస్ గ్రేడ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్( ఎన్. ఐ.ఆర్.ఎఫ్) జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకింగ్లో వైవీయూ మొదటి వందలోను, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఒకటి నుంచి 20 లోపు ర్యాంకుల్లో నిలిచేలా గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలో దూరవిద్యలో ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ, ఐక్యు ఏసీ డైరెక్టర్ డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో వైవీయూ పబ్లిక్ రిలేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ సరిత, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ సెల్ ఆఫీసర్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు పాల్గొన్నారు.వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ -
విద్యార్థి నాయకుడి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి దాకా..
కడప వైఎస్ఆర్ సర్కిల్ : విద్యార్థి దశ నుంచి సీపీఐ అనుబంధ సంఘాల్లో పనిచేసిన గుజ్జుల ఈశ్వరయ్య సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం, బద్రంపల్లె గ్రామంలో బాలమ్మ ఓబన్న దంపతులకు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈశ్వరయ్య ప్రొద్దుటూరు పట్టణంలోని హన్నమ్మ అనాథాశ్రమంలో ప్రాథమిక విద్యను చదివారు. తొండూరులో హైస్కూల్ విద్య, కడప శ్రీ రామక్రిష్ణ జూనియర్ కాలేజిలో ఇంటర్, కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు హైస్కూల్, హాస్టల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయాలు అవసరం అని భావించి విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఏఐఎస్ఎఫ్ అభ్యర్థులను అన్ని స్థానాల్లో గెలిపించారు. అనతి కాలంలోనే ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కరువు సీమకు కృష్ణా జలాలు మళ్లించాలని చేపట్టిన అనేక పోరాటాల్లో అరెస్టు అయ్యారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు. డిటెన్షన్ విధానానికి, విద్యావ్యాపారీకరణకు, కాషాయీకరణకు వ్యతిరేకం పోరాటాలు నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కడప బసవతారకం లా కళాశాలలో బి.ఎల్ పూర్తి చేశారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా పనిచేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఉద్యమాలు చేపట్టి ప్రజానాయకుడిగా ఎదిగిన ఈశ్వరయ్య సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన గుజ్జుల ఈశ్వరయ్య -
ఎర్రగుంట్లలో క్షుద్ర పూజల కలకలం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం 17వ వార్డులోని న్యూకాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు గేటుకు ఎదురుగా బొమ్మ, దానిపై ఇనుప రేకులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున బయటకు వచ్చిన కాలనీ వాసులు వీటిని చూసి భయాందోళన చెందారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల క్రితం అదే కాలనీలో ఇంటి బయట టెంకాయతో పూజలు చేసి ఉంచారన్నారు. మళ్లీ అదే తరహాలో జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోమవారం రాత్రి వర్షం కారణంగా బయటకు రాలేదని, మంగళవారం తెల్లవారుజామున బయటకు రాగానే ఈ దృశ్యం కనిపించిందన్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియలేదని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
నీటి కుంటలోకి దిగి మూడు ఎద్దులు మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని సిర్రాజుపల్లి గ్రామానికి చెందిన ఒంటిగారి గంగరాజుకు చెందిన మూడు ఎద్దులు నీటి కుంటలోకి దిగి బురదలో ఇరుక్కుని మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గంగరాజు ఉదయాన్నే పొలం పనులు ముగించుకొని ఎద్దుల బండికి వెనుక భాగంలో మరో ఎద్దును కట్టుకొని ఇంటికి బయలు దేరాడు. దండుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో పాలకుంట వద్ద ఎద్దులను శుభ్రం చేసేందుకు గంగరాజు నీటి కుంటలోకి ఎద్దుల బండిని తీసుకెళ్లాడు. అయితే కుంట చాలా లోతు ఉండట వల్ల ఎద్దుల బండి నీటిలోకి మునిగింది. దీంతో గంగరాజు ఎద్దులను కాపాడేందుకు ప్రయత్నించాడు. బండితో సహా ఎద్దులు నీటిలో మునిగి పోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో నీట మునిగి ఉన్న మూడు ఎద్దులను బయటకు తీశారు. అప్పటికి మూడు ఎద్దులు మృతి చెంది ఉన్నాయి. ఎద్దుల యజమాని లబోదిబోమంటూ విలపించాడు. -
కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య రంగం కుదేలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య రంగం కుదేలయిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. మంగళవారం 34వ డివిజన్లో ఏకే ఫంక్షన్ హాలులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ‘కోటి సంతకాల సేకరణ’ చేపట్టారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒక బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ, తన బినామీలకు, తన మనుషులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజావైద్యం ప్రజల హక్కు అని, ప్రజల ఆస్తులు ఎప్పటికీ ప్రజలకే చెందాలన్నారు. చాలా కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. ఫలితంగా మధ్యతరగతి వాళ్లు పేదవాళ్లుగానూ, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగానో మారిపోయారన్నారు. ఇలా జరక్కూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.8,480 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా పరిశీలకుడు, మాజీ మేయర్ కె. సురేష్ బాబు మాట్లాడుతూ 1923 నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క గవర్నమెంటు మెడికల్ కాలేజీ కూడా కట్టలేదన్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ విధానంలో తన మనుషులకు అప్పగించేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ దీన్ని అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి మేయర్ ముంతాజ్ బేగం, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జోనల్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, రామ్మోహన్రెడ్డి, 34వ డివిజన్ ఇన్చార్జి అక్బర్ అలీ, గౌస్ చాక్లెట్, షఫీ, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ కె.సురేష్ బాబు -
ప్రణాళిక ప్రకారమే సీజేఐపై దాడి
సదస్సులో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు మాట్లాడుతున్న హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చంద్ర కుమార్ కడప కార్పొరేషన్ : న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి పక్కా ప్రణాళిక ప్రకారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాదులు దాడి చేశారని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం పాతరిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్లో కడప పౌర సమాజం ఆధ్వర్యంలో ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిద్దాం– రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగ మూల స్తంభాలపై జరిగిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. పెద్ద కుట్రలో భాగంగానే సీజేఐపై ఈ దాడి జరిగిందన్నారు. మనువాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న అవినీతి, దోపిడీ, రైతులు, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల నుంచి పక్కదోవ పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై దాడి చేశారంటే.. మన సమాజంలో కులతత్వం, మతతత్వం ఎంత లోతుగా పాతుకుపోయిందో, ఇది ఎంత ప్రమాదకర సంఘటనో తెలియజేస్తుందన్నారు. జ్ఞానానికి కులం లేదని, సమానత్వమే ప్రధాన ధర్మమని రాజ్యాంగం చెప్పిందన్నారు. మూఢ నమ్మకాలు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా అన్నమయ్య, వివేకానందుడు, వేమన, వీరబ్రహ్మంలాంటి వారు ఆనాడే గళం విప్పారని గుర్తు చేశారు. సనాతన ధర్మ ముసుగులో దాష్టీకాలు సనాతన ధర్మం ముగుసులో జరుగుతున్న దాష్టీకాలపై ప్రజలను చైతన్య పరచడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ప్రముఖ న్యాయవాది ఏ.సంపత్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి చేయడం ద్వారా దేశంలో ఒక భయానక పరిస్థితిని కల్పించారన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడి ప్రజాస్వామ్య మనుగడకు ఎంతో ప్రమాదకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడే తనతో ఈ దాడి చేయించారని రాకేష్ కిషోర్ చెప్పడం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల హింసా రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాలరాసి, మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ప్రేరేపించేందుకు కుట్ర జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏకతా వాదాన్ని తెరపైకి తెస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి, బీఎస్పీ నాయకులు సగిలి గుర్రప్ప, డాక్టర్ మల్లేల భాస్కర్, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు వెంకట శివ, రామ్మోహన్, రఘునాథరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.కుమారస్వామి, ఎన్జీవో నాయకులు రాజశేఖర్, శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు అవ్వారు మల్లికార్జున, కేవీ రమణ, విశ్వనాథ్, లక్ష్మిరాజ, సంగటి మనోహర్, డీఎం ఓబులేసు, కె. శ్రీనివాసులరెడ్డి, సుబ్రమణ్యం, జేవీ రమణ, నాగసుబ్బారెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉంది హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ -
రోడ్డుకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్సీ
వైఎస్సార్సీపీ నేతలు పూడ్చిన గుంత, దెబ్బతిన్న రోడ్డు వద్ద నుంచి డీఈతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జమ్మలమడుగు : పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె కుందూ నదిపై ఉన్న బ్రిడ్జికి సమీపంలో రంధ్రాలు పడ్డాయని గ్రామస్తులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మూడు రోజుల నుంచి బస్సులు రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. దీంతో ఆదివారం రామసుబ్బారెడ్డి నెమళ్లదిన్నె బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి సమీప ప్రదేశంలో రంధ్రం పడటంతో దానికి మరమ్మతులు చేయించాలని ఆర్అండ్బీ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. అయితే ప్రస్తుతం పండుగ సందర్భంగా సెలవులు ఉన్నాయని, తర్వాత చేస్తామంటూ డీఈ తెలిపారు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన.. ఎగువ భాగాన ఉన్న జంగాలపల్లి, బలపనగూడురు, ఉప్పలపల్లి, జె.కొట్టాలపల్లి గ్రామాలకు చెందిన ఆరు వేలజనాభాకు రాకపోకలకు అంతరాయం కలగడంతో వెంటనే రంధ్రాలను పూడ్చాలని స్థానిక నేతలను ఆదేశించారు. దీంతో స్థానిక నేతలు జంగాలపల్లి వీరారెడ్డి, నెమళ్లదిన్నె సుదర్శన్రెడ్డి, సురేష్, శంకర్, బలపనగూడురు రామచంద్రారెడ్డి వెంటనే పొక్లెయిన్ తెప్పించి పనులు ప్రారంభించారు. రంధ్రాలను పూర్తిగా పూడ్చిన తర్వాత స్థానిక ఎస్ఐ సుబ్బారావు అక్కడికి చేరుకుని పనులు ఎవరు చేయమన్నారంటూ ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ స్థానిక నేతలకు హుకుం జారీ చేశారు. అప్పటికే పనులు పూర్తి కావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా సంఘటన స్థలం నుంచి వెనుదిరిగారు. చేసిన పనులనే మళ్లీ చేసి.. నెమళ్లదిన్నె బ్రిడ్జి వద్ద ఎమ్మెల్సీ పనులు చేయిస్తున్న విషయం తెలుసుకున్న కూటమి నేతలు.. వైఎస్సార్సీపీ నాయకులకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వెంటనే పోలీసులను పంపించి పనులు ఆపాలని ప్రయత్నం చేశారు. అయితే గత కొన్ని నెలలుగా పట్టించుకోని కూటమి నేతలు.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్లీ మేము చేస్తామంటూ వితండవాదం చేస్తూ మరో పొక్లయిన్ తెప్పించి పనులు చేస్తున్నట్లు ఫోజులు ఇచ్చారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాకవల్ల రోడ్డు బాగు పడిందని, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి స్పందనపై ప్రజల్లో హర్షం పనులు ఎందుకు చేశారంటూ ప్రశ్నించిన పోలీసులు స్థానిక నేతలను అక్కడి నుంచి పంపించిన వైనం -
కొత్త యాడ్ బోర్డుల కోసం ఈఓఐ పద్ధతిలో టెండర్లు
కడప కార్పొరేషన్ : కడప నగరంలో కొత్త యాడ్ బోర్డులు ఏర్పాటు చేయుటకు ఈఓఐ పద్ధతిలో టెండర్లు పిలవడం జరిగిందని నగరపాలక కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీన సాక్షిలో ప్రచురితమైన శ్రీమనోడే.. ఫ్రీగా ఇచ్చేయ్శ్రీ కథనంపై ఆయన స్పందించారు. లీడ్ స్పేస్ ఏజెన్సీతో బీఓటీ పద్ధతిలో 2019లో 15 ఏళ్ల కాలానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయుటకు ఒప్పందం కుదిరిందన్నారు. ఆ ఒప్పందం ప్రకారం కార్పొరేషన్ గుర్తించిన ప్రదేశాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బదులుగా కార్పొరేషన్ అంగీకరించిన ప్రకారం కొన్ని ప్రదేశాలలో ప్రకటనల హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. భవిష్యత్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలు గుర్తించినట్లయితే.. అవసరమైన చోట్ల ప్రకటనల హోర్డింగుల కోసం అదనపు అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్తో ఈ నెల 15న జరిగిన సమావేశంలో ఈ పనులకు అవసరమైన నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ) కింద నిధులు మంజూరు చేసి, ఈ ప్రతిపాదనను ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ అదనపు ప్రకటన హక్కులు మంజూరు చేసే ప్రతిపాదనను నగరపాలక మండలి తిరస్కరించి, తిరిగి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగిందన్నారు. విద్యుత్ షాక్తో విద్యార్థిని దుర్మరణం పుల్లంపేట : మండల పరిధిలోని రాజుగారిపల్లికి చెందిన విద్యార్థిని మానస(17) విద్యుత్ షాక్తో దర్మరణం చెందింది. ఆ బాలిక ఇంటర్మీడియెట్ చదువుతుండేది. ఆదివారం ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మానస మృతదేహాన్ని మాజీ మండలాధ్యక్షురాలు ముద్దా పెద్ద విజయమ్మ, మండలాధ్యక్షుడు ముద్దా బాబుల్రెడ్డి, స్థానిక నాయకులు కుమార్రెడ్డిలు సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మానస మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేట రూరల్ : ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో ఆదివారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రూరల్ పరిధిలో కోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనీల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కోటి సంతకాల సేకరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతోపాటు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తున్న పథకాలన్నింటిని అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అమరావతికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయక పోగా.. నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయనీయబోమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపంగా నిలుస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి సంతకాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి మన బిడ్డల భవిష్యత్ కోసం మనం వైఎస్సార్సీపీకి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట : ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ తెలిపారు. రాజంపేటలో పలు మద్యంషాపులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 మద్యంషాపులు, 11 బార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. ప్రతి షాపులో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం మాత్రమే ఉందన్నారు. నకిలీ మద్యం ఎక్కడా లేదన్నారు. నకిలీ మద్యం అమ్మితే ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా ఇట్టే పసిగట్టవచ్చునన్నారు. ఒక వేళ ఎక్కడైనా మద్యం అమ్మిన బాటిల్ కన్సూమర్ పోర్టల్లో వివరాలు రాకపోయినా, మద్యం బాటిల్ అనుమానాస్పదంగా ఉన్న వెంటనే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (7981216391)ను సంప్రందించాలన్నారు. వాట్సాప్లో ఆ బాటిల్ ఫొటో పంపిన తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,11,628 మద్యం సీసాలను స్కాన్ చేసి అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
కడప రూరల్ : వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గం సమావేశం జిల్లా గౌరవ అధ్యక్షులు బాలకొండయ్య, రమణయ్య ఆధ్వర్యంలో జరగ్గా.. నూతన జిల్లా అధ్యక్షులుగా చంద్రగిరి నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాయచోటి వెంకటసుబ్బయ్య (కమలాపురం)లను ఎన్నుకున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వడ్డెర్లను వాడుకుని తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరుగుతోందన్నారు. ఈ కారణంగా తరతరాలుగా వడ్డెర్లు ఎలాంటి అభ్యున్నతికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముఖ్యంగా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నా పాలకులకు పట్టడం లేదని తెలిపారు. ఈ క్రమంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి నియోజకవర్గాల, మండలాల నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలతోపాటు ఇతర విభాగాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి పోరాటాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిర్దేశించుకున్న డిమాండ్లను సాధించగలమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, వడ్డెర కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరిదేవికి కుంకుమార్చనలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. గోపూజ, గణపతి, నవగ్రహ, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం గంగారాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి, కాలక్షేప మండపంలోని కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. సుమూహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా కల్యాణోత్సవాన్ని జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికడప సెవెన్రోడ్స్ : మహాదాత బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి రచించిన బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ కార్యక్రమం రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్రాజు ఆధ్వర్యంలో ఆదివారం కడప హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ డొక్కల కరువులో తిండి లేక వేలాది మంది రాయలసీమ ప్రజలు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో బుడ్డా వెంగళరెడ్డి కొన్ని వేల మందికి కొన్ని నెలల పాటు అంబలి పోసి ప్రాణాలు కాపాడారన్నారు. ఆయన దాతృత్వం, సేవల గురించి భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడపలో ఆయన విగ్రహ ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని, తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠ్యాంశాల్లో చేర్చాలి ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం, ఆయన చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఇందువల్ల భావి తరాలు ఆయన గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. వర్సిటీలు పరిశోధనలు జరపాలి రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలతోపాటు ఎందరో మహానీయుల సేవలు, త్యాగాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేపట్టాలని అన్నారు. వారి జీవితం, సేవల గురించి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నందన, డొక్కల, ధాతు వంటి భయానక కరువుల్లో రాయలసీమ ప్రజలు అనుభవించిన ఆవేదన, కన్నీళ్లు, అవమానాలు లాంటి అంశాల గురించి బ్రిటీషు గెజిటీర్లు, చరిత్ర పుస్తకాల్లో లేవన్నారు. ఆ విషయాలను చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తీసుకు రాగలిగితే రాయలసీమ యువత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఘనంగా సన్మానం పుస్తక రచయిత దస్తగిరి, బుడ్డా వెంగళరెడ్డి ఐదవ తరం వారసులు బుడ్డా విష్ణువర్దన్రెడ్డి, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కవి కర్నాటి రామకృష్ణారెడ్డి, పుస్తక సమీక్షకులు జీవీ సాయిప్రసాద్, రెడ్డి సేవా సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, యూ ట్యూబర్ దండా ప్రసాద్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మోపూరి బాలకృష్ణారెడ్డి, ఇంటాక్ జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లయన్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, నగర ప్రముఖులు పోతుల వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు డాక్టర్ రామాంజులరెడ్డి, ఆచార్య సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులు -
ప్రజాస్వామ్యం..అపహాస్యం
ప్రభుత్వ వైఫల్యాలు,అవినీతిని నిలదీస్తున్న ’సాక్షి’పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజ్యాంగం కల్పిచిన పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నాయకులు, పాత్రికేయులు, వివిధ వర్గాల నేతలు మండిపడుతున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే సాక్షి మీడియా జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణం. నెల్లూరులో నకిలీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల వద్దకు వెళ్లి పోలీసులు హంగామా సృష్టించడం అప్రజాస్వామికం. మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –షేక్ ఉమైర్, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపై, రిపోర్టర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. –లక్షుమయ్య, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్రజాస్వామికం పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. సాక్షి ఎడిటర్ ధునుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికం. తక్షణమే వీటిని రద్దుచేయాలి. – ధ్వజారెడ్డి, వైస్ఎంపీపీ, రైల్వేకోడూరు -
ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లాలో కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ప్రవేశ పెట్టిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కడప నగరం, బద్వేలు, సిద్దవటం పరిధిలోని మద్యం దుకాణాల్లోని అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేసే వ్యక్తి ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్కాన్ చేయగానే మద్యం తయారీ, ధర, తయారు చేసిన కంపెనీ, ఏ మద్యం దుకాణంలో విక్రయించారు అనే వివరాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, కడప స్టేషన్ సీఐ కృష్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పరిమి శ్రీరామనాథ్కు గడియారం సాహిత్య పురస్కారంకడప సెవెన్రోడ్స్ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిమి శ్రీరామనాథ్ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేది సాయంత్రం 5:30 గంటలకు ప్రొద్దుటూరులోని అరవిందాశ్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ఎంపికై న కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి పరిమి శ్రీరామనాథ్ రచించిన ‘జీవాతువు’ అనే కావ్యం ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో శ్రీరామనాథ్కు కవి సన్మానం, అవార్డుకు గాను రూ.10,000 నగదు బహుమతి, పురస్కారపత్రం, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. యువకుడి ఆత్మహత్య చక్రాయపేట : మండలంలోని గండి కొవ్వూరు గ్రామం ఓబుళనాయునిపల్లెలో గండికోట జగదీష్(18) అనే యువకుడు తమ ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్ తల్లిదండ్రులు జనార్దన, పావని జీవనోపాధి నిమిత్తం కువైట్లో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లెలోని అమ్మమ్మ ఇంటివద్ద జగదీష్ ఉండేవారు. తనకు బుల్లెట్ బైకు కొనివ్వమని ఫోన్ చేసి వత్తిడి తేవడంతో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై లక్కిరెడ్డిపల్లె నుంచి ఓబుళనాయునిపల్లెలో ఉన్న ఇంటికు వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ ఫోన్ పనిచేయక పోవడంతో పాటు అలిగి వచ్చాడని అతని అమ్మమ్మ శనివారం ఓబుళనాయునిపల్లెలోని ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయగా జగదీష్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్ధరాత్రి లిఫ్ట్ ఇచ్చి దోపిడీ చేశారుమదనపల్లె రూరల్ : అర్ధరాత్రి వేళ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి లిఫ్ట్ ఇస్తామని బలవంతంగా బైక్లో ఎక్కించుకుని దారిదోపిడీ చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని సత్సంగ్ స్కూల్ సమీపంలో నివాసం ఉన్న విజయ్కుమార్రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి బెంగళూరులో ఆత్మకూరు బస్సులో బయలుదేరి రాత్రి 12.45 గంటల సమయంలో నక్కలదిన్నె తండా వద్ద దిగి ఇంటికి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడే కాపు కాసిన గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై అతడి వద్దకు వచ్చి లిఫ్ట్ ఇస్తామని బలవంత పెట్టారు. అతడు వద్దని చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా బైక్లోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక బైక్ నిలిపి అతడి వద్ద ఉన్న రూ.20వేల నగదు, 15 గ్రాముల బంగారు చైను దోచుకున్నారు. బాధితుడు వన్టౌన్ పోలీస్స్టేషన్లో దోపిడీ ఘటనపై ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శివకుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. -
టపాసులతో భద్రం!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కోసమన్నట్లు నరక చతుర్థశి, దీపావళి పర్వదినాలు ఆది, సోమవారాల్లో వచ్చేస్తున్నాయి. మరో రెండు రోజులు ఉండగానే ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం సందడి చేస్తోంది. దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది టపాసుల మోతనే. పల్లైలెనా పట్టణాలైనా దీపావళి నాడు టపాసుల మోతతో దద్దరిల్లాల్సిందే. అయితే బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ● కొనుగోలు చేసిన బాణసంచాను ఎట్టి పరిస్థితులలో వంట గదిలోను, పొయ్యి ఉన్న ప్రాంతంలోనూ ఉంచకూడదు. సురక్షిత ప్రదేశంలోనే పెట్టాలి. ● టపాసులను చేతుల్లో పట్టుకుని కాల్చరాదు. ● టపాసులను వెలిగించిన తర్వాత పేలకపోతే వాటిపైకి వంగి చూడడం ప్రమాదం. ● తారాజువ్వలను సీసా బోర్లించిన రేకు డబ్బాలో పెట్టి కాల్చే పద్ధతి కూడా ప్రమాదమే. ● టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా నూలు దుస్తులు ధరించాలి. ● గాలులు విపరీతంగా ఉన్నచోట కాసేపు ఆగి టపాసులు కాల్చాలి. లేదంటే నిప్పురవ్వలు కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ● బాణసంచా కాల్చే సమయంలో దగ్గరగా నీటిని లేక ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. ● చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో ఒంటరిగా కాకుండా తల్లిదండ్రులు పక్కన ఉండాలి. ● ఒకవేళ అనుకోని పరిస్థితులలో బాణసంచా వల్ల గాయపడితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. కాలిన చోట రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది. ఆసుపత్రికి వెళ్లే వరకు తడి గుడ్డతో కప్పి ఉంచాలి. ● ఇంటి బయట మాత్రమే టపాసులు కాల్చాలి. ఇళ్లల్లో ప్రమాదకర వస్తువులు ఉన్నప్పుడు వాటి తీవ్రత మరింత అధికమవుతుంది. ● విపరీతమైన శబ్దాలను చెవులు భరించలేవు. చెవుల్లో దూది పెట్టుకుంటే రక్షణగా ఉంటుంది. ● అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే కళ్లకు, చెవులకు, చర్మానికి ప్రమాదం లేని పెద్ద మోత చేసే టపాసుల కన్నా తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, కాకర వొత్తులు, పెన్సిళ్లు, భుచక్రాలు వంటి వాటితో ఆనందంగా దీపావళి పండగ జరుపుకోవడం ఉత్తమం.అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమేనంటున్న అధికారులు -
సాక్షిపై వేధింపులు సరికాదు
ఖాజీపేట : నకిలీ మద్యం దోపిడీని వెలుగులోకి తీసుకు వస్తున్న సాక్షి ఎడిటర్, పత్రికా విలేకరుల పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కర్కు కొన్ని పత్రికలు వత్తుసు పలుకుతూ ఉంటే నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకు వచ్చింది ఒక్క సాక్షి దినపత్రిక మాత్రమే అన్నారు. ప్రతి పక్ష పాత్ర పోషిస్తూ కూటమి ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివరిస్తున్న పత్రికల గొంతు నొక్కేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
పెద్ద దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘అమీన్ పీర్ దర్గా‘ ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అమీన్పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు, ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యం కలిగిన అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను కడప నగర ఫెస్టివల్గా, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా స్టాండర్డ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.15 రోజుల ముందుగానే ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు, దర్గా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉరుసు ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ విధులు కేటాయించారు. మున్సిపల్ అధికారులు: ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమలను చేపట్టాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలన్నారు. మొబైల్ టాయిలెట్స్, సురక్షితమైన తాగునీరు, హై మాస్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన కూడళ్లను అందంగా విద్యుత్ లైట్లతో అలంకరించాలని సూచించారు. పోలీస్ శాఖ: పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ శాఖ: పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో.. ఎక్కువగా గుమికుడే ప్రాంతాలలో బారికేడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా నుంచి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్ వెళ్లడానికి గ్రీన్ ఛానల్ దారిని ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ ప్రొటోకాల్, ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు దర్గా ఆహ్వానాలు వంటి అంశాలను చూసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 108 అంబులెన్స్ తదితర వాహనాలతోపాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటక శాఖ: నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, ఎయిర్ఫోర్ట్ ప్రాంతాలలో పెద్ద దర్గా, ఇతర దేవాలయాల టెంపుల్ టూరిజం క్యాంపెయిన్ చేపట్టాలని పర్యాటక అధికారులకు సూచించారు. ఆర్టీసీ : ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితరాల నుంచి అమీన్ పీర్ పెద్ద దర్గా ప్రాంతానికి షటిల్, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మన జిల్లా నుంచే కాకుండా ఇతర రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. విద్యుత్ శాఖ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పవర్ మేనేజ్మెంట్ చేయాలన్నారు. షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అగ్నిమాపక శాఖ: ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ: అమీన్ పీర్ దర్గా ప్రధాన ఉరుసు మహోత్సవం రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు గతంలో పెద్ద దర్గా ఉర్సు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మల్టీ డిస్ప్లేనరీ కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని, ఇందులో ఏడు శాఖలకు చెందిన అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ● ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ ఆఫీసర్ ఇదయతుల్లా, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, జిల్లా సమాచార శాఖ అధికారి పద్మజ, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నాగరాజు, జిల్లా అగ్నిమాపక అధికారి ధర్మారావు, కడప మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్, ఇతర జిల్లా అధికారులు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పెండ్లిమర్రి ఎస్ఐ మధుసూదన్రెడ్డి సస్పెన్షన్
కడప అర్బన్ : పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జి.మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈనెల 17న కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ తమ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని తమ దృష్టికి వచ్చిందని డీఐజీ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 30న పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మృతుడు సుబ్బయ్య భార్య సుధా లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు 194 బి.ఎన్.ఎస్.ఎస్ (మరణానికి కారణం తెలియదు) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 29న పెండ్లిమర్రి మండలం, మాచనూరు సమీపంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన సుధా సుబ్బయ్య(46) అనే వ్యక్తి బాల అంకిరెడ్డికి చెందిన స్థలంలో మృతదేహమై కనిపించాడు. దీంతో మృతుని భార్య సుధా లలిత తన భర్త మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అయితే మృతుడు వడదెబ్బ కారణంగా మరణించి ఉండవచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు. ఈ ఏడాది మే 23న కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుధాకర్ నుంచి ఎస్ఐకి పోస్ట్మార్టం సర్టిఫికేట్ లభించింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిక ఆధారంగా మృతుడు ‘ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రయోగం‘ కారణంగా మరణించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల3న మృతుడు సుధా సుబ్బయ్య తండ్రి సుధా నారాయణ ఎస్పీని, ఉన్నతాధికారులను సంప్రదించారు. తన కుమారుడు సుధా సుబ్బయ్యను బాల అంకిరెడ్డికి చెందిన వేరుశనగ కొట్టే ప్రదేశానికి తీసుకెళ్లారని, అక్కడ అతనికి విషం ఇచ్చి చంపారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు బాల అంకి రెడ్డి పారిపోయాడని సుధా నారాయణ పేర్కొన్నారు. ఎస్ఐ మధుసూదన్రెడ్డి మాత్రం సుధా సుబ్బయ్య వడదెబ్బ కారణంగానే మరణించడంటూ వాదిస్తూ వచ్చారు. దీంతో ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్, కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డిని విచారణ చేయాలని ఆదేశించారు. ఆయన విచారణ చేసి, ఎస్పీ ద్వారా కర్నూలు రేంజ్ డీఐజీకి నివేదిక పంపారు. దీంతో ఆయన ఎస్ఐ మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఉత్తర్వులు జారీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ -
బైకులు ఢీకొని యువకుడికి గాయాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొనడంతో యల్లటూరు ప్రదీప్ అనే యువకుడికి గాయాలయ్యాయి. కాలు విరగడంతో ప్రదీప్ను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీఎస్ఎన్ఎల్ దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ బొనాంజా ఆఫర్లను ప్రవేశ పెట్టిందని జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్లో ఒక రూపాయికే 30 రోజుల పాటు ఉచిత వాయిస్ కాల్స్, 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయన్నారు. సిమ్ కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా గాని, వెబ్సైట్ ద్వారా గానీ రూ.100 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ప్రతి రోజు పది మందిని లక్కీ డిప్ ద్వారా ఎంచుకొని ఒక్కొక్కరికి సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తామన్నారు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా మిత్రులకు గాని, కుటుంబ సభ్యులకు గాని రీచార్జ్ చేసినట్లయితే రీ చార్జ్ అమౌంట్లో 25 శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం రూ.1812కే 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయన్నారు. సిమ్ ఉచితంగా ఇస్తామన్నారు. -
● సీఎంకు ఆహ్వానం
కడప సెవెన్రోడ్స్: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ సాహెబ్.. సీఎంను కలిసి ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహోత్సవాలు నవంబరు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు. -
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మీడియాపై అంక్షలు విఽధించడం తగదని పలువురు ప్రజాస్వామ్యవాదులు, పార్టీల నాయకులు అభిప్రాయపడతున్నారు. పాత్రికేయులపై వేధింపులు తగదు ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం. పాలకులు చేసే తప్పులను పత్రికలు చూపడం సహజం. కల్తీ మద్యంపై వార్త రాసిన సాక్షి ప్రతినిధులపై కేసుల నమోదు, వేధింపులు తగవు. ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న చర్యలు సరికాదు. ప్రభుత్వాలు చేసే లోపాలను ఎత్తిచూపే హక్కు మీడియాకు ఉంది. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి, వైఎస్సార్ జిల్లా ఉద్దేశ పూర్వకంగానే సాక్షిపై కుట్ర ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సాక్షి పత్రికపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తేవడం నేరం కాదు. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు సాక్షి కార్యాలయానికి వెళ్లడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. – పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రొద్దుటూరు పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. మీడియాలో ప్రసారం చేసిన వాటిపైన, పేపర్లలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి. అలా కాకుండా పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టడం తగదు. – బి.దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి -
బాలికలు పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. శనివారం జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ఫర్ చిల్డ్రన్లో అంతర్జాతీయ బాలికాదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు విద్యా ప్రాముఖ్యత, అంతర్జాతీయ బాలికా దినోత్సవ విశిష్టతను వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ ఆఫీసర్ హరిబాబు మాట్లాడుతూ బాలికలు, మహిళలకు డీఎల్ఎస్ఏ ద్వారా కలిగే ప్రయోజనాలు, చట్టాలపై తెలియజేశారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సాయం అందించడం జరుగుతుందని వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఎంఓ భారతి, సీడీపీఓ జె.వాణి, డిస్ట్రిక్ట్ మిషన్ కోఅర్డినేటర్ శోభారాణి, మిషన్ వాత్సల్య సిబ్బంది, మిషన్ శక్తి సిబ్బంది, మహిళా పోలీసులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వాసు.. అధ్యక్షుడని చెప్పుకోవడానికే సిగుచేటు
్గకడప రూరల్: ‘రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి (వాసు).. ఆయన మా పార్టీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకోవడాకే సిగ్గు చేటుగా ఉంది. అది కడప నగర కమిటీ కాదు.. దొంగగా వచ్చి చేరిన వారి కమిటీ’ అని కడప నియోజక వర్గానికి చెంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం కడపలోని సాయిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జి ఆర్కే మాబుల్లాఖాన్ మాట్లాడారు. పార్టీ కడప నగర కమిటీకి అధ్యక్షుడిగా దొంగగా మన్సూర్ అలీఖాన్ వచ్చారన్నారు. నూతనంగా ప్రకటించిన కడప నగర కమిటీ, అసలు తెలుగుదేశం పార్టీ కమిటీనే కాదని తెలిపారు. నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ అసలు సిసలైన కార్యకర్తల గురించి విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అలాగే మరో 8 మంది పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను దొంగల్లా టీడీపీలోకి తెచ్చారని, వారు పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. తన సోదరుడు, పార్టీ కార్యకర్త కరీంఖాన్ చనిపోయారని అన్నారు. ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెబితే, మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి రాకుండా, తనకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఆఖరికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు. మానవతా ధృక్ఫదంతో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు అహ్మద్బాషా 80 మంది అనుచరులతో వచ్చి మరణించిన తన సోదరుడి కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. ఇతర పార్టీ నేతలకు ఉండే దయా హృదయం, ఇంకిత జ్ఞానం శ్రీనివాసులురెడ్డికి లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నామని, అయితే తమకు ఏ మాత్రం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 39వ డివిజన్ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షా మొహమ్మద్ మాట్లాడుతూ పార్టీలో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, బయటి నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ‘పుత్తా’ వద్దకు వెళ్తుంటే పోలీసుల చేత బెదిరింపులు కొండ్రెడ్డి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ కడప అసెంబ్లీలో టీడీపీ కార్యకర్తల పరిస్ధితి అధ్వానంగా మారిందన్నారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సీనియర్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం గాక, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహరెడ్డి వద్దకు వెళ్తున్నామని అన్నారు. ఆయన వద్దకు వెళ్లిన మరుక్షణం పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్లు.. బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. మాజీ శాప్ డైరెక్టర్ జయచంద్ర మాట్లాడుతూ సీనియర్ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తున్న వారు పార్టీ సభ్యత్వం కార్డును చూపించి మాట్లాడాలన్నారు. పార్టీ ఫిరాయింపు దారుల పెత్తనం టీడీపీలో ఎక్కువైందన్నారు. పార్టీ కోసం పని చేసిన అసలు కార్యకర్తలు ఎవరో.. నకిలీ కార్యకర్తలు ఎవరో నిగ్గు తేల్చడానికి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు షేక్ సలీం, వాహిద్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు ఎక్కడి నుంచో వచ్చిన వారికి అందలం అసలు కార్యకర్తలు ఎవరో.. నకిలీ వారెవరో చర్చకు సిద్ధమా? కడప టీడీపీ సీనియర్ నాయకుల సవాల్ -
స్వల్ప వర్షం
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా వర్షం కురిసింది. అట్లూరు, రాజుపాలెం, ఒంటిమిట్టలలో 2.8 మిల్లీమీటర్లు, కాశినాయన, సిద్దవటంలో 1.2, పోరుమామిళ్లలో 1 ఎంఎం వర్షపాతం నమోదైంది. కడప సెవెన్రోడ్స్: దీపావళిని ప్రజలు ఈనెల 20వ తేదీన నిర్వహించుకోవాలని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయ అర్చకులు, కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు కేహెచ్ విజయ్భట్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ నిర్వహణ విషయంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:37 గంటలకు అమావాస్య ప్రారంభమై 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:03 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కారణంగా 20వ తేదీనే దీపావళి నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అన్నమయ్య, కడప జిల్లాకు చెందిన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్ఏవీవోడీఏవైఏ.జీవోఎన్ వె వెబ్సైట్ను సందర్శించాలన్నారు. చివరి తేది 23–10–2025 అని వెల్లడించారు. ● 2026–27 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి కూడా గడువును పెంచినట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 23.10. 2025 వరకు గడువు ఉందని వెల్లడించారు. ఖాజీపేట: కార్తీక మాసం సందర్భంగా నాగనాథేశ్వరస్వామి కొండ పైకి వచ్చే భక్తుల తలనీలాలు, టెంకాయలు విక్రయించే విషయమై దేవదాయ శాఖ అధికారులు శనివారం వేలం పాట నిర్వహించారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కును రూ.4.50 లక్షలకు మహేష్ దక్కించుకున్నారు. టెంకాయల అమ్మకం కోసం రూ.1.25 లక్షలకు హరిప్రసాద్ పాట పాడారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. కడప: కడప నగర శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో చిన్న పిల్లల విభాగం (పీడియాట్రిక్స్)లో పీజీ సీట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఎన్ఎంసీ ఇటీవల 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. గతంలో 3 పీజీ సీట్లు ఉండేవి. సీట్ల పెంపు కోసం హెచ్ఓడీతోపాటు వైద్యులు కృషి చేశారని జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ తమ చాంబర్లో పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ వై. వంశీధర్, వైద్యులు అనిల్ కిరణ్, పద్మినీ ప్రియా, బి.కె.నిరంజన్తోపాటు చిన్నపిల్లల విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల బురిడీ!
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వారి ఉచ్చులో టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పడ్డారు. ఫేక్ ఐడీలతో బెదిరించి భారీ స్థాయిలో దోచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు వెబ్ మీడియా ద్వారా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ముంబై సైబర్క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ను మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బులు గుంజారు. ప్రొవిజనల్ బెయిల్ పేరుతో రూ.1.07 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న ఎమ్మెల్యే పుట్టాకు అక్టోబరు 10 ఉదయం 7.30 గంటలకు ఫోన్ కాల్ వచి్చంది. ఫోన్ చేసిన వ్యక్తి తను ముంబై సైబర్ క్రైమ్ విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 17 ఫిర్యాదులు కూడా అందాయని చెప్పాడు. ఆధార్, సిమ్కార్డు వాడి నకిలీ బ్యాంకు ఖాతా కూడా తెరిచారని, ముంబైలో కొనుగోలు చేసిన సిమ్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు చెప్పాడు. కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి వాట్సాప్ వీడియా కాల్లోకి వచ్చాడు. తాను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ అకౌంట్ ఫ్రీజ్ ఆర్డర్ చూపించి నమ్మించినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బులు వచి్చందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. కెనరా బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్టోబర్ 15లోపు రూ.1.07 కోట్లు సైబర్ మోసగాళ్ల అకౌంట్కు పంపించినట్లు సమాచారం. కాగా, మరో రూ.60లక్షలు పంపిస్తే కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే, గురువారం రాత్రి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ఫ్రీ బస్ను వెంబడించిన యువకులు.. ఎందుకంటే?
అన్నమయ్య జిల్లా: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు. -
సర్పంచ్కు గాయాలు
వేంపల్లె : బొలెరో వాహనం ఢీకొని బక్కన్నగారిపల్లె సర్పంచ్ మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల వివరాల మేరకు.. సర్పంచ్ మల్లయ్య పులివెందులలో నుండి తన సొంత పనులను ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్నారు. వేంపల్లె నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో మల్లయ్యకు చేయి విరి గి గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. మల్లయ్యను వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి రూ.6.03 లక్షల ఆదాయంప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో టెంకాయలను విక్రయించేందుకు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 9 మంది పాల్గొనగా టి.సుమలత రూ.6,03,000లకు టెంకాయల అంగడిని దక్కించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి 2026 నవంబర్, 22వతేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు ఆమెకు హక్కు ఉంటుందని దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు. గత ఏడాది వచ్చిన ఆదాయంతో పోల్చితే అదనంగా రూ.1,30,000 వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కిరణ్కుమార్రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ఝరికోనలో మృతదేహంకలకడ : మండలంలోని బాలయ్యగారిపల్లె సమీపంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా
● ప్రతి రోజు వంద టన్నులకుపైగా ఇసుక తరలింపు ● మండల స్థాయి టీడీపీ నాయకుడి అండతో రవాణాసాక్షి టాస్క్ఫోర్స్ : మండలస్థాయి టీడీపీ నేత అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చక్రాయపేట మండలం మారెళ్ల మడక సమీపంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్లో భారీగా వర్షపునీరు చేరింది. ఈ పరిణామం చక్రాయపేట మండల టీడీపీ నాయకుడికి వరంగా మారింది. అద్దాలమర్రి చెక్ పోస్టు సమీపంలో అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులో ఉండడం గమనించి దానిపై ఆ నాయకుడు కన్నేశారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలో హిటాచీ ఏర్పాటుచేసి నిత్యం వంద టన్నులకు పైగా ఇసుక తరలించేస్తున్నారు. నిత్యం ఇది కనిపిస్తున్నా.. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుల వారీగా వచ్చే ఆదాయంలో వాటాల రూపంలో అందరికీ చేరుతోందనే ఆరోపణలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయం నిర్మించి అక్కడి వరకూ సీసీ రహదారి నిర్మించింది. ఈ ఆలయ సమీపంలోనే తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. -
ఆర్ఎంపీ క్లీనిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్, ల్యాబ్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం యశోద పాల్గొన్నారు.మహిళ మృతి కేసులో అధికారుల విచారణ -
మతోన్మాదుల కుట్రతోనే సీజేఐపై దాడి
కడప కార్పొరేషన్ : మతోన్మాదుల కుట్రతోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్పై దాడి జరిగిందని ప్రముఖ న్యాయవాది ఎ.సంపత్కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, డా.మల్లె భాస్కర్ ఆరోపించారు. జన విజ్జాన వేదిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 19న పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా పౌర సమాజం ఆధ్వర్యంలో ఈ సదస్సుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్, జన విజ్ఞాన వేదిక ఫౌండర్ డాక్టర్ బ్రహ్మారెడ్డి ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అత్యంత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖజురహో ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిందని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మార్పుచేర్పులు చేయడానికి సాధ్యపడదన్నారు. పరిపాలనా పరంగా తిరస్కరణకు గురైన అంశంపై న్యాయస్థానం పరిష్కారం చూపడం సాధ్యం కాదన్న గవాయ్ వ్యాఖ్యల్ని వక్రీకరించి పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్య పరిచి సమాయత్తం చేయాలనే ఆలోచనతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యావంతులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాతంత్ర శక్తులు సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ నగర అధ్యక్షుడు వెంకటశివ, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.19న దాడి ఘటనను ఖండిస్తూ సదస్సు -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. తీగలు తగిలి గేదెలు.. వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. విద్యుత్ తీగలు తగులుకుని మృతి చెందిన గేదెల విలువు సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలని బాధిత రైతు నాగేశ్వరరెడ్డి కోరారు. -
నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించవద్దు
మహిళపై దాడిమైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. ఉల్లి పంటను దున్నేసిన రైతుముద్దనూరు : ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఉల్లి పంటను దున్నేస్తున్నారు. మండలంలోని చింతకుంటకు చెందిన రైతు ఆదినారాయణరెడ్డి ఐదు ఎకరాల్లో తాను సాగు చేసిన ఉల్లి పంటను రోటోవేటర్తో ఇలా దున్నేసి మట్టిలో కలిపేశాడు. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక, రవాణా వ్యయం భరించలేక దున్నేశానని రైతు తెలిపారు. ఐదు ఎకరాల్లో పంట సాగుకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని, చిల్లిగవ్వ రాక ఆర్థికంగా నష్ట పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఆపలేదని మహిళల ఆగ్రహంరాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు. ఇద్దరికి జైలుశిక్ష ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, అనుమతి లేకుండా మెడికల్ షాపులు, క్లినిక్, ప్రైవేట్ క్లినిక్లు, ల్యాబ్లు నడిపితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేస్తాం. కడప రోడ్డులో ఆర్ఎంపీ ముందు వైపు మెడికల్ షాపు నిర్వహిస్తూ లోపల ఆర్ఎంపీ క్లినిక్ను నడుపుతున్నారు. మందుల కోసం వస్తే లోపల డాక్టర్ ఉన్నాడంటూ పంపుతున్నారు. ఆర్ఎంపీలు ఇంజెక్షన్ చేయవద్దని, సైలెన్లతో చికిత్స చేయొద్దని చాలాసార్లు హెచ్చరించాం. ఆస్పత్రి బోర్డులో ఒకరి పేరు కనబరిచి.. మరొకరు వైద్యం చేయాలంటే వైద్య సమయాలను సూచిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబందనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – భారతి, జిల్లా డెమో అధికారి కడప అర్బన్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వఉంచినా, విక్రయించినా పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు శుక్రవారం ఆయన దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టపాసుల విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సూచించిన బహిరంగ ప్రదేశాలు, వారికి కేటాయించిన ప్రాంతంలో నిర్ణీత కొలతల మేరకు దుకాణాలు ఏర్పాటుచేసుకుని , లైసెన్సులు కలిగిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయించాలన్నారు. లైసెన్సు పొందిన గోదాములు, దుకాణాలు, తాత్కాలిక దుకాణదారులు తూచాతప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని ఎస్పీ సూచించారు. షాపు, షాపుకు మధ్య నిర్దేశించిన దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రతి దుకాణంలోనూ నీరు, ఇసుక, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి రోజున జాగ్రత్త.. దీపావళి పర్వదినం జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా పండగ జరుపుకోవాలని కోరారు. కాటన్ దుస్తులు ధరించి చిన్నారుల తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణాసంచా కాల్చాలని సూచించారు. రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టపాసులు కాల్చుకోవాలని, బకెట్లో నీరు ఉంచుకొని జాగ్రత్త ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, గాయాలైతే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఇంటి లోపల బాణసంచా కాల్చకూడదని, సగం కాలిన వాటిని మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం, ముట్టుకోవడం ప్రమాదకరంమని అన్నారు. ఆస్పత్రుల వద్ద బాణాసంచా కాల్చరాదని ఎస్పీ సూచించారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, టపాసులు విక్రయిస్తున్నా సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలు
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ సైన్సు సెమినార్ జిల్లా స్థాయి పోటీలలో దువ్వూరు కేజీబీవీకి చెందిన షఫియా, సికె.దిన్నె జెడ్పీ హైస్కూల్కు చెందిన జాస్మిన్ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపికయ్యారు. కడపలోని అంధుల ఉన్నత పాఠశాలలో జరిగిన నేషనల్ సైన్సు సెమినార్లో డీఈఓ షేక్ షంషుద్దీన్, డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినైజర్ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు క్వాంటమ్ ఏజ్ బిగిన్స్, ఫొటెన్షియల్ అండ్ చాలెంజెస్పై చాట్స్, స్లైడ్స్ ద్వారా పోటీలు జరిగాయన్నాఉ. ఎంపికై న విద్యార్థులు రెండు రోజుల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, మురళి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ఎస్తో 24 గంటల విద్యుత్ సరఫరా
మైదుకూరు : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీఎస్ఎస్ (రివేంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)తో 24 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాయప్పగారిపల్లెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల, గ్రామీణాభివృద్ధి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏపీఎస్పీడీసీఎల్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దువ్వూరు : పీఎం–కుసుం ఫీడర్ సోలార్ విద్యుద్దీకరణ పనులనుఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ శుక్రవారం పరిశీలించారు. దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఐదు మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన స్థల సేకరణ, మట్టి పరీక్ష అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణ, ఈఈలు లక్ష్మీపతి, నాగరాజు, డీఈఈలు శ్రీకాంత్, శివభాస్కర్, ఏఈలు రాజ్కుమార్, రామభద్రయ్య, హరి పాల్గొన్నారు.ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ -
సీపీఆర్పై అవగాహన పెంచుకోవాలి
మైదుకూరు : విద్యార్థులు సీపీఆర్(కార్డియో పల్మనరి రిసిస్టేషన్)పై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. వనిపెంట జ్యోతిరావు పూలే గురుకులం, మైదుకూరు కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సీపీఆర్పై శుక్రవారం అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సగా ఉపయోగపడే సీపీఆర్పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీపీఆర్తో వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రతతో వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చని, సరైన పద్ధతిలో చేతులు కడుక్కోవడవ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆడ పిల్లలను రక్షించడం, చదివించడం ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వి.మల్లేష్, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డెమో డి.భారతి, మెడికల్ ఆఫీసర్ సుమధుర, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ విజయ పాల్గొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులతో స్వయం ఉపాధికడప అగ్రికల్చర్: చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందవచ్చునని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్. అంకయ్యకుమార్ పేర్కొన్నారు. ఊటకూరు కేవీకేలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, లేబులింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేయడమేగాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేరుస్తాయని తెలిపారు. ఇటీవల కాలంలో యువత చిరుధాన్యాల ఉత్పత్తి సంస్థలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మార్కెట్లో ఉత్పత్తులకు గుర్తింపు పొందేలా ఆకర్షణీయమైన లేబుల్స్, సరైన ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలు అత్యంత ముఖ్యమని వివరించారు. చెరువులో పడి ఒకరు మృతి రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. రఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేవీకే పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్యకుమార్ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు -
అసంవాద బ్యాంకు ఖాతాలను నిర్వహణలోకి తీసుకురావాలి
కడప సెవెన్రోడ్స్ : భారత ప్రభుత్వం అసంవాదనీయ(అన్ క్లెయిమ్డ్) బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, బీమా, పొదుపు పథకాల నిధులు నిజమైన హక్కుదారులకు చేరేలా బ్యాంకర్లు చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో నిరుపయోగంగా ఉన్న అసంవాద (అన్ క్లెయిమ్డ్) అకౌంట్లను తిరిగి నిర్వహణలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో చేపట్టిన అవగాహన కార్యక్రమ బ్రోచర్లను కలెక్టర్ శుక్రవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచారం ప్రారంభించి.. ఆ అకౌంట్లను యాక్టివేట్ చేసేలా బ్యాంకర్లు చురుకై నపాత్ర పోషించాలన్నారు. బ్యాంకు కంట్రోలర్లు, సమన్వయకర్తలు తమ శాఖలను చైతన్యపరచి, బధిర ఖాతాదారులకు లేఖలు/ ఎస్ఎంఎస్లు పంపించాలని సూచించారు. అన్ని బ్యాంకులు ఆయా శాఖలలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి నిజమైన హక్కుదారులకు తిరిగి చెల్లించాలన్నారు. బ్యాంకులు తమ కస్టమర్లు, లేదా డిపాజిటర్లను ప్రోత్సహించి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్(డీఈఏ)ఫండ్లో ఉన్న అసంవాదనీయ డిపాజిట్లను నిజమైన హక్కుదారులకు ఇవ్వడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దనం, సీపీవో హజరతయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
● బద్వేలులో..
బద్వేలు అర్బన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట బద్వేలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ ఉదయభారతికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు భూమిరెడ్డి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు పి.సుదర్శన్రెడ్డి, జె.జానీసుందరం, జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు ఎ.వెంకటేష్, మోహన్క్రిష్ణ, రాజన్న, శేఖర్రెడ్డి, రఘురామిరెడ్డి, వి.వి.రమణ, అరుణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, సీపీఎం నాయకులు చిన్ని, సీపీఐఎంఎల్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుగురు తహసీల్దార్లకు పదోన్నతి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో పని చేస్తున్న ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా అడ్హక్ పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్:383 జారీ చేసింది. కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, కమలాపురం తహసీల్దార్ శివరామిరెడ్డి, పోరుమామిళ్ల తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, పెండ్లిమర్రి తహసీల్దార్ అనూరాధ, కలెక్టరేట్ ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ మాధవకృష్ణారెడ్డి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన జాబితాలో ఉన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21వ తేదీన తిరుపతి–హైదరాబాదు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07499 నంబరు గల రైలు మంగళవారం తిరుపతిలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదిగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా హైదరాబాదుకు మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నవంబర్ 7న హాకీ ఇండియా 100వ వార్షికోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ సంఘం సెక్రటరీ శేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో కడప హాకీ సంఘం సీనియర్ క్రీడాకారులు, కోచ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో హాకీ ఇండియా అసోసియేషన్ స్థాపించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఏపీ రాష్ట్ర అసోసియేషన్ ఆదేశాలకు జిల్లాలో ఉత్సవాలు జరపాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఆ రోజున పురుషులకు, మహిళలకు హాకీ పోటీలు నిర్వహించి సీనియర్ క్రీడాకారులను, క్రీడాకారిణులను సన్మానిస్తామని పేర్కొన్నారు. -
● జిల్లా వ్యాప్తంగా..
కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహ రిస్తోంది.. నిజాలు రాసే కలంపై కక్ష కట్టింది.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తోంది.. ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలు ప్రచురిస్తున్న ‘సాక్షి’ని వేధింపులకు గురి చేస్తోంది.. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది.. ఈ నేపథ్యంలో కలం నిరసన గళం విప్పింది.. ‘సాక్షి’కి మద్దతుగా జర్నలిస్టులు కదం తొక్కారు.. ‘సాక్షి’పై అక్రమ కేసులు, వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. ఇప్పటికై నా మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కడప కార్పొరేషన్: నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు.. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన కడపలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియాపై వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. రాసిన వార్తల్లో ఏవైనా తప్పులుంటే ఆధారాలు చూపి ఖండన కోరవచ్చు, అంతేగానీ అధికారముందని అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సాక్షి కార్యాలయాలకు వెళ్లి నోటీసుల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మనుగడకు ఇది చాలా ప్రమాదమన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ‘సాక్షి’ మీడియాపై అక్కసు ప్రదర్శిస్తోందన్నారు. చీటికీ, మాటికీ జర్నలిస్టులను బెదిరించేలా పోలీసులతో.. వారి ఇళ్లలో సోదాలు చేస్తూ, నోటీసులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం మీడియా సంస్థలను కూడా విభజించి తమకు అనుకూలంగా ఉన్న మీడియాపై ఒక విధంగా, వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాపై మరొక రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి సరికాదన్నారు. సాక్షి ఽఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన కడపలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు రామాంజనేయరెడ్డి, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, శివరామ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, కెమెరామెన్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేతలు పి. జయచంద్రారెడ్డి, పాకా సురేష్, పులి సునీల్కుమార్, సీహెచ్ వినోద్, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, బి.మరియలు, మల్లీశ్వరి, సుజిత, శివమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కడి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. పులివెందులలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి, ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. పత్రికా స్వేచ్ఛపై దాడితగదంటూ ఆందోళన ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యల పట్ల మండిపాటు అక్రమ కేసులు, వేధింపులపై ఆగ్రహం కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజం కదం తొక్కిన జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రాలు అందజేత -
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం
వేంపల్లె: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ.. ప్రజల శ్రేయస్సు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం వేంపల్లెలోని కడప – పులివెందుల బైపాస్ రోడ్డులోని మధురెడ్డి కన్వెన్షన్ హాలులో మెడికల్ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించి, ఆ ప్రతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఎంతోమందికి ప్రాణాలు పోసిన ఆరోగ్య శ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తున్నారన్నారు. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన మంది మాగధులైన పెత్తందారులకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం సహకారంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 17 కళాశాలలు మంజూరు కాగా.. వీటిలో ఐదు కళాశాలలు పూర్తయ్యాయని, కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డి, రాష్ట్ర యాక్టివిటీ జనరల్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీలు రవికుమార్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, బయపురెడ్డి, మండల కన్వీనర్లు చంద్రఓబుల్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీపీలు గాయత్రి, మాధవి బాలకృష్ణ, చల్లా వెంకట నారాయణ, ఉపసర్పంచ్ ఆర్.శ్రీనివాసులు, రామలింగేశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదు పేదలకు విద్య, వైద్యం దూరం అనుచరులకు దోచి పెట్టేందుకే చంద్రబాబు పన్నాగం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నట్టేట ముంచిందని ఎద్దేవా చేశారు. చీనీ, అరటి, ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఒక్కో బస్సులో 150 మందిని కుక్కి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం కాలం అవుతున్నా.. అరకొరగా ఒక సిలిండర్ ఇచ్చి మహిళలను మోసం చేశారని విమర్శించారు. కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతోందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. కూటమి నేతల మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పేదలకు వైద్య, విద్య దూరమవుతుందని, భవిష్యత్తులో ప్రజారోగ్యానికి భరోసా ఉండదన్నారు. వైద్యపరంగా పేదలను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. -
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ముద్దనూరు, లింగాల, పులివెందుల మినహా మిగతా 33 మండలాల్లో వర్షం కురిసింది. ఈ వాన చిరుపొట్ట దశలో ఉన్న వరికి కొంత నష్టం కలిగించే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ, పెన్నానది, నీటి వసతి ఉన్న బోర్ల కింద ముందస్తుగా సాగు చేసుకున్న వారికి.. వరుసగా కురుస్తున్న వర్షాలతో గుండె గుబేల్మంటోంది. ఎందుకంటే వర్షపు నీరు చిరుపొట్టలోకి చేరితే వరి ఎన్ను తాళ పోయే అవకాశం ఉంది. వెన్ను బయటికి వచ్చిన వరికై తే కంకికి ఉన్న సుంకు రాలిపోయే ప్రమాదం ఉంది. పత్తి, వేరుశనగ రైతులు కూడా కలవర పడుతున్నారు. ఈ వర్షపు నీరు పత్తికాయల్లోకి వెళ్లితే పత్తి కుళ్లిపోయే అవకాశం ఉంది. వేరుశనగ పంటలో నీరు నిలిస్తే ఊడలు ఎర్రగా మారి, భూమిలోకి సరిగా దిగవని రైతులు పేర్కొంటున్నారు. శనగ పంట సాగు చేసుకునే రైతులకు మాత్రం ప్రస్తుతం వర్షం చాలా అవసరం. ఉద్యానపంటలైన మామిడి, సపోట, చీని, డ్రాగెన్ ప్రూట్ వంటి రైతులకు కూడా మేలే. మండలం కురిసిన వర్షం(మి.మీ ) మూడు మండలాలు మినహాజిల్లా అంతటా వాన అత్యధికంగా అట్లూరులో 69.4 మి.మీ : : : : : : : : : : : : : : : అట్లూరు 69.4 కడప 36.8 ఒంటిమిట్ట 33.6 సిద్దవటం 30.2 గోపవరం 29.2 బద్వేలు 23.4 సీకే దిన్నె 20.4 వేంపల్లి 20.0 పెండ్లిమర్రి 19.2 పోరుమామిళ్ల 16.2 బి.మఠం 15.6 మైలవరం 14.6 దువ్వూరు 14.6 బి.కోడూరు 14.2 వీఎన్పల్లి 14.2 చెన్నూరు 14.2 సింహాద్రిపురం 12.4 కలసపాడు 11.0 రాజుపాళెం 10.0 తొండూరు 9.4 ఖాజీపేట 8.2 వేముల 8.0 మైదుకూరు 7.8 వల్లూరు 6.8 జమ్మలమడుగు 6,2 చాపాడు 3.4 కమలాపురం 2.4 కొండాపురం 2.4 చక్రాయపేట 1.8 ప్రొద్దుటూరు 1.2 -
● మైదుకూరులో..
మైదుకూరు: మైదుకూరులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అర్బన్ సీఐ కె.రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) నియోజకవర్గ అధ్యక్షుడు కారెడ్ల కృష్ణ, ప్రింట్ మీడియా యూనియన్ అధ్యక్షుడు జి.వాసు, శ్రీపతి సుబ్బయ్య, కశెట్టి చంద్ర, బొమ్మిశెట్టి మోహన్, శేగినేని మురళి, టి.రామమోహన్, ఎల్.సుధాకర్రెడ్డి, ఎం.ప్రసాద్, రియాజ్ హుస్సేన్, ఎస్.గౌస్పీర్, రంజిత్కుమార్, యాపరాల ప్రసాద్, డీవీ కుమార్, సంపత్, గోశెట్టి రవీంద్ర, అనిల్ కుమార్రెడ్డి, ఎ.శ్రీనివాసులరెడ్డి, సురేష్, సుబ్బరాయుడు, చొక్కం సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీ విత్తనం ఇంకెప్పుడు!
ఖరీఫ్ ముగిసింది.. రబీ వచ్చింది.. విత్తనం మాటే లేదు.. చినుకు రాలింది.. నేల తడిసింది.. సబ్సిడీ విత్తనం ఊసే లేదు.. కూటమి ప్రణాళిక లోపం అన్నదాతకు శాపమవుతోంది. పదునెక్కిన ఈ వానకు పొలమంతా నాగలిపట్టాల్సిన రైతు.. విత్తనం కోసమే ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకటా రెండా సీజన్ మొదలై పక్షం రోజులు దాటినా సబ్సిడీ విత్తన పంపిణీకి మోక్షం రావడం లేదు. రాజుపాళెంలో శనగసాగుకు ట్రాక్టర్తో పొలాన్ని సిద్దం చేస్తున్న రైతు, ఎర్రగుంట్ల మండలంలో శనగసాగుకు విత్త్తనాన్ని సిద్దం చేసుకుంటున్న రైతన్న కడప అగ్రికల్చర్: జిల్లాలో సబ్సిడీ శనగ విత్తన పంపిణీ అతిగతి లేకుండా పోయింది. రబీ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా ప్రభుత్వం ఇంతవరకు విత్తన పంపిణీ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విత్తనాల పంపిణీకి ముందు కనీసం రైతుభరోసా కేంద్రాలలో రైతుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించకపోవడంతో ఇక విత్తన పంపిణీ ఎప్పుడు చేస్తారని అన్నదాతలు మండిపడుతున్నారు. గతేడాది విత్తనాలను సరఫరా చేసిన టెండర్ దార్లకు ఇంతవరకు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ ఏడాది విత్తన పంపిణీ ఆలస్యమవుతోన్నట్లు సమాచారం. పదును ఆరిపోతుందనే... ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో చాలా ప్రాంతాలలో పదును అయ్యింది. ఈ పదునులోనే చాలా మంది రైతులు శనగ పంటను సాగు చేయనున్నారు. కాకపోతే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలలో శనగపంటను సాగుకానుంది. మండలాల్లో ఇబ్బందులకు గురవుతున్న ఏవోలు. జిల్లాలో శనగపంటను అధికంగా సాగు చేసే మండలాలైన పెద్దముడియం, రాజుపాలెం, తొండూరు, సింహాద్రిపురం, వేముల, వేంపల్లి, కొండాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైలవారంతోపాటు పలు మండాలల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శనగను సాగు చేసే రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. దీనికి తోడు రైతులు అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల నుంచి మౌనమే సమాధానంగా ఉంటుందని రైతులు తెలిపారు. రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు... ప్రభుత్వం సరఫరా చేస్తే సబ్సిడి విత్తనాల కోసం ఎదురు చూస్తే పదును ఆరిపోతుందని భావించిన పలువురు రైతులు ప్రైవేటు రైతుల నుంచి శనగలు కొనుగోలును చేస్తున్నారు. పైగా ప్రభుత్వం సరఫరా చేసే శనగ విత్తనాలు ఏవిధంగా ఉంటాయోననే ఆందోళన కూడా రైతులను వేధిస్తుంది. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట రైతులకు సరఫరా చేసే శనగ విత్తనాల పంపిణీలో ప్రభు త్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రైతుల సమ స్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే విత్తనాల సరఫరాను సకాలంలో సరఫరా చేయలేకపోయింది. దీంతో చాలా మంది రైతులు బయట మర్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి -
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి సుశాంత్ను పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదడంతో వాతలు పడ్డాయి. పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సుశాంత్ను తెలుగు ఉపాధ్యాయుడు నారాయణ స్వామి కొట్టడంతో వీపుపై చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఏఐఎస్బీ జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డిసర్కిల్:-õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* ç³Æý‡Þ¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯]l*ÞÆð‡¯ŒSÞ ´ëÌSïÜ õÜÐ]l-ÌS¯]l$ {糆 JMýSPÆý‡* Ѱ-Äñæ*-W…-^èl$-Mø-ÐéÌS° õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* f¯]l-Æý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ AÐ]l$-Æó‡…{§ýl MýS$Ð]l*ÆŠ‡ çÜ$Ð]l$¯ŒS í³Ë$ç³#-°^éaÆý‡$. MýSyýl-ç³ÌZ° IsîæI çÜÇPÌŒæ {»ê…^Œl, Ð]l°-ò³…r G‹Ü½I {»ê…^ŒlÌZ fÇ-W¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ »ê«¨-™èl$-ÌSMýS$ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯ŒS-{çÜ*-ె ¯ŒSÞ ´ëÌSïÜ Ððl¬™é¢ÌS¯]l$ A…§ýlgôæ-Ô>Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> iG… Ð]l*sêÏ-yýl$™èl* {ç³çÜ$¢™èl M>ÌS…ÌZ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïܰ ¡çÜ$-Mø-Ð]lyýl… AÐ]l-çÜ-Æý‡Ð]l$-¯é²Æý‡$. ´ëÌSïÜ §éÓÆ> BǦMýS…V> A°² Ñ«§éÌê ™øyéµr$ A…§ýl$-™èl$…-§ýl¯é²Æý‡$. A¯]l…™èlÆý‡… MýS–çÙ~-M>…™Œæ ÔèæÆý‡Ã, íܧéª-Æð‡-yìlzÌS MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïÜ ^ðlMýS$P¯]l$ A…§ýl-gôæ-Ô>Æý‡$. D M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ »êÅ…MýS$ yìlç³NÅsîæ f¯]lÆý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ õßæÐ]l$, Èh¯]lÌŒæ Ðól$¯ól-fÆŠ‡ MýS–çÙ~ MìSÚùÆŠæ, f¯]lÆý‡ÌŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ HÇĶæ* Ðól$¯ólfÆŠ‡ fĶæ$^èl…-{§ýl™ø-´ër$ C™èlÆý‡ »êÅ…MýS$ A«¨-M>-Æý‡$Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధికి కృషి చేయాలి కడప అగ్రికల్చర్: ఉద్యాన పంటల క్లస్టర్ల సమగ్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఉద్యానశాఖ కన్సల్టెంట్ విద్యాశంకర్ సూచించారు. గురువారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీ్ష్ ఆధ్వర్యంలో ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉద్యాన పంటల క్లస్టర్ సమగ్రాభివృద్ధి కార్యక్రమంపై అవగాహన, వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటలైన అరటి, బత్తాయి, ఉల్లి, పసుపు, చామంతి తదితర పంటల క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ద్వారా క్లస్టర్ సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టవలసిన ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ , ఎగుమతి, మొదలకు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్, సహాయ సంచాలకుడు రవిచంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, ప్రధాన శాస్త్రవేత్తలు ప్రభాకర్రెడ్డి, సునీల్, ఉద్యానశాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, రైతులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలను ఆపి.. ప్రాణాలు నిలిపి..
● ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు ● శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో ఇద్దరి నిండు ప్రాణాలు నిలిచాయి. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి రాగా రైల్వే పోలీసులు గమనించి వారిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలిలా.. వేంపల్లికి చెందిన సుందరి సుమంజలి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు వచ్చింది. రైలు పట్టాలపై పడుకొని ఉండటాన్ని ఎర్రగుంట్ల రైల్వే కానిస్టేబుళ్లు డి.వీరనారాయణ, శ్రీనివాసరావులు గమనించారు. వెంటనే రైల్వే ట్రాక్పై ఉన్న సుందరి సుమంజలిని కాపాడారు. తర్వాత రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి వివరాలు సేకరించారు. ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలతో సంతోషంగా జీవించాలని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. మద్యం మత్తులో.. ప్రొద్దుటూరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలో గొడవ పడి అతిగా మద్యం తాగి ఎర్రగుంట్లకు వచ్చాడు. రైలు కింద పడి చనిపోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు డి. వీరనారాయణ, రామాంజనేయరెడ్డిలు వెంటనే స్పందించి పట్టాలపై ఉన్న రామాంజనేయులును కాపాడి పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లోనూ రైల్వే పోలీసులు చూపిన చొరవను చూసిన వారు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు. -
ప్రత్యక్ష రాజకీయాల్లోకి చవ్వా దుష్యంత్రెడ్డి
పులివెందుల: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా దుష్యంత్రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రకటించారు. దుష్యంత్రెడ్డి గతంలో కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశారు. గురువారం పులివెందులలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి గత 30ఏళ్లుగా వైఎస్ మనోహర్రెడ్డి సేవలు అందించారని, ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా దుష్యంత్రెడ్డి మనోహర్రెడ్డికి తోడుగా పులివెందుల మున్సిపాలిటీలో సేవలందిస్తారన్నారు. పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.


