YSR
-
● ఏ తల్లి పాపమో !
అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డ.. ముళ్లపొదల్లో చేరి మృత్యు కౌగిట్లో జారిపోయాడు.. తండ్రి చేతుల్లో పెరగాల్సిన బిడ్డ.. శునకాల నోట చిక్కి విలవిల్లాడిపోయాడు.. ఎవరి పాపమో.. విధి శాపమో గానీ.. కళ్లు తెరవకుండా శాశ్వతంగా కన్నుమూశాడు.. కడప వినాయకనగర్ సమీపంలో ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. వినాయకసాగర్ ముళ్లపొదల సమీపంలో కుక్కలు ఓ పసికందును నోట కరుచుకుని తీసుకెళ్తుండటాన్ని గమనించారు. తీవ్ర గాయాలతో అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ తెలిపారు. – కడప అర్బన్ -
కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాపాడు మండలంలోని రాజువారిపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి తనతో మాట్లాడాలని ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన వివాహితను కొన్ని రోజులుగా వేధించేవాడు. తన వెంట పడొద్దని సదరు మహిళ పలుమార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో మహిళ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యపుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. మహిళకు పాము కాటుమదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఆది వర్గీయుల దాడి
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ దాడిలో ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లి మేకల వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మాలేపాడులోని సర్వే నంబర్ 373లో 86 సెంట్ల స్థలాన్ని 2013లో ప్రసాద్రెడ్డి తండ్రి మేకల సుబ్బిరెడ్డి రూ.90 వేలకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో పంట సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని ఎవరికీ తెలియకుండా ప్రొద్దుటూరుకు చెందిన టంగుటూరు మారుతీప్రసాద్, రావుశ్రీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ప్రొద్దుటూరు మండలంలోని రామాపురానికి చెందిన పైడికాలువ జగన్కు విక్రయించారు. బాధితులు 2015లో దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలలో తామే అనుభవంలో ఉన్నామని ప్రసాద్రెడ్డి ఆధారాలతో సహా నిరూపించుకోగా, ఆ భూమి ప్రసాద్రెడ్డిదేనని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు పైడికాలువ జగన్, ఆయన తండ్రి ఓబన్న అలియాస్ జయన్న, పైడికాలువ ప్రసాద్, ఎర్రమాసి ప్రతాప్, పైడికాలువ భరత్ మరో 20 మంది కలిసి మారణాయుధాలతో భూమిలో దిగారు. ప్రసాద్రెడ్డి తల్లి వరలక్ష్మి వారికి అడ్డుచెప్పగా వారు ఆమైపె తీవ్రంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు నుంచి నేరుగా ఇంటికి రాగా, ఎమ్మెల్యే వర్గీయులు ఆయనపైనా దాడి చేశారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శించారు. ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లికి తీవ్రగాయాలు -
రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఆ సమయాల్లో ప్రత్యేక నిఘా, పటిష్ట ట్రాఫిక్ అమలు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 51 బ్లాక్ స్పాట్లు, 125 జీరో ఫెటాలిటీ క్రాష్ ప్రోన్ ప్రాంతాలు, 162 యాక్షనబుల్ ప్రదేశాల వద్ద తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. డివైడర్లను పగలగొట్టి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో అధిక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యల్లో మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రవాణా శాఖ నిబంధనలు ఇవీ..
● ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు ● బడి బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ● అన్నీ సక్రమంగా ఉంటేనే ఎఫ్సీ ఇస్తామంటున్న అధికారులు కడప వైఎస్ఆర్ సర్కిల్: వేసవి సెలవులకు బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. పిల్లలు బడిబాట పట్టే వేళయింది. పిల్లలే కాదు వారిని తీసుకెళ్లే బస్సులు కూడా సిద్ధం కావాల్సిన తరుణం రానే వచ్చింది. అవును.. రవాణాశాఖ ఆధ్వర్యంలో అన్ని సామర్థ్య పరీక్షలు చేసుకుని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. కాగా గత ఏడాది జారీ చేసిన సర్టిఫికెట్లకు కాలం చెల్లడంతో ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రక్రియ జరుగుతోంది. విద్యా సంస్థలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి కండీషన్లో ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏటీసీ సెంటర్ ద్వారా ఎఫ్సీలు జారీ గతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రతి వాహనాన్ని ఒకటి రెండు కిలోమీటర్లు నడిపి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఈ పనిని బాబు సర్కారు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. జిల్లాకు సంబంధించి వైవీయూ యూనివర్శిటీ సమీపంలో ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల నుంచి బడి బస్సులను ఇక్కడికే తీసుకువచ్చి ఎఫ్సీ పొందాల్సి వస్తోంది. ఈ ఏటీఎస్ సెంటర్పై ఏమాత్రం అజమాయిషీ లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉదయం ఆరు గంటలకు బస్సు తీసుకొని వస్తే రాత్రి 9 గంటలైనా పని పూర్తి కావడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 460 బస్సులు తనిఖీ జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, ప్రాంతాల్లో దాదాపు 618 పైగా విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 460 బస్సులను తనిఖీ చేశారు. వీటిలో 92 బస్సులకు ఎఫ్సీలు జారీ చేశారు. బడి బస్సులో లోపాలు ఉన్న 368 బస్సులకు నోటీసులు ఇచ్చారు. గుర్తిస్తున్న లోపాలు ఇవీ...... రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయ టకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పని చేయకపోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్ లేకపోవడం, ఎక్స్పైరీ డేట్తో ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తిస్తున్నారు ● స్కూల్ బస్సుకు డ్రైవర్గా 60 ఏళ్లు నిండిన వారు అనర్హులు ● బస్సు నడిపే డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ● డ్రైవర్ నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తప్పనిసరిగా తెలియ జేయాలి. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభవం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి నెల వాహనం ిస్థితి గతులను నమోదు చేయాలి. ఫిర్యాదు పుస్తకం ఉండాలి. ● బస్సులోని అన్ని లైట్లు, సిగ్నల్స్ ఖచ్చితంగా పని చేయాలి. ● బ్రేకులు కండీషన్లో ఉండాలి ● ఎమర్జెన్సీ డోర్, అగ్ని ఆర్పే పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి విద్యా సంస్థల బస్సులకు తప్పనిసరిగా ఎఫ్సీ కలిగిఉండాలి. దీనిపై ఇప్పటికే జిల్లాలోని విద్యా సంస్థలకు సమాచారం ఇచ్చాం. ఎఫ్సీ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా బస్సులను సీజ్ చేసి జరిమానా విధిస్తాం. వీటిపై ప్రత్యేక బృందాలను నియమించాం. – వీర్రాజు, ఇన్చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా -
జూద స్థావరంపై పోలీసుల దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం బ్రాహ్మణపల్లె రోడ్డులోని జూదస్థావరంపై ఎస్ఐ తిమోతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 8 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టగా, నిందితులు పట్టుబడ్డారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని ఎస్ఐ తిమోతి పేర్కొన్నారు. గొర్రెల చోరీపై కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలు చోరీ చేసిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గోపవరం గ్రామంలో రేకుల షెడ్డును కత్తిరించి అందులో ఉన్న 13 గొర్రెలు నిందితులు చోరీ చేశారు. గొర్రెలను నిందితులు బొలెరో వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు అనిల్కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొర్రెలు విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు బనగానపల్లెలో వాసులుగా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాజు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్(31) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి బుధవారం తెలిపారు. చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్, గురుశేఖర్లు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేపలను నిల్వ చేసుకోవడానికి ఐస్ కోసమని ఇద్దరు కలసి ఈ నెల 8వ తేదీన స్కూటర్పై చెన్నూరుకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా తిప్పలూరు గ్రామంలోని సచివాలయం వద్దకు రాగానే తుఫాన్ వాహనం వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ గౌస్పీర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసమని కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వృద్ధుడు అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని బొల్లవరానికి చెందిన వృద్ధుడు పందిటి సామేల్ (80) అదృశ్యంపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సామేల్ తమిళనాడులోని వేళాంగినికి వెళ్తున్నానని చెప్పి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు వెళ్లిన అతను ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లలోనూ, తెలిసిన చోట్ల వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రోబోటిక్ ల్యాబ్ను పరిశీలించిన డీఈఓ
రాజంపేట టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ను బుధవారం డీఈఓ షంషుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ఈరోబోటిక్ ల్యాబ్ను త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మరో పది పాఠశాలల్లో రోబోటిక్ ల్యాబ్లను, స్టెమ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైస్కూల్స్లోని రోబోటిక్ ల్యాబ్స్ సిద్దాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తూ అనుభవాలుగా మారుస్తాయన్నారు. ఫలితంగా విద్యార్థులు రోబోలను డిజైన్ చేసేందుకు, నిర్మించేందుకు, కోడ్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సి, ఇంజనీరింగ్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. హై స్కూల్ స్థాయిలో ఈ ప్రయోగాలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు. రోబోటిక్ ల్యాబ్ వల్ల విద్యార్థులు వైఫల్యాలను విశ్లేషించడం, కోడ్లోని సమస్యలను పరిష్కరించడం, హార్డ్వేర్ను సర్దుబాటు చేయడం, సవాళ్ళను ఎదుర్కోవడానికి పునరావృతమయ్యే దశలవారీ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి విద్యార్థులు నేర్చుకుంటారని తెలిపారు. భవిష్యత్తులో రోబోల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీపై పట్టు సాధించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ లంకాయగారి నాగయ్య, ఎంఈఓ–1 కొండూరు రఘునాధ్రాజు, ఎంఈఓ–2 సుబ్బరాయుడు, హెచ్ఎం నాగమణి, సైన్స్ ఉపాధ్యాయుడు, రోబోటిక్ ల్యాబ్ ఇన్ఛార్జ్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నా భర్తను అప్పగించండి మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సర్టిఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది. -
బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా జే.భరత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. జెడ్పీలో నియామకాలు కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, సీఈఓ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఈఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్: రాష్ట్రంలోకి రుతు పవనాల ఆగమనంతో జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 32.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 18.2, లింగాల, దువ్వూరు మండలాల్లో 5.2, సీకేదిన్నె మండలంలో 4.6 ముద్దనూరు మండలంలో 2.4, బద్వేల్ మండలంలో 1.2, గోపవరంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. దుప్పి మాంసాన్ని పంచుకున్న ఇద్దరు అరెస్టు మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్లోని గంగాయపల్లె బీట్లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్ అధికారి చలపతి నాయుడు తెలిపిన వివరాల మేరకు.. గంగాయపల్లె బీట్లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్ దొరికారు. ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. డీప్యూటీ ఈఓ మీనాక్షిపై వేటు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారి మీనాక్షిపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఇటీవల జరిగిన డీఆర్సీలో ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తప్పించడంతో పాటు విద్యాశాఖ డైరెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియ ఆదేశాలు జారీ చేశారు. -
బాబు పేరు చెబితే మోసం గుర్తుకువస్తుంది
● 12న చేపట్టే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలి ● వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.సురేష్ బాబుకడప కార్పొరేషన్ : ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది నిర్వహించనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. సురేష్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక అపూర్వ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పింఛన్లు తప్పా మరేమీ ఇవ్వలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చారన్నారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి రూ.13వేలే ఇస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 20లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని కేవలం 5 సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే మోసం, దగా, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, క్లస్టర్ పార్టీ అధ్యక్షులు పి. రామ్మోహన్రెడ్డి, బీహెచ్ ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు : పట్టణంలోని యూబి కాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా .. 15 ఏళ్ల క్రితం అహ్మద్బాషాతో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముది వేడు వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలి పరిస్థితి విషమించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించామన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
ప్రధాన క్రికెట్ బుకీలపై చర్యలేవీ..?
ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు రెండు నెలల పాటు జరిగాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకమునుపే పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై దృష్టి సారించారు. అన్ని స్టేషన్ల పరిధిలోని బుకీలను పిలిపించి స్వయంగా ఏఎస్పీ విభూకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐపీఎల్ ప్రారంభం అయ్యేనాటికే రెండు, మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కౌన్సిలింగ్కు ప్రధాన బుకీలెవ్వరూ హాజరు కాలేదు. చిన్నా చితకా క్రికెట్ పందేలు నిర్వహించే బుకీలు మాత్రమే కౌన్సిలింగ్కు వచ్చారు. ఈ ఏడాది మార్చి 28న ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మే 31న ముగిశాయి. ప్రధాన బుకీలందరూ ఇతర దేశాలకు వెళ్లారు. అక్కడే ఉంటూ రెండు నెలల పాటు నిర్విరామంగా బెట్టింగ్ నిర్వహించారు. టోర్నమెంట్ ముగియడంతో కౌన్సిలింగ్కు డుమ్మా కొట్టిన వారు, పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలు ఇప్పుడిప్పుడే సొంత గూటికి వస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం.. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్్ అనేది ఈ రోజు పుట్టింది కాదు. ఇక్కడ క్రికెట్ పందేలను ప్రారంభించిన అనేక మంది బెట్టింగ్ డాన్లుగా ఎదిగారు. వీరి నీడన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది బుకీలు పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు విషయానికొస్తే అధికార పార్టీలో ఉంటున్న కొందరు బుకీలు స్థానికంగా చక్రం తిప్పుతున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్బుకీలు, కొరియర్ బాయ్లుగా ఉన్న యువకులు నేడు బడా బుకీలుగా మారారు. జిన్నారోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు బెట్టింగ్ కార్యకలాపాలను విస్తరించాడు..ఇతను కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ప్రధాన బుకీతో కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నాడు. వన్టౌన్ ప్రాంతంలో ఒకరు, బంగారు అంగళ్ల వీధిలో ఒక యువబుకీ, మైదుకూరు రోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అతని సోదరుడు క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పొలిటికల్ అండతో ప్రొద్దుటూరులో అనేక మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాగానే వీళ్లంతా కువైట్, దుబాయ్, మస్కట్, శ్రీలంక తదతర దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే యాప్ల ద్వారా, ఫోన్లలోనూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. పోలీసుల భయంతో రెండు నెలల పాటు ఇతర దేశాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ఇటీవలే ఐపీఎల్ సీజన్ ముగియడంతో తిరిగి ఒక్కొక్కరుగా ప్రొద్దుటూరుకు వస్తున్నారు. నాడు పోలీసుల భయంతో పారిపోయినోళ్లే.. నేడు పోలీసుస్టేషన్ల ముందే ఫోజులు కొడుతున్నారు ఐపీఎల్, టీ ట్వంటి వరల్డ్కప్ లాంటి క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో వారం రోజులు ముందే క్రికెట్ బుకీలు వారెంచుకున్న ప్రాంతాలకు వెళ్లిపోతారు. క్రికెట్ మ్యాచ్ల ముందు పోలీసులు పట్టుకుంటే బెట్టింగ్ నిర్వహించుకునేందుకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందుగా స్థావరాలకు చేరుకుంటారు. ఒక వేళ క్రికెట్ సీజన్ ప్రారంభమైనా బిక్కు బిక్కుమంటూ పోలీసులకు కనిపించకుండా దాక్కొని తిరుగుతుంటారు. క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ నంబర్లను మార్చుకొని పందేలు నిర్వహిస్తుంటారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తిస్తారేమోననే భయంతో కొత్త సిమ్ కార్డులను తీసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. క్రికెట్ మ్యాచ్లు ముగిసిన వెంటనే బుకీలు ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. రెండు నెలల క్రితం వరకు పోలీసులను చూస్తే భయపడిన బుకీలే ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై పోలీసుల ముందే జెంటిల్మెన్లా తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమ క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు, నిఘా సంస్థలు ఎంత మేరకు పర్యవేక్షణ చేస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్రికెట్ సీజన్లో నీడలా మాయమై..ఫైనల్ మ్యాచ్ ముగిశాక ప్రత్యక్షమయ్యే ఈ జెంటిల్మెన్ల వ్యవహారంపై ఆయా పోలీస్స్టేషన్ల పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన క్రికెట్ పందేలు నిర్వహించే కొందరు వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీస్స్టేషన్లకు వెళ్లి పంచాయతీలు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పాల్గొంటున్న వ్యక్తులతో కొందరు పోలీసు సిబ్బంది సన్నిహితంగా కనిపించడం ప్రొద్దుటూరులో పరిపాటిగా మారుతోంది. పలువురు ప్రధాన బుకీలపై కేసులు..? ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రొద్దుటూరు పోలీసులు పలువురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీసులు 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి రూ.11 లక్షలుపైగా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు షేక్ జావిద్ అలియాస్ బాలాజీ, అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సోదరుడు షేక్ జిలానిబాషాలు అరెస్ట్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మరో రూ. 14 లక్షలను జప్తు చేశారు. అలాగే వన్టౌన్ పోలీసులు ఆరుగురు బుకీలను అరెస్ట్ చేసి రూ. 2.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ. 4.14 లక్షలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ రెండు స్టేషన్లలో నమోదైన బెట్టింగ్ కేసుల్లో పలువురు ప్రధాన బుకీలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కారణంగా 5–6 మంది ప్రధాన బుకీలు ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం రెండు నెలల పాటు విదేశాల్లో మకాం వేసిన క్రికెట్ బుకీలు ఇటీవల ఐపీఎల్ సీజన్ ముగియడంతో సొంతగూటికి పయనం క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలే.. నేడు పెద్ద మనుషులుగా, సమాజ సేవకులుగా చలామణి మోస్ట్ వాంటెడ్ బుకీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారా..! -
ఇంటిల్లిపాదికీ యోగానందం
కడప వైఎస్ఆర్ సర్కిల్: మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’ కార్యక్రమానికి సుమారు 4 వేల మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే ‘టూరిజం, హెరిటేజ్ యోగా’థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తితో పాటు మంచి జీవనశైలి కుడా అలవడుతుందన్నా రు. సబ్ కలెక్టర్, కడప నగర కమిషనర్ హెచ్.ఎస్. భావన మాట్లాడారు. కడప ఆర్డీఓ మురళి, ఎస్డీసి హరిప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, డీఎంహెచ్ఓ నాగరాజు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నిధీ మీనా -
ఇసుకమాఫియా కోరల్లో పెన్నమ్మ
● పరివాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ● ఇసుక తోడేస్తుండటంతో దెబ్బతింటున్న తాగునీటి పైపులైన్ ● ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులుట్రాలీని వదిలి ఇంజన్తో పరారైన ఇసుకాసురులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్న అధికారులు ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పరిధి పోట్లదుర్తి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రొద్దుటూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు అధికార పార్టీ అండదండలతో వారి అనుచర వర్గీయులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోట్లదుర్తి గ్రామ సమీపంలోని బ్రిడ్జి సమీంలోనే ఇసుకను తోడేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెన్నానది అంతా గుంతలు పడింది. అడుగుభాగాన ఉన్న ఇసుకను తోడేయడంతో మట్టి మాత్రం నదిలో మిగిలింది. అధికారుల రాకతో పరుగులు పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రని గ్రామంలోని కొందరు బుధవారం రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ అమరేశ్వరీ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రమీల వీఆర్ఓ పెన్నానదిలోకి వెళ్లి దాడులు చేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను వదిలి పరుగులు పెట్టారు. నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అడుగంటిపోతున్న భూగర్భజలాలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్నానదిలోని ఇసుకపై అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల కన్నుపడింది. దీంతో ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా పైపులైన్ దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు నుంచి అధికంగా ఇసుక మాఫియ దారులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక బయట ప్రాంతాలకు తరలిపోతోంది. -
చీటింగ్ వెనుక గూడుపుఠాణి !
రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత సహకారం? .. నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. నాగేంద్రవర్మకు సహకరించినది ఎవరు..? నిష్పక్షపాతంగా పోలీసు విచారణ జరిగేనా? మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగేనా రూ.కోట్లాది మార్పిడిపై ఐటీ దాడులు ఏవీ.. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా !
కడప కార్పొరేషన్/కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాచునూరు, నందిమండలం, అలిదెన, పగిడాల పల్లె, జమాల్పల్లె, కొండపేటలో మట్టి, గ్రావెల్, నల్లమట్టి మాఫియా రెచ్చిపోతోందని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విలువైన మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రూ.కోట్లలో మట్టి, గ్రావెల్ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ దందాను బీజేపీ తరఫున ఖండిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా మైనింగ్ శాఖ స్పందించి, అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి -
బిల్లులు లేకుండా బంగారు నగలు విక్రయించొద్దు
ప్రొద్దుటూరు క్రైం : బిల్లులు లేకుండా బంగారు నగలను విక్రయించరాదని ప్రొద్దుటూరు బంగారు దుకాణ యజమానులకు ఏఎస్పీ విభూకృష్ణ సూచించారు. పట్టణంలోని బంగారు వ్యాపారులు, అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం ఏఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దుకాణ యజమాని నాణ్యమైన సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. మెయిన్బజార్, దర్గాబజార్, పాతమార్కెట్ సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దుకాణదారులు సహకరించాలన్నారు. రహదారికి ఇరువైపులా దుకాణాల ముందు ఒక లైన్ను ఏర్పాటు చేసుకొని లైన్ లోపలే బైక్లు నిలుపుకొనేలా ఎవరికి వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బంగారు నగలను విక్రయించడానికి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దొంగ బంగారు కొనుగోలు చేసి ఎవరూ ఇబ్బందులు పడరాదని సూచించారు. బిల్లులు లేకుండా బంగారు విక్రయించరాదని, తగు ఆధారాలతో బంగారు నగలను విక్రయించడం శ్రేయష్కరమన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బుశెట్టి రామ్మోహన్రావు, ఉప్పలూరు ఇలియాస్, సీఐలు టీవీ కొండారెడ్డి, వంశీనాథ్, ట్రాఫిక్ సీఐ సురేష్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వృద్ధులకు శాపం
● జిల్లా ఆస్పత్రిలో ఆగిన కంటి శస్త్రచికిత్సలు ● రోజూ వచ్చి వెనుతిరుగుతున్న వైనం ● పనుల నిర్వహణపై శ్రద్ధ చూపని కూటమి నాయకులుప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో రూ. 20.50 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కాకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది నవంబర్ 17న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర పనులు కొంచెం ఆలస్యంగా చేసినా.. కంటి విభాగం మాత్రం మొదటి ప్రాధాన్యతగా మార్చి చివరి నాటికి పూర్తి చేసి తమకు అప్పగించాలని ఆస్పత్రి అధికారులు కోరారు. అంతకంటే ముందుగానే పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు, టీడీపీ నాయకులు చెప్పారు. కంటి విభాగం పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతుండటంతో ఈ ఏడాది కంటి శస్త్రచికిత్స ఒక్కటి కూడా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలంలో 300కు పైగా కంటి ఆపరేషన్ల నిర్వహణ వేసవి కాలంలో పేద వృద్ధులు కంటి ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్రొద్దుటూరులో ప్రైవేట్ కంటి ఆస్పత్రులు అనేకం ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద కూడా శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఆపరేషన్లు చేయడానికి 20 నుంచి 30 రోజుల వరకు సమయం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ మంది జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు. పైగా ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు బాగా చేస్తారనే భావనతో.. ఇక్కడికి రావడానికే ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో ప్రతి యేటా 300కు పైగా జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. అయితే వేసవి ముగుస్తున్నా ఇప్పటికి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని కంటి విభాగంలో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారే కానీ.. ఇంత వరకు శ్వాబ్ పరీక్ష నిర్వహించలేదు. వారానికి ఒక సారి చొప్పున రెండు వారాలు ఆపరేషన్ థియేటర్లో శ్వాబ్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు, గాలిలో సూక్ష్మ జీవుల కాలుష్యాన్ని గుర్తించడం కోసం ఈ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడో.. కంటి ఆపరేషన్లు ప్రారంభమయ్యేది ఎప్పుడోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోగుల ఇబ్బందులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. చేతులెత్తేశారు.. నవంబర్లో పనులు ప్రారంభించినా.. మొదట్లో రెండు, మూడు నెలలు మందకొడిగా సాగాయి. తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు ఇతర టీడీపీ నాయకులు రెండు, మూడు సార్లు జిల్లా ఆస్పత్రిని సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. శిలాఫలకాన్ని ప్రారంభించి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఆస్పత్రిలోని 47 బ్లాకుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో చిన్న పిల్లల వార్డు, బ్లడ్బ్యాంక్, మూడు ఆప రేషన్ థియేటర్లను ఆధునీకరించాల్సి ఉంది. 200 వరకు మరుగు దొడ్లు కూడా నిర్మించాలి. అలాగే గ్రౌండ్ఫ్లోర్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాన్ఫరెన్స్ హాల్, శానిటేషన్ వర్కర్ల గదులు, అంబులెన్స్ షెల్టర్ తదితర పనులను ఇంకా ప్రారంభించనే లేదు.కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం కంటి విభాగం భవనాన్ని ఈ నెలాఖరు నాటికి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెప్పాడు. సాధ్యమైనంత తొందరగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కంటి విభాగం భవనంలో రూఫ్ వర్క్, పెయింట్ పనులు జరుగుతున్నాయి. తొందరలోనే కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆనంద్బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
చిట్టీల వ్యాపారి కుచ్చుటోపీ
రాజంపేట : రాజంపేటలో చిట్టీల వ్యాపారి చేసే కంచి నాగేంద్ర వర్మ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. అధికార పార్టీకి చెందిన నేతను అడ్డుపెట్టుకుని మోసం చేశా డు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు స్కెచ్ వేశాడు. బాధితుడు ధనుజంయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కంచి నాగేంద్రవర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్స్టేషన్కు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట పట్టణం ఎల్లాగడ్డ గ్రామానికి చెందిన కంచి నాగేంద్రవర్మ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. రాజంపేటతోపాటు రైల్వేకోడూరు ప్రాంతంలోనూ చిట్టీలు వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 50 కోట్లకు పైగా చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో నమ్మకస్తుడిగా వ్యవహరించిన నాగేంద్రవర్మ కొన్ని రోజులుగా తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండ చూసుకుని కుచ్చుటోపీకి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు 70 లక్షల రూపాయలు మోసపోయానని గ్రహించిన ధనంజయ అనే వ్యక్తి రెండు రోజుల కిందట ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ రాజంపేట అర్బన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో నాగేంద్ర వర్మ మోసం చేశాడన్న విషయం తెలిసి బాధితులు.. ఒక్కొక్కరిగా రాజంపేట అర్బన్ స్టేషన్కు తరలిరావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లో బాధితుల పంచాయితీ ఉదయం కొనసాగుతూనూ వచ్చింది. నాగేంద్రవర్మ బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల రూపాయిలు బాకీ అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు రూ.50 కోట్ల వరకు చిట్టీల లావాదేవీలు జరిపినట్లుగా సమాచారం వస్తోంది. ఈ విషయమై సీఐ నాగార్జునను వివరణ కోరగా నాగేంద్రను విచారణ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఇన్చార్జిపై ఆరోపణలు చేసిన బాధితుడు పోలీసుస్టేషన్లో ఉన్న చిట్టీల వ్యాపారి విషయంలో బాధితుడు జాఫర్ అనే వ్యక్తి పీఎస్ వద్ద టీడీపీ ఇన్చార్జి జగన్మోహన్రాజుపై ఆరోపణలు చేశారు. నాగేంద్రవర్మకు అతని అండ ఉందని తెలిపాడు. కొంత సేపు గడిచాక తిరిగి తనకు తెలియదంటూ, ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి చెప్పమంటే చెప్పానంటూ ప్లేటు ఫిరాయించడం గమనార్హం. స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు టీడీపీ నేతపై ఆరోపణలు చేసిన జాఫర్పై పచ్చమూకలు దౌర్జన్యం చేయడానికి రాజంపేట పట్టణ పోలీసు స్టేషన్కు తరలిరావడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో బాధితునికి, ముఖ్య నేత వర్గీయులకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ నాయకులు దూషణపర్వం కొనసాగించారు. దాదాపు 20 మందికిపైగా పచ్చమూకలు స్టేషన్ ఎదుట వీరంగం సృష్టించారు. రాజంపేటలో సంచలనంగా మారిన వ్యవహారం పోలీసుల అదుపులో చిట్టీల వ్యాపారి నాగేంద్ర స్టేషన్కు తరలివచ్చిన బాధితులు ఉదయం నుంచి రాత్రి వరకు ఠాణా వద్ద ఉద్రిక్తత స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు -
బంగారు హారం అపహరణ
ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ధరించిన బంగారు హారం మంగళవారం చోరీకి గురైంది. బాధిత మహిళ సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన ప్రమీళ అనే మహిళ కడపలో ముద్దనూరుకు చెందిన వారి వివాహానికి హాజరై తిరిగి మధ్యాహ్నం కడపలో బైపాస్ రైడస్ బస్సులో ఎక్కింది. ముద్దనూరులోని 4 రోడ్ల కూడలిలో బస్సు దిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి గమనించగా తన మెడలో ధరించిన సుమారు 3 తులాల బంగారు హారం చోరీకి గురైనట్లు గుర్తించింది. కడప బస్టాండు నుంచే ఇద్దరు మహిళలు తన పక్కలోనే వున్నారని, వారిరువురు కూడా తనతోపాటు బస్సులో ఎక్కి, వారు కూడా ముద్దనూరులోనే దిగి వెళ్లిపోవడం తాను చూశానని ఆమె తెలిపారు. బస్సులో ప్రయాణించే సమయంలోనే వారు హారం కాజేసి వుంటారని ఆమె పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య మైదుకూరు : మున్సిపాలిటీలోని గడ్డంవారిపల్లె వద్ద ఉన్న ఇండస్ట్రీయల్ సముదాయంలో వాచ్మెన్గా పని చేస్తున్న చల్ల ఆంజనేయులు(70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయులు నిత్యం మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. తాను బతకనని భార్య సావిత్రి, కొడుకు లక్ష్మీనారాయణతో చెప్పేవాడు. శుక్రవారం ఓ వేరుశనగ ఆయిల్మిల్లు సమీపంలో విషద్రావణం సేవించగా అక్కడున్న వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మృతి చెందాడు. కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి(40) చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో ఉదయం 5 గంటలకు మృతి చెందారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తి మృతి జమ్మలమడుగు : పట్టణంలోని ధనలక్ష్మీ సినిమా హాల్ వీధికి చెందిన కాకరవాద దస్తగిరి(53) అనే వ్యక్తిని సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పెన్నానదిలో పడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దారిన పోతున్న కొంత మంది వ్యక్తులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది దస్తగిరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున గౌస్పీర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్బన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడిచక్రాయపేట : మండలంలోని ఎర్రబొమ్మనపల్లె గ్రామ సమీపంలో మంగళవారం పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. నాగరాజునాయక్, అనిల్ కుమార్, వెంకట రామిరెడ్డి, అమర, నాగిరెడ్డితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.52,340లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు తెలుగు తమ్ముళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దొరికిన మొత్తం కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు ఆ ప్రాంతీయులు తెలిపారు. -
ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.ముత్యాలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలసి ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటాలకు ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు టి.ముత్యాలరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీకి చెందిన విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం, డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ విలువైన స్థలాలను లీజు పేరుతో ప్రవేటువారికి దారా దత్తం చేయడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని పేర్కొన్నారు. -
పగలంతా ఉక్కపోత.. రాత్రికి కుండపోత !
కడప కోటిరెడ్డిసర్కిల్: పగలంతా ఉక్కపోత... సాయంత్రానికి నల్ల మబ్బుల జాతర.. కాస్త పొద్దు వాలగానే ఒక్కసారిగా కుండపోత.. ఇదీ మంగళవారం కడపలో వాతావరణం. నల్లని మబ్బులన్నీ ఒక్కసారిగా కరిగిపోవడంతో కడప నగరం వర్షంలో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారుల్లోనే వర్షపు నీరు వరదలా పారింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్జీఓ కాలనీ, మృత్యుంజయకుంట, అప్సర సర్కిల్, చిన్నచౌకు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మొత్తం మీద ఓ మోస్తరు వర్షం కారణంగా నగర వాసులకు తిప్పలు తప్పలేదు. కడపలో మురికి నీటితో కలిసి రోడ్డుపై పారుతున్న వర్షపునీరు -
స్మార్ట్ కిచెన్లతో ఆరోగ్యానికి భరోసా
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి శుభ్రమైన,సురక్షితమైన, పోషక విలువలు కలిగిన వేడివేడి భోజనం అందించడమే స్మార్ట్ కిచెన్ల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్మార్ట్ కిచెన్ల నిర్వహణపై సంబంధిత స్టేక్ హోల్డర్స్ కు అవగాహన పెంచే ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్య సభ్యులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఈఓ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ముంగిట పోరు షురూ !
టీడీీపీ వర్సెస్ జనసేన! ● తెరపైకి డిప్యూటీ సీఎం పేరెంట్స్ మీటింగ్ బిల్లుల వివాదం ● స్వయంగా ట్వీట్ చేసిన జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ● పొత్తు ధర్మం ఏనాడైనా పాటించారా? నిలదీస్తున్న జనసేన నాయకులు సాక్షి ప్రతినిధి, కడప: కూటమి ముంగిట కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి రాజ్యసభ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి టీడీపీ, జనసేన మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతేడాది కడపలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు బిల్లులే ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ సమావేశానికి అయిన ఖర్చులు ఎక్కడా? అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే.. అసలు శ్రీనివాసులురెడ్డి ఏనాడైనా పొత్తు ధర్మం పాటించారా?అంటూ జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు. పవన్ను ప్రశ్నించిన వాసు కడప నగరంలోని మున్సిపల్ హైస్కూళ్లో 2024 డిసెంబర్ 7వ తేదీన పవన్కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో పాల్గొన్నారు. ఆ బిల్లులు ఎక్కడా అని శ్రీనివాసులురెడ్డి నేరుగా ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్నే ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనసేన శ్రేణులు దాంతో మాకేం సంబంధం అంటూ, అసలు మీరు కడప జనసేన వారికి చేసిందేమీటంటూ ప్రశ్నిస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పొత్తు ధర్మం విస్మరించడంపై ధ్వజమెత్తారు. బిల్లుల స్వాహాకు యత్నించారని ఎదురుదాడి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కోసం ఏర్పాట్ల ఖర్చు విషయంలోనూ టీడీపీ నేతలు అక్రమాలకు తెరలేపారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎందుకు ఖర్చులు పెట్టాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. అవే బిల్లులు రాబట్టుకునేందుకు టీడీపీ నేతలు ఆర్అండ్బీలో బిల్లులు పెట్టారు. దాదాపు 20 లక్షలు చెల్లించాలని కోరారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అదే బిల్లులను కడప కార్పొరేషన్లోనూ ఎందుకు పెట్టారని జనసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10న నిర్వహించిన కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ సభ ఖర్చుల చిట్టాను ఉంచారు. పాలకవర్గం అంతా పరిశీలించి, తమకు సంబంధం లేని అంశం అంటూ ఆ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఇదే విషయాన్ని జనసేన నేతలు దెప్పి పొడుస్తున్నారు. అక్రమాలకు నిలయంగా నాటి హడావుడి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్తో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, నాటి హడావుడి ఇప్పుడు కూటమిలో చోటుచేసుకున్న అక్రమాలను బహిర్గత పర్చింది. సాక్షాత్తు పవన్ కల్యాణ్ కోసం చేసిన ఏర్పాట్ల బిల్లులనే ప్రభుత్వం ఇవ్వడం లేదనేది ఒక ఎత్తైతే...అసలు ఒకే బిల్లును రెండు శాఖల్లో వసూలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు డిప్యూటీ సీఎంను సైతం రోడ్డుమీదకు తెస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
సుండుపల్లె : జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు అయ్యాయి. సుండుపల్లె మండల పరిధిలోని బూడిదేటిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుణా ల వేడుకల రద్దీ వల్ల ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పీలేరుకు చెందిన మల్లిఖార్జునకు కాలు విరగ్గా, సుండుపల్లెకు చెందిన ఆసీఫ్, బాబ్జాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం – కారు ఢీ కలసపాడు : మండలంలోని పెండ్లిమర్రి వద్ద ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుడిమెరామ్మోహన్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. తన ద్విచక్ర వాహనంలో ఓ పని నిమిత్తం పోరుమామిళ్ళకు బయలుదేరాడు. పెండ్లిమర్రి వద్ద కలసపాడు నుండి పోరుమామిళ్లకు వెళుతున్న ఓ డ్రైవింగ్ స్కూల్ వాహనం రోడ్డుపై ఓ మహిళను తప్పించబోయి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న రామ్మోహన్ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రామ్మోహన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. -
వైన్షాప్లో చోరీ
వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్షాప్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్షాప్లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు. పిచ్చి కుక్క వీరంగంమదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ కంబాలపల్లిలో మంగళవారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది. గ్రామంలో ఊర, పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్ !
● ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుల్లో వైఎస్సార్సీపీ నేతలు ● కడప, కమలాపురం నియోజక వర్గాల్లో నిరసన సదస్సులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసనలో భాగంగా కడపలో జరిగిన సదస్సులో నినదిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు సురేష్ బాబు, పాకా సురేష్, మాసీమబాబు తదితరులు కమలాపురంలో నిరసన సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కడప కార్పొరేషన్: మోసం, అబద్ధాలు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కె. సురేష్ బాబు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. మంగళవారం కడపలోని మున్సిపల్ మైదానం వద్దనున్న ఐఎంఏ హాలులో నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతూ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ కడప నియోజకవర్గ పరిశీలకులు ఎస్. గురుమోహన్, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డాక్టర్ సొహైల్, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నమ్మించి వంచించడం చంద్రబాబుకు బాగా అలవాటన్నారు. ● కమలాపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీ ఎస్ఈసీ సభ్యులు సంబటూరు ప్రసాద్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, ఆరు మండలాల కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రతిసారీ ఆయన అబద్ధాలతోనే అధికారంలోకి వస్తున్నారని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని కోరారు. -
వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 112 కాల్
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి వేగవంతమైన స్పందన, తక్షణమే రంగంలోకి దిగిన ఇద్దరు బ్లూకోట్ పోలీసుల సమయ స్ఫూర్తితో.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడారు. డయల్ 112కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి కేవలం 10 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాలనుకున్న వ్యక్తిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చి శభాష్ పోలీసు అని ప్రజల మన్నననలు పొందారు. పోలీసు వివరాల మేరకు.. కడప నగరం ప్రకాష్నగర్ పరిధిలో ఓ వ్యక్తి చికెన్ సెంటర్ను నడుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరాడు. ఆందోళనకు గురైన ఇంటిలోని కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కమాండ్ కంట్రోల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ హెడ్కానిస్టేబుల్ మూర్తి, కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్రఫితోపాటు బ్లూకోట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి బాధితున్ని గుర్తించే క్రమంలో ట్రాక్ వెంబడి జల్లెడ పడుతూ వెళుతుండగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి లొకేషన్ను గుర్తించి కడప రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గంలో పుట్లంపల్లి సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ట్రాక్ వెంబడి గాలిస్తూ ట్రాక్పై ఉన్న బాధిత వ్యక్తిని తక్షణమే ట్రాక్ నుంచి తప్పించి సురక్షితం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారికి అప్పగించారు. కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి, బ్లూకోట్ సిబ్బంది, హెడ్కానిస్టేబుల్ నజీర్, కానిస్టేబుల్ రంగనాథ్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కడప సెవెన్రోడ్స్ : కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోమ్మల వరప్రసాద్ అన్నారు. కర్నూలులో ఈనెల 6వ తేదిన మృతి చెందిన వీఆర్వో మహమ్మద్ హుసేన్కు నివాళులర్పిస్తూ మంగళవారం సాయంత్రం కడప సచివాలయ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోమ్మల వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు సెక్రటరీలకు పూర్తి స్థాయిలో పదోన్నతి ఇవ్వలేదన్నారు. ఐదు నెలలుగా మున్సిపల్ పన్నుల వసూళ్లు, వివిధ రకాల సర్వేలు, జనాభా లెక్కల సేకరణ, సిటిజన్ ఈకేవైసీ, కౌసలం సర్వే, బీఎల్ఓ డ్యూటీలు తమతో చేయిస్తున్నారని వివరించారు. దీంతో పండుగలు, పబ్బాలు అంటూ ఏమి లేకుండా కుటుంబాలతో గడిపే అవకాశాన్ని కోల్పొతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నాగార్జున, శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంధన ధరల పెంపుపై నిరసన
కడప సెవెన్రోడ్స్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించకుండా మోదీ ప్రభుత్వం అమెరికా కాళ్ల వద్ద సాగిలపడిందని విమర్శించారు. చౌకగా వస్తున్న రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేజీ బేసిన్లోని గ్యాస్ నిక్షేపాల్లో 50 శాతం రాష్ట్ర వాటాను కేంద్రం నుంచి తీసుకు రాలేకపోయిందని ధ్వజమెత్తారు. సీపీఐ నాయకుడు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, కేసీ బాదుల్లా, వెంకట శివ, మద్దిలేటి, సీపీఎం నాయకుడు రామ్మోహన్రెడ్డి, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ – జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం కడప సెవెన్రోడ్స్ : వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం ఆదేశించారు. మంగళవారం కడప జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, స్వచ్ఛరథం కార్యక్రమాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించి లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆదేశించారు.బాధితులకు ఆశ్రయం కడప సెవెన్రోడ్స్ : సోమశిల వెనుక జలాల్లో చేపల వేటకు వెళ్లి దళారుల వలలో చిక్కుకున్న 11 మంది బాధితులకు అధికారులు విముక్తి కలిగించారు. అనంతరం వారిని కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహానికి చేర్చారు. వీరిలో ఏపీకి చెందిన వారే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిని స్వగ్రామాలకు పంపించే వరకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. వీరికి రక్షణగా నందలూరు పోలీసులను ఏర్పాటు చేశా రు. కాగా వీరిని కొందరు దళారులు చేపల వేటకోసమంటూ మభ్యపెట్టి ఇక్కడికి రప్పించుకుని సరైన జీతభత్యాలు ఇవ్వకుండా.. ఇళ్లకు పోనియకుండా వేధిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్, ఏఎస్పీ సూచనల మేరకు వీరికి ఆ శ్రయం కల్పించామని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. యోగాతో ఆరోగ్య భాగ్యం కడప సెవెన్రోడ్స్ : యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్ రాజారెడ్డిక్రికెట్ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఫ్యామిలీ యోగా కార్యక్రమం ఉంటుందని, ఇందులో ప్రతి కుటుంబం ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ యోగాంధ్ర.ఏపీ.జీఓవీ.ఇన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
‘ఆర్టీపీపీలో చిరుత ఆనవాళ్లు కనిపించలేదు’
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచారం చేసిన అనవాళ్లు కనిపించలేదని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆర్టీపీపీలో ఫారెస్ట్, ఎస్పీఎఫ్, విజిలెన్స్, ఆర్టీపీపీ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా చిరుత సంచరించిందని స్థానికులు చెప్పిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీపీపీలో చిరుత పాదముద్రలు, గుర్తులు ఇతర ఆధారాలు లభించలేదన్నారు. ఆర్టీపీపీ పరిసరాలు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణుల సంచారం సాధారణమన్నారు. వారానికి రెండు, మూడు సార్లు రాత్రి వేళల్లో బాణసంచా పేల్చడం ద్వారా అడవి జంతువులు ప్లాంట్ సమీపంలోకి రాకుండా చూడొచ్చన్నారు. రాత్రి షిఫ్టులలో విధులు నిర్వహించే వారు చీకటి ప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దన్నారు. వ్యక్తిగత భద్రత కోసం లాఠీ, కర్రను వెంట ఉంచుకోవాలన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ హనుమన్న, ఎస్పీఎఫ్ ఏసీ క్రిష్ణయ్య, ఆర్ఐ రమేష్, విజిలెన్స్ సీఐ నారాయణయాదవ్ ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. -
మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో మాతృభాష అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ యం.వి రామచంద్రారెడ్డి కోరారు. అపుస్మా కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నాగార్జున మోడల్ స్కూల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలుగు భాష ప్రపంచ రికార్డు’లక్ష్యంతో కూడిన రెండు రోజుల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో వాగ్దేవి బిరుదాంకితుడు భాస్కర్ రాజు, వారి కుమార్తె అశ్విని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తెలుగు భాషను విద్యార్థులకు సులభతరంగా, ఆసక్తికరంగా బోధించే పద్ధతులతోపాటు తెలుగు భాష ప్రపంచ రికార్డు కార్యక్రమం గురించి ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సభకు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రేమాభిమానాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యాలు, అతిథులను అభినందించారు. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అపుస్మా జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి రమణారెడ్డి, అపుస్మా కడప జిల్లా అధ్యక్షుడు బి.గంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, జనరల్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, ట్రెజరర్ నాగసుబ్బారెడ్డి, కడప సిటీ అధ్యక్షురాలు మైథిలి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పద్మనాభరెడ్డి, అపుస్మా జిల్లా నాయకులు రామక్రిష్ణారెడ్డి, రమణారెడ్డి, నిర్మల, షహనాజ్ బేగంతోపాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ సామగ్రిని అపహరించిన నలుగురిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని మట్టిమసీదు వీధికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్ కార్పెంటర్ పని చేసేవాడు. ఇతను ముగ్గురు మైనర్ బాలురులతో కలసి యర్రగుంట్ల, జమ్మమడుగు బైపాస్ రోడ్డులో గత నెల 17న రాత్రి సమయంలో కడ్డీలు కటింగ్ చేసే మిషన్ను దొంగలించాడు. అదే రోజు రాత్రి మరో రెండు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పని ముట్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు షేక్ సాధక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో ఉండగా ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
మైదుకూరులో పట్టపగలే చోరీ
మైదుకూరు : మైదుకూరు పట్టణ పరిధిలోని శ్రీనగరంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామంలోని గోశెట్టి చిన్నరామ తులసయ్య అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఇంట్లో ఉండగానే.. ఇంటి యజమాని రామ తులసయ్య రావడంతో వెనుక వైపున తలుపు తీసుకొని పారితోతుండగా గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామతులయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. కొన్నేళ్ల కిందట ఆయన భార్య రామలక్షుమ్మ మృతి చెందడంతో రామతులసయ్య ఒంటరిగా ఉంటున్నారు. ప్రతి రోజూ మైదుకూరుకు వెళ్లి మధ్యాహ్నం వేళ పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన కుమార్తె ఇంటి నుంచి భోజనాన్ని తీసుకుని ఇంటికి వచ్చేవాడు. సోమవారం ఇంటికి తాళం వేసి యథావిధిగా రామతులసయ్య మైదుకూరుకు వెళ్లాడు. రోడ్డుపై ఇల్లు ఉండటం, ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇదే అదనుగా భావించిన దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఓ గదిలో ఉన్న మూడు బీరువాల తలుపులను అక్కడ ఉన్న స్క్రూ డ్రైవర్తో తెరిచాడు. బీరువాల్లో విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగానే రామతులసయ్య తలుపు తట్టాడు. యజమాని వచ్చినట్టు భావించిన అగంతకుడు వెనుక వైపునున్న తలుపును తెరిచి గోడ దూకి పరుగెత్తాడు. గ్రామస్తులు గమనించి వెంబడించి పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దొంగ జేబుల్లో వెతకగా రామతులసయ్య ఇంట్లో బీరువా నుంచి తీసిన రూ.800 నగదుతోపాటు కొంత బంగారం ఉన్నట్లు గుర్తించారు. తన ఇంట్లో బంగారు ఆభరణాలేవీ పెట్టలేదని, కేవలం కొంత నగదు మాత్రమే దొంగలించాడని ఈ సందర్భంగా రామతులసయ్య తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి నగదు, బంగారాన్ని, దొంగను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. రామతులసయ్య ఇంట్లో చోరీ చేసే ముందు సదరు దొంగ దువ్వూరు మండలంలో చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణను వివరణ కోరగా దొంగను నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన జగన్నాథం కిరణ్గా గుర్తించామని, విచారణ చేస్తున్నామని తెలిపారు.దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు -
టెట్లో అర్హత మార్కులు అందరికీ సమానంగా ఉండాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఒక్కొక్క రాష్టం ఒక్కొక్క విధంగా అర్హత మార్కులు పెట్టాయని, ఇది సబబుగా లేదని ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, ఓసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కందనూరు వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కాలేజీలో వారు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టెట్లో ఓసీలకు 90 మార్కులు(60శాతం), బీసీలకు 75 మార్కులు(50 శాతం), ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు(40 శాతం ) అర్హతగా నిబంధనలు పెట్టి ఓసీలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద ఒకే విధంగా అన్ని వర్గాలకు సమానంగా అర్హత మార్కులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పెట్టి ఓసీలను సర్వ నాశనం చేసారని అన్నారు. ఈ విధానం తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని అన్నారు. టెట్లో పెడితే అందరికి సమానంగా అర్హత మార్కులు పెట్టాలి లేదా ఓసీలకు 15 శాతం అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. -
గాయపడిన వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని వై.కోడూరు గ్రామానికి చెందిన యాపరాల చిన్న నాగిరెడ్డి(83) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఈ నెల 1న నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారుబాలుడికి తీవ్ర గాయాలు మైదుకూరు : విహార యాత్రకు వెళుతున్న ఆ కుటుంబానికి విషాదం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన దాదాపీర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో సొంత ఆటోలో నెల్లూరు జిల్లా కలువాయికి విహార యాత్రకు బయల్దేరారు. అక్కడ అందమైన ప్రకృతి, జలపాతాలు చూసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళుతుండగా బళ్లారి – కృష్ణపట్నం హైవే బైపాస్పై మున్సిపాలిటీలోని సరస్వతి పేట వద్ద ఆటోను కారు ఢీకొన్నది. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా షామీర్ అనే 13 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. -
ప్రైవేట్ పాఠశాలలపై పన్నుల భారం తగదు
కడప ఎడ్యుకేషన్ : ఎప్పుడూ లేని విధంగా ప్రొఫెషన్ టాక్స్ పేరుతో చిన్నా చితక బడ్జెట్ స్కూల్స్కు కూడా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని, ఇది చాలా అన్యాయమని కృస్మా జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి అన్నారు. చిన్న పాఠశాలలు నెలనెలా జీతాలు ఇవ్వడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్ల నుంచి ప్రొఫెషన్ టాక్స్ కట్టించాలి అని చెప్పడం ఎంత వరకు న్యాయం అన్నారు. ఈ విషయమై కమర్షియల్ టాక్స్ శాఖ జారీ చేసిన ప్రొఫెషన్ ట్యాక్స్ నోటీసులపై సోమవారం కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ కేథారేశ్వరావును ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్తో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ చిన్న జీతాలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఇటువంటి టాక్స్ కట్టాలని చెప్పడం వల్ల ప్రైవేట్ టీచర్లు ఆ వృత్తి మానుకొని దినసరి కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల జీతాలు, విద్యుత్ చార్జీలు, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాలు గణనీయంగా పెరగడంతో పాఠశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రొఫెషన్ ట్యాక్స్ భారం తక్కువ బడ్జెట్ పాఠశాలలపై మరింత ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇటువంటి పాఠశాలలకు మినహాయింపు లేదా ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజానికి సేవ చేస్తున్న తక్కువ బడ్జెట్ విద్యాసంస్థల పరిస్థితిని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులను కలసి సమస్యలపై చర్చిస్తామన్నారు. తాము పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన పలువురు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి
కడప సెవెన్రోడ్స్ : డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్కుమార్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకుడు సీహెచ్ వినోద్కుమార్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. డీఎస్సీ ఎలిజబుల్, మెరిట్ జాబితాలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ నిర్వహించాలన్నారు. ఇందుకు బాధ్యులైన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. 1:1 నిష్పత్తి మేరకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు అంటే మోసమని, అదే బాటలో ఆయన తనయుడు లోకేష్ కూడా వెళుతున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు త్యాగరాజు, బాబు, రవి, పెంచలయ్య, ప్రభుదాసు, రత్నకుమారి, మరియలు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆందోళన -
బ్యాంకు అధికారులపై రైతుల ఫిర్యాదు
లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామ అరటి రైతులు సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాలలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఫిర్యాదు చేశారు. గతేడాది మే నెలలో వీచిన ఈదురు గాలులకు గుణకణపల్లెలో భారీగా అరటిపంట నేలకొరిగిందన్నారు. అప్పట్లో ఉద్యాన శాఖ అధికారులు నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. గతంలో ఏపీజీబీ బ్యాంక్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఐఎస్ఎఫ్సీ కోడ్ మారడంతో.. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదన్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించగా తాము రైతుల అకౌంట్ నంబర్లు, బ్యాంకు ఐఎస్ఎఫ్సీ కోడ్ నంబరు ఇచ్చామన్నారు. నష్టపరిహారం డబ్బులు కూడా అందులో పడ్డాయని, బ్యాంక్ అధికారుల తప్పిదంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలుమార్లు బ్యాంక్ చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని గ్రీవెన్స్ సెల్ అధికారి రైతులకు హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మునేశ్వర్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, బెస్త రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 191 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీంతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేత వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 120 మంది పోలీస్ సిబ్బందికి హ్యాట్స్, చలువ కళ్లద్దాలు, మాస్క్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, స్పెషల్బ్రాంచ్ సీఐ సదాశివయ్య, ట్రాఫిక్ సీఐ మర్రి తులసీరామ్, ట్రాఫిక్ ఎస్ఐలు నారాయణ, నాగరాజు, సిద్దయ్య, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బధిరుడిగా నటించి.. నగలు అపహరించి..
● తమిళనాడు వాసి అరెస్ట్ ● రూ.14.50 లక్షల బంగారు, వెండి నగలు స్వాధీనంప్రొద్దుటూరు క్రైం : అతను బధిరుడు కాదు.. అయితే మూగ, చెవిటి వాడిలా నమ్మించి భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన తమిళనాడు వాసిని ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా ఉదయరాజు పాలెం గ్రామానికి చెందిన శివకుమార్ మునియప్పన్ కూలి పని చేస్తుంటాడు. రోజూ కష్టపడ్డా డబ్బులు మిగలడం లేదని భావించిన అతను మూగవాడి ముసుగులో చిన్న చిన్న దొంగతనాలు చేయాలని భావించాడు. అయితే స్థానికంగా తిరిగితే ఎవరైనా గుర్తు పడతారని భావించి, ప్రొద్దుటూరుకు వచ్చాడు. తమిళనాడు నుంచి రైలులో బయలుదేరి ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఎర్రగుంట్లలో దిగాడు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరుకు వచ్చాడు. తన వద్ద ఒక చీటి పెట్టుకున్నాడు. ఒక డాక్టర్ సర్టిఫైడ్ చేసినట్లుగా ఉన్న ఆ చీటిలో ‘ఈ వ్యక్తికి చెవుడు, మూగ. ఇతనికి తల్లిదండ్రులు బంధువులు ఎవరూ లేరు. ఈ చీటి చూసిన వారు తగిన ఆర్ధిక సాయం చేయగలరు’ అని రాసి ఉంది. అతను బంగారు అంగళ్లలోని ఇళ్లకు తిరుగుతూ ఆ చీటీని చూపించేవాడు. చీటి చూసిన కొందరు మానవతా హృదయంతో ఆర్థిక సాయం చేసేవారు. ఇలా ఎవరూ చూడని సమయంలో ఇంట్లోని మొబైల్ ఫోన్లు, వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు దొంగలించేవాడు. ఈ క్రమంలో శంకరయ్య గారి వీధి గుండా వెళ్తున్న అతను గంగనపల్లి శివాజీరావు ఇంట్లోకి వెళ్లాడు. శివాజీరావు భార్య అస్వస్థతతో పడుకొని ఉండగా నేరుగా పూజ గదిలోకి వెళ్లి బంగారుతో అల్లిన రుద్రాక్ష మాల, బంగారు చైన్, బంగారు, వెండి ఉంగరాలను దొంగలించి పారిపోయాడు. శివాజీరావు ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ, నాట్గ్రిడ్ టెక్నాలజీ ద్వారా పోలీసులు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. ఈ క్రమంలో అతన్ని వాసవి సర్కిల్లో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ,14.50 లక్షలు విలువైన బంగారు, వెండి నగలతోపాటు హెచ్పీ ల్యాప్టాప్, ట్యాబ్, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసలుఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరచి నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పూర్తి స్థాయిలో చోరీ సొత్తును రికవరీ చేయడంలో విశేష కృషి చేసిన వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కే బాషా, వై నరసింహనాయుడు, సాయికిశోర్లను ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. -
‘సర్’ త్వరగా పూర్తి చేయండి
సిద్దవటం : మూడు రోజుల్లోగా 95 శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన అధికారులను ఆదేవించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం సబ్ కలెక్టర్ బీఎల్ఓలు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సిద్దవటం మండలంలో ఇప్పటి వరకు 62.5 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తహసీల్దార్ విజయ్కుమార్ సబ్ కలెక్టర్కు వివరించారు. కిచెన్ షెడ్డును త్వరగా పూర్తి చేయాలిమండల కేంద్రమైన సిద్దవటంలో నిర్మిస్తున్న కిచెన్షెడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన కాంట్రాక్టర్ను ఆదేశించారు. సిద్దవటం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన నిర్మిస్తున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కిచెన్ షెడ్లను నిర్మిస్తోందన్నారు. కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.రాజంపేట సబ్ కలెక్టర్ భావన -
నేడు ‘డయల్ యువర్ సీఎండీ
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి డీఆర్వో మల్లికార్జునుడుకడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ● కలెక్టరేట్లోని సభా భవన్లో సోమవారం ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని డీఆర్వో సూచించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం పదిలం మదనపల్లె సిటీ : క్రీడలతో మానసికోల్లాసం, మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని బీటీ కాలేజీ మైదానంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు, సైక్లింగ్ వల్ల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.సైక్లింగ్ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో రిటైర్డు డీఎస్డీఓ సయ్యద్బాషా, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
బైక్పై నుంచి పడి యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మండలం మాచుగారిపల్లె వద్ద బైక్పై నుంచి కింద పడి కొండెపోగు కళ్యాణ్కుమార్(32) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠం అంబేడ్కర్ నగర్కు చెందిన కళ్యాణ్ కుమార్ కడపలోని ఓ బ్యాంక్లో అటెండర్గా పని చేస్తుంటాడు. అక్కడే ఉంటూ వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి తన బంధువు భాస్కర్తో కలిసి బైక్పై కడప నుంచి మైదుకూరు మండలంలోని జీవీ సత్రం మీదుగా ఇంటికి బయల్దేరాడు. మాచుగారిపల్లె వద్ద బైక్ అదుపు తప్పడంతో కళ్యాణ్ కుమార్ బైక్పై నుంచి బోర్లా కిందపడ్డాడు. ముఖం, ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై మృతి చెందాడు. సంఘటనపై మృతుడి తమ్ముడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఉజ్వల భవితకు వారధి
డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్, లాయర్, ఛార్టెర్డ్ అకౌంటెంట్, టీచర్, టెక్నీషియన్, సివిల్ సర్వెంట్, గ్రూప్ అధికారి.. ఇలా మీ లక్ష్యం ఏదైనప్పటికీ.. వాటిని చేరుకోవడానికి ఇంటర్మీడియట్ వారధిగా నిలుస్తుంది. ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా కూడలి లాంటిది ఇంటర్. అందుకే భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు ఇంటర్ను బాగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అందిస్తున్న కథనం. రాజంపేట టౌన్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులది కౌమార దశ. ఈ దశలో ఉండే వారి ఆలోచనలు, ఉరకలేసే ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, చిన్నపాటి విషయాలకే హర్ట్ అయ్యే సందర్భాలు, చదువుకోవడాలు, కాలేజీకి డుమ్మా కొట్టడాలు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ నుంచే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే టెన్త్ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన విద్యార్థులకు ఇంటర్మీడియట్లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి విద్యార్థిలో అదేదో తెలియని అనుభూతి ఉంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్నీ కూడా విద్యార్థులకు కొత్తగాను, వింతగాను అనిపిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికీ అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమి తెలియని తనం ఆవహిస్తుంది. విద్యార్థులు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది. పరాజయం బాటలో నడుస్తుంది. తొలిసారి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. జీవితంలో కీలక అడుగులన్ని ఇంటర్మీడియట్లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడి తప్పి అంధఃపాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్లోనే బీజం పడుతుంది. హైస్కూల్ విద్యతోనే ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్మీడియట్లో మరింత పురి విప్పుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో ప్రధానమైనదని విద్యావేత్తలు చెబుతున్నారు. చదువుపైనే దృష్టి సారించాలి ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. అందువల్ల వారి ఆలోనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు. అయితే మనసు అదుపులో ఉంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అందుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేల్లా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి. స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం ప్రధానంగా ఇంటర్మీడియట్లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇంటర్లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టెన్త్ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గం వైపే పయనిస్తారు. అయితే ఇంటర్ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పి తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే.. పిల్లలు కూడా చెడ్డవారితో స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. చెడ్డవారితో స్నేహం ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడేందుకు అడ్డుపడుతుంది. మొదలైన ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు గాడి తప్పితే జీవితమే గందరగోళం క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉజ్వల భవిష్యత్తు -
గరం గరం!
రాజ్యసభ సీటు దక్కకపోవడంపై వాసు కినుక సోషల్ మీడియాలో శ్రీనివాసులరెడ్డి పోస్టు హల్చల్ వాసును అనునయించిన తెలుగుతమ్ముళ్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు మూకుమ్మడి రాజీనామా చేయాలనే దిశగా ఆలోచనలు అధిష్టానం వాకబు చేయడంతో వెనక్కు తగ్గిన వైనం సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం మొండిచేయి చూపించింది. రాజ్యసభ సీటుపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. తుది వరకు సభ్యత్వం ఆశించి ఆపై భంగపాటుకు గురయ్యారు. వెరశి 13ఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నా అధిష్టానం నిర్ణయం కలత కలిగించిందని, అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన ఘటనగా మిగిలిపోతుందని పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈపరిస్థితులల్లో కడప తెలుగుతమ్ముళ్లు గరంగరంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతోందని గత కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కారణాలేమైనప్పటికీ టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తొలుత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.తర్వాత పొలిట్బ్యూరో సభ్యుల జాబితా నుంచి గెంటేశారు. జోనల్ కోఆర్డినేటర్ పదవితో మాత్రమే సరిపెట్టారు. అయినప్పటీకీ ఎలాంటి అసంతృప్తి బహిర్గత పర్చకుండా సైలెంట్గా ఉండిపోయినా, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో కడప నియోజకవర్గంలో ఆయన అభిమానులు సైతం కినుక వహించారు. మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే దిశగా అనుచరులు అడుగులు వేశారు. అధిష్టానం నిశితంగా పరిశీలన.. టీడీపీ అధిష్టానం తెలుగుతమ్ముళ్ల అడుగులను నిశితంగా పరిశీలన చేసినట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి అనుచరుల ప్రత్యేక సమావేశం గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆపై పొరుగున ఉన్న నేతలను సైతం పురమాయించినట్లు సమాచారం. సమావేశం వీగిపోయేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ అధిష్టానం డైరెక్షన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులల్లో శ్రీనివాసులరెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయరాదని, అధిష్టానం గురించి మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతమ్ముళ్లు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయాలని భావించినప్పటికీ శ్రీనివాసులరెడ్డి వారిని కట్టడి చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు అనేకం. సమావేశం నిర్వహిస్తే పొరుగు నేతల ప్రమేయం కడపలో పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో టీడీపీకి అన్నీ తానై వ్యవహారించిన శ్రీనివాసులరెడ్డికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరి మద్దతు లభించడం లేదు. ప్రత్యేకించి అధిష్టానం ఎదుట శ్రీనివాసులరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరిన సందర్భమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుచరుల సమావేశాన్ని సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
రీచార్జ్ బోర్వెల్స్ ప్రాజెక్టు విజయవంతం
● మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఈ వినూత్న ప్రాజెక్టుకుర శీకారం: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ● ప్రాజెక్టు విజయవంతంపై రైతుల హర్షంలింగాల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతోనే మండలంలోని గుణకనపల్లెలో రీచార్జ్ బోర్ల ప్రాజెక్టును ప్రారంభించామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లింగాల మండలం గుణకనపల్లె గ్రామంలో ఆదివారం భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుణకనపల్లె గ్రామానికి కృష్ణా జలాలను తరలించేందుకు సుమారు రూ. 5 కోట్ల నిధులు వెచ్చించారన్నారు. దీంతో ప్రత్యేక పంపుహౌస్, మోటార్లు, పైపులైన్ పూర్తి చేశామన్నారు. సుమారు 100 మీటర్ల మేర అక్కడి రైతులు భూ సేకరణకు అంగీకరించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. తాజాగా తమ గ్రామానికి కృష్ణా జలాలను తరలించాలని అక్కడి ప్రజలు, రైతులు, కుడికాలువ అధికారులు కోరడంతో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని ఎంపీ తెలిపారు. ఆయన ఆదేశాలతో సుమారు రూ. 15 లక్షల ఎంపీ నిధులను వెచ్చించి వంద మీటర్ల పైపులైన్ ఏర్పాటుతోపాటు ఐదు బోరుబావులను తవ్వించామని వెల్లడించారు. బోరు బావులకు ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలను బోరు బావుల్లోకి పంపించా మని వివరించారు. బోరు బావుల్లో సుమారు 20–30 అడుగుల సొరంగమార్గాలు ఏర్పడ్డాయని, పొడవు కిలోమీటర్ల మేర ఉండవచ్చన్నారు. ఈ బోరు బావుల్లోకి పంపిస్తున్న కృష్ణా జలాలు సొరంగ మార్గాల ద్వారా వెళ్లి పరిసర ప్రాంతాలు, గ్రామా ల్లోని రైతుల బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని వివరించారు. చిత్రావతి నుంచి పాపాగ్ని నది వరకు భూగర్భంలో ఉన్న సొరంగ మార్గాలలో 120 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా కృష్ణా జలాలు బోరు బావుల ద్వారా సొరంగ మార్గాల్లో వెళుతుండడంతో గుణకనపల్లె, రామట్లపల్లె గ్రామాలలో భూగర్భజలాలు పెరిగాయని అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి కొత్త ప్రాజెక్టుకు జీవం పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ చైతన్యరెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బాబురెడ్డి, పులివెందుల నియోజకవర్గ రైతు విభాగ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మునీశ్వర్రెడ్డి, శేఖర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, కొండారెడ్డి, మునిరెడ్డి, గోపాల్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, మునికిట్ట, ప్రతాపుడు, గూడు సాహెబ్, రఫీ, బాబా హుసేన్, గంగాదర్రెడ్డి, రవి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, ఏవీ శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీను, శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి, మోహన్రెడ్డి, రఘునాథరెడ్డి,మండలంలోని వివిధ గ్రామా ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛ పరిమితంగానే ఉండాలి
టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. విద్యార్థులకు కాలేజీ లైఫ్ ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. అయితే విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఉన్నత చదువులు చదివి, నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ పరిమితంగా ఉంటేనే పిల్లలు సన్మార్గం వైపు పయనించి చదువులో రాణించగలరు. – బండి చంద్రమోహన్, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట -
ఆపేదేల్యా!
● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పచ్చ నేతలు ● ఆగస్టు 15వరకు ఇసుక తరలించవద్దన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ● పాపాఘ్ని, పెన్నా నదులను గుళ్ల చేస్తున్న వైనం ● కన్నెత్తి చూడని పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులుసాక్షి ప్రతినిధి, కడప : ‘నదీగర్భాల్లో ఇసుక రవాణా ఆగస్టు 15వరకూ నిషేధిస్తున్నాం.. ఇదివరకూ డంప్ చేసిన యార్డుల ద్వారా ఇసుక తీసుకెళ్లాలి.. ’ఈ నెల 6వ తేదీ శనివారం జరిగిన జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు ఇవి. పచ్చ నేతలకు ఈ మాటలు చెవికెక్కలేదో.. అధికార టీడీపీ నేతలకు కలెక్టర్ మినహాయింపు ఇచ్చారో గానీ.. ఇసుక అక్రమ రవాణా ఎక్కడా ఆగడం లేదు. పట్టుమని 24 గంటలు కూడా ఇసుక తవ్వకుండా ఉండలేకపోయారు. ఇక మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం కలెక్టర్ ఆదేశాలను అమలు చేయలేకపోయారు. ఫలితంగా పెన్నా, పాపాఘ్ని నదులు గుల్లవుతున్నాయి. అధికార నేతల దోపిడీ పర్వానికి విలవిల్లాడుతున్నాయి. ఒళ్లంతా గుంతలు తేలి..తడారి ఎడారిగా దర్శనమిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సర్కార్లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇసుక అక్రమ ఆదాయ వనరుగా మారింది. ఉచిత ఇసుక మాటున నదులు లూఠీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పాపాఘ్ని, పెన్నా, చిత్రావతి, చెయ్యేరు నదులను తెలుగుతమ్ముళ్లు చెరబట్టారు. పేరుకే ప్రభుత్వ రీచ్లు, ఆయా రీచ్ల నుంచి అనధికారికంగా నిత్యం వేలాది టన్నులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కమలాపురం, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. అక్రమ సంపాదన కోసం పోటీ పడుతోన్నారు. ప్రభుత్వ రీచ్లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, కొండూరు, సంబటూరు ఇసుక రీచ్లు నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను దక్కించుకున్న తెలుగుతమ్ముళ్లు ఆ మాటునా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇదే తంతు కొండాపురం, సిద్దవటం ప్రాంతాల్లో కూడా తెరపైకి వస్తోంది. అధికారిక రీచ్లను అడ్డుపెట్టుకొని అనధికారిక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు.అక్రమ రవాణాకు అడ్డుకట్టేదీ? వర్షాభావ దుస్థితి, రాబోవు రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ శ్రీధర్ ఆగస్టు 15 వరకూ ఇసుకను నదీ గర్భాలల్లో తరలించవద్దని ఆదేశించారు. ఆమేరకు సాండ్ కమిటీ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాపాఘ్నిలో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడలేదు. మారెళ్లమడక, సోగలపల్లె, నందిమండలం, యర్రబల్లె, పైడికాల్వ, సంబటూరు ప్రాంతాల నుంచి, పెన్నా నదిలో కొండాపురం, సిద్ధవటం ప్రాంతాల నుంచి యధేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రీచ్లతో నిమిత్తం లేకుండా అనధికార రీచ్ల నుంచి కూడా తెలుగుతమ్ముళ్లు యధేచ్ఛగా అక్రమంగా తరలించకు వెళ్తున్నారు. యంత్రాలతో లోడింగ్ చేసి, భారీ టిప్పర్లతో ఇసుక కన్పించకుండా పట్ట కట్టుకొని బెంగుళూరు పట్టణానికి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నదుల్లో అధికారిక రీచ్లల్లో ఇసుక అలాగే కొనసాగిస్తూ ఆ మాటున పొరుగు గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటన కమలాపురం నియోజకవర్గంలో యధేచ్ఛగా కొనసాగుతోంది. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికై నా అక్రమార్కుల నుంచి నదులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
పందుల దొంగల ముఠా అరెస్ట్
● రూ.10 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం పులివెందుల రూరల్ : పట్టణంలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి వద్ద పందులు, గొర్రెల దొంగల ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్బన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సీఐ శ్రీరామ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో.. పందులు, గొర్రెల దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల నగదు, బుల్లెట్, బొలెరో వాహనాలతో పాటు పందులు, గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగల ముఠాను శనివారం పార్నపల్లె రోడ్డులోని కోతి సమాధి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులలో అనంతపురం జిల్లాకు చెందిన ఎరుకుల శ్రీరామ్, భాస్కర్, చంద్రశేఖర్, చిరంజీవి, రాజు, భరత్కుమార్ ఉన్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం చోరీ కేసులో శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఇర్ఫాన్ అను కూబాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బోడా శ్రీను, విజయ్ పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐలు సిద్దార్థ, వర్మ, పోలీసులు పాల్గొన్నారు. మదనపల్లె టౌన్ : అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మదనపల్లె మండలం నడింపల్లి పంచాయతీ జంగాలపల్లికి చెందిన గంగప్ప భార్య మునెమ్మ (80) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. -
విచ్చలవిడి దోపిడీ..
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్పైపు అడుగు లేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి ‘క్యాస్’ చేసుకుంటున్నాయి. అడ్మిషన్ టెస్టుల నుంచే దోపిడీ పర్వం మొదలుపెట్టాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్, షూ వంటి వాటిని తమ పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్ ధరలకంటే అధిక రేట్లతో విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాలపై పలువురు విద్యార్థి సంఘ నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే విమర్శలు మెండుగా వినిపిస్తున్నాయి. -
పాముకాటుతో దంత వైద్యురాలు మృతి
గాలివీడు : మండల పరిధి కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన దంత వైద్యురాలు గొట్టివీటి శివనాగమణి(34) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొట్టివీటి శ్రీరాములు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అయిన శివనాగమణి బీడీఎస్ విద్యను పూర్తి చేసి గుర్రంకొండ, తంబళ్లపల్లి, గాలివీడు ప్రాంతాల్లో ప్రైవేట్ దంత వైద్యశాలలను నిర్వహిస్తూ వైద్య వృత్తిలో స్థిరపడింది. వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం తండ్రి సంరక్షణలో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా ఆమెను పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, విష ప్రభావం శరీరంలోని కీలక భాగాలకు వ్యాపించడంతో శనివారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివనాగమణి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మైదుకూరులో యువకుడి దారుణ హత్య
మైదుకూరు : మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సంపంగి నాగేంద్ర(37) అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరు అర్బన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేంద్ర ఆటో డ్రైవర్గా, బేల్దారిగా పని చేస్తుంటాడు. ఆయనకు ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన జ్యోతి అనే యువతితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల నయనిక అనే కుమార్తె ఉంది. రోజూ మద్యం తాగుతుండటంతో జ్యోతి నాగేంద్రతో గొడవపడి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. మద్యం తాగాక నాగేంద్ర రోజూ కాలనీలోని గుడి ఆవరణలో ఉన్న అరుగుపై పడుకునేవాడు. కాలనీకే చెందిన గాలి సుదర్శన్రెడ్డి అనే యువకుడితో కలిసి తిరిగేవాడు. సుదర్శన్రెడ్డి తల్లి గురించి నాగేంద్ర చెడుగా ప్రచారం చేసేవాడు. తన తల్లిపై దుష్ప్రచారం మానుకోకపోతే నాగేంద్రను ఎప్పుడైనా చంపుతానంటూ సుదర్శన్రెడ్డి చెప్పేవాడు. ఆ ప్రకారమే శనివారం రాత్రి గుడి ఆవరణలోని అరుగుపై నిద్రపోతున్న నాగేంద్రపై ఆదివారం తెల్లవారుజామున సుదర్శన్రెడ్డి మచ్చుకత్తితో దాడి చేసి ముఖంపై పలుమార్లు నరికాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగేంద్ర తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ అలియాస్ చిన్న షకీలా.. సుదర్శన్రెడ్డి తన అన్నను నరుకుతున్నాడని చూసి గట్టిగా కేకలు వేసి వెంబడించగా అతను పారిపోయాడు. నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేసి సుదర్శన్రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
విత్తన ఎంపికే కీలకం
● నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు ● చీడపీడలకు చెక్ ● ఖరీఫ్లో 79,773 హెక్టార్లలో సాగు కడప అగ్రికల్చర్: పంటలసాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతోపాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపికతో చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో నిర్లక్ష్యం చేయకుండా..వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదులుకుని దిగుబడి వరకు.. పెట్టిన పెట్టుబడి ఖర్చు, రైతుల కష్టం నేలపాలు అవుతుంది.అందువల్ల పంటల సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ప్రారంభమైన ఖరీప్ సీజన్... రాష్ట్రానికి మరో వారం రోజుల్లో రుతుపవనాల రానున్నాయి. రుతుపవనాలతో సంబంధం లేకుండా ఇప్పటికే జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కూడా కాడి, మేడి సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దుక్కులు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 79,773 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీతో మంజూరు చేసింది. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన సిద్దవటం, చెన్నూరు. కమలాపురం, చాపాడు తదితర మండలాల పరిధిలో నీటి వసతి ఉన్న వారు వరినారు సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వేరుశనగ సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు.అయితే వ్యవసాయ అధికారుల సర్టిఫైడ్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. దీంతోపాటు కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంటపేరు సాగు (హెక్టార్లలో) వరి 33078 కంది 5992 మొక్కజొన్న 1495 మినుము 3745 వేరుశనగ 4446 ఉల్లి 5203 సోయాబీన్ 1074 సన్ఫ్లవర్ 837 సజ్జ 994 కొర్ర 569 జొన్న 428 వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తనాలను కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటినవి ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. విత్తనాల సంచిపైన సీల్ ఉందా, లేదా అని చెక్ చేసుకోవాలి. రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలకశాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థల్లో.. రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థలు, ఏఆర్ఎస్ సెంటర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అక్కడ వీలుకాకపోతే లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలకశాతం చెక్ చేసుకోవాలి.మొలక శాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. – ప్రభాకర్రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఊటుకూరు, కడపడీలర్లు వద్ద విత్తనాలు కొనుగోలు చేసే రైతులు డీలర్లను అడిగి బిల్లులు తీసుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు వీటిని భద్రంగా దాచుకోవాలి. పంటలో పూత పిందె, దిగుబడిలో తేడా వస్తే స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – మట్టా. సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 146 కేసులు నమోదు చేసి, రూ. 38,710 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత
కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వినయ్కుమార్ సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’పై ఆదివారం కడపలోని గాంధీనగర్ హైస్కూల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వినయ్ కుమార్ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్ల పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చేతులు కడుక్కోవాలన్నారు. బయటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన లేదా కాలం తీరిన ఆహారం తీసుకోకూడదు సూచించారు. అలాగే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్లైన్ నెంబర్ 1098, ఉచిత న్యాయ సాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారి దృష్టికి తీసుకొని రావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారులు హరిత, రమేష్ కుమార్రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ చంద్రకాంతమ్మ, సంత, ప్రవీణ్, కడప మండలంలోని హోటల్స్ సిబ్బంది, పార లీగల్ వాలంటీర్స్ దశరథరామిరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆల్విన్
● ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని ఆల్విన్ వెనుకవైపు నుంచి ఢీకొనడంతో ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామానికి చెందిన కట్టా వాసుబాబు(39) తన స్వగ్రామం నుంచి మదనపల్లెకు టమాట లోడు తీసుకువచ్చేందుకు బయలుదేరాడు. బద్వేలు సమీపంలోకి వచ్చేసరికి చెన్నంపల్లె వద్ద రోడ్డు పక్కన ఓ లారీ ఆపి ఉండటంతో.. అర్ధరాత్రి పూట సరిగా కనిపించక వెనుకవైపు నుంచి లారీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో వాసుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించి వాసుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు. మైదుకూరు : జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరులోని కొత్త కొట్టాలు వీధికి చెందిన పసుపుల నరసింహ, నాగేళ్ల పవన్ కుమార్ అనే వారు దువ్వూరు నుంచి మోటార్ బైక్పై మైదుకూరుకు వస్తుండగా శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సంఘటనలో నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే విధంగా దువ్వూరుకు చెందిన పున్నం నడిపి సుబ్బరాయుడు, అతని కుమారుడు రామసుబ్బయ్య మైదుకూరు నుంచి ఎర్రగడ్డల బస్తాలు తీసుకుని ఆటోలో వెళుతుండగా.. వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరికీ గాయాలయ్యాయి. కుక్క అడ్డు రావడంతో.. కడప అర్బన్ : కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని బంజారాహిల్స్లో నివసిస్తున్న షేక్ ఖాసిం సాహెబ్, భార్య షేక్ రహజాన్, కుమారుడు అబ్బాస్ అలీ, కుమార్తె ఆయేషాలు కారులో కడపకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. కడపలో బంధువుల ఇంటికి వివాహానికి హాజరు కావాలనుకుని వచ్చారు. వినాయక నగర్ దగ్గరికి వచ్చేసరికి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రహజాన్, అబ్బాస్ అలీ, ఆయేషాలు గాయపడ్డారు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుజ్జగింపుల పర్వం.. పవన్పై పోస్ట్ డిలీట్!
కడప: రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి ఒకరు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఒకటి. ఈ పోస్ట్ను టీడీపీ అధిష్టానం డిలీట్ చేయించింది. ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ ట్వీట్ కనుమరుగు కావడంతో ఇది కాస్తా బుజ్జగింపు పర్వం చర్చకు దారి తీసింది. టీడీపీ అధిష్టానం ఆశావహులను బుజ్జగించే క్రమంలోనే శ్రీనివాసులరెడ్డి చేత ఆ పోస్ట్ డిలీట్ చేయించిందనే చర్చ నడుస్తోంది. మరొకవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా శ్రీనివాసులురెడ్డి ప్రకటించడంతో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైందనేది విశ్లేషకుల మాట.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. డిసెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ కడప పర్యటన నేపథ్యంలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ మీటింగుకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ శ్రీనివాసులురెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్ అండ్ బి శాఖలో బిల్లు పెండింగ్ ఉందన్న శ్రీనివాసులురెడ్డి.. పవన్ను సూటిగా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త సొంత నిధులు ఖర్చు చేస్తే 18 నెలలుగా బిల్లులు ఇవ్వరా అని నిలదీశారు. నెలలు తరబడి బిల్లు పెండింగులో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదే సమయంలో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కూడా టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. ఇదీ చదవండి..చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై పెట్టిన పోస్ట్ ఇది..గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026 -
చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. లాబీయింగ్ చేసే వారికే అవకాశాలుంటాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.రాజ్యసభ సీటు రాకపోవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అలకబూనారు. సోషల్ మీడియాలో శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిని వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపించింది. కష్టపడిన నేతలకు గుర్తింపు లేదంటూ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. కాగా, ఇటీవలే ఆయనకున్న పోలిట్ బ్యూరో సభ్యుడి పోస్ట్ తీసేసి జోనల్ కో ఆర్డినేటర్ స్థాయికి తగ్గించింది. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026 -
అలసత్వం వద్దు.. అప్రమత్తతే ముద్దు
కడప ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు (అయ్యవార్లు) పాఠశాలల నిర్వహణ పట్ల కాసింత ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి సెలవులు మొత్తం పాఠశాలలు మూసి ఉంచడంతో చెత్తాచెదారం, దుమ్ము, ధూళి అంతా పేరుకుపోయి ఉంటుంది. దీనికితోడు ఇటీవల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసాయి. ఈ కారణంగా తరగతి గదులన్నీ వర్షపు నీరు, దుమ్ముతో నిండి ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేటప్పుడు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం నెలకొంటుంది. విద్యుత్ భద్రత – భవన పటిష్టత : సెలవుల్లో విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకడం లేదా వర్షాల తేమ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, లైట్ల వైరింగ్ను ఎలక్ట్రీషియన్తో చెక్ చేయించాలి. భవన మరమ్మతులు : మే నెలలో కురిసిన వర్షాలకు భవనం ఎక్కడైనా లీకేజీలు ఇస్తోందా, గోడలు లేదా పై కప్పుల నుంచి సిమెంట్ ఊడిపడుతుందా అనేది గమ నించి, అవసరమైన తక్షణ మరమ్మతులు చేపట్టాలి. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం : జిల్లాలో ఇంకా ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్లాస్ రూమ్స్లో ఫ్యాన్లు సరిగ్గా తిరిగేలా చూడాలి. ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్ను సిద్ధంగా ఉంచుకోవాలి. ఒత్తిడి లేని వాతావరణం : పాఠశాలలు తెరిచిన మొదటి వారం పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచకూడదు. సెలవుల్లో వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎలా ఎంజాయ్ చేశారనే అంశాలపై ఆటపాటలు, కథల ద్వారా చర్చిస్తూ వారిని క్రమంగా పాఠశాల వాతావరణానికి అలవాటు చేయాలి. జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి పాఠశాలల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవాలి. పిల్లలు బడికి వచ్చే సమయానికి పాఠశాలల్లో పూర్తి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలి. – షేక్ షంషుద్దీన్,డీఈఓ, కడప బడి గంట మోగేలోపే పాఠశాలల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి చెత్తాచెదారం, దుమ్ము, ధూళిపై సెలవుల్లోనే సమర శంఖం తొలిరోజు అడుగుపెట్టే విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి పిల్లల శారీరక, మానసిక భద్రతపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలుఆట స్థలం నిర్వహణ పొదల తొలగింపు : నెలన్నరపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో మైదానంలో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తక్షణం తొలగించాలి. లేనిపక్షంలో విషపురుగులు, పాములు వంటివి చేరే ప్రమాదం ఉంటుంది. సామాగ్రి భద్రత : పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తుప్పు పట్టకుండా బలంగా ఉన్నాయో లేదో ఉపాధ్యాయులు భౌతికంగా తనిఖీ చేయాలి.ఉపాధ్యాయులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గదుల శానిటైజేషన్ : సెలవుల్లో మూసి ఉంచిన క్లాస్ రూమ్లు, డెస్కులు, ల్యాబ్లు, లైబ్రరీ, స్టాఫ్ రూమ్లను దుమ్ము, ధూళి లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణ : పాఠశాలలోని బాత్రూమ్స్, మరుగుదొడ్లను ఫినాయిల్ లేదా యా సిడ్తో కడిగించాలి. పిల్లలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం నీటి వసతి ఉండేలా రన్నింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. చెదలు మందులు, క్రిమిసంహారక చర్యలు: తరగతి గదుల్లో చేరిన చెదలు, బూజును పూర్తిగా శుభ్రం చేసుకుని, వాటి నివారణకు ముందుగానే మందు పిచికారీ చేసుకోవాలి. ఫాగింగ్ – బ్లీచింగ్ : వర్షాకాలం కూడా ప్రారంభమయ్యే సమయం కాబట్టి దోమలు చేరకుండా గదుల్లో, ఆట స్థలంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదా ఫాగింగ్ చేయించడం ఎంతైనా మంచిది. వాటర్ ట్యాంకుల శుభ్రత : పాఠశాలలోని తాగునీటి ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్లను పూర్తిగా కెమికల్స్తో క్లీన్ చేయించి, స్వచ్ఛమైన నీరు లభించేలా చూడాలి. పైపుల్లో చాలా రోజులుగా నిలిచిపోయిన పాత నీటిని పూర్తిగా వదిలేసి, కొత్త నీటితో నింపాలి. -
ఎరువు కోసం ఏకరువు
● ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం! ● జిల్లాలో విత్తనాలు, ఎరువుల తీవ్ర కొరత ● ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని, గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నదాతల ఆగ్రహంకడప అగ్రికల్చర్ : -Q-È‹œ ïÜf-¯Œl {´ëÆý‡…¿ê°MìS Ð]l¬…§ól hÌêÏÌZ° OÆð‡™èl-¯]l²-ÌS¯]l$ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ¿ýæÄ¶æ$ò³-yýl$-™èl$-¯é²Æ‡$$. JMýS-OÐðlç³# Ðé™é-Ð]l-Æý‡×æ Ð]l*Æý‡$µ-ÌS™ø ç³…rË$ çÜÇV> ç³…yýl-MýS-´ùÐ]l-yýl…, Ð]l$ÆøOÐðlç³# ç³…yìl¯]l ç³…rMýS$ {糿¶æ$™èlÓ… Wr$t»êr$ «§ýlÆý‡ MýSÍ-µ…-^èl-MýS-´ù-Ð]lyýl…™ø Cç³µ-sìæMóS Ð]lÅÐ]l-ÝëĶæ$… ¿êÆý‡…V> Ð]l*Ç…-¨. D {MýSÐ]l$…ÌZ QÈ‹œ ò³r$t-º-yýl$ÌS MøçÜ… G§ýl$-Æý‡$-^èl*çÜ$¢¯]l² çÜÐ]l$-Ķæ*°MìS M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ºÝë¢Oò³ ₹200 ¯]l$…_ ₹450 Ð]lÆý‡MýS$ ò³Æý‡-VýS-yýl…™ø MýSÆý‡Û-MýS$Ë$ Ð]l$Ç…™èl MýS$…W´ù-™èl$-¯é²Æý‡$. ïÜf-¯Œl {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ð]l#™èl$¯é² ¯ólsìæMîS Ñ™èl¢-¯éË$, GÆý‡$-Ð]l#Ë$ OÆð‡™èl$-ÌSMýS$ A…§ýl$-»ê-r$ÌZMìS Æ>Ð]l-yýlÐól$ Ìôæ§ýl$. ©…™ø D Hyé¨ QÈ‹œ ÝëVýS$ {ç³Ô>²-Æý‡¦-MýS…V> Ð]l*Ç…-¨. లక్షలాది ఎకరాల్లో సాగు.. నేటికీ దొరకని విత్తనాలు! జిల్లాలో లక్షలాదిమంది రైతులు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదంతో పాటు జొన్న, వరి, అలసంద, ఉలవ తదితర పంటలు సాగు కానున్నాయి. భూములు సిద్ధమైనా ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, సరిపడా ఎరువులు ముందస్తుగా సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధర కరువు.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు గత రబీ సీజన్ లో నీటి వసతి ఉండి కష్టపడి పంటలు పండించినా.. వాటికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ఇప్పు డు ఎరువుల ధరలు కూడా పెంచితే తాము వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని గాలివీడు పరివాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి ఇప్పటికై నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా అవసరమైన వేరుశనగ, ఇతర విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ కాకుండా పాత ధరలకే ఎరువులు లభించేలా కఠిన నిఘా పెట్టాలని కోరుతున్నారు.పాత స్టాక్ను పాత ధరలకే అమ్మాలి రైతులు కూడా బస్తాపై ఉన్న ధరనే చెల్లించాలి జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు కడప అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిందని, ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు అన్నారు. అయితే పాత స్టాక్ను మాత్రం పాత ధరలకు అమ్మాలని డీలర్లు, వ్యాపారులకు సూచించారు. రైతులు కూడా బస్తాపై ఉన్న రేట్లను మాత్రమే చెల్లించాలని తెలిపారు. అలాగే కొత్త స్టాక్ను మాత్రం పెంచిన ధరలను అమ్మాలని డీలర్లకు సూచించారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షించమని ఏడీఏలు, వ్యవసాయ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. -
పిల్లల్లో మానసిక లోపాలను గుర్తించేందుకే ‘నవచేతన’
కమలాపురం : ఆరేళ్లలోపు చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన అనే ఏఐ యాప్ను రూపొందించిందని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా ఐసీడీఎస్ సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణలో చెబుతున్న అంశాలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో స్థూల, సూక్ష్మ, చలన నైపుణ్యాలు, భాషా వికాసం, జ్ఞాన వికాసం, సామాజిక భావోద్వేగాల వృద్ధిని నవచేతన ద్వారా అంచనా వేస్తామన్నారు. లోపాలను గుర్తించి ముందస్తు జోక్యం ద్వారా సరిచేయవచ్చన్నారు. సీడీపీఓ శ్రీలతారెడ్డి, అర్బన్ పీహెచ్సీ డాక్టర్ ముని శేఖర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకట సుబ్బమ్మ, పార్వతి, లక్ష్మీదేవి తదితరులు సిబ్బందికి నవచేతన యాప్లో చిన్నారుల పై చేసిన సర్వే అంశాల నమోదు పై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.ఐసీడీఎస్ పీడీ రమాదేవి -
బైక్ డివైడర్ను ఢీకొని ఒకరికి గాయాలు
మైదుకూరు : పట్టణ శివారులోని జాతీయ రహదారి బైపాస్లో మోటార్ బైక్ డివైడర్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న అబ్దుల్ అనే యువకుడు గాయపడ్డాడు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన యువకుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. హౌసింగ్ స్టీల్ మాయంపై విచారణ ప్రొద్దుటూరు : హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో ఉన్న హౌసింగ్ గోడౌన్లలో విజిలెన్స్ అధికారి కృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 270 టన్నుల స్టీల్ నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం రెండు టన్నులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం 268 టన్నుల స్టీల్ కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఏఈఈ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, రాజంపేట ఈఈ మురళి, ప్రొద్దుటూరు ఈఈ రాజశేఖర్ ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి విజిలెన్స్ బృందం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు పీడీ తెలిపారు. -
తల్లీబిడ్డల మృతిపై జిల్లా వైద్యాధికారుల విచారణ
జమ్మలమడుగు : జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు రోజుల కిందట జరిగిన తల్లీబిడ్డల మరణాలపై జిల్లా వైద్యాధికారులు శనివారం విచారణ చేపట్టారు. గురుగడ్డ వీధికి చెందిన పటాన్ రుక్సానాను ప్రసవానికి కుటుంబ సభ్యులు తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శుక్రవారం ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం నవజాత శిశువు మృతి చెందింది. రుక్సానా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రొద్దుటూరుకు తరలించారు. మార్గంమధ్యలో రుక్సానా కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా వైద్యాధికారి డీఐఓ డాక్టర్ ప్రవీణ్ బృందం శనివారం విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులను విచారించారు. బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం రామలింగారెడ్డి ఆసుపత్రి వైద్యులను విచారించారు. వైద్యుల నుంచి మృతురాలి కేర్షీట్, వాడిన మందుల వివరాలను నమోదు చేసుకున్నారు. విచారణలో జిల్లా వైద్యాధికారి శాంతి, ప్రైవేట్ ఆసుపత్రి ఆసోసియేషన్ వైద్యులు అగస్టీన్రాజు, ఎంఎల్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు (అట్లూరు) : బద్వేలు మండలం రాజుపాళెం గ్రామ సమీపంలో కడప – బద్వేలు రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు సిద్ధవటం నుంచి బద్వేలుకు వెళుతున్న ఆటో, బద్వేలు నుంచి సిద్ధవటం వెళుతున్న కారు రాజుపాళెం గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అట్లూరు మండలం లింగాలకుంటకు చెందిన సంగటి వెంకటసుబ్బమ్మ, బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన గంగమ్మ, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామానికి చెందిన సుబ్బమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్లో బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని కడప రిమ్స్కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై ఓబుళాపురం సమీపంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని మారుతి (30) అనే యువకుడు మృతి చెందాడు. సీఐ నగేష్బాబు వివరాల ప్రకారం.. ఓబుళాపురం గ్రామానికి చెందిన మారుతి బైక్లో కొండాపురం నుంచి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నగేష్బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మారుతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడని, 3 నెలల కిందటే వివాహమైనట్లు బంధువులు తెలిపారు. -
గాలి మాటలతో సరి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు మహానాడు వేదికగా ‘కడప ఉక్కు–రాయలసీమ హక్కు’ అంటూ రంగురంగుల గ్రాఫిక్స్ చూపించారు. నేడు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ‘రైజింగ్ రాయలసీమ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హక్కులనే సాధించలేని వీరు సీమను రైజింగ్ చేస్తామనడం హాస్యాస్పదం. గత 30 ఏళ్లుగా తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నేటికీ పంట కాలువలు లేవు. జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి) ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాలకులవన్నీ గాలిమాటలే. – చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం -
అస్మదీయులకు అభయం
రాజంపేట: కడప–తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని చరిత్రాత్మక ‘రెడ్డికుంట’ చెరువు కబ్జా పర్వంలో రాజంపేట రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అధికార పార్టీ పక్షపాతం పూర్తిగా బట్టబయలైంది. 13.72 ఎకరాల ప్రభుత్వ నీటి వనరును దర్జాగా మింగేస్తున్న అసలైన కబ్జాదారులను కాపాడేందుకు అధికారులు పక్కా స్కెచ్ వేశారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల నేపథ్యంలో కేవలం కొద్దిమంది పాత రికార్డుదారులకే నోటీసులు ఇచ్చి, ప్రస్తుతం చెరువును అక్రమంగా చెరబట్టిన టీడీపీ నేతలను విచారణ పరిధి నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన ఆక్రమణదారులను కాపాడటానికే చెరువులో నామమాత్రంగా ఒక హెచ్చరిక బోర్డు తగిలించి, రెవెన్యూ శాఖ దర్జాగా చేతులు దులుపుకుందని స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ్ముళ్లకు నోటీసులు లేవు.. అస్మదీయులకు అభయం! తహసీల్దార్ ఆదేశాల మేరకు జరిగిన రెవెన్యూ విచారణ అంతా ఒక వైపు మాత్రమే సాగిందని జిల్లా రైతాంగం ఆరోపిస్తోంది. పాత రికార్డుల్లో పేర్లు ఉన్న మృతుల వారసులను పిలిపించి నోటీసులు ఇచ్చిన అధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం చెరువు గర్భాన్ని మట్టితో పూడ్చి, ప్లాట్లుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అసలైన ఆక్రమణదారుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీకి చెందిన కొందరు ముఖ్య అనుచరులు, స్థానిక నేతలు ఈ 13 ఎకరాల కుంటను గద్దల్లా తన్నుకుపోతుంటే.. అధికారం అడ్డుపెట్టుకుని వారి పేర్లను బయటపెట్టకుండా రెవెన్యూ యంత్రాంగం తెరవెనుక నాటకమాడింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా కేవలం బోర్డుతో సరిపెట్టడం వెనుక అధికారులపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెవెన్యూ హెచ్చరిక బోర్డులో ఏముందంటే..? కబ్జాదారుల పేర్లు బయటకు రాకుండా రాజంపేట తహసీల్దార్ పేరుతో రెడ్డికుంట చెరువులో నామమాత్రంగా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు పాఠకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆ బోర్డు సారాంశం ఇలా ఉంది. ‘పోలి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 1488 విస్తీర్ణం 13 ఎకరాల 72 సెంట్ల కుంట.. ఇది ప్రభుత్వ భూమి కనుక ఎవరైనా ఆక్రమిస్తే వారు శిక్షార్హులు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. ఇట్లు.. తహసీల్దారు, రాజంపేట.‘ ఈ బోర్డును చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏకంగా 13.72 ఎకరాల ప్రభుత్వ భూమి కళ్లముందే కనుమరుగైపోతుంటే.. ఆక్రమణలను కూల్చేయకుండా, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుండా, కేవలం ‘ఎవరైనా ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డు పెట్టి వదిలేయడం అధికారుల కపట నాటకానికి పరాకాష్ట అని దెప్పిపొడుస్తున్నారు. రెడ్డికుంటను దర్జాగా కబ్జా చేస్తున్న తెలుగుతమ్ముళ్లు సర్వే నంబరు 1488 పరిధిలోని 13.72 ఎకరాల కుంటపై సాగుతున్న పచ్చ దోపిడీ తమ్ముళ్లను దాచేసి రెవెన్యూ ‘హెచ్చరిక’ బోర్డుతో సరి -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని వెంకటాపురం రహదారిలో శనివారం భూమిరెడ్డి పెద్ద మాదన్న గారి రమణమ్మ అనే మహిళ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు రమణమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి పెద్దమాదన్నగారి రమణమ్మ, భర్త కొండయ్య మృతి చెందడంతో మైదుకూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని వినాయక నగర్లో ఉంటున్న ఆమె రెండేళ్ల కిందట వెంకటాపురం రహదారిలో సొంత ఇల్లు కట్టుకుని నివాసాన్ని అక్కడికి మార్చింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు సునీల్ రైల్వే కోడూరు సమీపంలోని ఫారెస్ట్ చెక్పోస్టులో పనిచేస్తున్నాడు. ఇంట్లో రమణమ్మ ఒక్కతే ఉంటుంది. శనివారం ఉదయం ఆమె గడ్డమాయపల్లె ప్రాంతంలో ఓ రైతు పొలంలో వేరుశనగ కాయలను ఏరేందుకు పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపునకు తాళం చెవి పెట్టేందుకు ప్రయత్నించగా తలుపులు అవే తెరుచుకున్నాయి. గాబరాతో ఆమె తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. ఆందోళనతో బీరువాలో చూడగా బంగారు గొలుసు, కమ్మలు, ఉంగరాలు, చెవి మాటీలు, చెవి బుట్టలు, వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడు, వెండి గిన్నెలు తదితర వస్తువులు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగిందని భావించి స్థానిక విజయనగర కాలనీలో ఉంటున్న చిన్న కుమార్తె అల్లుడుకు సమాచారం తెలిపింది. వారు వచ్చి ఇంటి పరిసరాలు వెతికారు. ప్రధాన తలుపు గుండా వచ్చిన అగంతకులు చోరీ అనంతరం ఇంట్లో నుంచి తూర్పు వాకిలి గుండా వెళ్లి బయట గడియ వేసినట్టు గుర్తించారు. బీరువాలో ఉన్న 8.7 తులాల బంగారు వస్తువులు, 43 తులాల వెండి వస్తువులు, రూ.4వేలు నగదు చోరీకి గురైనట్టు ఈ సందర్భంగా బాధితురాలు రమణమ్మ తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, వేలి ముద్రల నిపుణులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. -
అన్నీ తానై ...అన్నిట్లో తలమునకలై
టాస్క్ఫోర్సు: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై గత కొద్ది రోజులుగా ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. దీనికి ఉక్కిరి బిక్కిరవుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక ఎక్కడిక్కడ ఖడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కడపలోని హరిత హాటల్లో ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అనుబంధ విద్యార్థి, అనుబంధ టీచర్ల సంఘాల నాయకులతోపాటు కొత్తగా ఉద్యోగాలకు ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు అనే కార్యక్రమాన్ని నిర్వహించి డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అంతా పారదర్శకంగా నిర్వహించామంటూ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ఇందులో జిల్లా ఓపెన్స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ సాంబ శివారెడ్డి పాల్గొని అన్నీ తానై వ్యవహరించారు.ఎమ్మెల్సీ వెంట తిరగడం, వచ్చిన వాళ్లను పలకరించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ హడావుడి చేస్తూ కనిపించాడు. కొన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రీవెన్స్లో ఫిర్యాదుకు సమాయత్తం... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సాంబశివారెడ్డిపై విద్యార్థి సంఘనాయకులు సోమవారం ప్రజా పిర్యాదుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా అయన పాల్గొనటం మేమినటి ప్రశ్నించారు. ప్రైవేట్ కార్యక్రమంలో హల్ చేసిన ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు హాజరు -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● యువతి మృతి, యువకుడికి తీవ్రగాయాలు కడప అర్బన్: కడప ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయకనగర్ నుంచి అలంఖాన్పల్లెకు వెళ్లేదారిలో ఆర్ఎల్టి పెట్రోల్ బంకు ఎదురుగా ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడప నగరం నకాష్కు చెందిన సయ్యద్ మొహీసీన్ (18) అక్కడికక్కడే మృతి చెందగా..సయ్యద్ అమీనుల్లా (18) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరు అలంఖాన్పల్లెకు వెళ్లేదారిలో ఉన్న కల్యాణమండపంలో బంధువుల వివాహానికి బైక్లో వెళ్లారు.వివాహానంతరం తిరిగి బయలుదేరారు. సంఘటన స్థలానికి వచ్చేసరికి కర్నూలు– బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు (ఏపి39 యుపి2577) వేగంగా వచ్చి బైక్ను ఢీకొనడంతో యువకుడు ఎగిరి పడ్డాడు. యువతి అదుపుతప్పి బస్సు కిందపడటంతో వెనుకవైపు టైరు ఆమెతలపైకి ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి నెల రోజుల్లో ఓ యువకుడితో వివాహం జరిపేందుకు నిశ్చయం చేశారు. సయ్యద్ అమీనుల్లా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు సీఐ వెల్లడించారు. -
108 వాహనంలో ప్రసవం
కమలాపురం: మండంలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మ కమలాపురం 108 వాహనంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. 108 సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మకు శనివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో 108 వాహనం గ్రామానికి చేరుకుని నారాయణమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై ప్రసవం జరిగింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. నారాయణమ్మ కుటుంబం 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. 165 బస్తాల విత్తన వడ్లు స్వాధీనంప్రొద్దుటూరు రూరల్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డు లో ఉన్న వరసిద్ధి వినాయక విత్తన కేంద్రంలో శనివారం విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయశాఖ అధికారు లు తనిఖీ చే శారు. దుకాణంలో విత్తన చ ట్టం 1965 నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 165 బస్తాల కేఎన్ఎం రకం వరి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, దుకాణ యజమాని రమణారెడ్డిపై 6–ఏ కేసు నమోదు చేశారు. 30 కేజీల తూకం కలిగిన విత్తన వడ్ల బస్తాను రూ.1200లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గు ర్తించారు. తనిఖీల్లో స్థానిక మండల వ్యవసాయాధికారి వరహరికుమార్,విజిలెన్స్అధికారిజి.లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
మంత్రి సమావేశానికి స్పందన కరువు
పులివెందుల రూరల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ శనివారం పులివెందులలోని పాత బస్టాండ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన సమావేశం కార్యకర్తలు లేక వెలవెలబోయింది. అరకొరగా వచ్చిన కార్యకర్తలు సైతం సమావేశం మధ్యలోనే వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కుర్చీలన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రి సత్యకుమార్ పులివెందులకు రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పాత బస్టాండ్లోని ప్రధాన కూడలి వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ నడిరోడ్డుపై ఉంచడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన నిఖిల్ జమ్మలమడుగు : పట్టణంలోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన కుందవరపు జెఫన్యా నిఖిల్ గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినట్లు తల్లిదండ్రులు కుందవరపు సురేష్, రాణి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల ఆధ్వర్యంలో 22దేశాలకు చెందిన 2వేల మంది కీబోర్డు వాయిద్యకారులతో ఏకకాలంలో ఏకస్వరంతో కీబోర్డు వా యించి ప్రతిభను చాటాడు. ఈ మేరకు శుక్రవా రం హెలెన్ మ్యూజిక్స్కూల్ వ్యవస్థాపకుడు ఆగస్టీన్ ఆధ్వర్యంలో ఇండియన్ పెంతకోస్టల్ చర్చి విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు రికార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేసినట్లు వివరించారు. -
పదవులు–పంపకాలు కోసమే
½gôæ-ï³MìS {´ë…¡Ä¶æ$ AÀÐ]l–-¨®Oò³ _™èl¢-Ô¶æ$¨® Ìôæ§ýl$. ™èlÐ]l$ Æ>f-MîSĶæ$ ç³§ýlÐ]l#Ë$, ç³…ç³-M>ÌS MøçÜÐól$ C糚yýl$ Mö™èl¢ ¯érM>Ë$ Byýl$-™èl$-¯é²Æý‡$. Ñ¿ýæ-f¯]l ^èlrt… {ç³M>Æý‡… Ððl¯]l$-MýS-º-yìl¯]l hÌêÏÌS AÀ-Ð]l–-¨®MìS CÐéÓ-ÍÞ¯]l MýS±çÜ ₹50 MørÏ MóS…{§ýl °«§ýl$Ë$ HÐ]l$Ķæ*ÅÆ‡$$? MýSyýl-ç³ÌZ EMýS$P MýSÆ>Ã-V>Æý‡… HÆ>µ-r$Oò³ ^èlrt… ^ólíÜ.. C糚yýl$ Ýë«§ýlÅ… M>§ýl…r* ÐéÆó‡ ^ðlç³#¢-¯é²Æý‡$. D {´ë…™é-°MìS G…™ø MîSÌS-MýS-OÐðl$¯]l MýSyýlç³&»ñæ…-VýSâ¶æ*Æý‡$ OÆð‡ÌôæÓ-OÌñ毌S VýS$Ç…_ MóS…{§ýl… ç³NÇ¢V> Ð]l$Ça-´ù-Ƈ$$…¨. A…™èlÆŠæ Æ>[ÚëtÌS ±sìæ ÑÐé-§éÌSMýS$ Ð]lÊÌS-M>-Æý‡-MýS$Ë$ ½gôæï³ ¯ól™èlÌôæ. Kr$Ï&-ïÜr$Ï Ñ$¯]là ÒÇMìS ïÜÐ]l$ {ç³Äñæ*f-¯é-ÌS™ø ç³°-Ìôæ§ýl$. – జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ -
టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్రెడ్డికి బెదిరింపు లేఖ
ప్రొద్దుటూరు : ‘త్వరలో మీ ఇంటిపై దాడి చేసి చంపుతాం.. పూర్వం మీ అబ్బ పెద్ద వీరారెడ్డిని ఎలా చంపారో అలాంటి పరిస్థితే నీకు వస్తుంది’ అని టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డికి స్పీడ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖ రాశారు. లేఖలో రాసిన ఫోన్ నంబర్, అడ్రెస్ ఫేక్ అని తెలుసుకున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గీయుల మధ్య రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగిన పది రోజులు కాకమునుపే ఈ లేఖ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎస్ మాల్ విషయంపై జీవీ ప్రవీణ్ కుమార్రెడ్డి ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణకు వచ్చిన సందర్భంగా గత నెల 26వ తేదీన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు, ప్రవీణ్కుమార్రెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వుకున్న సంఘటన తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం పరిపాటి. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుతం ఆర్.ఈశ్వర్రెడ్డి పేరుతో ప్రవీణ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. లేఖలో టౌన్ బ్యాంక్ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో మీ ఇంటిపై దాడి చేస్తామని, దమ్ముంటే ప్రాణాలను కాపాడుకోవాలని లేఖలో పొందుపరిచారు. ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు మార్కెట్యార్డులో శనగలను కొనుగోలు చేశారు. దీనిపై ఆర్టీఐ పెట్టిన ప్రవీణ్ కుమార్రెడ్డి వర్గీయుడు పర్లపాడు చంద్రను కూడా బెదిరించినట్లు ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. తాటాకు చప్పులకు బెదరను ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరా లేని చోట ఈ లేఖను రాసి పంపారన్నారు. దమ్ముంటే అధికారికంగా రాసి పంపాలని కోరారు. వ్యవసాయ మార్కెట్యార్డు డైరెక్టర్ సుధాకర్ రాసినట్లుగా ఈ అక్షరాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇంతటితో తాను ఆగనని, డీఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూల్, సుందరయ్య నగర్, తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. మైలవరం కాలువపై అక్రమ నిర్మాణాల విషయం గురించి కూడా మాట్లాడుతానన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపుతారా అని ప్రవీణ్ అన్నారు. ఈ విషయంపై ఏఎస్పీ విభూ కృష్ణకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇంటికొచ్చి చంపుతామని లేఖలో పేర్కొన్నారు రాళ్లు రువ్వుకున్న సంఘటన మరువక ముందే మరో ఘటన -
పవర్ ఫుల్గా వినియోగం
కడప కార్పొరేషన్: మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతిరోజూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోనూ ఉక్కపోతను భరించలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా విని యోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం రికార్డుస్థాయిలో నమోదవుతోంది. గత ఏడాదితో పోల్చితే ఏప్రిల్, మే మాసాల్లో 120.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం పెరిగింది. గృహావసరాలతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ఆధారిత రంగాల్లో విద్యుత్ వాడకం గణనీయంగా పెరుగుతోంది. గృహ వినియోగమే ఎక్కువ గృహావసరాలకే ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత కనిపిస్తోంది. నాలుగు రోజులుగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అధిక విద్యుత్వినియోగం జరుగుతున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులో 16 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్రకటిత కోతలు జిల్లాలో విద్యుత్ కోతలు లేవని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. పలు ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రజలు వాపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. డిమాండు తగ్గట్టు సరఫరా వేసవి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడా కోతలు అమలుచేయడం లేదు. పలు ప్రాంతాల్లో ఎండ వేడికి ట్రాన్స్ఫార్మర్లు, ఫ్యూజులు కాలిపోతే వాటిని ఎప్పటికప్పుడు మార్పు చేస్తున్నాం. అందుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో తప్ప ఎలాంటి కోతలు విధించడం లేదు. – ఎస్. శ్రీనివాసులు, ఎస్ఈ, విద్యుత్శాఖ. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 510 మిలియన్ యూనిట్ల వాడకం ఏప్రిల్ 2026 510.857 మిలియన్ యూనిట్లు మే 2026 444.518 మిలియన్ యూనిట్లు ఏప్రిల్ 2025 459.455 మిలియన్ యూనిట్లు మే 2025 375.596 మిలియన్ యూనిట్లు -
వైద్యం వికటించి తల్లీశిశువు మృతి
● మృతదేహాలతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వైద్యం వికటించి తల్లి, నవజాత శిశువు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జమ్మలమడుగు పట్టణంలోని గడ్డవీధికి చెందిన పఠాన్ రుక్సానా (28) అనే గర్భిణిని గురువారం ప్రసవానికి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు.. మృతదేహాలతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనపై అరా తీశారు. పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్ట్మార్టం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని సీఐ నరేష్బాబు బాధితులకు సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని, వైద్యులతో తమకు క్షమాపణ చెప్పించాలని కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమై డాక్టర్ లక్ష్మీరెడ్డిని వివరణ కోరగా.. రుక్సానాను గురువారం తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమెకు నొప్పులు రాకపోవడంతో శస్త్రచికిత్స చేసి నవజాత శిశువును బయటకు తీశామన్నారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో రుక్సానాకు మూర్ఛ, గుండెపోటు రావడంతో వెంటనే ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని సూచించామన్నారు. -
రిమ్స్లో కార్మికుల ఆందోళన
కడప అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలలో పని చేస్తున్న సెక్యూరిటీ, పారిశుద్ధ్య, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్– వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పని ప్రదేశాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐటీయూసీ పిలుపులో భాగంగా శుక్రవారం కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ అత్యవసర ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ కార్మికులకు కొత్తగా వచ్చిన ఏజెన్సీ నిర్వాహకులు ఎంవోయూ ప్రకారం వేతనాలు 13960 రూపాయలు ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారని విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు అధికారుల ఆదేశాలు పాటించాలా? లేక అధికారులు కాంట్రాక్టర్లకు లోబడి పని చేయాలా? అనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులే తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. 10–15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్మికులను పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు పర్మినెంట్ చేస్తున్నాయని వాటిని చూసి అయినా మన రాష్ట్రంలో ఎప్పుడు పర్మినెంట్ చేస్తారని ఎదురు చూస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోగా.. ఒక్క మెడికల్ రంగంలోనే 50 సంవత్సరాలు నిండిన పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి నెల 10వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, జాతీయ పర్వదినాలకు సెలవులు ఇవ్వాలని అడుగుతున్నా, ఇవన్నీ మీకు వర్తించవు కార్మిక చట్టాలు వర్తింప చేయము పిఎఫ్, ఈఎస్ఐ ఇష్టానుసారంగా చెల్లిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అడిగిన కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు, 15న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె మద్దిలేటి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బరాయుడు, సెక్యూరిటీ గార్డ్ యూనియన్ నాయకులు రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో అసమ్మతి సెగలు
కాశినాయన : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారా స్థాయికి చేరాయి. టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న కార్యకర్తలను పక్కన పెట్టడాన్ని ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం మండలంలోని అశోక్కుమార్రెడ్డి పాఠశాల ఆవరణలో టీడీపీ అసమ్మతి నాయకులు ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేకపోయినా 30 ఏళ్లుగా నమ్ముకుని ఉన్న కార్యకర్తలను కొంత మంది నాయకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మహానాడుకు నాయకులను, కార్యకర్తలను పిలవకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాలు, మండల, బూత్ స్థాయిలో జెండాను మోస్తూ.. బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. మహానాడు నిర్వహణ, బూత్ కమిటీ ఏజెన్సీలను ఏకపక్షంగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రితీష్ నాయకత్వంలో మండలంలో టీడీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగానే అధిష్టానం డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డికి మహానాడు నిర్వహణ, బీఎల్ఏల నిర్వాహణ బాధ్యతలను అప్పగించింది. గ్రామాల్లో కార్యకర్తలకు తెలపకుండా బీఎల్ఏలను నియమించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మండలంలో రితీష్ నాయకత్వంలోని రెండు వర్గాలు ఏకమై మన భవిష్యత్తు ఏమిటని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధినాయకుల దృష్టికి తీసుకెళుతామని వారు తెలిపారు. గ్రామ కమిటీలు, మండల నాయకత్వం, క్లస్టర్ ఇన్చార్జిలకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నముక అని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పలు మార్లు పేర్కొన్నారని వారు గుర్తు చేశారు. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, మండల సింగిల్ విండో అధ్యక్షుడు గురివిరెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ డి.రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యనారాయణరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నాయకుల సమావేశం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇదేనా? అసహనం వ్యక్తం చేస్తున్న నాయకులు -
వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం
పులిచెర్ల (కల్లూరు) : కల్లూరులో వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు బీసీ కాలనీలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వారిని చూసిన కారు డ్రైవర్ కొంత దూరం వెళ్లి.. వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు పరిశీలించగా.. కారులో 12 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గమనించారు. వాహనాన్ని కల్లూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అందులో 12 దుంగల బరువు 358 కేజీలుగా గుర్తించారు. వాటి విలువ రూ.16.46 లక్షలు, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత
చౌడేపల్లె : పాము కాటుకు గురై వ్యక్తి అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం జరిగింది. మండల కేంద్రంలోని ప్రైవేటు బస్టాండులో సుబ్రమణ్యం చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు శబరీష్(39) విక్రయదారుకోసం దుకాణంలో సరుకులు తీసే క్రమంలో నాగుపాము కాటేసింది. పాము కాటును గుర్తించిన అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో పుంగనూరుకు తీసుకెళ్లారు. కాగా దుకాణంలోని నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలడానికి తీసుకెళ్లారు.రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణంమదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండా ఉదయ్ కుమార్(20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బైక్పై స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం కాండ్లమడుగు క్రాస్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. యువకుడి మృతితో పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన బిడ్డను దేవుడు దూరం చేశాడని పెడుతున్న ఆర్తనాదాలు చూపరుల హృదయాలను తీవ్రంగా కలిచి వేశాయి. వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్ల చోరీవాల్మీకిపురం : మండలంలోని నగరిమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో దాదాపు 10 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్ వైర్లను చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగిరిమడుకు చెందిన రెడ్డెప్ప, శ్రీరాములు, జ్యోతి, నరసింహారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరెడ్డి, రామాంజులు, నాగమ్మ, రామయ్య తదితర రైతుల వ్యవసాయ భూముల వద్ద 200 మీటర్లకు పైగా ఉన్న కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు శుక్రవారం గుర్తించారు. అసలే వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తుంటే మరో పక్క వైర్లను చోరీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ చూపి కేబుల్ వైర్ల దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
ఇన్చార్జ్ పాలన ఇంకెన్నాళ్లు..!?
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగర శివారులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఇన్చార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. గత రెండేళ్ల కిందట లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి డీటీసీ చంద్రశేఖర్రెడ్డిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్ ఆరు నెలల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్రెడ్డి నాలుగు నెలలు అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం డీటీసీగా ఉన్న వీర్రాజు 2025 సెప్టెంబర్ నుంచి ఇన్చార్జ్ డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారంలో బుధ, గురువారాల్లో మాత్రమే రవాణా శాఖ కార్యాలయంలో వాహన యజమానులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను ఇన్చార్జ్ డీటీసీ మొత్తం పూర్తి చేసి వెళుతున్నారు. మిగిలిన రోజులో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత రవాణా శాఖ కార్యాలయంలోని సిబ్బందిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. దీంతో ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఒక డీటీసీ, ఎంవీఐ ఒకరు, ఏ ఎంవీఐలు ముగ్గురు, ఏఓలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాలి. అయితే ప్రస్తుతం డీటీసీ లేకపోగా ఏంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ఇద్దరు, ఏవోలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు సెలవుపై వెళ్లినా పనులు సకాలంలో జరగక పెండింగ్లో పడిపోతున్నాయి. ఇన్చార్జ్ డీటీసీ లేని సమయంలో వాహనదారులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ పరిధిలో ఉన్న పనులను ఎంవీఐ, ఏ ఎంవీఐలు చేస్తున్నారు. డీటీసీ పరిధిలో ఉన్న పనులు పెండింగ్లో ఉండక తప్పడం లేదు. జిల్లాలోని నాలుగు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలలో సిబ్బంది కొరతతో అగచాట్లు పడుతున్నారు. రవాణా శాఖ అధికారులు రెగ్యులర్ డీటీసీని నియమించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయానికి రెగ్యులర్ డీటీసీని నియమించాలని వాహనదారులు కోరుతున్నారు. రెగ్యులర్ డీటీసీ లేక వాహనదారులకు ఇక్కట్లు రెండేళ్లుగా భర్తీ కానీ పోస్టు వారంలో రెండు రోజులు మాత్రమే సేవలు -
ముగిసిన ఇళ్ల జాబితా, గణన
కడప సెవెన్రోడ్స్ : జనాభా గణనలో భాగంగా మొదటి దశలో చేపట్టిన ఇళ్ల జాబితా, గణన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మే 1 నుంచి 30వ తేదీ వరకు ఈ గణన నిర్వహించాలని తొలుత ఉత్తర్వులు వచ్చాయి. అయితే, తక్కువ సమయంలో వంద శాతం లక్ష్యాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఈనెల 5వ తేదీ వరకు ఇళ్ల జాబితా, గణనను పొడిగించారు. జిల్లాలో మొత్తం 7,15,736 ఇళ్లను గణన చేశారు. అందులో 96,503 (13.48 శాతం) ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక తాళాలు వేసిన ఇళ్లు 1202 గుర్తించారు. జిల్లాలోని 616 గ్రామాలు, 8 పట్టణాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లలో 4421 మంది ఎన్యుమరేటర్లు, 773 సూపర్వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రెండవ దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనాభాను లెక్కిస్తారు. గండికోటలో రణబాలి చిత్రీకరణ పూర్తి జమ్మలమడుగు : గండికోటలో రణబాలి చిత్రీకరణ పూర్తయింది. గత నెల 31న ప్రారంభమైన చిత్రీకరణలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. కోట ముఖద్వారం నుంచి హీరో విజయ్దేవరకొండ గుర్రాలపై తన అనుచరులతో లోపలికి వెళ్లే సన్నివేశాలతో పాటు, హీరోయిన్ రష్మిక మందనతో కలిసి మాధవరాయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సన్నివేశాలను చిత్రీకరించారు. శుక్రవారం చిత్రీకరణ పూర్తి కావడంతో హీరో, హీరోయిన్లు, టెక్నిషియన్లు ప్యాకప్ చేసుకుని సాయంత్రం గండికోట నుంచి వెళ్లిపోయారు. -
బాధ్యతల స్వీకరణ
కడప అర్బన్: కడప సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఓబులేసు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం కడప ఫారెస్ట్ రేంజ్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత కడప నగరవనంలో జరిగిన కార్యక్రమంలో కడప డిఎఫ్ఓ వినీత్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఆర్జేడీగా మధుసూదన్ వర్మ కడప ఎడ్యుకేషన్: కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మధుసూదన్ వర్మకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం కడపలోని కళాశాల ఆర్జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మధుసూదన్ వర్మకు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, ఏఓ రమణరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు.గర్భాలయంలోని మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సిద్ధవటం ఎస్ఐ హారిక, ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలి కడప రూరల్ : ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం కడపలో వైద్యాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0–5 సంవత్సరాల పిల్లలలందరికి మొదటి రోజునే చుక్కల మందు వేయాలన్నారు. రెండో రోజు, మూడోరోజు ఇంటింటి సర్వే ద్వారా మార్కింగ్ చేస్తూ, మిస్ అయిన పిల్లలకు ఇంటి దగ్గర వేయాలని తెలిపారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన తరువాత, ఎడమ చిటికెన వేలికి మార్క్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఐఓ ప్రవీణ్, డాక్టర్ రవిబాబు, డాక్టర్ ఆరిఫ్, జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్పీ కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 252 కేసులు నమోదు చేసి, రూ. 60,778 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భూసమస్యల పరిష్కారానికి జవాబుదారీగా ఉండాలి
బద్వేలు అర్బన్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చొరవ చూపుతోందని,ఇందుకోసం అధికారులంతా జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం్ఙకార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశం లో స్వీకరించిన సుమారు 200 ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన గడువును విధించామని తెలిపారు.రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో వీటిని పరిష్కరించి,తుది నివేదికను దరఖాస్తుదారులకు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా,ఆయా శాఖల జిల్లా అధికారులు,బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్,డీసీసీబి చైర్మన్ మంచూరుసూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న ‘స్టార్ట్ అప్ కడప’ కడప సెవెన్రోడ్స్ : జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న శ్రీస్టార్ట్ అప్ కడప్ఙఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని పి–4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్ గా నిర్మిస్తున్న శ్రీస్టార్ట్ అప్ కడప్ఙఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడొద్దని సంబందిత ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, హౌసింగ్ ఇంజనీర్లు, ఏడిపి యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తల్లిని ఓదార్చడం.. ఈతరం కాదు !
● ఈతకొట్టేందుకు నీటిలోకి దిగిన నలుగురు పిల్లలు ● ఇద్దరిని కాపాడిన తల్లి ● కళ్ల ఎదుటే నీటిలో మునిగి మరో ఇద్దరు మృతి ● ఖాజీపేటలో హృదయవిదారక ఘటన ఖాజీపేట : అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఆ తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. నీటిలో దూకి ఇద్దరిని కాపాడింది. మరో ఇద్దరు తన కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడలేక గుండెలవిసేలా విలపించిన హృదయవిదారక ఘటన ఖాజీపేటలోని మండలం దుంపలగట్టు గ్రామంలోని గుట్టులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం సమీపంలోని గుట్టుపై 10 ఏళ్లుగా పందులను మేపుతూ శివకృష్ణ, శ్రీవాణి దంపతులు జీవనం సాగిస్తున్నాయి. పందులను నీటి గుంటలో శుభ్రం చేసేందుకు ప్రతి రోజు శివకృష్ణ వెళ్లి వచ్చేవారు. శుక్రవారం శివకృష్ణ ఇతర పనులపై కడపకు వెళ్లారు. దీంతో శ్రీవాణి నీటిలో ఉన్న పందుల కంచె వద్దకు వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు గౌతమ్, కార్తీక్తో పాటు వనం సంజన (18) వనం అర్చన (14) వెళ్లారు. శ్రీవాణి పందుల కంచె వద్ద ఉండగా నీటిలో ఈత కొడదాం అని పిల్లలు తల్లిని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీవాణి అంగీకరించారు. నలుగురు పిల్లలు నీటిలోకి దిగారు. నీటిలోని కుంట లోతుగా ఉండటంతో నలుగురు నీటిలో మునిగిపోతుండగా శ్రీవాణి గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గౌతమ్, కార్తీక్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సంజన, అర్చన అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాపాడే ప్రయత్నం చేసేలోగానే ఇద్దరూ గల్లంతయ్యారు. గట్టిగా కేకలు వేడయంతో స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం నీటిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఖాజీపేట సీఐ వంశీధర్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే చెన్నూరు నుంచి గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కలిసి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు రోప్ సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్కు తరలించారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే మృత్యుఒడిలోకి.. శ్రీ వాణి కళ్ల ఎదుటే తన ఇద్దరు కుమార్తెలు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఆమె రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరామర్శ దుంపలగట్టు గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదం నుంచి బయట పడిన కార్తీక్, గౌతమ్ -
ఐపీపీబీ ఖాతాల ద్వారా పథకాల నగదు చెల్లింపు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎన్పీసీఐ మ్యాపర్లో ఆధార్ సీడింగ్ లేకపోవడం వల్ల అందుకోలేకపోతున్న వారికి.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల ప్రారంభం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.రాజేష్ తెలిపారు. శుక్రవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా ఖాతాల్లో జమ కావడానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అన్నారు. అయితే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి 4,180 మంది లబ్ధిదారుల ఖాతాలు ఎన్పీసీఐ మ్యాపర్తో అనుసంధానం కాకపోవడంతో వారికి పథకాల ప్రయోజనాలు అందడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోస్టల్ శాఖ ద్వారా ఐపీపీబీ ప్రీమియం ఖాతాల ప్రారంభ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఇనాక్టివ్గా మారిన వారు తమ ఖాతాలను ఈ నెల 13వ తేదీలోపు పునరుద్ధరించుకోవాలని సూచించారు. అదే విధంగా ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా లేని అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్తో ఐపీపీబీ ఖాతాను సులభంగా ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఈ ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా జమ అవుతుందని వివరించారు. ప్రత్యేకంగా ఐపీపీబీ ఖాతాదారులకు తపాలా సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి నగదు చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన పౌరులందరూ తమ సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రతి ఓటును కాపాడుకోవాలి
● ఎస్ఐఆర్ వల్ల ముఖ్యమంత్రులు ఓడిపోయారు ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డిసిద్దవటం : వైఎస్ఆర్సీపీకి ప్రతి ఓటు కీలకమేనని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అన్నారు. మండలంలోని కనుములోపల్లి ఆకేపాటి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి బీఎల్ఏ బీఎల్ఓతో కలిసి ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఆ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. 24 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్ఐఆర్ ద్వారా ఇటీవల పలు రాష్ట్రాలలో కొన్ని లక్షల ఓట్లు తొలగించడంతో ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రులే ఓడిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు బోగస్ ఓట్లు ఎక్కించే అవకాశం ఉందని, బీఎల్ఏలు ఓటరు జాబితాలోని ప్రతి ఓటరు పేరును పరిశీలించాలని, బోగస్ ఓట్లు ఉంటే బీఎల్ఓలకు ఫిర్యాదు చేసి వాటిని తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాజంపేట పార్టీ కార్యాలయంలో వార్ రూం ఏర్పాటు చేశామని, ఏమైనా సమస్యలుంటే వారు అక్కడికి వస్తే రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. బీఎల్ఏలు ఒక నెల పాటు కష్టపడి సమష్టిగా పనిచేస్తే ప్రతి ఓటును కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె.పెంచలయ్య, రాయలసీమ జోనల్ బూత్ కమిటీ కన్వీనర్ తల్లెం భరత్కుమార్రెడ్డి, బూత్ కమిటీ మండల కన్వీనర్ నారపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారుతి పిల్లి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, జనరల్ సెక్రటరీ వలీచాన్, జిల్లా బూత్ సెక్రటరీ కాడే శివయ్యనాయుడు, బూత్ కమిటీ అసిస్టెంట్లు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
● బాబు వెన్నుపోటుకు రెండేళ్లు..
కడపలో టీడీపీ మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలుప్రొద్దుటూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి యర్రగుంట్లలో మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెన్నూరు: మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి మేనిఫెస్టోకు హామీల రంగులద్దీ..మోసపూరిత ప్రకటనలతో మాయ చేసిన కూటమి నేతల తీరుపై జనం భగ్గుమన్నారు. ఇంటింటికీ తిరిగి ఉత్తుత్తి బాండ్లు పంచి.. నిలువునా వంచించిన పచ్చ పాలకులపై ధ్వజమెత్తారు. ‘నీకు..నీకు..నీకు..’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించడంపైఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ‘బాబు ష్యూరీటీ’ అంటూ బాండ్లు పంచిన నేతలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మేనిఫెస్టో కాపీలను మంటల్లో కాల్చివేశారు.. బాండ్ల ప్రతులను అడ్డంగా చించేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయని నేపథ్యంలో వైఎస్సార్సీపీ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిరసన మిన్నంటింది. దగాపడ్డ ప్రజాస్వామ్యంపై దండోరా వేస్తున్న ప్రజాక్షేత్రం వైఎస్సార్సీపీతో కలిసి ఊరువాడ ధర్మాగ్రహం పోరుమామిళ్ల: నిరసనలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సుధ, చిత్రంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి , పార్టీ శ్రేణులుసాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలు విస్మరించడంపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై ఉవ్వెత్తున రగిలిపోయింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరశనలో భాగంగా గురువారం మండల, నియోజకవర్గ కేంద్రాలల్లో ప్రజలతో కలిసి భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. టీడీపీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ కరపత్రాలు, ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’బాండ్లు ఆయా కేంద్రాల్లో దహనం చేశారు. కూటమి సర్కార్ హామీలు విస్మరించడంపై నిప్పులు చెరిగారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన, ఇప్పటి కూటమి పాలనను ప్రజలు భేరీజు వేసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇ లా అన్నీ వర్గాల ప్రజల్ని మో సం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు. పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాలల్లో చేపట్టిన నిరశనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి మీటింగ్ లోను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని విపరీతంగా ప్రచారం చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ● ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ బాండ్లను ప్రదర్శించారు. నిరుపయోగంగా ఉండిపోయిన బాండ్లను చించేశారు. ● కడపలో మాజీ మేయర్లు కొత్తమద్ది సురేష్బాబు, పాకా సురేష్ నిరశన కార్యక్రమాన్ని కొనసాగించారు. సూపర్సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం, ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై మండిపడ్డారు. ● నియోజకవర్గ కేంద్రమైన మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు జీవితమంతా వెన్ను పోటు వ్యవహారమేనని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. ఆ ఐదేళ్లలో ప్రతి కుటుంబం బాగుపడాలనే దృడసంకల్పంతో వైఎస్ జగన్ పాలన అందించారని గుర్తు చేశారు. ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి యర్రగుంట్ల, ముద్దనూరు కేంద్రాలల్లో చేపట్టిన నిరశన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అప్పులు కుప్పలు తెప్పలుగా తెస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ● నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం, వల్లూరు కేంద్రాల్లో కమలాపురం సమన్వయకర్త నరేన్రామాంజులరెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు. 16ఏళ్లు సిఎంగా చెప్పుకోవడం మినహా చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని ఎద్దేవా చేశారు. ● పులివెందులలో మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మధనమోహన్రెడ్డి నేతృత్వంలో నిరశన చేపట్టారు. అపద్దపు హామీలతో గద్దెనెక్కి ప్రజల్ని చంద్రబాబు మోసగించారని ధ్వజమెత్తారు. ● పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మె ల్యే డాక్టర్ సుధా పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై భరోసా లేకుండా పోయిందని వాపోయారు. వంచించడం మినహా చేయూతనివ్వాలనే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ● ఒంటిమిట్టలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నిరశన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారన్నారు. వంచించడమే ఆయన నైజమని దెప్పిపొడిచారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరశనలు మిన్నంటాయి. మైదుకూరులో వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తదితరులు కమలాపురంలో ‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో నరేన్ తదితరులుబాండు పేపర్లను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి -
అటవీశాఖ వాహనాన్ని ఢీ కొన్న బైక్
ఒంటిమిట్ట : మంటపంపల్లి జెడ్పీహెచ్ఎస్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద ఆగి ఉన్న అటవీశాఖ వాహనాన్ని బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో అటవీ శాఖ వాహన డ్రైవర్ నాగ చంద్రకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..వాహనాల తనిఖీ కోసం అటవీశాఖ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, డ్రైవర్ నాగ చంద్ర జగనన్న కాలనీ వద్ద జీపు ఆపి నాగ చంద్ర డోర్ తీసి దిగుతుండగా బోపల్లి నుంచి మంటపంపల్లి వైపు అతివేగంగా ద్విచక్ర వాహనంలో వస్తున్న బోయ మహేష్, చరణ్లు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో నాగ చంద్ర తీవ్రగాయాలయ్యాయి. మహేష్, చరణ్లకు కూడా గాయాల అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహన చోదకుడు బోయ మహేష్పై అసిస్టెంట్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆటో చోరీపై ఫిర్యాదు మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్ ఖాదర్ వలీ సొంత ఆటో చోరీకి గురైనట్టు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖాదర్ వలీకి రెండు ఆటోలు ఉండగా ఒకదానిని తనే నడుపుకొంటూ మరొక ఆటోను మైదుకూరుకు చెందిన రెడ్డి బాబు అనే వ్యక్తికి రోజువారి అద్దెకిచ్చారు. గత నెల 28న రెడ్డి బాబు స్థానిక బద్వేలు రోడ్డులోని వైన్ షాప్ వద్ద ఆటోను నిలిపి షాపులోకి వెళ్లి తిరిగి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. విషయం ఖాదర్ వలీకి తెలపడంతో ఇద్దరూ పట్టణంలో వెతకినా కనిపించలేదు. చోరీకి గురైనట్టు భావించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి ఆటో కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలుబద్వేలు అర్బన్ : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) డాక్టర్ హిమదేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓపీని పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఓపీ డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని, ఇందుకోసం ఆసుపత్రికి వచ్చే రోగులు ఆధార్కార్డుతో పాటు ఆధార్కార్డుకు లింక్ అయిన ఫోన్నెంబరు తీసుకుని రావాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరతను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి వైద్యులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆమె వెంట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డితో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీతో దుకాణంలో మంటలు జమ్మలమడుగు : మండల పరిధిలోని పి. బొమ్మెపల్లిలోని ఓ టీ దుకాణంలో గురువారం గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణంలోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని హరినాథ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హరినాథ్రెడ్డి టిఫిన్, టీ, తినుబండరాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
శుభ కార్యాలకు కొన్నాళ్లు ‘శుభం కార్డు’
కడప సెవెన్రోడ్స్ : వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలతో నిత్యం కళకళలాడే ముహూర్తాల సీజన్కు తాత్కాలికంగా విరామం పడింది. తిరుగులేని శుభ ముహూర్తాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా పెళ్లి బాజాలు మూగబోయాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరుతో పాటు పలు మండల కేంద్రాల్లో వందలాది కల్యాణ మండపాలు ఉన్నాయి. సాధారణంగా ఈ కేంద్రాల్లో నెలకు సుమారు 200కు పైగా వివాహాలు జరుగుతుంటాయి. అయితే, అధిక జ్యేష్టమాసం రావడంతో గత నెల 14 నుంచి ఈ నెల 18 వరకు వివాహాది ప్రధాన శుభకార్యాలకు పూర్తిగా బ్రేక్ పడింది.‘మూఢమి’ కారణంగా వాయిదాలు వేద పండితుల ప్రకారం మే 14 నుంచి జూన్ 18 వరకు ఉన్న కాలాన్ని ‘మూఢమి’ (శూన్యమాసం)గా పరిగణిస్తారు. ఈ కాలంలో ఎలాంటి పెద్ద శుభకార్యాలు తలపెట్టకూడదనే నియమం ఉంది. అందుకే జనాలు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి ప్రధాన వేడుకలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్లు వంటి సాధారణ కార్యక్రమాలను మాత్రం యథావిధిగా నిర్వహించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. అనుబంధ రంగాల్లో మందగమనం ముహూర్తాలు లేకపోవడంతో వివాహ వేడుకలపై ఆధారపడి జీవించే వందలాది అనుబంధ రంగాలు, వృత్తుల వ్యాపారం తాత్కాలికంగా మందగించింది. కల్యాణ మండపాలు, కేటరింగ్ సర్వీసెస్, టెంట్ హౌస్లు, డెకరేషన్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, జ్యువెలరీ షాపులు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, హోటళ్లు మరియు లాడ్జీల వ్యాపారాలపై ఈ శూన్యమాసం ప్రభావం తీవ్రంగా పడనుంది. వ్యాపారాలు లేక సిబ్బందికి ఉపాధి కరువైంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 19 నుంచి మళ్లీ సందడి ఈ నెల 19న ‘నిజ జ్యేష్టమాసం’ ప్రారంభం కావడంతో మళ్లీ జిల్లాలో శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనువైన తేదీలున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ పలు శుభముహూర్తాలు లైన్ కట్టాయి. 18 వరకు నిలిచిపోనున్న పెళ్లి బాజాలు! అడ్డుగా మారిన అధిక జ్యేష్టమాసం (మూఢమి) బోసిపోతున్న కల్యాణ మండపాలు.. ఉపాధి కోల్పోతున్న అనుబంధ రంగాలు 19 నుంచి మళ్లీ ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సందడికొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది అధిక జ్యేష్టమాసం (మూఢమి) కారణంగా మే 14 నుంచి ప్రధాన శుభకార్యాలకు విరామం మొదలైంది. ఈ నెల 18వ తేదీ వరకు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. జూన్ 19 నుంచి మళ్లీ తిరుగులేని శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – విజయ్ భట్టర్, అర్చకులు, కడప -
శిక్షణ సరే.. కుట్టుమిషన్లు ఏవీ ?
● ఏడాదైనా ప్రతిపాదన దశలోనే ● జిల్లా వ్యాప్తంగా 3500 మంది ఎదురుచూపుజమ్మలమడుగు : మహిళలకు చేతి వృత్తులు నేర్పించి ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ దిశగా డ్వాక్రా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, తర్వాత మిషన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మహిళలు కుట్టు శిక్షణ కేంద్రానికి భారీగా క్యూ కట్టారు. శిక్షణ పూర్తయి ఏడాదమవుతున్నా మిషన్లు పంపిణీ చేయకపోవడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 24 కేంద్రాల్లో.. మహిళలకు కుట్టు శిక్షణలో మెలకువలు, ఆధునిక సమాజంలో నూతన డిజైన్లు నేర్పిస్తామని చెప్పిన బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ, మండల పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులకు 2025 ఏప్రిల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయం, మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు శిక్షణ నేర్పించారు. కేంద్రాలు దూరంగా ఉన్నా ఆటోలకు చార్జీలు పెట్టుకుని మహిళలు శిక్షణ నేర్చుకున్నారు. శిక్షణ తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్న అధికారులు.. తిరిగి పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించారు. పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ఏడాది అవుతున్నా ఇంత వరకు కుట్టుమిషన్లు రాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3500 మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకున్నారు. వారందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేర్చలేదు. పైగా అధికారులు మాత్రం ఇంకా ప్రతిపాదనలు పెట్టామని సర్దేసుకుంటున్నారు. అసలు మిషన్లు పంపిణీ అవుతాయా లేదా అనే అనుమానాలు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కుట్టు శిక్షణ పొందిన మహిళల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. వారు మంజూరు చేసిన తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం. – జయసింహా, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి -
జిల్లా ఆస్పత్రిలో అరుదైన చికిత్స
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఎంతో కాలం నుంచి మహిళ అండాశయంలో ఉన్న భారీ కణితిని జిల్లా ఆస్పత్రి వైద్య బృందం తొలగించారు. ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన రామలక్ష్మి కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అండాశయంలో భారీ సైజులో గడ్డలు (కణితి) ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి వైద్యులు సాగర్ కుమారి, కావ్య, గోపినాథ్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి గడ్డలను సురక్షితంగా తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇంత పరిమాణంలో గడ్డలు అరుదుగా ఉంటాయని చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్బాబు చికిత్సలో పాల్గొన్న వైద్యులను అభినందించారు.మహిళ అండాశయం నుంచి భారీ కణితి తొలగింపు -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి లీడర్స్ మిల్లులో జరిగిన చోరీ కేసుకు సంబంధించి టూ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏఎస్పీ విభూ కృష్ణ గురువారం టూటౌన్ పోలీస్స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మిల్లులో ఆపరేటర్గా పనిచేస్తున్న కిరణ్కు వ్యాపార వేత్తలు గదిలో భారీ మొత్తంలో నగదు భద్రపరుస్తారనే విషయం తెలిసి, తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనానికి పథకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 30న అర్ధరాత్రి సమయంలో మిల్లులోకి ప్రవేశించాడు.ముందుగా సీసీ కెమెరా వైర్ను కత్తిరించాడు. గది లోపలికి ప్రవేశించి, ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న డబ్బు బ్యాగ్ను అపహరించాడు. ఈ సమయంలో ఉత్తయ్య అతనికి సహకరిస్తూ కాపలా కాశాడు. అనంతరం నేరాన్ని గుర్తించకుండా ఉండేందుకు గదిలో, బీరువాలో, నగదు సంచిలో కారంపొడి చల్లినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.11.36 లక్షలు నగదు, నేరానికి ఉపయోగించిన ఇనుప సుత్తె, ఆకుపచ్చ రంగు గుడ్డ బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఈ కేసును అత్యంత తర్వగా ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసిన టూటౌన్ సీఐ వంశీనాథ్, సిబ్బందిని, అదనపు పోలీసులను ఏఎస్పీ అభినందించారు.రూ.11.36 లక్షలు స్వాధీనం -
436 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
బద్వేలు అర్బన్ : బద్వేలులో గురువారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె మిట్టలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 436 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు నడిపిపోలయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. అలాగే నడిపిపోలయ్యపై బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతాప్రసాద్రెడ్డి, విజిలెన్స్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
లైసెన్స్.. సైలెన్స్!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో రవాణా శాఖ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, వాహనదారులకు అత్యంత కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ అస్సలు ముందుకు సాగడం లేదు. రవాణా శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక లక్షకు పైగా డిజిటల్ కార్డులు పెండింగ్లో పడిపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలకు 4 వేల దరఖాస్తులు వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్ ప్రాంతాలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగు కార్యాలయాల పరిధిలో నెలకు సగటున 2 వేల డ్రైవింగ్ లైసెన్స్లు, మరో 2 వేల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల చొప్పున మొత్తం 4 వేల కార్డులు జారీ కావాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించినా, రెండేళ్లుగా పర్మినెంట్ డిజిటల్ కార్డులను ముద్రించి ఇవ్వడంలో రవాణా శాఖ పూర్తిగా విఫలమైంది. రూ. 2.10 కోట్లు వసూలు రవాణా శాఖ అధికారులు వాహనదారుల నుంచి పర్మినెంట్ డీఎల్, ఆర్సీ చలానాలు కట్టించుకునే సమయంలో స్మార్ట్ కార్డుల కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.210 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 80 నుంచి 100 వరకు డీఎల్, ఆర్సీ కార్డులు జారీ అవుతుంటాయి. ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు రూ.21 వేల మేర రవాణా శాఖ ద్వారా వాహనదారులు ప్రభుత్వానికి అదనంగా సొమ్ము చెల్లిస్తున్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న లక్ష కార్డుల లెక్కన చూసుకుంటే ఇప్పటికే దాదాపు రూ.2.10 కోట్ల భారీ మొత్తాన్ని ముందస్తుగానే వసూలు చేసిన అధికారులు, కార్డులు మాత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డ్రైవర్ల తిప్పలు వేల రూపాయల ఫీజులు కట్టినా కార్డులు రాకపోవడంతో వాహనదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వివిధ ప్రైవేట్ వెబ్సైట్లను ఆశ్రయించి నానా తిప్పలు పడుతున్నారు. అక్కడ భారీగా డబ్బులు చెల్లించి డూప్లికేట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటున్నారు. అయితే లారీల డ్రైవర్లు, యజమానులు ఇతర రాష్ట్రాలకు బాడుగలకు వెళ్లినప్పుడు అక్కడి రవాణా, పోలీస్ శాఖ అధికారులు ఒరిజినల్ ఆర్సీ, డీఎల్ మాత్రమే చూపాలని పట్టుబడుతున్నారు. రవాణా కార్యాలయాలకు వెళ్లి నిలదీస్తే ‘ఆన్లైన్ నుంచి డిజిటల్ ప్రింట్ తీసుకోండి‘ అంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, తీరా ఆ ప్రింట్లను పక్క రాష్ట్రాల్లో చూపిస్తే పోలీసులు ఒప్పుకోవడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల కాళ్లా వేళ్లా పడి, భారీగా లంచాలు ఇచ్చుకుని బయటపడాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ కార్డులను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా జారీ కాని డీఎల్, ఆర్సీ కార్డులు రూ. 2.10 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినా లభించని మోక్షం జిల్లా వ్యాప్తంగా లక్ష కార్డులు పెండింగ్.. రవాణా శాఖ స్మార్ట్ మోసం! -
మృతదేహం వెలికితీత
గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం ఎస్టీకాలనీకి చెందిన ఇండ్లనాగేంద్ర మూడు రోజుల క్రితం చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, స్థానికులు బద్వేలు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం ఎస్ఐ రంగారావు, సిబ్బంది బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీపీపీలో మాక్ డ్రిల్ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో అత్యవసర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండటం ఎలా అనే అంశంపై గురువారం ఆన్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్యవేక్షణ చేశారు. కార్యక్రమంలో ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు, ఎస్ఈ సోమశేఖర్రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ హనుమన్న, డివిజనల్ ఫైర్ అధికారి బిఎల్పీ శాస్త్రి, ఎస్పీఎఫ్ ఏసీ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. జాబు ఎక్కడ?
చేతిలో పారతో సిమెంట్ కంకర కలుపుతున్న ఇతని పేరు సుబాన్. చెన్నూరు మండలం కొండపేట వాసి. పేద కుటుంబానికి చెందిన సుభాన్ కష్టపడి చదువుకున్నాడు. బీఈడీ పూర్తి చేశాడు. కష్టపడి డీఎస్సీ కోసం ప్రయత్నం చేశాడు. కానీ అదృష్టం లేకో.. ప్రభుత్వం మాయాజాలమో కానీ గత డీఎస్సిలో 64మార్కులు వచ్చాయి. ఎల్జిబుల్కు కొన్ని మార్కుల దూరంలో ఆగిపోయాడు. తన కష్టాన్ని నమ్ముకొన్న సుభాన్ ఇదిగో ఇలా భవన నిర్మాణకూలిగా మారి జీవనం సాగిస్తున్నాడు.నిరుద్యోగ యువత కోసం 3 వేలు నిరు ద్యోగ భృతి ఇస్తామన్నారు.. మరి అది ఏమైందో, ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని వాపోయాడు. – మొహమ్మద్ రఫీ, ఫోటోగ్రాఫర్,కడప. -
ప్రజారోగ్య పరిరక్షణకు పని చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : ప్రజారోగ్య పరిరక్షణకు వైద్యులు కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ అమలుచేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని, వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని,సెలవులు తీసుకొనేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంజీవని కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు అవసరమైన సదుపాయాల కల్పనతోపాటు వైద్యులందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, డిసిహెచ్ఎస్ డా.హిమదేవి, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్ షెడ్స్పై సమీక్ష జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులు జూన్ 8వ తేదీ నాటికి పూర్తి స్థాయి లో సిద్ధం కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై సంబంధిత జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డిఏ పీడీ రాజ్యలక్ష్మి, డీఈఓ శంషుద్దీన్, హౌసింగ్ పీడీ రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. ఓటరు మ్యాపింగ్ పక్కాగా జరగాలి ప్రతి ఓటరు మ్యాపింగ్ పక్కాగా జరగాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈఆర్ఓ,ఏఈఆర్ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటా జనగణన, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పు లు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ మ్యాపింగ్లో రెవెన్యూ శాఖతో సమన్వయంతో పని చేయాలన్నా రు. ఇంటింటా జనగణన నమోదు ప్రక్రియను ప్రభుత్వం జూన్ 6వరకు పొడిగించిందన్నారు. ఈ ఇంటింటా జనగణనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్ఓ మల్లికార్జునుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి పాల్గొన్నారు. -
● పోస్టర్లు ఆవిష్కరించిన సీఈసీ మెంబర్ సురేష్బాబు
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం కూటమి రెండేళ్ల పాలనతో మరోమారు బహిర్గతమైంది. అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు ముఖానికేసుకున్న అబద్ధాల హామీల ముసుగు అధికారంలోకి రాగానే తొలగిపోయింది. ‘నాడు–నేడు’ వెలుగులు కరిగిపోయి విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’ కాదు.. ‘బాబును నమ్మితే మోసం గ్యారంటీ’ అని విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ చేసిన వెన్నుపోటుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నేడు (గురువారం) జిల్లావ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యక్ష ఆందోళనలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆడబిడ్డ నిధికి కూటమి సర్కార్ మంగళం! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని చంద్రబాబు ఊరూవాడా నమ్మబలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి మాటే మరిచారు ‘ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి’ అంటూ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ద్వారా ఊదరగొట్టిన చంద్రబాబు గద్దెనెక్కాక ఆ మాట పూర్తిగా మరిచారు. నిరుద్యోగ భృతి కింద ఈ రెండేళ్ల కాలానికి ప్రతి నిరుద్యోగికి రూ.72,000 లభించాల్సి ఉంది. ఏటా పెరుగుతున్న నిరుద్యోగుల జాబితా: జిల్లాలో వైవీయూ పరిధిలో ఏటా డిగ్రీ పూర్తి చేసే 12,000 మంది, ఇంటర్ పాస్ అయ్యే 15,000 మంది, ఇంజనీరింగ్ పట్టా పొందే 6,000 మందితో కలిపి ఏటా కనీసం 35,000 మంది యువత చేతిలో పట్టాలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అటు ఉద్యోగాలూ ఇవ్వక, ఇటు భృతీ దక్కక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాడు మహిళలే మహారాణులు గత వైఎస్సార్సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. జిల్లాలో 2,16,222 మంది తల్లులకు ‘అమ్మ ఒడి’ ద్వారా నాలుగేళ్లలో రూ.912 కోట్ల ఆర్థిక సాయం అందింది. డ్వాక్రా సంఘాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ‘సున్నా వడ్డీ’ కింద రూ. 190 కోట్లు అందజేశారు. కోట్లాది రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చారు. కామధేనువు లాంటి జగనన్న సర్కార్ను పోగొట్టుకున్నామని మహిళలు మదనపడుతున్నారు. నేడు ఊరువాడా నిరసన జ్వాలలు కూటమి సర్కార్ ప్రజలను నిలువునా ముంచినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయిలో పోరుబాట పట్టింది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం సాగుతుందని, జిల్లాలోని పార్టీ కేడర్, నాయకులు అందరూ అన్ని కేంద్రాలలోని నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయని వైఎస్సార్సీసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. సురేష్ బాబు అన్నారు. బుధవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబులతో కలిసి ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆవిష్కరించారు. గురువారం నిర్వహించే నిరసన కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. -
గండికోటలో విరోష్ జంట సందడి
జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన, నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో రణబాలి సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. మంగళవారం హీరో విజయ్దేవరకొండపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. బుధవారం గండికోటలోని మాధవరాయస్వామి ఆలయం, జుమ్మా మసీదు సమీపంలోని ధాన్యాగారంలో రష్మిక మందన, విజయ్తో షూటింగ్ చేశారు. చిత్రీకరణ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని యూ నిట్ సభ్యులు తెలియజేశారు. సినిమా చిత్రీకరణను తిలకించేందుకు స్థానికులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. -
నడక ఆగింది..
మృతి చెందిన మదన గోపాల్, వనిపెంట సుమంత్ నడక కోసం గుమ్మం దాటిన ఆ అడుగులు గమ్యం చేరకనే ఆగిపోయాయి.. వందేళ్లు సాగాల్సిన ఆ యువకుల బతుకులు మధ్యలోనే తెలవారిపోయాయి.. తెల్లారకముందే వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.. ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం.. దారి కాచిన మృత్యువు రాకాసిలా దూసుకొచ్చింది.. చూస్తుండగానే ప్రాణాల్ని గాల్లో కలిపేసింది.. అంతే.. వారి నడక శాశ్వతంగా ఆగింది.. మైదుకూరు మండలం.. జీవీ సత్రం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఓ కుటుంబంలో చెట్టంత కొడుకును తన ఒడిలోకి చేర్చుకున్న మృత్యువు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.. మరో కుటుంబంలో పెళ్లయిన ఆర్నెళ్లకే భర్తను దూరం చేసి భార్యకు చేదు జ్ఞాపకాన్నిచ్చింది.. ● జీవీ సత్రం సమీపంలో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ముగ్గురు యువకులపై బొలెరో పికప్ వ్యాన్ దూసుకెళ్లిన సంఘటనలో వనిపెంట సుమంత్(24), కుంభగిరి మదన గోపాల్(25) అనే యువకులు మృతి చెందారు. మరో యువకుడు సామల విజయ నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. సుమంత్ బీటెక్ చదివి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న అతను ముంబై నుంచి 20 రోజుల కిందట ఇంటికి వచ్చాడు. మదన గోపాల్ జీవీ సత్రంలోనే సెలూన్ పెట్టుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. ఆర్నెళ్ల కిందట ఇతనికి వివాహమైంది. మరో యువకుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన ఇద్దరూ బంధు వు లే కావడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. –మైదుకూరు -
రితేష్ ఔట్!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్లు పడ్డాయా? నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్రెడ్డిని పక్కన పెట్టారా? మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శకం బద్వేల్లో ముగిసిందా అంటే ఔను అనే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఏకులా వచ్చిన డీసీసీబ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మేకులా తయారయ్యారు. మొన్న మహానాడు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం, నిన్న బూత్ లెవెల్ ఏజంట్ల నియామక బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు చీఫ్ ఎలెక్షన్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఎలెక్షన్ ఆఫీసర్కు టీడీపీ లేఖ రాసింది. ● తెలుగుదేశం పార్టీలో దివంగత బిజివేముల వీరారెడ్డిది అత్యున్నత క్రియాశీలక పాత్ర. ఒకదశలో ఎన్టీయార్ నిర్ణయాలను ధిక్కరించిన వ్యక్తి. టీడీపీ సంక్షోభంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వానికి అండగా నిలిచిన మొదటి నేత. అలాంటి కుటుంబం రాజకీయ నాయకత్వానికి తాజాగా టీడీపీలో బ్రేకులు పడ్డాయి. ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, మనవడు రితేష్రెడ్డిల ప్రమేయాన్ని బద్వేల్లో కట్టడి చేశారు. ఇన్చార్జి నుంచి అధికారికంగా తప్పించడమే తరువాయి. ఇటీవల మహానాడు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంతో మొదలై ప్రస్తుతం బీఎల్ఏ నియామకంపై అధికారికంగా టీడీపీ ఎన్నికల అధికారులకు లేఖ జారీ చేసింది. ఇకపై సూర్యనారాయణరెడ్డిని నియమించిన వారినే టీడీపీ బీఎల్ఏలుగా పరిగణించాల్సిందిగా నిర్ణయించారు. ‘ధనం మూలం ఇదం జగత్’ అన్నట్లుగా 2014–19వరకూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానికి సాధారణ అనుచరుడుగా ఉన్న మంచూరు సూర్యనారాయణరెడ్డి కాంట్రాక్టర్గా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆర్థిక స్థిరత్వమే అతడిని డీసీసీబీ చైర్మన్ను చేసింది. ఆపై పార్టీలో పట్టుకోసం చాపకింద నీరులా వ్యవహరించారు. ఏకంగా ఇన్చార్జి రితేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నాయకత్వానికి సవాల్గా నిలిచారు. టీడీపీ అధిష్టానం సైతం పాతచరిత్రతో నిమిత్తం లేకుండా ఆర్థిక సమర్థతను పరిగణలోకి తీసుకుంది. ఫలితంగా క్రమేపీ రితేష్రెడ్డి నాయకత్వాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఇక ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించడమే తరువాయి కానుంది. ఈ పరిణామాలు నియోజకవర్గంలోని సీనియర్లకు కంటగింపుగా ఉన్నప్పటికీ అవేవీ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇకపై బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ పెత్తనమంతా మంచూరు సూర్యనారాయణరెడ్డిదేనని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు సమాచారం. నారా లోకేష్ జిల్లా పర్యటన తర్వాతే వేగంగా ఈపరిణామాలు చోటు చేసుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. స్థానిక సంస్థల బాధ్యతలు సైతం సూర్యనారయణరెడ్డికే మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్ మంత్రి నారాలోకేష్ పర్యటన తర్వాత వేగంగా మార్పులు బద్వేల్లో జీర్ణించుకోలేకున్న సీనియర్ నాయకులు -
301 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సోషియల్ పరీక్షలకు 301 మంది గైర్హాజరయారు. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 1623 మందికిగాను 1322 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్కు సంబంధించి రసాయన, ఆర్థికశాస్త్ర పరీక్షలకు సంబంధించి 656 మందికిగాను 586 మంది హాజరయ్యారు. వేంపల్లె: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన ధార్మిక వెంకట్ ఆలిండియా 27వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించానని తెలిపారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అతడిని అభినందించారు. పులివెందుల: పట్టణంలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మూడేళ్లుగా సాధన చేస్తున్న చరిత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ ట్రైనింగ్ సెంటర్కు ఎంపికయ్యారు. గత ఏప్రిల్లో కర్ణాటకలోని మడికేరిలో జరిగిన రాష్ట్ర అకాడమీ ఎంపికల్లో రాణించి హాకీ ట్రైనింగ్ సెంటర్కు ఎంపికయ్యారు. ఈ నెల 8న చరిత అకాడమీలో చేరతారని ఖేలో ఇండియా హాకీ కోచ్ గౌస్ బాషా తెలిపారు. అకాడమీ సెలెక్షన్కు ఎంపికై న చరితకు డీఎస్డీఓ గౌస్ బాషా, వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జి యేసుదాసు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు అభినందనలు తెలిపారు. కడప అర్బన్: రిమ్స్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని విరాజిత గోల్డ్మెడల్ సాధించారు. ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో జనరల్ మెడిసిన్ విభాగంలో ఆమె టాపర్గా నిలిచారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ ఎండీ(జనరల్ మెడిసన్) పట్టా అందుకున్నారు. డాక్టర్ విరాజిత తల్లిదండ్రులు రాఘవరెడ్డి, సర్వరాజ్యలక్ష్మి ఇరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పీజీ కడప రిమ్స్ మెడికల్ కళాశాలల్లో జనరల్ మెడిసన్ విభాగంలో చేసి గోల్డ్మెడల్ సాధించడం విశేషం. తన విజయానికి సహకరించిన రిమ్స్ జన రల్ మెడిసిన్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ యాదవేంద్రారెడ్డి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కుమార స్వామి గుప్తా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న జి.విజయ్ ప్రకాష్ను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ట్రిపుల్ ఐటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. పరిపాలన అధికారి రవికుమార్, కొండారెడ్డి, రత్నకుమారి, అసోసియేట్ డీన్స్ పాల్గొన్నారు. -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ‘బాబూ ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ అనే నినాదాన్ని నిజం చేసి, ఆరు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు అధికారంలోకి వచ్చాక 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా ప్రతి మహిళకు రూ.36వేలు, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు, 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.96వేలు, అన్నదాత సుఖీభవ ద్వారా ఒక్కో రైతుకు రూ.26వేలు బకాయి పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.23లక్షల పింఛన్లు కోత కోశారని, ప్రతినెలా 25వేల పింఛన్లు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు అని కేవలం ఐదు సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారని, మొత్తం ఆర్టీసీనే ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారన్నారు. ఈ ప్రభు త్వం రెండేళ్లలో ప్రజలకు చేసిన మోసాలపై ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ఈనెల 4వ తేది మండల కేంద్రాల కూడళ్లలో టీడీపీ మేనిఫెస్టో కాపీలను, చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండ్లను దహనం చేస్తామన్నారు. 8,9 తేదీలలో నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని, 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, డాక్టర్ సొహైల్, సంబటూరు ప్రసాద్రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్రెడ్డి, కడప నియోజకవర్గ పరిశీలకులు గురుమోహన్, ఎస్సీసెల్ స్టేట్వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్కుమార్, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు శీనయ్య, నూర్బాష్, దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓ. రసూల్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమ అమలును వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డిలతో కలిసి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరైనా చనిపోయారా, వలస పోయారా, ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారా అనే వివరాలను సేకరించాలన్నారు. ఆ వివరాలు తెలిసి ఉంటే బీఎల్ఓలు ఏ ఓట్లు తొలగిస్తున్నారో తెలిసిపోతుందన్నారు. పార్టీ ఇచ్చిన వర్క్షీట్ను భర్తీ చేసి జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. అదనపు ఎస్పీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు కోర్ కమిటీ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తదితరులు జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబును కలిశారు. ఈ సందర్బంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 4, 8,9,12 తేదీలలో నిర్వహించే నిరసన కార్యక్రమాలను తెలియజేశారు. శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమాలను అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఫయాజ్, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈనెల 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో కాపీలు దహనం 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్రెడ్డి వెల్లడి -
రుణాల పంపిణీలో లక్ష్యాలకు మించి పురోగతి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను బ్యాంకులు గణనీయంగా అధిగమించి రుణాల పంపిణీలో విశేష పురోగతి సాధించాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పాల్గొనగా.. వివిధ ప్రధాన బ్యాంకుల రీజనల్ మేనేజర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి బ్యాంకులు సమర్థవంతంగా సహకరించాయని పేర్కొన్నారు. రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్పీఏలను మరింత తగ్గించేలా బ్యాంకులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న స్టార్ట్ అప్ కడప ఎంట్రప్రెన్యూర్ కేంద్ర నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో బ్యాంకర్లు కూడా భాగస్వామ్యం వహించి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్కి వివరించారు. నాబార్డు డీడీఎం విజయ విహారి, యూబీఐ ఏజీఎం లక్ష్మీ తులసి, కేడీసీసీ సీఈఓ రాజమణి, ఎస్బీఐ ఆర్ఎం అబ్దుల్ రవుఫ్, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ ఎలమంద, ఏపీజీబీ కడప ఆర్ఎం శ్రీనివాస్ ప్రసాద్, రాజంపేట ఆర్ఎం రాఘవేంద్ర, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా పీఎస్ సీఐ పి.నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్రఫీ తమ సిబ్బందితో కలిసి ప్రధాన క్రికెట్ బుకీ ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని ఆదివారం రాత్రి అక్కాయపల్లి శాస్త్రి నగర్లో అరెస్ట్ చేశారు. సోమవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్లో ప్రధాన నిందితుడు ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి ఇంటిలో కడప తాలూకా సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడు తన ల్యాప్టాప్, మొ బైల్ ఫోన్లు, వై–ఫై రూటర్ ద్వారా తన సబ్ బుకీలైన వారికి యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును స్వీకరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 12 విలువైన మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ వుంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.7,00,550 నగదు, ల్యాప్టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక వైఫై రూటర్, నగదు కౌంటింగ్ మిషన్, 12 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, మోడమీదపల్లెకు చెందిన అంబవరం మాధవరెడ్డి అలియాస్ మోడమీదపల్లె మాధవరెడ్డి, పులివెందులకు చెందిన నరేష్, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ శేఖర్, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్ అలియాస్ శ్రీహరి, ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి, షేక్ ఇంతియాజ్, జయప్రకాష్ అలియాస్ చంటితోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్లు వెల్లడైందని డీఎ స్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
అధికారం అండ... బెట్టింగ్ దందా !
● ఐపీఎల్ క్రికెట్ ఆధారంగా కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు ● బెట్టింగ్ వ్యవహారాలల్లో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు హల్చల్ ● కడప పోలీసులకు పట్టుబడిన వాసు, పుత్తా వర్గీయులు ● ఎమ్మెల్యే వరద అండతో పరారీలో ప్రధాన బుకీ ఇలియాస్ కడప (సాక్షి ప్రతినిధి): జిల్లాలో టీడీపీ అండదండలతో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆశీస్సులే ఏకై క పెట్టుబడిగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి బానిసగా మారినవారిని రోడ్డున పడేశారు. పుత్తా, వాసు వర్గీయులు బుక్! తాజాగా కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జోనల్ అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి (వాసు) ప్రధాన అనుచరులు కడప పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై కడప నగరంలోని అక్కాయపల్లె ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి, మోడమీదపల్లెకు చెందిన మాధవరెడ్డి, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్, జయప్రకాష్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉంటూ.. ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డికి వెన్నంటే నడిచే యూత్ వింగ్ నేతలు. వీరిలో మాధవరెడ్డిని ఇటీవలే టీడీపీ జోనల్ అధ్యక్షుడు వాసు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. ప్రొద్దుటూరులోనే ప్రధాన మూలాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మట్కా, గుట్కా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఈ దందాలు సాగాయని, తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రూపుమాపుతామని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోగా, మరింత ఘోరంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, జూద నిర్వహణను అడ్డుకోవడంలో విఫలమైన అధికార పార్టీ నేతలు.. ఒకడుగు ముందుకు వేసి ప్రధాన బుకీలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ‘లైసెన్స్’ ఇచ్చారు. ఎక్కడ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ పట్టుబడినా, దాని మూలాలు ప్రొద్దుటూరు బుకీల వద్దకే చేరుతుండటం గమనార్హంలేపాక్షి కేసులో వెలుగుచూసిన లింకులు ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి పరిధిలో పోలీసులు ఒక క్రికెట్ బుకీని పట్టుకుని విచారించగా ఈ భారీ నెట్వర్క్ గుట్టురట్టయింది. సదరు నిందితుడు తాను ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ ద్వారా పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, తాము వసూలు చేసిన క్రికెట్ పట్టీలను ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీ ఇలియాస్కు అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఎమ్మెల్యే అండతో ప్రధాన బుకీ పరారీ.. C…™èl ò³§ýlª G™èl$¢¯]l B«§éÆ>Ë$ ÌSÀ…-_-¯]l-ç³µ-sìæMîS, {糫§é¯]l º$MîS CÍ-Ķæ*‹Ü Cç³µ-sìæMîS ç³Æ>-È-ÌZ¯ól E¯é²yýl$. Ý린MýS GÐðl$ÃÌôæÅ Ð]lÆý‡-§ýl-Æ>-kÌS Æð‡yìlz Æ>f-MîSĶæ$ A…yýl-§ýl…-yýlË$ E…yýlr… Ð]lÌôæÏ CÍ-Ķæ*‹Ü ´ùÎ-çÜ$-ÌSMýS$ _MýSP-MýS$…yé ™èlí³µ…^èl$-MýS$¯é²-yýl¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. MîSÌSMýS çÜ*{™èl-«§é-Æý‡$OÌñæ¯]l Mö…§ýlÆý‡$ º$MîSË$ A«¨-M>Æý‡ sîæyîlï³ VýS*sìæMìS ^ólÇ-´ùÐ]l-yýl…™ø, ÐéÇOò³ MýS¯ðl²†¢ ^èl*õÜ ÝëçßæçÜ… MýS*yé Ý린MýS ´ùÎ-çÜ$Ë$ ^ólĶæ$-Ìôæ-MýS-´ù-™èl$-¯é²-Æý‡¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. hÌêÏ ÐéÅç³¢…V> GMýSP-yðl-MýSPyýl »ñæsìæt…VŠæ MóS…{§éË$ E¯é²Æ‡$$, GÐ]l-Æð‡-Ð]lÆý‡$ °Æý‡Ó-íßæ-çÜ$¢¯é²Æý‡$ A¯ól ÑçÙĶæ*-ÌSOò³ °çœ* Ð]lÆ>YÌSMýS$, ´ùÎçÜ$ Ð]lÅÐ]l-çܦMýS$ ç³NÇ¢ çÜÐ]l*-^éÆý‡… E¯]l²-ç³µ-sìæMîS.. ÐéÆý‡$ °Ð]l$ÃMýS$ ±Æð‡-†¢-¯]lr$Ï Ð]lÅÐ]l-çßæ-Ç-çÜ$¢-¯é²-Æý‡¯ól BÆø-ç³×æË$-¯é²Æ‡$$. A«¨-M>Æý‡ 糄ýS… ¯]l$…_ Ð]lçÜ$¢¯]l² ¡{Ð]lOÐðl$¯]l Æ>f-MîSĶæ$ J†¢yìl M>Æý‡-׿…-V>¯ól ´ùÎ-çÜ$Ë$ ^èlsêt°² çÜ{MýS-Ð]l$…V> लाAÐ]l$Ë$ ^ólĶæ$Ìôæ MýS$¯é²Æý‡° {ç³fË$ B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢¯é²Æý‡$. ఎన్నికల కోసమే బెట్టింగ్ దందా? పోలీసులకు చిక్కిన వారంతా టీడీపీకి చెందిన కేవలం సాధారణ కార్యకర్తలు కారని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తృతీయ శ్రేణి నాయకులని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకే, ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా ఈజీ మనీ వైపు మొగ్గు చూపి కోట్లాది రూపాయలు ఆర్జించారని పరిశీలకులు భావిస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు పరిధిలోనే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఇలాంటి టీడీపీ నేతల అక్రమ దందాలు సాగుతున్నాయని సమాచారం. -
దగా డీఎస్సీపై ధ్వజం
● డీఎస్సీ అక్రమాలపై నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిన యువత ● డీఎస్సీని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ ● వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగంఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కడప కార్పొరేషన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో మెగా కాదు...దగా డీఎస్సీపేరుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని, డీఎస్సీ రాసి న అభ్యర్థులతోపాటు అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం వీసమెత్తు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పూర్తిగా తప్పుడు విధానమన్నారు. డీఎస్సీపై 33వేల మంది ఫిర్యాదులు చేశారని, వారి గ్రీవెన్స్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ చేసి నిజా నిజాలు నిగ్గుతేల్చాలని, తద్వారా అర్హులైన వారికి న్యా యం చేయాలన్నారు. డీఎస్సీని రద్దు చేసి మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ‘ఒక్క పరీక్ష–వేల సందేహాలు’, పేపర్లు లీక్, డేటా డెలీట్, మెరిట్ లిస్టు మాయం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం వారు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు, వైఎస్సార్సీపీ యువజన విభాగం కడప నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ షఫీవుల్లా, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఎం.గురుప్రసాద్ మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1.73లక్షల సచివాలయ ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్...16వేల ఉద్యోగాలే అయినా అనేక అక్రమాలు జరిగాయన్నారు. యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు మెగా డీఎస్సీ పేరుతో వారి జీవితాల ను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథరెడ్డి (ప్రొద్దుటూరు), చంద్ర ఓబుల్రెడ్డి(మైదుకూరు), ఈశ్వర్రెడ్డి(కమలాపురం), నరసింహారెడ్డి(బద్వేల్), హరీష్రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ఉపాధ్యక్షులు సందీప్, పఠాన్ ఖాన్, పార్టీ నాయకులు రహీమ్, అఖిల్, వంశీ, నాగేంద్ర ప్రసాద్, కంచుపాటి బాబు, చల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య తదితరులుకలెక్టరేట్లో అధికారికి వినతిపత్రమిస్తున్న పార్టీ నేతలు -
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీ నామా చేయాలి. ఉద్యోగం కోసం లక్షలాది మంది అభ్యర్థు లు అనేక మాసాలుగా రేయింబవళ్లు చదివి ఉంటారు. వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కలల్ని ఈ ప్రభుత్వం ఛిద్రం చేసింది. కేవలం 40 రోజులు సమయమిచ్చి డీఎస్సీ నిర్వహించడంలోనే మతలబుదాగుంది. – దేవిరెడ్డి ఆదిత్య, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు -
మెరిసిన మనోళ్లు
● ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులు ● ఓపెన్ కేటగిరిలో 23, 28, 51 ర్యాంకులు ● కడపకు గర్వకారణంగా నిలిచిన వైనంకడప ఎడ్యుకేషన్ : ప్రతిష్టాత్మక ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్(2026) ఫలితాల్లో మనోళ్లు మెరిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వారు తమ ఆశయాలతోపాటు తల్లిదండ్రుల కల నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చెందిన విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో 23, 28, 51, 243 ర్యాంకులు సాధించి భళా అనిపించారు. బద్వేలుకు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి, జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన ముక్కర సాకేత్రెడ్డి, వల్లూరు మండలంలో కొప్పోలుకు చెందిన మోపూరి వేదచరణ్రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చరిత్ర లిఖించారు. రాయలసీమ జిల్లాలకు 100లోపు ర్యాంకు అసాధ్యమని విద్యావేత్తలు భావించేవారు. అలాంటి వారి అంచనాలు తలకిందులు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి, ముక్కర సాకేత్రెడ్డి, మోపూరి వేదచరణ్రెడ్డి జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫౌండేషన్ వేసిన ‘సంకల్ప్’ ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, నీట్ ఇలాంటి పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరిలో 100లోపు ర్యాంకులు సాధిస్తూ సంకల్ప్ విద్యార్థులు చరిత్ర సృష్టిస్తున్నారు. సంకల్ప్ కడపలో చదివి, కడపలో ఫౌండేషన్ తీసుకొని ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరిలో 51వ ర్యాంకు వేదచరణ్రెడ్డి సాధించారు. గతంలో ఐఐటీ మెయిన్స్ ఓపెన్ క్యాటగిరిలో ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించిన శశాంక్ అనిరుద్రెడ్డి, నీట్లో ఆల్ ఇండియా 100లోపు ర్యాంక్ సాధించిన వినయసింహరెడ్డి, ప్రణతిరెడ్డి కడప సంకల్ప్లో ఫౌండేషన్ కోర్స్ ద్వారా జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం విశేషం. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో చేపట్టిన సంకల్ప్ ఫౌండేషన్ నుంచి గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో సంతృప్తిగా ఉందని సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకులు వంశీ, రేణుక వెల్లడించారు. ● కడప నగరానికి చెందిన మోపూరి వేణుగోపాల్రెడ్డి, లక్ష్మీశిరీషల కుమారుడు మోపూరి వేద చరణ్రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడప నాగార్జున మోడల్ స్కూల్లో చదువుకుంటూ సంకల్ప్ కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సు శిక్షణ తీసుకున్నాడు. 10వ తరగతిలో 600 మార్కులకు 578 మార్కులు సాధించాడు. ఆ తరువాత విజయవాడ నారాయణ కళాశాలలో ఎంపీీసీ(సీపీఎస్ఈ)లో 500 మార్కులకు 470 మార్కులు పొందారు. కడప ఎడ్యుకేషన్: నగరానికి చెందిన వి.మల్లేశ్వరరెడ్డి, రాజేశ్వరి కుమారుడు వెంగరెడ్డి రెడ్డి ప్రసా ద్రెడ్డి 243వ ర్యాంకు సాధించాడు. ఈ అబ్బా యి కడపలోని నాగార్జున మోడల్ స్కూల్లో చదివి 10వ తరగతిలో 585 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ను విజయవాడలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివి ఎంపీసీ(సీబీఎస్సీ)లో 461 మార్కులు పొందాడు. జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్ 26వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. పట్టణంలోని పెద్దపసుపల రహదారిలోని టీచర్స్ కాలనీకి చెందిన హరిత 395వ ర్యాంక్ సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, అపర్ణ తెలిపారు. పట్టణానికి చెందిన గొంగటి వెంకట వంశీధర్రెడ్డి 581వ ర్యాంక్ సాధించాడు. బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి 23వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి ఎ.విజయభాస్కర్రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా డు. హేమంత్కుమార్రెడ్డిని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు అభినందించారు. సిద్దవటం : సిద్దవటం పట్టణానికి చెందిన ముక్కర సాకేత్ 28వ ర్యాంకు సాధించాడు. ఆ విద్యార్థి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను సిద్దవటంలోని శ్రీ భారతి హైస్కూల్లో అభ్యసించాడు. వంతాటిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ముక్కర వెంకటసుబ్బారెడ్డి, ముక్కర నిర్మలాదేవి తన విజయానికి ప్రధాన ప్రేరణగా నిలిచారని సాకేత్ తెలిపారు. -
● ఓట్లు–సీట్లు ఇచ్చినా అదే దుస్థితి
సాక్షి ప్రతినిధి, కడప: నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం దేని పని దానిదే. అచ్చం అలాగే వైఎస్సార్ కడప జిల్లా పట్ల సీఎం చంద్రబాబు వైఖరి స్పష్టమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం మహానాడు వేదికగా కడప కేంద్రంగా జిల్లా అభివృద్ధికి హామీల వర్షం కురిపించారు. జీఎన్ఎస్ఎస్ ఫేజ్–1 పనులను పూర్తి చేసేందుకు రూ.1000కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తికి రూ.170కోట్లు, గండికోటలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాం ఏర్పాటుకు రూ.32.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కడపకు రూ.68.45కోట్లు, బుగ్గవంక ఆధునికీకరణకు రూ.100 కోట్లు, చెన్నూరు సమీపంలో హజ్హౌస్ పూర్తి కోసం రూ.10కోట్లు, దాదాపుగా రూ.1381కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు 2025 మే29న ప్రకటించారు. ఏడాది పూర్తయినా అభివృద్ధి పనుల్లో ఇసుమంతైనా పురోగతి లేదు. ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. కడప అంటే సీఎం చంద్రబాబుకు వివక్షే నేను రాయలసీమలోనే పుట్టాను, సీమ బిడ్డనంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రాయలసీమకు ప్రత్యేకించి వైఎస్సార్ కడప జిల్లాకు అభివృద్ధికి చేసింది శూన్యం. పైగా జిల్లా పారిశ్రామిక ప్రగతికి అవరోధంగా నిలుస్తూ అనేక మార్లు కడప అంటే కడపు మంట అని చాటుకున్నారు. నాటి బ్రహ్మణీ స్టీల్స్ నుంచి నేటి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకూ ఎన్నో ఆటంకాలు సృష్టించారు. తుదకు సాగు, తాగునీరు సరఫరాకు యోగ్యకరంగా నిలుస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కూడా అడ్డుతగిలారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తుదకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రక్రియను కూడా అడ్డుతగిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంకారప్రాయంగా పులివెందుల మెడికల్ కళాశాల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధిని కూడా కొనసాగించలేని దుస్థితిలో కూటమి సర్కార్ ఉండిపోయింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిలుస్తోంది. రూ.530 కోట్లతో నిర్మించిన ఈ మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు కూడా దక్కాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 50ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే పెండింగ్ పనులు ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కోరింది. ఆ లేఖను ఇస్తే 2024–25కు 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యేవి. 5శాతం పెండింగ్ పనులు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ మనుసు అంగీకరించలేదు. వెరశి ఎన్ఎంసీకి సీట్లు అవసరం లేదంటూ ఏకంగా ఎన్ఎంసీ లెటర్ రాశారు. 2024–25లో 50 సీట్లు దక్కి ఉంటే ఈ ఏడాది 2025–26, 2026–27లల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున లభించేవి. జిల్లాలో పట్ల సీఎం చంద్రబాబు కడపు మంటకు మెడికల్ కళాశాల ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జిఎన్ఎస్ఎస్ ఫేజ్–1 పనులు వేగంగా చేసేందుకు రూ.1000 కోట్లు, వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసేందుకు రూ.170కోట్లు మంజూరు చేయనున్నట్లు ఏడాది క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే వీరపునాయునిపల్లె, వేంపల్లే, వేముల, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, కమలాపురం, కడప మండలాల్లో భూసేకరణ, పెండింగ్ పనులు నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చిత్త శుద్ధి లేని హామీలు ఇవ్వడం.. ఆపై మిన్నకుండిపోవడం మినహా, నిర్దిష్టమైన అభివృద్ధి చేయాలనే తలంపు కూటమి సర్కార్కు లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అదే స్థాయిలో సీఎం హామీలు అమలు చేయించి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తట్టలేదని పరిశీలకులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అభివృద్ధి కోసం కొంతైనా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. కడప వేదికగా రూ.1380కోట్ల నిధుల మంజూరుకు సీఎం హామీ ఏడాది పూర్తయినా అభివృద్ధిలో పురోగతి లేదు...నిధుల ఊసు అసలే లేదు నాడు ఓట్లు–సీట్లు ఇవ్వలేదన్న చంద్రన్న...సీట్లు ఇచ్చినా అదే వివక్ష 2014లో అధికారం దక్కించుకున్న తర్వాత జిల్లా పర్యటనకు సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఓ బహిరంగ సభలోనే మీరు నాకు ఓటేశారా..మీకు అభివృద్ధి చేయడానికి..? అంటూ ప్రశ్నించారు. 2024లో ఓట్లు సీట్లు ఇచ్చినా ఈ ప్రాంతం పట్ల అక్కసు, అసూయ తగ్గడం లేదని పలువురు మండిపడుతున్నారు. నాడు ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పద్మావతి మెడికల్ కళాశాలల్లో సీట్లు రాయలసీమ విద్యార్థులతోనే భర్తీ చేయాలనే నిబంధనలను నాటి చంద్రబాబు సర్కార్ తోసి పుచ్చుతూ జిఓ 130 తీసుకొచ్చి రాయలసీమకు అన్యాయం చేసింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పులివెందుల మెడికల్ కళాశాలకు 50సీట్లు ఎన్ఎంసీ కేటాయిస్తే చంద్రబాబు సర్కార్ మోకాలొడ్డుతోంది. స్వతహాగా సీఎం చంద్రబాబుకు రాయలసీమ, అందులో కడప, పులివెందుల అంటే ఎక్కడ లేని కోపం, ఆక్రోశం వెళ్లగక్కుతాడడని పలువురు ఆరోపిస్తున్నారు. మభ్యపెట్టే మాటలు చెప్పడం మినహా నిర్దిష్టమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేసిన చరిత్రే లేదని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. అలంకారప్రాయంగా ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు అలంకారప్రాయంగా ఉండిపోయారు. సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా, జిల్లా పర్యటనకు వ చ్చిన ప్రతిసారి హామీలు ఇవ్వడం,ప్రజల్ని మభ్యపెట్టడం మినహా జిల్లాలో అభివృద్ధి లేదు.ప్రజాప్రతినిధులకు నిలదీసే దమ్ము లేదు. – గాలి చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐసీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం చంద్ర బాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఏడాది గడిచినా ని ధులు విడుదల చేయలేదు.త్వర లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబు తారు.స్థానిక సంస్థలఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. –చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం -
మహిళ అదృశ్యం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన ఎద్దుల జయమ్మ(63) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు నాగరాజు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోట్లదుర్తి గ్రామంలో నివాసం ఉండే ఎద్దుల నాగన్న, జయమ్మకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గేదెలను కట్టేసే విషయంలో కోడలితో గొడవ పడింది. ఈ క్రమంలో జయమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తర్వాత తిరిగి రాలేదు. బంధువులు ఇళ్లు, చుట్టు పక్కల వారిని విచారణ చేసినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలతో విశ్వసనీయతకడప సెవెన్రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
పేదరికం చిన్నబోయింది.. వైద్య విద్య వరించింది
● తండ్రి లారీ డ్రైవర్ ● ఇద్దరు కుమారులు వైద్యులు ● నెరవేరిన వారి కలవారు పేదింటి పిల్లలు.. పల్లె ప్రాంతానికి చెందిన వారు.. తమ చదువుకు ఇవేవీ ఆటంకం కాదని నిరూపించారు. ఇద్దరు అన్నదమ్ములు నీట్లో సీటు సాధించి వైద్య విద్య అభ్యసించారు. తమ తల్లిదండ్రుల కల నెరవేర్చారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వేంపల్లె : రోజంతా లారీ నడుపుతూ కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడిన ఓ తండ్రి కన్నీటి కల నెరవేరింది. వేంపల్లెలోని మేదర వీధిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహబూబ్ బాషా వృత్తి రీత్యా లారీ డ్రైవర్, ఆయన భార్య కౌసర్ గృహిణి, వీరికి ఇద్దరు కుమారులు. వారిని బాగా చదివించాలనే ఉద్దేశంతో.. సంపాదన తక్కువైనా మహబూబ్ బాషా ఎన్నో కష్టాలు భరించారు. మండే ఎండలు, వర్షాలు, రాత్రింబవళ్లు లారీ నడిపి పిల్లల చదువుల కోసం జీవితమంతా రోడ్లపైనే గడిపారు. తన పిల్లలు మాత్రం మంచి స్థాయికి చేరాలని ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన కుమారులు చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. ముందుగా మహబూబ్ బాషా పెద్ద కుమారుడైన ఉమర్ బాషా రెండు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేయగా రెండవ కుమారుడు సమీర్ బాషా కూడా ఎంబీబీఎస్ను ఫస్ట్ క్లాస్తో పూర్తి చేసి కుటుంబానికి అపారమైన ఆనందాన్ని అందించారు. మొదటి కుమారుడు డాక్టర్ ఉమర్ కడప రిమ్స్లో, రెండవ కుమారుడు డాక్టర్ సమీర్ బాషా కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. తండ్రి మహబూబ్ బాషా, తల్లి కౌసర్, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు అన్న డాక్టర్ ఉమర్ బాషా ప్రోత్సాహంతో సమీర్ బాషా తన వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి కష్టం, తల్లి ఆశీర్వాదం, కుటుంబ నమ్మకం కలిసొచ్చి ఒక లారీ డ్రైవర్ కుమారులు డాక్టర్ స్థాయికి ఎదిగారు. ఒక లారీ డ్రైవర్ కుమారులు వైద్యులు కావడం ఇప్పుడు ఎంతో మంది పేద కుటుంబాల పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరు కుమారులు మాట్లాడుతూ మా తండ్రి స్టీరింగ్ పట్టి మా భవిష్యత్తును నడిపించారని తెలిపారు. నేడు స్టెతస్కోప్ పట్టడం మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండే గర్వకారణం అని లారీ డ్రైవర్ మహబూబ్ బాషా తెలిపారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో వేంపల్లి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సమీర్ బాషా, ఉమర్ బాషాకు అభినందనలు తెలియజేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశాం మా తల్లిదండ్రుల కష్టాలను మేము కళ్లారా చూశాం. భవిష్యత్తులో వారి కష్టాలను తొలగించి సుఖ జీవనం సాగాలని కోరుకున్నాం. ఒక లక్ష్యంతో కష్టపడి చదివాం. అలాగే 10 మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కష్టపడ్డాం. తండ్రికి వచ్చిన చిన్న ఆదాయంతోనే మేము మంచిగా చదివి ఉచితంగా సీట్లు సాధించి ఉన్నత స్థాయి చదువులు అభ్యసించాం. మా తల్లిదండ్రుల కలను మేము సహకారం చేశాం. – డాక్టర్ సమీర్ బాషా, ఎంబీబీఎస్, మేదర వీధి, వేంపల్లె -
110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవర
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండల పరిధిలోని బిదినంచెర్లలో 110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ 110 ఏళ్ల తర్వాత దేవర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉంటాయన్నారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, కేశవరెడ్డి పెద్దిరెడ్డి ఇళ్లకు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలోకి రాగానే మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ, పూలమాలలతో డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. 110 ఏళ్ల తర్వాత జరుగుతున్న దేవర కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ డాక్టర్ నాయక్, తొండూరు ఎస్ఐ మద్దిలేటి, లింగాల ఎస్ఐ జగదీశ్వర్రెడ్డి చర్యలు తీసుకోవడంతో దేవర ప్రశాంతంగా ముగిసింది.అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
డీఎస్సీ స్కామ్ బయటపడగానే డైవర్షన్ పాలిటిక్స్
పులివెందుల: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్తోపాటు వారి అనుచరులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. ఆదివారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులకు మోసం చేసి డీఎస్సీ ఉద్యోగాలను పెద్ద ఎత్తున అమ్ముకున్నారని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు కాల్లెటర్లు పంపి సర్టిఫికెట్లు కూడా పరిశీలించిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడటం జరిగిందన్నారు. చంద్రబాబుకు తన తప్పులు బయటపడగానే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన చేస్తున్న అనైతిక కార్యక్రమాలు బయటపడగానే వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు, ఎల్లో మీడియా ద్వారా విషపు రాతలు మొదలుపెట్టి డైవర్షన్ చేస్తారన్నారు. ఇప్పుడు కూడా అలాగే డీఎస్సీ స్కామ్ బయట పడగానే అక్రమ మద్యం కేసుల పేరుతో టాపిక్ డైవర్షన్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన తప్పు కప్పి పుచ్చుకోనడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే బాధ్యతగా అందుకు సమాధానాలు చెప్పకుండా చంద్రబాబునాయుడుతోపాటు ఆయన అనుచరులు ఏమాత్రం సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి పచ్చి అపద్ధాలతో ఎదరుదాడి చేస్తున్నారన్నారు. చేసిన తప్పులకు సమాధానం చేప్పే ధైర్యం లేక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. గడిచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకులు ఆయనను కలిశారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ జయప్రదం చేయండి చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలను వివరించాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగాదోచుకుంటున్న కూటమి నేతలు ప్రశ్నిస్తే సమాధానంచెప్పకుండా ఎదురుదాడి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
కడప కార్పొరేషన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదాసిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, అయితే ఈ డీఎస్సీలో పేపరు లీకేజీ వల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీపీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంకు వచ్చిందని, అతని వల్లే పేపరు లీక్ అయిందన్నారు. అతను ఎంతమంది ఆ పేపరును లీకేజ్ చేశారో తెలియదన్నారు. అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఒకసారి, ఉద్యోగం అవసరం లేదని చెప్పాడని మరోసారి, ఒక ఉద్యోగం చేస్తున్నందున మరో ఉద్యోగం ఇవ్వలేదని ఇంకోసారి ఇలా రకరకాలుగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అలాగే డీఎస్సీపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. 33,300 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని అధికారులు పరిష్కరించలేదన్నారు. ● దొంగే దొంగ దొంగ అన్నట్లు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబితే మీ హయాంలో తప్పులు జరిగాయి...జగన్ మేనమామ పోస్టులు అమ్ముకున్నారని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లక్షా 73 వేల సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి సిఫార్సు లేకుండా పూర్తి మెరిట్ ప్రకారం భర్తీ చేశారన్నారు. దీనిపై వారు విచారణ కూడా చేసుకోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తుంటే, 96 ఆరోపణలు వచ్చాయన్నారు. జెడ్పీ నియామకాల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి: జెడ్పీలో నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. విజయనగరంలో ఓ అభ్యర్థి డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకు పూర్తి అర్హుడైనప్పటికీ అతనికి ఆ కోటాలో ఉద్యోగం రాలేదన్నారు. డీఎస్సీ, టెట్ పాసైన వారికి కాకుండా డైరెక్టుగా శాప్ ద్వారా పోస్టులు భర్తీ చేసి మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డీఎస్సీ–1998 వారికి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, అవన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల తరుపున తాము పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని, రెండేళ్లవుతున్నా ఒక్క పీఆర్సీ కనిపించలేదని, నాలుగు డీఏలు, ఐఆర్ పెండింగ్లోఉన్నాయన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ. 30 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ పాకా సురేష్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి వైఎస్సార్ సీపీ హయాంలో తప్పులు జరిగాయని చెప్పడం దారుణమన్నారు. అప్పుడు అక్రమాలు జరిగి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రామగోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈసమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పులి సునీల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వీరారెడ్డి, శ్రీ రంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దొంగే దొంగ..దొంగ అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
నేడు డయల్ యువర్ కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు. రాజంపేట టౌన్: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ మేజర్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దుగ్గినేని శ్రావణి ఏపీపీజిసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. శ్రావణి 100కు 99 మార్కులు సాధించారు. ఇదే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ మేజర్గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయేషా కౌసర్ రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీ.పురుషోత్తం తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించగలరని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజినీర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా వినియోగదారులు అన్నమయ్య: 9440817449, కడప: 08562242457 నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. కడప సెవెన్రోడ్స్: సోమవారం కలెక్టరేట్లో జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వైబ్సెట్లో తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ● సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు సమస్యలకుసంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : చిన్నదండ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్త గోపులాపురంలో గోసుల శ్రీరాములు (23) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోపులాపురానికి చెందిన గోసుల చౌడప్ప కుమారుడు గోసుల శ్రీరాములు పదేళ్ల కిందట అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేట నుంచి వచ్చి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా గ్రామంలోని ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవారు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు ఇటీవల ఆమెను మందలించి గ్రామం నుంచి తీసుకెళ్లారు. గత నెల ఆమె తిరిగి గ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి శ్రీరాములు ఇంట్లో ఇద్దరూ నిద్రపోయారు. ఆదివారం ఉదయం శ్రీరాములు సోదరి పార్వతి ఇంటి వద్దకు వచ్చి చూడగా.. శ్రీరాములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. జమ్మలమడుగుడు డీఎస్పీ వెంకటేశ్వరరావు, యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి గొంతుపై కమిలిన గుర్తులు ఉన్నట్లు తెలిపారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పరేషన్కు ఏడాది
జిల్లాలో రేషన్షాపులు, కార్డుల వివరాలు రేషన్ ఏఏవై తెల్ల మొత్తం షాపులు కార్డులు కార్డులు కార్డులు 1239 36,031 5,42,746 5,78,777 కడప సెవెన్రోడ్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోవడంతో కారు్ాడ్దరులకు కష్టాలు ప్రారంభమై సోమవారానికి ఏడాది పూర్తి అవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీపీఎల్ కార్డుదారుల పాలిట శాపంగా మారింది. పేదలు పనులు వదులుకొని రేషన్షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 ఎండీయూ వాహనాలు ఆగిపోవడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న యువత ఉపాధి కోల్పొయి రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పటిష్టం చేయకపోగా తమను కష్టాలపాలు చేసిందని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. ఒకప్పుడు వృద్ధులు, దివ్యాంగులు, రోజు కూలీలు తమ ఇళ్లకు అవసరమైన సరుకులు తెచ్చుకునేందుకు ఎఫ్పీ షాపుల వద్ద భారీ క్యూలలో గంటలకొద్ది పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 366 మొబైల్ డిస్పెసింగ్ యూనిట్లు (రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాలు) ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనం ద్వారా కనీసం ఇద్దరు ఉపాధి పొందేవారు. ఈ వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేవి. ఫలానా రోజు బియ్యం బండి వస్తుందనే సమాచారం వలంటీర్ల ద్వారా ప్రజలకు సమాచారం అందేది. దీంతో ప్రజలు ఆ సమయంలో ఇళ్ల వద్దనే ఉండి తమకు అందాల్సిన బియ్యం, చక్కెర, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకునేవారు. కరోనా వైరస్ వ్యాపించినపుడు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో బియ్యం బండ్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రజల్లో చెరిపేయడం కోసం ఆయన ముద్ర ఉన్న పలు పథకాలను రద్దు చేశారు. అందులో ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం ఒకటి. 2027 వరకు ఎండీయూ వాహనాలు కొనసాగేందుకు ఒప్పందం ఉన్నప్పటికీ వాటిని రద్దుచేసి యువతను కూటమి ప్రభుత్వం రోడ్లపాలు చేసింది. దీంతో ఎండీయూ నిర్వాహకులు మరో ఉపాధి కానరాక, కుటుంబాల పోషణ భారంగా పరిణమించింది. వైఎస్ జగన్ హయాంలో ఉచిత బియ్యంతోపాటు కార్డుదారులకు చక్కెర, కందిబేడలు, గోధుమపిండి, జొన్నలు, రాగులు వంటివి కూడా పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెడుతోంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా తక్కువ ధరతో కందిబేడలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎఫ్పీ షాపుల ద్వారా కందిబేడలు సరఫరా చేయకపోవడంతో ప్రజలు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 170–180తో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ కోసం తప్పని తిప్పలు గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. ఈ విధానం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన త తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలను రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించారు. ఇందువల్ల రేషన్కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. – వడ్ల భాగ్యలక్ష్మి, కడప ఆ విధానమే బాగుండేది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన బియ్యం బండ్ల విధానమే బాగుండేది. ఇంటి ముంగిటికే సరుకులు వచ్చేవి. కరోనా కష్టకాలంలో ఇది ఎంతో ఉపయోగపడింది. చంద్రబాబు వచ్చిన తర్వాత బియ్యం బండ్లను రద్దు చేయడంతో పనిపాట చేసుకుని బతికే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – టి.వెంకట సుబ్బమ్మ, రామరాజుపల్లె, కడప 366 ఎండీయూ వాహనాల నిలిపివేత ఉపాధి కోల్పోయిన యువత ఎఫ్పీ షాపుల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు -
ఇరు వర్గాల ఘర్షణ.. ఆరుగురికి గాయాలు
మైదుకూరు : మండలంలోని ముసల్నాయనిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు రాళ్లు, చాకులతో దాడి చేసుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రోజులైన సందర్భంగా గ్రామస్తులు తమ బంధువులను పిలుచుకొని వేడుక చేసుకున్నారు. బంధువుల ఇళ్లకు వచ్చిన వారిలో ఓ వర్గం వారు భార్యాభర్తల గొడవను ప్రస్తావించి పరస్పరం రెచ్చగొట్టుకోవడం ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన బండి తిరుమలయ్య అనే యువకునికి మున్సిపాలిటీలోని వేపరాలపల్లెకు చెందిన కశెట్టి ఓబయ్య కుమార్తె ప్రసన్నతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్లుగా వారు విడిగా ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకకు వచ్చిన వారు భార్యాభర్తల విషయం ప్రస్తావించి.. వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. సంఘటనలో నానుబాల ఇంద్రసేన, నానుబాల శివ, నానుబాల చిన్న ఈశ్వరయ్య, బండి తిరుమలయ్య, బండి సురేష్, బండి సుబ్బరాయుడు అనే వారు గాయడ్డారు. ఓ వర్గాన్ని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి, మరో వర్గానికి చెందిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరస్పర ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆటోను ఢీకొన్న బొలెరో
ఎర్రగుంట్ల : మండల పరిధి పెద్దనపాడు గ్రామ సమీపంలోని చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పెద్దమాచుపల్లె ఆంజనేయులు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన వివరాల మేరకు... ఎర్రగుంట్ల పట్టణంలోని పుష్పగిరి మాన్యంలో నివాసం ఉండే గుమ్మయ్య కుమారుడు ఆంజనేయులు ఆటోను బాడుగులకు నడుపుతూ, రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఆయనకు భార్య లక్ష్మీనరసమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆదివారం లక్ష్మీనరసమ్మ బట్టలు ఉతకడానికి పెద్దనపాడు గ్రామ పరిధి వంకలోని చాకిరేవుకు వెళ్లింది. ఆంజనేయులు ఆటో నడుపుకొంటూ అక్కడికి బయలుదేరాడు. చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే సమీపంలో ఉన్న లక్ష్మీనరసమ్మ వెంటనే స్థానికుల సాయంతో ఆంజనేయులును ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరగైన వైద్య కోసం కడప రిమ్స్కు తరలించే ప్రయత్నం చేసే లోపే ఆంజనేయులు మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బద్వేలులో దొంగల హల్చల్బద్వేలు అర్బన్ : పట్టణంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దొంగలు హల్చల్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్ 5వ లైన్లో ఓ ఇంటిలోకి ప్రవేశించి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదు, కొంత వెండి సామగ్రి చోరీ చేశారు. అనంతరం స్థానిక మైదుకూరురోడ్డులోని ఎంసీ ఫర్నిచర్షాపులో శనివారం అర్ధరాత్రి గడ్డపారతో షట్టర్ లాక్లు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు క్యాష్టేబుల్ డ్రాయర్లు, బీరువా తాళాలు పగులకొట్టి నగదు కోసం గాలించారు. అయితే ఎటువంటి నగదు లభించకపోవడంతో షాపునకు సంబంధించిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. అలాగే నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల సియట్ షోరూమ్లోకి ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్లోని రూ.60 వేల నగదుతోపాటు షోరూమ్లోని రూ.1.20 లక్షలు విలువ చేసే 8 స్టార్ హెడ్లైట్లు దొంగిలించారు. ఉదయం దుకాణాలు తెరిచేందుకు వెళ్లిన ఆయా షాపుల యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో చోరీ ఘటనలు చోటు చేసుకోవడంతో సీరియస్గా పరిగణించిన అర్బన్ పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంచిన్నమండెం : కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) దుర్మరణం చెందింది. మండల పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
ఆ బుకీలకు అధికార పార్టీ నేతల అండ
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రొద్దుటూరులో మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఇలా జరుగుతోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గత ఎన్నికల సందర్భంగా వాడవాడలా ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని రూపుమాపుతామని ఉపన్యాసాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. వీటిలో వేటినీ నియంత్రించకపోగా కొత్తగా క్యాషినో జూదం తోడైంది. గంజాయి ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే కారణం. టీడీపీలో చేరిన కొందరు బుకీలు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన క్రికెట్ బుకీలు రూ.కోట్లకు పడగ ఎత్తారు. డబ్బు ప్రభావంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాప్రతినిధులను సైతం ప్రభావితం చేస్తున్నారు. ఈ కారణంగానే వారిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ప్రధాన బుకీ ఇలియాస్కు సంబంధించిన ఆధారాలు ఇటీవల పోలీసులకు లభ్యమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి వద్ద పోలీసులు ఓ క్రికెట్ బుకీని పట్టుకోగా ఆయన ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ పేరు చెప్పారు. ఆయనను పోలీసులు విచారణ చేసి క్రికెట్ పట్టీలను ఎవరికి ఇస్తున్నావని ప్రశ్నించగా.. ఇలియాస్కు ఇస్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికంగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం వద్దకు వెళ్లి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు కార్ల వ్యాపారానికి సంబంధించినదని చెప్పి విడిపించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఇంత వరకు ఇలియాస్ పోలీసులకు దొరకలేదు. ఆయనకు అధికార పార్టీ నేతల అండ ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే మట్టి మసీదు వీధిలో, జిన్నా రోడ్డులో క్రికెట్ బుకీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మట్టి మసీదు వీధికి చెందిన బుకీ కుటుంబ సభ్యులు, జిన్నా రోడ్డుకు చెందిన బుకీ.. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇలాంటి కారణాల వల్లే పోలీసులు బుకీలను కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.● పట్టుబడని ప్రధాన బుకీలు ● పోలీసుల తీరుపై విమర్శలు -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
జమ్మలమడుగు : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ముద్దనూరు రోడ్డులోని నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాల్లో రజక సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు లోగిడి జయన్న, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల లక్షుమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాలు బాగు పడాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదువుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలకు తగిన ప్రతిఫలం సాధించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోలన్నారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అవసరాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టి ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, షూ, బ్యాగులు అందించారన్నారు. ఇలాంటి ప్రతిభా పురస్కారాలు నిరుపేద పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 36 మందికి రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల చొప్పున నగదుతో పాటు ప్రతిభాపురస్కారాలను అందించారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అఽధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, పోచిరెడ్డి, జానీ, ఫయాజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు గుర్విరెడ్డి, రమణారెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, రఘునాథ్రెడ్డి, తలమంచిపట్నం వినయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నందలూరు : నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పైనుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి(యాచకుడు) మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకొని జీవనం సాగించే ఈ వ్యక్తి అండర్ బ్రిడ్జి గోడపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి గురించి ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆచూకీ గుర్తిస్తే తమను సంప్రదించాలని చెప్పారు. ఆర్యుబీ గోడపైన క్లోజ్ చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. శివాలయంలో కొండ చిలువ కలకలంముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామ శివారు, కొండ ప్రాంతం కావడంతో సర్పాలు, విష పురుగుల సంచారం అధికంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. -
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీల అమలేదీ?
● నమ్మించి మోసం చేయడంలో ‘కూటమి’సూపర్ సక్సెస్ ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదని, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ పార్టీలు ఇష్టారాజ్యంగా అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. హామీల అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై వ్యక్తిగతంగా దూషణలు , దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతి అమలు ఎప్పడో.. రెండేళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం 3.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏమైనా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందా అంటే అదీలేదన్నారు. ఆడ బిడ్డనిధి, నిరుద్యోగ భృతిని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై ఇంత వరకు స్పష్టతలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి సైతం అమలు చేసిన చరిత్ర ఆయనకు దక్కితే.. హామీల అమలును విస్మరించిన చరిత్ర కూటమి నేతలకు దక్కుతుందన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారన్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి నియోజకవర్గంలో ఏమి చేసినా తమకు కప్పం కట్టాలంటూ ఎమ్మెల్యేలు వ్యాపారులను శాసించడం జరుగుతోందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నదుల్లో ఉన్న ఇసుకను కోట్లాది రూపాయలకు వీళ్ల జాగీర్లు అయినట్లు అమ్మేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన మహానాడులో ప్రజా సమస్యలపై , సంక్షేమ పథకాల అమలుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు.కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నామస్మరణతో సరిపెట్టారన్నారు. పైగా జగన్ పార్టీని గొడ్డలిపార్టీ అంటూ అసత్య ప్రచారం చేయడంతోపాటు ఇంకా జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ సిగ్గులేకుండా అసత్యాలు పలికాన్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రెండేళ్లలో ప్రజలకు వారు చేసింది ఎమిలేదన్నారు. టీడీపీ నాయకులు జగన్మోహన్రెడ్డిని విమర్శించే పని కాకుండా ప్రజలను మెప్పించే ప్రయత్నం చేయాలని హితవుపలికారు. ఈనెల 4వ తేదీన మండల కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలను కాల్చి నిరసన కార్యక్రమాన్ని, 12న నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జెడ్పీటీసీ బాలయ్య, ఎర్రగుంట్ల నాయకులు జయరామిరెడ్డి, శివారెడ్డి, రైతు విభాగం నాయకులు విశ్వనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విచారణకు ఆదేశం
కడప అగ్రికల్చర్: వైఎస్సార్జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె ప్రైమరీ అగ్రికల్చర్ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామిరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. ఈ మేరకు ఆయనపై విచారణ చేయాలని కమిటీని ఆదేశించినట్లు జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ ఎం. వెంకటసుబ్బయ్య తెలిపారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్లను టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి కలెక్టర్కడప సెవెన్రోడ్స్: దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అధ్యక్షతన జిల్లా గ్రామీణ విలేకరుల రెండురోజుల పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. వార్తలు కేవలం ప్రభుత్వ పరిపాలనకే కాకుండా, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా కనీసం 70 శాతం ఉపయోగకరంగా ఉండాలన్నారు. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి వాచ్డాగ్స్గా నిలవాలన్నారు. వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిష్పాక్షిక సమాచారంతో మీడియా విశ్వసనీయతను కాపాడుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మీడియా వ్యవస్థకు గ్రామీణ జర్నలిస్టులే మూలస్తంభాలన్నారు.మరో సీనియర్ పాత్రికేయుడు రాఘవశర్మ మాట్లాడుతూ.. తెలుగు వ్యాకరణంపై అవగాహన పెంచుకుని, మాండలిక పదాలతో, సరళమైన పదజాలంతో వార్తా రచన చేయాలని సూచించారు. కడప సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు. -
వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ
కడప సెవెన్రోడ్స్ : కడపకు చెందిన వసంత్ మౌని విహంత్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్ కేటగిరి కింద ఎయిమ్స్, నిమ్హాన్స్, జిప్మర్, పీజీ ఐ చండీఘర్లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్క్లేవ్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్రెడ్డి పూణెలోని ఆర్మ్డ్ ఫోర్స్డ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు. జమ్మలమడుగు: జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, భాగ్యనగర్ కాలనీల్లో గురువారం రాత్రి కురిసిన భారీ గాలివానకు చేనేత కార్మికులు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డారని, ప్రభుత్వం వారిని తక్షణమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మోరగుడి తదితర ప్రాంతాల్లో పర్యటించి, నష్టపోయిన కుటుంబాల వివరాలను సేకరించారు. ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించి, ఉచితంగా ముడిసరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. -
ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం
రాజంపేట: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అపనమ్మకం ఏర్పడిన పరిస్ధితులు నేడున్నాయని, గత ఎన్నికల్లో ఓటువేశామని బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం మేడాభవన్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు. టీడీపీ రెండేళ్లపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండేళ్ల పాలన మోసపూరితమని, ప్రజలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ స్ధాయిలో నిరసనలు జయప్రదం చేయాలన్నారు. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. స్ధానికసంస్ధలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నందలూరు మండలాధ్యక్షుడు మేడా విజయభాస్కర్రెడ్డి, నందలూరు వైఎస్సార్సీపీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కలీం,మోదుగల చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, గంగినాయుడు, మోహన్రెడ్డి, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్,ఆల్విన్ విజయుడు, మహిళనాయకురాలు పల్లెమాధవి,మైనార్టీ ప్రతినిధులు షాజహాన్, జుల్ఫీకర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మేడారఘునాథరెడ్డి -
గాయపడిన వ్యక్తి మృతి
వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బద్వేలులో చోరీ బద్వేలు అర్బన్ : పట్టణంలోని సిద్దవటం రోడ్డులో గల శివరామకృష్ణనగర్ 5వ వీధిలోని ఓ ఇంటిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు..శివరామకృష్ణనగర్ 5వ లైన్లో నివసిస్తున్న బోవిళ్ళనరసింహారెడ్డి కన్స్ట్రక్షన్ బిల్డర్గా పనిచేస్తుండేవాడు. ఈయన భార్య బ్యాంకు పని నిమిత్తం అట్లూరుకు వెళ్లగా నరసింహారెడ్డి సొంత పని నిమిత్తం బయటికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులకొట్టి అందులోని 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదుతో పాటు పూజగదిలోని వెండి సామగ్రిని దోచుకెళ్లారు. సాయంత్రం సమయంలో నరసింహారెడ్డి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి పరిశీలించారు. ప్రొద్దుటూరులో.. ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనిఽధి మిల్లులోని ఆఫీసు బీరువాను పగులకొట్టి అందులోని రూ. 12 లక్షలకు పైగా నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగలను పసిగట్టకుండా ఉండేందుకు ఆఫీసులోని సీసీ కెమెరాల వైర్ను దుండగులు కట్ చేశారు. అలాగే ఘటనా స్థలంలో కారం పొడి చల్లారు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పిడుగుపాటుకు బొగ్గుల బట్టీ దగ్ధం సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు బొగ్గుల బట్టీ దగ్ధమైంది. బట్టీ నిర్వాహకుడు మాబు అలియాస్ పండుకు చెందిన రూ.15 లక్షలు విలువైన ముడి సరుకు, బొగ్గు సంచులు కాలిపోయాయి. బాధితుడి వివరాల మేరకు.. బట్టీ ఏర్పాటు చేసేందుకు శనివారం 20 ట్రాక్టర్ల కట్టెలు సిద్ధం చేసి ఈదురు గాలులు, ఉరుములు అధికమవడంతో ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే పిడుగుపాటుకు కట్టెలతో పాటు గతంలో కాల్చిన 400 బొగ్గుల సంచులు అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. పిడుగుపాటుతో మహిళ మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించారు. మహేష్ మాసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు దువ్వూరు : బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. శనివారం మైదుకూరు రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను వల్లూరు మండలం కొట్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు ఈశ్వర్ (19) ఆరు నెలల క్రితం ఇన్స్ట్రాగామ్లో బాలికకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో గత సోమవారం ఆ బాలిక దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి వచ్చింది. ఆ బాలికను ఈశ్వర్ బైక్పై ఎక్కించుకుని ఖాజీపేట బైపాస్లో ఉన్న ఓ లాడ్జీలోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను గుడిపాడు దగ్గర వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత అధిక రక్తస్రావం అవుతుండటంతో తల్లికి జరిగిన విషయం తెలిపిందని చెప్పారు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని ప్రొద్దుటూరు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినటు తెలిపారు. -
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కడప వాసులకు స్థానం
కడప ఎడ్యుకేషన్: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్ రావు (రిటైడ్ హెడ్ మాస్టర్ సీఎస్ఐ స్కూల్) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు. విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎంసెంబల్’ చేశారు. దీంతో 777 మంది గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప నాగరాజు పేటకు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ అగసిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. పాస్టర్ ఆగస్తిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకుంటున్న కావ్య, గోయల్ -
ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. అక్టోబరు 2, 1966లో ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్ర కారం, జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్గా ఏర్పాటైన దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. జూన్ 1న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగానే ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్లోనూ కడపకు అన్యాయమేనా..? విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. దశాబ్దాల కల అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ, కంభం–ప్రొద్దుటూరు, భాకరాపేట–గిద్దలూరు రైలుమార్గాలు కేవలం సర్వేలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామన్న హామీ మూలనపడింది. ఒకప్పుడు అత్యంత కీలక కేంద్రమైన నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కనీసం అన్ని రైళ్లకు ఇక్కడ వాటరింగ్ సదుపాయం కల్పించే ప్రతిపాదన కూడా పెండింగ్లో పడింది. కొత్త జోన్ కేంద్రమైన విశాఖపట్నానికి వెళ్లేందుకు జిల్లా వాసులకు కనీసం ఒక్క ప్రత్యక్ష రైలు కూడా అందుబాటులో లేదు. కొత్త జోన్కు వెళ్లే ఏకై క రైలు తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే కావడం, అది ఎప్పుడూ రద్దీగా ఉండటంతో జిల్లా ప్రజలు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా ఇప్పటివరకు కనీసం ఒక్క వందేభారత్ రైలు కూడా నడపలేదు. ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ’కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోనే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్కు రూ. 25 వేల కోట్ల ఆదాయం ఉండాల్సి ఉండగా, ఈ మార్పుల వల్ల రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. రేపటి నుంచే దక్షిణకోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు సికింద్రాబాద్ వీడి.. విశాఖ ‘డెక్’భవనం గూటికి కడప రైల్వే ఆదాయం కోల్పోవడంపై విమర్శలు సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్ కృష్ణపట్నం–ఓబులవారిపల్లె ప్యాసింజర్ లైన్, కడప–బెంగళూరు ప్రాజెక్టులపై జిల్లా వాసుల ఆశలు దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపోయి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీమ రైల్వే ధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సార్ యాజమాన్యం ఆలోచన చేయాలి. అలాగే తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడుకొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్కు రావలసిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్కోస్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్ను నెరవేర్చకుండానే జోన్ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. – పీవీ మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ -
ప్రతి బీఎల్ఏ సైనికుడే !
● ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ గెలుపునకు తొలిఅడుగు ● వైఎస్ జగన్ను సీఎంగా చేసుకోవాలన్నదే ధ్యేయం ● ఎమ్మెల్సీ టీ. కల్పలతారెడ్డి రాజంపేట: స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రతి బూల్ లెవెల్ ఏజెంట్(బీఎల్ఏ) సైనికుడని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏదేనని శాసనమండలి సభ్యురాలు,అన్నమయ్య జిల్లా బీఎల్ఏ పరిశీలకురాలు టీ.కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీఎల్ఏ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాయే వైఎస్సార్సీపీ గెలుపునకు తొలి అడుగు అని అన్నారు. బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై పట్టు సాధించాలన్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లను రకరకాలుగా తొలిగించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. దానిని బీఎల్ఏలు అడ్డుకోవాలన్నారు. మళ్లీ 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ధ్యేయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్క బీఎల్ఏ సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు మేడా విజయభాస్కర్రెడ్డి, గాలివీటి రాజేంద్రరెడ్డి, కేంద్రకార్యాలయ పరిశీలకులు నరసింహారెడ్డి. ఎస్ఈసీ సభ్యుడు చొప్పాఎల్లారెడ్డి, రాయలసీమ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటి నేత నడివీధి సుధాకర్, మండలకన్వీనర్లు టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లెభాస్కర్రాజు, జె. కృష్ణరావుయాదవ్, నీలకంఠేశ్వరరెడ్డి, సిద్ధవరం గోపిరెడ్డి,బెహరన్ వైఎస్సార్సీపీ కన్వీనరు ఓర్సు నాగరాజు, నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్,పాపినేని విశ్వనాధరెడ్డి, దండుగోపి,వడ్డెరమణ, మహిళనేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, రక్కాసి శ్రీవాణి, పల్లె మాధవి పాల్గొన్నారు. సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.ఓట్లు తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలదే. స్థానికసంస్ధలలో వైఎస్సార్సీపీ సత్తా చాటుకునేందుకు సమష్టిగా కృషిచేయాలి. బూత్ స్ధాయిలో వైఎస్సార్సీపీ ఓట్లకు గండిపడకుండా చూసుకోవాలి. – సురేష్బాబు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు ఒక ఓటు కూడా పొగొట్టుకోకూడదు. ఆ దిశగా బీఎల్ఏలు పనిచేయాలి. సర్లో బీఎల్ఏలదే కీలకపాత్ర.అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలలో ఓట్ల తొలగింపుతో నేతలు ఓటమి పాలయ్యారు. అందువల్ల ఓట్ల తొలిగింపునకు అడ్డుకట్టవేసే విధంగా బీఎల్ఏలు పనిచేయాలి. – ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట స్థ్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురాలి.సమష్టిగా గెలుపునకు కృషిచేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గ్రహించారు.రెండేళ్లలో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రె డ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలంటే బీఎల్ఏలు కీలకపాత్ర పోషించాలి. ఓట్ల తొలిగింపుకు కుట్రలు తెరలేస్తాయి. వాటిని అడ్డుకొని మన ఓట్లను కాపాడుకోవాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు -
● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఎర్రగుంట్ల : మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు గాలివాన బీభత్సం సృస్టించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) కాలనీలోని ఈ టైపు క్వార్టర్స్లో ఉంచిన కారుపై భారీ చెట్టు పడింది. కారు భూమికిలోకి కూరుకుపోయింది. ఎర్రగుంట్ల, వై కోడూరు, కలమల్ల, మాలెపాడు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో గ్రామాల్లో రాత్రంతా అంధకారం నెలకొంది. ● చెట్టు కూలి దూడ మృతి ముద్దనూరు : ముద్దనూరు మండలంలో గురువారం రాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక పాతబస్టాండు ఆవరణలోని బస్షెల్టర్ వద్ద ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. రాత్రి కావడం, జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెన్నారెడ్డిపల్లెలో దూడపై చెట్టు పడటంతో దూడ మృతి చెందింది. ఇదే గ్రామంలో గేదైపె చెట్టు పడటంతో తీవ్రంగా గాయపడింది. చెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. పెనుగాలులకు సుమారు 50 చెట్లు నేలకూలాయి. మండల వ్యాప్తంగా సుమారు 70 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్లు విద్యుత్తు శాఖ ఏఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మండల వ్యాప్తంగా అంధకారం నెలకొంది. -
ఆరోగ్య భారతి
కమలాపురం : సమాజ సంక్షేమానికి భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) పెద్దపీట వేస్తోంది. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతి సిమెంట్స్, అపోలో టెలీమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్సైట్ వైద్య సంరక్షణను టెలీమెడిసిన్ ఆధారిత స్పెషాలిటీ కన్సల్టేషన్లతో కలిసి గ్రామీణులకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిజిటల్ క్లినిక్ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ను అపోలో టెలిమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్ అమలు చేస్తూ, కార్యచరణ రూపొందించింది. నిరంతర సేవలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రముఖ అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షణలో 2015లో ఫ్యాక్టరీ ఎదుటే రూ. 50 లక్షల వ్యయంతో టెలీక్లినిక్ను ఏర్పాటు చేశారు. అపోలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోజుకు దాదాపు 40 నుంచి 50 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలతో పాటు కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో క్లినిక్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చికిత్స చేయడంతో పాటు మందుల పంపిణీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించారు. అపోలో పర్యవేక్షణలో డిజిటల్ క్లినిక్ నిర్వహణ -
ఘనంగా బర్సీ మహోత్సవం
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా స్వర్గీయ పీఠాధిపతి హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి బర్సీ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి పీఠాధిపతి, సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బర్సీ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ పీఠాధిపతి నివాసం నుంచి జహీరియా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మజార్లపై గంధం ఎక్కించి, పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. రాత్రి నాత్ చదివారు. అనంతరం బయాన్ చేశారు. పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా, గౌస్పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
● రైతుకు అపార నష్టం
మైలవరం: మైలవరం మండలలో గురువారం రాత్రి గాలివాన గడగడలాడించింది. మండలంలోని తొర్రివేములు, నార్జాంపల్లి గ్రామాల్లో బొప్పాయి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. గ్రామాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రూ. 15 లక్షల వరకు పంట జరిగినట్లు రైతులు వాపోతున్నారు.పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఉద్యాన వన శాఖ అధికారి జయ భరత్రెడ్డి తెలిపారు.అరటి మూడు హెక్టార్లలో, బొప్పాయి 5.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. -
మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ
లింగాల : లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో పట్టపగలే మహిళ మెడలోని రూ.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు..చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కేతిరెడ్డి సరళ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు సరకులు కొనేందుకు వచ్చారు. ఆమె సరకులు ఇస్తుండగా ముఖంపై మత్తు మందు చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. నిందితులు పులివెందుల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ట్రావెల్ బస్సు బోల్తా – ముగ్గురికి గాయాలు గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్, అనంతపురం జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకు ని బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ముద్దనూరు: మండలంలోని చెర్లోపల్లెకు చెందిన కుంచపు భారతి (37) కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. భారతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవారన్నారు. గురువారం నొప్పి భరించలేక విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్నదాత.. గుండెకోత
● అకాలవర్షాలు, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలు ● 10 మండలాల్లో అరటి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం ● రాజుపాలెంలో 88.6 మి.మీ.వర్షం కడప అగ్రికల్చర్: అకాల వర్షాలు, ఈదురు గాలులతో అన్నదాతలకు దెబ్బమీద దెబ్బపడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఆరటి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 56.99 లక్షల మేర నష్టం జరిగి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది. 168.85 హెక్టార్లలో పంటలకు నష్టం... జిల్లావ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 201 మంది రైతులకు సంబంధించి 168.55 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ. 56.99 లక్షల్లో పంట నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఇందులో ఒంటిమిట్ట మండలం పరిధిలో ముగ్గురు రైతులకు చెందిన 1.60 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిని రూ. 56 వేలు నష్టం జరిగింది. మైదుకూరు మండలంలో 94 మంది రైతులకు సంబంధించి 68 హెక్టార్లలో ఆరటి, 14 హెక్టార్లలో బొప్పాయి పంటలు దెబ్బతిని రూ. 27.30 లక్షలు, మైలవరం మండల పరిధిలో 12 మంది రైతులకు చెందిన మూడు హెక్టార్లలో ఆరటి, 5.85 హెక్టార్లలో బొప్పాయి, 40 సెంట్లలో మునగ పంటల దెబ్బతిని రూ. 2.61 లక్షలు, పొద్దుటూరు మండలం పరిధిలో 12 మంది రైతులకు సంబంధించి 80 సెంట్లలో మునగపంట దెబ్బతిని రూ. 20 వేలు, లింగాల మండల పరిధిలో 5 మంది రైతులకు చెందిన 4 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 1.40 లక్షలు, ఎర్రగుంట్ల మండల పరిధిలో 15 మంది రైతులకు సంబంధించి 14 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 4.96 లక్షలు, సింహాద్రిపురం మండల పరిధిలో 35 మంది రైతులకు చెందిన 30 హెక్టార్లలో ఆరటి పంట దెబ్బతిని రూ. 10.50 లక్షలు, తొండూరు మండల పరిధిలో నలుగురు రైతులకు సంబంధించి 3 హెక్టార్లో అరటి దె బ్బతిని రూ. 1.05 లక్షలు, కొండాపురం మండల పరిధిలో ఒక రైతుకు సంబంధించి 1.20 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 42 వేలు, ముద్దనూరు మండల పరిధిలో 30 మంది రైతులకు సంబంధించి 23 హెక్టార్లలో ఆరటి దెబ్బతిని రూ. 8.05 లక్షల మేర నష్టం జరిగింది. రాజుపాలెం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు జిల్లాలోని రాజుపాలెం మండలంలో అత్యధికంగా 88.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగులో 47.4, మైలవరం మండలంలో 45.6, మైదుకూరు మండలంలో 36.4, పొద్దుటూరు మండలంలో 36, గోపవరం మండలంలో 26.8, ముద్దనూరు మండలంలో 25.2, చాపాడు మండలంలో 19.6, సిద్దవటం, ఎర్రగుంట్ల మండలాల్లో 18.2, కొండాపురం మండలంలో 14.2, బద్వేల్ మండలంలో 12.8, కడపలో 8.4, సీకేదిన్నె మండలంలో 5.4 , చెన్నూరు మండలంలో 2.6, ఖాజీపేట మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో గురువారం రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. -
బూత్లెవల్ ఏజెంట్ కీలకంగా వ్యవహరించాలి
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ చెందిన ప్రతి 252 బూత్ లెవల్ ఏజంట్లు సర్ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదికారప్రతినిధి, మాజీఎమ్మెల్యే, ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు శక్రవారం తెలిపారు. స్థానిక రాజ్కళ్యాణ మండపంలో జరిగిన సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్బాబు, కొండూరుఅజయ్రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏ దృష్ఠి పెట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, జెట్పీటీసీరత్నమ్మ, రాయలసీమ బూత్కన్వీనర్ తల్లెంభరత్కుమార్రెడ్డి, క్రిష్ణారెడ్డి, , వెంకటరెడ్డి, సీహెచ్రమేష్, నందాబాల, విజయ్కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
డీఎస్సీలో భారీ అక్రమాలు
కడప సెవెన్రోడ్స్: డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విభాగ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మణ్రెడ్డి, సంయుక్త కార్యదర్శి సందీప్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ను తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. డేటా కూడా డెలీట్ చేయడం, మెరిట్ లిస్టు మాయం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక్కో పోస్టుకు రూ. 15 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకపోగా, అవినీతికి గేట్లు తెరిచారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు జరిగిన ఈ అన్యాయం క్షమించరానిదన్నారు. నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని, డీఎస్సీ అక్రమాలు సరిదిద్దే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మళ సాయికుమార్రెడ్డి, నాయకులు బాలకృష్ణ, డేవిడ్, శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేష్రెడ్డి, రుద్రసేనారెడ్డి, శ్యాం, రాయుడులతోపాటు నగర కమిటీ సభ్యులు, కాలేజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ గంగయ్యకు వినతిపత్రమిచ్చారు. ఫోటోనెం. 29కెడిపి601, 602, 603– కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పార్టీ నేతలు కెడిపి604 – కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి విభాగం నాయకులు మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేయాలి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీవిద్యార్థి విభాగం ధర్నా -
ఏపీ పీజీ సెట్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: ఏపీ పీజీ సెట్–2026 ప్రవేశ పరీక్షల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రతిభ చాటారు. జిల్లావ్యాప్తంగా 859 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 658 మంది క్వాలిఫై అయి 89.16 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాజంపేట: శేషాచల అటవీప్రాంతం రోళ్లమడుగులో శుక్రవారం ఓ తమిళ సినిమా షూటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద నుంచి ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు సెట్టింగ్స్ వేస్తున్నారు. ఎర్రచందనం స్లగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తునట్టుగా తెలుస్తోంది. రోళ్లమడుగు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండటం వల్ల షూటింగ్ ఇక్కడ చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కడప కార్పొరేషన్: వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ స్టేట్ చైర్మన్ ఎం. సురేష్ బాబు అన్నారు. శుక్రవారం కడప శివారులో వున్న పాస్ట్రల్ సెంటర్ పరిధిలో యువతీ యువకులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ఉత్పత్తులను వినియోగించే వారికి కొన్ని మౌళిక హక్కులు ఉంటాయన్నారు. కొన్న వస్తువుకు సరైన బిల్లులు తీసుకోవడం, చలామణి తేదీలు పరిశీలించడం, నకిలీ వస్తువులను గుర్తించడం, తప్పిదాలపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయాలన్నారు. కన్స్యూమర్ ఫోరమ్లో నష్ట పరిహారం కోసం ఎలా దాఖలు చేయాలి అన్న అంశం పై కూడా అవగాహన కల్పించారు. రూ.50వేల వరకూ నష్టపోతే జిల్లా కోర్టులో, రూ.2కోట్ల వరకూ నష్టపోతే రాష్ట్ర వినియోగదారుల కోర్టులో, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంలో పరిహారం పొందవచ్చన్నారు. సెంటర్ డైరెక్టర్ పాస్టర్ వరప్రసాద్, కమిషన్ జిల్లా ఛైర్మెన్ కిశోర్, పాస్టర్లు ప్రసాద్, శరత్, సిస్టర్లు సౌరీలు, సీహెచ్ మేరీ, ప్రశాంతి, లిల్లీ పుష్ఫ, కస్పర్, లెక్చరర్ ప్రసన్న ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదాములను కడప కార్పొరేషన్/సెవెన్రోడ్స్: రైతులకు ఉపయోగపడేలా ఎంపీఎఫ్సీ గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాల గోదాముల ఏర్పాటుకు సంబంధించి జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కడప అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – ఎస్ఐఆర్ 2026 ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్ 2026 పై జేసీ డి. నిధి మీనా, డిఆర్వో మల్లికార్జునుడులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సమగ్రత అత్యంత కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని, అందుకే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల ఉండకూడదనే దానితో పాటు, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడడమేనని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గత ప్రత్యేక సమగ్ర సవరణలో నమోదైన వివరాలకు ప్రామాణికత కల్పించబడుతుందని చెప్పారు. ఎవరైనా పేరు తొలగించే ముందు తప్పనిసరిగా వినతులు స్వీకరించి విచారణ జరిపి మాత్రమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమించే బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏ) కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. -
● కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి: మాజీ మేయర్ పాకా సురేష్
కడప అర్బన్: కడప నగరంలోని గుర్రాలగడ్డ సమీపంలో శుక్రవారం నీటి గుంతలో పడి సయ్యద్ యూనస్ (4) అనే బాలుడు మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువుల సమాచారం మేరకు... కడప నగరంలోని గుర్రాలగడ్డ వీధి సమీపంలో నివాసముంటున్న సయ్యద్ మున్నా, సాజిదాభానులకు సయ్యద్ యూనస్ (4), జహీర్ (7), సాజిద్ (9) ముగ్గురు సంతానం. వీరిలో సయ్యద్ యూనస్, జహీర్ శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆడుకుంటూ సమీపంలోని వంతెన నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. ఇటీవల పడిన వర్షాలకు ‘పిల్లర్ల’ మధ్యలోని గుంతలు నీటితో నిండి ఉన్నాయి. ఈ క్రమంలో ఆడుకుంటూ యూనస్ నీటిలోకి దిగి మునిగిపోయాడు. భయపడిన అన్న జహీర్ కేకలు వేసుకుంటూ ఇంటికొచ్చాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అంతలోపే యూనస్ నిండా మునిగిపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టారు. సుమారు అరగంట తర్వాత బాలుడిని వెలికి తీసి ప్రథమచికిత్స చర్యలను చేపట్టి కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. అంతవరకు ఊపిరిబిగపట్టి చూస్తున్న తండ్రి మున్నా ఒక్కసారిగా బోరున విలపించారు. యూనస్ మృతదేహాన్ని పట్టుకుని ‘మేరే బేటే!ఉఠో ఘర్కు చలింగే!!’ అంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. బాలుడి మృతికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం కడప నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్రాలగడ్డ నుంచి రవీంద్రనగర్లోకి బుగ్గవంక వీదు గా రోడ్డు వేసేందుకు పిల్లర్లను నిర్మించారు. పిల్లర్ల చుట్టూ ఏర్పడిన గుంతలు దాదాపు 10 అడుగులకుపైగా లోతులో వున్నాయి. ఇటీవల పడిన వర్షాలకు గుంతనిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల చుట్టూ కంచెను ఏర్పాటు చేయలేదు. పిల్లర్ల నిర్మాణ సమయంలో బుగ్గవంక ప్రహరీని పగులగొట్టిన కాంట్రాక్టర్ ప్రహరీనిగానీ పూర్తి చేయకుండా వదిలేశాడు. దీంతో అవి ప్రమాదాలకు నెలవుగా మారాయి. రెండు రోజుల క్రితం ఓ చిన్నారి నీటి దగ్గరికి వెళ్లి ఆడుకుంటుండగా మునిగిపోతుండగా స్థానికులు గమనించి రక్షించారు. ఆ సంఘటన తరువాత కాంట్రాక్టర్కు, అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా నిర్లక్ష్యం వీడలేదు. బుగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. ప్రమాదాలు పొంచి ఉన్నాయని సాక్షి ముందే హెచ్చరించింది. కాంట్రాక్టర్ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. ముందే మేల్కొని ఉంటే ఈ విషాద ఘటన జరిగేది కాదు. ఆ చిన్నారి కంటికి పూసిన సుర్మా అలాగే ఉంది.. ఒంటికి రాసిన అత్తరు గుబాళి స్తూనే ఉంది.. ఈద్ రోజు చిట్టి చేతులతో చేసిన దువా అతని తల్లిదండ్రుల కళ్లముందు కదలాడుతూనే ఉంది.. ఇల్లంతా తిరుగుతూ చేసిన అడుగుల సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది.. పండగ క్షణాలు ఇంకా చెరిగిపోకముందే.. ఆ ఇంట విషాదం అలుముకుంది.. తియ్యని ఈద్ జ్ఞాపకాలు తుడిచిపోకముందే.. కఠిన చేదు వార్త వారి గుండెల్ని తాకింది.. సరిగ్గా ఐదేళ్లు నిండని చిరు వయసులోనే మృత్యుకౌగిట్లోకి ‘జారి’పోయిన పిల్లాడిని చూసి తల్లిదండ్రుల కంట కన్నీరొలికింది. నీటి గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన విషాద ఘటన కడపలో చోటుచేసుకుంది. త్యువాత నాయకుల నిర్లక్ష్యానికి బలైంది. కడప వైఎస్ఆర్ సర్కిల్: బుగ్గవంకపై షామీరియా బ్రిడ్జి నిర్మాణపు నీళ్ల గుంతలో పడి గుర్రాలగడ్డ వీధికి చెందిన 5 ఏళ్ల బాలుడు సయ్యద్ యూసఫ్ మృతి చెందిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు. శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటన పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం, నిర్మాణ పనుల పర్యవేక్షణలో వైఫల్యం వల్లే జరిగిందని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి షామీరియా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినా.. నిరంతరాయంగా పూర్తి చేసే బాధ్యతలో విఫలమయ్యారని విమర్శించారు. ఘటన జరిగాక మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ‘ప్రవేశం లేదు‘ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారని.. అదే ప్రమాదం జరగకముందే ఈ చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గవంక గుంతలో పడి బాలుడు మృతి కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులనిర్లక్ష్యమే కారణం నీటి గుంతలో పడి మృతిచెందిన యూనస్ మృతదేహాన్ని రిమ్స్ క్యాజువాలిటీలో మాజీమేయర్ పాకా సురేష్కుమార్, మాజీ కార్పొరేటర్లు బాలస్వామిరెడ్డి, అజ్మతుల్లాలు, ఇతర వైఎస్ఆర్ సీపీ నేతలు పరిశీలించారు. బాలుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గవంకలో వంతెన నిర్మాణపనులలో పిల్లర్ల వరకే పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా వంతెన నిర్మాణ పనులు చేయలేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ తనకు బిల్లులు మంజూరు కాలేదంటూ నిర్లక్ష్యంగా ఎక్కడిపనులను అక్కడ వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్టర్పైనా, పర్యవేక్షణ అధికారులపైన చర్యలను తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్సీపీ న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తుందన్నారు. -
కర్షకుడికి కాయ కష్టం!
కడప అగ్రికల్చర్: జిల్లాలో వరుణుడు కరుణించాడు. వర్షాలు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో రైతన్నలు కాడీ మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఖరీఫ్–2026 సీజన్ కూడా అధికారికంగా ప్రారంభం కానుంది. కోటి ఆశలతో రైతులు దుక్కులు దున్నుతున్న వేళ.. వేరుశనగ విత్తనకాయల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిబంధనల కోతలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సేకరణ ఆరంభించని అధికారులు సీజన్ ముంచుకొస్తున్నా జిల్లాలో ఇంతవరకు వేరుశనగ విత్తనకాయల ప్రొక్యూర్మెంట్ (సేకరణ) ప్రక్రియే ప్రారంభం కాలేదు. అధికారులు వీటిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు? రైతులకు ఎప్పుడు సరఫరా చేస్తారనే విషయాలపై తీవ్ర మల్లగుల్లాలు నడుస్తున్నాయి. జిల్లాలో ’వేముల’ మండలం మినహా మరెక్కడా విత్తనాల కోసం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలుకాలేదు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జూన్ రెండో వారం దాటితే కానీ విత్తనకాయలు చేతికి వచ్చేలా లేవు. ప్రభుత్వ పంపిణీలో నిబంధనల గోడలు! ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సకాలంలో వచ్చేలా లేకపోవడంతో బహిరంగ మార్కెట్ను ఆశ్రయిద్దామన్నా రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో వేరుశనగ క్వింటాల్ ధర రూ.10,000 పైగా పలుకుతుండటంతో అంత పెట్టుబడి పెట్టలేక చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించి 4,788 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీకి (కే–6, టీఎస్జీఎస్–1694, నారాయణి రకాలు) వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, ఇందులో పెట్టిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఇరిగేటెడ్ రైతులకు మొండిచేయి నాన్–ఇరిగేటెడ్ (వర్షాధార) మండలాలకు తప్ప, ఇరిగేటెడ్ (ఆయకట్టు) పరిధిలోని మండలాలకు విత్తనకాయలను కేటాయించకుండా అధికారులు చేతులెత్తేశారు. అర ఎకరా లోపు ఉంటే ఒక మూట (30 కిలోలు), ఎకరా లోపు ఉంటే రెండు బస్తాలు, ఎకరా దాటి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా కేవలం మూడు బస్తాలు (90 కిలోలు) మాత్రమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ‘ఐదెకరాలున్న రైతుకు మూడే బస్తాలిస్తే.. మిగతా పొలానికి ఓపెన్ మార్కెట్లో వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేయాలా?‘ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తొలకరి పలకరించినా.. తలుపు తెరవని విత్తన కేంద్రాలు ఖరీఫ్ ముంగిట వేరుశనగరైతన్నల ఆందోళన కూటమి పాలనలో విత్తనానికికోత, సాగుకు ఘాత దుక్కులు దున్నినాదిక్కుతోచని స్థితిలో రైతన్న ప్రభుత్వ ఉదాసీనత, విత్తన కోతల ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జిల్లాలో 5,976 హెక్టార్లలో వేరుశనగ సాగు కాగా, ఈ ఏడాది దానిని 4,446 హెక్టార్లకే పరిమితం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,530 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పడిపోనుంది. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు నాటికే పూర్తిస్థాయిలో విత్తనాలు జిల్లాకు చేరేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసి, మండలాలకు కేటాయించి, డి–కృషి యాప్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.‘ అని స్థానిక రైతులు వాపోతున్నారు. -
మరోసారి పిలిస్తే ‘చీరే’స్తాం!
బద్వేలు అర్బన్: ‘ఏరుదాటే దాకా ఓడమల్లన్న ... దాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గల 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహణ బాధ్యతను డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి చేతికి అధిష్టానం అప్పగించింది. దీంతో ఎలాగైనా కార్యక్రమానికి జనాన్ని రప్పించి విజయవంతం చేయాలని అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన మూడు క్లస్టర్లలో మహిళలను రప్పించేందుకు మెప్మా ఆర్పీల ద్వారా వాయిస్ మెసేజ్లు పంపించారు. ప్రతి గ్రూపు నుంచి కచ్చితంగా ఐదుగురు మహిళలు హాజరు కావాలని, హాజరైన వారికి భోజన వసతితో పాటు చివరి రోజున చీరలు పంపిణీ చేస్తారని సదరు సందేశంలో చెప్పారు. దీంతో ఆశపడిన పట్టణంలోని పలు పేద కాలనీలకు చెందిన మహిళలు సభకు హాజరయ్యారు. రెండు రోజులు కార్యక్రమాన్ని ముగించుకున్న టీడీపీ నాయకులు కొద్ది మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. చీరలు దక్కని చాలా మంది మహిళలు టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. తమను ఆశపెట్టి కార్యక్రమం ముగిసిన తర్వాత చీరలు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు మోసపూరిత మాటలతో పిలిస్తే ‘చీరే’స్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● బద్వేలు మహానాడులో పచ్చ నేతల‘బోడిమల్లన్న’ రాజకీయం ● ఆశ చూపి పిలిచారు.. అవసరం తీరాక మొండిచేయి చూపారు -
చిన్నారికి పునర్జన్మను ప్రసాదించండి
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ భవాని నగర్కు చెందిన జంబుబోయిన కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మల కుమారుడు వర్షిత్ నాథ్కు అరుదైన జబ్బు సోకింది. వీరికి ముగ్గురు కుమార్తెలతోపాటు నాలుగో సంతానంగా వర్షిత్ నాథ్ జన్మించాడు. వీరిది మేనరికం వివాహం. తల్లిదండ్రులు హోటల్ను నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వర్షిత్ నాథ్ పుట్టిన తొలి ఆరు నెలలు అందరిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడు. క్రమేణా నరాల జబ్బు కారణంగా నిల్చోలేని పరిస్థితి వచ్చింది. బాబు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో హోటల్నూ మూసివేశారు. ఈ నెల 14న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లగా.. అక్కడ బాలుడికి జనటిక్ పరీక్షలు చేయించారు. ‘మీ బాబుకు మోటార్ ఆక్జోనల్ న్యూరోపతి జబ్బు వచ్చిందని’ అక్కడి డాక్టర్ గీత చందా చెప్పినట్లు వారు తెలిపారు. బాబు వయసు ప్రస్తుతం 14 నెలలు.. రెండేళ్లలోపు బాబుకు వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు సూచించారు. అంత వరకు తాత్కాలికంగా మందులు ఇచ్చారు. పునర్విక తరహాలోనే రూ.16 కోట్ల విలువైన టీకా వేయాల్సిందే పునర్విక తరహాలోనే తమ బాబుకు రూ.16కోట్ల విలువైన ఇంజక్షన్ వేయించాలని వైద్యులు సూచించినట్లు తల్లిదండ్రులు కాశీవిశ్వనాథ్, బాలలింగమ్మ తెలిపారు. మానవతా హృదయంతో స్పందించి తమ బాబుకు పునర్జన్మను ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు. 7095148237 నంబర్కు దాతలు ఫోన్ పే చేయాలని తల్లిదండ్రులు కోరారు. 14 నెలల బాబుకు నరాల జబ్బు పునర్విక తరహాలోనే ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు -
మహానాడులో కార్పొరేషన్ ఉద్యోగి
కడప కార్పొరేషన్: కడపలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న రాజశేఖర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ మీటింగ్లో పాల్గొని, టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : కర్ణాటక రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నిమ్మనపల్లి మండల యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం, వెంగంవారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి కుమారుడు వెర్రి హరీష్ (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శని, ఆదివారం గంగ జాతర ఉందని తల్లిదండ్రులు హరీష్ను ఇంటికి రమ్మని కోరారు. దీంతో హరీష్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని హెచ్ క్రాస్– కై వారం మధ్యలో టీవీఎస్ ఎక్సెల్లో వస్తున్న వృద్ధుడు హఠాత్తుగా రోడ్డుకు అడ్డు రావడంతో, బుల్లెట్ ఢీకొని హరీష్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న చింతామణి రూరల్ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం చింతామణి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.నిమ్మనపల్లి యువకుడు మృతి -
లోతుగా దుక్కు.. లాభాలు దక్కు!
● జిల్లాలో ప్రారంభమైన ముందస్తు వర్షాలు ● ముమ్మరమైన వ్యవసాయ పనులు ● ఖరీఫ్లో 79,773 హెక్టార్ల పంటల సాగు లక్ష్యం ● కలుపు, చీడపీడల నివారణకు తొలి వర్షాలే సరైన సమయంకడప అగ్రికల్చర్ : ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల దిగుబడిని దెబ్బతీసే ప్రధాన సమస్య ‘కలుపు’ మరియు ‘చీడపీడలు’. ఈ యాజమాన్య ప్రక్రియను తొలి వర్షాలు కురిసినప్పటి నుంచే ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం 79,773 హెక్టార్లలో పంటల సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించగా, జూన్ 1 నుంచి సీజన్ అధికారికంగా ప్రారంభం కానుంది. వాలుకు అడ్డంగా దున్నాలి! ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని తమ పరిధిలోని మాగాణి, మెట్ట, బీడు భూములను వెంటనే దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా దున్నడంతో పాటు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా పొలాల్లోనే ఆగుతుంది. ఇది నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకేందుకు అనుకూల పరిస్థితిని కల్పిస్తుంది. ఫలితంగా భూమి ఎక్కువ తేమను గ్రహించి, ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చెత్తాచెదారం కాల్చవద్దు.. ఎరువుగా మార్చండి చాలా మంది రైతులు పంటల నూర్పిడి పూర్తయిన తర్వాత, భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల పొలంలో మొండి కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి నేలను నిస్సారంగా మారుస్తాయి. అంతేకాకుండా పంట చేతికి రాగానే పొలంలో మిగిలిపోయే ఎండు ఆకులు, కోయకాడలను తగలబెడుతుంటారు. అలా కాల్చకుండా వదిలేసిన చెత్తను, ఇప్పుడు కురుస్తున్న వర్షం పదునులో లోతు దుక్కులు చేయడం ద్వారా సులభంగా మట్టిలో కలిసిపోయేలా చేయవచ్చు. ఇవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి, భూమికి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా మారి భూసారాన్ని పెంచుతాయి. పక్షుల వేట.. చీడపీడల కోట బద్దలు! వేసవిలో పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పంటలను ఆశించే పురుగుల కోశస్థ దశలు, గుడ్లు, లార్వాలు మరియు తెగుళ్లు కలుగజేసే శిలీంధ్రాలు నేల అడుగున నిద్రావస్థలో దాగుంటాయి. ఇప్పుడు లోతు దుక్కులు చేయడం వల్ల నేల పొరలు తలకిందులై, ఇవన్నీ పైకి వస్తాయి. పొలం దున్నుతున్న సమయంలో నాగలి వెంట వచ్చే కొంగలు, కాకులు ఈ పురుగులను ఏరి తిని నాశనం చేస్తాయి. మిగిలినవి ఎండ తీవ్రతకు చనిపోతాయి. వర్షం పడగానే మొలకెత్తే కలుపు విత్తనాలు కూడా పంటల సాగుకు ముందే రెండు సార్లు దుక్కులు చేయడం వల్ల నశిస్తాయి. రసాయనాలతో దెబ్బతింటున్న నేలరైతులు శ్రమ తగ్గించుకోవడానికి విచ్చలవిడిగా రసాయన కలుపు మందులను పిచికారీ చేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, రైతులు ముందస్తు సేద్యం, లోతు దుక్కులు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, ఈ ఖరీఫ్లో జిల్లాలో ప్రధానంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్ఫ్లవర్, సోయాబీన్ తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.రైతులు లోతు దక్కులు చేపట్టాలి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దుక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి, వైఎస్సార్జిల్లా -
ఎన్టీఆర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వంటి నిర్ణయాలు సామాజిక మార్పునకు దోహదపడ్డాయని తెలిపారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం క్రమశిక్షణ, పట్టుదల, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని, నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.అనంతరం డీఆర్వో మల్లికార్జునుడు, స్టెప్ సీఈఓ జోయల్ విజయ్ కుమార్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు రామాపురం క్రీడాకారిణి
రామాపురం : మండలంలోని గోపగుడిపల్లి గ్రామం గొల్లపల్లికి చెందిన యనపడ్డ గోవిందు కుమార్తె యనపడ్డ సంజన అంతర్జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమైంది. అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి , కోచ్ ప్రసన్న జయశంకర్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం అనంతరం ఏపీ స్టేట్ జూనియర్ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో సంజన అద్భుత ప్రతిభ ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. పుదుచ్చేరిలో మే 22 నుంచి 28 వరకు నిర్వహించిన నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో సంజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపింది. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


