అన్ని వర్గాలను మోసగించారు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసగించేదిలా ఉంది. తన ఆప్తుడు, శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేందుకు బడ్జెట్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాలను నిధులు కేటాయింపు లేనేలేదు. 2.95 టీఎంసీలు సామర్థ్యంతో నిర్మిస్తున్న రాజోలు జలాశయానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. విద్యుత్ ఉత్పాదక రంగంపై మనసు పెట్టని కూటమి సర్కార్ తీరు స్పష్టంగా కనబడుతోంది.
– రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్ సీపీ


