breaking news
YSR District News
-
‘స్మార్ట్ కిచెన్’ పప్పులో బల్లిపై విచారణ
మైదుకూరు : మైదుకూరు మండలం జీవీ సత్రం హైస్కూల్లోని స్మార్ట్ కిచెన్లో వండిన మధ్యాహ్న భోజనం పప్పులో బల్లి పడిన విషయంపై శనివారం బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, వెలుగు పీడీ రాజ్యలక్ష్మి, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ తదితరులు విచారణ చేశారు. స్మార్ట్ కిచెన్ నుంచి జీవీ సత్రం హైస్కూల్ విద్యార్థులకు శుక్రవారం అందించిన పప్పులో బల్లి పడగా భోజనాన్ని వడ్డించే సిబ్బంది గమనించి ఆ విషయాన్ని పాఠశాల హెడ్మాస్టర్ జయప్రకాష్రెడ్డికి తెలిపారు. ఆయన ఆ పప్పును పార వేయించారు. అయితే అప్పటికే ముగ్గురు ఆరో తరగతి విద్యార్థులు ఆ పప్పును భోజనంలో కలుపుకొని తిని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జీవీ సత్రం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు శ్రీనాథ్రెడ్డి, వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకుని పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాత్రలను అందజేశారు. పప్పులో పడిన బల్లి చితికి పోకపోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పప్పులో బల్లి పడిన విషయం టీవీల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో రావడంతో అధికారులు శనివారం పాఠశాల వద్దకు చేరుకుని విచారణ నిర్వహించారు. స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యత తీసుకున్న వెలుగు ఏపీఎం జయరాజ్ వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటంతో.. వంట మనుషులను, పాఠశాలల్లో పిల్లలకు భోజనం వడ్డించిన పూర్వ వంట ఏజెన్సీ నిర్వాహకులు లీలావతి, ఆమె భర్త చంద్రలను అధికారులు విచారణ చేశారు. పప్పులోకి బల్లి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు భోజనం వడ్డించిన వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బల్లి పడిన విషయాన్ని బయటి వ్యక్తులకు ఎందుకు తెలియజేశారని అడిగినట్టు సమాచారం. పాఠశాల హెచ్ఎం జయప్రకాష్రెడ్డితో మాట్లాడి సంఘటన గురించి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కూడా పిలిపించి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. విచారణలో మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్ర, అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎంఈఓ–2 నరహరిశర్మ పాల్గొన్నారు. కేసు నమోదు స్మార్ట్ కిచెన్లో వండిన పప్పులో బల్లి పడిన సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ కిచెన్ బాధ్యతలు చూస్తున్న మండల ఎంఈఓ–2 నరహరి శర్మ నుంచి ఫిర్యాదు తీసుకుని, జీవీ సత్రం హైస్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే పూర్వ వంట ఏజెన్సీ నిర్వాహకులపైన లీలావతి, ఆమె భర్త చంద్ర, మరికొందరిపై కేసు నమోదు చేస్తున్నట్టు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పప్పులో బల్లి పడిన సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నియోకజవర్గ అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించినదని, అలాంటి భోజనం తయారీలో పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం చూపడం తీవ్రమైన విషయాలని ఆయన పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా పాఠశాలకు వచ్చిన పలు శాఖల అధికారులు -
● వైభవం.. పవిత్రోత్సవం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని కోదండ రామాలయంలో శనివారం పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులను ఆశీనులు చేశారు. పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన కుంభ ఆరాధన, చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం యాగశాలలో హోమాలు జరిపారు. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలభోగం, పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనంఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు తులసి గజమాలలతో స్వామి, అమ్మవారిని అలంకరించారు. అనంతరం మూలవరులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రెండవ శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. -
ఆకాంక్ష జిల్లాల పురోగతిలో కడపకు అగ్రస్థానం
కడప సిటీ: ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధిస్తూ, జాతీయ స్థాయిలో వరుసగా మూడు త్రైమాసికాల్లో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఆకాంక్ష జిల్లాలు, బ్లాకుల అభివృద్ధి పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్తో పాటు నీతీ ఆయోగ్ రాష్ట్ర నోడల్ అధికారి కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో నీతీ ఆయోగ్ నిర్దేశించిన వివిధ ప్రామాణికాల్లో సాధించిన ప్రగతిని మరియు అభివృద్ధి పురోగతిని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు. -
గాడి తప్పిన గండి
చక్రాయపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో అక్రమాలు శృతిమించుతున్నాయి. అర్చకులు చేసే పూజల దగ్గరి నుంచి వాహన పూజలు, హారతి పళ్లెం, కొబ్బరికాయలు, పూలదండల విక్రయాలు, విరాళాల సేకరణ వరకు ప్రతి ఒక్కటీ వివాదాస్పదంగా మారుతోంది. ఇక్కడ ఎవరి తీరు వారిదే అన్నట్లుగా సాగుతుండటంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లంచం ఇస్తేనే పూజలు.. లేదంటే అవమానాలు ఆలయానికి వస్తున్న భక్తులు ఆకుపూజ, స్పెషల్ దర్శనం, వీఐపీ దర్శనం టికెట్లు కొనుగోలు చేసి లోపలికి వెళ్లినా.. అక్కడ అదనంగా డబ్బులు ఇస్తేనే పూజలు చేస్తున్నారనే తీవ్ర అపవాదు ఉంది. చివరకు వాహన పూజ టికెట్లు తీసుకున్నా, వాహన మోడల్ను బట్టి అదనపు డిమాండ్లు తలెత్తుతున్నాయి. అడిగినంత ఇచ్చుకోకపోతే భక్తులను అవమానకరంగా మాట్లాడుతుండటంతో, ఎంతోమంది భక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా గండి ఆలయ తీరును తూర్పారబడుతున్నారు. హారతి పళ్లెం వసూళ్లు.. బెదిరింపులకు వెరసి సిబ్బంది సరెండర్ ఇటీవల హారతి పళ్లెం వ్యవహారం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. హారతి పళ్లెంలో భక్తులు వేసే కానుకలను ఆలయ హుండీలోనే వేయాలని గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టగా.. ఆలయంలోని ఒక ప్రధాన వ్యక్తి ఆగ్రహానికి, బెదిరింపులకు వారు తట్టుకోలేకపోయారు. ’మేము ఈ డ్యూటీ చేయలేం’ అంటూ సదరు సిబ్బంది ఏకంగా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా రాసివ్వడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై దేవదాయ శాఖ కమిషనర్ సదరు ప్రధాన వ్యక్తిని తీవ్రస్థాయిలో మందలించినా ఆయన తీరు మారలేదు. ఉద్యోగుల కంటే ఇతర వ్యక్తులదే పెత్తనం ఆలయంలో అధికారిక సిబ్బంది కంటే అనాధికార వ్యక్తుల పెత్తనం ఎక్కువైంది. పాలక మండలి సభ్యులు, దాతలు, సిబ్బంది బంఛిధువులు వచ్చినా స్వామి దర్శనానికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆలయ ఉద్యోగుల కంటే ముందే ప్రధాన వ్యక్తికి చెందిన అనధికార వ్యక్తితో పాటు మరో మహిళ క్యూ లైన్ వద్ద నిలబడి భక్తులను ’వంద ఇవ్వు.. లేకుంటే వెనక్కు వెళ్లు’ అంటూ రుబాబులు చేస్తున్నారు. ‘మమ్మల్ని పలానా వాళ్లు పంపారు‘ అని భక్తులు చెబితే.. ‘వాళ్లనే అడిగి వంద తీసుకురా పో‘ అంటూ వెనక్కు పంపిన సంఘటనలు భక్తులను విస్మయానికి గురిచేస్తున్నాయి. కొబ్బరికాయలు, పూలమాలల దోపిడీ.. వెనుక రాజకీయ ఒత్తిళ్లు దేవదాయశాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆలయ పరిసరాల్లో కొబ్బరికాయలు, పూలదండలను భారీ ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై భక్తులు గొడవలకు దిగుతున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇస్తే.. రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు ఈ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో ఇబ్బందులు పడి, తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మల్లగుల్లాలు పడ్డారు. ఇక్కడ ఎవరి తీరు వారిదే.. దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు అదనపు వసూళ్లు, దళారుల పెత్తనంపై భక్తుల ఆగ్రహం రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుకు సిద్ధమైన ఏసీ విశ్వనాథ్!గండికి దండం’.. సెలవుపై వెళ్లేందుకు ఏసీ సిద్ధం భక్తుల ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక, వారి మనోభావాలను కాపాడలేక ఆలయ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) విశ్వనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తప్పు చేస్తున్న వారిని మందలించినా మార్పు రాకపోగా.. ప్రధాన వ్యక్తి నోటి దురుసు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందుజాగ్రత్తే మేలు.. గండికి దండం పెట్టేసి, దేవదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక ఇచ్చి సుదీర్ఘ సెలవుపై వెళ్లడమే ఉత్తమం‘ అని ఏసీ విశ్వనాథ్ తన అనుయాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం విచారణ నిమిత్తం గండి క్షేత్రానికి వచ్చిన ఆర్జేసి ఎదుట కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం ఆలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. -
మద్యం దుకాణాల లైసెన్స్ గడువు పొడిగింపు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని 160 మద్యం దుకాణాల లైసెన్స్ను రెన్యువల్ చేస్తూ ఏడాది పాటు గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె.రమేష్ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు ఈనెల 30 తేదీకి ముగుస్తుండడంతో వాటిని అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు రెన్యూవల్ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్ మద్యం దుకాణాలకు రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.50 లక్షలు, గీత కులాల మద్యం దుకాణాలకు రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలు తమ వెబ్సైట్లో చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో భర్తీ కాని 14 మద్యం దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇందులో మైదుకూరు –2, ముద్దనూరు–1, కడప–2, సిద్దవటం –2, పులివెందుల –1, ఎర్రగుంట్ల–1, జమ్మలమడుగు–2 ఉన్నాయని వివరించారు. అంకెల గారడీతో ప్రజలను మభ్య పెడుతున్న సీఎం● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కడప రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్త మాటలు, అంకెల గారడీతో మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. శనివారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అప్పులు, వడ్డీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని అన్నారు. ఉత్త మాటలు, అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారని తెలిపారు. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కిలో బియ్యం రూ 70 దాటిందన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఉప్పు, పప్పు, నూనె, కోడి గుడ్డు మొదలుకొని అన్ని ధరలు పెరిగాయని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయం పెరగక, ఆర్థిక భారంతో చితికి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు నేపథ్యంలో అన్నదాతలు, ప్రజలను ఆదుకోవాలని అన్నారు. ప్రధాన మంత్రి మోడీకి రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదన్నారు. ఆయన రాజ్యా ంగం చదవలేదన్నారు. ప్రధానమంత్రి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సూచనలకు విరుద్ధంగా ఉత్తర భారతదేశానికి 500 సీట్లు, దక్షిణ భారతదేశానికి 300 సీట్లులోపు ఇవ్వాలని అనుకుంటున్నారని, అదే జరిగితే అసమానతల కారణంగా దేశం ఆరు ముక్కలవుతుందని హెచ్చరించారు. వినాయక చవితి రోజున గ్రీవెన్స్ రద్దు● జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మదనపల్లె టౌన్: వినాయక చవితి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ఉన్నందున ఆ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుల కోసం ప్రజలు ఎవరూ ఎస్పీ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు. వచ్చే వారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
● అందం వెనుక.. ’గుర్రపు’ గండం!
నిండుగా పూసి.. నీలి రంగు తివాచీ పరిచినట్లు ఎంతో కనువిందు చేస్తున్న ఈ పూలను చూసి ఏదో అందమైన సరస్సు అనుకుంటే పొరపాటే! ఇది మన కేసీ కాలువలో మైదుకూరు వద్ద దట్టంగా అల్లుకుపోయిన గుర్రపు డెక్క మొక్కల విశ్వరూపం. కాలువలో పూడిక తీయకపోవడంతో ఇవి కాలువ పొడవునా పరుచుకుని ఇలా పూలు పూశాయి. ఎలాగూ నీళ్లు లేవు కదా అని అధికారులు వీటిని గాలికొదిలేశారు. కానీ, ఇప్పుడు తాగునీటి అవసరాల కోసం కాలువకు నీటిని విడుదల చేశారు. కాలువ కొండపేట చానల్లో కొండలా పేరుకుపోయిన ఈ గుర్రపు డెక్కల కారణంగా నీరు దిగువకు ప్రవహించడం కష్టంగా మారింది. చూసేందుకు అందంగా ఉన్నా.. లోతట్టు ప్రాంతాల ప్రజల దాహార్తికి ఇవి పెద్ద గండంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. – మైదుకూరు -
ఉద్యానం.. అధ్వానం!
కడప సిటీ : ఉద్యానవన పంటలను ప్రోత్సహించి రైతులకు అండగా నిలవాల్సిన ఉపాధి హామీ అనుసంధాన పండ్ల తోటల పెంపకం పథకం కఠినమైన నిబంధనలు, షరతుల కారణంతో అటకెక్కుతోంది. ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ అజీవిక మిషన్ (వీబీజీ రామ్జీ) పథకం అమలులోకి వచ్చింది. ఈ కొత్త పథకంలో పండ్ల తోటలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కఠిన షరతులు విధించారు. ఈ కఠిన నిబంధనల వల్ల ఉద్యానవన అభివృద్ధి జిల్లాలో కష్టతరంగా మారింది. ఒకవైపు జిల్లాను తీవ్రంగా వేధిస్తున్న ఎల్నినో ప్రభావం, మరోవైపు పథకంలోని సవరించిన నిబంధనల వల్ల తోటల పెంపకానికి రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రైతులను ఎంత ఒత్తిడి చేసినా, గ్రామాల్లో ‘మొక్కలు కావాలా... రైతన్నా!‘ అని దండోరా వేయిస్తున్నా అన్నదాతలు ముందుకు రావడం లేదు. దీంతో నిర్దేశిత వార్షిక సాగు లక్ష్యాలను చేరుకోలేక ఉద్యానవన, డ్వామా అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక భారం తప్పించుకునేందుకే ‘కనిష్ట’ పరిమితి? ఈ పథకం నిధుల ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా భారాన్ని తగ్గించుకోవడానికి, కూటమి ప్రభుత్వం తనపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను కఠినతరం చేసి, సాగు విస్తీర్ణాన్ని తగ్గించడానికి కారణమవుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఈ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు ఉద్యాన పంటల సాగుకు లబ్ధి చేకూర్చేవారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 0.25 ఎకరం నుండి గరిష్ఠంగా 2.5 ఎకరాలకు (సగానికి) కుదించారు. పెట్టుబడి మరియు రుణ సౌకర్యాన్ని కూడా గరిష్ఠంగా రూ. 4 లక్షల వరకే పరిమితం చేశారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, లేబర్ ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని రైతులు పెదవి విరుస్తున్నారు. గతానికి భిన్నంగా.. మిగిలిన భూమికి నో పర్మిషన్ గతంలో ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి ఎకరాకు రూ.1.30 లక్షలు అందించేవారు. అప్పట్లో రైతుకు ఐదు ఎకరాల భూమి ఉండి, అందులో రెండు ఎకరాలకు ఉద్యాన పంటల పెంపకానికి లబ్ధి పొందినప్పటికీ.. మళ్లీ మిగిలిన రెండున్నర ఎకరాల్లో కూడా పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం (విడతల వారీగా) ఉండేది. కానీ ప్రస్తుతం అమలవుతున్న వీబీజీ రామ్జీ పథకంలో ఈ పరిస్థితి లేదు. ఇందులో అత్యంత విచిత్రమైన నిబంధన ఏమిటంటే.. ఒక రైతు ఒకసారి దరఖాస్తు చేసుకుని పండ్ల తోటలు వేసుకుంటే, ఆ తర్వాత అతనికి ఇంకా సొంత భూమి మిగిలి ఉన్నప్పటికీ, అందులో తిరిగి పండ్ల తోటల పెంపకానికి అనుమతి నిరాకరించేలా నిబంధనలు రూపొందించారు.ఎల్నినో ముప్పు.. అధికారుల నిస్సహాయతషరతులు ఒకవైపు కోకొల్లుగా ఉంటే, మరోవైపు ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి బోర్లు ఎండిపోతున్నాయి. తీవ్రమైన వర్షాభావం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా తోటలకు నీళ్లు పోసే పరిస్థితి లేదని, ఎక్కడ ఇబ్బందులు పడి అప్పులపాలవుతామన్న ఆలోచనతో రైతులు ముందుకు రావడం లేదు. ప్రతి మండలంలో ఇంత విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేయించాలంటూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలను విధించారు. అయితే, రైతుల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో టార్గెట్లు పూర్తి చేయలేక ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారు. వీబీజీ రామ్జీలో షరతులెన్నో! ఆర్థిక భారం తప్పించుకునేందుకు ప్రభుత్వ ఎత్తుగడ ఎల్నినో భయంతో రైతుల వెనకడుగు సాగు విస్తీర్ణం 5 ఎకరాల నుంచి 2.5 ఎకరాలకు కుదింపు రుణ సౌకర్యం రూ.4 లక్షలకే పరిమితం లక్ష్యాలు పూర్తి కాక అధికారుల అగచాట్లుక్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తాం! ప్రస్తుతం వీబీజీ రామ్జీ పథకం ద్వారానే పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు తీసుకుంటున్నాం. అయితే, ఎల్నినో ప్రభావంతో రైతులు సాగు చేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నది వాస్తవమే. ఈ పథకంలో ఒకసారి ప్రయోజనం పొంది, ఒకవేళ నీళ్లు లేని పరిస్థితి దాపురించి ఉద్యాన పంటలు కాపాడుకోలేకపోతే.. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు అవకాశం ఉండదు. ఈ నిబంధనల వల్ల రైతులు వెనుకంజ వేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిల్లో రైతుల్లో అవగాహన పెంచి ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – బి.ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప -
సేవలలో మొదటి స్థానం
కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సర్వీసెస్ డెలివరీ(సేవలను ప్రజలకు అందించడం)లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ ఏడాది జులైలో 81.48 శాతం, ఆగస్టు లో 81.59 శాతం సాధించి వరుసగా రెండు నెలలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్ వైద్య సిబ్బందిని అభినందించారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం కడప సిటీ : తిరుమలలో ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాహన సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాల్సిందిగా కడపకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, ప్రవచనకర్త డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావుకు టీటీడీ అధికారులు ఆహ్వానం పంపారు. పెండ్లిమర్రి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడైన ఆయన, ఈ నెల 15న పెద్దశేష వాహనం, 16న చిన్నశేష వాహన సేవలకు మాడ వీధుల్లో టీటీడీ ధర్మప్రచార పరిషత్ తరఫున వ్యాఖ్యానం చేయనున్నారు. అలాగే 21న జరిగే స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహన సేవలకు ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం అందించనున్నారు. రిమ్స్లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభంకడప అర్బన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి వద్ద ఈ బ్లాక్ను కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్. మాధవి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అత్యవసర, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అధునాతన చికిత్స అందించేందుకు ఈ బ్లాక్ ఎంతో ఉపయోగపడుతుందని, కడప జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోనల్ కో–ఆర్డినేటర్ ఆర్.శ్రీనివాసుల రెడ్డి, రిమ్స్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయభాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ కె.పెంచలయ్య, అడ్మినిస్ట్రేటర్ యు.రంగస్వామి, ఏపిఎంఎస్ఐడిసీ ఈఈ చంద్రమౌళి పాల్గొన్నారు. నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ కడప అర్బన్ : కడప నగరంలోని ఓ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ ప్రదేశంలో పేకాడుతున్న వారిలో నలుగురు కానిస్టేబుల్స్ పట్టుబడ్డారు. పేకాట ఆడుతుండగా సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐకి సమాచారం వచ్చింది. ఆయన తమ సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. అందులో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రం ప్రారంభం కడప కార్పొరేషన్: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని కడప వన్టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల హీరో షోరూం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రాన్ని (గల్ఫ్ వలసదారుల వనరుల కేంద్రం) ఆయన ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేక ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారిని రక్షించేందుకు, సురక్షిత వలసలను ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి అక్కడి నియమాలు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వీసా, పాస్పోర్ట్, కాంట్రాక్ట్ పత్రాల పరిశీలన, వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కడప అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు, డీఎల్ఎస్ఏ మెంబర్ కె.ప్రభాకర్, ఎన్డబ్ల్యూడబ్ల్యూటీ చైర్పర్సన్ లిస్సి జోసెఫ్ పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరి పోరాటం స్ఫూర్తిదాయకం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి పోరాటం స్ఫూర్తిదాయకమని సీపీఎం సీనియర్ నాయకుడు కందారపు మురళి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర వాసి అయిన సీతారాం ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, బి.మనోహర్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, బి.దస్తగిరిరెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పైపులైన్ సాకుతో రాజకీయ కక్ష
● వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ ప్రహరీ కూల్చివేతకు మార్కింగ్ ఎర్రగుంట్ల: మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది. కాలనీలోని పుష్పగిరి మాన్యంలో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ దేరంగుల వెంకటలక్షుమ్మ ఇంటి ప్రహారీని తాగునీటి పైపులైన్ సాకుతో కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు శనివారం హడావిడిగా మార్కింగ్ ఇచ్చారు. ఇటీవల విద్యుత్ స్తంభం ఏర్పాటు విషయంలో స్థానిక కూటమి నేతతో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ఇల్లే లక్ష్యంగా ఈ చర్యలకు దిగుతున్నారని ఆమె కుమారులు శ్రీనివాసులు, గోపి వాపోయారు. అదే పైపులైన్ పక్క ఇళ్ల కింద కూడా ఉన్నా, కేవలం తమ ఇంటికే మార్కింగ్ ఇవ్వడం వెనుక రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందని, నిబంధనల ప్రకారం మొత్తం సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శ:ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి శనివారం బాధితుల ఇంటికి వెళ్లి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైపులైన్ నెపంతో ఆక్రమణలు జరిగాయని భావిస్తే ముందుగా టీపీఓ ( ఖ్కీౖ) సిబ్బందితో ఆ ఏరియా అంతా సర్వే చేయించి, ఆ లైన్ వెంబడి ఉన్న ఆక్రమణలన్నింటినీ ఒకేలా తొలగించాలన్నారు. అలా కాకుండా కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్త ఇల్లే టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేషఫణితో ఎమ్మెల్సీ ఫోన్లో మాట్లాడారు. కూటమి నేతలు చెప్పారని తమ పార్టీ శ్రేణులను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గిరిధర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ తుంగా వెంకటరామిరెడ్డి, ఉపమండలాధ్యక్షుడు వెంకటమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వివరణ: ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ శేషఫణి వివరణ ఇస్తూ.. కాలనీలో తాగునీటి సరఫరాను మెరుగుపరచడం కోసమే పైపులైన్పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. అందులో భాగంగానే అన్నింటిపైనా సర్వే చేసి మార్కింగ్ ఇస్తున్నామని, మంగళవారం నాటికి అందరికీ గడువు విధించామని తెలిపారు. -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
సిద్ధవటం : సిద్దవటంలోని దిగువపేట గాంధీ వీధికి చెందిన కల్లోజి వర్షశ్రీ (21) అనే బీటెక్ విద్యార్థిని బలవన్మరణం చెందినట్లు ఎస్ఐ హారిక తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లోజి రామచంద్ర, ఇందిర దంపతుల కుమార్తె కల్లోజి వర్షశ్రీ అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుందన్నారు. గత 3 నెలలుగా కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు వైద్యం చేయించారన్నారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా విపరీతమైన పొత్తికడుపు నొప్పి రావడంతో భరించలేక బెడ్ రూమ్లో తలుపులు వేసుకుని ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి ఇందిర చెప్పారన్నారు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. విద్యార్థిని తల్లి ఇందిరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి, జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
● గోరుముద్దల చందమామ ఏది?
ఒకప్పుడు పిల్లలు అన్నం తిననని మారాం చేస్తే.. అమ్మ చంకన ఎత్తుకుని ఆకాశం వైపు చూపిస్తూ, చందమామ రావే జబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించేది. తోటి పిల్లలతో కలిసి వీధుల్లో ఆడుకునే ఆటల సందడి ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ మురిపాలు, ఆటలు మృగ్యమైపోయాయి. పిల్లవాడు ఏడ్చినా, భోజనం చేయకపోయినా.. శాంతింపజేయడానికి తల్లిదండ్రులు చేతిలో స్మార్ట్ఫోన్ పెట్టడం అలవాటు చేసేశారు. చివరకు ఈ అలవాటు ఎంతవరకు వచ్చిందంటే.. వీధిలో ఆపి ఉంచిన స్కూటర్ ఫుట్బోర్డ్పై కూర్చుని కూడా లోకాన్ని మరిచి మొబైల్ స్క్రీన్పైనే చూపులు నిలిపేలా చేస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి అవస్థే అందుకు నిదర్శనం. పిల్లలను మొబైల్కు బానిసలుగా మార్చేస్తుండటంతో, చిన్న వయసులోనే కంటిచూపు మందగించి కళ్లద్దాలు ఆశ్రయించాల్సి వస్తోంది. పిల్లల భవిష్యత్తును స్మార్ట్ఫోన్ల పాలు చేస్తున్న ఈ ఆధునిక సంస్కృతిపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. – ఖాజీపేట -
లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్గోపాల్ కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రామ్ గోపాల్ కోరారు. శనివారం కడప జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. జిల్లా నాలుగవ అదనపు న్యాయమూర్తి జి.ఎస్.రమేష్ కుమార్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడవ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరిగిన ఒక కేసులో రూ 1.20 కోట్ల పరిహారం మంజూరయ్యేలా పరిష్కారం జరిగిందన్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న అనే యువతి పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఖాజీపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని పేర్కొన్నారు. ఆమె భర్త మధుసూదన్, పిల్లలకు, కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. అదే విధంగా కోడూరు శశిధర్రెడ్డి మృతి చెందిన కేసులో మొదటి అదనపు జిల్లా న్యాయస్థానంలో ఆయన భార్య కంభం గౌతమి, చిన్నారి కుటుంబానికి రూ.1.30 కోట్ల పరిహారం అందేలా కేసు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో రూ.1.05 కోట్ల పరిహారానికి సంబంధించిన మరో కేసు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ధన్యవాదాలు తెలిపారు. 92,091 కేసుల పరిష్కారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా కడపలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలలో 92,091 కేసులకు పరిష్కారం లభించింది. కక్షిదారులకు రూ.6 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించారు. కేసుల పరిష్కారంలో ఉమ్మడి కడప జిల్లా రాష్ట్రంలో రెండవ ర్యాంకును ఇప్పటి వరకు సాధించింది. ఇంకా కేసుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. -
విద్యుత్ స్తంభాలను ఢీకొన్న కారు
● నలుగురికి గాయాలు మర్రిపాడు : రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను కారు ఢీకొన్న ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు సబ్స్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు వైపు వంశీ, బ్రహ్మయ్య, కంటే ప్రసాద్తోపాటు ఓ చిన్నారి, మహిళ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మర్రిపాడు సబ్స్టేషన్ సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉంచిన విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాలువలోకి దూసుకెళ్లిన కారుసంగం : కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి జయరామిరెడ్డి అనే వ్యక్తి ఓ పేషెంట్ను కారులో తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నారు. దువ్వూరు సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాపర్ వైరు చోరీ పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి సమీపంలో సురేష్రెడ్డి అనే వ్యక్తి షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పొషించు కుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం షెడ్కు వెళ్లి షాపు తెరవగా తాళాలు పగలి కొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. షాపులో ఉన్న రూ.70 వేల విలువ గల 25 కేజీల కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పురుషొత్తమరాజు తెలిపారు. -
అబద్ధాల పుట్ట రాంగోపాల్ రెడ్డి
పులివెందుల: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి చంద్రబాబు, లోకేష్ల డైరెక్షన్లో స్క్రిప్ట్లు చదువుతూ అబద్ధాల పుట్టలా మారిపోయారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర రవికుమార్ మండిపడ్డారు. శనివారం పులివెందులలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటం చేసి, నేడు కోర్టు కేసులు, వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఈ కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ’జాబ్ రావాలంటే బాబు రావాలి’ అన్న నినాదం కాస్తా, నేడు ‘బాబు వచ్చాడు.. ఉన్న ఉద్యోగాలు ఊడాయి’ అనేలా మారిందని ఎద్దేవా చేశారు. ఐటీ, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, ఏటా ఇచ్చే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఇప్పటికై నా ఎమ్మెల్సీ నోటి దురుసుతనాన్ని అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు దేవదత్త రాజా నాయుడు, రమేష్ కుమార్ పాల్గొన్నారు. -
ఆధునిక అగ్నిమాపక వాహనాలపై అవగాహన
కడప అర్బన్ : అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖలో అందుబాటులోకి వచ్చిన నూతన ఆధునిక వాహనాలు, పరికరాల వినియోగంపై అగ్నిమాపక అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. జోన్ –4 పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వివిధ అగ్నిమాపక కేంద్రాలకు కేటాయించిన నూతన ఆధునిక అగ్నిమాపక వాహనాలు, పరికరాల పనితీరుపై శిక్షణ ఇచ్చారు. కడప నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మైదానంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. వాహనాల పనితీరు, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించే విధానం, పరికరాల నిర్వహణ, సాంకేతిక అంశాలపై సంబంధిత వాహనాల తయారీ సంస్థల ప్రతినిధులు అగ్నిమాపక అధికారులకు, సిబ్బందికి ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల సమయంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు, తక్కువ సమయంలో ప్రమాద ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో జోన్–4 పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, చిత్తూరు, నంద్యాల, అనంతపురం ఏడీఎఫ్ఓలు వై.చిన్న బజారి, పి.బి.శివారెడ్డి, ఎస్.నాగరాజు నాయక్, వై.కరుణాకర్, వి.రఘునాథ్, ఎస్.అశ్వర్థ్, అగ్నిమాపక కేంద్రాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
చక్రాయపేట : భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మండలంలోని సురభి గ్రామం రెడ్డివారిపల్లె మాలపల్లెకు చెందిన గొంగటి రాధ(38) హత్య కేసులో నిందితుడు గొంగటి నాగార్జున అలియాస్ జి.కర్ణను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. హతురాలు రాధ, నిందితుడు నాగార్జున భార్యాభర్తలన్నారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య సఖ్యత లేక పోవడం, వారి పిల్లలను భర్తకు దూరం చేయడం, ఇంటిలోకి రానివ్వక పోవడంతో నాగార్జున మనసులో కక్ష పెంచుకొని ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న రాధను కట్టెతో, రాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశాడని వివరించారు. ఈ కేసులో హతురాలి కుమారులు రుద్రదీప్, భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రాయచోటి –వేంపల్లె ప్రధాన రహదారిపై బీటీపల్లె సమీపాన ఉన్న హెరిటేజ్ దుకాణం వద్ద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాళ్లు, కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
నందలూరులో భారీ అగ్ని ప్రమాదం
● రూ.50 లక్షల సరుకు అగ్నికి ఆహుతి నందలూరు: నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జయలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ ఫాన్సీ స్టోర్లో మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.50 లక్షల పైగా విలువైన సరుకు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దుకాణంలో మంటలు చెలరేగడాన్ని ఇంటి యజమాని గెలివి జయలక్ష్మి, గెలివి నాగేంద్ర గుర్తించి బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజన్లోని నీరు పూర్తిగా అయిపోవడంతో మరోసారి నీటిని నింపేందుకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో మంటలు మరింతగా చెలరేగడంతో దుకాణంలోని సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితులు వాపోయారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు అదనపు ఫైర్ ఇంజన్ కోసం అగ్నిమాపక అధికారులను కోరారు. అయితే రాజంపేటలో ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే ఉందని, కడప నుంచి మరో వాహనం రావాలంటే సమయం పడుతుందని అధికారులు తెలిపినట్లు బాధితులు పేర్కొన్నారు. సకాలంలో అదనపు అగ్నిమాపక వాహనం అందుబాటులోకి వచ్చి ఉంటే నష్టం కొంతవరకు తగ్గేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే దుకాణంలోని సరుకంతా మంటల్లో కాలిపోవడంతో బాధితులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. -
5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కడప జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసులరెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, అజీజ్లు కోరారు. శుక్రవారం దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె కడపలోని ఏడు రోడ్ల కూడలిలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక, న్యాయమైన డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్, భారత ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్య ధొరణికి నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. పెన్షన్ అప్డేషన్, యూనిఫాం, డీఏ, ఓపీఎస్ పునరుద్ధరణతో సహా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. తీవ్ర పనిభారాన్ని తగ్గించడానికి అన్ని కేడర్లలో తగిన సంఖ్యలో నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ లలితా రెడ్డి, ట్రెజరర్ మాలతి, జాయింట్ సెక్రటరీలు అనిల్, విజయ్, కిశోర్, ఏఐబీఏఓ అధ్యక్షుడు గరుడయ్య, యూనియన్ నాయకులు కిరణ్, హరి, హర్షవర్థన్రెడ్డి, రాఘవరెడ్డి, ఏపీజీబీ యూనియన్ నాయకులు కోటేశ్వరరెడ్డి, రాహుల్ పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని అంగడి వీధిలో జూన్ 14వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితుడు ముసలిగాళ్ళ వంశీని శుక్రవారం అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 57 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అంగడివీధికి చెందిన కొండికళ్ళు వరలక్ష్మి అనే మహిళ జూన్ 14వ తేదీ ఉదయం ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి మెయిన్ డోర్ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువా పైన ఉన్న తాళాల సహాయంతో బీరువాను తెరిచి, అందులోని బంగారు వస్తువులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజుపాలెం మండలంలోని పర్లపాడుకు చెందిన వంశీని రిమ్స్ – ఉటుకూరు మెయిన్ రోడ్ లోని చైతన్య స్కూల్ సర్కిల్ సమీపంలోని టీ షాప్ వద్ద శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రెండు బంగారు గాజులు, ఒక సాదా చైను, ఒక ఉంగరం కలిపి మొత్తం సుమారు 57 గ్రాములు బరువు గల బంగారు వస్తువులను స్వాధీన పరచుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి పులివెందుల టౌన్ : 2009 విద్యా హక్కు చట్టం నిబంధనలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పకడ్బందీగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పులివెందుల పట్టణంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ నిబంధనలు అమలు కావడంలేదన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందనలేదన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, జర్నలిస్టులు కలిసి ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. -
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమా!
జమ్మలమడుగు : ‘పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం కాదు. నిజంగా నీలో సత్తా ఉంటే మీ మూడు పార్టీలే కాదు మరికొన్ని పార్టీలను కలుపుకొని రా, నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగనివ్వు, ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం జమ్మలమడుగులో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆదినారాయణరెడ్డి పులివెందుల టార్గెట్ అంటున్నాడు, గతంలో పులివెందులలో డీఐజీ, ఎస్పీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసి గ్రామాల్లో ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా.. బయటి ప్రాంతాల వారితో ఓట్లు వేయించుకున్న వాడివి, నీవు వైఎస్ జగన్ గురించి పులివెందులలో తమ ప్రతాపం చూపిస్తా అని మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఏమిటో ముందు తెలుసుకో. పోలీసులు ఉంటేనే బయటికి, పులివెందులకు పోయే పరిస్థితి. వారు లేకుండా పూల అంగళ్లు కూడా దాటలేని పరిస్థితి నీది’ అంటూ చురకలు అంటించారు. ఇప్పుడు ఎన్నికల్లో జమ్మలమడుగు మున్సిపాలిటీ గెలిచి చూడు నీవేంటో తెలుస్తుందన్నారు. ‘ఆదినారాయణరెడ్డి.. ఇప్పటికై నా మారు నీ స్థితి ఏమిటో అర్థం చేసుకుని మసలుకో. వయసు మీద పడుతుంది. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకో’ అని హితవు పలికారు. రాబోయే 30 ఏళ్ల పాటు అధికారంలో కూటమి ఉంటుందని ప్రగల్భాలు చెబుతున్నావు. 2029లో జరిగే ఎన్నికల్లో మీ కూటమే కాకుండా ఇంకా ఎవరినైనా కలుపుకొని వచ్చినా జమ్మలమడుగు, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం’ అని అన్నారు. దమ్ము ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వు ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సవాల్ -
అందరూ ఉన్నా.. అనాథలా..!
కడప అర్బన్ : ‘ఆమెకు అందరూ ఉన్నారు.. కానీ అనాథగానే’ ఈ లోకం విడిచిపోయింది. కడ చూపునకు బంధువులు వచ్చినా.. ఈపింటి వాళ్లం, కొన్ని సంప్రదాయాలు చేయకూడదు అని తప్పించుకున్నారు. చివరకు ఓ బంధువు శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిని సంప్రదించగా.. వారు హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భర్త, ఇద్దరు కుమారులు ఉన్నా.. వారు కార్యం నిర్వహణకు ముందుకు రాలేదు. దీంతో ఆత్మ బంధువులు అయిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంత్యక్రియల తతంగం పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు వాస్తవ్యులు జయకుమార్ సతీమణి రాధమ్మ (55) గత 24 సంవత్సరాల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల భర్తతో విడిపోయారు. అనంతరం కడపలో ఉన్న తన తల్లి దగ్గర ఉన్నారు. తల్లి మరణించిన తర్వాత అక్క, బావ చేరదీసినట్లే చేరదీసి, తరువాత కడప నగరంలోని చౌడమ్మ వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకొన్నారు. రాధమ్మ గత 12 ఏళ్లుగా చౌడమ్మ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. భర్త, కుమారుడు వచ్చినా... రాధమ్మకు భర్త, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన ఇద్దరు కుమారులు ఉన్నారు. చివరి చూపు చూసేందుకు భర్త, ఓ కుమారుడు వచ్చినా, అంతిమ సంస్కారాలు నిర్వహించలేదు. బంధువర్గం పెద్దది. అయితే వారిలో 20 మంది దాకా బంధువులు చివరి చూపు చూసేందుకు వచ్చారు. కానీ అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కడపలో ఉన్న ఆమె బంధువులలో ఒకరు ఫోన్ ద్వారా శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిని సంప్రదించి రాధమ్మ గురించి వివరాలను తెలిపి, అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. వెంటనే శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి వారు స్పందించారు. మానవత్వంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అందరూ బంధువులే కానీ.. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె దహన సంస్కారాలు అనాథగా నిర్వహించాల్సి వచ్చిందని సంస్థ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంప్రదాయాలు ఈపింటి వాళ్లం చేయకూడదు అనే మాటలు వారి నుంచి రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో ఆర్టీసీ కానిస్టేబుల్ గుండ్లకొండ రవి, రెడ్డి లక్ష్మణ్, బద్రి, పుట్టా పురుషోత్తం, హరిబాబు, ఎలక్ట్రిషన్ మధు, సివిల్ సప్లయ్ సురేష్ పాల్గొన్నారు. చివరి చూపునకు వచ్చిన బంధువులు ఈపింటి వాళ్లమని అంత్యక్రియలకు దూరం ’ఆత్మ బంధువులచే’ అంతిమ సంస్కారాలు -
గండి అక్రమాలపై ఆర్జేసీ విచారణ
చక్రాయపేట : గండి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై దేవదాయ శాఖ కమిషనర్కు కొందరు భక్తులు పంపిన ఫిర్యాదులపై ఆ శాఖ మల్టీజోన్ తిరుపతి ఆర్జేసీ బి.మహేశ్వరరెడ్డి శుక్రవారం విచారణ చేశారు. మహాకుంభాభిషేంలో అవకతవకలు, పంచలు, కండువాల కొనుగోలు, విద్యుత్ డెకరేషన్, షామియానాల టెండర్లలో సిండికేట్, గదుల నిర్వహణలో అక్రమాలు, అనధికారికంగా కొందరు ఉద్యోగులకు జీతాలు తదితరాలపై భక్తులు వాట్సాప్ వేదికగా కమిషనర్కు పంపారు. ఇందుకు స్పందించిన కమిషనర్ ఆర్జేసీ మహేశ్వరరెడ్డిని విచారణాధికారిగా పంపారు. దీంతో ఆయన గండికి చేరుకొని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన నివేదికను కమిషనర్కు పంపుతామని వెల్లడించారు. అంజన్నకు పూజలు విచారణ నిమిత్తం వచ్చిన ఆర్జేసీ గండి వీరాంజనేయస్వామిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు ఆయనచే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. సభా అనుజ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసుదాసు పుణ్యాహవాచకం, రక్షాబంధనం, ఆచార్య రుత్విక్ వరణం, పవిత్ర పుట్ట మన్ను సమర్పణ, అంకురార్పణ, వాస్తుహోమం, సోమకుంభ ప్రతిష్ఠ, కలశారాధన, నివేదన, సేవాకాలం, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ ఏఈవో రవి మాట్లాడుతూ శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజుల పాటు రామయ్య క్షేత్రంలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహిస్తామని చెప్పారు. బ్రెజిల్ దేశస్తుల సందడి ఒంటిమిట్ట పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతున్న వేళ.. బ్రెజిల్ దేశస్తులు సందడి చేశారు. తీర్థ యాత్రలో భాగంగా వారు రామేశ్వరం, హంపి తదితర ప్రాంతాలతోపాటు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామా లయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గర్భాలయంలోని మూల మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాసేపు అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. -
చెకుముకి సైన్స్ సంబరాలకు స్పందన
కడప ఎడ్యుకేషన్: జన విజ్ఞాన వేదిక (జేవీవీ)ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి వరకు విజయవంతంగా కొనసాగాయని జేవీవీ కడప జిల్లా కమిటీ తెలిపింది. జిల్లాలోని 20 మండలాల నుంచి 20 వేలకు పైగా విద్యార్థులు చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంది. విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా దృష్టి, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే చెకుముకి సైన్స్ సంబరాల ప్రధాన ఉద్దేశమని వారు అన్నారు. కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కడప పట్టణానికి సంబంధించిన 50 పాఠశాలల నుంచి 160 మంది విద్యార్థులు మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల విభాగంలో నాగరాజుపేట ఎంసీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల నుంచి షేక్ అమియా అజీమ్, ఎస్. నఫీసా బి., తారక రామ్ పాల్గొననున్నారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో సీఎంఆర్ పల్లె స్కైల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి టి. సాయి చందన, జి. మానసవీణ, కె.ఈ. శ్రీత జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న కడప ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా కమిటీ తెలిపింది. కార్యక్రమంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి, జేవీవీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, శివరాం, శ్రీకాంత్, కుమారస్వామి రెడ్డి, జింక రవి, సమతా నాయకురాలు సునీత, అరుణ, రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్లో సత్తా చాటుదాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నిర్వహించనున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్(డబ్ల్యూ ఏపీఎల్) సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్లో రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు విజయం సాధిస్తుందని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు ఓనర్లు రాజారెడ్డి, అమర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహిళా క్రికెట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. ఇందులో భాగంగా తొలిసారి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుంచి ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్ (డబ్ల్యూ ఏపీఎల్) సీజన్ –1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుందన్నారు. ఇందులో నాలుగు జట్లు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఈ– ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్(డబ్ల్యూ ఏపీఎల్)లో తలపడనున్నాయన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు శ్రీచరణి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని, అయితే అంతర్జాతీయ కిక్రెట్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా క్రీడాకారులు పద్మజ కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా అనూష వ్యవహరిస్తున్నారన్నారు. రాయలసీమ బౌలింగ్, బ్యాటింగ్లో బలంగా ఉన్న జట్టు అని అన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ దీవించాలన్నారు. శనివారం కడప నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం క్రికెట్ స్టేడియంలో జెర్సీ లాంచ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జట్టు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్ స్టేడియం కమిటీ చైర్మన్ ఆర్.శ్రవణ్ రాజ్రెడ్డి, జట్టు కోచ్ సురేష్, మెంటర్ పైడి కాల్వ విజయ్కుమార్ పాల్గొన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు కప్ గెలుస్తుంది ఆ జట్టు ఓనర్స్ రాజారెడ్డి, అమర్బాబు -
నేడు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్
కడప అర్బన్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ నెల 12న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ‘జాతీయ లోక్ అదాలత్‘నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 8, ప్రొద్దుటూరు 5, రాజంపేట 3, రాయచోటి 3, బద్వేల్ 2, సిద్దవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వేకోడూరులో ఒక్కొక్క బెంచ్ చొప్పున ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్: 08562 258622, 244622.. ఈ మెయిల్ అడ్రస్: కెఎడిఎపిఎ.డికోర్ట్స్.జిఒవి.ఐఎన్, డిఎల్ఎస్ఎకెడిపిఅట్దిడేటాఫ్డాట్కామ్. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చును. న్యాయవాదులు, రెవెన్యూ, బ్యాంక్, ఇన్సూరెన్స్, లేబర్ డిపార్ట్మెంట్, రవాణా, పోలీసు శాఖతోపాటు ఇతర శాఖల అధికారులు, చిట్ ఫండ్ కంపెనీ ప్రతినిధులు జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.రామగోపాల్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఫకృద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. -
అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీ చేయాలి
● పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మేడా, ఎమ్మెల్యే ఆకేపాటి రాజంపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క స్థానం ఏకగ్రీవం కారాదని, అన్ని చోట్లా వైఎస్సార్సీపీ పోటీ చేయాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో జీఎంసీ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మేడా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార దర్పంతో అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని, వాటికి బెదరనవసరం లేదన్నారు. ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. వర్గ విభేదాలు లేకుండా కలసికట్టుగా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలన్నారు. అన్ని వేళలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అన్ని మండలాల్లో కూడా వైఎస్సార్సీపీ బలంగా ఉందని పేర్కొన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని మరోసారి ప్రజలకు ప్రతి కార్యకర్త తెలియజేయాలన్నారు. అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తోందన్నారు. భవిష్యత్తులో పార్టీలో గుర్తింపు కార్డులు కీలకం కానున్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకుడు సురేష్బాబు, మున్సిపాలిటి చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ మేడా భాస్కర్రెడ్డి, ఎంపీ మేనల్లుడు మదన్రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, స్టేట్ సీఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, మున్సిపాలిటి వైస్ చైర్మన్ మర్రి రవి, మండల పార్టీ కన్వీనర్లు గోపిరెడ్డి, నీలకంఠేశ్వరెడ్డి, టక్కోలు శివారెడ్డి, రామస్వామిరెడ్డి, రాజారెడ్డి, భాస్కర్రాజు, పట్టణ కన్వీనరు కృష్ణారావుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమి చేయాలో పాలుపోవడంలేదు
నాకు సొంత పొలం 8 ఎకరాలు ఉంటే మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఇప్పటి వరకు 11 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిరప సాగు చేశాను. వర్షాభావంతో 4 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట దున్నేశాను. దీంతో రూ. 20 వేల వరకు నష్టం వచ్చింది. మరో 11 ఎకరాల్లో పత్తిపంట వేశాను. ప్రస్తుతం వర్షాభావం వల్ల పంట కూడా వాడుముఖం పట్టింది. కౌలు పొలంలో పంట సాగుచేశాను కాబట్టి యజమానికి ఎకరాకు రూ. 15 వేల చొప్పున కౌలు డబ్బులు కట్టాలి. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – కమాల్బాషా, కొర్రపాడు గ్రామం, రాజుపాలెం మండలం -
వాయిదా పడితేనే ఫాయిదా !
● వారెంట్ల పేరుతో నిందితులు, బాధితుల నుంచి దందా ● జరిమానా రూ.200–రూ.500.. వసూళ్లు రూ.3వేలు – 5 వేలు ● క్రిమినల్ కేసుల్లో పిండి పిప్పి చేస్తారు ● రాజీల పేరిట బాధితులపై ఒత్తిడి బద్వేలు: వైఎస్ఆర్ కడప జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు కోర్టు డ్యూటీలు కాసులు కురిపిస్తున్నాయి. మాటల మాంత్రికులైన కొందరు కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు వారెంట్ల పేరుతో నిందితులను, బాధితులను ఇద్దరినీ వేర్వేరుగా కలుస్తూ భయాందోళనకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల అమాయకత్వం, బలహీనతలే పెట్టుబడిగా, నిందితుల భయాందోళనలే ఆదాయ మార్గంగా కోర్టు కానిస్టేబుళ్లు ఈ వసూళ్ల దందాకు తెరలేపారు. అసలు విధులు ఇవీ.. కానీ జేబులు నిండేది ఇలా.. జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ప్రతి పోలీసు స్టేషన్కు కోర్టు కేసుల నిమిత్తం ఒకరిద్దరు కానిస్టేబుళ్లతో పాటు వారెంట్ సిబ్బంది ఉంటారు. కేసుల వివరాలను కోర్టుకు అప్పగించడం, చార్జ్ షీట్లను చేర్చడం, వాయిదాలను నోట్ చేసుకోవడం, కోర్టు ఆదేశాలను స్టేషన్ అధికారికి తెలియజేయడం, చిన్న కేసుల్లో జరిమానాలు కట్టించడం, పీటీ వారెంట్లలో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం వీరి ప్రధాన విధులు. ఎటువంటి సమస్యలేని ఈ విధులే ఇప్పుడు కోర్టు కానిస్టేబుళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. బాధితులైనా, నిందితులైనా సరే కోర్టుకు హాజరయ్యారంటే కానిస్టేబుళ్ల చేతిలో డబ్బులు పెట్టక తప్పడం లేదు. ప్రతి రోజూ ఒక్కో పోలీసు స్టేషన్ నుంచి కోర్టు సిబ్బంది వేలల్లో జేబులు నింపుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. చేయి తడపకపోతే సాయంత్రం దాకా పడిగాపులే! జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేసే కానిస్టేబుళ్లు చిన్న చిన్న నేరాలకు నిందితుల నుంచి జరిమానాలు కట్టించాల్సి ఉంటుంది. చిన్న నేరాలకు కోర్టులో కట్టే జరిమానాలు రూ.200 నుంచి రూ.500 మాత్రమే కాగా.. కోర్టు ఖర్చులంటూ నిందితులు, బాధితుల నుంచి రూ.3 వేల నుండి రూ.5 వేల వరకూ వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాయిదా రోజు సంబంధిత కోర్టు కానిస్టేబుల్ను పట్టించుకోకపోతే సాయంత్రం వరకూ కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సిందేనని కక్షిదారులు వాపోతున్నారు. అదే కోర్టుకు హాజరైన వెంటనే కానిస్టేబుల్ చేయి తడపగలిగితే.. వెంటనే వాయిదా వేయించి క్షణాల్లో ఇంటికి పంపిస్తారని బాధితులు చెబుతున్నారు. పెద్ద కేసుల్లో రాజీపడాలని బాధితులపై ఒత్తిడి రోడ్డు ప్రమాదాలు, భూతగాదాలు, గొడవలు తదితర పెద్ద కేసుల్లో న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై రాజీపడాలంటూ ఒత్తిడికి గురిచేస్తున్నారు. రాజీపడితే ఎంతో కొంత సొమ్ము వస్తుందని, కేసులు పెడితే డబ్బున్న వారితో కోర్టుల చుట్టూ నడపలేరని నయానా భయానా బెదిరిస్తూ పెద్దల దగ్గర అందినకాడికి గుంజుకుంటున్నారు. దీంతో నిజమైన బాధితులు నష్టపోతున్నారు. ఈ కేసుల్లో బాధితుల పక్షాన ఉండే ప్రభుత్వ న్యాయవాదికి, నిందితుల పక్షాన ఉండే ప్రైవేటు వకీళ్లకు ఈ కోర్టు కానిస్టేబుళ్లే మధ్యవర్తులుగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కోర్టు డ్యూటీలో రాటుతేలిన కానిస్టేబుళ్లు చిన్నపాటి పెట్టీ కేసుల నుంచి నాన్ బెయిలబుల్ కేసుల దాకా.. తాము విధులు నిర్వహించే పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకూ చక్రం తిప్పుతున్నారు. నిత్యమూ అక్రమార్జనతో వేలు, లక్షలు సంపాదిస్తూ ఇంద్రభవనం లాంటి ఇళ్లు నిర్మించుకుని దర్జాగా బతికేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే పోలీసు స్టేషన్లో కోర్టు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహించడంతో వీరి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఒకవేళ వీరు ఇతర చోట్లకు బదిలీ అయినా.. అక్కడ కూడా కోర్టు విధులకే మొగ్గు చూపుతూ, సిఫారసులు, డబ్బులతో సంబంధిత అధికారుల చేతులు తడిపి మళ్లీ అదే పోస్టింగ్ వేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఏదో విధంగా స్టేషన్లలో కేసులు తగ్గితే చాలన్నట్లు వ్యవహరిస్తూ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా పోలీసులు బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
కలెక్టర్, ఎస్పీలకు ఏపీ ఎస్సీ కమిషన్ నోటీసులు
కడప అర్బన్: వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఈనెల 15వ తేదీన విజయవాడలోని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఛాంబర్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ఆదేశించారు. ఒక కీలకమైన భూ వివాదం కేసులో కడప నగరానికి చెందిన పి.సరోజమ్మ, పి.కిషోర్కుమార్ల ద్వారా అందిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. కలెక్టర్, ఎస్పీలతో పాటు కడప డివిజన్ డీఎస్పీ, కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్, వల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, కడప రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, వల్లూరు తహసీల్దార్లను సైతం వ్యక్తిగతంగా చైర్మన్ ముందు హాజరుకావాలని ఏపీ ఎస్సీ కమిషన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం, అధికారిక నివేదికలతో సంబంధిత అధికారులంతా విచారణకు రావాలని చైర్మన్ స్పష్టం చేశారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రవీణ్దే పైచేయి !
● హైకమాండ్ వద్ద తగ్గని పరపతి ● ప్రొద్దుటూరు ఏజీపీగా వినోద్కుమార్ నియామకం ● ఎమ్మెల్యే వరద సిఫార్సు చేసిన నిర్మలకు మొండిచేయి ● ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఆదేశాలు జారీ సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్కుమార్ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్కుమార్రెడ్డిదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా (ఏజీపీ) వినోద్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్చిర్జిగా ఉక్కు ప్రవీణ్కుమార్రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అన్పించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు. ఏజీపీగా వినోద్కుమార్ నియామకం... ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్గా ఈ.వినోద్కుమార్ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అడ్వకేట్ వినోద్కుమార్ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం. కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి.... ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జీవీ ప్రవీణ్ కుమార్రెడ్డి నంద్యాల వరదరాజులరెడ్డి -
●ఆశగా ఎదురు చూపులు..
కడప అగ్రికల్చర్: తెల్లబంగారం నిలువునా ఎండుతోంది. సాగుదారుల ఆశలను ‘ఎల్నినో’రాక్షసి ఆవిరి చేస్తోంది. ఒకప్పుడు లాభాల సిరులు కురిపించిన పత్తి చేలు.. నేడు నీరు లేక, ఎండల తీవ్రతకు అకాలంగా తెల్లబడుతున్నాయి. కీలక దశలో వరుణుడు ముఖం చాటేయడంతో పత్తిపంట ఎదుగుదల మందగించి చెట్టుకున్న పూత, కాయ రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో పత్తిపై పెట్టుకున్న ఆశలు ఆవిరవుతుండగా సుమారు రూ. 10 కోట్లు పైగా పెట్టుబడులు నేలపాలయ్యే పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో... ఖరీఫ్ ప్రారంభంలో తొలకరి జల్లులు పలకరించడంతో జిల్లాలో పత్తిపంటను సాగు చేశారు. కీలకమైన పూత, కాయ దశలో చినుకుజాడ కనిపించడపోవడంతో పంట ఎండిపోతోంది. ఇప్పటికే వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్ల ఎదుటే ఎండిపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పత్తి సాధారణ సాగు 22469 హెక్టార్లు గాకా అందులో 8703 హెక్టార్లలో మాత్రమే సాగైంది, ఇందులో వర్షాధారంగా 6458 హెక్టార్లలో, బోర్ల కింద 2245 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వానలకు సాగు చేసిన పత్తి పంటకు రైతులు ఎరువులు, పురుగుముందులు వినియోగించారు. తరువాత ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో పంట పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. ఎకరాకు రూ. 12 వేల పెట్టబడి... పత్తిపంట సాగు కోసం ఎకరాకు సుమారు రూ. 12 వేల వరకు పెట్టుబడి పెట్టారు, ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు రూ. 15 వందలు, రెండు సార్లు దుక్కుల కోసం రూ. 4 వేలు, కలుపు ఖర్చులు ఎకరాకు రూ. 3 వేలు, ఎరువులు, పురుగుముందులు రూ. 3500 ఇలా అన్ని కలిసి ఎకరాకు సుమారు రూ. 12 వేల వరకు ఖర్చు పెట్టారు. వర్షాధారంగా సాగు చేసిన పత్తి పంట ఎడుముఖం పట్టింది. నీటి ఆధారం ఉన్న చోట్ల కూడా భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీర అందక ఎండిపోతున్నట్లు పలువురు రైతలు తెలిపారు. పత్తి పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. పూత, పిందె, కాయలు నిలవాలంటే నేలలో తేమ అవసరం. కానీ వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గి మొక్కలు బలహీన పడుతున్నాయి, వర్షాభావంతో పూత నిలవక, కాయలు ఏర్పడక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఎరువులు, పురుగు మందులు వాడుతున్నా వర్షాలు లేని కారణంగా ఆశించిన మేర ఫలితం రావడం లేదని పత్తి రైతులు పాపోతున్నారు. బోర్లలో అడుగంటుతున్న జలాలు... ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్జ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా బోర్లకు కూడా నీరు సరిగా అందడం లేదని రైతులు తెలిపారు. ఫలితంగా కొన్ని చోట్ల బోర్లలో వచ్చే అరకొర నీటితో రాత్రింబవళ్లు నీటి తడులను అందించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎండ, మరో పక్క విపరీతమైన గాలులు వీస్తుండంతో నీటి తడులు అందించినా రెండురోజులకే భూమంతా తడి ఆరి మళ్లీ పంట వాడుముఖం పడుతుందని వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితో మరో వారం పది రోజుల్లో బోర్లలో కూడా నీరు వచ్చే పరిస్థితి లేదని పలురువు రైతులు తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను చూసి రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేవీకే శాస్త్రవేత్తలు. వ్యవసాయ అధికారులు తెలయిజేస్తున్నారు. నేలలో తేమను కాపాడుకోవడం కోసం అవసరమైన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.మండల సాధారణ సాగైన విస్తీర్ణం సాగు (హెక్టార్లలో) వేముల 3266 2450 కమలాపురం 523 170 తొండూరు 2066 193 ఖాజీపేట 1406 155 రాజంపేట 1354 65 రాజుపాలెం 1397 106 వీఎన్పల్లి 1930 720 పెండ్లిమర్రి 1389 1584 పెద్దముడియం 1319 201 -
అ(న)ధికారిక కోతలు !
● పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్కు కూటమి మొండిచేయి ● శుక్ర, శనివారాల్లో ఏకంగా 12 గంటల పాటు కరెంట్ కోతలకు రంగం సిద్ధం కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచేసి జనం జేబులకు చిల్లులు పెట్టింది. భారీగా భారం మోపినా కరెంటు సరఫరా అయినా సక్రమంగా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ, తాజాగా జిల్లావ్యాప్తంగా ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు రోజులుగా రాత్రి 9 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో జనం ఉక్కపోత, దోమలతో రాత్రంతా అల్లాడిపోయారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో రోజూ ఒకటి నుంచి రెండు గంటల పాటు కరెంటు నిలిపివేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు అంధకారం నెలకొంటోంది. రైతాంగానికి తీవ్ర అన్యాయం వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. పగటిపూట కరెంటు ఇవ్వలేక కాడి దించేసిన సర్కారు.. ఇప్పుడు ఏకంగా మూడు నుండి నాలుగు గంటల పాటు కోతలు విధిస్తూ అన్నదాతల గొంతు కోస్తోంది. దీంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక బోర్ల కింద పంటలు వేసుకున్న రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడటం వల్లే ప్రస్తుతం అనధికారిక కరెంట్ కోతలు విధించాల్సి వస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా హైడల్ (జల విద్యుత్), విండ్ (పవన విద్యుత్) పవర్ జనరేషన్ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది. లోటును అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుంది. – ఎస్.శ్రీనివాసులు, ఎస్ఈ -
హైవే పెట్రోల్ ఖాకీ వీరంగం!
రాజంపేట : పట్టణంలోని చిన్నచావిడి వీధిలో హైవే పెట్రోలు సిబ్బందిలో ఒకరు హల్చల్ చేసినట్లు గురువారం స్ధానికుల నుంచి ఆరోపణలు వెలువడ్డాయి. ఓ ఆటోలో ప్రయాణిస్తున్న హైవే పెట్రోలు సిబ్బంది ఎదురుగా వస్తున్న మరో ఆటోను వెనక్కి వెళ్లాలని సూచించారు. అయితే ట్రాఫిక్ ఉండటంతో వెనక్కి వెళ్లలేకపోయారు. వీలు లేని పరిస్ధితి ఉందని ఆటోడ్రైవర్ తెలిపారు. ఈనేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. నాకే ఎదురుచెపుతావా అంటూ ఆటోడ్రైవర్ చొక్కా పట్టుకున్నారు. దురుసుగా ప్రవర్తించారు. దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపించారు.హైవేపెట్రోలు సిబ్బంది హైవేలో ఉండాల్సిందిపోయి, నిబంధనలను అతిక్రమించారని విమర్శించారు. నడిరోడ్డులో జనం సాక్షిగా జరిగిన ఈ సంఘటనపై పలువురు హైవే పోలీసుల తీరుపై పెదవివిరస్తున్నారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు తెలిసింది. ఆటోడ్రైవరు, హైవే పెట్రోలు ఖాకీని పట్టణ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. మహిళ పై కత్తితో దాడి: కేసు నమోదు కమలాపురం : మండలంలోని టి.చదిపిరాళ్ల ఎస్సీ కాలనీకి చెందిన బెల్లం మేరిపై అదే కాలనీకి చెందిన జయవర్ధన్ అలియాస్ కన్నా అనే వ్యక్తి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేరి తన ఇద్దరు కుమారులతో కలసి టి.చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో నివసిస్తోంది. ఉపాధి, వ్యవసాయ పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. కాగా మేరి ఇంటి ఎదుటే ఉన్న జయవర్ధన్ అలియాస్ కన్నా రోజూ తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ, ఇంటి ఎదుటే మూత్రం పోస్తూ మేరిని వేధించేవాడు. గురువారం కూడా మేరి ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చాక కన్నా తిడుతున్నాడు. రోజు ఏందిరా వేధింపులు అని అతని ఇంటి గేటు వద్దకు వెళ్లి మేరి ప్రశ్నించగా జుత్తు పట్టుకుని తన ఇంట్లోని వంటగదిలోకి తీసుకెళ్తి కత్తితో పలు చోట్ల పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. మేరి కేకలు వేయడంతో కాలనీ వాసులు కన్నా ఇంట్లోకి వెళ్లి రక్షించారు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న ఆమెను 108 వాహనంలోచికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మేరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ప్రకాశం జిల్లాలో బీటెక్ చదువుతుండగా మరో కుమారుడు డిక్సన్లో పని చేస్తున్నారు. జయవర్ధన్ పక్షవాతం బారిన పడిన తన తల్లితో కలసి నివసిస్తున్నాడు. కాగా జయవర్ధన్ మానసిక పరిస్థితి సరిగా లేనట్లు స్థానికులు తెలిపారు.జనం సాక్షిగా దౌర్జన్యకర సంఘటన -
బాలల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు
కడప అర్బన్ : బాలలతో భిక్షాటన చేయించడం, వారిని బాలకార్మికులుగా మార్చడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత అధికారులను ఆదేశించారు. కడప జిల్లాలో గురువారం పర్యటించిన ఆమె పలు సంక్షేమ కేంద్రాలు, ఆసుపత్రులు, కారాగారాలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ సేవలు ప్రతి చిన్నారికి సమర్థవంతంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పుట్టంపల్లి యానాది కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, వైద్య సేవలను పరిశీలించారు. కడప కేంద్ర కారాగారం, మహిళా జైలును తనిఖీ చేసిన మహిళా కమిషన్ సభ్యురాలు ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భోజనం, వైద్య సేవల గురించి ఆరా తీశారు. 18 సంవత్సరాల లోపు వయసున్న మైనర్లు ఎవరైనా రిమాండ్లో ఉన్నారా అనే అంశంపై ప్రవేశ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. జీజీహెచ్ (రిమ్స్)లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం, పిల్లల వార్డులను తనిఖీ చేసి వైద్య పరికరాల లభ్యత, చిన్నారులకు అందుతున్న అత్యవసర వైద్య సేవలను పరిశీలించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి పి. రమాదేవి, జిల్లా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమన్వయకర్త ఎం. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
● చెరువులు ఎడారి.. చేపలు తడారి..
ప్రొద్దుటూరు రూరల్: చాపాడు మండలం చెంచుపల్లె గ్రామ సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణమున్న మడూరు చెరువు ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావం వల్ల పూర్తిగా ఎండిపోయింది. ప్రతి ఏడాది వర్షపు నీరు, కేసీ కెనాల్ నీటితో కళకళలాడే ఈ చెరువు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. చెరువులో అక్కడక్కడా గుంతల్లో మిగిలిన కొద్దిపాటి బురద నీటిలో వందలాది చేపలు ప్రాణాల కోసం విలవిలలాడుతున్నాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో చేపలు పైకి వచ్చి అల్లాడుతూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఈ దయనీయ దృశ్యాలు చూసేవారి మనసులను కలిచివేస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ప్రొద్దుటూరు పట్టణం నుంచి జనం వచ్చి ఈ చేపలను పట్టుకెళ్తున్నా ఇంకా వందలాది చేపలు బురదలోనే ప్రాణాలు వదులుతున్నాయి. అయితే, ఈ రకం చేపలకు మార్కెట్లో పెద్దగా గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వేలాది జీవులకు ఆశ్రయమిచ్చిన చెరువు.. ఇప్పుడు వాటి మృత్యువేదికగా మారడం స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది. -
‘మాకు సోది చెప్పకండి’..
కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘర్షణ కేసులో పోలీసుల దర్యాప్తు, వివక్షపూరిత అరెస్టుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి 14న జరిగిన ఘర్షణలో ఇరువర్గాల వారు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిపై కేవలం 41ఏ నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్ బెయిల్పై విడుదల చేయగా.. ఎస్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 9వ నిందితుడైన డేరా శేఖర్ను ఏప్రిల్ 28న అక్రమంగా అరెస్టు చేశారు. ఏపీ కమిషన్ నుండి ఢిల్లీ జాతీయ కమిషన్ దాకా బాధితుల పోరాటం తమపై జరిగిన ఘర్షణ, పోలీసుల తీవ్ర వివక్షా పూరిత వేధింపులపై డేరా శేఖర్ తరఫున కుటుంబ సభ్యులు 2026 ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అక్కడ ఆశించిన న్యాయం జరగకపోవడంతో, శేఖర్ భార్య డేరా జ్యోతి ఏకంగా ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించి సమగ్ర విచారణ జరపాలని వేడుకున్నారు. హైదరాబాద్లో విచారణ.. ఎస్పీ రాకపోవడంపై కమిషన్ ఫైర్ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్.. సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో విచారణ చేపట్టింది. ఈ విచారణకు కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించినప్పటికీ, పోలీస్ శాఖ తరఫున పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ హాజరయ్యారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మాకు సోది చెప్పకండి.. ఎస్పీ ఎందుకు హాజరు కాలేదు? చట్టం ముందు ఎవరైనా సమానులే‘ అని నిలదీశారు. స్థానికంగా ఒక వర్గానికే కొమ్ముకాస్తారా? కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహారశైలిపై కమిషన్ సభ్యుడు ప్రశ్నలు సంధించారు. ‘ఒకే ఘటనలో ఇరువర్గాలపై సమానంగా చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? స్థానికంగా ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించారా?‘ అని నిప్పులు చెరిగారు. గాయపడిన ఎస్టీలపై కేసులు పెట్టడం, డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేయడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించారు. జాతీయ కమిషన్ విచారణ నేపథ్యంలో ఈ కేసు జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కమిషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. కడప ఎస్పీపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం! ఒకే కేసులో ఒక వర్గానికి స్టేషన్ బెయిల్.. ఎస్టీలపై ఏకపక్ష అరెస్టులు, రిమాండ్లు ఎందుకు? హైదరాబాద్ విచారణకు ఎస్పీ ఎందుకు రాలేదు?.. డీఎస్పీ మురళీ నాయక్పై హుస్సేన్ నాయక్ నిప్పులు బాధిత మహిళ డేరా జ్యోతి పోరాటం.. తదుపరి చర్యలపై పోలీస్ శాఖలో తీవ్ర ఉత్కంఠ -
స్పర్శలేని పొడ.. తేలిగ్గా తీసుకోవద్దు
ప్రొద్దుటూరు క్రైం : చర్మంపై చిన్న పొడ కనిపించింది.. నొప్పి లేదు.. దురద కూడా లేదు.. ఏదో సాధారణ చర్మ సమస్య అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నారా ? అయితే జాగ్రత్త! ఆ పొడపై స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే అంది కుష్టు వ్యాధికి సంకేతం కావచ్చు. తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. చికిత్సలో జాప్యం చేస్తే నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లలో అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో కుష్టవ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది.కడప జిల్లాలో గత ఐదేళ్లలో 355 మంది కుష్టు వ్యాధి బాధితులకు పూర్తి స్థాయి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. వీరు చికిత్స అనంతరం వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 63 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. ప్రొద్దుటూరు లెప్రసీ విభాగం పరిధిలోని ప్రొద్దుటూరు అర్బన్, రాజుపాళెం, కల్లూరు, కామనూరు పీహెచ్సీల పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీపీఎంఓ శివశంకరయ్య తెలిపారు. ఎల్సీడీసీ సర్వేను విజయవంతం చేయాలి కడప రూరల్ : ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఎల్సీడీసీ (కుష్టు నియంత్రణ, అవగాహన) సర్వే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ యుగంధర్ కోరారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఈ సర్వేకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది నిర్దేశించిన వ్యవధిలో ఇంటింటి సర్వేను పూర్తి చేయాలన్నారు. వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి ఎక్కడా సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. హెచ్పీవీ వ్యాక్సినేషన్, వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, డాక్టర్ ఆరిఫుల్లా, ఏఓ విజయభాస్కర్, పీహెచ్సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.నేటి నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు ఇంటింటి సర్వే -
● ఎండుతున్న పంటలు !
వేముల: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం పులివెందుల నియోజకవర్గ ఖరీఫ్ రైతులను నిలువునా ముంచాయి. జూన్ నెలలో కురిసిన అరకొర వర్షాలకు వరుణుడు కరుణిస్తాడనే ఆశతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 13వేల ఎకరాలకుపైనే పత్తి, వేరుశనగ పంటలను సాగు చేశారు. అయితే వేరుశనగ సాగు చేసి 80 రోజులు, పత్తి సాగు చేసి 60 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా పడకపోవడంతో చేలన్నీ ఎండ దశకు చేరుకున్నాయి. వేరుశనగ సాగుకు విత్తనాలు, ఎరువులు, సేద్యాల కోసం ఎకరాకు రూ. 35 వేలకు పైనే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూమిలో తేమ అడుగంటింది. మరో రెండు వారాల్లో వర్షాలు రాకపోతే వేరుశనగను పూర్తిగా దున్నేయాల్సి వస్తుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం కరువును సమీక్షించి, ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు. -
● కూలీల వలసలు
రాజుపాళెం: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పల్లెల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు లేక, కేసీ కాలువకు నీరు రాక కాలువలన్నీ ఎండిపోయాయి. కనుచూపు మేరలో పొలాలన్నీ బీడు భూములుగా మారడంతో రైతులు సాగుకు ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కరువు ప్రభావం వ్యవసాయ కూలీలపై తీవ్రంగా పడింది. సొంత గ్రామాల్లో పనులు కరువై కుటుంబం గడవడం కష్టంగా మారడంతో, రాజు పాళెం మండలంలోని పలు గ్రామాల కూలీలు 20 రోజులుగా ఇతర మండలాలకు వలస వెళ్తున్నారు. అక్కడ వరినాట్లు, వరిమళ్లలో కలుపు తీయడం, మిర ప, పసుపు పంటల్లో పనుల కోసం వెతుకులాడుతున్నారు. స్థానికంగా బోరుబావుల్లో సైతం నీరు అడుగంటడంతో ఆరతడి పంటల సాగు కూడా నిలిచిపోయిందని, ప్రభుత్వం కరువు పరిస్థితులపై స్పందించి ఆదుకోవాలని రైతులు, కూలీలు కోరుతున్నారు. -
కొడుకు పాడె వద్దే ప్రాణాలొదిలిన తల్లి
రాజంపేట టౌన్ : కొడుకు అంత్యక్రియల వేళ కన్నతల్లి గుండె పగిలి మరణించిన అత్యంత హృదయవిదారక సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని రోళ్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. రోళ్లమడుగు పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బుర్రు నాగేశ్వరరావు (65) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందగా, ఆ పుత్రశోకాన్ని దిగమింగుకోలేక ఆయన తల్లి బుర్రు వెంకట సుబ్బమ్మ (86) కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు రాజంపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని రోళ్లమడుగులోని నివాసానికి తీసుకువచ్చినప్పటి నుంచి, 86 ఏళ్ల వృద్ధురాలైన తల్లి వెంకట సుబ్బమ్మ కన్నబిడ్డ శవాన్ని చూసి భోరున విలపిస్తూనే ఉంది. అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసి, మృతదేహాన్ని కాటికి పంపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ తల్లి రోదనలు వర్ణనాతీతంగా మారాయి. కొడుకు పాడె వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ ఆమె ఒక్కసారిగా మృతదేహంపైనే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి, ఆమెను కారులో రాజంపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలో ఎదురైన 108 వాహన సిబ్బంది వెంకట సుబ్బమ్మను పరీక్షించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు ఇద్దరూ మృత్యువాత పడటంతో రోళ్లమడుగు పంచాయతీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉన్న రెండు శవాలను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నబిడ్డను ఒంటరిగా పంపడం ఇష్టం లేకే ఆ తల్లి కూడా కొడుకుతో పాటే వెళ్లిపోయిందంటూ అంత్యక్రియలకు వచ్చిన వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనీల్కుమార్రెడ్డి నాగేశ్వరరావు మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. -
● ఇదే మన ‘హైటెక్’ నిమజ్జన ఘాట్!
బొజ్జ గణపయ్య పండుగ వచ్చేస్తోంది. ఏటా చవితికి నెల రోజుల ముందే కేసీ కెనాల్ నీటితో పాత కడప చెరువును కళకళలాడించి, నిమజ్జనానికి రూట్ క్లియర్ చేయడం కడప నగరంలో ఆనవాయితీ. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది! మన ‘కూటమి’ మున్సిపల్ అధికారులు, పాలకులు భక్తి కంటే ‘కక్ష సాధింపు’ ధ్యాసలోనే మునిగిపోయారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, పాత ఆస్తుల లెక్కలు తేల్చడంలో చూపించిన శ్రద్ధ.. నగర పాలనపై దృష్టి పెట్టడం పూర్తిగా మరిచారు. ఫలితంగా పాత కడప చెరువు ఇప్పటికీ చుక్క నీరు లేక వెక్కిరిస్తోంది. వారం రోజుల్లో పండుగ పెట్టుకుని ఇప్పుడు నీరెలా నింపుతారో ఆ వినాయకుడికే ఎరుక! నెల రోజుల నుంచి నగరవాసులకు కనీసం తాగడానికి మంచి నీళ్లివ్వలేని ఈ ‘మహా’ యంత్రాంగం.. ఇప్పుడు లంబోదరుడిని బురదలో ముంచుతుందో, ఎండు చెరువులో కూర్చోబెడుతుందోనని ఉత్సవ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ‘స్వామీ విఘ్నేశ్వరా.. భక్తుల కష్టాలు ఎలాగూ తీరుస్తావు..ముందు మన పాలకుల అజ్ఞానాన్ని కాస్త తొలగించు తండ్రి!’ అంటూ ప్రజలు ప్రార్థిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
● కరువు కోరల్లో ‘కేసీ’
ఖాజీపేట: మండలంలో ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా, వర్షాలు లేక పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. నిత్యం జలకళతో ఉడకాల్సిన కేసీ కాలువకు నీరు రాకపోవడంతో కాలువలన్నీ ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీనివల్ల కనుచూపు మేరలో ఎటు చూసినా పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయాయి. కాలువ నీరు లేకపోవడంతో కనీసం బోరుబావుల కిందైనా ఆరతడి పంటలు సాగు చేద్దామంటే.. భూగర్భ జలాలు పడిపోయి బోర్లలో నీరు చుక్క కూడా రావడం లేదు. పెట్టుబడులు పెడితే అప్పులపాలు కావాల్సి వస్తుందనే భయంతో రైతులు ఈ ఏడాది సాగుకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. -
● గణనాథుడి హడావుడి.. వీధివీధినా సందడి!
ఈ నెల 14వ తేదీన రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్సవాల సందడి ముందే మొదలైంది. తమ వీధుల్లో, కాలనీల్లో అందరికంటే భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి, ఘనంగా పూజలు చేయాలని భక్తజనం ఉరకలేస్తోంది. కడప నగరంలోని చిన్నచౌకుతో పాటు ప్రధాన ప్రాంతాలలో విగ్రహాల తయారీ కేంద్రాలు రంగురంగుల గణపతులతో కళకళలాడుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భారీ విగ్రహాల కోసం కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే నచ్చిన విగ్రహాలను అడ్వాన్సులు ఇచ్చి రిజర్వ్ చేసుకుంటుండగా.. మరికొందరు ముందస్తుగానే భక్తిశ్రద్ధలతో, డప్పు వాయిద్యాల మధ్య విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
అగ్ని ప్రమాదం: రూ.48లక్షల నష్టం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని షామీర్ బైకు వరల్డ్, ప్లైవుడ్ ఎంటర్ప్రైజెస్, ఎం.ఎస్ గ్లాస్ షాపుల్లో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.48లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి పని ముగించుకుని మూడు షాపుల యజమానులు ఇంటికి వెళ్లారు. రాత్రి 11గంటల సమయంలో షాపులో నుంచి మంటలు వస్తుండటంతో వారు అక్కడికి వెళ్లారు. వెంటనే అక్కడున్న వారు అగ్రిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపకశాఖాధికారి సునీల్ కుమార్ తన సిబ్బంది ఫైర్ ఇంజన్తో వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. గంటసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ షాపులలో ఉన్న దాదాపు 30 బైకులు, ప్లైవుడ్, గ్లాస్ వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ షేక్షావల్లి తన సిబ్బందితో వచ్చి స ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ మొదట బైకు షాపులో మంటలు చెలరేగాయని, బైకులలో పెట్రోలు ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఆ షాపు అనుకుని ఉన్న మరో రెండు షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయన్నారు. షాపు యజమానులు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందన్నారు. మళ్లీ సంఘటనా ప్రాంతానికి వెళ్లి ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తామన్నారు. -
ఆకాశాన నల్లని మేఘం తిరగడమే తప్ప చినుకై నేల రాలింది లేదు.. ఖరీఫ్ సీజనంతా ఒక్కసారైనా పొలం తడిసింది లేదు. ఇంకేముంది విత్తన సంచులకు వేసిన ముడి తెగ లేదు.. కాడిమేడి ఒక్క ఇంచు కదల్లేదు.. బోరు అడుగంటింది.. పైరు ఎండింది.. చెరువు తడారి చేపసైతం తండ్లాడింది.. ఎల్ని
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వీఎన్ పల్లి మండలంలో బీడుగా మారిన పొలం కడప అగ్రికల్చర్: జిల్లాలో కరువు ఛాయ కమ్ముకొస్తోంది. ఎల్నినో ఎఫెక్టుతో వర్షాలు కురిసే పరిస్థితి కనిపించకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రమైంది. కొన్ని మెట్టప్రాంతాల్లో పంట సాగన్నదే లేకుండా పోయింది. ఇక అక్కడక్కడ సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు 38 శాతం మించి కాలేదు. మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగియనుంది. ఇటు పంటలు సాగు కాక అటు సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వ్యవసాయ సాగు... ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేని కారణంగా వ్యవసాయశాఖ రైతుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా మెట్టప్రాంతంలో సాగు చేసుకునేందుకు వీలుగా ఉలవలు, మినుములు 80 శాతం సబ్సిడీతో అందించేందుకుకు సిద్ధం చేసింది. ఇందులో 1000 క్వింటాళ్లు మినుములు, 650 క్వింటాల్లు ఉలవలను పంపిణీ చేయనుంది. కావాల్సిన రైతులు విత్తనాలను తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ సూచించింది, చాపాడు: ఎగువన శ్రీశైలం జలాశయం నిండినప్పటికీ ప్రభుత్వం కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయకపోవడంతో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 92వేల ఎకరాలు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వారం రోజులుగా కుందూ నది పూర్తిగా ఎండిపోవడం, ఎల్నినో ప్రభావంతో బోర్లలో సైతం నీరు అడుగంటడంతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నాయి. అల్లాడుపల్లెలో మస్తాన్ వల్లి అనే రైతు తన 5 ఎకరాల పసుపు, మిరప పంటలను కాపాడుకోవడానికి బోరుబావిలోకి అదనపు పైపులు దించుతూ అవస్థలు పడుతుండగా, కేతవరంలో రైతు పరమేశ్వర నరసయ్య ఎండిపోయిన తన ఎకరా అలసంద పంటను దిక్కుతోచక ట్రాక్టర్తో తొలగించాడు. ఈ తరుణంలో కేసీ కెనాల్ డీఈఈ పుల్లయ్య స్పందిస్తూ.. రెండు రోజుల్లో కేసీ కాలువకు నీరు వదులుతున్నామని, అయితే ఇది కేవలం తాగునీటి అవసరాల కోసమేనని, రైతులు పంటల సాగు కోసం ఆశపడవద్దని స్పష్టం చేశారు. కనీసం తాగునీటి కోసమైనా వచ్చే నీటితో కుందూ నది పరివాహక పంటలు ఊపిరి పోసుకుంటాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎల్నినో పరిిస్థితుల నేపథ్యంలో వర్షాలు తక్కువ అవడంతో జిల్లాలో ఆనుకున్న మేర పంటలసాగు కాలేదు. ఈ పరిస్థితుల నేథఫ్యంలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా మినుములు, ఉలవలను సాగుచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసమని మినుములు, ఉలవలను కేటాయించాం. సబ్సిడీతో తీసుకెళ్లచ్చు. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎల్నినో ప్రభావంతో జిల్లాలో అనుకున్న మేర వర్షాలు కురవకపోవడంతో చాలా మేర పంటలు సాగుకు నోచుకోలేదు. అక్కడక్కడ అరకొరగా సాగు చేసిన పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి జిల్లా రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నాకు ఆరెకరాల మెట్ట పొలం ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సెంటు భూమి కూడా సాగు చేయలేదు. ఉన్న భూమంతా బీడుగానే ఉంది. ఏం చేయాలో ఆర్థం కావడం లేదు. ఈ నెలాఖరుకన్నా మంచి వర్షం కురిస్తే శనగపంట సాగు చేసుకొనే వీలుంటుంది. కానీ ఆ పరిస్థితి యాడా కనిపించడం లేదు. – శ్రీనివాసులరెడ్డి, గంగిరెడ్డిపల్లె, వీఎన్ పల్లి మండలం. నెల సాధారణ కురిసిన లోటు వర్షపాతం వర్షం వర్షపాతం జూన్ 68.2 50.3 – 26.3 జులై 96.7 24.5 – 74.7 ఆగష్టు 118.4 66.7 – 43.7 సెప్టెంబర్ 117.2 0 0 మొత్తం 400.5 141.5 – 50 -
వైఎస్సార్సీపీ కార్యర్తలే లక్ష్యంగా బైండోవర్లు
జమ్మలమడుగు : రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీలో బాగా పనిచేస్తున్న కార్యకర్తలపై బైండోవర్లు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది సరికాదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. ఈమేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎటువంటి క్రిమినల్ కేసులు లేకున్నా వైఎస్సార్సీపీ కార్యకర్తలను స్టేషన్కు పిలిపించి అవమానిస్తున్నారన్నారు. పోలీసులు పక్షపాత వైఖరి వీడాలన్నారు. బైండోవర్ కేసులు క్రిమినల్ కేసులు ఉన్నవారిపై పెట్టాలన్నారు. కానీ మాజీ సర్పంచ్లపై కూడా పెట్టి రాబోయే ఎన్నికల్లో వారిని పాల్గొనకుండా పోలీసులు భయందోళనకు గురి చేయడం ప్రజా స్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. ఇదేవిషయాన్ని ఇప్పుడు డీఎస్పీకి వివరించామని, జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు. బైండోవర్లు ఇరువర్గాలపై పెట్టాలే తప్ప కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మాత్రమే పెట్టడం అన్యాయం అని అన్నారు. కూటమి నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలడతాం.. మీ వైఫల్యాలను ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామ అన్నారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, పొన్నపురెడ్డి వెంటకశివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లక్షుమయ్య, మైనార్టీ నాయకులు ముల్లాజానీ, రైతు నాయకుడు విశ్వనాథ్రెడ్డి,వేణు యాదవ్, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, యేబు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు : ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
లాభాల వేటలో వ్యర్థాల దాణా
జమ్మలమడుగు: మైలవరం జలాశయం పరిధిలోని నిషేధిత ప్రభుత్వ భూములను ఆక్రమించి, కొందరు వ్యాపారులు దాదాపు 8కి పైగా అక్రమ కేంద్రాలలో పూర్తిగా నిషేధించిన శ్రీక్యాట్ఫిష్శ్రీ రకం చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా సున్నపురాళ్లపల్లి సమీపంలో, పి.బొమ్మెపల్లి రహదారిలో ఉన్న చెరువులో చేపలను అనధికారికంగా పెంచుతున్నారు. నాణ్యమైన దాణా ఖర్చు తగ్గించుకోవడానికి ప్రతి ఆదివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల చికెన్ సెంటర్ల నుంచి కుళ్లిన కోడి వ్యర్థాలను తెచ్చి వీటికి ఆహారంగా వేస్తున్నారు. ఈ చెరువుల వల్ల వచ్చే తీవ్ర దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇక్కడ పెంచిన చేపలను కడపతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు భారీ ఎత్తున ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మత్స్య శాఖ అధికారులు, స్థానిక కూటమి పాలకుల రాజకీయ మద్దతు ఉండటంతోనే నిర్వాహకులు ఈ దందాకు తెగబడుతున్నారని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్యాట్ఫిష్ పెంపకం ఎందుకు నేరం? మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నందున భారత ప్రభుత్వం బయో–సేఫ్టీ నిబంధనల ప్రకారం ఆఫ్రికన్ క్యాట్ఫిష్ (మాగూర్) పెంపకం, విక్రయాలను దేశంలో పూర్తిగా నిషేధించింది. కుళ్లిన కోడి వ్యర్థాలను తిని పెరిగే ఈ చేపల వల్ల మనుషులకు క్యాన్సర్, కాలేయ వ్యాధులు, తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇవి క్రూరమైన స్వభావం కలిగి ఉండి, చెరువుల్లోని ఇతర స్థానిక జలచరాలను వేటాడి తినేయడం ద్వారా సహజ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తాయి. చట్టప్రకారం ఈ నిషేధిత చేపలను పెంచినా, రవాణా చేసినా కఠినమైన జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం -
ఒక్క మాట.. ఓ ప్రాణాన్ని కాపాడొచ్చు
మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి బయటకు కనిపించినంత సంతోషంగా ఉండకపోవచ్చు. ఎవరి మనసులో ఏ బాధ ఉందో మనకు తెలియదు. అందుకే కుటుంబంలో, స్నేహితుల్లో, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో‘ మాట్లాడుకుందాం.. విందాం.. తోడుగా నిలుద్దాం’ అనే సంస్కృతి పెరగాలి. ఎదుటివారు తమ మనసులోని బాధను చెప్పుకుంటే వినడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడవచ్చు. ముఖ్యంగా ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి. సానుకూల దృక్పథాన్ని, సమస్యను పలు కోణాళ్లో చూడగలిగే గుణాన్ని వారిలో పెంచాలి. నేటి ఓటమి రేపటి విజయమని చెప్పాలి. -
● నేతల హర్షం
● రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల మార్గం ● రూ.4,500 కోట్లతో ముంబై–చైన్నె రైల్వే కారిడార్ విస్తరణ ● కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ● గంటకు 150 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు ● కృష్ణపట్నం ఓడరేవుకు సరకు రవాణా మరింత సులువు, వేగవంతం ● రైల్వే చట్టం కింద వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ రాజంపేట: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాలలో ఒకటైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. బంగాళాఖాతం – అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన ముంబై–చైన్నె రైల్వే కారిడార్లో కొత్తగా మూడు,నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 4,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రతి 7.5 నిమిషాలకో రైలు.. గంటల తరబడి నిలిపివేతలకు చెక్ 310 కిలోమీటర్ల పొడవు కలిగిన రేణిగుంట–గుంతకల్ సెక్షన్ మధ్య ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 190 రైళ్లు నడుస్తున్నాయి. అంటే సగటున ప్రతి 7.5 నిమిషాలకు ఒక రైలు ఈ ట్రాక్పై ప్రయాణిస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం ఒక రైలుకు, మరో రైలుకు మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడమే కాకుండా, రైళ్లను చిన్న చిన్న స్టేషన్లలో లేదా ఔటర్లలో గంటల తరబడి నిలిపివేయాల్సి వస్తోంది. కొత్తగా 3, 4 లైన్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది. కృష్ణపట్నం పోర్టుకు మహర్దశ – రైతులకు వరం ఈ లైన్ల నిర్మాణం పూర్తయితే కృష్ణపట్నం ఓడరేవుకు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులను అత్యంత వేగంగా చేరవేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ కొత్త లైన్లలో రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన సాంకేతికతతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో సున్నపురాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణా వేగవంతం కావడం వల్ల రైల్వే శాఖకు ఆదాయం భారీగా పెరుగుతుంది. అలాగే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో నగరాలకు చేర్చవచ్చు. అంతేకాకుండా, ఈ కారిడార్ వెంబడి ఉన్న పలు గ్రామాలు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. రంగంలోకి యంత్రాంగం.. భూసేకరణ షురూ ఈ మెగా ప్రాజెక్టు కోసం ఆరు నెలల కిందటే రైల్వే అధికారులు క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్ర అనుమతులు రావడంతో, రైల్వే చట్టం 1989 సెక్షన్ 2(37ఎ) కింద దీనిని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ భూసేకరణకు అధికారులు ముందడుగు వేశారు. ఈ మేరకు వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూమిని సేకరించేందుకు రైల్వే యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముంబై–చైన్నె రైల్వే కారిడార్లో అత్యంత కీలకమైన రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ 310 కిలోమీటర్ల మార్గంలో నిత్యం ప్రయాణికులు, సరకు రవాణా రైళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఫోర్లైన్ నిర్మాణం పూర్తయితే రైళ్లు గంటల తరబడి ఔటర్లలో వేచి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని, ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతాయని నేతలు స్పష్టం చేశారు. -
ఉద్యోగుల సమస్యలపై రాజీ ప్రసక్తే లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వీసీ–ఎండీ, యాజమాన్యంతో చర్చలు జరిపామని.. ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కో–కన్వీనర్ జీవీ నరసయ్య తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో కడప జోన్కు చెందిన ఎనిమిది జిల్లాలు, కడప నాన్ ఆపరేషన్ రీజియన్కు చెందిన నాయకులతో జోన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. జోనల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ అధ్యక్షతన, జోనల్ కార్యదర్శి యన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికిజీవీ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టీసీని,ఆర్టీసీ ఉద్యోగులను పరిరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో జేఏసీని ఏర్పాటు చేసి, ఐక్య ఉద్యమాల ద్వారా ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో చర్చలు జరిపి సాధ్యమైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈయూ స్టేట్ అడిషనల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు.రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామాంజనేయులు పీఎన్బీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మద్దిలేటి, కె.కె.కుమార్, నబీరసూల్, మురగమ్మ, మజీద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు వి.వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, విజయకుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దేవసహాయం, పి.ఎస్.ఎస్.కుమార్, బి.వి.ఎస్.ఎల్.దేవి, జోనల్ కమిటీ సభ్యులు, నాన్–ఆపరేషన్ రీజియన్ నాయకులు, కడప జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా స్థాయి నాయకులు, పాల్గొన్నారు. -
ఆపన్న హస్తంగా అమృతహస్తం..
అమృతహస్తం పేరిట సేవాసంస్థను స్థాపించిన పట్టం కిరణ్ గంగిరెడ్డి ఆత్మహత్యల నివారణకు విశేషంగా కృషి చేస్తున్నారు. కడప సమీపంలోని కొప్తర్తి పంచాయతీ ఎర్రమాచుపల్లెలో ఉంటున్న ఆయన సొంత ఖర్చులతో కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో పంచడం.., కళాశాల విద్యార్థులకు అందచేయడం ప్రారంభించారు. పోలీసుల సహకారం తీసుకుని కళాశాలల్లో అవగాహన సదస్సులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 179 సదస్సులను నిర్వహించి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంచారు. ఎవరికై నా సమస్యలుంటే 7702443446 నెంబర్కు కాల్ చేస్తే పరిష్కారానికి కృషి చేయగలమని ప్రచారం చేస్తున్నారు. ఆత్మహత్యల నివారణే లక్ష్యం.. క్షణికావేశానికి గురై ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని వల్ల ప్రతి ఒక్కరికి జీవితకాలం బాధతప్ప ఒరిగేదేమీ ఉండదు. జిల్లాను ఆత్మహత్యల రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా నా వంతు కృషి చేస్తున్నా. – పట్టెం కిరణ్గంగిరెడ్డి, అమృత హస్తం సేవాసంస్థ వ్యవస్థాపకుడు, కడప -
చిన్నారిపై వీధికుక్క దాడి
బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచింది. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కృతికారెడ్డి అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రి యల్లారెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆడుకుంటోంది. ఈ సమయంలో అక్కడే సంచరిస్తున్న ఓ వీధి కుక్క ఉన్నపలంగా చిన్నారిపై దాడి చేసి గాయపరిచింది. చిన్నారి కడుపు భాగంలో గాయం కావడంతో వెంటనే చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా చిన్నారి ఆడుకుంటున్న సమయంలో తన తండ్రి వీడియో తీస్తుండగా అదే సమయంలో చిన్నారిపై కుక్క దాడి చేసే ఘటన కూడా రికార్డు అయింది. వీధికుక్కలను నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని బాధిత చిన్నారి తండ్రితో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పరీక్షలో ఫెయిల్.. జీవితంలో కాదు!
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్లో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం కుటుంబ సభ్యులను ఎంతగానో కలచివేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ఆశించిన మార్కులు రాలేదని కొందరు విద్యార్థులు తీవ్రంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి, భవిష్యత్తుపై భయం వంటి అంశాలు వారిని మానసికంగా వేధిస్తున్నాయి. కానీ ఒక పరీక్షలో ఫెయిల్ కావడం అంటే.. జీవితంలో ఫెయినట్లు కాదు. ఒక సంవత్సరం నష్టం కావచ్చు. ఒక అవకాశం చేజారవచ్చు. కానీ జీవితం మాత్రం ఒక్కటే. అందుకే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యను తల్లిదండ్రులు ఓపికగా వినాల్సిన అవసరం ఉంది. -
రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన పులివెందుల ఎన్జీఓలు
పులివెందుల రూరల్ : కడప నగరంలోని స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో బుధవారం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యా సాగర్ను ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు సచివాలయ సిబ్బంది సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రామ గంగాధరరెడ్డి యాదవ్, ఉపాధ్యక్షులు ప్రభుకుమార్, శంకరయ్య, ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి బాలల హక్కుల కమిషన్ సభ్యురాలి పర్యటన కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ పద్మలత సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం కడపలోని అంగన్వాడిసెంటర్, సెంట్రల్, మహిళా జైళ్లు, అడాప్షన్ ఏజెన్సీ, కడప ప్రభుత్వ ఆసుపత్రిలోని మెంటల్ హెల్త్ హాస్పిటల్, ఏకీకృత సహాయ కేంద్రం, చిన్నపిల్లల వార్డులను సందర్శిస్తారన్నారు. మధ్యాహ్నం ప్రభుత్వ బాలుర వసతి గృహం, మహిళా పోలీస్ స్టేషన్లను ఆ మె తనిఖీ చేస్తారన్నారు. శుక్రవారం ఖాజీపేట, ప్రొద్దుటూరులో పర్యటిస్తారని పేర్కొన్నారు. గూడ్స్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప– కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్యలో బుధవారం గూడ్స్ రైలు కిందపడి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ధరించిన బ్లూ కలర్ ఫుల్ చొక్కాపై తెల్లని గీతలు ఉన్నాయని, తెలుపు రంగు పంచ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు రైల్వేఎస్ఐ 9247575624, 8500226717కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుడు సస్పెన్షన్మైదుకూరు : వనిపెంట జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడిని బుధవారం డీఈఓ సస్పెండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థినులపై ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేశారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు తెలియడంతో ఆ మేరకు డీఈఓకు నివేదిక పంపారు. ఈ మేరకు డీఈఓ షంషుద్దీన్, సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సస్పెండ్ ఉత్తర్వులను ఎంఈఓ–2 నరహరి శర్మ ఉపాధ్యాయుడికి అందజేశారు. -
భార్యను హత్య చేసిన భర్త
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం రెడ్డివారిపల్లె మాలపల్లెలో గొంగటి అనూరాధ (40)ను ఆమె భర్త గొంగటి నాగార్జున హత్య చేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కుమారుడు రుద్రదీప్ ఫిర్యాదు మేరకు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి,ఎస్సై చంద్ర శేఖర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనూరాధ, నాగార్జున దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కాలక్రమంలో నాగార్జున తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా ఇద్ద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. తెల్లారేసరికి ఇద్దరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు రుద్రదీప్ సమీప ప్రాంతాల్లో గాలించాడు. తమ ఇంటికి సమీపంలోని గుట్టలో అనూరాధ శవమై కనిపించిందని.. తన తండ్రి నాగార్జునే బండ రాయితో కొట్టి హత్య చేసినట్టు అనుమానంగా ఉందని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాధ హత్యకు అక్రమ సంబంధాలే కారణమని గతంలో కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పంచాయతీలు చేసుకున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కన్యకా చెరువు వైపు దూసుకెళ్లింది.ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటనపై ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ చిట్వేల్కి చెందిన చల్ల జయకర్ రాజంపేట నుంచి కడపకు కారులో వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన కారు చెరువుకట్టపై ఉన్న ఇనుప డివైడర్లను ఢీ కొట్టి చెరువు దిగువ ప్రాంతం వైపు దూసుకెళ్లిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్ ప్రొద్దుటూరు క్రైం : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇరువురు బుకీలను ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వన్టౌన్ స్టేషన్ పరిధిలో హుస్సేన్, సురేష్ రెడ్డి–99 యాప్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ మైనుద్ధిన్ సిబ్బదితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 20 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ జీవోను ఉపసంహరించుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పాత జీవోను బయటికి చేనేత ధ్రువీకరణ పత్రం జారీ చేలో నిబంధనలు కఠినతరం చేయడం దురదృష్టకరమని చేనేత ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేనేత పింఛన్కు జారీచేసిన విధివిధానాలపైన జిల్లా చేనేత జౌళీ శాఖ కార్యాలయం వద్ద ఆయా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టరేట్లోని చేనేత రంగానికి సంబంధించిన కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఓను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ఈ నెల 11వ తేదీ కడప కొత్త కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో అగ్నిప్రమాదం చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి బసివిరెడ్డి రెండు ఫైర్ ఇంజిన్లు, సిబ్బందితో వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సంబంధిత అధికారులు వివరించారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లి పేరుతో బెదిరింపులుప్రొద్దుటూరు క్రైం : పరిచయాన్ని అడ్డుపెట్టుకొని మహిళను నమ్మించి సుమారు రూ. 35 లక్షలు తీసుకోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన ఆమెను బెదిరించిన ఘటనలో కర్నాటక వాసిని ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మిట్టమడివీధికి చెందిన ఓ మహిళ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న చిక్బళ్లాపూర్ జిల్లా, గౌరిబిదనూరు తాలుకా, హోసూరు గ్రామానికి చెందిన గిరీష్రెడ్డి అలియాస్ గిరీష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఆమె వద్ద నుంచి సుమారు రూ. 35 లక్షలు తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితురాలు కోరగా, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు చిక్బళ్లాపూర్ జిల్లాలో ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న గిరీష్ ప్రొద్దుటూరులోని బాధితురాలి ఇంటికి వచ్చి తనకు మరింత డబ్బు ఇవ్వకపోతే ఇద్దరికి వివాహం జరిగినట్లు తప్పుడు వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గిరీష్ కర్నాటకలోని బెంగళూరులో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.● చేనేతలకు పింఛన్ మంజూరు చేయాలి ● జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు అవ్వారు మల్లికార్జునసాఫ్ట్వేర్ ఉద్యోగిని వేధించి మోసం చేసిన కర్నాటక వాసి అరెస్ట్ -
క్షణికావేశం.. కుటుంబం మొత్తం బలి
● బతుకు భారంగా అనిపించినా..చావు పరిష్కారం కాదు ● సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి ● బలవన్మరణాలు.. బాఽధిత కుటుంబాలకు కన్నీళ్లు ● నేడు ఆత్మహత్యల నివారణ దినంఒక్క మాటకు అలిగారు.. ఒక్క మార్కులో పరీక్ష తప్పారు... ఒక్క సమస్యను తట్టుకోలేక పోయారు. ఒక్క క్షణం ఆవేశపడ్డారు..! అంతే.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వారి మరణంతో సమస్య తీరిందా.. కాదు వారి కుటుంబ సభ్యులకు జీవితానికి సరిపడా శిక్ష పడింది.. తల్లిదండ్రులకు బిడ్డల జ్ఞాపకాలు.. పిల్లలకు అమ్మానాన్నల జ్ఞాపకాలు.. జీవిత భాగస్వాములకు తీరని ఒంటరితనం.. బంధువులకు మరచిపోలేని విషాదం.. ‘ఆత్మహత్య’తో మిగిలేదిదే. ఒక్క నిర్ణయంతో చీకట్లోకి జారకముందే.. ధైర్యంగా నిలిచి వెలుగై నిలవాలి. ఏదైనా బతికి సాధించాలి.కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది. కుటుంబ సభ్యులు మందలించారనే కారణంతో ఓ మహిళ మనస్తాపానికి గురైంది. ఆ క్షణంలో తీసుకున్న తీవ్ర నిర్ణయం ఆమె కుటుంబాన్నే విషాదంలోకి నెట్టింది.తన ముగ్గురు పిల్లలకు విషపదార్థం కలిపిన కూల్డ్రింక్ను ఇచ్చి, తాను కూడా అదే కూల్డ్రింక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇచ్చిందనే నమ్మకంతో పిల్లలు దానిని తీసుకున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆస్పత్రిలో కోలుకోలేక తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఓ కుటుంబం మొత్తం ఈ లోకంలో ఉండేది. ఒక చిన్న కుటుంబ కలహం నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబానికి సంబంధించిన వారిని జీవితాంతం వెంటాడే విషాదాన్ని మిగిల్చింది. -
పిల్లలకు టీకాలు తప్పనిసరి
డీఎంహెచ్ఓ యుగంధర్సిద్దవటం : పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని కడప డీఎంహెచ్ఓ యుగంధర్ తెలిపారు. మండలంలోని మాధవరం1 గ్రామ పంచాయతీ లోని సచివాలయం–2 పరిధి లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో బుధవారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో పాల్గొని టీకాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో బుధ, శనివారాల్లో పిల్లలకు, గర్భిణులకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తారని పేర్కొన్నారు. పిల్లలకు తట్టు రాకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయానికి విధులకు హాజరై పేషంట్లకు వైద్య సేవలు అందించాలన్నారు. డీఐఓ ప్రవీణ్ కుమార్, మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య పాల్గొన్నారు. -
వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
సింహాద్రిపురం: మండల కేంద్రమైన సింహాద్రిపురంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ బుధవారం ముస్లిం సోదరులు రెండో రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా నాలుగు రోజుల పాటు నాలుగు దిక్కుల్లోని బీడు భూములలో ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి, పాడిపంటలు బాగా పండేలా అల్లాహ్ కరుణించాలని వేడుకున్నారు. శుక్రవారం జరిగే ముగింపు ప్రార్థనలలో ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
వైవీయూలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు షురూ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య వి.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో వైవీయూ ఉపకులపతి) ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ హాజరై విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ పత్రాలను అందజేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి ‘ఓఎండీసీ’ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ప్రాతిపదికన వివిధ ఆనర్స్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లు కేటాయించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. నాణ్యమైన బోధన, అధునాతన గ్రంథాలయం, హాస్టల్ వసతితో రాష్ట్రంలోనే వైవీయూ మొదటి మూడు స్థానాల్లో నిలిచిందన్నారు. విద్యార్థులు మొదటి రోజు నుంచే లక్ష్యంతో చదివి ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ విజయభారతి తదితరులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో సైన్స్ దే కీలకపాత్ర కడప ఎడ్యుకేషన్: శాసీ్త్రయ సమాజ నిర్మాణంలో సైన్స్ , ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప జయనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ మనక్ నామినేషన్లు, ఎకో క్లబ్ కార్యక్రమాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి లేబాక బాలాజీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఇన్స్పైర్ మనక్ నామినేషన్లను వంద శాతం పూర్తి చేసి, జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. అలాగే ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్, పర్యావరణ విద్య కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రెహమాన్, ఎన్జీసీ కో–ఆర్డినేటర్ విజయప్రసాద్, పలువురు రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
ఇన్వెస్ట్ కడప సెంటర్ ప్రారంభం
● దక్షిణ భారత్లోనే ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మారుస్తాం ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సిటీ: వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న కడపను పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక హబ్గా మార్చి, దక్షిణ భారతదేశంలోనే ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం కడప కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటైన ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, పలువురు పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రం యొక్క ప్రత్యేకతలను వివరించారు. పెట్టుబడిదారులు తమ వ్యాపార ఆలోచనలతో వచ్చిన రోజు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. పెట్టుబడిదారులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పరిశ్రమలకు అనువైన ప్రాంతాలు, పారిశ్రామిక భూముల లభ్యత, నీరు, విద్యుత్, రహదారి అనుసంధానం వంటి పూర్తి వివరాలను అందిస్తారు. భూమి కేటాయింపు అనంతరం వివిధ శాఖలను సమన్వయం చేస్తూ అన్ని అనుమతులను వేగంగా ఇప్పిస్తారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే బాధ్యతను కూడా ఈ కేంద్రమే చూసుకుంటుంది. బయటి రాష్ట్రాల పెట్టుబడిదారులకు ప్రత్యేక సహకారం అందించడంతో పాటు, స్థానిక యువత, విద్యార్థి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వారి స్టార్టప్లకు అవసరమైన తోడ్పాటును అందిస్తారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, ఎంటర్ప్రెన్యూర్స్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆసుపత్రుల బాట పడుతున్న జనం
● జిల్లాలో వేసవిని తలపిస్తున్న ఎండలు ● ఉక్కతో అల్లాడుతున్న జనం ● వర్షాభావ పరిస్థితులతో రైతుల్లో అందోళన ● మారిన వాతావరణంలో జనాలకు జలుబు, జ్వరాలు తేదీ కనిష్ట గరిష్ట గాలివేగం ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత (కి.మీ/ (డిగ్రీలు) (డిగ్రీలు) గంటకు) 01.9.26 27.8 36.6 8.1 02.9.26 26.2 36.2 5.5 03.9.26 28.2 36.6 7.9 04.9.26 28.6 37.2 5.6 05.9.26 28.4 38.6 7.2 06.9.26 28.7 38.9 5.9 07.9.26 28.0 39.2 4.3 08.9.26 27.6 38.2 6.4 కడప అగ్రికల్చర్: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటు న్న విభిన్న మార్పులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొద్దిసేపు ఆకాశమంతా మేఘావృతమవ్వడం, మరికొద్ది సేపటికే ఎండలు తీవ్రంగా కాయడంతో జిల్లా ప్రజ లు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత వాతావరణాన్ని చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. అటు ప్రకృతి కరుణించక, ఇటు వింత వాతావరణ పరిస్థితులతో జిల్లా అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖం చాటేసిన వరుణుడు.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వాన దేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో రోజురోజుకూ ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు మండు వేసవిని తలపిస్తున్నాయి. నాలుగు రోజులు గా జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో పాటు, పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వేధిస్తోంది. దీంతో జనాలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నా రులు, వృద్థులు అవస్థలు పడుతున్నారు. 39 డిగ్రీలకు చేరిన భానుడి భగభగలు గత వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న 36.6 డిగ్రీలుగా ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత, కేవలం వారం రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 7 నాటికి 39.2 డిగ్రీలకు చేరుకుంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి వేళల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ ల పైనే నమోదు కావడంతో ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఒకవైపు చేతిలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు రోగాల బారిన పడుతుండటంతో వైద్య ఖర్చులు భరించలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు.ముందుకు సాగని వ్యవసాయం.. బోర్లలో సైతం అడుగంటిన నీరువర్షాలు లేని కారణంగా జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తిగా ముందుకు సాగడం లేదు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పనులు దొరకక పూట గడవడం కష్టంగా మారింది. వ్యవసాయ బోర్లలో నీటి ప్రవాహం గణనీయంగా క్షీణించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, కరువు ప్యాకేజీ ప్రకటించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
● వర్ణనాతీతం!
నల్లని మబ్బుల నడుమ.. సాయంసంధ్య వేళ.. ఆకాశమంతా ఒకేసారి బంగారు రంగుతో మెరిసిపోతే ఆ అనుభూతి వర్ణనాతీతం! మంగళవారం సాయంత్రం జమ్మలమడుగులో సరిగ్గా అలాంటి అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది. రోజంతా తన వేడి కిరణాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన భానుడు.. పడమటి కొండల్లోకి వాలిపోతూ జమ్మలమడుగు ఆకాశంపై పసిడి పారాణి పూశాడు. తెల్లని మేఘాల పొరలు ఒక్కసారిగా స్వర్ణమయంగా మారిపోవడంతో ప్రకృతి ఒక అందమైన కాన్వాస్ లా రూపాంతరం చెందింది. స్థానిక దర్గా గుమ్మటం, దానిపై రెపరెపలాడుతున్న పతాకాల వెనుక సూర్యాస్తమయ కిరణాలు వెదజల్లిన ఆ ‘స్వర్ణవర్ణశోభ’ చూసి స్థానికులు పరవశించిపోయారు. అప్పటివరకు గజిబిజి పనుల్లో ఉన్నవారంతా ఒక్క నిమిషం పాటు ఆగి, ఆకాశం వైపు ముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. ప్రకృతే స్వయంగా కురిపించిన ఈ కనక వర్షపు అపురూప దృశ్యాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలుగా, వీడియోలుగా బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కాసేపు ప్రకృతి రమణీయతను ఆస్వాదించిన జమ్మలమడుగు ప్రజలు, సాయంత్రపు ఉక్కపోతను మరిచి ఈ దృశ్యంతో మనసులను తేలిక పరుచుకున్నారు. – జమ్మలమడుగు -
● ఉచిత ప్రయాణం.. ఉమ్మడి వ్యాయామం!
అదిగో.. మహిళా లోకానికి ఉచిత ప్రయాణాలంటూ కూటమి సర్కారు పెద్ద పెద్ద హామీల ‘ఫ్రీ బస్సు’ ఎక్కించేసింది! ఇంకేముంది.. సీట్లు దొరక్క బస్సుల్లో సిగపట్లు, జుట్టు పట్లు ఎలాగూ నిత్యకృత్యం అయిపోయాయి. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు బాసూ.. బస్సు స్టాప్లో చేతులు ఎత్తితే ఆపకుండా తుర్రున వెళ్లిపోయే ఆర్టీసీ డ్రైవర్లను దాటుకుని, ఎట్టకేలకు సీటు సంపాదిస్తే.. ఆ బస్సే నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ అగచాట్లు ఎలా ఉంటాయో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం రూట్లో సాక్షాత్కరించింది. పులివెందుల నుంచి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సు కాస్తా మధ్యలో మొండికేసి ‘నేను కదలను గాక కదలను’ అంటూ మొరాయించింది. ఇంకేముంది.. డ్రైవర్, కండక్టర్ చేతులెత్తేయడంతో.. విధిలేని పరిస్థితుల్లో ‘ఉచిత’ ప్రయాణికురాళ్లే రంగంలోకి దిగారు. తమ చేతులకు ఉన్న గాజుల సవ్వడి పక్కనబెట్టి.. చీరల కొంగులు నడుముకు చుట్టి.. ఆర్టీసీ బస్సును స్టార్ట్ చేయడానికి వెనుక నుంచి గట్టిగా తోయాల్సి వచ్చింది! ‘ఫ్రీ బస్సంటే.. ఏదో సీట్లు మాత్రమే ఫ్రీ అనుకున్నాం సార్, కానీ ఇలా బస్సును తోసే ‘ఫ్రీ వ్యాయామం’ కూడా ఇస్తారని ఊహించలేదు’ అంటూ తోసి తోసి అలసిపోయిన మహిళలు వ్యంగ్యంగా ముక్కున వేలేసుకుంటున్నారు. ఫ్రీ టికెట్ ఇచ్చారు సరే.. కాస్త నడిచే బస్సులను కూడా ఇస్తే పుణ్యం ఉంటుందని కూటమి సర్కారుకు మహిళా లోకం దండాలు పెడుతోంది. – సింహాద్రిపురం -
కాలిబాటపై శీతకన్నప్పా!
● దేవదాయశాఖ, శ్రీకాళహస్తి నిర్లక్ష్యంపై భక్తుల విమర్శలు ● రాజంపేట ఊటుకూరు నుంచి శ్రీకాళహస్తికి నేరుగా చారిత్రక మార్గం అభివృద్ధికి డిమాండ్ ● ఇతరరాష్ట్రాల భక్తులకు తప్పనున్న ప్రయాణ దూరం రాజంపేట: అపర శివభక్తుడైన భక్తకన్నప్ప (తిన్నడు) జన్మస్థలి నుంచి ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్లిన కాలిబాట ఏది అన్నది ఇప్పుడు శివభక్తులలో ఆసక్తికర చర్చగా మారింది. తమిళనాడుకు చెందిన ఒక భక్తుడు ‘పెరియపురాణం’ ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం వైఎస్సార్ జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తెచ్చా రు. కన్నప్ప జన్మస్థలానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్షేత్రం అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం, దేవదాయశాఖతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం కూడా శీతకన్ను వేశాయని భక్తులు పెదవి విరుస్తున్నారు. ఉడుము కొండల మీదుగా పయనం కన్నప్ప నాడు ఊటుకూరు గ్రామానికి తూర్పు వైపున ఉన్న దట్టమైన అడవులు, వాగులు, ఉడుము కొండల మీదుగా పయనించి శ్రీకాళహాస్తి సమీపంలోని దివ్య కై లాస శిఖరారణ్యానికి చేరుకున్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాచీన అటవీ మార్గాన్ని నేటి రహదారులతో యథాతథంగా పోల్చడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, దీనిపై రాష్ట్ర దేవదాయశాఖ అధికారికంగా సర్వే చేయిస్తే నేరుగా శ్రీకాళహస్తికి ఒక అద్భుతమైన మార్గం ఏర్పడుతుందని జన్మస్థలి వాసులు కోరుతున్నారు. రేణిగుంటకు వెళ్లకుండానే.. ఈ చారిత్రక కాలిబాటను వెలుగులోకి తెచ్చి, రహదారిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే భక్తులు రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాజంపేట మండలం ఊటుకూరు నుంచే నేరుగా శ్రీకాళహస్తికి ప్రయాణం ఎంతో సుగమమవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కన్నప్ప జన్మస్థలాన్ని గుర్తించి, కాలిబాటపై సమగ్ర సర్వే జరపాలని శివభక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తకన్నప్ప జన్మస్థలి అభివృద్ధికి శ్రీకాళహస్తి దేవస్థానం పూర్తిస్థాయిలో దోహదపడాలి. కన్నప్ప ఊటుకూరు (ఊడుమూరు) నుంచి ఉడుముకొండల మీదుగా తూర్పు దిక్కుగా శ్రీకాళహస్తి ప్రాంతానికి అరణ్యంలో వేటాడుకుంటూ వెళ్లాడని ఇక్కడి చరిత్ర చెబుతోంది. దేవదాయశాఖ భక్తకన్నప్ప కాలిబాటను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి పరిధిలోకి తెస్తే మరిన్ని నిధులు వచ్చి భక్తులకు సౌకర్యాలు మెరుగవుతాయి. – నాగా ఫృథ్వీపరెడ్డి, వైఎస్సార్సీపీనేత, ఊటుకూరు, రాజంపేట అపర శివభక్తుడు భక్తకన్నప్ప కాలిబాటపై ప్రభుత్వం వెంటనే అధికారిక సర్వే నిర్వహించాలి. స్థానిక ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ శ్రీకాళహస్తి దేవస్థానంలోకి విలీనం చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం భ క్తులే చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చే స్తున్నారు. అలాగే భక్తకన్నప్ప జయంతి ఉత్సవాలను ఊటుకూరులో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. – రేవరాజు శ్రీనివాసరాజు, మాజీ ఎంపీటీసీ, ఊటుకూరు, రాజంపేట. -
● అధికార వేడుకల్లో..విమర్శల విందు
సాధారణంగా మున్సిపల్ కమిషనర్లు అంటే నగరంలో ఎక్కడ డ్రైనేజీ బాగుంది, ఎక్కడ వాటర్ పైప్లైన్ లీకవుతోంది అంటూ ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. కానీ, మన కడప మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి.భవానీప్రసాద్ గారి స్టైలే వేరు! మంగళవారం నగరంలో ఒక ఆసక్తికరమైన ‘రాజకీయ విన్యాసం’ చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ ఆర్.శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గండి వాటర్ వర్క్స్ వేదికగా తమ్ముళ్లకు గట్టిగా విందు, అన్నదానాలు అరేంజ్ చేశారు. ఇంకేముంది.. రాజకీయ వేడుక కదా అని అధికారులు దూరంగా ఉంటారనుకుంటే పొరపాటే! మున్సిపల్ బాస్ భవానీప్రసాద్ గారు స్వయంగా విచ్చేశారు. చేతికి గరిటె పట్టి, ఆకుల్లోకి వేడివేడి అన్నాన్ని వడ్డిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం చూసి అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు. ఒక నగర పాలక సంస్థకు సర్వాధికారిగా ఉంటూ, ఒక రాజకీయ పార్టీకి చెందిన పూర్తి ప్రైవేట్ కార్యక్రమంలో ఇలా భుజాలు కలుపుతూ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు కడప రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కమిషనర్ గారి వడ్డన చూస్తుంటే.. నగర సేవలో కంటే కూటమి సేవలోనే అసలైన కిక్కు ఉందన్నట్లుంది అంటూ వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! – కడప కార్పొరేషన్ -
బద్వేలు టీడీపీలో తారా స్థాయికి విభేదాలు
గోపవరం : బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రితీష్రెడ్డి, సూర్యనారాయణరెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో రోజురోజుకు వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తమకు సమాచారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు మండలంలో చేపడుతుండటంపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సూర్యనారాయణరెడ్డిపై రితీష్రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనపై జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వేణుగోపాల్రెడ్డిని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారని జెడ్పీటీసీ జయరామిరెడ్డి పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడని, ఇప్పుడు అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై తాను పూర్తిగా విబేధిస్తూ రాజీనామా కూడా చేసేందుకు సిద్ధపడినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే బీసీ యాదవ మహిళను కాబట్టే తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీపీ ధనలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇటీవల మండలంలోని ఎస్.రామాపురం, రాచాయపేట, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పార్టీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. జెడ్పీటీసీ జయరామిరెడ్డితోపాటు తాను కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి, రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఢీకొన్న బస్సు, కారుముద్దనూరు : ముద్దనూరు–కడప ప్రధాన రహదారిలో ముద్దనూరు సమీపంలోని డాబా వద్ద బళ్ళారి నుంచి కడపకు ప్రయాణిస్తున్న కర్ణాటక బస్సు, కారు ఢీకొన్నాయి. ప్రయాణికుల సమాచారం మేరకు.. కడపకు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే కొంత వరకు ఢీనడంతో కారు ముందు భాగం దెబ్బతినింది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం సంభవించలేదు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 19 మంది ప్రయాణికులు వున్నారు. పిచ్చికుక్క స్వైరవిహారంపోరుమామిళ్ల : పట్టణంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్క కాటుతో 20 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ చితానందనగర్, శ్రీరాంనగర్, రంపాడురోడ్, బెస్తవీధి ప్రాంతాల్లో కుక్కల దాడులతో చాలామంది గాయపడ్డారని, వెంటనే కుక్కలను అదుపు చేయాలని కోరారు. శ్రీరాంనగర్కు చెందిన జమీరాయాసిన్ (6), చితానందనగర్కు చెందిన రామచంద్రయ్య (65), రామకృష్ణ (45),ప్రణతి, స్టార్ స్కూల్ వద్ద ఉన్న మహబూబ్బాష(65), గురప్ప తదితరులు ఆసుపత్రుల్లో చేరారన్నారు.● తమకు సమాచారం లేకుండానే కార్యక్రమాల నిర్వహణపై ఆగ్రహం ● రాజీనామా దిశగా జెడ్పీటీసీ, ఎంపీపీ -
స్మార్ట్ కిచెన్లకు జాతీయ స్థాయి గుర్తింపు
చెన్నూరు (వల్లూరు) : వైఎస్సార్ కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ (ఆధునిక వంటశాల) ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో విశేష గుర్తింపు వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్మార్ట్ కిచెన్ పనితీరును, అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పరిశీలించేందుకు అంతర్జాతీయ సంస్థ ‘జైకా‘ జపాన్ ప్రతినిధి యామికోశాన్, హెల్త్ అండ్ న్యూట్రీషియన్ టీం లీడర్ మోహిత్ తో కూడిన బృందం మంగళవారం ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా కిచెన్ ప్రత్యేకతలు, రుచి, శుచికరమైన భోజనం అందించే తీరు, రవాణా జాగ్రత్తలను జపాన్ బృందానికి వివరించారు. అనంతరం చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన అధికారులకు విద్యార్థినులు జపాన్ భాషలోనే స్వాగతం పలకడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల పరిశుభ్రత అలవాట్లు, క్రమశిక్షణను కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నిధి మీనా విదేశీ బృందానికి వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు జపాన్ ప్రతినిధులు, కలెక్టర్, జేసీలతో కలిసి విద్యార్థులతో సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ‘జైకా’ ప్రతినిధి యామికోశాన్ విలేకరులతో మాట్లాడుతూ.. జపాన్ లోని పాఠశాలల వలె ఇక్కడ కూడా పరిస్థితులు ఎంతో బాగున్నాయని.. పిల్లల్లో పరిశుభ్రత, పౌష్టికాహార అమలు తీరు తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని ప్రశంసించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,900 పాఠశాలల్లో దాదాపు 75,000 మంది విద్యార్థులకు స్మార్ట్ కిచెన్ ద్వారా నిత్యం ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డీఈవో షంషుద్దీన్, ఆర్డీవో మురళి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, తహసిల్దార్ విజయకుమారి, ఇన్చార్జి ఎంపీడీవో వరప్రసాద్ రెడ్డి, ఎంఈఓలు జే. సునీత, ఎన్. సునీతలు, పీఆర్ ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీవో వెంకటేష్, హెచ్ఎం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవలపై శాసన మండలి కమిటీ సమీక్ష కడప అర్బన్ : కడప కలెక్టరేట్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య సేవలు, ఆసుపత్రుల అభివృద్ధిపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్, సంయుక్త సంచాలకులు గణపతిరావు హాజరయ్యారు. సమీక్షకు ముందు వారు కడప రిమ్స్ ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, క్యాన్సర్ చికిత్స కేంద్రాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం కడప సర్వజన ఆసుపత్రిలో ఎల్ఐసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన ఆధునిక రేడియాలజీ పరికరాన్ని తనిఖీ చేసి, దానిని ప్రజలకు సమర్థంగా వినియోగించాలని సూచించారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశమై ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.పెంచలయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజారాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభాస్కర్రెడ్డి, ఏఓ యు.రంగస్వామి, ఆర్ఎమ్ఓలు డాక్టర్ వై.శ్రీనివాసులు, డాక్టర్ ఎస్.ఆర్.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప జిల్లా ఆధునిక వంటశాలను సందర్శించిన ‘జైకా’ జపాన్ ప్రతినిధుల బృందం జపనీస్ భాషలో స్వాగతం పలికి, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన విద్యార్థినులు -
వ్యక్తి అదృశ్యం
చాపాడు : మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు చెన్నయ్య (56) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఈనెల 6న రాజంపేటకు వెళ్లి వస్తానని చెప్పిన చెన్నయ్య తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.మార్చురీలో గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు గుర్తు తెలియని వ్యక్తి (50)ని వైద్యం కోసం తీసుకురాగానే పరీక్షలను నిర్వహించి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆన్లైన్ మట్కా బీటర్ అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : ఆన్లైన్లో మట్కా జూదం నిర్వహిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నడింపల్లె ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్బాషా ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన వన్టౌన్ ఎస్ఐ మైనుద్ధిన్ మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.7 వేలు నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆన్లైన్లో మట్కా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ కొండారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. -
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
రాజంపేట : దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పాగంగిరెడ్డి అన్నారు. మంగళవారం ఏయూ ఓపెన్ ఆడిటోరియంలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే స్థాయి కాకుండా, భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలను ఇచ్చేలా ప్రతి విద్యార్ధి తయారు కావాలన్నారు. వ్యక్తిగత నైపుణాన్ని పెంపొందించుకోవాలన్నారు. సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే వారిగా ఎదగాలన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ తరగతి గదుల్లో పొందే జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అన్వయించడంతోపాటు, పరిశ్రమలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్థి జీవితంలో ఇంజనీరింగ్ విద్య కీలకమైన దశ అన్నారు. ఆ దశను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కలిగి వుండాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, డీన్ స్కూల్స్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ నారాయణ, డీన్స్, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగ పట్టుకొని ఆత్మహత్య
నందలూరు : మండలంలోని ఎంఎం పురం పంచాయతీ వెంకటరాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరత్నం(40) విద్యుత్ వైరు పట్టుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన మేరకు వివరాలు... పెంచలయ్య కుమారుడు వెంకటరత్నం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. కొంత కాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. భార్య కువైట్లో ఉండగా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు తనకు దూరంగా ఉండటంతో జీవితంపై విరక్తి చెంది విద్యుత్ మెయిన్ లైన్ వైరు పట్టుకోవడంతో షాక్కు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.కుటుంబానికి దూరమై.. జీవితంపై విరక్తితో.. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కిరాణా బంకు దగ్ధం
వేముల : మండలంలోని చాగలేరు ఎస్సీ కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన చాగలేటి రవి శంకర్ కిరాణా బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అక్కడ బంకు వద్దనే బోధ కొట్టం నిర్మించుకుని ఉంటున్నాడు. మంగళవారం బంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో బంకుతోపాటు అందులోని కిరాణా సరుకులు కాలి బూడిదయ్యాయి. అలాగే వ్యవసాయ పనుల కోసం బోధ కొట్టంలో నిల్వ ఉంచుకున్న వ్యవసాయ సామగ్రి కాలిపోయింది. తన పొలంలో సాగు చేసిన ఉల్లికి రసాయనిక ఎరువు కొనుగోలు చేసి బోధ కొట్టంలోనే పెట్టాడు. అగ్ని ప్రమాదం జరగడంతో రసాయనిక ఎరువులు, సాగునీరు అందించేందుకు తెచ్చుకున్న పీవీసీ పైపులు కాలిపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. మంటలను ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా మంటలు వేగంగా వ్యాపించడంతో కిరాణా బంకు, వ్యవసాయ వస్తువులు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. -
వైఎస్సార్సీపీ నేతలపై ఆది అనుచరుల దాడి
● ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు ● ఇద్దరికి తీవ్ర గాయాలు ● నిందితుల్ని అరెస్ట్ చేయకుంటే ఆందోళన తప్పదన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిజమ్మలమడుగు/ఎర్రగుంట్ల : వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల ఇందిరానగర్ పుష్పగిరి ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు డేరంగుల శ్రీనివాసులు, డేరంగుల గోపిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నాపరాయి పాలిష్ మెషిన్ నడుపుకుంటున్న శ్రీనివాసులుకు, సమీపంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసే విషయమై అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుడు గంగాధర్రెడ్డి, అతని కుమారుడు విక్రమ్ కుమార్రెడ్డితో కొన్ని నెలల క్రితం వివాదం తలెత్తింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు మంగళవారం ఇనుపరాడ్లతో శ్రీనివాసులు, గోపిల తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు అధికారం అండతో బలహీనులపై దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్సీపీకి విధేయులుగా ఉన్న వడ్డెర కులస్తులను భయభ్రాంతులకు గురిచేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో వడ్డెర కులస్తులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా.. గొడవ జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అతివేగంతోనే లారీ ప్రమాదం
చింతకొమ్మదిన్నె : కడప– రాయచోటి జాతీయ రహదారిలోని వైయస్సార్ కడప – అన్నమయ్య జిల్లాల సరిహద్దులో సోమవారం రాత్రి గువ్వలచెరువు ఘాట్లోని లోయలో పడి లారీ అగ్నికి ఆహుతి కాగా, ఆ మంటల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనం అయిన విషయం తెలిసినదే. అయితే ఈ ప్రమాదానికి లారీ అతివేగమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎన్52 కే 9788 నెంబర్ గల లారీ సోమవారం తమిళనాడులోని రాణిపేట నుండి లక్నోకు పెయింట్లలో ఉపయోగించే కెమికల్ పౌడర్తో బయలుదేరినది. సరిగ్గా వైఎస్ఆర్ కడప–అన్నమయ్య జిల్లా సరిహద్దులోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద రక్షణ గోడను ఢీకొని లోయలో పడటంతో లారీకి మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోవడంతో, అందులోని ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం అయ్యారు. మృతులు తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన డ్రైవర్ పళని కృష్ణన్ (56)కు భార్యతోపాటు పళని, నితీష్, నవీన్, పరిమళ అనే నలుగురు సంతానం ఉన్నారు. అదే విధంగా తాత్కాలిక డ్రైవర్ అయిన సుబ్రమనణి చిన్నస్వామి(40)కి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఇరువురు తమిళనాడు రాష్ట్రంలోని బాలకృష్ణ ట్రాన్స్పోర్టులో డ్రైవర్లుగా పని చేస్తూ కుటుంబాల్ని పోషిస్తున్నారు. అయితే ఇద్దరూ లారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం కూడా లారీ నుంచి మంటలు వస్తుండడంతో మరోసారి ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పి వేశారు. సంఘటనా స్థలాన్ని మంగళవారం చింతకొమ్మదిన్నె ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. లారీ డ్రైవర్లు కొందరు డీజిల్ ఆదా కోసం లారీని న్యూట్రల్లో నడపడంతో కూడా మలుపుల వద్ద బ్రేకులు ఫెయిలై వాహనాలు ఘాట్లోని లోయలో పడి మత్యువాత పడుతున్నారు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం లారీ అగ్నికి ఆహుతి కావడంతో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమైన పళని కృష్ణన్ సుబ్రహ్మణ్యం మృతదేహాలకు సంఘటనా స్థలంలోని రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం -
‘ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత’
కడప ఎడ్యుకేషన్/బద్వేలు: కూటమి రెండేళ్ల పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కరువై అడ్మిషన్ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. నాడు నేడు నిబంధనల ప్రకారం పాఠశాలల్లో 9 రకాల వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను జత చేసి విద్యాభ్యాసం చేశారు. కూట మి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కనుమరుగయ్యాయి. ఫలితంగా చేరికలు తగ్గిపోయాయి. ఇది క్రమంగా కొనసాగితే అక్షరాస్యతా శాతంపైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేరికలు తగ్గుముఖం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. గతేడాది 1వ తరగతిలో 11,978 మంది చేరితే ఈ ఏడాది 11516 మంది మాత్రమే చేరారు. ఈ ఏడాది 462 మంది విద్యార్థుల చేరిక తగ్గింది. అంటే చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రుల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఒకట్రెండు తరగతుల్లో మినహా అన్ని తరగతుల్లోనూ చేరికలు తగ్గాయి. మొత్తంపై ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2190 అడ్మిషన్లు తగ్గాయి. అడ్మిషన్ల గణాంకాలు ఇలా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా ఏటా దాదాపు 2లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చేవి. ఐదేళ్లూ ఈ సంఖ్య కాస్త అటూ..ఇటూగా సాగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏటా అడ్మిషన్ల తగ్గుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే సుమారు 3వేలు తగ్గింది.నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు నిధుల వరద నేడు సౌకర్యాలు కరువై పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య అక్షరాస్యతా శాతంపై ప్రభావం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడికి వచ్చే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఒకొక్కరికి రూ. 15 వేల చొప్పున తల్లుల ఖతాలకు నగదు జమ అయ్యేది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన విద్యాసామగ్రిని ఆనందంగా కొనుగోలు చేసు కుని నిశ్చింతంగా తమ పిల్లలకు బడికి పంపించుకునేవారు. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్నే కాపీ కొట్టి తల్లికి వందనంగా మార్చి అమలు చేస్తోంది. ఇది కూడా సరిగా అమలు చేయడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు నెలలకుగానీ డబ్బులు తల్లుల ఖతాలకు జమకావడం లేదు. అది కూడా కొందరికి రూ. 13 వేలు పడగా మరికొంత మందికి ఒకొక్కరికి 8, 9 చొప్పున మాత్రమే పడింది. దీంతో చాలా మంది మిగిలిన డబ్బుల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
భక్తులకు వసతులు కల్పించడమే లక్ష్యం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించాలనేదే లక్ష్యం అని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ ఇషాక్ బాష అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ బృందం నుంచి కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాష, సభ్యులు, కడప ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి పనులపై స్థానిక టీటీడీ సమావేశం భవనంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఇషాక్బాష మాట్లాడుతూ..2014లో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆంధ్రా భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ ఎంత ఖర్చు చేసింది, అందులో ఏఏ పనులు పూర్తి ఆయ్యాయి, కొత్తగా ఎన్ని పనులు మంజూరు అయ్యాయి అన్నదానిపై ఆలయ టీటీడీ అధికారులు, జిల్లా ప్రభుత్వ అధికారులతో ఆయన చర్చించారు. ఇప్పటి వరకు భక్తులకు అందని సౌకర్యాలలో కొన్ని అంశాలు తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని ఇషాక్ భాష, రామచంద్రారెడ్డి అన్నారు. సమావేశానికి ఇరిగేషన్శాఖకు సంబంధించి ఏఈ కిశోర్ సమావేశం ముగిసే సమాయానికి రావడంపై కమిటీ చైర్మన్ మండిపడ్డారు. అతనిపై చర్యలు తీసుకునే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాన్నారు. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ సుబ్బారెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో నరసింహముర్తి , కడప ఆర్డీవో మురళి, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ హామీలు అమలు చేయాలి కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ హామీలను అమలు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఇసాక్బీషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కమిటీ వివిధ విభాగాలను పరిశీలించింది. అనంతరం కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాలను సందర్శించింది.విద్యార్థులకు అందుతు న్న సౌకర్యాలను పరిశీలించింది. డీఈఓ షంషుద్దీన్, హెచ్ఎం నాగమణి, పీడీ వెంకటలక్ష్మి,జీజీహెచ్ సూపరింటెండెంట్ పెంచలయ్య, పాల్గొన్నారు. బ్రౌన్ కేంద్రం నిర్వహణ భేష్ కడప ఎడ్యుకేషన్: కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహణ తీరు భేష్గా ఉందని ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అస్సూరెన్స్ కమిటీ చైర్మన్ కాంట్రాక్టర్ ఇసాక్ బాషా ప్రశంసించారు. సోమవారం ఈ కేంద్రాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు ఇక్కడి తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగ ప్రతిని పరిశీలించారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రంథాలయ వార్షిక బడ్జెట్ను రూ.10 లక్షల నుండి రూ.కోటికి పెంచాలని, భవన నిర్మాణ కార్యకలాపాలకు రూ. 4.63 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై చైర్మన్ ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి స్పందిస్తూ, బ్రౌన్ గ్రంథాలయ ప్రగతికి నిధులు మంజూరయ్యేలా శాసనమండలిలో తమ వాణిని వినిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ ప్రతినిధులను వీసీ రాజశేఖర్, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ పి.పద్మ సత్కరించారు. కడప సిటీ : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న కడప అమీన్పీర్ దర్గా గురువులను సోమవారం ఏపీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ ఇషాక్బాషా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ బృందం చైర్మన్ -
2014–19 బాబు పాలనలో..
చినుకులు రాలినా ఉరిసే పైకప్పులు.. కాలం దాటిన బల్లలు.. విరిగిపోయిన కుర్చీలు.. అరిగిపోయిన చాక్పీస్ ముక్కలు.. చెట్ల కిందే పాఠాలు.. నేలమీదే చదువులు.. ఇదీ 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.. వైఎస్సార్సీపీ హయాంలో.. వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి.. నాడు – నేడు కింద పాఠశాలలకు నిధులు వెల్లువెత్తాయి. నూతన గదులు మంజూరయ్యాయి.. కొత్త బల్లలు చేరాయి.. సాంకేతికత అద్దుకుని నల్లబల్ల స్థానంలో డిజిటల్ బోర్డు ప్రత్యక్షమైంది.. మరుగుదొడ్లు బాగుపడ్డాయి.. సౌకర్యాలన్నీ మెరుగుపడ్డాయి.. ఫలితంగా పిల్లలసంఖ్య పెరిగింది.. చూస్తుండగానే సర్కారు బడి కళకళలాడింది. ప్రభుత్వ బడి కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెంది అక్షర విప్లవం సాగించింది. దీనికితోడు ‘అమ్మ ఒడి’ కొండంత అండ ఇచ్చింది. ఇంకేముంది అడ్మిషన్ల సంఖ్య రెట్టింపైంది. బడి ముందు ‘అడ్మిషన్లు ఫుల్’ బోర్డు దర్శనమిచ్చింది.. నాడు– నేడు పథకం అటకెక్కింది.. పాఠశాల ఆవరణలోని నూతన తరగతి గది నిర్మాణం ఆగింది..అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. మధ్యాహ్న భోజనంలో.. విద్యా కానుకలో నాణ్యత కొరవడింది... మరుగుదొడ్లలో నీరు కరువైంది.. అపరిశుభ్రత తిష్ట వేసింది.. అంతే.. మెలమెల్లగా పిల్లల సంఖ్య తగ్గింది.. చూస్తుండగానే డ్రాపవుట్ల సంఖ్య వేలకు పెరిగింది.. కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయం విద్యా వ్యవస్థకే శాపంగా మారింది. ఇలాగే కొనసాగితే అక్షరాస్యతా శాతంపైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. -
పేకాట ముఠా గుట్టురట్టు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో వ్యవస్థీకృతంగా పేకాట నిర్వహిస్తున్న ముఠాపై వన్టౌన్ పోలీసులు మెరుపుదాడి చేశారు. అరెస్ట్ వివరాలను సోమవారం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. గాంధీరోడ్డు సమీపంలోని గిడ్డంగివీధిలో కొంత కాలంగా పెద్ద ఎత్తున ఆర్గనైజింగ్ పేకాట నిర్వహిస్తున్నారు. పెద్దగండ్ల బాలు, అతని అనుచరులు వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులను పేకాట ఆడేందుకు పిలిపించి వారి నుంచి మేజ్ డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో నిందితులు ముందస్తు ప్రణాళికతో వ్యవస్థీకృతంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో ప్రొద్దుటూరులోని ప్రకాష్నగర్కు చెందిన పెద్దగండ్ల బాలు, షేక్ మహబూబ్షరీఫ్, కేకేస్ట్రీట్కు చెందిన సయ్యద్మహమ్మద్ గౌస్, మత్స్యకాలనీకి చెందిన పసుపల శ్రీనివాసులు, అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న మాలేపాటి వెంకటసుబ్బయ్య, మీనాపురం గ్రామానికి చెందిన చింతకుంట రామమోహన్నాయుడు, చూడూరు గ్రామానికి చెందిన మల్లెల నాగేంద్ర, చాపాడు మండలంలోని బద్రిపల్లెకు చెందిన చందా పరమేశ్వరరెడ్డి, యర్రగుంట్ల రోడ్డులోని గడ్డం కేశవలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 96,520 నగదుతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురు నిందితులపై గతంలో పేకాట కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.9 మంది అరెస్ట్, రూ. 96,520 నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం -
విద్యుత్ హై ఓల్టేజీ అలైన్మెంట్ మార్చాలి
చింతకొమ్మదిన్నె మండలంలోని రైతుల పొలాల్లో 765 కేవీ విద్యుత్ హై ఓల్టేజీ లైన్ అలైన్మెంట్ మార్చాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజుల మల్లారెడ్డి, సీకే దిన్నె బాధిత భూ యజమానులతోపాటు ఏపీ రైతు సంఘం నాయకుడు దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పచ్చని పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీకే దిన్నె మండలంలో 765 కేవీ విద్యుత్ హై ఓల్టేజ్ లైన్ అలైన్మెంట్ మార్చాలంటూ కోరుతుండగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పంట పొలాలకు ఎలాంటి నష్టం లేకుండా 765 కేవీ విద్యుత్ లైన్ వేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు చూసుకోవాలన్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ లైన్లు వేయాలని, చిన్న రైతుకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలతోపాటు పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. సోమవారం కడప మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆత్మ గోష ర్యాలీ నిర్వహించారు. వైజాగ్లో సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులతో కడప వేదికగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమ డిమాండ్లను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అధికారుల ఒత్తిడితో తనువు చాలించినా వారి కుటుంబాలకు ఉద్యోగం, పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కోవిడ్ సమయంలో తమ కుటుంబాలను వదిలి విధులు నిర్వర్తించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఏఎస్ను తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రొబెషన్ అర్హత పొందిన తొమ్మిది నెలల కాలానికి అరియర్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి రూ. 30 వేలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓఎంఎస్ నెం. 11ను వెంటనే రద్దుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడపజిల్లా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
9న ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
కడప రూరల్: ఈనెల 9వ తేదీన కడపలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో జరిగే ఈ సభకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జైళ్ల శాఖ రాయలసీమ డీఐజీగా రాజేశ్వరరావుకు పదోన్నతి కడప అర్బన్: జైళ్ల శాఖ రాయలసీమ రేంజ్ డీఐజీగా ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రాజేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్గా విధులను నిర్వహించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు సూపరింటెండెంట్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 153 ఫిర్యాదులను సమర్పించారు.ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడారు.వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూల్ రేంజ్ హాకీ జట్టుకు అభినందనలు కడప అర్బన్: రాష్ట్రస్థాయిలో ఇటీవల జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో కర్నూల్ రేంజ్ హాకీ జట్టు రెండో స్థానం సాధించింది. కర్నూల్ రేంజ్ హాకీ జట్టులో (కడప పోలీస్ టీమ్) సభ్యులను సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని డీఐజీ ఆకాంక్షించారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
జమ్మలమడుగు : మండల కేంద్రమైన మైలవరంలో ట్రాక్టర్ దుకాణంలోనికి దూసుకుపోయింది. అప్రమత్తమైన స్థానికులు పరుగులు తీశారు. ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. స్కూటర్ దెబ్బతింది. సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మైనర్ బాలుడు ఖాళీ ట్రాక్టర్ను మైలవరం పాత బస్టాండ్ నుంచి గురుకుల పాఠశాల రోడ్డువైపునకు పోతున్న సమయంలో కంట్రోల్ చేయలేక నేరుగా దుకాణంలోనికి పోనిచ్చినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాని పరిశీలించారు. ట్రాక్టర్ను బయటికి తీయించి స్టేషన్కు తరలించారు. మైనర్లు వాహనాలు నడుపడంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉన్న పాత బస్టాండ్లో సోమవారం పెద్దగా జనాలు లేకపోవడం వల్ల పెద్దప్రమాదమే తప్పింది. లేకపోతే ప్రాణ నష్టం జరిగి ఉండేదని, మైనర్లు వాహనాలు నడుపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయినవారు ఉన్నా అనాథలా మృతి! పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన చింతాకుల అశోక్ 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు. ● మైనర్ నడపటంతోనే ప్రమాదం -
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొందాం ● పనిచేసే కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలుపుదాం ● వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కడప కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి దేనికైనా సిద్ధపడే తెగువ కలిగి ఉండాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. సోమవారం ఊటుకూరులోని కడప కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోలీసులను, విచ్చలవిడిగా సంపాదించిన డబ్బును నమ్ముకుందని, మనం వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన గొప్ప అభివృద్ధి పనులను నమ్ముకున్నామని వివరించారు. త్యాగాలకు సిద్ధపడి ఏటికి ఎదురీదుతున్నామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సమిష్టిగా పనిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలని సూచించారు. కూటమి నేతలు చేయగలిగింది అక్రమ కేసులు పెట్టడమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పనిచేసే కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలబెడతామని, వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందిందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వజ్రభాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మె ల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ఆదిత్యరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు, సమావేశంలో మాట్లాడుతున్న కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కడప సిటీ : పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సహిత, ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణంలో శాంతియుత ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తోపాటు జిల్లా ఎస్పీ.షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధీమీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, ఏఎస్పీ విభూకృష్ణ, డీఆర్వో మల్లికార్జునుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో గణేశ చతుర్థి ఉత్సవాలను నిర్వహించుకుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. అందు కోసం అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ తీగలు, కేబుల్ వైర్ లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అలాగే.. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వలన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు, శాంతిభద్రతలకు, మతసామరస్యానికి ఇబ్బంది కలగకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రాంతాల, వీధుల వారీగా ఏర్పాటు చేస్తున్న ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ముందస్తుగా.. స్థానిక సి.హెచ్.ఓ. ల వద్ద అనుమతులు పొందాలన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని డీజే సౌండ్ పొల్యూషన్ లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో శాంతి భద్రతల ఏర్పాట్లపై.. పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచండి కడప సిటీ : ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతోపాటు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ‘ఎల్నినో‘ వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు, సాగు విధానాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జేసీ డాక్టర్ నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, డీసీవో వెంకట సుబ్బయ్య, డిప్యూటీ కలెక్టర్లు జాన్ ఇర్విన్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మృతి
ముద్దనూరు : మండలంలోని కొలవలి గ్రామానికి చెందిన రాజ(24)అనే యువకుడు చికిత్సపొందుతూ మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సీఐ నగేష్బాబు సమాచారం మేరకు కొలవలికి చెందిన రాజ తన మేనత్త కూతురిని ప్రేమించాడు. అయితే రాజకు అప్పటికే పెళ్లి జరిగిందనే కారణంతో వారి వివాహానికి వారు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన రాజ ఈనెల 1వతేదీన విష ద్రావణం దాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు.అనంతరం రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయించారు.చికిత్స పొందుతూ రాజ ఆదివారం మృతిచెందాడు. విద్యుదాఘాతంతో రైతు.. దువ్వూరు : మండలంలోని పెద్దబాకరాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పెద్దబాకరాపురం గ్రామానికి చెందిన ఆలమూరు నడిపి హుస్సేనయ్య (50) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవాడు. ఇతనికి 1.50 ఎకరాల సొంత పొలం ఉండగా, కౌలుకు 3 ఎకరాల పొలం తీసుకుని మొక్క జొన్న పంట సాగు చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మొక్క జొన్న పంటకు నీరు కట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటార్ వైర్లు తీసుకుని ట్రాన్స్ఫార్మర్ కొక్కీలకు తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు వైర్లు హుస్సేనయ్య కాలికి తగలడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం 7 గంటలైనా హుస్సేనయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి చూడగా విద్యుత్ వైర్ కాలికి తగిలి అప్పటికే హుస్సేనయ్య మృతి చెందాడని పోలీసులు తెలిపారు. హుస్సేనయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. బియ్యం వ్యాపారి అరెస్ట్ చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన కాటం వీర బ్రహ్మయ్య అనే అక్రమ బియ్యం వ్యాపారిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీర బ్రహ్మయ్య గతంలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండేందుకు రూ 1 లక్ష స్వీయ పూచీకత్తుతో బైండ్ ఓవర్ చేయబడ్డాడు. కానీ అతను ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు చెన్నూరు పోలీస్ స్టేషన్న్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బాండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివరణ కోరుతూ చెన్నూరు తహసీల్దారు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో పూచీ కత్తు సొమ్ము రూ 1 లక్ష మొత్తాన్ని జమ చేయాలని ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించలేదు. దీంతో కాటం వీర బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గండికోటకు కృష్ణాజలాలు నిలుపుదల కొండాపురం : గండికోట జలాశయానికి నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు– నగరి సృజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రధాన కాలువ ద్వారా వస్తున్న కృష్ణాజలాలను నిలుపుదల చేశారు. ఈ విషయాన్ని జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు సోమవారం తెలిపారు. -
అధిక ధరలను అరికట్టాలి
పేద, సామాన్య ప్రజల ఇబ్బందులను గుర్తించి అధిక ధరలను అరికట్టాలని ఆలిండియా డెమోకట్రిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐఎన్ సుబ్బమ్మ, ముంతాజ్ బేగంలు డిమాండ్ చేశారు. అధిక ధరలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐద్వాఆధ్వర్యంలో మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జులై, ఆగస్టులో ధరలు 40 నుంచి 70 శాతం వరకూ పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా కోశాధికారి బి.లక్ష్మీదేవి, నగర కమిటీ ఉపాధ్యక్షురాలు గౌసియా, షంషాద్, లతీఫ్, అనంతమ్మ, బీబీ, మోక్షమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
క్షమా గుణాన్ని అలవర్చుకోవాలి
కడప సిటీ : తప్పు చేసిన వారిని క్షమించి వారు మంచి మార్గములో నడిపించమని ప్రభువును వేడుకునేలా ప్రతి ఒక్కరూ క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ సూచించారు. కడప నగరంలోని ఆరోగ్యమాత చర్చిలో తిరునాల ఉత్సవంలో భాగంగా తొమ్మిదవరోజు ఆదివారం తేరును అలంకరించి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు. తొలుత ఫాదర్ జోసెఫ్ దివ్యబలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ తమ పట్ల తప్పు చేసిన వ్యక్తికి ప్రేమతో తన తప్పును తెలియచేసి క్షమించడంతోపాటు సన్మార్గంలో నడిచేలా ఏసు ప్రభువును వేడుకోవాలన్నారు. పరిశుద్ధ పౌలు గారు చెప్పినట్లుగా నిజమైన ప్రేమ ఉన్న చోట పగ ఉండదని, పగ ఉన్న చోట ప్రేమ ఉండదన్నారు. ఈ విషయములో మరియతల్లి మన అందరికీ మార్గదర్శకురాలన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎల్.ఆరోగ్యస్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. -
జాతర జనసంద్రం
● ముగిసిన రాజనాలబండ తిరుణాల ● ఆకట్టుకున్న ఉట్లోత్సవం ● దేవరెద్దుల సందడి కోలాటం గమ్మత్తుగా సాగుతుండగా.. చెక్కభజన కళాకారులు లయబద్ధంగా ఆడుతుండగా.. ఉత్సవమూర్తై అమ్మవారు కరుణించారు....కత్తిసాము విన్యాసాలు హోరెత్తగా.. పిల్లనగ్రోవుల గానామృతం మృదుమధురంగా వినిపించగా... బండారు పంపకం అంగరంగ వైభవంగా సాగింది.. సాంప్రదాయ మేళతాళాలకు దేవరెద్దుల అడుగు శబ్దాలు తోడై ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.. ఘనంగా సాగిన ఉట్లోత్సవానికి.. పోకమాను ఎక్కేందుకు యువత చూపిన ఉత్సాహానికి రాజనాల బండ వేదికై ంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కచోట గుమిగూడగా జాతర జనసంద్రమైంది. అన్నమయ్య జిల్లాలో సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద తిరుణాల మహోత్సవం ఆదివారం కన్నులపండువగా ముగిసింది. – చౌడేపల్లె -
పట్టాలెక్కని ప్యాసింజర్ రైళ్లు!
● అధికారులకు పట్టని ప్రయాణికుల కష్టాలు ● కోవిడ్–19 ముందు హాల్టింగ్స్కు మంగళం ● పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లురాజంపేట : కోవిడ్కు ముందు రద్దయిన రైళ్లు నేటికీ పట్టాలు ఎక్కలేదు. నడిచే పలు రైళ్లకు హాల్టింగ్ లేదు. దీంతో జిల్లా రైల్వేపరంగా ప్రసిద్ది చెందిన నందలూరు, తిరుపతి జిల్లాలోని ఓబులవారిపల్లె జంక్షన్ పరిధిలోని ప్రయాణికులు ఏళ్లతరబడి అవస్థలు పడుతున్నారు. గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో ఎర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లు ప్రాధాన్యత కలిగినవి. ఈ ప్రాంతవాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ స్టేషన్ల ద్వారా పలు రైళ్లలో రోజూ వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రైల్వేస్టేషన్లలో స్టాపింగ్లేక ఏళ్ల తరబడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నా రైల్వేబోడ్డు, రైల్వే ఉన్నతాధికారులు అసలు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నంద్యాల–రేణిగుంట, తిరుపతి–హుబ్లీ, అరక్కోణం–కడప ప్యాసింజర్ రైళ్లు తప్ప ఈ మార్గంలో మిగిలిన ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో లేకుండాపోయాయి. అందుకు కారణం కోవిడ్ –19 రైళ్ల హాల్టింగ్స్ను పునరుద్ధరించకపోవడమే. పునరుద్ధరిస్తే మేలు.. ● గతంలో ప్రయాణికుల ఆదరణ చూరగొని రైల్వేశాఖకు ఆదాయం సమకూర్చిన రైళ్లను పునరుద్ధరిస్తే అందరికీ మేలు. ముఖ్యంగా చిన్నస్టేషన్ల ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం ఇవి నడవక ప్రయాణికు ల జర్నీ ఇబ్బందిగా మారింది. అద్దె వాహనాలను ఆశ్రయించి అధిక వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ● కడప–తిరుపతి మధ్య ఒకప్పుడు రెండు ప్యాసింజర్ రైళ్లు ఉండేవి. ఇవి సామాన్య ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉండేవి. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు నిత్యం కిటకిటమంటుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లు అనుకూలంగా ఉంటాయి. అలాగే కడప–గుంతకల్(డివిజన్ కేంద్రానికి) వెళ్లే మార్గంలో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి వస్తే పల్లెస్టేషన్లలోకి వెళ్లేందుకు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుది. ● ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి రైల్లో వెళ్లాలంటే తెల్లవారుజామున స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి. ఈ మార్గంలో నడిచే చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు సమయ వేళలు తెల్లవారుజామునే ఉన్నాయి. దీంతో ప్యాసింజర్ రైళ్లను టైమింగ్స్ మార్చి నడిపిస్తే జిల్లా ప్రయాణికులకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉద్యోగులు, రైల్వేకార్మికులు, రిటైర్డ్ కార్మికులు, విద్యార్ధులు, నిరుద్యోగులు అటూ తిరుపతి, చిత్తూరు, రేణిగుంట, చైన్నె సరిహద్దు స్టేషన్ల్కు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ● సదరన్ రైల్వేలో ఉన్నప్పటి నుంచి నందలూరు రైల్వేకేంద్రానికి తమిళులు ఎక్కువగా రాకపోకలు సాగించేవారు. కొందరు అరవపల్లె అనే ప్రాంతంలో స్థిరపడ్డారు.ఈ ప్రాంతంలో రైల్వేకార్మికులు, సాఫ్ట్వేర్స్, వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. అలాగే అరక్కోణం, పుత్తూరు, పెరంబూరు తదిత రైల్వేస్టేషన్ల పరిధిలో నందలూరు కు చెందిన వారు వేలాదిమంది ఉన్నారు. ప్యాసింజర్ రైళ్లు లేక రాకపోకలకు వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు మెయిల్, టెన్మెయిల్ (రాత్రిపూట), లెవన్, ట్వువల్ ఎక్ప్రెస్ రైళ్లు నడిచేవి. కోవిడ్–19లో వీటి వేళలు మార్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. ● జిల్లాలోని కడప, నందలూరు, రైల్వేకోడూరు, కమలాపురం, బద్వేలు తదితర ప్రాంతంలో సాప్ట్వేర్స్తోపాటు బెంగళూరుకు రాకపోకలు అధికంగా ఉన్నాయి. జిల్లా నుంచి డైరక్ట్గా కడప నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు ఈ మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.రైలుప్రయాణికుల పక్షాన విన్నవించాం గుత్తి–రేణిగుంట మార్గంలో ప్రాథాన్యత కలిగిన స్టేషన్లలో ఆగని రైళ్ల గురించి ఎప్పుటికప్పుడు విన్నవిస్తున్నాం. ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటికే కొన్ని రైళ్లకు కొన్ని రైల్వేస్టేషన్ రైళ్లో ఆగేలా చర్యలు తీసుకున్నారు. కోవిడ్–19 ముందు ఏవిధంగా రైళ్ల హాల్టింగ్ ఉండేవే, వాటిని పునరుద్ధరించాలని కోరాం. ఆ ప్రయత్నమే వైఎస్సార్సీపీ ఎంపీలు కృషిచేస్తున్నారు. –తల్లెం భరత్కుమార్రెడ్డి, డీఆర్యూసీ సభ్యుడు, రైల్వేకోడూరు -
మెగా డీఎస్సీ కాదు మేనేజ్మెంట్ డీఎస్సీ
ప్రొద్దుటూరు : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రమంతా కోడై కూస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకులా అమ్ముకున్నారని ఆరోపించారు. ఎంత మంది ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, దున్నపోతు మీద వాన పడి చందంగా పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలుకు చెందిన ప్రభాకర్ గౌడ్, వైఎస్సార్ జిల్లాకు చెందిన అమ్మాయి లాంటి సాక్ష్యాధారాలు వెలుగు చూసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డీఎస్సీలో జరిగిన అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదని గతంలో పది మార్లు చెప్పడంతోపాటు ఛాలెంజ్ చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్ముకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నా నైతిక బాధ్యతతో పదవికి రాజీనామా చేయకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్ పదవీవ్యామోహంతో గబ్బిలంలా పట్టుకుని వేలాడుతున్నట్లు విమర్శించారు. ఈ అక్రమాలపై యువత జెన్జీ లాంటి ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత బయటికి వచ్చి పోరాటం చేయకపోతే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు కలలు కంటున్నారని, ఆయనే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మూడు దుడ్లకు అమ్ముతారన్నారు. ప్రజలు ఓట్లు వేయకుండానే తండ్రి ముఖ్యమంతి అయ్యారని, ఆటలు ఆడని వారిని క్రీడాకారులను చేశారని, చదువు రాని వారిని అయ్యవార్లను చేశారని విమర్శించారు. బాగా చదువుకున్న వారు నష్టపోయారని తెలిపారు. జూడో, సాఫ్ట్బాల్, లాంటి క్రీడలకు సంబంధించి ఎమ్మెల్యే కూన రవి లాంటి వారిని ప్రతినిధిగా నియమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు, దివ్యాంగుల కోటాకు సంబంధించి దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని తెలిపారు. వినికిడి లోపం ఉందని వైఎస్సార్ జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఉద్యోగం సాధించిందన్నారు. దివ్యాంగుల కోటాకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలను సృష్టించారని, వెనకబడిన తరగతుల వారికి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేశారన్నారు. ఒకే గ్రామంలో ఏడు మందికి ఉద్యోగాలు రావడం, ఒకే ఇంట్లో భార్యభర్తలు ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా శ్రీచరణి, సింధూలాంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే తప్పు లేదని క్రీడాకారులు కాని వారికి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది మెరిట్ డీఎస్సీ కాదని మేనేజ్మెంట్ డీఎస్సీ అని, మెరిట్ లిస్ట్ కాదు మనీ లిస్ట్కే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారన్నారు. డీఎస్సీ రిక్రూట్ మెంట్ సమయంలో ఉన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారని, ప్రస్తుతం అదే స్థానంలో ఉన్న వారు డీఎస్సీ రిక్రూట్మెంట్కు సంబంధించి పత్రికా ప్రకటన ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అదే స్థానంలో ఐఏఎస్ అధికారులు ఈ అక్రమాలకు తమకు సంబంధం లేదని చెబుతుంటే, బదిలీ అయిన వారు ఆ స్థానంలో లేమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని స్వయానా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసిందన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
కొత్త జెడ్పీకి సర్వం సిద్ధం!
● పీఆర్ ఈఈ ఆఫీసే జెడ్పీ కార్యాలయం ● కడప, చిత్తూరు ఉద్యోగుల సర్దుబాటుసాక్షి, మదనపల్లె : మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు నూతన జిల్లా పరిషత్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే రెండు జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిషత్ను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2022 ఏప్రిల్ 4న రాయచోటి కేంద్రంగా 30 మండలాలతో అన్నమయ్య జిల్లా ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025 డిసెంబర్ 30న మదనపల్లె జిల్లా కేంద్రంగా, 25 మండలాలతో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో ఈ జిల్లాకు జెడ్పీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాల పరిధిలోనే జిల్లా పరిషత్ పాలన సాగుతోంది. రాయచోటి వైఎస్సార్కడప, మిగిలినవి చిత్తూరు జిల్లా పరిషత్లలో కొనసాగుతున్నాయి. కాగా జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. 25 నుంచి అధికారుల పాలనలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో గడువులోపు విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఈ ఆఫీసులో జెడ్పీ కార్యాలయం ఉమ్మడి చిత్తూరు నుంచి విభజన జరిగే అన్నమయ్య జిల్లా పరిషత్ కార్యాలయాన్ని మదనపల్లె పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా పరిషత్ ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగుల సర్దుబాటు కూడా చేస్తున్నారు. ఉమ్మడి కడపలోని రాయచోటి అన్నమయ్యలోకి, ఉమ్మడి చిత్తూరులోని పీలేరు, మదనపల్లె తంబళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో చిత్తూరు జిల్లా పరిషత్, కడప జిల్లా పరిషత్ నుంచి ఉద్యోగులను అన్నమయ్య జిల్లా పరిషత్కు కేటాయించే అవకాశం ఉంది. దీనికోసం సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇక్కడ తరలించాల్సిన రికార్డుల విభజన పని చేపట్టినట్టు సమాచారం.నేడో, రేపో నియామకం అన్నమయ్య జిల్లా పరిషత్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకాన్ని ప్రభుత్వం సోమ లేదా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని జెడ్పీ వర్గాలు తెలిపాయిు. ఈ అధికారుల నియామకం అయ్యాక జెడ్పీ పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా జిల్లా పరిషత్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి చర్యలు తీసుకుంటారు. అధికారుల హోదాకు తగ్గ ఏర్పాట్లను కార్యాలయంలో చేయాల్సి ఉంది. రికార్డులను తరలించడం, వాటిని భద్రపరచడం, ఇక్కడికి నియమితులైన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం..తదితర చర్యలను ఎన్నికల నిర్వహణలోపే పూర్తి చేసేందుకు కసరత్తు చేసే అవకాశం ఉంది. -
నిలిచిపోయిన రిజర్వేషన్ సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప ఆర్టీసీ బస్టాండులో రిజర్వేషన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు కౌంటర్కు వచ్చి వెనుదిరిగి వెళుతున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ రిజర్వేషన్ సేవలు కొనసాగించిన గౌస్ కమ్యూనికేషన్ గడువు ముగిసిపోవడంతో కౌంటర్ మూసేసినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ విషయంగా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా కౌంటర్లో మాత్రం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతోందని బోర్డు పెట్టడం కొసమెరుపు. ఇప్పటికై నా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.● మూతపడ్డ కౌంటర్ ● ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు -
త్రేతేశ్వరుడికి నాగపడిగ వితరణ
రాజంపేట రూరల్ : శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామికి కడప నగరానికి చెందిన దివంగత జానపాటి పిచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.4లక్షల విలువైన నాగపడిగను అందజేశారు. ఆదివారం జానపాటి పిచ్చయ్య సతీమణి లక్షుమ్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి మండల పరిధిలోని అత్తిరాలలో కొలువైన త్రేతేశ్వరుడి సన్నిధికొచ్చి దేవస్థాన చైర్మెన్ పూల నాగమణికి దీనిని అందజేశారు. దాతలకు దేవస్థాన చైర్మన్ ప్రత్యేక పూజలు చేయించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్కడప సిటీ : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ సభాభవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో హాజరై వినతిపత్రాలు అందజేయాలని కోరారు. అలాగే గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని, పాత అర్జీలకు సంబంధించిన రశీదు ఉంటే తీసుకురావాలని సూచించారు. సేవల స్పందనకు క్యూఆర్ కోడ్కడప సిటీ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి ిపీజీఆర్ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూ ఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించామన్నారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని అధికా రులను ఆదేశించారు. అర్జీల స్థితిగతులు తెలుసుకొనేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. నేడు డయల్ యువర్ ‘సీఎండీ’ కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలోనూ ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో విద్యుత్ సమస్యలను సూపరింటెండెంట్ ఇంజినీర దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు 08562–242457, అన్నమయ్య జిల్లాకు చెందిన వారు 9440817449 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.గండి ఆదాయం రూ.91.26లక్షలుచక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగిన నాలుగు శ్రావణ శనివారోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ. 91,26,462లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయకమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. తొలి శనివారం రూ.15,51,669లు, రెండవ శనివారం రూ.19,85,127లు, మూడో శనివారం రూ.29,00,343లు, చివరి శనివారం రూ.26,89,323లు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈమొత్తం తాత్కాలిక హుండీలు, ఆర్జిత సేవాటికెట్లు, తలనీలాల టికెట్లు,అన్నదానం తాత్కాలిక షాపులు, లడ్డు పులిహోర ప్రసాదాల విక్రయం,స్పెషల్ దర్శనం తదితరాల ద్వారా వచ్చిందని వివరించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గం
కడప అగ్రికల్చర్: ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గమని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వి ప్రవీణ్కుమార్ సూచించారు. కడపలోని జిల్లా రైతు సాధికార సంస్ధ డీపీఎంయూ కార్యాలయంలో ఆదివారం రైతు మాస్టర్ ట్రైనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ పంట నమోదు ఇప్పటి వరకు 34 శాతం మాత్రమే పూర్తయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డివిజన్ల వారీగా సాగు పరిస్థితులను సమీక్షించి, ప్రాంతానుగుణంగా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో ప్రతి చుక్క వర్షపు నీటిని పొలంలోనే వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స కోసం వచ్చి వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్న్ : మదనపల్లె సర్వజన ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆదివారం ఆసుపత్రి ప్రాంగణం సమీపంలో వ్యక్తి విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటన స్థలానికి వచ్చి విచారించారు, మృతుడు మదనపల్లె మండలం, టేకులపాలెంకు చెందిన సోమశేఖర్ (40) గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడు చికిత్స కోసం వచ్చి మృతిచెందాడా? లేక అనారోగ్యంతో ఆసుపత్రి ప్రహరీ వద్దే ఉంటూ మృతి చెందాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని తమకు కేసు వద్దని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. 60 బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీలుగుర్రంకొండ: 60 బోర్ల వద్ద ఉన్న 725 మీటర్ల బోరుమోటారు కేబుల్ వైర్లను దుండగులు కత్తిరించి ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని తరిగొండ పంచాయతీలో జరిగింది. పంచాయతీ పరిధిలోని తరిగొండ, పిల్లగోవులవారిపల్లె,ఇరగన్నగారిపల్లె, రెడ్డివారిపల్లె, గ్రామాల పరిధిలో గత రాత్రి కేబుల్ వైర్లు చోరీ ముఠా సభ్యులు 48 మంది రైతులకు చెందిన పొలాల వద్ద ఉన్న బోర్లకు అమర్చిన కేబుల్ వైర్లను కత్తిరించేశారు. ఒక్కో బోరు మోటారు దగ్గర పది నుంచి 12మీటర్ల మేరకు కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే పొలాల వద్దకు బోరుమోటారు ఆన్చేయడానికి వెళ్లిన రైతులకు కేబుల్ వైర్లు కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో బోరుమోటార్లు పనిచేయక మెకానిక్ల వద్దకు పరుగులు తీశారు. మళ్లీకొత్తగా కేబుల్ వైర్లు అమర్చాలంటే ఒక బోరుకు రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా తరిగొండ గ్రామంలోని ఇందిరమ్మకాలనీ రెండు పంచాయతీ తాగునీటి బోర్లకు అమర్చిన కేబుల్ వైర్లను దుండగులు కత్తిరించి వేశారు. దీంతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది. -
డీజే మోత..గుండెకోత
రాజంపేట టౌన్: ప్రస్తుతం కొన్ని ఉత్సవాలు, జాతర్లు, తిరునాళ్ల సందర్భంగా డీజేలను ఏర్పాటు చేయడం తప్పని అయింది. డీజే ద్వారా వచ్చే మ్యూజిక్కు డ్యాన్స్ చేసే వారికి ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఆ శబ్దం కొందరికి ప్రాణసంకటంగా మారుతుంది. పలు ప్రాంతాల్లో డీజేల వద్ద నృత్యం చేస్తూ మృతి చెందిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం రాజస్థాన్లో డీజే శబ్దానికి పిట్టగోడ కూలి పలువురు మృతి చెందారు. డీజే శబ్దం వల్ల వినికిడిలోపం, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఒకవైపు వైద్యులు మీడియా, సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో రెండు వారాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేస్తారు. అయితే వీటి వల్ల మనిషికి ఎంతటి హాని కలుగుతుందన్న విషయమై ఉత్సవ కమిటీలు ఆలోచించాలని విద్యావంతులు కోరుతున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం కూడా డీజే సౌండ్పై కఠినమైన విధానం అవలంభించేలా చట్టం కూడా తీసుకురావాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు సాధారణంగా రోడ్డుపై వెళ్లే సమయంలో వాహనాల వల్ల పెద్ద శబ్దాలు వస్తేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గంటల తరబడి రోడ్లపై డీజే శబ్దాలు ఉంటే రహదారిలో వెళ్లే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. డీజే శబ్దం వల్ల హృద్రోగులకు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అలాగే వృద్ధులు, పిల్లలు, గర్భిణీ మహిళలకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వినికిడిలోపం, గుండెపోటు వంటి సమస్యలు వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. అమలు కాని మార్గదర్శకాలు శబ్దకాలుష్యంపై మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా అమలు అవుతున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ సమయంలో వీటివల్ల శబ్దం అధికంగా ఉంటుంది. బందోబస్తుగా ఉండే పోలీసు అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో చిన్న, చిన్న ఉత్సవాలకు సైతం డీజేలను ఏర్పాటు చేస్తున్నారు.మార్గదర్శకాలు ఇలా....] బహిరంగ ప్రదేశాల్లో 10 డిసేబుల్స్కు మించి శబ్దం చేయరాదు ] ప్రైవేట్ ప్రదేశాల్లో డీజేలను పెట్టకూడదు ] లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేయకూడదు ] నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం ఇతర శబ్దాలు చేయకూడదు ] సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్కు మించి శద్దం ఉండకూడదు ] హాస్పిటల్స్, విద్యా సంస్థలు, దేవాలయాలు, న్యాయ స్థానాలకు వందమీటర్ల ] లోపు డీజేలు కాని ఏ ఇతర సౌండ్ సిస్టంలను ఏర్పాటు చేయకూడదు ఉత్సవాల్లో తప్పని సరి అయిన డీజే అధిక శబ్దం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నా చర్యలు శూన్యం -
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం తగదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు హీరామియ్యా, కార్యదర్శి చిన్న మస్తాన్ అన్నారు. ఆదివారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ 2 డీఏలు, పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో లక్షకు పైగా ఉన్న ఉద్యోగులకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఇంక్రిమెంట్ల మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లతోపాటు 9నెలల అరియెర్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలన్నారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హేమసుందర్ రాజు పాల్గొన్నారు. -
రక్తదానం ద్వారా ప్రాణదాతలుగా నిలవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, సమాజంలో ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు స్వయంగా రక్తదాతలుగా ముందుకు రావడం మరింత అభినందనీయమని జేబీవీఎస్ సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ తెలిపారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన వారోత్సవాల్లో మూడోరోజు ఆదివారం నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తం అవసరమైన సమయంలో అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. ముఖ్యంగా వైద్యులు రక్తదానం చేయడం ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నికల్ సూపర్వైజర్ గోపిరెడ్డి విశ్వనాథ్రెడ్డి మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడటం వైద్యుల వృత్తి, బాధ్యత అయితే, అవసరమైన వారికి రక్తం అందించడం వారి మానవతా బాధ్యత అని తెలిపారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ విద్యార్థి ప్రముఖ సాయి ఈశ్వర్ మాట్లాడుతూ రక్తదానం విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.ఓ సభ్యులు సాయిచంద్, సాయినాథ్, మణిశంకర్, నిఖిల్, జేబీవీఎస్ సభ్యులు వీరాచారి, సూర్య, జస్వంత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్స్ మేనేజర్పై రౌడీషీటర్ దాడి
తిరుపతి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని తిరిగి వస్తున్న ట్రావెల్స్ మేనేజర్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చెర్లోపల్లి అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి ఫోన్ను నేలకేసి పగులగొట్టడంతోపాటు మెడలోని 9 గ్రాముల బంగారు చైన్ను లాక్కుని, చంపేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం మేరకు... అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, మంచిరెడ్డిపల్లికి చెందిన పి.చంద్రమోహన్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదిపట్ల కృష్ణ ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఇస్కాన్ ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని ఆదివారం తెల్లవారు జామున తిరిగి వస్తుండగా చెర్లోపల్లి సమీపంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలను ర్యాష్గా నడుపుతూ వెళ్తున్నారు. చంద్రమోహన్ హారన్ కొట్టగా వారు వాహనాలను అడ్డంగా పెట్టి అతడిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అనంతరం బాధితుడి మెడలోని బంగారం చైన్ లాక్కుని వెళ్లారు. తనపై దాడి చేసిన వారిలో ఒకరు తన పేరు అజయ్ అని, తాను రౌడీషీటర్నని, చంపేస్తానంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. తన ఫోన్ను నేలకేసి పగులగొట్టి వెళ్లారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన సమీపంలోని ఓ దుకాణం వద్ద సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో దాని ఆధారంగా కొర్లగుంట కొత్తపల్లికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ అజీమ్, తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన గోశాల రుద్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు వినయ్ అలియాస్ బబ్లూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మదనపల్లె టౌన్్ : ఆమెకు సొంత ఇల్లు లేదు.. బంధువులెవరో తెలియదు.. నిత్యం నాలుగు మెతుకుల కోసం చేయి చాచడమే జీవనాధారం. ఎవరైనా దయతలచి పెట్టిన అన్నం తింటూ.. ప్లాస్టిక్ బాటిళ్లు, పాత పేపర్లు, ఇతర గుజరీ సామగ్రిని ఏరుకుంటూ కాలం వెళ్లదీసిన ఓ నిస్సహాయ మహిళ చివరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మదనపల్లెలో కలకలం రేపింది.మదనపల్లె మండలం బసినికొండ డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. దర్గా సమీపంలోని చెట్టుకు మహిళ వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మహిళ మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై డీఎస్పీ బుచ్చిరాజు స్పందిస్తూ అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టి వాస్తవాను వెల్లడిస్తామని చెప్పారు. మృత దేహానికి కూడా పోలీసులతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఖాకీ వర్గాల్లో... లుకౌట్ కలకలం!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అమెరికాలో ఉంటున్న పెనగలపాటి అభిషేక్ నాయుడు అనే విద్యార్థికి ఏపీ పోలీసులు ఇచ్చిన లుకౌట్ నోటీసు కలకలం రేపుతోంది. ఇదే అంశంపై తనకు పోలీసులు చేసిన అన్యాయాలు రాష్ట్రపతిభవన్ను తాకాయి. కేంద్రహోంశాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేసింది. ఇప్పుడు పోలీసువర్గాల్లో హాట్టాపిక్గా మారింది.ఈ వ్యవహారం జరిగేటప్పటికి అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట మండలం ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారింది. ఖాకీపై స్వారీ చేస్తున్న ఆయనెవరు.. ఎన్ఆర్ఐ విద్యార్ధికి పోలీసు వేధింపుల వెనుక ఖాకీల స్వారీ చేస్తున్న నాయకుడు పుల్లంపేటలో కమ్మ సామాజికవర్గాని చెందిన ఓ వ్యక్తి. ఇతను తన స్నేహితుడు ఓ పోలీసు ఉన్నతాధికారి పవర్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోని పోలీసులను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని కబ్జాలు..అక్రమకేసులుపెట్టడంతోపాటు అన్నింటిని కానిం చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. ఖాకీపై స్వారీ చేస్తున్న వ్యక్తి వల్ల రాజంపేట (కడపజిల్లా), పుల్లంపేట (తిరుపతి జిల్లా)లో కూడా పోలీసులపై పెత్తనం సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇతని చేతిలో టీటీడీ అధికారంలోకి వచ్చిన అనేక మంది డీఎస్పీ, సీఐలు, ఎస్ఐ బదిలీలకు కారకుడయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన పోలీసులతో దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు పోలీసువర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రపతికి ఫిర్యాదు.. ఆగస్టు 14..2026న పోలీసులు బాధితుడు స్వయంగా భారతరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి , ప్రధానమంత్రి,కేంద్రహోంశాఖ,ఏపీముఖ్యమంత్రి, డీజీపీతో పాటు సహా పలువురికి ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 3న రాష్ట్రపతి భవన్ నుంచి ఫిర్యాదు కేంద్రహోంశాఖకు బదిలీ అయింది. స్వస్థలం రాలేక.. తిరుపతిజిల్లా పుల్లంపేట మండలానికి చెందిన అభిషేక్ అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదవి, స్వదేశానికి తిరిగిరావాలనుకున్నా ఇప్పుడు సొంత జిల్లాలో అడుగుపెట్టేందకు హక్కులేకుండా పోయింది. ఇందుకు కారణం ప్రధానంగా భారత్ వదలిన తర్వాత నమోదైన ఒక తప్పుడు ఎఫ్ఐఆర్, ఆ తర్వాత అతని పాస్పోర్టు వివరాలు అతనికి తెలియకుండానే సేకరించి జారీచేసిన లుక్అవుట్ సర్కులర్ (ఎల్వోసీ). మే 24న వేసవిసెలవులకు ఇండియాకు వచ్చిన పెనగలపాటి అభిషేక్(పుల్లంపేట మండల పీవీజీ పల్లె) ఆ సమయంలోనే గ్రామకంఠం భూమిపై వివాదం రాజుకుంది. ఆగస్టు 8న బెంగళూరు విమానాశ్రయం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లారు. అదేరోజు 9 గంటలకు అభిషేక్ దేశం విడిచి కేవలం గంటల్లోనే , పోలూరు కృష్ణమూర్తి అనే వ్యక్తి పుల్లంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామకంఠం, అంటే ప్రభుత్వభూమి తన సొంతభూమిగా చూపించారు. పోలీసులు ఆ ఫిర్యాదును 133/2024గా నమోదుచేశారు. ఏ2గా చేర్చారు. అభిషేక్ కుటుంబీకులు, అతని కుటుంబం కానీ పాస్పోర్టు వివరాలను పోలీసులకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎల్ఓసీలో తన పాస్పోర్టు నంబరుకు ఎలా వచ్చిందన్న అనుమానాలు లేవనెత్తారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే, బహిరంగంగా , చెల్లుబాటు అయ్యే వీసాపై, ఏ నోటీసు అందలేదు, ఏ సమన్లూ జారీ కాలేదు. కోర్టు ప్రకటన కూడాలేదు. అయితే పోలీసుశాఖలో పరారీలో ఉన్న నిందితునిగా అభివర్ణించి, ఆ ఆధారంగా ఎల్వోసీతెప్పించారు. పీజీఆర్ఎస్లో ఇలా.. తిరుపతి పీజీఆర్ఎస్కు సంబంధించిన అధికారి ఇచ్చిన నివేదిక (209/206)–22.07.2026న ప్రకారం వివాదస్పద భూమి సర్వే నంబర్ 885లోని గ్రామకంఠం అంటే ప్రభుత్వభూమి, ఫిర్యాదుదారుకు దానికిపై చట్టబద్ధమైన స్వాధీనం లేదని, పట్టా కూడా లేదని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రభుత్వభూమిపై ప్రైవేట్ వ్యక్తి పేరిటట్రస్పాస్ కేసు నమోదు అనుమానానికి దారితీస్తోంది. విచారణ కొనసాగుతుండగానే వివాద స్ప భూమి అంశంలో గోడ నిర్మాణానికి పోలీసులే వెన్నుదన్నుగా నిలిచారని ఆరోపణలు వెలువడ్డాయి. కారకులెవరు... అమెరికాలో ఉంటున్న అభిషేక్కు జారీ చేసిన అక్రమ లుక్అవుట్ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయని పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేంద్రహోంశాఖ విచారణకు ఆదేశిస్తే, తప్పుడు లేఖలు రాయడం, పాస్పోర్టు వివరాలు అనధికారికంగా సేకరించడం, నిష్పక్షపాతంగా వ్యవహారించడం వంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రపతి భవన్ తాకిన ఎన్ఆర్ఐ విద్యార్ధి గోడు విచారణకు కేంద్రహోంశాఖకు ఆదేశాలు అడ్డగోలుగా అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు ఐపీఎస్ అధికారి స్నేహితునిగా ఖాకీపై స్వారీ -
మద్యం మత్తులో నిప్పంటించుకున్న వ్యక్తి
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని గడ్డం వారి పల్లెలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో హజరత్ ( 55 ) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా ఉంటున్న హజరత్ ఇంట్లో నుంచి మంటలు కనిపించేసరికి చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. తాను ఆసుపత్రికి రానని హజరత్ కొంతసేపు బెట్టు చేశాడు. రాత్రి 9.40 ప్రాంతంలో ఇరుగుపొరుగువారు అతన్ని అంబులెన్స్ ఎక్కించగా చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి
కడప అగ్రికల్చర్: రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా వ్యవసాయం రంగం కుదేలైందని, రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక కరువు సహాయ ప్రాకేజీని ప్రకటించి రైతులను అదుకోవాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ చాంబర్లో వైస్ చైర్మన్ పిట్టు బాలయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ మాధవ్రెడ్డి, చెన్నూరు ఎంపీపీ సురేష్యాదవ్లతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ రైతును ఆదుకుంటేనే వ్యవసాయం నిలుస్తుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందన్నారు. రైతులకు పెట్టుబడి బాగా పెరిగిందని రాబడి మాత్రం పడిపోయి ఆర్థికంగా వెనకబడిపోతున్నారన్నారు. వ్యవసాయ ఎమర్జెనీ ప్రకటించి ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రతి ఎకరాకు తగిన కరువు పరిహారం చెల్లించాలన్నారు. పంటలబీమా, ఇన్పుట్ సబ్సిడి, సున్నా వడ్డి బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర్ర సంవత్సరం అవుతున్నా రైతులకు పథకాలు మాత్రం రావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే 1866లో వచ్చిన డొక్కల కరువు గుర్తుకు వస్తుందని అన్నారు. -
కుక్కల దాడి: బాలుడికి తీవ్ర గాయాలు
జమ్మలమడుగు రూరల్: అంబవరం గ్రామంలో మూడేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది.ఈ ఘటన ఆదివారం జరిగింది. బాలుడి తండ్రి కథనం మేరకు సాయంత్రం ఆడుకునేందుకు బాలుడు ఇంటి బయటకు వచ్చాడు. అదే సమయంలో అటు నుంచి వెళతున్న కుక్కులు దాడి చేసి నోరు, నుదురు, కణత, కాళ్లు చేతులపై కరిచాయి.స్థానికులు కుక్కలను తరమి కొట్టారని ఆయన తెలిపారు.కుక్కుల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య సంబేపల్లె : మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన తముకు రమేశ్ (38) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు ఆదివారం సాయంత్రం ఓ పైనాన్స్ కంపెనీ వారు రమేశ్ ఇంటి వద్దకు వచ్చి పిలవగా పలకలేదు. దీంతో చుట్టుపక్కన ఉన్న వారికి, బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు తలుపులు పగలకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వారం రోజుల కింద అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఒంటరితనాన్ని భరించలేక మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగం● ఎఫ్పీఓ సీసీకి డీఆర్డీఏ పీడీ నోటీసులు గాలివీడు: మండలంలోని అగ్రికల్చర్ ఎఫ్పీఓ కలెక్షన్ సెంటర్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నిధుల వినియోగంలో రూ.5,19,376 మేర అదనపు ఖర్చు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సంబంధిత ఎఫ్పీఓ ఖాతాల్లోకి తక్షణమే తిరిగి జమ చేయాలని అగ్రికల్చర్ ఎఫ్పీఓ సీసీ బాలకృష్ణకు డీఆర్డీఏ పీడీ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతంలో గాలివీడు వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా విధులు నిర్వహించిన వ్యక్తి హయాంలో ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీఓ) కార్యకలాపాలకు సంబంధించిన నిధుల వినియోగం, కలెక్షన్ సెంటర్ల ఏర్పాటులో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ఏపీఎం దేవసేన జిల్లా కలెక్టర్, సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఏపీఎం ఆధ్వర్యంలో ఎఫ్పీఓ అగ్రిగేటర్ నుంచి కలెక్షన్ సెంటర్ నిర్మాణం కోసం రూ.6,13,527, లైవ్స్టాక్ ఎఫ్పీఓ నుంచి రూ.5,44,850 డ్రా చేసి ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా కలెక్షన్ సెంటర్ల నిర్వహణ, వివిధ సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.3,21,526, రూ.1,97,850 చొప్పున మొత్తం రూ.5,19,376 అదనంగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వివరణలు పరిశీలించిన అనంతరం నిధుల వినియోగంపై బాధ్యుల నుంచి వివరణ కోరుతూ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా ఖర్చు చేసిన రూ.5,19,376 మొత్తాన్ని సంబంధిత ఎఫ్పీఓ ఖాతాల్లోకి తిరిగి జమ చేయాలని డీఆర్డీఏ పీడీ నోటీసుల్లో ఆదేశించినట్లు సమాచారం. ఎఫ్పీఓలకు కేటాయించిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
సేవకు సత్కారం
హెచ్ఎంలుస్కూలు అసిస్టెంట్లుఎస్జీటీలుహేమాదేవి, అహోబిలాపురం లత, వేంపల్లె విజయభాస్కర్, పోరుమామిళ్ల పుల్లయ్య, ఊటుకూరుసునీల, కల్లూరు రామచంద్ర, బి.కోడూరు వెంకట ప్రసాద్, ఎర్రగుంట్ల రామ్మోహన్, వీరబల్లిరాజశేఖర్, మన్నూరు బాలశేఖర్, ఊటుకూరు దేశ్ముఖ్ సైరాఖాన్, ఆర్కేనగర్, కడప బాలకృష్ణ, అప్పనపల్లెసరోజ, వేంపల్లె వరలక్ష్మి, పులివెందుల శివప్రసాద్రావు, చెన్నకేశంపల్లె రోహిణి, శాంతినగర్, కడపగురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 60 మందికి జేసీ నిధిమీనా ఉత్తమ పురస్కారాలను ప్రదానం చేశారు. -
గురువుల చేతుల్లోనే భావిభారతం!
● జాయింట్ కలెక్టర్ నిధిమీనా ● అత్యుత్తమ సేవలందించిన 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానంకడప ఎడ్యుకేషన్ : విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జేసీ నిధీమీనా పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహాన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం కడప కలెక్టరేట్ సభాభవన్లో డీఈఓ షేక్ షంషుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ చదువుకున్న ప్రతి ఒక్కరూ తమకు విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. మార్గదర్శకులైన గురువులకు ఈ సమాజంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. డీఆర్వో మల్లికార్జునుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుతోపాటు వారి నడవడికను గమనించాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాశ్, జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికత కేవలం సమాచారాన్ని ఇస్తుందని.. విద్యార్థి ఓటమి సమయంలో ధైర్యం చెప్పి, ‘నేనున్నాను’ అంటూ ముందుకు నడిపించేది గురువు మాత్రమే అని అన్నారు. సమగ్రశిక్ష జిల్లా కో–ఆర్డినేటర్ అనురాధ మాట్లాడారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ సేవలు అందించిన 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయడంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారులు రాజగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నాగరాజు, డీఎస్ఓ బాలాజీ, మాజీ డీఎస్ఓలు రెహమాన్, నిత్యానందరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
సరికొత్త ట్రాక్!
సీమ అభివృద్ధికిరాజంపేట : రాయలసీమ రవాణా రంగాన్ని సరికొత్త ప్రగతి పథంలో నడిపేందుకు ఉద్దేశించిన ముద్దనూరు–ముదిగుబ్బ–పుట్టపర్తి కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అధికారులు తుది రూపకల్పన చేసి రైల్వేబోర్డుకు సమర్పించారు. రూ.2,505 కోట్లతో చేపట్టనున్న ఈ నూతన రైల్వేలైన్ ఫైళ్లలో కదలిక ప్రారంభం కావడంతో, దశాబ్దాలుగా రైలు కూత కోసం వేచిచూస్తున్న పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. బెంగళూరు మెయిన్ లైన్తో అనుసంధానం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కడప–బెంగళూరు రైలు మార్గానికి ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య ఉన్న 60 కిలోమీటర్ల దూరాన్ని ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి వరకు పొడిగించడం ద్వారా ఈ నూతన మార్గానికి రూపకల్పన చేశారు. ఈ ప్రతిపాదిత లైన్ ముద్దనూరు నుంచి ప్రారంభమై పులివెందుల మీదుగా సాగి, ధర్మవరం–ముదిగుబ్బ–పాకాల రైల్వేలైన్ను దాటుకుంటూ ముదిగుబ్బ వద్ద అనుసంధానం కానుంది. అక్కడ నుంచి పుట్టపర్తి మీదుగా సాగి, ధర్మవరం–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం–పెనుకొండ బెంగళూరు మెయిన్ లైన్లో శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం సమీపంలో కలుస్తుంది. బెంగళూరు వెళ్లేందుకు జిల్లా వాసులకు ఇది తక్కువ దూరం, త్వరితగతిన గమ్యానికి చేరుకునేందుకు వీలుంటుందని రైల్వే నిపుణులు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు 5వ మార్గం.. ఇవే కొత్త రైల్వే స్టేషన్లు ఉమ్మడి జిల్లాలలో ప్రస్తుతం ముంబై–రేణిగుంట మెయిన్లైన్, కృష్ణపట్నం–ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గాలు అందుబాటులో ఉండగా, కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా ఐదో మార్గంగా కొత్త లైన్ అందుబాటులోకి రానుంది. మొత్తం 105.31 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ కొత్త రైలుమార్గ నిర్మాణంలో భాగంగా చిన్న దుద్యాల, మల్లెల, మడూరు, పులివెందుల, అంబకపల్లె, దొరిగల్లు, గునిపల్లె, బుచ్చయ్యగారిపల్లె స్టేషన్ల మీదుగా రైళ్లు నడవనున్నాయి. ఇప్పటికే ముదిగుబ్బ స్టేషన్ ఉనికిలో ఉండగా, మిగిలిన 8 చోట్ల కొత్తగా అత్యాధునిక రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డిల కఠోర శ్రమ పులివెందులకు రైలుకూత వినిపించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చేసిన గట్టి ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి బడ్జెట్లో సర్వే నిధులు మంజూరు చేయించిన వీరి కృషి ఫలితంగానే నేడు సమగ్ర నివేదిక సిద్ధమైంది. ఈ రైలుమార్గం గనుక పూర్తయితే ప్రాంతీయ ఆర్థిక, సామాజిక వృద్ధి పెరగడంతో పాటు కార్మికులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి సుదూర ప్రయాణాలు ఎంతో చౌకగా మరియు సులభంగా మారనున్నాయి. రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు–ముదిగుబ్బ–పుట్టపర్తి కొత్త రైల్వేలైన్ డీపీఆర్ సిద్ధం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అవినాష్రెడ్డిల కృషితో సాకారం కానున్న పులివెందుల రైలు కల శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం సమీపంలో బెంగళూరు మెయిన్ లైన్తో అనుసంధానం -
భగవద్గీత పోటీల విజేతలకు బహుమతులు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ, తాత్పర్య సహిత పోటీల విజేతలకు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావు, ఆయన సతీమణి లక్ష్మీలత దంపతుల కుటుంబం నగదు బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా దాతలతో పాటు కుటుంబ సభ్యు లు హేమలత మహాలక్ష్మి, నాగరమ్యలను ఇస్కాన్ మందిర అధ్యక్షుడు మధురేశ్ ప్రభూజీ ఘనంగా సత్కరించారు. కాశినాయన సమాధి సందర్శనకాశినాయన : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతి క్షేత్రంలో కాశినాయన సమాధిని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, జిల్లా ఫారెస్ట్ అధికారి రాజశేఖర్బాబు, సబ్ డీఎఫ్ఓ సంకేత్ సునీత్ ఖర్గ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాశినాయన గుడి నిర్మాణం తొందరపడి చేపట్టరాదని, అటవీశాఖ అనుమతుల కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు గుడి నిర్మాణ అనుమతులపై విన్నవించగా.. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. రేపటి నుంచి శిక్షణకడప ఎడ్యుకేషన్ : కడప పట్టణంలోని శంకరాపురంలో ఉన్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈ నెల 7 నుంచి వారం రోజుల పాటు బేసిక్ ఆర్.ఎస్.ఎల్(రోవర్ స్కౌట్ లీడర్) బేసిక్ స్కౌట్ మాస్టర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్ బా షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చీఫ్ కమిషనర్ షేక్ శంషుద్దీన్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి పీఎం శ్రీ పాఠశాలల ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కోరారు. -
కారు, బైక్ ఢీ: విద్యార్థి సంఘం నాయకుడు దుర్మరణం
జమ్మలమడుగు రూరల్: రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొన్న సంఘటనలో విద్యార్థి సంఘం నాయకుడు కె.సి. పాములేటి (29) శనివారం రాత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడు మోహన్ తీవ్ర గాయాలపాలైన సంఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకోంది. స్థానికుల కథనం మేరకు... పెద్దముడియం మండలం దిగువ కల్వటాల గ్రామానికి చెందిన కె.సి. పాములేటి వైఎసా్స్ర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రతి రోజు జమ్మలమడుగుకు వచ్చి పనులు చూసుకోని తిరిగి స్వగ్రామానికి వెళ్లేవాడు. శనివారం రాత్రి 8–30 గంటల సమయంలో దిగువ కల్వటాల గ్రామానికి చెందిన మోహన్ తో కలసి బైక్లో వెళుతుండగా ఎస్.ఉప్పలపాడు గ్రామ సమీపాన ఉన్న రైల్వె బ్రిడ్జి సమీపంలో వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఈ సంఘటనలో పాములేటి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మోహన్ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు.రోడ్డుప్రమాదంలో పాములేటి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రేమించిన యువతి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందని..మైదుకూరు : తాను ప్రేమించిన యువతి వేరొకరిని చేసుకోబోతోందనే బాధతో మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన జీవన్ కుమార్ (20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తల్లి గారెళ్ల సావిత్రి శనివారం మైదుకూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సావిత్రి కుమారుడు జీవన్ కుమార్ పదో తగరతి వరకు చదివి జీవనం కోసం ఆటో తోలుకుంటున్నాడు. కొన్నాళ్ల కిందట ఇన్స్ట్రాగామ్లో ఖాజీపేట మండలానికి చెందిన యువతి పరిచయమైంది. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తల్లితో చెప్పేవాడు. కొన్ని రోజుల కిందట ఆ అమ్మాయి తాను వేరొకరిని వివాహం చేసుకుంటున్నట్టు చెప్పిందని, తాను ఈవిషయాన్ని భరించలేకున్నానని, బతకాలని లేదని, చనిపోతానని జీవన్ కుమార్ తల్లికి చెబుతుండేవాడు. గత నెల 28న ఆ యువకుడు పురుగుల మందు తాగాడు. తల్లి సావిత్రి, బంధువులు చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో చేర్పించి కోలుకోకపోవడతో 30న కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా కోలుకోలేక జీవన్ కుమార్ శుక్రవారం మృతి చెందాడు. సావిత్రి శనివారం మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తాళ్లపాక చెరువులో చేపల మృత్యువాతరాజంపేట: తాళ్లపాక చెరువులో చేపలు మృత్యువాతకు గురి అయ్యాయి. ప్రధానంగా తాళ్లపాక చెరువులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో చేపల ఒడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం వాతావరణం వేసవిని తలపించేవిధంగా ఉండటంతో చెరువులో నీటి మట్టం ఆవిరైపోతోంది. ఈ నేపథ్యంలో చేపలు మృత్యువాత పడటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంజనీసుత..అభయప్రదాత
● గండిక్షేత్రంలో ముగిసిన శ్రావణమాస ఉత్సవాలు చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ మాసం చివరి శనివారోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని పరవశించి పోయారు. వాహనాలను పోలీసులు అద్దాలమర్రి, ఇడుపుల పాయ క్రాస్ల వద్దనే నిలిపి వేశారు.దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకున్నారు. కొందరు భక్తులు వేంపల్లె చక్రాయపేట,నాగలగుట్టపల్లె,వేముల తదితర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.భక్తుల కోసం గండి శ్రీవాసవీ నిత్యాన్నదాన సత్రం,గండి భజనమండలి తరపున నందారపు చెన్నకృష్ణారెడ్డితో పాటు పలు చోట్ల దాతలు అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ చైర్మన్ వెంకటస్వామి పాలకమండలి సభ్యులుతో పాటు పులివెందుల డీఎస్పీ మురళి ఆర్కేవ్యాలీ సీఐ శంకర్రెడ్డి,ఆర్కేవ్యాలీ ఎస్ఐ శ్రీప్రియ ఆధ్వర్యంలో సీఐలు ఎస్సైలు,పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిని సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప జేశాయి, ఆలయ ప్రధాన,ఉప ప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామి, వేదపారాయణం రామ మోహన శర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పూజలు జరిపారు.భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంజన్న సన్నిధిలో శనివారం భక్తులు అధికంగా రావడంతో లడ్డూ ప్రసాదాలు తక్కువ వచ్చాయి.దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే ఆలయ అధికారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయించి భక్తులకు అందేలా చర్యలు చేపట్టారు. వైభవంగా స్వామి వారి క్షేత్రోత్సవం ఆస్థానం శ్రావణ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి క్షేత్రోత్సవం,ఆస్థానం కార్యక్రమాలను నిర్వహించారు,ప్రత్యేక పల్లకిలో ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.అనంతరం పాపాఘ్ని నదిలో ఆస్థానం నిర్వహించి ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలను ముగించారు. -
ఉద్యోగులను మోసగిస్తున్న కూటమి సర్కార్
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి కడప వైఎస్ఆర్ సర్కిల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉద్యోగులను మోసగిస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీఅమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చర్చలకు పిలిస్తే ఏదో చేస్తారని ఆశపడి వెళ్లారని, చివరికి రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్ లీవులు ఇచ్చి నిరాశే మిగిల్చారన్నారు. ] ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు డీఏలు పెండింగ్ ఉంటే రెండు ఇస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఉద్యోగసంఘ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్ ఎక్కడని, సీపీఎస్ విషయంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు పెండింగు బకాయిలు ఉంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో లేదో సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలోనే ఉద్యోగులకు భరోసా గత ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి గత ప్రభుత్వం జీతాలు పెంచిందని, కరోనా ఇబ్బంది వల్ల 23 శాతం ఫిట్మెంటు ఇస్తే రివర్స్ పీఆర్సీ అని చంద్రబాబు అంటున్నారన్నారు. మీకు చేతనైతే ఆ రివర్స్ పీఆర్సీ అయినా ఇవ్వండన్నారు. రెండున్నరేళ్లుగా ఐఆర్ లేకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదని, ఈ రోజు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, పింఛను స్కీమ్ కూడా లేదన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన చేయడం మొదలు పెడితే ఇక ప్రభుత్వం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై ఆగ్రహం కరోనా సమయంలో కేంద్రం డీఏలను ఫ్రీజ్ చేస్తే.. అది అయిపోగానే గత ప్రభుత్వం ఒక్కసారి ఐదు డీఏలు ఇచ్చిందన్నారు. ఇక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంపు తప్ప జీతాల పెంపు, ప్రమోషన్లు లేవన్నారు. వందలాది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉన్న టీచర్లను టెట్ రాయాలంటారు కానీ..వాళ్లు మాత్రం టెట్ లేకుండానే ఉద్యోగాలిస్తారని ఎద్దేవా చేశారు. టెట్ గురించి కేంద్ర మంత్రిని కలిస్తే వారిపై అబద్ధపు ప్రచారం చేసి సస్పెండ్ చేశారని, ఎంపికై న ఉద్యోగులతో ర్యాలీలు చేయిస్తూ తమ రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ చేయదని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వరదారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎస్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
5 సెల్ ఫోన్లు స్వాధీనం
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిధిలో రాయలసీమ రైలులో చోరి చేసిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ. 50 వేలు విలువచేసే ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల రైల్వే సీఐ సుధాకర్ రెడ్డి శనివారం తెలియజేశారు. పురస్కారం అందజేతరాజంపేట: అన్నమాచార్య యూనివర్సిటీలో శనివారం ఉపాధ్యాయదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా సర్వేపల్లె రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏయూ ఛాన్సలర్ డాక్టర్ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లె రాధాకృష్ణన్ విద్యారంగానికి అపూర్వమైన సేవలందించారన్నారు.విద్యార్ధులలో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిచారన్నారు. ఎయూలోని 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులకు పురస్కారాలను చొప్పాగంగిరెడ్డి అందచేశారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబరెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పాఎల్లారెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీన్లు, హెచ్వోడీలు, అధ్యాపకులు, భోదనసిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి కడప అర్బన్: కడప పరిధిలో ఎకై ్సజ్, చింతకొమ్మదిన్నె, చెన్నూరు, మహిళా పోలీస్ స్టేషన్లలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని కడపలోని మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి విజయలక్ష్మి అన్నారు. ఈనెల 12న జాతీయ జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టు పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ రాజీ కాదగిన సివిల్ క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ రాజీ విషయాలలో ఏదైనా తమ వంతు సహాయం కావాలంటే చేస్తామన్నారు. -
పంతుల పవన్కుమార్ సేవలు చిరస్మరణీయం
కడప సిటీ : సీనియర్ జర్నలిస్టు పంతుల పవన్ కుమార్ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం కడపలోని ’సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం’లో పంతుల పవన్ కుమార్ సంతాప సభ నిర్వహించారు. తొలుత పవన్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ కుమార్ కేవలం ఒక విలేకరి మాత్రమే కాదని, తెలుగు భాషా వికాసానికి, రాయలసీమ సాంస్కృతిక వారసత్వ రక్షణకు పోరాడిన యోధుడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం, మన భాష, చరిత్ర, సంస్కృతుల పరిరక్షణకు మనమందరం పునరంకితం కావడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కే.చిన్నపరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని చారిత్రక ఆధారాలు, కట్టడాల పరిరక్షణలో పవన్ కుమార్ కృషి మరవలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సాక్షి బ్యూరో ఇన్చార్జి బాలకృష్ణారెడ్డి, వైవీయూ తెలుగు ఆచార్యులు డాక్టర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పవన్ కుమార్ వార్తా రచనల్లో సమాజ శ్రేయస్సు, సాంస్కృతిక పరిమళాలు స్పష్టంగా కనిపిస్తాయని, భావితరాలకు ఆయన జీవితం మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ కో–కన్వీనర్ పీవీ సుబ్బారెడ్డి, హౌసింగ్ బోర్డ్ కోదండరామాలయం ధర్మకర్త వెంకటరెడ్డి, పలువురు పత్రికా విలేకరులు, సాహితీప్రియులు, కవులు, సాంస్కృతిక వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్కుమార్ సేవలను స్మరించుకున్నారు. -
అగ్నిప్రమాదం: రూ.5 లక్షల ఆస్తి నష్టం
కడప అర్బన్: కడప జయనగర్ కాలనీలోని ఓ ఇంటిలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. అనిషా అపార్ట్మెంట్ పక్కన ఉన్న కింద ఇంటిలో ఉదయం 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఇంటిలోని సామగ్రికి వ్యాపించాయి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కడప అగ్నిమాపక కేంద్రం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లో నివసిస్తున్న వినుకొండ వెంకటసుబ్బయ్యకు చెందిన రిఫ్రిజిరేటర్, టీవీ, మూడు బీరువాలు, మూడు పడకలు, ఎల్ఐసీ పత్రాలు, విద్యా ధ్రువపత్రాలు, నగదు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఇంటి యజమాని మోపురి శ్రీకాంత్రెడ్డి తెలిపిన మేరకు విద్యుత్ వైరింగ్, కిటికీలు, పెయింటింగ్, తలుపులు తదితరాలు దెబ్బతిన్నాయి. వీటి వల్ల సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. -
మొబైల్ దొంగల ఆటకట్టు
● 531 ఫోన్లు సీజ్.. బాధితులకు అప్పగింత. కడప అర్బన్: పోయిన, దొంగిలించిన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు మరో ఘనత సాధించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఆపరేషనన్ మొబీ ట్రాక్’లో కేవలం 60 రోజుల్లోనే 531 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. వీటి అంచనా విలువ రూ.1.06 కోట్లు. రికవరీ చేసిన ఫోన్లను సంబంధిత బాధితులకు తిరిగి అప్పగించారు. 2026 జూలై 8 నుంచి సెప్టెంబరు 4 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషనన్లో ఈ ఫలితాన్ని సాధించినట్లు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. తాజా రికవరీతో కలిపి ‘ఆపరేషనన్ మొబీ ట్రాక్’లో ఇప్పటివరకు 10 దశల్లో 7,018 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం అంచనా విలువ రూ.13.73 కోట్లుగా ఉందన్నారు.శనివారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలోని ‘పెన్నార్’పోలీస్ కాన్ఫరెన్స్’హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ] పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్, ఐఎంఈఐ ఆధారిత విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్స్, నెట్వర్క్ ట్రాకింగ్, డేటా అనాలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. వివిధ నెట్వర్క్లలో మొబైల్ పరికరాల కదలికలను విశ్లేషిస్తూ వాటి ఆచూకీని గుర్తించి రికవరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిబ్బందికి ప్రశంసా పత్రాలు మొబైల్ ఫోన్ల రికవరీలో డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇనన్స్పెక్టర్ ఎ. మధు మల్లేశ్వర రెడ్డిని ఎస్పీ అభినందించారు. రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సీఎస్కే ప్రసాద్ వర్మ (ఏఎస్ఐ), సలవాడి మారుతిరావు (ఏఎస్ఐ), బి. గంగాధర్ (హెచ్సీ), కె.బి.వి. కృష్ణారెడ్డి (పీసీ), సి. సురేష్ (పీసీ), ఎన్. చంద్రనారాయణ రెడ్డి పీసీ)లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజల ఆస్తి, డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్తో అనుసంధానం చేసి మరిన్ని మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ వివరించారు. తాము పోగొట్టుకున్న మొబైల్ఫోన్లను రికవరీ చేయించిన జిల్లా ఎస్పీకి బాధితులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్ పాల్గొన్నారు. ఫిర్యాదు చేసిన గంటలోనే ఫోన్ రికవరీ జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పట్టణంలోని బ్యాంక్ కాలనీకి చెందిన రిటైర్డ్ అగ్నిమాపకశాఖ అధికారి నార్ల సత్యంరెడ్డి వద్ద నుంచి శనివారం ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసుకోని ఇస్తానని నమ్మబలికి మొబైల్తో పరారయ్యాడు. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీస్లు స్పందించి సాంకేతిక పరిజ్ఞానంతో లోకేషన్ గుర్తించి మొబైల్ స్వాధీనం చేసుకున్నాడు. బాధితుడి అప్పగించినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
కడప సిటీ : క్రీస్తు ప్రభువు సర్వమానవాళికి ఆదర్శనీయులని, ఆయన మార్గం అనుసరణీయమని రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తెలిపారు. కడప ఆరోగ్యమాత చర్చిలో నిర్వహిస్తున్న తిరునాల ఉత్సవంలో భాగంగా ఎనిమిదో తేరును అలంకరించి ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. తొలుత రెవరెండ్ ఫాదర్ అశోక్ దివ్యబలి పూజ చేపట్టారు. ఈ సందర్బంగా ఫాదర్జోసెఫ్ తన సందేశంలో మనందరి పాపాలను అవమానాలను క్రీస్తు ప్రభువు భరిస్తాన్నారన్నారు. క్రీస్తు ప్రభువు సమస్యలను ప్రేమతో ఎదుర్కొన్నారని, శ్రతువులను సైతం ప్రేమించాలని, వారి కోసం ప్రార్థించాలని, ఇతరుల తప్పులను హృదయ పూర్వకంగా క్షమించాలని తెలియజేశారన్నారు. చివరగా మరియతల్లి గొప్పతనం, ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుణ్య క్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎల్.ఆరోగ్యస్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని బాలుడి దుర్మరణం
కాశినాయన : మండలంలోని ఇటుకలపాడు గ్రామానికి చెందిన కొప్పోలు సురేంద్రారెడ్డి (14) కారు ఢీకొని దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటుకలపాడు గ్రామానికి చెందిన కొప్పోలు శ్రీనివాసులరెడ్డి, లత దంపతుల రెండో కుమారుడు సురేంద్రారెడ్డి శుక్రవారం వాళ్ల పెద్దనాన్న బైక్ పంఛర్ కావడంతో తోచుకుంటూ తీసుకెళుతున్నాడు. పోరుమామిళ్ల నుంచి మైదుకూరుకు వెళ్లే కారు.. వెనుక నుంచి బైక్ను ఢీకొనడంతో సురేంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సురేంద్రారెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. కారు డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోరుమామిళ్ల సీఐ హేమసుందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాశినాయన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గండి క్షేత్రం.. శ్రావణ వైభవం
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో నేడు శ్రావణ మాసం చివరి శనివారోత్సవం జరుగనుంది. చివరి శనివారం కావడంతో గత వారం కంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ వర్గాలతోపాటు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు తెలిపారు. అందుకు అనుగుణంగా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేసినట్లు వారు చెప్పారు. క్యూలైన్ల వద్ద తాగునీటి వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆలయ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాతలచే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కడప రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకుడు ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రసాద్ తెలిపారు. క్షేత్రోత్సవం నిర్వహణపై ట్రయల్ రన్ అశేష భక్త జనం మధ్య నిర్వహించే క్షేత్రోత్సవానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వ హించారు. ఆంజనేయస్వామి వాహనం అయిన ఒంటైపె స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి భక్తులు ఎలా పల్లకీని మోయాలి అనే అంశంపై ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కొండకమర్లకు చెదిన అర్జున్ అనే భక్తుడు రూ.4 లక్షల విలువ గల స్వామి వారి తిరుచ్చి(పల్లకీ), తండ్లు(మోతకర్రలు) సమర్పించారు. ఆస్థానంతో ఉత్సవాల ముగింపు శ్రావణమాసం చివరి శనివారం రాత్రి జరిగే క్షేత్రోత్సవం, ఆస్థానంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా వెళ్లి పాపాఘ్ని నదిలో వేద పండితులచే ఆస్థానం నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం, మహాతిరుమంజనం, అలంకారం, విశేష నైవేద్యాలు, మహామంగళ హారతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని వివరించారు. కట్టుదిట్టంగా భద్రత భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆర్కేవ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్సై శ్రీప్రియ తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలు ఉన్నందున సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు, మహిళా పోలీసులు, హోంగార్డులతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. వాహనాలను గండిలోకి అనుమతించబోమని చెప్పారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని వారు కోరారు. వృద్ధులు, మహిళల కోసం అద్దాలమర్రి క్రాస్ ఇడుపుల పాయ క్రాస్ వద్ద నుంచి గండిలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఉచితంగా తిప్పిస్తున్నట్లు వారు వివరించారు.జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి ఆంజనేయస్వామి ఆలయంలో.. శ్రావణ మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రకృతి రమణీయత నడుమ, పాపాగ్ని నది తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనార్థం ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా నలుమూలల నుంచే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు చివరి శనివారోత్సవం భారీగా తరలిరానున్న భక్తులు -
వైఎస్సార్సీపీ పోరాట ఫలితం.. రైలు బండి కల సాకారం
పులివెందుల రూరల్ : వైఎస్సార్సీపీ పోరాట ఫలితంతో రైలు బండి కల సాకారం కానుందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ప్రత్యేక చొరవతో పులివెందుల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షుడు రసూల్, మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధర్ రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముద్దనూరు – పులివెందుల మీదుగా ముదిగుబ్బ, పుట్టపర్తి రైల్వేలైన్కు సంబంధించి తాజాగా అధికారులు రూ.2.505 కోట్ల అంచనా వ్యయంతో 105.31 కిలోమీటర్ల సామాగ్రి ప్రాజెక్ట్ రిపోర్ట్ డీపీఆర్కు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించారన్నారు. ఇది పులివెందుల ప్రజలేతో పాటు రాయలసీమ ప్రాంతానికి శుభ పరిణామమన్నారు. ఈ రైల్వేలైన్ పులివెందుల మీదుగా వచ్చేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో అప్పటి ప్రభుత్వం కృషి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నిరంతర ప్రయత్నాలతో డీపీఆర్ రైల్వేబోర్డుకు సమర్పించారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పులివెందుల మీదుగా ప్రత్యామ్నాయ రైల్వే అలైన్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖలతో పలుమార్లు చర్చలు జరిపారన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అవసరాన్ని వివరించారన్నారు. లిఖితపూర్వకంగా లేఖలు కూడా సమర్పించారన్నారు. వాటి ఫలితంగానే ముద్దనూరు – పులివెందుల – ముదిగుబ్బ – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మార్గంలో సర్వేకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన అధికారిక సమాధానాల్లో కూడా ఈ ప్రత్యామ్నాయ అలైన్మెంట్కు సంబంధించి సర్వే మంజూరనే విషయం స్పష్టంగా నమోదైందన్నారు. అదే ప్రతిపాదికను డీపీఆర్ దశకు చేరుకోవడం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డి నిరంతర కృషికి నిదర్శనమన్నారు. పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ రావడంతో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా వ్యాపార, విద్య, వైద్య, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దశరథరామిరెడ్డి, హఫీజ్, ఈశ్వరయ్య, మహేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందులకు రైలు మార్గం.. సుగమం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో నెరవేరనున్న చిరకాల స్వప్నం -
బాబు, పవన్, లోకేష్.. జాబ్లు మీకేనా, మాకివ్వరా?
● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల నిరాహారదీక్ష కర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
భూ వివాదంతో 250 చీనీ చెట్ల నరికివేత
● ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు ఖాజీపేట : కొత్తపేట గ్రామంలో సాగులో ఉన్న 1.43 ఎకరాల భూమిపై వివాదం చెలరేగడంతో 250 చీనీ చెట్లను నరికి వేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నంబర్ 467లో 1.43 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి సాగు చేస్తున్నాడు. 250 చీనీ చెట్లతోపాటు పసుపు పంటను అంతర్ పంటగా సాగు చేశారు. అయితే ఈ భూమిపై వారసత్వ పోరు 2018 నుంచి నడుస్తోంది. కొత్తపేట గ్రామానికి చెందిన లక్షుమ్మ, చిన్నమ్మలు అక్కాచెల్లెళ్లు. లక్షుమ్మ వారసులైన రమణారెడ్డి ఈ భూమి మాది వారసత్వంగా మాకు సక్రమించిందని, అలాగే చిన్నమ్మ వారసులైన దశరథ రామిరెడ్డి మాకు చెందుతుందని చెబుతున్నాడు. ఇలా ఇరువురి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై ఇరువర్గాల వారు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. అయితే బుధవారం రాత్రి పాలకొలను లక్ష్మీదేవమ్మ, నారాయణమ్మ, దశరథరామిరెడ్డిలు పొలంలోకి వచ్చి 250 చెట్లు నరికేశారని ఖాజీపేట పోలీసులకు రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ భూమి తమకు వారసత్వంగా వచ్చినదని, కావున తమ భూమిలో చెట్లను తామే నరికేశామని దశరథరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో ఈ భూమి ఎవరిదో తేల్చాలని ఖాజీపేట సీఐ వంశీధర్ ఖాజీపేట తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. భూ హక్కుదారులు తేలిన తరువాత కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇరు వర్గాల వారిని పిలిచి రికార్డుల పరిశీలన చేపట్టారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు పోలీస్స్టేషన్ పరిధి కొండపేట గ్రామంలో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 22 గ్రాముల బంగారు, 79 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూరు పోలీస్స్టేషన్లో సీఐ చాంద్బాషా, ఎస్ఐ సుభాష్చంద్రబోస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నంద్యాల నరేంద్ర ఇంటిలో గతేడాది జూలై 25న గుర్తు తెలియని వ్యక్తులు బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కడప సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితుడు కొప్పెర్ల ప్రసన్న కుమార్ను అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేంద్ర కారాగారానికి తరలించారు. -
రక్తదాతలే నిజమైన హీరోలు: సినీ నటుడు శ్రీకాంత్
కడప ఎడ్యుకేషన్: రక్తదానం మానవత్వానికి ప్రతీక అని, ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలే నిజమైన హీరోలని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కొనియాడారు. కడప ఊటుకూరు ప్రకృతి నగర్లోని పీఆర్ఆర్ఎం ఫార్మసీ కళాశాలలో ‘ఖూన్ కా రిష్తా’ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, అత్యవసర సమయాల్లో ఎంతోమందికి రక్తాన్ని అందిస్తూ నిరంతరం సేవలందిస్తున్న కడప సమాచార పౌర సంబంధాల శాఖ ఫొటోగ్రాఫర్ పీఎండీ సోహైల్ అలీ ఖాన్ను నటుడు శ్రీకాంత్ శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఒక మనిషి మరో మనిషికి ఇవ్వగలిగే అత్యంత విలువైన కానుక రక్తదానమేనని పేర్కొన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సల వేళ సరైన సమయానికి రక్తం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎటువంటి అపోహలు లేకుండా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గౌరవ అధ్యక్షుడిగా హాజరైన ప్రొద్దుటూరు సినీ నిర్మాత కె. రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి.. నిజమైన హీరోలుగా నిలవండి‘ అనే సందేశంతో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య, విద్యా రంగాల ప్రముఖులు, సినీ అభిమానులు, ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
● కొత్త జన్మనిచ్చిన గురువు..
‘మా సార్ జగదీశ్వరయ్య అంటే నాకు చదువు చెప్పిన గురువు మాత్రమే కాదు.. నా పాలిట ప్రత్యక్ష దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం.. అందరినీ ఒకే రూపంలో చూడాలనుకుంటే మా సార్ను చూస్తే సరిపోతుంది’ అంటూ తన గురువు పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గం, సోమలవారిపల్లెకు చెందిన సచివాలయ వీఆర్వో మల్లికార్జున్. ‘నేను 5వ తరగతి చదువుతుండగా మా అమ్మ చనిపోయింది. ఆ కష్టకాలంలో చదువు మానేసి నాన్నతో కలిసి పనులకు వెళ్తుంటే, బలపనూరు జెడ్పీ హైస్కూల్ పీఈటీగా ఉన్న జగదీశ్వరయ్య సార్ మా ఇంటికి వచ్చి నన్ను మళ్లీ బడికి వచ్చేలా చేశారు. 10వ తరగతి తర్వాత సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ ఫ్రీ సీట్ సాధించాను. పాలిటెక్నిక్ పూర్తయ్యాక కర్నూలు పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ సీట్ వచ్చింది. తీరా చేరాక మా నాన్న కూడా చనిపోవడంతో హాస్టల్ ఫీజు కట్టలేక చదువు ఆపేయాలనుకున్నాను. విషయం తెలిసి మా సార్ మళ్లీ దేవుడిలా వచ్చి.. ‘నేనున్నాను చదువుకో’ అని ధైర్యం చెప్పారు. ఆపై సార్ అండతోనే తిరుపతి ఎస్వీయూలో సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ పూర్తి చేశాను. ఎంటెక్ చదువుతుండగానే నాకు గ్రామ సచివాలయంలో వీఆర్వో ఉద్యోగం వచ్చింది. సార్ సలహాతో ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఎంటెక్ పూర్తి చేశాను. మా సార్ భార్య (నా దృష్టిలో ఆమె నా కన్నతల్లి) ప్రతి నెల ఒకటి రాగానే.. ‘మల్లికి డబ్బులు వేశావా?’ అని సార్ను అడిగి మరీ వేయించేవారు. అలా ఆ దంపతులిద్దరూ కలిసి నాకు ఈరోజు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చారు.మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వారు వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు.’ అంటూ వీఆర్వో మల్లికార్జున్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘మా పిల్లల్లో ఒకడు’ అనుకున్నాం : జగదీశ్వరయ్య ‘నేను బదిలీపై పులివెందుల బలపనూరు జెడ్పీ హైస్కూల్కు వెళ్లినప్పుడు అది ఆటలు తెలియని ఒక మారుమూల పాఠశాల. ప్రార్థన సమయానికి రాని పిల్లల కోసం స్వయంగా పల్లెలకు వెళ్లి వారిని బడికి తెచ్చి ఆటలు ఆడిస్తుండేవాడిని. అలా మల్లికార్జున్లో ఉన్న క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి బాల్ బ్యాడ్మింటన్ నేర్పాను. అయితే వాడు చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో చదువు ఆపేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని నా భార్యతో చర్చించగా.. వాడి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు మనమే చేద్దామంది. ‘మా పిల్లల్లో ఒకడు‘ అని మేమిద్దరం అనుకున్నాము. ఈరోజు ఆ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించి గౌరవప్రదంగా కొత్త జీవితాన్ని సాగిస్తుంటే ఒక గురువుగా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.’ –రాయచోటి టౌన్ -
● ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రమణారెడ్డి
రమణారెడ్డి ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్, నాటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటూ.. కడప ఎడ్యుకేషన్: కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గానుగపెంట రమణారెడ్డి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివిన ఆయన, 1998లో ఎస్జీటీగా ఎంపికై కవలకుంట్ల యూపీ పాఠశాలలో ప్రస్థానం ప్రారంభించారు. సుదీర్ఘ బోధనా ప్రస్థానంలో పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బడి రూపురేఖలు మారుస్తూ.. కవలకుంట్ల బడిలో విద్యార్థుల సంఖ్యను 70 నుంచి 200కు పెంచి, దానిని జెడ్పీ హైస్కూల్గా అప్గ్రేడ్ చేయించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా ఆయనే 10వ తరగతి వరకు బోధించేవారు. 2002లో పులివీడు బడిలో పిల్లల సంఖ్యను 60 నుండి 100కు పెంచి యూపీ స్కూల్గా మార్చారు. 2009లో ఉప్పలూరు పాఠశాలలో విద్యార్థులను 18 నుండి 54కు పెంచినందుకు 2016లో ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డు అందుకున్నారు. 2017లో పిట్టిగుంట బడిలో కేవలం ముగ్గురు పిల్లలుండి మూతపడే స్థితికి చేరగా, ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించి ఆ సంఖ్యను 103కు పెంచారు. ఈ అంకితభావాన్ని ఆనాటి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. సొంత నిధులు, దాతల సహకారం.. పిట్టిగుంట పాఠశాల అభివృద్ధికి రమణారెడ్డి రూ.2.50 లక్షల సొంత నిధులు ఖర్చు చేయడంతో పాటు, రెండేళ్ల పాటు సొంత డబ్బుతో వాలంటీర్ను నియమించారు. దాతల సహకారంతో రూ.10 లక్షలు సేకరించి సొంత స్థలం, టాయిలెట్లు సమకూర్చారు. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న కరణంవారిపల్లె పాఠశాలలోనూ రూ.1.50 లక్షల సొంత ఖర్చుతో వాలంటీర్ను, ప్రింటర్ను ఏర్పాటు చేశారు. దాతలు, సోలార్ పవర్ కార్పొరేషన్ సాయంతో రూ.7 లక్షలు సేకరించి ప్రహారీ గోడ, డిజిటల్ బోర్డు, కంప్యూటర్ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ సేవలకు 2022లో ఆయన ప్రతిష్ఠాత్మక ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డును అందుకున్నారు. హృదయంతరంగాలు ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ‘సార్ ఇచ్చిన అద్భుతమైన మోటివేషన్ వల్లే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను’ అని ఆక్టోపస్ కమాండో వెంకటేశ్వర్లు తెలపగా, ‘సార్ కల్పించిన చదువు పట్ల ఆసక్తి వల్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాను, ఆయన రుణం తీర్చుకోలేము’ అని బెంగళూరు హెచ్సీఎల్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శశిధర్ కృతజ్ఞత చాటుకున్నారు. -
నిత్య పరిశోధకుడు ఆచార్య చంద్రశేఖర్
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ తుమ్మల చంద్రశేఖర్, జెనెటిక్స్ అండ్ జినోమిక్స్ ప్రొఫెసర్ లోమడ దాక్షాయణి, ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న ముగ్గురు ఆచార్యులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పద్మతో పాటు తోటి ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, విద్యార్థులు అభినందించారు. కాగా, ఒకే విశ్వవిద్యాలయం నుంచి ముగ్గురు ఆచార్యులు ఒకేసారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. వీరి ప్రస్థానంపై ప్రత్యేక కథనం... వైవీయూ పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ తుమ్మల చంద్రశేఖర్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ, పీహెచ్డీ పట్టాలను పొందారు. పీహెచ్డీ పూర్తి చేసిన వెంటనే ఆయన తైవాన్లోని ఐఐఎస్సీలో, ఆ తర్వాత దక్షిణ కొరియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పరిశోధనలు చేశారు. అనంతరం యూఎస్ఏలో కూడా తన సేవలందించారు. ఆయన 2009లో వైవీయూ పర్యావరణ శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 2021లో అసోసియేట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత 2024లో ప్రొఫెసర్గా పదోన్నతి అందుకున్నారు. పర్యావరణ శాస్త్ర రంగంలో ఆయనకు 30 సంవత్సరాలకు పైగా పరిశోధన అనుభవం, 17 ఏళ్ల బోధనానుభవం ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ‘యంగ్ సైంటిస్ట్’, ‘రామన్ ఫెలో’ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో ఆయన మూడుసార్లు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీటితో పాటు హాస్టల్ వార్డెన్గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా, ప్లేస్మెంట్ సెల్ సభ్యుడిగా, రూసా 2.0, పీఎం–ఉషా కార్యక్రమాలకు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు పరిధిలోని ఎస్ఈఏసీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పరిశోధనలు .. డాక్టర్ చంద్రశేఖర్ ప్రధానంగా ప్లాంట్ బయోటెక్నాలజీ, బయోఎనర్జీ పరిశోధన రంగాల్లో కృషి చేస్తున్నారు. శైవలాలు, చేపల వ్యర్థాలను ఉపయోగించి బయోఇథనాల్, బయోహైడ్రోజన్, బయోడీజిల్ ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేయగా, ప్రస్తుతం మరో ఆరుగురు పరిశోధనలు చేస్తున్నారు. ఆయన రాసిన అనేక పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. వైవీయూ జెనెటిక్స్ అండ్ జినోమిక్స్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎల్.దాక్షాయణికి బోధన, పరిశోధన రంగాలలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఆమెకు 17 ఏళ్ల బోధనానుభవం, 26 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనానుభవం ఉంది. 2009లో వైవీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన ఆమె, తన ప్రతిభతో అసోసియేట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. అమెరికాలోని ప్రసిద్ధ ‘యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్’లో పోస్ట్డాక్టోరల్ ఫెలోషిప్తో పాటు రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్గా సేవలు అందించారు. క్యాన్సర్, మధుమేహంపై పరిశోధనలు డాక్టర్ దాక్షాయణి ప్రధానంగా క్యాన్సర్ జీవశాస్త్రం, ఆటోఇమ్యూన్ వ్యాధులు, నానోపార్టికల్స్ చికిత్సాపరమైన అనువర్తనాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రయోగశాల క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, మధుమేహం చికిత్స, నివారణ కోసం ‘బయోజెనిక్ సింథటిక్ నానోపార్టికల్స్’ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆమె పరిశోధనలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డీఎస్టీ, డీబీటీ, సీఎస్ఐఆర్, యూజీసీ, ఎస్ఈఆర్బీ, రూసా, ఏఎన్ఆర్ఎఫ్ వంటి జాతీయ సంస్థల నుంచి రూ.2.45 కోట్ల పరిశోధన నిధులను మంజూరుచేశారు. ఆమె రాసిన 45 పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జర్నల్స్లో (సెల్ హోస్ట్–మైక్రోబ్, పీఎల్ఓఎస్ జెనెటిక్స్, క్యాన్సర్ రీసెర్చ్) ప్రచురితమయ్యాయి. అందుకున్న పురస్కారాలు డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2011), యూఎస్ఏలో పరిశోధనల కోసం రామన్ ఫెలోషిప్ (2014–15),ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ ఫెలోషిప్ (2019), అత్యుత్తమ విద్యావేత– పండితురాలు అవార్డు (2023), మానవతా మెరిటోరియస్ టీచర్ అవార్డు (2025) ఆమె సొంతం చేసుకున్నారు.వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ కోట మృత్యుంజయ రావు రాయలసీమతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులను ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. గత 17 ఏళ్లుగా వైవీయూలో బోధన, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సును ప్రారంభించి, రాయలసీమ కళారంగానికి గుర్తింపు తెచ్చారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ప్రత్యేకంగా రాయలసీమ లోని ఆలయాల వాస్తు, శిల్పకళ, చిత్రకళలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఈ అంశాలపై ఇప్పటివరకు 6 పుస్తకాలను రచించగా, దాదాపు 70 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ప్రస్తుతం పలువురు పరిశోధక విద్యార్థులకు గైడ్గా వ్యవహరిస్తున్నారు. కడపను దేశ పటంలో నిలిపి.. జాతీయ స్థాయిలో లలిత కళా అకాడమీ, నాగపూర్లోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, మద్రాస్ రీజనల్ సెంటర్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించి కడపను దేశ సాంస్కృతిక పటంపై సగర్వంగా నిలబెట్టారు. ముఖ్యంగా ‘చదువుకుంటూనే సంపాదన’ దక్కేలా కోర్సు పాఠ్యప్రణాళికను రూపొందించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవ: ఇన్టాక్ సభ్యుడిగా, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా, బాలోత్సవం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పర్యాటక రంగాన్ని, స్థానిక హస్తకళలను ప్రోత్సహిస్తూ తనదైన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. విశ్వవిద్యాలయంలో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసి, నడిపిస్తూ భావితరాలకు చిత్రకళపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈయన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పర్యాటక రంగ అవార్డు (2025), ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుండి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు (2026), మానవతా ఫౌండేషన్ నుండి ‘ఉత్తమ టీచర్ అవార్డు’, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ నుండి ‘దామె ర్ల రామారావు స్మారక పురస్కారం’ లభించాయి. -
ముగ్గురు టీచర్లకు రాష్ట్ర ఉత్తమ అవార్డులు
జిల్లావ్యాప్తంగా ఒక హెడ్మాస్టర్, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి.నాగమణి, ప్రొద్దుటూరు ఎస్పీసీఎన్ ఎంపీఎల్ హైస్కూల్ స్కూల్ అసిసెంట్ జి.గంగాధరనాయుడు, సికెదిన్నె మండలం మూలవంక జెడ్పీ హైస్కూల్(ఉర్దూ) టీచర్ షేక్ అబ్థుల్ సత్తార్లున్నారు. వీరు ఈ నెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. – కడప ఎడ్యుకేషన్/ప్రొద్దుటూరు కల్చరల్● చదివిన స్కూల్కే హెచ్ఎం ● ఎనిమిదేళ్ల సర్వీస్లో సెలవెరుగని హెచ్ఎం ● తెలుగు మాస్టారుకు దక్కిన గౌరవం ● దీక్షా యాప్లో 100కు పైగా వీడియో పాఠాలు కడప నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ ఉపాధ్యాయుడు ఎస్.అబ్దుల్ సత్తార్ ఫైజీ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1989లో లక్కిరెడ్డిపల్లెలో ఎస్జీటీగా ప్రస్థానం ప్రారంభించి, సీకే దిన్నె, రాజంపేట, మైదుకూరులలో పనిచేసి, ప్రస్తుతం మూలవంక జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూగా సేవలందిస్తున్నారు. తరగతి గది బోధనతో పాటు సాహిత్య, నాటక, సామాజిక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది. సాహిత్య, రచనా ప్రస్థానం సత్తార్ ఫైజీ 1996 నుండి 2026 వరకు నిరంతరాయంగా 12 ఉర్దూ, 4 తెలుగు పుస్తకాలను రచించారు. ఇందులో శ్రీసర్వరే కౌనైన్శ్రీ భక్తిగేయాలు, శ్రీషాహే ఉమ్మత్శ్రీ కవితలు, శ్రీధనక్శ్రీ బాలసాహిత్యం, శ్రీగుల్హాయే ఆఖీదత్శ్రీ గ్రంథాలు ప్రముఖమైనవి. బహుభాషా కవిగా 1,000కు పైగా కవిసమ్మేళనాల్లో పాల్గొని, 400 ఉర్దూ, 150 తెలుగు వ్యాసాలు రాశారు. 33 చారిత్రక, సాంఘిక హాస్య నాటకాలు రచించడంతో పాటు ఎస్సీఈఆర్టీ టెక్స్ట్బుక్ రైటర్గా, ఉపాధ్యాయ శిక్షణలో రీసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. సామాజిక బాధ్యత – పురస్కారాలు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడిగా, కడప బాలోత్సవం సలహాదారుగా, రాయలసీమ ఉర్దూ రైటర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 35 ఏళ్ల సేవలో 200కు పైగా సన్మానాలు అందుకున్న ఆయనను మిర్జా గాలిబ్ అవార్డు (2003), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005), ఉర్దూ అకాడమీ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సితార–ఎ–ఉర్దూ అవార్డు (2023), నేషనల్ అల్లామా ఇక్బాల్ అవార్డు (2024), ఏపీ ఉర్దూ అకాడమీ బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు (2025) వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ● నాగమణి ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన ఎనిమిదేళ్ల సర్వీస్లో ఏనాడూ పాఠశాలకు సాధారణ సెలవు పెట్టలేదు. అంతటి నిబద్ధతతో పనిచేస్తూ, తాను చదివిన పాఠశాలకే హెచ్ఎంగా వచ్చి విద్యా ప్రమాణాలను పెంచిన కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ హెచ్ఎం పెనువాడి నాగమణి ఈ ఏడాది ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’కు ఎంపికయ్యారు. ఆమె హయాంలో పదో తరగతి ఫలితాలు 61 శాతం నుండి 75 శాతానికి పెరగడమే కాక, బడిలో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కడపకు చెందిన పెనువాడి నాగేశ్వరావు (హెడ్ కానిస్టేబుల్), సాలమ్మల కుమార్తె అయిన నాగమణి, కడప మున్సిపల్ హైస్కూల్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, ఎంఏ పూర్తి చేసి, కడప రాజేశ్వరి కళాశాలలో బీఈడీ పట్టా పొందారు. ఆమె భర్త పుల్లయ్య సామాజిక వేత్త కాగా, పెద్ద కుమారుడు హర్షవర్ధన్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రెండో కుమారుడు యశ్వంత్ బీటెక్ మూడోసంవత్సరం చదువుతున్నారు. ఉద్యోగ ప్రస్థానం: నాగమణి 2000 నవంబర్ 13న ఎస్జీటీగా కడప 16వ వార్డు ఎంసీహెచ్ఎస్లో ఉద్యోగంలో చేరి 12 ఏళ్లు పనిచేశారు. 2012 మే 17న స్కూల్ అసిస్టెంట్గా గాంధీనగర్ ము న్సిపల్ హైస్కూల్కు వెళ్లారు. ఆపై 2017 సెప్టెంబర్ 14న హెచ్ఎంగా పదోన్నతి పొంది, తాను చదివిన మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లోనే ఏడేళ్ల పాటు ఆదర్శవంతంగా సేవలు అందించారు. 2025 జూన్ 1వ తేదీన బదిలీపై ప్రస్తుత గాంధీనగర్ హైస్కూల్కు హెచ్ఎంగా వచ్చారు. ● గంగాధర్ నాయకుడు ప్రొద్దుటూరు కల్చరల్: రామేశ్వరంలోని ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గంగాధర్ నాయుడు పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో బోధిస్తే విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారనే భావనతో పాఠ్యాంశాలను వినూత్న చిత్రాలతో అర్థమయ్యేలా వివరిస్తూ గుర్తింపు పొందారు. దీక్షా యాప్లో వంద వీడియోలు.. యూట్యూబ్ బోధన తన డిజిటల్ బోధన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉపయోగపడాలనే ఆశయంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాఠాలు చెప్తున్నారు. ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన అధికారిక ‘దీక్షా’ యాప్లో వందకు పైగా వీడియోలను పొందుపరిచారు. 7, 10వ తరగతి పాఠ్యపుస్తకాల రచనలో సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించి, బుక్స్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు.. వందకు వంద మార్కులు ఉపాధ్యాయ శిక్షణలో రాష్ట్ర, జిల్లా రీసోర్స్ పర్సన్గా, డీసీఈబీ మెటీరియల్ రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2018లో ఢిల్లీలో జరిగిన ఐసీటీ సెమినార్లో ప్రదర్శన ఇచ్చారు. బోధనా నైపుణ్యంతో 2024–25లో వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో, 2025–26లో రామేశ్వరం ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఆరుగురు చొప్పున 100కు 100 మార్కులు సాధించారు. గత 26 ఏళ్లుగా ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, తనకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని గంగాధర్ నాయుడు అన్నారు. -
‘హైటెన్షన్’తో పరేషాన్
చింతకొమ్మదిన్నె : అనంతపురం–2 ఆర్ఇజెడ్ నుంచి కడప పవర్ గ్రిడ్ స్టేషన్ వరకు నిర్మాణం చేయతలపెట్టిన 765 కేవీ విద్యుత్ లైన్లను రైతుల భూముల్లో బలవంతంగా వేయనిచ్చే పరిస్థితి ఉండదని కడప ఆర్డీవో మురళి రైతులకు తెలియజేశారు. చింతకొమ్మదిన్నె మండల రైతులు రెజోనియా సంస్థ చేపడుతున్న 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఇదివరకే వివిధ సందర్భాల్లో కలెక్టరేట్, కడప ఆర్డీఓ, చింతకొమ్మదిన్నె తహసిల్దార్, పవర్ గ్రిడ్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం రెజోనియా సంస్థ చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని రైతుల భూముల్లో బలవంతంగా 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టేందుకు పోలీసు రక్షణ కోరిన నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడం, ‘సాక్షి’లో వివరాలు బయటకి రావడంతో రైతుల అభ్యంతరాలు వినడానికి పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించారు.గురువారం చింతకొమ్మదిన్నె తహసిల్దార్ కార్యాలయంలో కడప ఆర్డీవో మురళి, డీఎస్పీ బాలస్వామిరెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి చింతకొమ్మదిన్నె మండలంలోని 765 కేవీ విద్యుత్ లైన్ ప్రభావిత 12 గ్రామాల రైతులను, రెజోనియా సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. రైతులు తాము ఏప్రిల్ 2025న పత్రికా ప్రకటనలో స్టెరిలైట్ సంస్థ విధించిన గడువులోగానే వారి కంపెనీ చూపిన అడ్రస్కు రిజిస్టర్ పోస్టులు చేస్తే వెనక్కి వచ్చాయని, మెయిల్, ప్రతినిధి ద్వారా స్టెరిలైట్ సంస్థకు అభ్యంతరాలను తెలుపుతూ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించినట్లు తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ స్టెరిలైట్ సంస్థ రూపొందించిన డిజైన్లోని లోపాలను ఎత్తిచూపారు. దేవాలయాల సమీపం నుంచి సత్రాల మీదుగా,కొన్నిచోట్ల ఇళ్లమీదుగా, మరికొన్ని చోట్ల పాఠశాలలకు అత్యంత సమీపం నుంచి, విలువైన భూముల మీదుగా సాగే ప్రస్తుత 765 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణాన్ని తాము సహకరించబోమని తెగేసి చెప్పారు. కొందరు రైతులు మాట్లాడుతూ కడప నగరానికి అత్యంత సమీపంలోని విలువైన భూముల గుండా దాదాపు 10 గ్రామాలకు ఆనుకుని వెళ్లే ఈ డిజైన్ లోపభూయిష్టంగా ఉందని రైతులు సూచించిన మేరకు సమీపంలోని గుట్టల మీదుగా విద్యుత్ లైన్ నిర్మాణం చేపట్టాలని అందుకు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు. తాము ఇదివరలోనే పీజీఆర్ఎస్లో కలెక్టర్ను సంప్రదించి తమ బాధను ,అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి దాదాపు 150 కుటుంబాలు రోడ్డున పడే ప్రస్తుత డిజైన్ మార్గాన్ని మార్పించి సమీప గుట్టలమీదుగా వెళ్లే విధంగా మార్పు చేయించాలని రైతులు కోరారు. సమావేశానికి వచ్చిన రైతుల నుంచి వారి భూమి వివరాలను ఆర్డీఓ, తహసిల్దార్ సేకరించారు. అనంతరం ఆర్డీవో మురళి మాట్లాడుతూ రైతుల భూముల్లో బలవంతరంగా 765 కేవీ విద్యుత్ నిర్మాణం జరపరని,ఈనాటి సమావేశ వివరాలను, రైతుల అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. రెజోనియా సంస్థ ప్రతినిధి గిరిప్రసాద్ మాట్లాడుతూ తాము గతంలో స్టెరిలైట్ సంస్థ పేరుతో అనంతపురం నుంచి కడప పవర్ గ్రిడ్ స్టేషన్ వరకు 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణ కాంట్రాక్టు మార్చి 2025లో పొంది ఉన్నామన్నారు. సంబంధిత డిజైన్ మేరకు లైన్లు వెళ్లే రైతుల అభ్యంతరాల స్వీకరణకు గత ఏప్రిల్ 10వ తేదీన ఓ పత్రికలో పత్రికా ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు.అయితే నిర్ణీత గడువు 60 రోజుల లోపల కొందరు రైతులు రిజిస్టర్ పోస్టు ద్వారా అభ్యంతరాలు తెలిపి ఉన్నారని, తాము కార్యాలయం మార్చడం వల్ల అందుకోలేకపోయామన్నారు. అలాగే రైతులు మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని తాము విశ్లేషించి తమ పరిధిలోనే తమకు డిజైన్ మార్పు చేయదగినవిగా అనిపించకపోవడంతో పరిశీలనలోకి తీసుకోలేదన్నారు.రైతుల అభ్యంతరాలు స్టెరిలైట్ సంస్థ సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చేరవేయలేకపోవడంతో,కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటే ప్రత్యామ్నాయ మార్గంగా చూపుతున్న మార్గంలో 9 టవర్లను క్రాస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుత డిజైన్ మార్గంలో కూడా15 టవర్లను క్రాస్ చేస్తున్నట్లు రైతుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.చింతకొమ్మదిన్నె సీఐ బలమద్దిలేటి,ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి రైతులతో అధికారుల సమావేశాన్ని పోలీసు బందోబస్తు మధ్య సజావుగా సాగేలా చూశారు. కొసమెరుపు : ప్రస్తుత డిజైన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే చేయకుండా కేవలం గూగుల్ మ్యాప్ ఆధారం చేసుకొని డిజైన్ తయారు చేసినట్లు రెజోనియా సంస్థ ప్రతినిధులు అధికారుల సమక్షంలో అంగీకరించారు. క్షేత్ర స్థాయిలో రైతుల వ్యతిరేకత ,గ్రామాల సమీపంలో వెలసిన నిర్మాణాలు,గడువులోగా రైతుల అభ్యంతరాలు తెలపడం,డిజైన్ లోపాలతో ఉండటం,ప్రత్యామ్నాయ మార్గానికి అటవీ అనుమతులు సాధించాల్సి ఉన్నందున ప్రతిష్టంభన నెలకొంది. ఇదివరలోనే రైతులు తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 10(డి) మేరకు రెజోనియా సంస్థను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి చెర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మాయమాటలతో మోసపోయా ఇప్పపెంట పరిధిలోని రైతు అజ్మత్బాష మాట్లాడుతూ తనకు మాయమాటలు చెప్పి తన అకౌంట్లో డబ్బులు వేశారని, తన భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్ ఫౌండేషన్ ఇదివరలోనే ధ్వంసమైనందున తాను వారు కోరిన అకౌంట్ కు డబ్బులు బదిలీ చేస్తానని,తన పొలంలో విద్యుత్ లైన్కు అంగీకరించడం లేదని అధికారులకు, రేజోనియా సంస్థ ప్రతినిధులకు తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్మాణం ఆపాలి లక్కిరెడ్డిపల్లెకు చెందిన రైతు వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను చిన్న వ్యవసాయ రైతునని, ఆ భూమిని నమ్ముకుని పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నాని చెప్పారు. ప్రస్తుత డిజైన్ మేరకు భూమిలో సగభాగానికి పైగా రైట్ ఆఫ్ వే కింద వెళ్లిపోతుందని, దీంతో భూమి విలువను కోల్పోయి రోడ్డున పడతామని,బలవంతంగా విద్యుత్ లైన్లు నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. 765 కేవీ విద్యుత్ లైన్ వద్దు.. రైతుల అల్టిమేటం అన్నదాతల అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం: కడప ఆర్డీవో మురళి -
హక్కుల సాధనకు ఉద్యమిస్తాం
కడప సిటీ : హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్లో పీఆర్సీ, ఉద్యోగుల బకాయిల సాధన కోసం లంచ్ అవర్ డెమానెస్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఏపీపీ టీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అన్ని బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అన్ని డిపార్టుమెంట్లు జేఏసీ అమరావతికి సంఘీభావం ప్రకటించి ఉద్యమించాలన్నారు. పదోన్నతులపై తక్షణ చర్యలు తీసుకుని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగి ఏపీ జేఏసీలో పాల్గొని ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు తన బాద్యతగా ఉద్యోగుల పక్షాన తమ గొంతుకను వినిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రతాప్రెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు. -
పవర్ గ్రిడ్ లైన్లతో భూములకు విలువ తగ్గుతుంది
జమ్మలమడుగు/మైలవరం : కార్పొరేట్ కంపెనీలు సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ఉత్పత్తి అయిన విద్యుత్ను పవర్గ్రిడ్కు కలపడం కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు, లైన్లు రైతుల పొలాల్లో పోవడం వల్ల భూములకు విలువ తగ్గిపోతుందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు గురువారం మైలవరం మండలంలోని వేపరాల గ్రామంలోని రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్టవర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ రైతులకు పరిహారం ఇవ్వకుండా వారి పంట పొలాల్లో టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులను పోలీసు, రెవెన్యూ అధికారులతో బెదిరిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం చట్ట రీత్యానేరం అంటున్నారే తప్ప రైతులకు రావాల్సిన పరిహారం గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.. పరిహారం అరకొర కాకుండా పది లక్షల రూపాయల వరకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రిడ్ కంపెనీలు చేపడుతున్న టవర్లను రైతుల భూముల్లో పెట్టనిచ్చే పరిస్థితి లేదన్నారు. అలా ఎవరైనా చేస్తే అన్యాయం జరిగిన రైతులతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొమెర్ల మోహన్రెడ్డి, జగదీశ్వరరెడ్డి వేపరాల గ్రామ రైతులు పాల్గొన్నారు.రైతులకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్ -
ఆధునిక హంగులతో ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయం
ప్రొద్దుటూరు క్రైం : పోలీసు అధికారులు, సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు, కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయాన్ని ఆధునిక హంగులతో పునరుద్ధరించారు. ఈ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు ప్రజలు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యాలయ పునరుద్ధరణకు ప్రొద్దుటూరులోని డాక్టర్ స్వరూప్కుమార్రెడ్ది, సీబీఐటీ జయచంద్రారెడ్డి, కేవీఆర్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్రెడ్డి, నాగార్జున హాస్పిటల్ డాక్టర్ ఎన్ నాగార్జున, దండపాణి శ్రీనివాసకుమార్, గౌతమి ఇంజినీరింగ్ కాలేజి నాగూర్బాషా, శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం ఎస్ నాగిరెడ్డి తదితరులు తమ వంతు ఆర్ధిక సహకారం అందించారన్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ చొరవతో దాతలు, పోలీసు అఽధికారులు, సిబ్బంది సమన్వయంతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె ప్రకాష్బాబు, ఏఎస్పీ విభూకృష్ణ, సీఐలు టీవీ కొండారెడ్డి, నాగభూషణ్, రామాంజనేయుడు, వంశీనాథ్, భాస్కర్, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీకాంత్, రాజు, రాఘవేంద్రారెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.ప్రారంభించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
●ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
● గుర్తింపు సంఖ్యతోనే ప్రభుత్వ పథకాలు ● త్వరితగతిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ● సొంత భూమి ఉన్న రైతుకు ఆధార్ తరహాలో 11 అంకెల నెంబర్ కడప అగ్రికల్చర్: అన్నదాతలకు అండగా నిలవాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. రైతులకు లభించే అన్ని రకాల సేవలను, ప్రభుత్వ సాయాన్ని ఒకే చోట అందించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా సాధారణ పౌరులకు ఉండే ఆధార్కార్డు మాదిరిగానే, కర్షకులకు కూడా పదకొండు అంకెలు కలిగిన ‘యూనిక్ ఐడీ’ నెంబర్తో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముమ్మరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ చేసే ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో (ఆర్బీకే) నమోదు ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. జిల్లా మొత్తం మీద 3 లక్షలకు పైగా రైతులు ఉండగా, వీరిలో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారు 2,86,983 మంది ఉన్నారు. ఎనిమిది వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు 2,38,090 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇంకా 48,771 మంది రైతులు ఈ నమోదు ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. నమోదుకు అడ్డంగా రెవెన్యూ సమస్యలు ఫార్మర్ రిజిస్ట్రీ యాప్లో నమోదు కాని వారిలో చాలామంది రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూముల వివరాలు వెబ్ల్యాండ్లో కనిపించకపోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు, 1బీ, అడంగల్లలో ఇంకా పూర్వీకుల పేర్లే ఉండటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనితో పాటు భూమి అసలు యజమాని ఒకరైతే, మరొకరి పేరిట వెబ్ల్యాండ్లో తప్పుగా నమోదు కావడం వంటి లోపాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక, రెవెన్యూ సమస్యల వల్లే వేలాది మంది రైతులు విశిష్ట సంఖ్యను పొందలేక ఆందోళన చెందుతున్నారు. నమోదుకు అవసరమైన ధ్రువ పత్రాలుజిల్లాలో రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడానికి రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ (పాసు పుస్తకం లేనిచో వన్బీ), ఆధార్కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను వెంటతీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ సిబ్బంది వివరాలు నమోదు చేయగానే రైతు మొబైల్కు మూడు ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియజేసి కన్ఫర్మ్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ యూనిక్ ఐడీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా ఈ విశిష్ట ఐడీని పొందాలి. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల వ్యవసాయ సేవలు, సంక్షేమ పథకాలు ఈ ఐడీ కార్డు ద్వారానే లభిస్తాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో (ఆర్బీకే) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,090 మంది రైతులు ఫార్మర్ ఐడీ కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు. ఇంకా చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే, వెంటనే తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం
కడప రూరల్ : సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ బలపనూరు శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలన్నారు . ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని తెలిపారు. రావాల్సిన 5 డీఏ లను మంజూరు చేయాలని చెప్పారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్ మహేష్ బాబు, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సైలేశ్వరరెడ్డి, యూటీఎఫ్ నాయకులు ఇలియాస్, జిల్లా ఎన్జీవోస్ సెక్రటరీ నిత్యపూజయ్య, ఎన్జీవోస్ నాయకులు టి.శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, బాలపుల్లయ్య, సిద్దయ్య, పద్మనాభరావు, మహిళా విభాగం కృష్ణ కుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం గర్జించిన ప్రభుత్వ వైద్యులు కడప అర్బన్ : ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జీడీఏఏపీ ఆధ్వర్యంలో జీఎంసీ కడప వైద్యులు గురువారం ఆందోళన చేపట్టారు.ఓపీడీ బ్లాక్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు.‘వైద్యులకు న్యాయం చేయాలి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి’అంటూ నినాదాలు చేశారు. 2016 నుంచి 2026 వరకు పెండింగ్లో ఉన్న బోధనా వైద్యుల వేతన/పే రివిజన్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రమోషన్లు,ఎన్పీపీఏ, క్యాడర్ సమస్యలు, ఖాళీల భర్తీ తదితర న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆందోళన అనంతరం వైద్యులు తమ సమ్మె నోటీసు లేఖలను జీఎంసీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ బోధనా ఆసుపత్రి సూపరింటెండెంట్కు సమర్పించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే దశలవారీగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని జీడీఏఏపీ ప్రకటించింది. సెప్టెంబరు 7 నుంచి మధ్యాహ్నం ఓపీలు, సెప్టెంబరు 21 నుంచి ఓపీడీలు, ఎలక్టివ్ సర్జరీల బహిష్కరణ, రిలే నిరాహార దీక్షలు, సెప్టెంబరు 28 నుంచి నిరాహార దీక్ష వంటి కార్యక్రమాలు ఉంటాయని నోటీసులో పేర్కొంది. రోగుల భద్రత, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని జీడీఏఏపీ ప్రతినిధులు తెలిపారు. -
ప్రభుత్వం మాట తప్పింది
30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో టెట్ను అటెండ్ చేయడం కష్టతరం. కావున వారికి ఆఫ్లైన్ విధానంలో టెట్ను నిర్వహించాలి. ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది – సింగారెడ్డి అమర్నాథరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా స్పెషల్ టెట్ను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి. ఇన్ సర్వీస్ టీచర్ల బోధ న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ను పునః పరిశీలించి అందరికి స మానంగా 40 శాతం మార్కులు ఉండేలా నిబంధనలు సవరించాలి. – కందుల వెంకటసుబ్బారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్. తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసంచేసింది. – పాలకొండయ్య, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. -
ప్రభుత్వ స్థలం కబ్జా
సిద్ధవటం : భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని జేసీబీ యంత్రంతో చదును చేసి కబ్జా చేశారు. సిద్దవటం మండలంలోని మాధవరం, 1,2,3, గ్రామం శాఖరాజుపల్లె రెవెన్యూ సర్వే నంబర్,425/1లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రభుత్వ స్థలం 10 సెంట్లు కబ్జా చేశాడు. గురువారం స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఒంటిమిట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మంగళవారం జేసీబీ యంత్రంతో చదును చేశాడని, ప్రభుత్వ స్థలాలు కనపడితే స్థానికులు కాకుండా ఇతర కొత్త వ్యక్తులు కబ్జా చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూమి, స్థలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ విషయమై తహసీల్దార్ విజయకుమార్ వివరణ కోరగా మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో శాఖరాజు పల్లెరెవెన్యూ పొలం కబ్జా చేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. భార్యా భర్తలపై దాడివీరపునాయునిపల్లె : వీరపునాయునిపల్లెకు చెందిన ప్రసాద్ అలియాస్ పేరూరి వెంకట నాగప్రసాద్ అతని భార్య లక్ష్మీప్రసన్నలపై గురువారం ఉదయం దాడి జరిగింది. ఈ దాడిలో ప్రసాద్కు తీవ్రగాయాలు కాగా లక్ష్మి ప్రసన్నకు స్వల్ప గాయాలయయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రసాద్ అన్ని శాఖల అధికారులపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తుండేవాడని, అదే క్రమంలో పాయసంపల్లెకు చెందిన అన్నారెడ్డి గంగిరెడ్డి కందుల సుదర్శన్రెడ్డి లింగాల పొలంలో సర్వే నంబర్ 520లో భూములు ఆక్రమించుకొన్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ప్రసాద్ బావమరిది సుదర్శన్రెడ్డి,గంగిరెడ్డి ఫోన్లో వాదించుకోవడం జరిగిందని ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. అదే క్రమంలో గురువారం ఉదయం ప్రసాద్ ఆయన భార్య లక్ష్మి ప్రసన్న ఇద్దరు కలసి గంగిరెడ్డిపల్లెలోని గోశాల వద్దకు వెలుతుండగా సంగాలపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామాల మధ్య వాహనాన్ని అడ్డగించి కందుల సుదర్శన్ రెడ్డి, అన్నారెడ్డి గంగిరెడ్డి, హర్షవర్దన్ రెడ్డిలు కలిసి దాడిచేశారు. ప్రసాద్ భార్య పిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దత్తాపురంలో చోరీకొండాపురం : మండల పరిధిలోని సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలో దత్తాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ వివరాల మేరకు.. తలారి లక్ష్మీనారాయణ, తన భార్యతో కలిసి వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. ఆయన తల్లి పక్కనే ఉన్న ఇంటిలో ఉంటుంది. తన కుమారుడి ఇంటి వైపు చూడగా తాళం పగలగొట్టి ఉంది. వెంటనే కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా ఇంటికి వచ్చి చూస్తే బీరువా లో రూ.20 వేల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పవిత్రోత్సవాలు ప్రారంభం
రాజంపేట: పదవకవితపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్ధలిలో వెలసిన శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను గురువారం ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవిత్రోత్సవాలలో భాగంగా తొలిరోజు పవిత్ర మాలల సంపూర్ణ కార్యక్రమంలో సిద్దేశ్వరస్వామికి నిర్వహించారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ, వేదపండితులు, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాయచోటి: కడప సబ్ జైలు (సెంట్రల్ జైలు పరిధి) నుండి పరారైన రిమాండ్ ఖైదీని తిరుపతి ఈస్ట్ పోలీసులు పట్టుకుని రాయచోటి పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి దొంగతనం కేసులో నిందితుడిగా ఉంటూ కడప జైలులో రిమాండ్లో ఉన్నాడు. కాగా, మరో దొంగతనం కేసుకు సంబంధించి పీటీ వారెంట్పై పోలీసులు ఇతడిని రాయచోటి కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు విచారణ అనంతరం నిందితుడిని తిరిగి కడపకు తరలించి, జైలు లోపలికి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసుల కళ్లు గప్పి వీరారెడ్డి తప్పించుకుని పారిపోయాడు. అక్కడ నుండి తిరుపతికి చేరుకున్న ఇతడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే రాయచోటి పోలీసులకు సమాచారం అందించగా.. ఏఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ అయాన్ బాషా, హోంగార్డు మధుబాబులు తిరుపతికి వెళ్లి వీరారెడ్డిని తమ ఆధీనంలోకి తీసుకుని తిరిగి కడప జైలుకు తరలించారు. -
బాలికను వేధించిన కేసులో ఉపాధ్యాయునికి జైలు
ఒంటిమిట్ట(సిద్దవటం ) : ఒంటిమిట్ట మండలం లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఏవీ వెంకటసుబ్బారావు ఒక బాలికను లైంగికంగా వేధిస్తూ, డబ్బులు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆమెను ప్రభావితం చేసి జూలై 2013 న ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు గురువారం కడప ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి తీర్పును వెలువరించారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన ఏవీ వెంకట సుబ్బారావు, ఒంటిమిట్ట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇతను బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు బాలిక తల్లి అక్టోబర్ 2013న ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ డీకే జావిద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. అప్పటి ఎస్ఐ బి. పెద్ద ఓబన్న దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జి సీటు దాఖలు చేశారు. ఈ కేసులో కడప ఒకటోఅదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్. శాంతి విచారించి, ప్రాసిక్యూషన్ తరపున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించారేఉ. నేరం నిరూపితమైనందున దోషిగా నిర్ధారించారు. సెక్షన్ 363 ఐపీసీ కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష,రూ. 5000 జరిమానా, అలాగే సెక్షన్ న్366 ఐపీసీ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేసిన ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్ఐ బి పెద్ద ఓబన్న, ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపించిన స్పెషల్ ఏపీపీ బొక్క సం శ్రీనివాసులు, గ్రేడ్ 1 శ్రీమతి ఎన్. ఖదిరుణ్, సాక్షులను సక్రమంగా కోర్టులో హాజరు పరిచి నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట కోర్టు కానిస్టేబుల్ నాగేంద్ర రాజు, సుమంత్, అలాగే కేసును పర్యవేక్షించిన ప్రస్తుత ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు, లను కడప జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
హెడ్ మాస్టర్ సస్పెన్షన్
– మరో టీచర్కు షోకాజ్ నోటీస్ కడప ఎడ్యుకేషన్: కడప మండల పరిధిలోని చెమ్ముమియపేట మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగన్నను డీఈఓ సస్పెండ్ చేయగా, ఆదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలు సుబ్బమ్మకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. హెడ్మాస్టర్ నాగ న్న విద్యార్థినులతో అభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఆదే విధంగా ఎస్జీటీ సుబ్బమ్మ తన భర్తను పాఠశాలకు పిలిపించి పిల్లలను మందలించడంపై వచ్చిన ఆరోపణలపై నోటీసు ఇచ్చినట్లు, ఎనిమిది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యతల స్వీకరణ కడప కార్పొరేషన్: ఏపీ ట్రాన్స్కో కడప జోన్ చీఫ్ ఇంజినీర్గా కె.కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం శంకరాపురంలోని ఏపీ ట్రాన్స్కో నిలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.నూతన సీఈ కరుణాకర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లకు అంతరాయం ఏర్పడితే తక్షణమే మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పారిశ్రామిక వాడలకు ఎక్కడా కరెంట్ కోతలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాసులరెడ్డి, చౌడయ్య, డీఈఈలు రామమోహన్, ప్రసాద్రెడ్డి, ఏఈలు మౌనిక, ఎ.మౌనిక తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలో చోటు కడప వైఎస్ఆర్ సర్కిల్: నెల్లూరులో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు జరిగిన డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో వైఎస్సార్ జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వీరణాల శివకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ముడియం చిన్ని ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల కోసం సేకరిస్తున్న వేలాది ఎకరాల భూముల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేలా యువతను చైతన్యపరచి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వీరణాల శివకుమార్ ముడియం చిన్ని -
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ది ఎన్నటికీ చెరగని స్థానం
వేంపల్లె : కోట్లాదిమంది తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఎన్నటికీ చెరగని స్థానమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. బుధవారం దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు నేటికీ చెరపని ముద్ర అని, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే అధ్యాయమని పేర్కొన్నారు. -
మా ఆవేదన పట్టించుకునే నాథుడే లేరు
విద్యుత్ లైన్లపై స్టెరిలైట్ సంస్థకు పంపిన అభ్యంతరాల పోస్టులు బోగస్ అడ్రస్ వల్ల వెనక్కి వచ్చాయి. నష్టం లేని ప్రత్యామ్నాయ మార్గాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా అనుమతి లేకుండా రెజోనియా సంస్థ క్షేత్రస్థాయిలో పనులు చేయడం దుర్మార్గం. – రాజుల మల్లారెడ్డి, రైతు, లింగారెడ్డిపల్లె. మాకున్న కొద్దిపాటి భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బలవంతంగా పనులు మొదలుపెడితే రైతులంతా మూకుమ్మడిగా ప్రతిఘటిస్తాం. కమ్మవారిపల్లె చెరువు నుండి నేరుగా పవర్ గ్రిడ్కు ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా మా భూముల్లోనే లైన్లు వేయడం అన్యాయం. – యుగంధర్, రైతు, కొలుములపల్లె. -
ధన్నవాడలో ఘర్షణ
మైలవరం : మండల పరిధిలోని ధన్నవాడ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం జలప్రవేశం చేసే కార్యక్రమంలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం బుధవారం నెలకొంది. గతనెల 28, 29వ తేదీలలో గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి 30వ తేదీన విగ్రహ ప్రతిష్టను గ్రామస్తులందరూ కలిసి చేశారు. అయితే గ్రామంలో పాత విగ్రహాన్ని ఏమిచేయాలో అన్న విషయాన్ని కమిటీ పెద్దలు బ్రాహ్మణ పెద్దలతో చర్చించారు. వారి సలహా మేరకు పాత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జలప్రవేశం చేయించాలని తెలుపడంతో ఆ మేరకు విగ్రహాన్ని మైలవరం జలాశయంలో జలప్రవేశం చేయించటానికి సిద్ధమయ్యారు. అయితే ఇంకో వర్గం మాత్రం గ్రామంలోనే ప్రతిష్టించాలని పదేపదే అడ్డుతగులుతూ వచ్చారు. అయితే మంగళవారం రాత్రి పాత విగ్రహాన్ని జలప్రవేశం చేయబోతున్నట్లు గ్రామంలో దండోర వేయించారు. దీంతో రాత్రి 10గంటల సమయంలో నూతన దేవాలయం భజన జరుగుతుండగా మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్టించాలని మీరు అవసరంలేకపోతే మా దేవాలయంలో ప్రతిష్టిస్తామంటూ వాదనకు దిగారు. దీంతో కమిటీ సభ్యులు ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బుధవారం ఉదయమే బందో బస్తు మధ్యలో పాత విగ్రహాన్ని మైలవరం జలాశయంలో జలప్రవేశం చేయించారు. అయితే గత రాత్రి జరిగిన వాదులాట వల్ల ఇరువర్గాలకు సంబంధించిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు. పెన్నానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని రామేశ్వరం గంగమ్మ ఆలయం వెనుక పెన్నానది నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం రూరల్ పోలీసులు గుర్తించారు. ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. అతను రెండు, మూడు రోజుల క్రితం నీటిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. మృతదేహంతో పశువైద్యశాల వద్ద ఆందోళన మైదుకూరు : ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సింగయ్యగారి వెంకటసురేష్ మృతదేహంతో బుధవారం ఆయన బంధువులు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాల వద్ద ఆందోళన చేశారు. పశువైద్యశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకట సురేష్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం పోస్టుమార్టం అయిపోగానే ఆయన మృతదేహాన్ని స్థానిక పశువైద్యశాల వద్దకు తీసుకుని వచ్చి బంధువులు ఆందోళన చేశారు. వెంకట సురేష్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతామని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సుమన్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నకిలీ పోలీసుల అవతారంలో బెదిరింపులు ప్రొద్దుటూరు క్రైం : పోలీసులమని చెప్పి యువత, ప్రేమ జంటలను బెదిరించి డబ్బు లు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటరిగా కూర్చున్న యువత, ప్రేమ జంటలను గుర్తించి తాము పోలీసులమంటూ బెదిరించి వారి నుంచి నిందితులు డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో నవీన్కుమార్ అనే వ్యక్తిని బెదిరించి రూ.1.35 లక్షలు విలువ చేసే ఐఫోన్ను తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. నిందితుల నుంచి పైబర్ లాఠీ, పల్సర్ బైక్, రూ.1.35 లక్షలు విలువైన ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ రాజు తెలిపారు.● అభయాంజనేయ స్వామి విగ్రహ విషయంలో వివాదం ● ఇరువర్గాలపై కేసు నమోదుఇరువురి అరెస్ట్ -
గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై లారీ బోల్తా
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై బుధవారం ఉదయం టెంకాయల లోడుతో వెళుతున్న లారీ వెనుక టైరు పంక్చరు కావడంతో బోల్తా పడింది. తమిళనాడు నుంచి హైదరాబాద్ వెళుతున్న టీఎన్ 52 ఎల్ 5973 నెంబరు గల పన్నెండు టైర్ల లారీ ఘాట్ రోడ్డుపై కడప వైపున మొదటి మలుపులో టైరు పంక్చరై నెమ్మదిగా వస్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదం నుండి వాహనంలోని డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, టెంకాయలు రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తగా పోలీసులు స్పందించి రెండు క్రేన్లతో లారీని యధాతథ స్థితిలోకి తెచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
పైపులైన్ పనులను అడ్డుకున్న బీజేపీ నేతలు
చక్రాయపేట : కుప్పంకు తాగునీటి కోసం తవ్వుతున్న పైపులైన్ పనులను బుధవారం బీజేపీ నేతలు అడ్డుకున్నారు. రైతుల అనుమతి లేకుండా వారికి పరిహారం చెల్లించకుండా వారి పట్టా భూముల్లో ఎలా పనులు చేస్తారంటూ మండి పడ్డారు. కుప్పంకు తాగునీటి కోసం పైపులైను కోసం తవ్వుతున్న కాలువపై సాక్షిలో ‘కుప్పంకు తాగునీరట.. చట్టాలను ఒప్పుకోరట’ అనే కథనం వెలువడింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్లు ఆపార్టీ నాయకులు రైతులతో కలసి పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈసందర్భంగా భూసేకరణ చేయకుండా.. రైతులకు తెలియ కుండా దౌర్జన్యంగా పట్టా భూముల్లో ఎలా పైపులైన్ కోసం కాలువ తవ్వుతారని మండి పడ్డారు. అనంతరం వారు తహశీల్దారు విజయకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సుమారు 85 శాతం మేర పనులు పూర్తయి అర్ధాంతరంగా ఆగిపోయిన మండలంలోని కాలేటి వాగు ప్రాజక్టు పనులు పూర్తి చేయక పోవడం దారుణమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు దశరథ రాయల్, సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి వేమారెడ్డి, రామ చంద్రా రెడ్డి, ఉమామహేశ్వరి, రైతులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం : మండల పరిధిలోని జి. అప్పాయపల్లెకు చెందిన బోదం వెంకట సోమిరెడ్డి(54) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం రోజూ లాగే సోమిరెడ్డి పొలానికి, ఆయన భార్య చంద్రావతి ఉపాధి పనులకు వెళ్లారు. అయితే ఏమి జరిగిందో ఏమో సోమిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకునే సమయంలో హైదరాబాద్లో ఉన్న తన మేనల్లుడుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అతడు ఈ విషయం బంధువుల ద్వారా మృతుని భార్యకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. బంధువులు, స్థానికులు కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వ్యవసాయం చేసుకుంటూ భార్య భర్తలు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారని, ఇలా ఎందుకు చేశాడోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మృతుని పెద్ద కుమారుడు లండన్లో, చిన్న కుమారుడు విజయవాడలో ఉన్నత చదువులు చదువుతున్నారు. సోమిరెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
టీడీపీ నేత కనుసన్నల్లో జూదశాల
బద్వేలు అర్బన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రమార్గంలో ఉపయోగిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఒక ఘరానా హైటెక్ జూదశాల గుట్టును వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అర్బన్ పోలీసులు రట్టు చేశారు. అయితే బుధవారం పోలీసులు వెలుగులోకి తెచ్చిన ఈ తెలుగుగంగ కాలనీ రోడ్డులోని జూదగృహం వెనుక స్థానిక అధికార పార్టీ రాజకీయ హస్తం ఉండటం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు శ్రీకాంత్ ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ టీడీపీ నాయకుడని, కొన్ని నెలల క్రితం వరకు సదరు పార్టీ ముఖ్యనేతకు అత్యంత ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడని తేలింది. అంతేకాకుండా ఇతను బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో రౌడీషీటర్గా కూడా నమోదై ఉన్నాడు. రాజకీయ అండతోనే అక్రమ సామ్రాజ్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతోనే శ్రీకాంత్ తన ఇంట్లో ఏకంగా అక్రమ జూదసామ్రాజ్యాన్ని సృష్టించినట్లు స్థానికంగా బలంగా ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే జూదరుల కోసం ఈ జూదశాలలో మందు, విందు వంటి అన్నీ సౌకర్యాలను అక్కడే అందుబాటులో ఉంచి.. ఒక మినీ క్లబ్ను తలపించేలా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైన్షాపుల నుండి పెద్ద ఎత్తున మద్యం, బీరు బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడకు వచ్చే వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కువైట్ డివైజ్లతో ఘరానా మోసం మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు కువైట్ నుండి ఆన్లైన్ ద్వారా ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్లు, బ్లూటూత్ పరికరాలు, డిజిటల్ ఇయర్ఫోన్లు కొనుగోలు చేశారు. జూదం కోసం ప్రత్యేక కోడింగ్ ఉన్న పేకముక్కలను తెప్పించారు. ఆట ప్రారంభానికి ముందే పేకముక్కలను ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్ ద్వారా స్కాన్ చేసి, ఆట సమయంలో ఏ పేకముక్క లోపల పడుతుందో, ఏది బయట పడుతుందో డిజిటల్ ఇయర్ఫోన్ల ద్వారా ముందే తెలుసుకునేవారు. ఇలా ’మంగతాయి’ (లోపల–బయట) జూదం ఆడడానికి వచ్చే అమాయకులను పక్కా ప్లాన్ తో మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకునేవారు. 9 మంది అరెస్ట్.. రూ.40,500 స్వాధీనం విశ్వసనీయ సమాచారంతో బద్వేలు అర్బన్ ఎస్ఐలు యు.వై.జయరాములు, ఎం.రంగారావు తమ సిబ్బందితో సదరు ఇంటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు పుంగునూరు శ్రీకాంత్తో పాటు షేక్ అబీద్, నూతి శ్రీను, పాల వెంకటరమణ, నారుబోయిన సాంబయ్య, చిలుమూరు శివారెడ్డి, మాబు రసూల్, పుంగనూరు రామకృష్ణ, ఉండ్రా హరిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.40,500 నగదు, మూడు ఐఫోన్ మోడల్ స్కానింగ్ పరికరాలు, మూడు డిజిటల్ ఇయర్ ఫోన్లు, రెండు బ్లూటూత్ పరికరాలు, పేకముక్కలతో పాటు 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టు కున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మినీ క్లబ్ను తలపించేలా ఏర్పాట్లు కేసులో ప్రధాన నిందితుడు అర్బన్ పోలీస్ స్టేషన్ రౌడీషీటర్ పుంగనూరు శ్రీకాంత్ అధికార అండదండలతోనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ జూదగృహం ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్లతో ఘరానా మోసం.. 9 మంది ముఠా సభ్యుల అరెస్ట్ -
పోలీస్ కొలువులు పెంచాలి
● కానిస్టేబుల్, ఎస్ఐ ఖాళీలను 11,000కు పెంచాలని డిమాండ్ ● వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలని కలెక్టరేట్లో వినతి కడప అర్బన్: రాబోయే జాబ్ క్యాలెండర్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కేవలం 2,000 మాత్రమే భర్తీ చేస్తామనడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ మండిపడింది. ఈ నిర్ణయానికి నిరసనగా బుధవారం కడప మహావీర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఉబ్బరపు అబెల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత దృష్ట్యా 11,000 పోస్టులు భర్తీ చేయాలని గతంలో డీజీపీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మేరకు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను 11,000కు పెంచి, అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్న్స్ అండ్ ఎన్న్ఫోర్స్మెంట్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎస్పి–ఎన్సీ)గా ఎన్. వెంకట రామాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప కో–ఆపరేటివ్ కాలనీలో జిల్లా రీజనల్ విజిలెన్న్స్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. పదోన్నతిపై ఆయన కడప విజిలెన్న్స్ అండ్ ఎన్న్ఫోర్స్మెంట్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. పల్నాడు జిల్లాకు చెందిన ఈయన 2012 గ్రూప్–1 పరీక్షలో విజయం సాధించి డీఎస్పీగా పోస్టింగ్ పొందారు. డీఎస్పీగా కదిరి, అనంతపురం, మార్కాపురం, చిత్తూరులో పనిచేశారు. 2021లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పనిచేశారు. అక్కడనుండి రాజ్భవన్లో గవర్నర్ ఏడీసీగా పనిచేస్తుండగా ఎస్పీగా (నాన్ క్యాడర్ ఐపీఎస్) పదోన్నతి పొందారు. కడప విజిలెన్న్స్కు బదిలీపై వచ్చారు. బైక్ అదుపు తప్పి యువకుడు దుర్మరణం ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని తాళ్లమాపురం క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగడి ప్రసన్నకుమార్ (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ కడపలోని డిక్సన్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను ప్రొద్దుటూరుకు వెళ్లే క్రమంలో తాళ్లమాపురం క్రాస్ రోడ్డు సమీపంలోని ఎస్సీ కాలనీ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ల వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం : తమ కుమారుడి మృతికి స్పీడ్ బ్రేకర్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన కారణమని ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేబుల్ తీగల చోరీసదుం : బోరు కేబుల్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. ఊటుపల్లె పంచాయతీ తుమ్మగుంటపల్లె సమీపంలోని పొలాల వద్ద రమణయ్య, కృష్ణయ్య, జనార్ధన, బసవయ్య, అశోక్, నాగలక్ష్మీ, రెడ్డెప్ప తదితరులకు చెందిన మోటర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు చెప్పారు. -
నాయకుల మాటలు విన్నాం.. నట్టేట మునిగాం
సోలార్ కంపెనీ వస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని భూములు ఇచ్చిన రైతులు ఆనందపడ్డారు. తీరా చూస్తే ఉద్యోగాలు లేవు. పైగా ఇచ్చిన ఉద్యోగాలు కసువు ఎత్తడం లాంటివి. ఎక్కడ నుంచో వచ్చిన వారికి ఏసీ గదుల్లో కూర్చొనే ఉద్యోగావకాశాలు కల్పించారంటూ భూములిచ్చిన రైతులు నిరసనకు దిగారు. పరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల మాటలు విని మోసపోయాం అంటూ మండిపడుతున్నారు. జమ్మలమడుగు : సోలార్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. సేల్ కంపెనీ యాజమాన్యం భూమి లీజుకు తీసుకోవటానికి, భూములు అమ్మకం చేసే రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేయటానికి భూసేకరణ టీంను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం భూసేకరణ పూర్తి చేసుకుని మొత్తం భూముల్లో సోలార్ ప్యానల్స్ బిగించుకున్నారు. రైతుల భూములను సేకరించుకున్న పరిశ్రమ యాజమాన్యం మొత్తం భూముల చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని తమ పనులు చేసుకుంటున్నారు. పరిశ్రమ వద్దకు వెళ్లి తమ వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరితే అది మాకు సంబంధం లేదంటూ పరిపాలనకు సంబంధించిన సెక్టార్లో చెబుతున్నారు. భూములు సేకరించిన టీంను ప్రశ్నిస్తే తాము భూములను సేకరించేవారమే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం మా చేతిలో లేదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకువస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగుల గొడితేనే వారు వస్తారని మా నాయకులు అంటున్నారు.. పనిపూర్తి అయిన తర్వాత తమ బాధలను సేల్ కంపెనీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే జమ్మలమడుగు నుంచి మా ఆఫీసర్ వస్తాడు తర్వాత మాట్లాడుకోండి..అని అంటున్నారని , ఆ అధికారి ఏసీ రూముల్లో కూర్చొని తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని తమ గ్రామ నాయకులను చెప్పి న్యాయం చేయాలని అడిగితే సేల్ కంపెనీ యాజమాన్యానికి మా ఎమ్మెల్యే అన్నా కూడా లెక్కలేకుండాపోయిందని.. ముందు మీరు కంపెనీ ఫెన్సింగ్ పగులగొట్టండి తర్వాత యాజమాన్యం వారు వస్తారు.. అప్పుడు మాట్లాడదాం అని చెబుతున్నారని రైతులు అంటున్నారు. సేల్ కంపెనీ భూములను లీజుకు తీసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంలేదు. పరిహారంకు సంబంధించిన చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్ అయిపోయాయని .. మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు సిద్ధమైన రైతులు.. సేల్ కంపెనీ చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు పెద్దముడియం మండలం కల్వటాల, పాపాయపల్లె, నంద్యాల జిల్లాకు సంబంధించిన గోవిందపల్లె గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. వారికి న్యాయం జరగకపోవడంతో బుధవారం రైతులు సేల్ కంపెనీ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సేల్ కంపెనీ రైతుల సమస్యలను పట్టించుకునే వరకు ఆందోళన చేస్తామని పిలుపునిచ్చారు. సేల్ కంపెనీ రైతుల వద్దనుంచి బలవంతంగా భూసేకరణ చేసి మోసం చేస్తోందంటూ అప్పట్లో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. అప్పుడు కూటమి నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి నాయకులే ముందుకు వచ్చి సేల్ కంపెనీ చేస్తున్న మోసాలు తెలుసుకుని ఇప్పుడు ధర్నాకు సన్నద్ధం అవుతున్నారు.


