YSR District News
-
ఆదివారం
సత్యమేవ జయతేశాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం 3-5-2026ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం మూలవిరాట్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకు లు వీణా రాఘవాచార్యులు పట్టువస్త్రా లు, పూలతో మూల విరాట్లను అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. –ఒంటిమిట్టwww.sakshi.com‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’ -
● టీచర్ల స్థలాలు కొట్టేసే పన్నాగం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మీకు అండగా మేముంటాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. న్యాయం చేస్తాం. మహానాడు నిర్వహణకు అడ్డుచెప్పొద్దు’.. సరిగ్గా ఏడాది క్రితం టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ నేతలతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అన్న మాటలివి. ఆపై సీఎం చంద్రబాబుతో హామీ ఇప్పించారు. శాలువాలతో సన్మానం చేయించారు. స్వయంగా కలెక్టర్ పర్యవేక్షించి టీచర్లకు ప్లాట్స్ కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇంత చెప్పినా టీచర్లు హైరానా పడ్డారు. ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అయ్యవార్లు కుయ్యో.. మొర్రో ప్లాట్స్ అప్పగించండంటూ వేడుకుంటున్నా కనికరం చూపెట్టడం లేదు. హామీ ఇచ్చిన కలెక్టర్ పట్టించుకోవడమే మానేశారు. ● 1989లో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.. కాలక్రమేపి రింగ్రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో తమ సమ్మతి లేకుండా కొనుగోలు చేశారని శోత్రియందారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నకిలీ రైత్వారీ పట్టాలు పుట్టుకొచ్చాయి. వెబ్ ల్యాండ్లో లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలుగు తమ్ముళ్లు నమ్మబలికారు. సరిగ్గా గత ఏడాది ఇదే మే నెలలో హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై ఆ స్థలంలో మహానాడు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అప్పటికే ఏర్పాటు చేసుకున్న ప్లాట్స్ నంబర్ రాళ్లు తొలగించి చదును చేసి చక్కబెట్టుకున్నారు. టీచర్ల పట్ల లోపించిన చిత్తశుద్ధి టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్ ప్లాట్స్ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్ ప్లాట్స్ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్ వరకూ అందరూ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించి టీచర్లకు ప్లాట్స్ అప్పగించడంలో తెలుగు తమ్ముళ్లకు చిత్తశుద్ధి లోపించింది. మహానాడు నిర్వహణకు సహకారం కోసం అనేక మాటలు చెప్పిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు దాటవేస్తున్నారు. హద్దులు చెరిపేసి మహానాడు నిర్వహణ ఏడాది అవుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్య సీఎం హామీ ఇచ్చినా నెరవేర్చని వైనం ఆందోళనలో అయ్యవార్లు టీచర్లు హౌస్ బిల్డింగ్ సొసైటీ, శోత్రియందారుల మధ్య ఉన్న విభేదాలు ఆసరాగా చేసుకొని తెలుగు తమ్ముళ్లు కొంత స్థలాన్ని కొట్టేసే పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాల్లో తగ్గించి కొత్తగా ప్లాట్స్ వేసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వులను సైతం పరిగణనలోకి తీసుకోకుండా చెప్పినట్లు వింటే సరే, లేదంటే మీ ఇష్టం అన్నట్లుగా టీచర్ల ప్రతినిధులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం చేయించిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు వితండవాదం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. -
అన్నమయ్య కీర్తనలకు తెలుగు సాహిత్యంలో విశేషస్థానం
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలకు తెలుగుసాహిత్యంలో విశేషస్థానం ఉంటుందని రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్యుల జయంత్యుత్సవాల సందర్భంగా తాళ్లపాకలోని అన్నమయ్య విగ్రహమూర్తికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్యుని కీర్తనలు తెలుగుసంస్కృతికి ప్రతి రూపాలన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు స్వర్ణయుగమనే చెప్పవచ్చునన్నారు. దివంగత సీఎం వెఎస్సార్ తాళ్లపాకను సందర్శించారన్నారు. అలాగే అన్నమయ్య వంశీకుల సంక్షేమానికి వైఎస్ఆర్ కృషి మరిచిపోలేనిదన్నారు. ఇప్పటికి ఆ సంప్రదాయం కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నమయ్య ఉద్యానవనంలో శ్రీవారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అలాగే టీటీడీ పాలకలమండలి తాళ్లపాకలో అన్నమయ్య ధాన్యమందిరం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారన్నారు. 2029లో వైఎస్జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అందుకు ఆ దేవదేవుని ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు డీలరు సుబ్బరామిరెడ్డి, దండుగోపి, దాసరి పెంచలయ్య,, శేఖర్, తాళ్లపాకకు చెందిన గ్రామస్తులు ఉద్దండం సుబ్రమణ్యం తదితర పెద్దలు పాల్గొన్నారు ● తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం టీటీడీ వారు ఎమ్మెల్యేను సన్మానించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి -
6న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప జయనగర్ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 6న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు 2010 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఎంపికై న క్రీడాకారులు జూన్ మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలల్లో పాల్గొంటారని తెలిపారు. కడప అగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) నూతన కో–ఆర్డినేటర్ (అధిపతి)గా డాక్టర్ శిల్పకళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కో–ఆర్డినేటర్గా పనిచేస్తున్న అంకయ్యకుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శిల్పకళకు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లా రైతులకు అధునిక వ్యవసాయ పద్దతులకు సంబంధించి శిక్షణలు అందిస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తానని తెలిపారు. డాక్టర్ శిల్పకళకు శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మియట్ విద్యలో భాగంగా నాన్ టిచింగ్ సిబ్బందికి శనివారం కడపలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడప కర్నూల్, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి నాన్ టీచింగ్ సిబ్బందికి ఆర్జేడీ సురేష్కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. కర్నూల్ జిల్లాలో ముగ్గురికి, అనంతపురం జిల్లాలో ఒకటిరికి, వైఎస్సార్కడప జిల్లాలో ఇద్దరికి పదోన్నతులు లబించాయి. కార్యక్రమంలో నాన్టిచింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరాజు, వైఎస్సార్కడప జిల్లా అధ్యక్షులు సురేష్, ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 30 మందికి పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్ను శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య నిర్వహించారు. వీరికి పంచాయతీ గ్రేడ్–5 సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ (పీటీడీ) అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడప జోనల్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జోనల్ కమిటీ అధ్యక్షుడిగా ఎంఎండీ హనీఫ్, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, జోనల్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా విజయ్, జోనల్ కార్యదర్శిగా శివశంకర్, జోనల్ జాయింట్ సెక్రటరీగా సోమశేఖర్రెడ్డి, జోనల్ కార్యదర్శిగా పవన్కుమార్, జోనల్ ప్రచార కార్యదర్శిగా నరేష్, జోనల్ అసిస్టెంట్ సెక్రటరీగా ఎస్.శ్యామల, జోనల్ అసిస్టెంట్ కార్యదర్శిగా శరవణకుమార్, జోనల్ అసిస్టెంట్ కార్యదర్శిగా రాంబాబు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ అధ్యక్షతన కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ను కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు, జిల్లా కార్యదర్శి స్టీఫెన్ ఆంటోని, చెప్పలయ్య, రాయుడు, నరసింహ, జిల్లా మహిళా నాయకురాలు ప్రభావతి, రజని తదితరులు పాల్గొన్నారు. -
చెరువు కబ్జాలను తొలగించండి
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నందలూరు: మండలంలోని చెరువుల కబ్జాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తహసీల్దార్ శివలక్ష్మీకి సూచించారు. శనివారం జలధార– జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని లేబాక చెరువును, ఆడపూరు గ్రామ పంచాయతీ మర్రిపల్లెలోని లేబాక చెరువుకు నీరందించే కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార జలభద్రతలో భాగంగా మొదటి విడతలోనే లేబాకచెరువు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత క్లస్టర్ భవనం సందర్శన సిద్దవటం: మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్లో ఉన్న చేనేత క్లస్టర్ భవనాన్ని శనివారం కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సందర్శించారు. ప్యాషన్ డిజైన్లను ఎలా చేయిస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒరిజినల్ మగ్గాలపై క్లాత్ తయారు చేసుకుని డిజైన్ వేయించి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ డయింగ్ హౌస్ను పరిశీలించారు. డయింగ్ హౌస్ను మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీ పిచ్చేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మీ, హౌసింగ్ పీడీ రాజారత్నం, ఏడీఓలు రవిప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉగ్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్సాఆర్ టీచర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శనివారం వైఎస్సార్టీఏ నాయకులలతో కలిసి కడపలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. పీఆర్సీ కమిషన్ను ఏర్పాటులో ఆలసత్వం చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు తోపాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్టీఏ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు 6వ తేదీ నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ అసోసియేట్ కార్యదర్శి ఎస్వీ రమణారెడ్డి, జిల్లా సలహాదారు రమేష్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ మోహిద్దీన్, అన్నమయ్య జిల్ల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వేంపల్లె అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి ఇబ్రహీం, చక్రాయపేట అధ్యక్షుడు పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి -
తిరుమల ప్రయాణం తికమక!
రాజంపేట: విశాఖ–కడప మధ్య నడిచే తిరుమల (18521/18522)ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం తికమకగా మారింది. తిరుమల ఎక్స్ప్రెస్గా గుంతకల్ జంక్షన్ వరకు పొడిగిస్తూ సౌత్సెంట్రల్ రైల్వే ఇటీవల ఉత్తర్వులు విడుదలచేసింది. ప్రస్తుతం కడప వరకు నడుస్తున్న ఈ రైలును కడప నుంచి గుంతకల్ వరకు ప్యాసింజర్గా నడిపించారు. కొంతకాలం కడప వరకు నడిపించి నీటి కోసం కొండాపురం వరకు ఖాళీగా తిప్పారు. మళ్లీ కడప నుంచి గుంతకల్ ప్యాసింజర్ గా తిప్పారు. ఇలా తిరుమల రైలుపై అనేక ప్రయోగాలు చేశారు. దీంతో ప్రయాణికులు సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. మే 13 నుంచి.. ఎక్స్ప్రెస్గా గుంతకల్ జంక్షన్కు నడిపించే విధంగా మే 13 నుంచి పొడిగించేశారు. ఎర్రగుంట్ల, నంద్యాల,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంకు దగ్గరి మార్గం కడప నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా మారనుంది. బెర్త్లు దొరకాలంటే.. తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో జిల్లా వాసులకు ప్రయాణం కష్టతరంగా మారింది. కడప నుంచి ఉన్నప్పుడే బెర్త్లు లభ్యంకావాలన్నా.జనరల్బోగీలో ప్రయాణం చేయాలన్నా ఇబ్బందుల పడాల్సి వచ్చేదని ప్రయాణికులు చెబతున్నారు. ఇప్పుడు గుంతకల్ జంక్షన్ నుంచి బెర్త్లు దొరకడం గురించి చెప్పనక్కర్లేదు. రెండు నెలల ముందు నుంచి రిజర్వేషన్ చేసుకుంటే వెయిటింగ్లిస్ట్ చాంతడంతా ఉంటుంది. తిరుమలలో ప్రయాణం భారమనే భావనలు జిల్లా వాసుల్లో నెలకొన్నాయి. కడప–గుంతకల్ ప్యాసింజర్కు మంగళం ఎక్స్ప్రెస్గా మళ్లీ గుంతకల్కు పొడింపు -
నేడు నీట్ ప్రవేశ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈనెల 3వ తేదీ నిర్వహించనున్న జాతీయస్థాయి ఆర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 22952 మంది విద్యార్థులకు కడపలో 8, పొద్దుటూరులో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంబంధిత పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 11 నుంచి మధ్యాహ్నం 1.40 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తోపాటు బయోమెట్రిక్ తీసుకుంటారు. 1.30 తరువాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. 1.50కి బుక్లెట్ను అందజేస్తారు. 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి... ప్రింటవుట్ అడ్మిట్కార్డు, నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్టు సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరో పాస్పోర్టు సైజు ఫొటోను పరీక్ష కేంద్రంలో హాజరు నమోదు చేసే సమయంలో ఆటెండెన్స్ షీట్పై అతికించాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ● కడపలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం నీట్ సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మునీష్మీనా, డిప్యూటీ సిటీ కో–ఆర్డినేటర్ మల్లికార్జునలు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కడప అర్బన్: నీట్ పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రం హాజరయ్యే విద్యార్థులు కడపలో... ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల 360 గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల 360 మున్సిపల్ హైస్కూల్ మెయిన్ 360 పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 240 బీఆర్ అంబేడ్కర్ గురుకులం 240 వైఆర్జెడ్పీహెచ్ స్కూల్ గర్ల్స్ 240 గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఫర్ ఉమెన్ 240 గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ 240 ప్రొద్దురూరులో... వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల 384 ఏపీ ఎంపిల్ హైస్కూల్ మెయిన్ 288 ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రదారణపై ఎన్టీఏ అంక్షలు విధించింది, విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఆభరణాలను ధరించరాదు, చేతికి వాచీలు సైతం ధరించకూడదు, విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే హాజరుకావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు సన్గ్లాస్ ధరించకూడదు బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, పెన్నులు సహా ఇతర వస్తువులు వెంట తీసురాకూడదు, -
అశ్వ వాహనంపై ఊరేగిన అగస్త్యేశ్వరస్వామి
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. దీక్షా మంటప పూజలు, గణపతి, నవగ్రహ, రుద్రహోమం, దీక్షాహోమాలను వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు త్రిశూల స్నానం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం గంగాగౌరి సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. -
● దెబ్బతిన్న పంటల వివరాలు...
కడప అగ్రికల్చర్: రైతన్న కష్టం నేలపాలైంది.. చేతికొచ్చిన పంట చూస్తుండగానే ఈదురుగాలులకు నేలమట్టమైంది. కర్షకుడి ఏడాది కష్టంపై అకాల వర్షం నీళ్లు చల్లింది. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలో వీచిన భారీ గాలులు, అకాల వర్షాలతో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా మామిడి, అరటి, బొప్పాయి, నారింజ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలకు రూ. 179.35 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో.. జిల్లాలో వీచిన ఈదురు గాలులు, అకాల వర్షాలకు లింగాల, పులివెందుల, చక్రాయపేట, దువ్వూరు, రాజంపేట మండలాల్లో 484 హెక్టార్లలో అరటి, 9 హెక్టార్లలో బొప్పాయి, 12 హెక్టార్లలో మామిడి, 10 హెక్టార్లలో నారింజ (స్వీట్ ఆరంజ్) ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పులివెందుల: ఈదురు గాలులకు జిల్లాలో అరటి, మామిడి పంట లు దెబ్బతిన్నాయని.. ఉద్యాన రైతులను ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు జరిగిన నష్టంపై కలెక్టర్ శ్రీధర్కు తెలియజేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున వెంటనే నష్టపరిహా రం అందించాలన్నారు. త్వరితగతిన పంట నష్టం తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పంట నష్టం అంచనాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎంపీకి వివరించారు. పులివెందుల: నల్లపరెడ్డిపల్లెలో నేలకూలిన అరటి అకాలవర్షాలు, ఈదురుగాలులకునేలకొరిగిన ఉద్యాన పంటలు అరటి, మామిడి, బొప్పాయి,నారింజ పంటలకు తీవ్ర నష్టం 490 మంది రైతులకు 515 హెక్టార్లలో పంటనష్టం ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసిన ఉద్యానశాఖ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
● మరొకరికి తీవ్రంగా గాయాలు ● రోడ్డు పక్కన నిలుచొని ఉండగా దూసుకెళ్లిన ట్రాక్టర్ ప్రొద్దుటూరు క్రైం : స్థానిక కొత్తపల్లె బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాలిష్ బండల కటింగ్ పని చేసుకునే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ట్రాక్టర్ వారిపై దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రికి చెందిన ఆకుమల్ల షరీఫ్(22), దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లె గ్రామానికి చెందిన అందె నరసింహులు (15) అక్కడిక్కడే మృతి చెందగా చాగలమర్రి మండలంలోని చిన్నవంగలికి చెందిన మేసీ్త్ర ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇమాంఖాసీం పాలిష్ బండల కటింగ్ పని చేస్తుంటాడు. షరీఫ్తోపాటు కృష్ణంపల్లెకు చెందిన బాలుడు ఇమాంఖాషీం వద్దకు పనికి వెళ్తుంటారు. వీళ్లు ముగ్గురు కొన్ని రోజుల నుంచి ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డు, శ్రీనివాసనగర్లో పని చేస్తున్నారు. ప్రతి రోజు బైక్లో ప్రొద్దుటూరుకు వచ్చి రాత్రికి వారి గ్రామాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో పని ముగించుకొని శుక్రవారం రాత్రి ముగ్గురూ బైక్లో బయలుదేరారు. కొత్తపల్లె బైపాస్ గుండా చాగలమర్రికి వెవెళ్తూ శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద బైక్ ఆపారు. ముగ్గురూ రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ట్రాక్టర్ వేగంగా వచ్చి వారిపై దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో షరీఫ్, నరసింహులు దుర్మరణం చెందగా, మేసీ్త్ర ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న షరీఫ్, నరసింహులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు విలపించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సర్వేల్లోనే కొత్త రైల్వేలైన్లు
● మొన్న ముదిగుబ్బ–ముద్దనూరు ● తాజాగా రాయచోటి–కదిరి ● కదలికలేని కడప–బెంగళూరు మార్గం రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాలో కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. దశాబ్దాలుగా కేంద్రంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వా ల ఏలుబడిలో కొత్త లైన్లు సర్వేల్లోనే ఆగిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ ముదిగుబ్బ–ముద్దనూరు రైల్వేలైన్ను తీసుకొచ్చారు. 2025–2026 బడ్జెట్లో 75 కి.మీ దూరం ఉన్న ఈ లైన్కు సర్వే కింద రూ.16 లక్షలు కేటాయించిన సంగతి తెలిసిందే. 110 కి.మీ దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం లైన్కు రూ.2.75కోట్ల ఫైనల్ లోకేషన్ సర్వేకు కేటాయించారు. అయితే ఈ రెండు లైన్ల పురోగతి లేదు. కడప–బెంగళూరు ముందుకెళ్లేదెపుడో.. దివగంత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక కడప – బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2010 సెప్టెంబర్లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప దీనికి శ్రీకారం చుట్టారు. ఈ రైలుమార్గానికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణపనులు కదిలాయి. 258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఐదేళ్లు కాదు కదా.. 15ఏళ్లు దాటిపోయేలా కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. కడప–బెంగళూరు రైలుమార్గం నాలుగుఫేజ్ల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వే నిర్ణయించుకుంది. మొదటి దశలో రూ.153 కోట్ల్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20 కోట్లు రైల్వే వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. పెండ్లిమర్రి లైన్ వేశారు. అక్కడితో లైన్ ఆగిపోయింది. దీని పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వకపోగా తాజాగా రాయచోటి–హిందుపురం లైన్ తీసుకొచ్చారు. దీంతో కడప–బెంగళూరు రైలుమార్గం ఇక అంతేనా.. అన్నమానాలు రాయచోటి వాసుల్లో నెలకొన్నాయి. ఎంపీ మిథున్రెడ్డి కృషి కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం కోసం ఎంపీ మిథున్రెడ్డి పట్టుబట్టారు. లోక్సభలో ఈ అంశంపై ప్రశ్నించారు. రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ క్రమంలో ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదు. ఈ లైన్ నిర్మాణానికి రైల్వేమంత్రి ముందుకువచ్చే అవకాశాలు కనిపించలేదు. పుంగనూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల మీదుగా వెళ్లే ఈ రైలుమార్గం త్వరితగతిన పూర్తికావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ ప్రకాశం జిల్లా కంభం–జిల్లాలోని ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వేకు పరిమితమైంది. ప్రతిపాదనతో ఊరిస్తోంది. 2023–2024లో కోటిరూపాయిలు కేటాయించారు. కంభం రైల్వేస్టేషన్ గుంటూరు–నంద్యాల మార్గంలో ఉంది. ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో ప్రొద్దుటూరు ఉంది. ఈ రైల్వేలైన్ పట్టాలు ఎక్కలేదు. 2009–2010లో లైన్ సర్వే చేశారు. 142 కి.మీ లైన్కు రూ.900 కోట్లు అంచనా వ్యయం చేశారు. 2013–2024లో రైల్వే ఈలైన్పై దృష్టి సారించారు. ఎన్డీఏ ప్రభుత్వలో దీనిని పక్కనపెట్టేశారు. కలగానే గిద్దలూరు–భాకరాపేట యూపీఏ ప్రభుత్వంతోనే భాకరాపేట–గిద్దలూరు(ప్రకాశం) లైన్ నిర్మాణం కాలగర్భంలో కలిసిపోయిందనే విమర్శలున్నాయి. ఈలైన్ సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు మీదుగా వెళ్లేలా సర్వే రూపొందించారు. 150 కిలోమీటర్ మేర లైన్ ఉంటుంది. పదేళ్ల క్రితం ప్రాథమికంగా ఇంజినీరింగ్ కమ్ సర్వే నిర్వహించారు. అప్పట్లో సర్వేకు రూ.కోటి కేటాయించారు. ఈలైన్ ఇప్పుడు అతీగతీ లేదని బద్వేలు ప్రాంతవాసులు పెదవివిరిస్తున్నారు. కడప జిల్లాలో పెండ్లిమర్రి వరకు నిలిచిపోయిన కడప–బెంగళూరు రైలుమార్గం రైల్వేమంత్రి వైష్ణవ్కు వినతి పత్రం ఇస్తున్న ఎంపీ మిథున్రెడ్డి(ఫైల్) -
జానపదానికి జ్ఞానపథం
తెలుగుపదానికి జన్మదినం.. రాజంపేట: అదివో అల్లదివో అంటూ.. ఆ ఏడుకొండలవాడిపై అద్భుత కీర్తనలు రాసి ఆలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. ఒకటా రెండా 32 వేల సంకీర్తనలు ఆలపించి పదకవితాపితామహుడిగా ఖ్యాతిగాంచిన అన్నమయ్య జన్మదినం నిజంగా తెలుగుపదానికి జన్మదినమే. జానపదానికి జ్ఞానపథమే. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిచనున్నారు. ఉత్సవాల వివరాలు ● ఈ నెల 2 నుంచి 8వరకు అన్నమయ్య జయంత్యుత్సవాలు నిర్వహణ ● తాళ్లపాక, అన్నమయ్య 108 విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. ● 2న తాళ్లపాకలో అన్నమయ్య ధాన్యమందిరం వద్ద ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం అన్నమయ్య థీంపార్కు ఊంజల్సేవ నిర్వహిస్తారు. తాళ్లపాకలో వంశీయులలో ఒకరైన తాళ్లపాక మీన లోచన బృందం చే సంగతీ సభను కూడా నిర్వహిస్తున్నారు. తాళ్లపాక వంశీయులు వీరే.. తాళ్లపాక నాగభూషణం, తాళ్లపాక కుప్పరాఘవన్, తాళ్లపాక హరినారాయణచార్యులు, శేషధర రవికుమార్, శ్రీరాంకుమార్, రాఘవ అన్నమాచార్యులు. వీరిని శనివారం టీటీడీ అధికారులు సన్మానించనున్నారు. నేటి నుంచి అన్నమయ్య 618 జయంత్యుత్సవాలు తాళ్లపాకలోనేడు శ్రీవారి కల్యాణం -
పిడుగు పాటుకు రెండు బర్రెలు మృతి
చక్రాయపేట : మండలంలోని చిలేకాంపల్లె దళితవాడలో గురువారం రాత్రి పిడుగు పడి రెండు బర్రెలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు లక్ష పైనే ఉంటుందని బాధితుడు పారి చిన్నబ్బి వాపోయాడు. బర్రెలను చెట్టుకు కట్టేశామని, గాలివానతోపాటు పెద్ద ఎత్తున ఉరుములు రావడంతో తాము భయంతో ఇంటిలోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రెండు బర్రెలు అక్కడికక్కడే చనిపోయాయని చెప్పాడు. ఈ విషయాన్ని పశువైద్యాధికారితోపాటు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధిత రైతు తెలిపారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజన్న సర్కిల్ వద్ద దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వెంకటసుబ్బారెడ్డి(23) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 47 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు రిమ్స్ పి.ఎస్ సి.ఐ రాజగోపాల్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించవచ్చని డీఎస్డీవో షేక్ గౌస్బాషా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో 2026 వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులు ఈ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ జిలానీ బాషా, రాష్ట్ర పీఈటీ అండర్ పీడీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
భళా.. బాలికా!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల్లో ఫలితాల్లో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) బాలికలు మెరిశారు. జిల్లావ్యాప్తంగా 17 కేజీబీవీలు ఉండగా వాటిల్లో నుంచి 656 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 596 మంది పాసై 90.85 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఇందులో రెండు కేజీబీవీలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. వైఎస్సార్ కళ... నెరవేరిన వేళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయం నెరవేరింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలికలు, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించని నిరుపేద బాలికల కోసం 2005లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలు)ఏర్పాటు చేశారు. నేడు ఎంతో మంది విద్యార్థులు బాగా చదివి విద్యావంతులై తమ ప్రతిభను చాటుతూ భళా అనిపిస్తున్నా రు. ఈ విద్యాలయాలు సాధారణ విద్యతోపాటు ఆంగ్లమాధ్యమం, యోగా, క్రీడలతోపాటు వృత్తి విద్యాకోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలికలకు చదువులతోపాటు బతుకుదెరువుకు భరోసానిస్తున్నాయి. దీంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు– నేడు మనబడి కార్యక్రమం ద్వారా కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలను కల్పించారు. అలాగే పదవ తరగతి తర్వాత వారు డ్రాపౌట్స్గా మారేందుకు వీలులేకుండా అదే కేవీజీబీలలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశ పెట్టి వైఎస్ జగన్ మరో అడుగు మందుకు వేశారు. కేజీబీవీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ టాపర్స్ వీరే... జిల్లాలోని 17 కేజీబీవీలకు గాను పెండ్లిమర్రి కేజీబీవీకి చెందిన టి. శివజ్యోతి 585 మార్కులు సాధించి కేజీబీవీల ప్రథమస్థానం(టాపర్గా)లో నిలిచింది. అలాగే పెద్దముడియం కేజీబీవీకి చెందిన సి. నాగదివ్వశ్రీ 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలువగా, మైదుకూరు కేజీబీవీకి చెందిన బి. గురుమానస 571 మార్కులు సాధించి తృతీయస్థానంలో నిలిచింది. అలాగే మరో 22 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించి తమ ప్రతిభ చాటారు. ప్రథమస్థానంలో నిలిచిన శివజ్యోతి ద్వితీయస్థానంలో నిలిచిన నాగదివ్య తృతీయస్థానంలో నిలిచిన మానస పది ఫలితాల్లో 90.85 శాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీలు 17 కేజీబీవీల్లో 656 మందికి596 మంది పాస్ -
ఆర్టీసీ ఆర్ఎం బాధ్యతల స్వీకరణ
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీ ఆర్టీసీ కడప రీజియన్ జిల్లా ప్రజా రవాణా అధికారిగా పలినేని రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం ఆర్ఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురం డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా పని చేస్తూ బదిలీపై కడపకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న ఆర్ఎం పోలిమేర గోపాల్రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్బాబును నియమించారు. ఈయన మొదట 1992లో ఆర్టీసీలో ఉద్యోగ ప్రస్థానం చేసి గద్వాల, తాడిపత్రి, పొదిలి, బద్వేలు, ఒంగోలు పీఓ, రాపూరు, తిరుపతి బస్స్టేషన్లలో ఏపీఎంగా, ఏడబ్లూఎంగా కరీంనగర్, జగ్గయ్యపేట, 2008లో జగ్గయ్యపేట డీఎంగా పని చేస్తూ 2008లో పదోన్నతిపై విజయనగరం ప్రిన్సిపల్గా పని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంఈగా మెదక్, గ్రేట్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, కర్నూలు డిప్యూటీ సీఎంఈగా, 2018లో కడపలో డిప్యూటీ సీపీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన అనంతపురం, సత్యసాయి జిల్లాల డిప్యూటీ సీఎంఈగా పని చేస్తూ బదిలీపై జిల్లా ప్రజా రవాణాధికారిగా కడపకు వచ్చారు. ఈ క్రమంలో కడప డిప్యూటీ సీఎంఈ దిల్లీశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. సీఓఎస్ హరి, జోనల్ వర్క్షాపు మేనేజర్ గిరిధర్రెడ్డి, పీఓ ధనలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ రవి, కడప డీఎం నిరంజన్రెడ్డి, కడప డీఎం ఆర్సీ నిరంజన్, సిబ్బంది రోజాకుమారి, బాబు, కమాల్, వెంకటేశ్వర్లు, మధుసూదనరావు, శివ, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కడప ఎడ్యుకేషన్ : యోగివేమన యూనివర్సిటీలో లలిత కళల విభాగం వారు ఏర్పాటు చేసిన ‘ది గోల్డెన్ త్రిషోల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను వైస్ చాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. అలాగే విద్యార్థులు చిత్రించిన ‘ఆర్ట్ కేటలాగ్’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర కళా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. పెద్ద పెద్ద కోర్సులు చేసిన వారు అతి తక్కువ వేతనాలకు పని చేస్తుంటే.. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనాలు పొందుతుండడం విశ్వవిద్యాలయం వారికి ఇచ్చిన నైపుణ్యానికి నిదర్శనం అన్నారు. ఫైన్ ఆర్ట్స్ శాఖ విభాగాధిపతి డాక్టర్ కోటా మృత్యుంజయరావు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ 10 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. చిత్ర ప్రదర్శన చేసిన 2022 –26వ బ్యాచ్ విద్యార్థులు ఎం.విజయ్ కుమార్, ఆర్.పునీత్, డి.రమ్య జ్యోతి, వై.రెడ్డి ప్రియదర్శిని, వై.అరవింద్, బి.దేవదాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.పద్మ, డీన్ ప్రొఫెసర్ ఎ.జి.దాము, ఆచార్య నజీర్ అహ్మద్, అధ్యాపకులు వెంకటేష్, చినరాయుడు, ఈరప్ప, చంటి సూరి, ఎం.వాసవి పాల్గొన్నారు. -
సురభి కళాకారులకు అపార నష్టం
● గాలివాన బీభత్సంతో సామగ్రి ధ్వంసం ● ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చక్రాయపేట : తమ నాటకాలకు పుట్టనిల్లు అయిన సురభి గ్రామంలో 141వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన సురభి కళాకారులు(భానోదయ నాట్య కళా మండలి)కు గాలి వాన బీభత్సం సృష్టించి అపార నష్టాన్ని మిగిల్చింది. ఐదు రోజుల పాటు తమ నాటకాల ద్వారా మండల వాసులను అలరింప చేయాలని వచ్చిన వారి గొంతుకలు మూగబోయాయి. గురువారం రాత్రి వారు బాలనాగమ్మ నాటకం వేస్తున్న సమయంలో ఒక్క మారుగా గాలివాన వచ్చింది. దీంతో వారు అన్ని సర్దుకోవాలనే ఆలోచన రాకమునుపే జరగకూడని నష్టం జరిగింది. నాటకానికి సంబంధించిన పరదాలు చినిగి పోయాయి. విద్యుత్ డెకరేషన్కు సంబంధించిన లైటింగ్ సిస్టం అంతా పాడై పోయింది. సంగీత వాయిద్యాలు సైతం దెబ్బతిన్నాయి. మేకప్ సామగ్రి మొత్తం గాలివానల పరమైంది. దీంతో దిక్కు తోచక వారు కన్నీటి పర్యంతం అయ్యారు. శుక్రవారం రాత్రి వరకు ప్రశాంత వాతావరణం ఉంటుందని అనుకున్న మేరకు అన్ని నాటకాలు వేద్దామను కుంటే.. ఒక్క రోజు ముందే గాలి వాన ఇబ్బంది పెట్టిందని భానోదయ నాట్య మండలి అధినేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నష్టం సుమారు 13 లక్షల వరకు ఉంటుందని కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రాణాలు కాపాడుకుంటామా లేదా అనుకునే లోపే నష్టం జరిగిందని భాను ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. సురభి(భానోదయ నాట్య కళామండలి)కళాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉన్న కళాకారుల సంక్షేమ నిధి నుంచి సాయం అందించి, తక్షణం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ, బీజీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో వైద్యం కోసం ఏప్రిల్ 30న గుర్తు తెలియని వ్యక్తి (45)ని తీసుకుని వచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మరణించారని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఎవరైనా సరే తగిన ఆధారాలతో సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
అనుగృహమెన్నడో..
కడప సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కా ఇళ్ల వ్యవహారం నత్తనడకన నడుస్తోంది. మౌలిక వసతులు కల్పించకుండా గాలికి వదిలేసింది. దీంతో లబ్ధిదారులు ఇళ్లను పూర్తి చేసుకోలేకపోతున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ. 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తేగానీ సమస్య కొలిక్కిరాదు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య వెంటాడుతోంది. దీంతో పట్టణ వాసులు ఇళ్లు మంజూరైనా అందులో చేరలేక, అద్దెలు కట్టుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. పూర్తయ్యేలోగా ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు కోర్టు మెట్లెక్కారు.గృహ నిర్మాణశాఖలో మౌలిక వసతుల సమస్య అర్బన్ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. అర్బన్ ప్రాంతాలంటే కార్పొరేషన్తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో ఈ సమస్య ఎదురవుతోంది. ఆ లేవుట్లలో బోర్లు, నీటి తొట్లు, పైపులైన్ కనెక్షన్లు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లు పూర్తి కాకుండా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్లు జిల్లా వ్యాప్తంగా అర్బన్ లే అవుట్లలో మౌలిక వసతులను పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్కు అప్పగించారు. వారు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు పనులు చేశారు. చేసిన పనులకు రూ. 7 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఎన్ని నివేదికలు అధికారులు పంపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో చివరికి చేసేదేమి లేక కోర్టు మెట్లెక్కారు. కడప 14, బద్వేలు 7, మైదుకూరు1, ప్రొద్దుటూరు 3, పులివెందుల 1 తదితర ప్రాంతాల్లో మొత్తం 25 అర్బన్ లే అవుట్లు ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన లేకపోవడం వల్ల లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు సమకూర్చాలంటే రూ.30 కోట్లు అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి రూ. 7 కోట్లు చెల్లించలేని ప్రభుత్వం మొత్తం పనులకు రూ. 30 కోట్లు చెల్లిస్తుందా? అన్న అనుమానం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. కాలనీల్లో మౌలిక వసతులు కరువు పూర్తి కావాలంటే రూ. 30 కోట్లు అవసరం ఇళ్లల్లో చేరని లబ్ధిదారులు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం -
కదం తొక్కి.. గళం విప్పి..
● పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన ● సర్కారుపై ధ్వజమెత్తిన సంఘాల నేతలు ● ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. సర్కారు వైఖరిపై నిరసన గళం విప్పారు. భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ను రద్దు చేసి ఏపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కడప నగరంలో సీపీఎస్ రద్దు మహాసంకల్ప గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాజ్పేయి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తక్షణమే సీపీఎస్ రద్దుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ సంఘాలు నియోజకవర్గాల వారిగా కృషి చేసి ఓట్లు వేయించారన్నారు. కానీ కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా కాలయాపన చేయడం ఉద్యోగులను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలపై నిర్లక్ష్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కరిమి రాజేశ్వరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కమ్మటి మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీయపురెడ్డి వెంకట జనార్ధన్రెడ్డి, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు, రాష్ట్ర రీ డ్రీసిల్ కమిటీ చైర్మన్ రామభూపాల్రెడ్డి, రామనరసింహా, కడప జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డిపల్లె మదన్మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరేంద్ర, రాష్ట్ర అసోసియేషన్ ప్రసిడెంట్ చీరల కిరణ్తోపాటు గుంటూరు, శ్రీసత్యసాయి, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, కర్నూలు, అన్నమయ్య జిల్లాల నాయకులు నాయకులు పాల్గొన్నారు. -
శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్పై టీడీపీ నేత దాడి
● బాకీ అడిగారని కార్యాలయంలో వీరంగం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్ ● ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నేతల ఒత్తిడి సాక్షి టాస్క్ఫోర్స్ : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న వాల్మీకి బోయ కా ర్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజును బాకీ చెల్లించాలనిని అడిగినందుకు.. ఏకంగా ఆ కార్యాలయానికి వెళ్లి మేనేజర్పై దాడి చేసిన సంఘటన గురువారం ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబోతుల నాగరాజు పోట్లదుర్తి గ్రామంలోని తన ఆస్తిని తనఖా పెట్టి రూ.40 లక్షల రుణాన్ని స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్లో తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతి నెల ఆయన రూ.1.31 లక్షలు కంతుగా(ఈఎంఐ) చెల్లించాల్సి ఉంది. గత ఐదు నెలలుగా కంతులు చెల్లించకపోగా నల్లబోతుల నాగరాజు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయ అధికారులు చేస్తున్న ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. పలు మార్లు ఇలా జరిగిందని శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది తెలిపారు. ఫర్నీచర్ ధ్వంసం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ బాబాఫకృద్దీన్ నల్లబోతుల నాగరాజుకు ఫోన్ చేశారు. పలు మార్లు చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తమ వద్ద నమోదు చేసుకున్న మరో నంబర్కు ఫోన్ చేశారు. ఈ నంబర్కు ఫోన్ చేయగా నల్లబోతుల నాగరాజు సతీమణి లిఫ్ట్ చేసింది. తన ఇంటిలోని వారికే ఫోన్ చేస్తావా అని ఆ సెల్ తీసుకున్న నల్లబోతుల నాగరాజు బాబా ఫకృద్దీన్ను దూషించాడు. నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు అని గదమాయించగా తాను తమ కార్యాలయంలోనే ఉన్నానని, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానని బాబాఫకృద్దీన్ తెలిపాడు. వెంటనే తన అనుచరులతో నల్లబోతుల నాగరాజు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతోపాటు బాబాఫకృద్దీన్పై దాడి చేసినట్లు తెలిసింది. తమ బాకీ చెల్లించకపోవడంతో తమ కార్యాలయంపైకి వచ్చి దౌర్జన్యం చేయడంపై శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ తమ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత స్థానిక త్రీటౌన్ సీఐ రామాంజనేయులును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నల్లబోతుల నాగరాజు అధికార పార్టీ ముఖ్య నాయకుడు కావడంతో సీఐ ఉన్నతాధికారులను సంప్రదించి కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోర్టు ద్వారా కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ ముఖ్య నాయకుడికి గురువైన న్యాయవాదిని నాగరాజు సంప్రదించగా ఆయన బాబాఫకృద్దీన్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించగా జరగని సంఘటనపై కేసు నమోదుకు పోలీసులు అంగీకరించలేదని సమాచారం. ఎన్నికల ప్రచారంలో.. నియోజకవర్గ ప్రజలతోపాటు వ్యాపార వర్గాలకు రక్షణ గోడగా ఉంటానని ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరుడే ఇలాంటి సంఘటనకు పాల్పడటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోగా అడిగినందుకు దాడి చేయడం విచారకరం. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. డివిజనల్ మేనేజర్ నియోజకవర్గ పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వారు కావడంతో.. కేసు లేకుండా రాజీ చేసేందుకు అధికార పార్టీ నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. -
ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప వైఎస్ఆర్ సర్కిల్: ఖరీఫ్–2026 సీజన్ లో అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఎరువుల సరఫరాలో డైవర్షన్, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో ఖరీఫ్–2026 సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా, వినియోగంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ యూరియా భారీగా పరిశ్రమలకు మళ్లుతున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో సరిపడా ఎరువులు అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇన్చార్జ్ డీఆర్వో వెంకటపతి, జెడ్పీ సీఈవో సుబ్రమణ్యం,డీఏవో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎల్డీఎం జనార్దనం, నాబార్డు డీడీఎం విజయ విహారి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. లాభదాయక సాగు కోసం ప్రణాళికలు రూపొందించాలి ‘ఆత్మనిర్భరత మిషన్‘ లక్ష్యం మేరకు.. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దిగుమతుల అవసరాన్ని తగ్గించడంతో పాటు రైతులకు లాభదాయకమైన వ్యవసాయ మెళుకువలపై అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ‘‘పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్’’ అమలుకు సంబంధించి 2026–27 వార్షిక ప్రణాళికపై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. -
పుల్ల ఐస్లు అమ్ముతూ.. వడదెబ్బతో మృతి
రాజంపేట : రాజంపేట మండలం చెర్లోపల్లెకు చెందిన పొన్నపల్లి నరసింహులు(53) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందారు. ఆయన పుల్ల ఐస్లు అమ్ముకుంటూ జీవనం సాగించే వారు. ఈ క్రమంలో గురువారం పుల్ల ఐస్లు తీసుకొని పెనగలూరు మండలంలో అమ్ముకునేందుకు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను రాజంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి వడదెబ్బతో మృతి చెందిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నరసింహులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, డీలర్ సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే -
వీరబ్రహ్మేంద్ర స్వామికి విరాళం
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శుక్రవారం తిరుపతికి చెందిన గిన్నెల హరిగోపాల్ ధర్మపత్ని లక్ష్మిదేవి రూ.5లక్షలు నగదు విరాళమిచ్చారు. ఇందులో మాస కల్యాణానికి రూ.3లక్షలు, నిత్యాన్నదానానికి రూ.50వేలు, శాశ్వత పూజకు రూ.1.50లక్షలు విరాళంగా అందించారు. దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి, సిబ్బంది వీరం బొట్లయ్య, గోపాల్ పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 2,9 తేదీల్లో జరగాల్సి న డిగ్రీ 2,3,4,5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. కొన్ని రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఉన్న దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2వ తేదీన జరగాల్సిన పరీక్ష 19న, 9వ తేదీన జరగాల్సిన పరీక్ష 20వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు. కడప సెవెన్ రోడ్స్: జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సి. సుబ్రమణ్యం శుక్రవారం బా ధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి రిటైర్డ్ కావడంతో డిప్యూటీ సీఈవోగా ఉన్న సుబ్రమణ్యానికి సీఈవోగా పదోన్నతి కల్పించారు. ఆయనను జెడ్పీ ఉద్యోగులు అభినందించారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు 2026– 27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 1 నుంచి 30 తేదీ వరకు నెల రోజులపాటు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. పదవ తరగతిలో వచ్చిన మార్కులు ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కేవ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రావన్ కుమార్, పవన్ కుమార్, ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. బి.కొత్తకోట: రాజంపేట డీఎఫ్ఓ జగన్నాఽథ్సింగ్ శుక్రవారం మండలంలోని హార్సిలీహిల్స్పై తనిఖీలు నిర్వహించారు. కొండపై అటవీశాఖ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. పర్యావరణ సముదాయం నిర్వహణ, ప్ర కృతి అధ్యయన కేంద్రం, అతిథిగృహలను తనిఖీ చేశారు. వీటి నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. కొత్త చేపట్టిన అభివృద్ది పనులు, ఆధునీకరణ, పెయింట్ పనులను పరిశీలించారు. కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి, పండరీపూర్, తిరుపతి మధ్య కొత్తగా వారాంతపు రైలును ఈనెల 16వ తేదీ నుంచి నడపనున్నట్లు రైల్వే ఉన్నతాఽధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు కడప రైల్వే కమర్షియర్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి శనివారం తిరుపతిలో (17437) సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తిరోడ్, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, లాథూర్, బార్సిటౌన్, గురుద్వార్, పండరీపురానికి ఆదివారం చేరుకుంటుందన్నారు. తిరిగి ఇదే రైలు ప్రతి ఆదివారం (17438) రాత్రి 8 గంటలకు బయలు దేరి మరుసటి రోజు సోమవారం రాత్రి 11–30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. -
జూన్లో కొత్త టెర్మినల్ ప్రారంభం
కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నాయని కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో నిర్వహించిన ఎయిరోడ్రోమ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జూన్లో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనాన్ని నిర్వహణలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నూతన టెర్మినల్ను ప్రారంభించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఎయిర్పోర్ట్ భద్రతకు సంబంధించి, రాష్ట్ర పోలీస్ విభాగం పరిమితి భద్రతను బలోపేతం చేయాలని, పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్కు రోజువారీ, చైన్నె మరియు విజయవాడకు ప్రత్యామ్నాయ రోజుల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయని, కొత్త టెర్మినల్ ప్రారంభం తర్వాత మరిన్ని విమాన మార్గాలను ప్రారంభించేందుకు ఎయిర్లైన్స్తో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో కడప మున్సిపల్ కమిషనర్, పంచాయతీ రాజ్ శాఖలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మే 22 నుంచి రైతు పండుగ రైతులకు సాంకేతికత, పంట దిగుబడి మార్కెట్కు అనుసంధానం చేసే అంశాలపై అవగాహన కల్పించేందుకు మే 22 నుంచి 24వ తేది వరకు జిల్లాలో నిర్వహించే రైతు పండుగ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్దకశాఖ, పట్టు పరిశ్రమల, మత్స్యశాఖ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే సౌకర్యం, పంటలు మార్కెటింగ్ చేసే అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ● జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను పాఠశాలల పునః ప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకు రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పారిశ్రామికరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని పీ4 స్టార్టప్ కడప ఎంట్రర్ప్రెన్యూర్షిప్ సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ల పరిశీలన కలెక్టర్ శ్రీధర్ గురువారం ఈవీఎం గోడౌన్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల వారి తనిఖీల్లో భాగంగా గోడౌన్లను తనిఖీ చేశారు. ఎయిరోడ్రోమ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ -
ముగిసిన అన్నమయ్య సంకీర్తన పోటీలు
కడప సెవెన్రోడ్స్: పదకవితా పితామహులు అన్నమాచార్యుల 618వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం దొంగలచెరువులోని శ్రీ కోదండ రామాలయంలో సంకీర్తన పోటీలు గురువారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నిర్వహించిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప సిటీ: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ–2025 (వీబీజీ రామ్జీ) పథకం అమలు మరోనెల రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటివరకు ఉపాధి హామీ కార్యాలయాలకు ఎటువంటి సర్క్యులర్ రాకపోవడంతో పథకం వాయిదా పడినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి ఉపాధి హామీ ఆర్థిక సంవత్సరం పూర్తి కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ కొత్త పథకం అమలు కావాల్సి ఉండగా, విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1వ తేదికి వాయిదా వేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగర శివార్లలోని యోగివేమన యూనివర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లాస్థాయి బాలబాలికల బీచ్ కబడ్డీ ఎంపికలు ఉత్సాహంగా జరిగినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న జట్టు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. బాలుర జట్టు వేణు, సాయి, బ్రహ్మయ్య, నూర్బాషా, మల్లికార్జున, పవన్, యశ్వంత్. బాలికల జట్టు...... జోష్న, నీలిమ, మహేశ్వరి, షమీన, రేణుక, మేఘన, ఉష, ఐశ్వర్య ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ విభాగంలో సీ్త్ర, పురుషులకు అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో 70 మంది క్రీడాకారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. 100మీ, 200మీ, 400మీ, 800మీ, 1500మీ, లాంగ్జంప్, హైజంప్, షార్ట్పుట్, డిస్కస్త్రో, విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరచిన గాయత్రి, రెడ్డి కీర్తన, మానస, ప్రీతి, గవ్యశ్రీ, నాగరోహిణి, అఖిల, వరప్రసాద్, భాస్కర్, దుర్గా హర్షవర్దన్, షాహిద్, మహేష్, విష్ణువర్దన్రెడ్డిలు మే 4, 5 తేదీల్లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొననున్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాలుగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని విద్యార్థుల హల్ టికెట్లను వీసీ పరిశీలించారు. 694 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు ఎస్సీఎన్నార్ ప్రభుత్వ కళాశాలలో 67 మంది పరీక్షలకు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ పరీక్షల అధికారులకు సూచించారు. -
లాహిరి..లాహిరి..లాహిరిలో
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలో భాగంగా రెండవరోజు గురువారం పుష్కరిణిలో తెప్పపై స్వామి, అమ్మవార్లు ఐదుమార్లు విహరించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేర్చారు. అక్కడ అలంకార మండపంలో విశేష అభిషేకాలు, అలంకారం చేసి, మంగళ హారతులు ఇచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కృష్ణమోహన్ బృందం, ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పర్యవేక్షణలో మంగళ హారతులు ఇచ్చి తెప్పను జల విహారం చేయించారు. అందులో భాగంగా తొలిసారి వేద పండితుల మంత్రోచ్ఛాటనలతో, తర్వాత రెండుసార్లు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి గీతాలాపనలతో, మరో రెండుసార్లు మంగళ వాయిద్యాలతో స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో హాయిగా విహరించారు. భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. -
బాబు పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం
వేంపల్లె/పులివెందుల: కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేంపల్లెలో టీడీపీ నాయకులు పెట్టిన కేసులో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం పులివెందులలోని స్థానిక అర్బన్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీన మంజుల భాస్కర్ సాయినాథ్ అనే ఫిర్యాదుదారుడు అంబటి రాంబాబుపై కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు విషయంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణ నిమిత్తం పులివెందుల పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. సుమారు 2గంటలపాటు ఆయనను పలు ప్రశ్నలు వేయగా సమాధానాలు చెప్పారు. వేంపల్లె పోలీస్స్టేషన్లో ఆయనను 2గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు నేను భయపడనని, అక్రమంగా బనాయించిన కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటానన్నారు. రాష్ట్రంలో పోలీసులు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసులు పెడితే న్యాయస్థానంలో ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతామన్నా రు. ఇప్పటికై నా చంద్రబాబు, లోకేష్లు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. అలాకాకుండా అక్రమ కేసులు, జైళ్లకు పంపితే ప్రజాస్వామ్య పద్ధతిలో సర్వనాశనమవుతారన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అలాంటి ప్రతి పోలీసు ఆఫీసర్ను కూడా న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో 25/26లో టీడీపీకి చెందిన రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్టర్ చేసిన కేసులో పోలీసు విచారణకు రమ్మనగా గుంటూరు నుంచి విచారణకు వచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు. 2 గంటలపాటు వేంపల్లె పోలీసులు విచారణ చేశారన్నారు. జనవరి 31వ తేదీవరకు గుంటూరులోని గోరంట్లలో చంద్రబాబును దూషించానని కేసు పెట్టడం జరిగిందన్నారు. అప్పుడే అల్లపాటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారని తెలిపారు. 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించానని అన్నారు. ఒకే విషయంలో 32 కేసులు నమోదు చేశారన్నారు. న్యాయస్థానాల తీర్పు ప్రకారం మల్టిపుల్ కేసులు పెట్టడం చట్టరీత్యా నేరమని ఆన్నారు. మళ్లీ కూడా రెండు వేంపల్లె, పులివెందులలో కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్ల ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు.. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, భారతి, సల్మా, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషియల్ మీడియాలో జగన్మోహన్రెడ్డిని ఎంతోమంది తిడుతు న్నారని, ఒక్కరిపైన అయినా కేసు పెట్టారా , చట్టం చంద్రబాబునాయుడికి ఒకటి, జగన్మోహన్రెడ్డికి ఒకటి ఉందా అని అన్నారు. అంతకుముందు పులివెందులలోని చందమామ డాబా వద్దకు చేరుకున్న అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నాయకులు, బలిజ సంఘం నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కడప రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ వారిద్దరూ కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడను మాజీ మంత్రి అంబటి రాంబాబు -
అబద్ధానికి రెక్కలు కట్టడంలో సీఎం దిట్ట
పులివెందుల : చంద్రబాబు నాయుడు అబద్ధానికి రెక్కలు కట్టడంలో దిట్ట అని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదని, కేవలం తన ఆర్థిక అభివృద్ధి కోసం అమరావతిని అడ్డుపెట్టుకున్నారన్నారు. అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ సంక్షోభానికి కూడా చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంకంటే, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కంటే తన అభివృద్ధి కోసం చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు తమ ఆదాయం కోసం అనేక అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేయడం కంటే ప్రజా ధనాన్ని ఎలా దోచుకోవాలో తెలుగుదేశం పార్టీ చూపిస్తోందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యో గ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలే ప్రధాన డిమాండ్ గా మే 6 తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామమని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్ టీఏ ముందుండాలని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథ్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఏ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. శనగల డబ్బులు చెల్లించలేదు : గురువారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పలువురు రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో శనగలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి వారి అకౌంట్లలో డబ్బులు వేయకపోవడం అన్యాయమన్నారు. అలాగే జిల్లాలో మొక్కజొన్న, వరి రైతులకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ
కడప అర్బన్: వైఎస్సార్ ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్ రిజిస్టార్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రస్తుతం ఖాళీ ఉండటంతో అక్కడికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి లావణ్య బదిలీ అయ్యారు. బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి వై.జె పద్మశ్రీ నెల్లూరు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీగా, సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. చెరువులో పడి యువకుడు మృతి కలికిరి: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కలికిరి పట్ట ణ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలి కిరి పట్టణం కొత్తపేట వీధికి చెందిన ఎస్.జాకీర్ హుస్సేన్ (33) బుధవారం ఉదయం కలికిరి పెద్దచెరువు వద్దకు బహిర్బూమికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. నీటిలో వ్యక్తి తల కొంతమేర కనిపిస్తుండటం, ఒడ్డున చెప్పులు ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చి, వారి సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని అక్క మహమ్మద్ జై అప్సానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుని భార్య ఏడాది క్రితం మరణించింది. తల్లిదండ్రులను కోల్పోయిన వీరి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిడుగు పడి 16 గొర్రెలు మృతి – రూ. 2.50 లక్షలు నష్టం గుర్రంకొండ: పిడుగు పడి 16 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ ఎస్. కొత్తపల్లె వద్ద జరిగింది. బాధిత గొర్రెల కాపరులకు రూ. 2.50 లక్షలు నష్టం వాటిల్లింది. శె శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు, మంజుల దంపతులు 60గొర్రెలను కాసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం యథావిధిగా గొర్రెల మందను గ్రామానికి సమీపంలో పొలాల్లో నిలిపారు. సాయంత్రం పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఎక్కువ సమయం ఉరుముల శబ్దాలు రావడంతో మందలోని గొర్రెలు భయాందోళన చెందాయి.దీనికి తోడు చిన్న పాటి వర్షం మొదలవడంతో గొర్రెలు నలుదిక్కులకు పారిపోయాయి. 16 గొర్రెలు పొలానికి సమీపంలోని చింత, వేపచెట్టుకింద ఉన్నాయి. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పిడుగు గొర్రెల మంద ఉన్న చెట్ల పైన పడింది. ఈసంఘటనలో 16 గొర్రెలు ఆక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరులు రోదించారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.2.50 లక్షలు వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్య సేవల కోసం గుర్తు తెలియని వ్యక్తి (45)ని ఈనెల 28వ తేదీన రాత్రి తీసుకుకొచ్చారు. వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు. గొర్రెల మందపై వీధి కుక్కల దాడి రామాపురం: రామాపురం మండలం సరస్వతీపల్లి దళితవాడలో నివసించే పిల్లిండ్ల ఆంజనేయులు కు చెందిన గొర్రెల మందపై బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. 40 గొర్రెలను కొరికి చంపాయి. ఉదయం గొర్రెలను బయటకు తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆంజనేయులు మృతి చెందిన 40 గొర్రెలను చూసి విలపించాడు.రూ. 5 లక్షల విలువైన గొర్రెలను కోల్పోవడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నట్లు వాపోయారు.,గ్రామస్తులు విషయాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వీ ఆర్ఓ యామినిని సంఘటన స్థలానికి పంపి నష్టాన్ని అంచనా వేసి,నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. పసికందు మృతదేహం లభ్యం రామసముద్రం: అప్పుడే పుట్టిన పసికందును కన్నతల్లి కడతేర్చి పొలాల్లో పారవేసి వెళ్లిన దుర్ఘటన ప్రజలను కలచివేస్తోంది. ఈ సంఘటన రామసముద్రం మండలం చెంబకూరు సమీపంలోని ఎలకపల్లి రోడ్డు మార్గంలో బుధవారం జరిగింది. ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి తెలిపిన కథనం ఎలకపల్లి సమీపంలోని మామిడి తోపులో గుర్తుతెలియని పసికందును పొలం యజమానురాలు గమనించింది. విషయం తెలియడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి, తహసీల్దార్ అజారుద్దీన్ తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను, చుట్టుపక్కల ప్రజలను ఆరా తీశారు. అనంతరం పసికందు మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పసికందు ఎవరన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోటారు వాహనచట్టం నిబంధనలు పాటించాలి
రాజంపేట: ప్రతి ఒక్కరూ మోటారు వాహనచట్టం నిబంధనలు పాటించాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాజంపేట మోటారు వెహికల్ కార్యాలయానికి ఎంపీ వెళ్లి, తన లైసెన్స్కు సంబంధించి రెన్యూవల్ చేసుకొని, సంబంధిత లైసెన్స్ను రాజంపేట ఎంవీఐ వినోద్కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ద్విచక్రవాహనం నడపడటం మంచిదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రధానంగా మైనర్లు వాహనాలను నడపరాదన్నారు. దీనికి తల్లిదండ్రులు బాధ్యులవుతారన్నది గుర్తుంచుకోవాలన్నారు. రాజంపేట ఎంవీఐ వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంవీఐ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న మేడా ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని బుధవారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన ఆయనను అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఒంటిమిట్ట రామయ్యను బ్రహ్మోత్సవాల సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల దర్శించుకోలేక పోయానన్నారు. ఇప్పటికి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, మాజీ రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, నందలూరు మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, కో–ఆప్షన్ మెంబర్ రఫీ, ఎంపీటీసీ ముమ్మడి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మేడా రఘునాథరెడ్డి -
పిల్లలపై దృష్టి పెట్టాలి
నేడు పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశంకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువ వచ్చినవారిని, ఫెయిల్ అయ్యే విద్యార్థుల ను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. – షేక్. షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్జిల్లా -
కురబలకోటలో వడగళ్ల వాన
కురబలకోట: కురబలకోట మండలంలోని కడప క్రాస్, దిగువబోయపల్లి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి టమాటా, వరి పంటలు దెబ్బతిన్నాయి. 45 నిమిషాల పాటు పడిన వర్షానికి వడగళ్లు సైతం పడటంతో ఇటీవల కొత్తగా నాటిన టమాటా దెబ్బతింది. కడప క్రాస్కు చెందిన ఏవీ లక్ష్మిదేవమ్మకు చెందిన మూడు ఎకరాల టమాటా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇంకా నేలను పట్టుకుని నిలబడక ముందే వడగళ్ల దెబ్బకు విరిగిపోయాయని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆటలకు వేళయింది.. మైదానం సిద్ధమైంది.. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు నెల రోజుల పాటు ఆటల్లో మునిగితేలనున్నారు.. పిల్లల్లో మానసిక ఉల్లాసంతో పాటు వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని 30 ప్రాంతాల్లో శిక్షణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శిక్షకులను నియమించారు. శిక్షకుడికి రూ. 2000లు ఇవ్వనుండగా నిర్వహణకు రూ. 1000, రోజుకు రూ. 60 చొప్పున సుమారు రూ. 1800 కేటాయించగా క్రీడా సామాగ్రి మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.3400 వినియోగించనున్నారు. వాస్తవానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 60 ప్రాంతాలలో శిబిరాలు నిర్వహించేందుకు ప్రతిపాదించగా 30 ప్రాంతాలలో నిర్వహణకే శాప్ అనుమతులు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండే విద్యార్థులు వారికి ఇష్టమైన ఆటలాడి నెల రోజులపాటు నైపుణ్యం సాధించవచ్చు. ● 8నుంచి 16 ఏళ్లలోపు బాల బాలికలకు అవకాశం కల్పిస్తారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, షటిల్, బ్యాడ్మింటన్ ఫుట్బాల్, పెన్సింగ్, హ్యాండ్ బాల్, కరాటే, సాప్ట్బాల్, తైక్వాండో వాలీబాల్ రెజ్లింగ్ క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. 30 శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశాం జిల్లా మొత్తంగా 30 శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. ఈ మేరకు క్రీడా సంఘాలు వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానించాం. –షేక్ గౌస్బాషా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కడప డీఎస్ఎ స్టేడియంలో హ్యాండ్బాల్, హాకీ, అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, తైక్వాండ్, వెయిట్లిఫ్లింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, సీఎస్ఐ మైదానంలో ఫుట్బాల్ శిక్షణ శిబిరాలు కడప నగర వేదికగా జరగనున్నాయి. బద్వేలులో అథ్లెటిక్స్, ప్రొద్దుటూరు అర్బన్లో బాస్కెట్బాల్, టి. సుండుపల్లిలో హ్యాండ్బాల్, సిద్దవటంలో హ్యాండ్బా ల్, స్కేటింగ్, పెండ్లిమర్రిలో వాలీబాల్, చాపాడులో పుట్బాల్, ముద్దనూరులో హాకీ, ఎర్రగుంట్ల అర్బన్లో హాకీ, పుట్బాల్, నందలూరులో వాలీబాల్, పులివెందుల అర్బన్లో బ్యాడ్మింటన్, హాకీ, రాజంపేట అర్బన్లో అథ్లెటిక్స్ వాలీబాల్, లింగాలలో వాలీబాల్ క్రీడాంశాలలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గతంలో 50కి పైగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ఈ ఏడాది కేవలం 30 క్రీడాంశాలల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా 13 క్రీడాంశాలల్లోనే శిక్షణ ఇస్తూ ఖోఖో, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలకు చోటు కల్పించలేదు. మే ఒకటి నుంచి జిల్లాలోవేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఈ సారి 30 శిబిరాలతోనేసరిపెట్టిన శాప్ -
కడప రాయుడి కోనేటి విహారం
తెప్పపై స్వామి వారి విహారం కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు పగలంతా దుష్ట శిక్షణతో అలిసి సాయంత్రం కోనేటిలో చల్లగాలితో ఆనందించాలని తెప్పపై కొలువుదీరాడు. అలా...అలా...విహరించి ఆనందించారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం తెప్పోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేసి పల్లకిలో కొలువుదీర్చారు. అర్చకులు మయూరం కృష్ణమోహన్ బృందం వేదమంత్రోచ్ఛాటనలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకు వెళ్లి పుష్కరిణిలో సిద్ధం చేసి ఉన్న తెప్పలో కొలువుదీర్చారు. పూజల అనంతరం మంగళహారతులు ఇచ్చి మొదట వేదమంత్రోచ్ఛాటనలతో తెప్ప పుష్కరిణిలో తొలి ప్రదక్షిణ చేయించారు. రెండవమారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు భక్తిగీతాలాపనతో తెప్పతో ప్రదక్షిణ నిర్వహించారు. మూడవమారు స్వామి, అమ్మవారు మంగళ వాయిద్యాల మధ్య ప్రదక్షణ చేశారు. మంగళ హారతులు అనంతరం స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. –కడప సెవెన్రోడ్స్ విశేష అలంకారంలో స్వామి, అమ్మవారు -
దివ్యాంగుల సాధికారతపై ప్రత్యేక దృష్టి
కడప సెవెన్రోడ్స్: దివ్యాంగుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, పునరావాస సేవలతో పాటు సాధికారత కోసం ప్రభుత్వం పాటుపడుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వ్యాప్తంగా 70 మంది దివ్యాంగులకు మంజూరైన ఉచిత మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 నుంచి 45 ఏళ్లలోపు కలిగి, కనీసం 70 శాతం దివ్యాంగత ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ ఉచిత మోటరైజ్డ్ వాహనాల పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్కూటర్ల పంపిణీలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, డిసేబుల్ శాఖ ఏడీ కృష్ణ కిషోర్, సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పొక్సో కేసులో ముగ్గురు అరెస్ట్
కడప అర్బన్: కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న నాగరత్నమ్మ కుమార్తె (15) ను పుట్టినరోజు పేరుతో కారులో నలుగురు యువకులు ఈనెల 24వ తేదీన గువ్వలచెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో తిరిగి ఉదయం నాలుగు గంటలకు బాలికను ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఈ క్రమంలో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరిలో మదరస్ ఆలీ, సయ్యద్ అల్లావుద్దీన్, షేక్ నజీర్ లను అరెస్ట్ చేశారు. మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. పాఠశాల మరుగుదొడ్డి తలుపు చోరీ ప్రొద్దుటూరు కల్చరల్ : మండలంలోనీ డీసీఎస్ఆర్ కాలనీలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాఠశాల మరుగుదొడ్డి తలుపు మంగళవారం చోరీకి గురైంది. పాఠశాలలో ఎవరు లేని సమయంలో ఆకతాయిలు మద్యం తాగడం, పేకాట ఆడటం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మరుగుదొడ్డికి ఉన్న తలుపును దొంగలించడంతోపాటు, స్టోర్ రూం తలుపు, తాళాన్ని ధ్వంసం చేశారు. చోరీ విషయంపై విద్యాశాఖాధికారుల దృష్టి కెళ్లడంతోపాటు పోలీసులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి వల్లూరు: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తప్పెట్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లేబాక విక్రాంత్ రెడ్డి (14) అనే విద్యార్థి దుర్మరణం పాయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు టీ కొత్తపల్లెకు చెందిన లేబాక రామ మనోహర్ రెడ్డి తప్పెట్ల గ్రామానికి, కుమారునిపల్లె క్రాస్కు మధ్యలో చిన్నపాటి షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు విక్రాంత్ రెడ్డి కడపలోని విస్డమ్ స్కూల్లో 9 వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి ఉదయాన్నే ఇంటి నుంచి తమ షాపు వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా తప్పెట్ల గ్రామానికి కొద్ది దూరంలో గుర్తు తెలియని వాహనం డీకొట్టి వెళ్లి పోయింది. దీంతో అతని తల నుజ్జునుజ్జుగా మారి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరటి తోటలో విద్యుత్ ప్రమాదం – రూ.10లక్షల పంట నష్టం లింగాల : లింగాల మండలం చిన్నకుడాల గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అరటి తోటలో విద్యుత్ హెచ్టీ వైర్లు తెగిపడి సుమారు 6ఎకరాల తోటలోని అరటి చెట్లు కాలి బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన శివనారాయణరెడ్డి అనే రైతుకు చెందిన రెండో పంట అరటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ లైన్ తెగి మంటలు వ్యాపించాయి. ఉదయం 10గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గెలలతో ఉన్న అరటి చెట్లు కాలిపోవడంతో సుమారు రూ.10లక్షల దాకా నష్టం వాటిల్లిందని రైతు శివనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అరటి తోటతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు పోటు కట్టెలు కాలిపోయాయని తెలియజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంవల్లనే ఈ ప్రమాదం సంభవించిందని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ రైతులు కోరారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపోలో పనిచేసేందుకు ఆన్కాల్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కడప డిపో మేనేజర్ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేది డీఎం కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 21 సంవత్సరాలు దాటి హెవీ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తయిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలోగానీ, 73828 60968 నెంబరులో సంప్రదించాలని వివరించారు. పులివెందుల రూరల్: ఏపీ కార్ల్ సీఈఓగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న దామోదర్ నాయుడును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పశుసంవర్థక రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రొద్దుటూరు రూరల్: మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న జింకా అంజనీకుమార్ ఆర్ఎంపీ క్లినిక్ను బుధవారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు మాత్రమే సేవలు అందించాలన్నారు. అంతకంటే ఎక్కువ వైద్యం అందించి రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు. హెల్త్ సూపర్వైజర్ బీఏ వరప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మదనపల్లె టౌన్: జిల్లా వ్యాప్తంగా రౌడీ మూక లను అణచివేయాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీ పావని తో కలిసి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో విద్యాభాస్యం పూర్తి చేసి న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని బుధవారం రాత్రి ట్రిపుల్ఐటీ అకాడమిక్ బ్లాక్–1 వద్ద ధర్నా చేపట్టారు. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు రావాల్సిన స్కాలర్షిప్ బకాయిల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా స్కాలర్షిప్ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజుల చెల్లింపులు ఆగిపోయాయని, దీనివల్ల సర్టిఫికెట్లు పొందే విషయంలో, ఉన్నత చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని డెరెక్టర్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు. ప్రభుత్వం స్పందించి తమ స్కాలర్షిప్ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. -
అంగన్ వేడిలో చిన్నారులు
రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిలలాడుతున్నాయి. వడదెబ్బకు భయపడి జనసంచారంలేక రోడ్లు కళావిహీనంగా ఉన్నాయి.దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్వేశంతో విద్యార్థులకు వేసవిసెలవులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యా సంస్థలకు ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు.అయితే అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది.ఫలితంగా కొందరు రావడం లేదు. ● వేసవి తీవ్రతతో విలవిల ● తగ్గుతున్న హజరు శాతం ● సెలవులు ప్రకటించని ప్రభుత్వం ● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్ బద్వేలు: ఎండలకు వాడిపోతున్న చిన్నారుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు.భానుడు భగభగ మండిపోతుంటే ఎండలకు చిన్నారులు ఎలా వస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణాలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు.కానీ ఇక్కడ వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. వైఎస్సార్ కడప జిల్లాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 15 ఉన్నాయి.వీటి కింద 2745 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటల్లో సంరక్షణ పొందుతున్న వారికి పౌష్టికా హరం అందించి, ఆటపాటలు, అక్షరాలు నేర్పించడం కార్యకర్తల విధులు. ఏడాది పొడవునా కేంద్రాల్లో చిన్నారులకు ఇదే పద్ధతి కొనసాగుతోంది.అయితే వేసవి సమీపించడంతో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.కానీ అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయలేదు.దీంతో ఎండలకు చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే గడపదాటి కాలు బయటికి పెట్టడానికి భయపడుతుంటే పిల్లలను ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. కొందరు చిన్నారులు కేంద్రాలకు వస్తున్నా అక్కడవారికి గాలి లేకపోవడంతో ఉక్కపోతకు విలవిలలాడి పోతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలు తంటాలు పడుతున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెబుతున్న ప్రభుత్వం వారికి చిరుతిండ్లు అందించడంలో శ్రద్ధ చూపడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలవులపై స్పష్టత లేదు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు,ఆయాలకు చెరో 15 రోజులు సెలవులు ఇవ్వాల్సి ఉంది. మే 1 నుంచి 15 వరకు ఒకరికి, 15 నుంచి 30 వరకు ఒకరు సెలవు లు తీసుకోవచ్చు.అయితే దీనిపై స్పష్టత కొరవడింది.ఒకవేళ వంతుల వారీగా కార్యకర్తలు,అయాలు సెలవులు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా ఆయాలు చేసే పనులు మేము చేయాలా అనే ధోరణిలో అంగన్వాడి కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం.చిన్నారుల పరిశుభ్రత పని ఆయాలదని, వారి పని కార్యకర్తలు చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. డిమాండ్లు పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేం అడగకుండానే వివిధ రకాల హామీలు ప్రకటించారని, కానీ ఒక్కటీ నెరవేర్చక పోగా తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నా రు. తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చాలని ఎండలు లెక్క చేయ కుండా ఒకవైపు వీరు పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎండలు మండిపోతున్నా కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా కక్ష పూరిత ధోరణి అవలంభిస్తోందని యూనియన్ నేతలు మండిపడు తున్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులు అంగన్వాడి కేంద్రం,కలసపాడు. -
నారసింహా...గోవిందా
మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మి నరసింహస్వామి గోవిందా... ప్రహ్లాద వరద గోవిందా.. జయ జయ సింహా ..జయ నరసింహా అంటూ భక్తులు కీర్తించగా గోవింద నామస్మరణతో సీటీఎం పురవీధులు మార్మోగాయి. బ్రహ్మరథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథాన్ని నడిపి శ్రీవారు పురవీధుల్లో విహరించేందుకు సహరించి భక్తులంతా స్వామిని దర్శించుకునేలా చూస్తారని భక్తుల నమ్మకం. ఆలయంలో ఉదయం అర్చక బృందం రుషికేశవ్, మంజువిక్రమ్, ఆదిత్యచార్యులు, రామాచార్యులు తేరు ముందు అస్థాన పూజలు నిర్వహించారు. స్థానిక ప్రముఖులు రథం వద్ద జరిగిన తొలి పూజల్లో పాల్గొని తర్వాత రథంపై శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. ఒకవైపు ఎండలు మండుతున్నా భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని రథంపైకి మిరియాలు, దవనం చల్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. ధార్మిక సేవా ఆధ్వర్యంలో ధూళోత్సవం నిర్వహించారు. వైభవంగా లక్ష్మినారసింహుడి బ్రహ్మరథోత్సవం -
మితిమీరిపోతున్న ఆ వీఆర్ఓ ఆగడాలు
గోపవరం : మండల తహసీల్దారు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఓ వీఆర్ఓ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారపార్టీ అండతోనే రెచ్చిపోతున్నాడు. ఆ వీఆర్ఓ పరిధిలో నేషనల్ హైవే, నేషనల్ హైవే నుంచి గోపవరం వరకు రెండు మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా విలువైన ప్రభుత్వ స్థలాలు ఉండటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాడు. అనుమతులు అన్నీ ఉన్నా ఏ చిన్న కట్టడం కట్టాలన్నా ఈయన అనుమతి తప్పనిసరైంది. ఇంటి స్థలాలకు సంబంధించి పత్రాలన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో పనులు మొదలు పెడితే వెంటనే వెళ్లి ఆ పనులను నిలుపుదల చేయడం అతనికి పరిపాటిగా మారింది. ఎక్కడైతే ఖాళీగా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సాకుగా చూపించి కొందరికి లేనిపోని ఆశలు కల్పించి వారి నుంచి భారీగా ముడుపులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు చివరిలో ఆ వీఆర్ఓ రిటైర్డ్ కానుండటంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంతో ముడుపుల కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. జాతీయ రహదారి పక్కనే ఉన్న 168/1 సర్వే నంబర్లోని 49 సెంట్లలో ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలు లేకపోగా కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. గోపవరం ప్రాజెక్టుకాలనీకి సమీపంలో ఏకంగా ఒరవకాలువను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నా వారిపై కనీసం చర్యలు తీసుకోకపోగా వారి వద్దనే ముడుపులు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన తహసీల్దారు పేరు చెప్పి కూడా భారీగా ముడుపులు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఆ తహసీల్దారు సదరు వీఆర్ఓను దూరం పెట్టినట్లు తెలిసింది. ఇక మ్యుటేషన్ విషయంలో కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం, సకాలంలో పనులు చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం ఇతనికి అలవాటే. ఎవరైనా ప్రశ్నిస్తే నా వెనుక ఏకంగా టీడీపీ ఇన్చార్జి ఉన్నారని బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులు వీఆర్ఓ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇదే వీఆర్ఓ గతంలో ఓ ప్రభుత్వ భూమిని మరొకరికి ఆన్లైన్ చేసిన విషయంలో అప్పటి జేసీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఆ వీఆర్ఓ ఆగడాలకు సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అధికారపార్టీ అండతో రెచ్చిపోతున్న వైనం -
కిలాడీ లేడీ హనీ ట్రాప్... సాఫ్ట్ వేర్ ఉద్యోగికి భారీ నష్టం
-
హత్య కేసులో నిందితుల అరెస్ట్
దువ్వూరు : మండలంలోని దాసరిపల్లె గ్రామంలో ఈ నెల 21న పొలం గట్టు దగ్గర జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. దువ్వూరు పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని దాసరిపల్లె గ్రామంలో ఈనెల 21న పొలం గట్టు దగ్గర జరిగిన ఘర్షణలో మొలకల శ్రీనివాసులు మృతి చెందగా, మొలకల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ హత్య కేసులో ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, పిక్కిలి వీరన్న, శీలం రామశేషయ్య, శీలం పెద్దయ్య, భోగాది నవీన్లను మండలంలో కానగూడూరు వద్ద మంగళవారం అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడైన పిక్కిలి లక్ష్మీనారాయణ, అతని భార్య నరసమ్మ పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భార్య మందలించిందని భర్త ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగరం యానాది కాలనీకి చెందిన వై.పుల్లయ్య(55) ఈ నెల 27న తన భార్య మందలించిందని విషపుగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పుల్లయ్య తరచూ మద్యం తాగి రావడంతో భార్య మందలించడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప టూటౌన్ పోలీసులు తెలియజేశారు. వృద్ధురాలిని బెదిరించి నగల అపహరణ కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామాంజనేయపురంలో సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి అనే వృద్ధురాలిని బెదిరించి ఆమె వద్ద నుంచి 6 తులాల బంగారు నగలు ఓ దొంగ దోచుకుని వెళ్లాడు. ఈ సంఘటన వివరాలను కడప రిమ్స్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రామాంజనేయపురంలో లక్ష్మీదేవి, ఆమె భర్త శ్రీనివాసులు ఉంటున్నారు. సాయంత్రం భర్త పని మీద బయటికి వెళ్లడంతో ఒంటరిగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంది. గుర్తుతెలియని దుండగుడు వారి ఇంట్లోకి వెళ్లి ఆమెను బెదిరించాడు. ఒక సరుడు, నల్లపూసల దండ మొత్తం 6 తులాల బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే వారి రక్షణ కోసం చట్టం తీసుకురావాలని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలక్రిష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్ను శ్రీనివాసులు, ఏపీయూడబ్లూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్ర శివతోపాటు ఎలక్ట్రానిక్స్ మీడియా రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టడానికి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఈ నెల 27న గుర్తు తెలియని యువకుడు(24)ని వైద్యం కోసం తీసుకుని వచ్చారు. అతన్ని తీసుకుని రాగానే పరీక్షలు జరిపి మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు. 1న టీటీసీ శిక్షణకు హాజరు కావాలి కడప ఎడ్యుకేషన్ : టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు మే 1వ తేదీ ఉదయం 9 గంటలకు కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హాజరు కావాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్ ఒరిజినల్, ఒక జిరాక్స్ కాపీ, సంబంధిత టెక్నికల్ ట్రేడ్లో పాస్ అయిన డిప్లొమా సర్టిఫికెట్ ఒరిజినల్తోపాటు జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని పేర్కొన్నారు. టీటీసీ అనేది డ్రాయింగ్, టేలరింగ్, మ్యూజిక్ వంటి సాంకేతిక అంశాలను బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అందించే 42 రోజుల వేసవి శిక్షణ కోర్సు అని తెలిపారు. ఇది డ్రాయింగ్, క్రాఫ్ట్, ఇతర నైపుణ్య ఆధారిత రంగాలలో టీచర్గా పని చేయడానికి అవసరమైన ధృవీకరణను అందిస్తుందని వివరించారు. -
పెట్రోలు, డీజిల్ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
● వారం రోజులుగా అన్ని వర్గాల వారు నష్టపోతున్నారు ● ప్రతి ఆటో కార్మికుడికి రోజుకు రూ.1000 చెల్లించాలి ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెట్రోలు, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఓ రకంగా సంక్షోభమేనని వెఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో ఎక్కడా ఈ కొరత లేదని, మన రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. దీనివల్ల వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంట నూర్పిళ్ల యంత్రాలకు, రైతుల ట్రాక్టర్లకు డీజిల్ ఎంతో అవసరమని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు, ఆక్వా రైతులు, నిత్యావసర వస్తువులకు సంబంధించి సరఫరా చేసే వాహనదారులు ఇలా అన్ని వర్గాల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారం రోజులుగా సమస్య ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవలేదని తెలిపారు. అలసత్వం కంటే చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని, పరిపాలన దక్షత లేదని అన్నారు. ఆర్భాటంగా తాను గొప్ప అడ్మినిస్ట్రేటర్ని అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నారన్నారు. సంక్షోభం నుంచి ప్రజలను, రైతులను గట్టెక్కెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనే ధరలు తక్కువ డీజిల్, పెట్రోలు ధరలు మన రాష్ట్రం కంటే పక్క రాష్ట్రాల్లోనే తక్కువగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏమి చేస్తున్నారని రాచమల్లు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.109.37, కర్ణాటకలో రూ.102, చైన్నెలో రూ.100, తెలంగాణలో రూ.107, ఢిల్లీలో రూ.95 ఉందన్నారు. అలాగే మన రాష్ట్రంలో డీజిల్ ధర రూ.97.22 ఉండగా కర్ణాటకలో రూ.90, చైన్నెలో రూ.92, ఢిల్లీలో రూ.87 ఉందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ డీజిల్ లేక ఆగిపోయింది అన్నారు. అన్ని చోట్ల ఈ ప్రభుత్వంలో పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని విమర్శించారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద నో స్టాక్, రైతులు వెళితే యూరియా అంగళ్ల వద్ద నోస్టాక్ బోర్డులు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీకి ఫుల్స్టాప్ పెట్టారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు లేవని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు ఉద్యోగాలు లేవన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, గత రెండేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. అంబులెన్స్లకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి వచ్చిందని, ఆస్పత్రుల్లో ఈ సమస్య కారణంగా ఆపరేషన్లు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, గత ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులకు రోజుకు రూ.1000గా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గమనించాలని కోరారు. -
మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం
● ముగిసిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ● అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం బ్రహ్మంగారిమఠం : ‘మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం’ అంటూ భక్తులు పోటీపడ్డారు. స్వామి వారి ప్రసాదం స్వీకరించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మంగారిమఠంలో ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు మ ధ్యాహ్నం మహాప్రసాద వినియోగం చేపట్టారు. బి య్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కలు, ఎండుకొబ్బరి, పాలు తదితరాలతో మహాప్రసాదాన్ని తయారు చేశారు. గర్భాలయంలో స్వామి వారి ఎదురుగా.. ఒక రాశిలా పోసి నివేదించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన ధర్మపత్ని ఉమాదేవి ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు స్వీకరించి కళ్లకు అద్దుకుని ఆరగించారు. మరికొందరు ఇంటికి తీసుకెళ్లారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మహాప్రసాదానికి ప్రొద్దుటూరు నియోజకవర్గం సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం మఠాధిపతి మహానివేదన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సాహ భరితంగా ఉత్సవం ఉదయం ఉత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పీఠంపై అధిష్టింపజేసి, విశేష పూజలు చేశారు. పెద్దమఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి విశేష పూజలు చేశారు. ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. కడప పుట్టా యాడ్స్కు చెందిన అమృతమ్మ, వెంకటసుబ్బయ్య శ్రేష్టి, లక్ష్మీదేవి ఉభయదారులుగా వ్యవహరించారు. తెల్లవారుజామున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవారి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది, స్వామి శిష్య బృందం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుటుంబ సభ్యులు, పీపీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మహానివేదన పూజలు చేస్తున్న మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి మహాప్రసాదం పంపిణీ చేస్తున్న మఠాధిపతి ధర్మపత్ని ఉమాదేవి -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రగడ
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మంగళవారం పీయూసీ–1, ఇంజినీరింగ్–1, 2 విద్యార్థులకు సెమిస్టర్– 2 పరీక్షలు ముగియడంతో జూన్ 5 వరకు సెలవులు ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది అవుట్ పాస్ కోసం ఏర్పాటు చేసిన యాప్ పని చేయకపోవడంతో అవుట్ పాస్ ఇచ్చేందుకు కొంచెం ఆలస్యమైంది. దీంతో సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. మధ్యాహ్నం గంటపాటు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రగడ చోటుచేసుకుంది. అవుట్ పాసులు ఇవ్వకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో గొడవకు దిగారు. విద్యార్థులకు అవుట్ పాస్ ఇవ్వడంలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. మాన్యువల్ పేరుతో అవుట్ పాస్ ఇవ్వడంలో సిబ్బంది ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా అవుట్ పాస్ జారీ చేసే సిబ్బంది ఇద్దరే ఉండడంతో జాప్యం జరుగుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు రిజర్వేషన్ చేసుకోవడంతో ఆందోళనలో పడ్డారు. ఇంత జరుగుతున్నా ట్రిపుల్ ఐటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీ నుంచి వేంపల్లెకు రావాలంటే ఆటోలతో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య గొడవ -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
● కారును ఢీకొన్న టిప్పర్ ● డ్రైవర్ దుర్మరణం ● ఇద్దరికి తీవ్ర, ఐదుగురికి స్వల్ప గాయాలుజమ్మలమడుగు రూరల్ : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందగా, ఇద్దరికి తీవ్ర, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జయనగర్కు చెందిన రంగనాయకులు కుటుంబానికి చెందిన 8 మంది కుటుంబ సభ్యులు పొలతల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటను సందర్శించారు. అనంతరం స్వస్థలం అయిన తాడిపత్రికి రంగనాయకులు, పెద్దక్క, భారతి, వెంకటమ్మ, అనీత, ఆమె భర్త వెంకటరమణ, చిన్నారులైన దీపక్, అమ్ము, ప్రణవ్ కలసి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలోని చిటిమిటిచింతల (పాటి) సమీపానికి రాగానే మూద్దనూరు వైపు నుంచి కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ రంగనాయకులు కుమారుడు వెంకటరమణ (24) అక్కడికక్కడే మృతి చెందగా, పెద్దక్క, భారతి, వెంకటమ్మకు తీవ్ర, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భారతి, వెంకటమ్మను మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ యాజమాని రంగనాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంగమాంబ ఉత్సవాలకు వేళాయె
● భక్త కవయిత్రిగా ప్రసిద్ధి ● నేటి నుంచి జయంతి ఉత్సవాలు ● తిరుమల, తరిగొండలో వేడుకలు గుర్రంకొండ : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను ధైర్యంగా ఎదిరించింది. వెంగమాంబ జయంతి ఉత్సవాలు తరిగొండ, తిరుమలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం. 17వ శతాబ్దంలో జననం క్రీ.శ 17వ శతాబ్దంలో చిత్తూరు జిల్లా తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కానాడ కృష్ణమూర్తి, అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తన భర్తగా భావించి నిరంతరం అద్వితీయమైన ధ్యానముద్రలో గడిపేది. ఎన్నో రచనలకు శ్రీకారం శ్రీ వెంకటేశ్వరస్వామిపై అనురక్తితో అనేక రచనలకు శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్మరిస్తూ శ్రీ నరసింహ శతకం రచించింది. దీ నికి నిదర్శనంగా ఇప్పటికీ తరిగొండలో శ్రీ లక్ష్మీనరసిం హస్వామి ఆలయంలోనే శ్రీ వెంగమాంబ ఆలయం ఉంది. శ్రీకృష్ణపారిజాతం, ముక్తకాంతావిలాసం, శ్రీ ముద్రరామాయణ ద్విపద కావ్యాలను రచించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి మీద సుమారు రెండు వేల కీ ర్తనలను తాళ పత్రాలపై రచించింది. ఈ తాళపత్రాలు నేటికీ తిరుమలలో టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. సాంఘిక దురాచారాలను ధిక్కరించిన ధీరవనిత క్రీ.శ 17,18 శతాబ్దాల్లో సమాజంలో సాంఘిక దురాచారాలను కట్టుదిట్టంగా అమలు చేసేవారు. తిరుపతి సమీపంలోని భాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వెంగమాంబ వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించారు. బ్రాహ్మణ సమాజంలో సనాతన సంప్రదాయాలు ఎక్కువగా పాటించేకాలం. బ్రాహ్మణ సీ్త్రకి భర్త మరణిస్తే శిరోముండనం చేయించి బొట్టు, గాజు, మెట్టలు తొలగించి ఇంటిలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసుడినే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సంప్రదాయాలను తిరస్కరించింది. ఈమె ధోరణిని నిరసిస్తూ బ్రాహ్మణులంతా పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహా భారతికి ఫిర్యాదు చేశారు. గురుపీఠం దగ్ధం.. శిరోజాలు యథాతథం పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించిన పెద్దలు.. పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్ధమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెకు బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. సాన్నం చేసిన తరువాత వెంగమాంబ తలపై శిరోజాలు మునపటి లాగే దర్శనమిచ్చాయి. దీంతో వెంగమాంబకు గ్రామ బహిష్కారం విధించారు. ముస్లిం మతపెద్ద మురాషావలీ ఆశ్రయం గ్రామ బహిష్కారానికి గురైన శ్రీ వెంగమాంబకు తరిగొండలో అప్పటి గొప్ప సూఫీమత బోధకుడు ముస్లిం మతగురువైన హజరత్ సయ్యద్ మురాద్షావలీ ఆశ్రయం కల్పించారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంది. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే ఈ మురాద్వలీ దర్గా(సమాధి) ఉంది. ఏటా ఇక్కడ వెంగమాంబ ఉత్సవాల కంటే మునుపే దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని మారెళ్ల గెవి(గుహ)కు చేరుకుంది. అయితే ప్రతి రోజు ఆమె సాధనకు అవసరమైన సాధన సామగ్రి, కందమూలాలను మురాద్షావలే సమకూర్చేవారు. ఆంజనేయస్వామి గుహ నుంచే తిరుమలకు.. బ్రాహ్మణ పెద్దల ప్రవర్తనతో మనస్తాపం చెందిన వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించారు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం వెనకవైపు ఉన్న సొరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకున్నారు. అక్కడ తుంబుర తీర్థంలోని శ్రీ వెంగమాంబ గుహగా పిలువబడే పర్వతశ్రేణిలో తన సాధన కొనసాగించింది. అక్కడే కొన్ని రచనలు, కీర్తనలు రచించింది. ముత్యాల హారతి.. వెంకటేశ్వరుడికి జోలపాట తిరుమలలోనూ బ్రాహ్మణుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీనివాసుడు అంతర్థానమె(ప్రత్యక్షమై) ఉండటం బ్రాహ్మణులు వీక్షించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించాలని వేడుకొన్నారు. అప్పటి నుంచి కొండపైన అన్నయమ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకు కల్పించారు. ఉండడానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామి వారి జోలపాట ముత్యాలహారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు. అప్పటి నుంచి ఆమె తరువాత ఆమె వంశీకులు నేటికి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యాన్నదానానికి శ్రీకారం తిరుమలలో నేటికి కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తరిగొండ శ్రీ వెంగమాంబే. క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. వందలాది మంది భక్తుల ఆకలిని ప్రతి రోజూ తీర్చేది. టీటీడీ వారు నేటికి ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రోజూ కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ సమీపంలోని నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం. రెండు రోజుల పాటు జయంతి ఉత్సవాలు మండలంలోని తరిగొండ ఆలయంతోపాటు తిరుమలలో శ్రీ వెంగమాంబ జయంతి ఉత్సవాలు బుధవారం అంకురార్పణతో ప్రారంభం అవుతాయి. గురువారం తరిగొండలోని వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, 11 గంటలకు పుష్పాంజలి, సాయంత్రం ఆరు గంటలకు గోష్టిగానం, 7 గంటలకు హరికథా వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుపతి శ్రీ వెంగమాంబ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతి పొందిందని ఉపకులపతి ఆచార్య బి.జయరామిరెడ్డి తెలిపారు. ఆ యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నూతన అవకాశాలను కల్పించేలా యూనివర్సిటీ కొత్త అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశ పెడుతుందని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికత, ఆవిష్కరణలను సమన్వయం చేస్తూ ఈ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో కొత్తగా ‘ఫ్యాషన్ అండ్ అపారెల్ డిజైన్’ కోర్సును 60 సీట్లతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘ఫైన్ ఆర్ట్స్’లో 24 సీట్లతో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశ పెట్టనున్నామన్నారు. కళాత్మకతను ఆధునిక సాంకేతికతతో మేళవించే ఈ కోర్సులు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. ఈ కోర్సులతో ఉత్తమ కెరీర్ అవకాశాలు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్’, ‘సివిల్ ఇంజినీరింగ్’ కోర్సులు ఒక్కొక్కటి 60 సీట్లతో ప్రారంభించనున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కోర్సును 24 సీట్లతో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్, రోబోటిక్స్ నిపుణులు వంటి ఉన్నత స్థాయి టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. మొత్తంగా ఈ కోర్సులు టెక్నాలజీ, నిర్మాణం, డిజైన్ రంగాలను కలిపి విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉత్తమ కెరీర్ అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఈ కొత్త కోర్సుల ప్రవేశంతో డా. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సృజనాత్మకత, సాంకేతికత, డిజైన్ రంగాలలో ఒక ప్రముఖ కేంద్రంగా ఎదగనుందన్నారు. భవిష్యత్తుకు అనుగుణమైన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సమన్వయకర్త బి.నారాయణ రెడ్డి, ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ మునావర్ పాషా, అకాడమిక్ నిపుణులు సి.శివయ్య, డాక్టర్ ఉషా మాధురి, యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి వి.శివకృష్ణారెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
సుండుపల్లె: పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. మంగళవారం సుండుపల్లె పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుండుపల్లిలో సీఐ కార్యాలయం నూతనంగా ఏర్పాటు కావడంతో ఆయన పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించిన డీఐజీ, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ వంటి వాటిపైన విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను తెలియజేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్రామనాథ్హెగ్డే, రూరల్ సీఐ ఏపీ మస్తాన్, ఎస్ఐ ఎస్కెఎం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ -
ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల ఫీజును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఇంటర్ విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ రెండింటిలోనూ ఫెయిల్ అయిన విద్యార్థులురూ.1200 చెల్లించాలన్నారు. ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఒక పేపర్కు రూ.160లు చెల్లించాలని పేర్కొన్నారు.కడప సెవెన్రోడ్స్: వస్త్ర ఎగుమతులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ ఎగుమతుల విజన్–2030ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని, అందుకు అనుగుణంగా జిల్లా నుంచి వస్త్ర ఎగుమతులకు ప్రోత్సాహం కల్పిస్తామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర చేనేత జౌళిశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని చేనేత జౌళి ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త యూనిట్లు ప్రారంభించే ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడీ పిచ్చేశ్వరనాయుడు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, పరిశ్రమల జనరల్ మేనేజర్ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సేవల గురించి సమగ్ర సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో కడప జిల్లా కడప రిమ్స్ ఆవరణంలోని మానసిక వైద్యశాల అధికారులు సిబ్బంది ప్రథమ స్థానంలో నిలిచారని ఐఎంఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. వెంకటరాముడు వెల్లడించారు. వైద్య సేవలపై పేషెంట్స్ దగ్గర నుంచి సేకరించిన ఈ సర్వేలో కడప మానసిక వైద్యశాల సిబ్బంది సేవలు 81.4 గా నమోదైందని వివరించారు. రాష్ట్రంలో 40 అనుబంధ వైద్య కళాశాలల్లో, సర్వజన వైద్యశాలల్లో సర్వే చేస్తే వాటిల్లో కడపలోని మానసిక వైద్యశాలకు ప్రథమ స్థానం లభించడం అభినందనీయమని.. ఈ సేవలో పాలుపంచుకున్న ఐఎంహెచ్ వైద్యులు సిబ్బందికి ఐఎంఎస్ సూపరింటెండెంట్ కృతజ్ఞతలు తెలిపారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: మే 1 నుంచి 31 వరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్ బాషా పేర్కొ న్నారు. మంగళవారం నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో క్రీడాకారుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 క్రీడాంశాలలో 30 శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడా యాప్ ద్వారా సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. క్రీడాకారులందరూ పాల్గొని ఈ శిక్షణ శిబిరాలను జయప్రదం చేయాలని సూచించా రు. స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి, కోచ్లు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లోని అదీప్ ల్యాబొరేటరీ యూనిట్లో ఈనెల 30న నిర్వహించనున్న ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలో ఆయిల్, కెమికల్ ఉత్పత్తి కేంద్రాల్లో విపత్తులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించే.. ‘ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహణ‘పై ఏపీఎస్ డీఎంఏ అధికారులు అన్ని జిల్లాల సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి, ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ చీఫ్ చిన్నారావ్ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం ఇన్ఛార్జి డీఆర్వో మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాక్డ్రిల్ సమయంలో కొప్పర్తి పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా కొన్ని పరిమితులు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
బడి మూతబడింది.... మైదానం రారమ్మని ఊరిస్తోంది.. పుస్తకం అటకెక్కింది.. అటకపైనున్న బ్యాటు బుడ్డోడి చేతికొచ్చింది. సందు దొరికితే చాలు పక్కసందులోకి వెళ్లి ఆడాలని చిన్నారి మనసు ఉవ్విళ్లూరే కాలమిది.. కుదిరితే ఈతాడాలని.. సమ్మర్ ట్రిప్కెళ్లాలని మారాం చేసే వయసిది
కడప ఎడ్యుకేషన్: నిన్నామొన్నటి వరకు పిల్లలతో సందడిగా ఉన్న బడులన్నీ నేడు వేసవి సెవులతో నిశ్శబ్దమైపోయాయి. ఆ సందడంతా ఇంటి గడపలకు చేరింది. సెలవు రోజుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు అజాగ్రత్తల వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వారికి చెరువులు, నదులు, కుంటలు,బావులపై అవగాహన కల్పించాలి. దీంతోపాటు వారికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది. నీరు.. కాకూడదు కన్నీరు.. ఓ వైపు ఎండలు మరోవైపు ఉక్కపోత.. ఇంకేముంది నీరు కనిపిస్తే చాలు పిల్లలకు ఎక్కడ లేని ఉల్లాసం ఉరకలేస్తుంది. ఆనందం పొంగుకొస్తుంది. ఈ ఉల్లాసంలో నీటి మడుగులు, బావులు, చెరువుల ఎంతలోతు ఉన్నాయో ఆలోచించరు. ఈత వచ్చిన వారితో పాటు ఈత రానివారు కూడా సరదాగా దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులకు కడపకోత మిగుల్చుతున్నారు. అందుకే ఈత రాని వారు చెరువులు, కాలువలు వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. స్నేహితులతో బయటికి పంపిస్తే.. పిల్లలను ఆడుకునేందుకు స్నేహితులతో బయటికి పంపిస్తే ఎవరితో వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఎండలకు బయట తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు వేసవి కాలం కావడంతో వేడికి తట్టుకోలేక విష పురుగులు బొరియల నుంచి బయట వచ్చి చల్లటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. పిల్లలు ఆటల్లో పడి ఆదమరిస్తే వాటి కాటుకు గురి కావాల్సి ఉంటుంది. సెలవులు ముగిసే వరకు పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గాలి పటాలను ఎగుర వేసేటప్పుడు... వేసవి సెలవులు కావడంతో పిల్లలు గాలిపటాలను ఎగురు వేసేటప్పు డు విద్యుత్తు తీగలతో జాగ్రత్తగా ఉండాలి. గాలిపటాలు విద్యుత్తు తీగల నడుమ ఇరుకొన్నప్పుడు వాటిని తొలగించేందుకు ఇనుపకడ్డీలు, పచ్చి కర్రలను వాడవద్దు. అలాగే క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలాడుకునే సమయంలో విద్యుత్తు నియంత్రికల వద్ద జాగ్రత్తగా ఉండాలి. నదులు, చెరువులు, కాల్వలుప్రమాదాలకు నిలయాలు పిల్లలు బయటకు వెళ్లినప్పుడుఓ కంట కనిపెట్టాలి షికారుకు వెళ్లే పిల్లలకుతల్లిదండ్రులు సూచనలు చేయాలి సమ్మర్ ట్రిప్ తీపి జ్ఞాపకాలుగా మిగలాలి -
ఎండలతో అప్రమత్తంగా ఉండాలి
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఆటల్లో మునిగి తెలుతూ ఉంటారు. ఆటల సరదాలో పడి ఎండను పట్టించుకోరు. పైగా ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా అధికంగా ఉంది. ఇలాంటి తరుణంలో పిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలను ఉదయం 9 గంటలకే ఆటలను ముగించుకుని ఇంటికి వచ్చేలా చూడాలి. సాయంత్రం 5 గంటల పైన బయటకు తీసుకెళ్లాలి. అలా చేస్తేనే మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యు లను సంప్రదించాలి. –డాక్టర్ అవ్వారు అర్జున్కుమార్, ప్రముఖ వైద్యులు, రిమ్స్, కడప సెలవులను వృథా చేసుకోవద్దు విద్యార్థులను వేసవి సెలవులను వృథా చేసుకోవద్దు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సరదాగా ఆటల్లో శిక్షణ పొందటం, స్పోకన్ ఇంగ్లిష్లో శిక్షణ తీసుకోవడం వంటివి చేయాలి. ఎండల తీవ్రత తగ్గాక సాయంత్రంగా ఆటపాటలతో ఎంజాయ్ చేయాలి. అలాగే సెలవుల్లో పిల్లలను గ్రంథాలయాలకు వెళ్లి పత్రికలు, మ్యాగజైన్స్, విజ్ఞాన పుస్తకాలను చదివించే అలవాటు చేయాలి. సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్జిల్లా పిల్లలను గమనిస్తుండాలి ఇంట్లో తెలియకుండా పిల్లలు స్నేహితులతో కలిసి ఈత సరదాతో బావులు,చెరువులు, కుంటలు వంటి ప్రదేశాలకు ఈతకు వెళ్తుంటారు. అక్కడ ఈత కొడుతున్నవారిని చూసి వీళ్లు కూడా ఈత రాకపోయినా సరదగా నీళ్లలోని దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలను భద్రంగా చూసుకోవాలి. –ప్రసాద్రెడ్డి, పీడీ -
గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధికి కార్యాచరణ
ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ మదనపల్లె: గ్రామీణ ఉపాధిహమీ పథకం ద్వారా గ్రామాల నీటివనరుల పునరుద్ధరణకు సమగ్ర కార్యా చరణ అమలు చేస్తున్నామని, ఇందులో చెరువులు, ఫీడర్, సప్లయ్ ఛానల్స్ పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వైవికే.షణ్ముఖ్ కుమార్ అన్నారు. మంగళవారం మదనపల్లెలో అన్నమయ్య, కడప జిల్లాల ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏటీఓలు, టెక్నికల్ అసిస్టెంట్ల్లకు జలధార–జలహారతి కార్యక్రమంపై అవగాహన, శిక్షణ సదస్సుకు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని చెరువులకు అనుసంధానంగా ఉన్న ఫీడర్ ఛానల్స్, సప్లై ఛానల్స్, నీటి ప్రవాహ మార్గా లన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తూ, వాటిపనులను ఉపాధి కూలీలతోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్వామా పీడీలు వెంకటరత్నం, ఆదిశేషారెడ్డి, భూగర్భ జలాల శాఖ ఈఈ సువర్ణ కుమార్ పాల్గొన్నారు. -
● సెల్ఫోన్ వద్దే వద్దు..
చిన్న పిల్లలకు చేతిలోకి సెల్ఫోన్ వచ్చిందంటే ఒళ్లు, ఇళ్లు మరిచిపోయి ఎన్ని గంటలైనా అలా సమయం గడిపేస్తూ ఉంటారు. పాఠశాలకు సెలవు రోజుల్లో పిల్లలు సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అల్లరి చేయకూడదనే ఉద్దేశ్యంతో సెల్ఫోన్ను పిల్లలకు ఇస్తుంటారు. మొదట్లో బాగానే ఉన్నా కొన్ని రోజులకు పిల్లలు ఆ సెల్ఫోన్కు బానిసలుగా మారిపోతారనే విష యాన్ని గ్రహించాలి. దీంతోపాటు సెల్ఫోన్లో ఆన్లైన్ ఆటలకు, గేమ్లకు బానిసయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే సెల్ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం సరదాగా గడపాలి. -
● సమ్మర్ ట్రిప్పులతో జాగ్రత్త...
పాఠశాలలకు సెలవులు కావడంతో చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటారు. విహార యాత్రల్లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా విజయవంతం అయ్యి సంతోషాన్ని పొందాలంటే తగిన ప్రణాళికలు అవసరం. టూర్కు వెళ్లే ప్రతి ఒక్కరు ఫొటో, చిరునామాతో కూడిన గుర్తింపు కార్డు తమ వెంట ఉంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులందరితో పాటు విహార యాత్రకు వెళ్లే టప్పుడు ఆ బృందంలో ఒక్కొక్కరుగా పిల్లల బాధ్యతను పంచుకోవాలి. నీటి పరివాహక ప్రాంతాలు, కొండలు, లోయలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈతకొట్టడం, ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. -
హత్య కేసులో ఒకరి అరెస్ట్
రాజంపేట : నందలూరు మండలం టంగుటూరు పంచాయతీ గట్టుమీదపల్లెలో బెల్లంకొండయ్యను రాయితో హత్య చేసిన కేసులో చిన్నయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు. శనివారం తన కార్యాలయంలో అరెస్టు చూపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య కేసులో నిందితుడిని రాజంపేట జేఎఫ్సీఎం కోర్టుకు హాజరుపరిచామన్నారు. రిమాండ్కు తరలించామన్నారు. ఏఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, నందలూరు పోలీసులు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డున తిప్పలూరు గ్రామ సమీపాన సాయిబాబా గుడి వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఆవరణలో బైక్ను లారీ ఢీకొన్న సంఘటనలో పెను ప్రమా దం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లారీ పెట్రోల్ బంకులోకి వెళ్తున్న సమయంలో బైక్ను ఢీకొంది. ద్విచక్ర వాహనం లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జు అయింది. అయితే బైక్ నడిపే వ్యక్తి పక్కకు దూకడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడ చూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాణి కాలువలో మృతదేహం వెలికితీత జమ్మలమడుగు రూరల్ : రాణి కాలువలో పడి మృతి చెందిన మోరగుడి గ్రామానికి చెందిన కుండా చిన్న చౌడయ్య(65) మృతదేహన్ని శనివారం వెలికితీశారు. మోరగుడి గ్రామంలోని శ్రీరాములపేటలో ఉన్న రాణి కాలువలో శుక్రవారం మృతదేహం ప్రత్యక్షం కావడంతో వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నించారు. కాగా రాత్రి కావడంతో తీయడానికి వీలు పడలేదు. చిన్న చౌడయ్య 3 రోజుల క్రితం మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోందని ఆయన కుమారుడు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు. -
‘జలధార’ను విజయవంతం చేద్దాం
కడప సెవెన్రోడ్స్: నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల భాగస్వాములతో జలధార కార్యక్రమాల ప్రణాళికలను మరింత ప్రాధాన్యతతో పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ నోడల్ అధికారులు,మండల స్థాయి బృందాల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ‘జలధార.. జల హారతి, నీటి భద్రత– అమలు ప్రణాళికపై అన్ని మండలాల నోడల్ అధికారులు,ఎంపీడీఓలు,ఇరిగేషన్,డ్వామా అధికారులులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు మట్టాన్ని పెంపొందించడం,నీటి వనరులు సంరక్షణ,సాగునీటి వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించాలన్నారు. అందులో భాగంగా నీటి వనరులను గుర్తించడం నీటి భద్రత, సాగునీటి పొదుపు, కొత్త ఆయకట్టు మదుపు,వాగులు, చెరువుల అనుసంధానం, సూక్ష్మ సేద్యం,వర్షపు నీటిని ఒడిసి పట్టడం.. తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మే 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు గ్రామాల వారీగా వారి పరిధిలోని చెరువుల్లో వారి సొంత అవసరాలకు మట్టిని తోలుకోవచ్చని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ అబ్దుల్, గ్రౌండ్ వాటర్ డీడీ మురళీధర్, సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
గురుదేవా.. దీవించవా..
● ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ● పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు విద్యుత్ దీపాలంకరణలో వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బ్రహ్మంగారిమఠం : ‘గురుదేవా.. దీవించవా’.. ‘మీ దరికి చేరామయ్యా.. మమ్మల్ని కాపాడవయ్యా..’అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శనివారం తెల్లవారుజామున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠంలోని విరాట్ నగర్లో విజయవాడ వారు ఏర్పాటు చేసిన శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి నిత్య అన్నదాన విశ్వబ్రాహ్మణ సేవా సమాజం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం మహా నైవేద్య పూజ కార్యక్రమాన్ని మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణం చేశారు. వైభవంగా నరనంది ఉత్సవం రాత్రి నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి నరనంది వాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. ఉత్సవానికి బద్వేలు నియోజకవర్గం రామాపురంలోని నీరొద్దుల పాపయ్య కుమార్తె వెంకటమ్మ ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను పారాయణం చేశారు. రాత్రి పాల రామాంజనేయులు భాగవతార్ ప్రదర్శించిన హరికథ అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మఠం మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో సిబ్బంది, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో పీపీఎన్ ప్రసాద్, దత్తాత్రేయస్వామి తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ రక్షణ కవచం
● ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ● పోలీస్ సిబ్బందికి 1000 హెల్మెట్లు అందజేత మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వాహనదారులు కడప అర్బన్ : పోలీసులు బైక్పై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించి, అందరికీ ఆదర్శంగా ఉండాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దాతల సహకారంతో పోలీస్ సిబ్బందికి 1000 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ వంతు సామజిక బాధ్యతగా పోలీస్ శాఖకు హెల్మెట్లను అందజేసిన దాతలు రెసోనియా ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ మిషన్ కంపెనీ ప్రతినిధులు చీఫ్ మేనేజర్ రాజ్ కుమార్, మేనేజర్ యశ్వంత్, కడప మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహమూర్తి, ప్రసాద్రెడ్డిలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు దైనందిన విధుల్లో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ద్విచక్ర వాహనంపై విధుల్లో ఉంటారని, ముందుగా వారి సంరక్షణకు హెల్మెట్ ధరించి సాధారణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. ముందుగా పోలీస్ శాఖలోని సిబ్బంది నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాల తీవ్రతను తెలియ చేస్తూ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను జిల్లా ఎస్పీ ప్రారంభించి తిలకించారు. భారీ బైక్ ర్యాలీ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన హెల్మెట్ అవగాహన ర్యాలీని స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందిలో ఉత్సాహం నింపారు. ర్యాలీ సెవెన్ రోడ్స్ వరకు చేరుకుంది. అనంతరం హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రజలు, వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, ఏఆర్ డి.ఎస్.పి నాగేశ్వర రావు, మైదుకూ రు డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్, ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, శ్రీశైల రెడ్డి, టైటస్, పెద్దయ్య, నగరంలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
దళిత యువకుడిపై దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
రాజంపేట : ఒంటిమిట్ట దళితవాడకు చెందిన హర్షవర్ధన్పై దాడి చేసిన కేసులో కట్టా హరికృష్ణ, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్కుమార్ను అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు. ఎస్డీపీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితులను అరెస్టును చూపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ముగ్గురు నిందతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందన్నారు. రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మురతోటి డానియల్ ప్రదీప్ పేర్కొన్నారు. శనివారం నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మురతోటా డా నియల్ ప్రదీప్, ఉపాధ్యక్షుడిగా ధామస్ జీవన్బాబు, సంయుక్త కార్యదర్శులుగా విక్టర్ ప్రభుదాస్, పోతుల శ్రీనివాసులు, నీలిమతోపాటు పలువురిని ఎన్నుకున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటా అండ్ అథ్లెటిక్ కమిటీని ఎన్నుకున్నారు. ఏపీఎఫ్ఏ మార్గదర్శకాల ప్రకారం తొలిసారిగా స్పోర్ట్స్ కోటా, అథ్లెటిక్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. స్పోర్ట్స్ సభ్యులుగా రంగస్వామి, నీరిషక్నా, అథ్లెటిక్స్ కమిటీ సభ్యులుగా ముక్తియార్, మామిడి సుతుల, రమేశ్వర్రెడ్డిని ఎన్నుకున్నారు. -
రీచ్ మాటున ఇసుక అక్రమ రవాణా
● బహుదా నదిలో భారీగా తవ్వకాలు ● సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు ● క్వారీ రద్దు చేయాలని గ్రామస్తుల నిరసన సుండుపల్లె : మండల కేంద్రంలోని ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుప్పగుట్ట సమీపంలోని రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అండదండలతో వందలాది టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారని బహుదానది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతన్నలు సుండుపల్లెలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని పేర్కొన్నారు. బహుదా నదిలోని రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోర్లలో నీరు సరిగ్గా రావడం లేదన్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడం లేదని వాపోయారు. బహుదానది నీటితో దాదాపు 40 నుంచి 50 వేల మంది జనాభాకు తాగునీరు, కొన్ని వందల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. బహుదానదిలో ఇసుక ఖాళీ అవుతుండటంతో భూగర్భజలం తగ్గిపోయి, సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు. ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు ప్రభుత్వ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్లో 1.79 హెక్టార్లలో 1 మీటర్ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు దాదాపు 50 హెక్టార్లలో 8 మీటర్ల లోతు నుంచి 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తోడేసి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే క్వారీని రద్దు చేయాల్సిన సంబంధిత అధికారులు.. క్వారీ వద్దకు వచ్చి అక్రమంగా ఎంత మేర ఇసుకను తోడారో కనీసం కొలతలు కానీ, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకుండా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. ఇష్టారాజ్యంగా లోతుకు వెళ్లి ఇసుకను తోడేస్తూ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్తో రెండు టిప్పర్లకు ఒకే నంబర్ గల ప్లేట్లను వేసి ఇసుకను తరలిస్తున్నారని పేర్కొన్నారు. పలుమార్లు అర్జీల రూపంలో తెలియజేసినా అధికార పార్టీకి చెందిన నాయకుని అండదండలతో ఏ ఒక్క మండల అధికారి అక్కడికి వెళ్లి తనిఖీ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక క్వారీని రద్దు చేయించి, తమకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నాన్నారు. తహసీల్దార్ హామీతో నిరసన విరమణ నిరసన కార్యక్రమం వద్దకు చేరుకున్న తహసీల్దార్ గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక క్వారీ వద్ద వీఆర్ఓ, వీఆర్ఏలతోపాటు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుని, ఇసుక తవ్వకాలను తక్షణమే రద్దు చేస్తామని గ్రామస్తులకు తెలపడంతో వారు వెనుతిరిగారు. ఇసుక క్వారీని రద్దు చేయకుండా మళ్లీ ఇసుకను తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. -
రేపటి నుంచి సురభి నాటకాలు
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో సోమవారం నుంచి సురభి నాటకాల ప్రదర్శనలు ప్రారంభమవుతాయని భానోదయ నాటక మండలి అధ్యక్షుడు ఆర్.నాగబాబు తెలిపారు. నాగలగుట్టపల్లెలోని నాగ చైతన్య విద్యానికేతన్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో నాటకాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. సోమవారం భక్త ప్రహ్లాద, మంగళవారం పాతాలభైరవి, బుధవారం లవకుశ, గురువారం బాల నాగమ్మ, శుక్రవారం మాయాబజార్తో సురభి నాటకాలు ముగుస్తాయని వివరించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలు తిలకించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
కడప అర్బన్ : కడప నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ హోంగార్డ్స్ పరేడ్ను పరిశీంచారు. ఈ సందర్భంగా హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. తరువాత దర్బార్లో హోంగార్డ్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని అన్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థవంతంగా సేవ చేయగలరన్నారు. అనంతరం హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డ్స్కు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్.పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి పి.నాగేశ్వరరావు, హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, హోంగార్డ్స్ ఇన్చార్జి ఆర్ఐ శ్రీశైలరెడ్డి, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి
బద్వేలు అర్బన్: జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున వరిపంటను సాగు చేసిన నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలుకు విచ్చేసిన ఆయనను స్థానిక నెల్లూరురోడ్డులోని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి వ్యక్తిగత కార్యాలయంలో పలువురు రైతులు కలిసి సమస్య తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన సివిల్ సప్లైస్ ఎండీతో మాట్లాడటంతో పాటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి కోతదశకు వచ్చిందని, అయితే మార్కెట్లో 78 కేజీల బస్తా రూ.1500లకే దొరుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఈ మేరకు కనీస మద్దతు ధర రూ.1830 లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం సకాలంలో స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిందని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వైభవం.. గజవాహనోత్సవం
బ్రహ్మంగారిమఠం: జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం రాత్రి గజవాహనోత్సవం వైభవంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేశారు. మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. ఉత్సవానికి గుంటూరు జిల్లా బుద్దాంకు చెందిన కట్టోజు సత్యనారాయణచార్యులు,వరహాలమ్మ, విశ్వనాథాచారి, గురుస్వాములు, శివరూపాచారి ఉభయదాతలుగా వ్యవహరించారు. ప్రత్యేక పూజలు: అంతకుముందు తెల్లవారుజామున ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు. ఈ ఉత్సవానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మల్లయ్య, ధనలక్ష్మి, డాక్టర్ యక్కల సురేష్బాబు, స్వప్న ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం భక్తుల కాలక్షేపం కోసం మైదుకూరుకు చెందిన యడవల్లి రమణయ్య భాగవతార్ ఆధ్వర్యంలో హరికథ ప్రదర్శించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. -
గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
కడప సెవెన్రోడ్స్: గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అందుకు కీలకం పంచాయతీరాజ్శాఖేనని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం డీపీఆర్సీ భవనంలో నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఏఓలు, జెడ్పీ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశంలో 60 శాతం ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి పనుల కారణంగా తమ పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటున్నారని తెలిపారు. ఎన్నేళ్లు పనిచేశామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు ఏం చేశామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. తాను పదవిలోకి వచ్చి స్వల్ప కాలమే అయినప్పటికీ రూ. 30 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులు చేపట్టామన్నారు. అలాగే 150 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు. అనంతరం విఽధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపీడీఓలు, ఏఓలకు జెడ్పీ చైర్మన్ మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
ప్రొద్దుటూరు క్రైం: మండల పరిధిలోని ఖాదర్బాద్ గ్రామంలో ముందు వెళ్తున్న లారీని ఢీ కొన్న ఘటనలో ఎదురుపాడు సురేష్ (36) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మండలంలోని మూలవారిపల్లె గ్రామానికి చెందిన సురేష్ డ్రైవర్గా వెళ్తుంటాడు. అతను పల్సర్ బైక్లో శుక్రవారం సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. పని ముగించుకొని సాయంత్రం కమలాకర్ అనే వ్యక్తితో కలిసి గ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొనడంతో సురేష్ అక్కడిక్కడే మృతి చెందగా కమలాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఒకరు మృతి, మరొకరికి గాయాలు -
మంత్రి షరీఫ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
కడప కార్పొరేషన్: కడప నగరం ఆలంఖాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి షరీఫ్ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివారే తప్పా అందులోని నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. కేసీ కెనాల్ పక్కన ప్రభుత్వ భూమిని పెద్ద దస్తగిరి ఆక్రమించి వెంచర్ వేశారని, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కట్టడాలు నిర్మించారని చెప్పడం దారుణమన్నారు. రెండేళ్లుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా... నిజంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు...గాడిదలు కాస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. దస్తగిరిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ నాయకులు వందల కోట్లు సంపాదించారని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటిని స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు. హతుడు దస్తగిరి ఒక రవీంద్రనాథ్రెడ్డికే కాదు వైఎస్సార్సీపీలోని అందరికీ సుపరిచితుడని, తమ పార్టీ సానుభూతి పరుడన్నారు. వ్యాపారరీత్యా అతనికి వైఎస్సార్సీపీ నాయకులతోపాటు టీడీపీ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని, చేనతైనే ఆదిశగా కూడా విచారణ చేయించాలన్నారు. రూ.100 కోట్ల ఆస్తులని ఒకరు, రూ.150 కోట్లని మరొకరు మాట్లాడుతున్నారని, మంత్రి షరీఫ్ ఏకంగా రూ.500 కోట్లని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డ కాల్చి మొఖాన వేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి వాఖ్యలు చేసి మీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. ● పెద్ద దస్తగిరి వైఎస్సార్సీపీ నాయకులకు బినామీ అని మాట్లాడుతున్నారని, బినామీల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరైనా ఉంచుతారా అని అంజద్బాష ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఎంతమంది బినామీలు ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలీదా... ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమందిని రాజకీయంగా హత్య చేశారని ఆరోపించారు. హత్యలు, దౌర్జన్యాలు, దాడులు చేయడం టీడీపీకి బాగా అలవాటన్నారు. పెద్ద దస్తగిరి 30 ఏళ్లుగా రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అందుకే అతని వద్ద క్రయ, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉందన్నారు. అంతమాత్రానే అవన్నీ అతనివి అయిపోతాయా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి, తమకు ఎలాంటి గొడవలు లేవని దస్తగిరి కుటుంబ సభ్యులు చెబుతున్నా దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నార న్నారు. ● రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, అందుకే దస్తగిరి హత్యను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కడపలో 50 వార్డుల్లో వారికి ఇన్న్చార్జులు కూడా లేరని ఎద్దేవా చేశారు. అందుకే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్నంత వరకూ భూకబ్జాదారులు, అవినీతి పరులు, అక్రమార్కులుగా ఉన్నవారు టీడీపీలో చేరుతానే పునీతులుగా మారుతారా...అంటూ ప్రశ్నించారు. ప్రతి దాన్ని వైఎస్ జగన్కు ముడిపెట్టడం టీడీపీకి అలవాటుగా మారిందని, ఎవరైనా బాత్రూములో కాలు జారి పడినా వైఎస్ జగన్ వల్లే అని చెబుతారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు నాగయ్య యాదవ్, దాసరి శివప్రసాద్, మైనార్టీ నగర అధ్యక్షుడు ఎస్ఎండీ షఫీ, రమేష్రెడ్డి పాల్గొన్నారు. భూములు ఆక్రమిస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్ద దస్తగిరి హత్య జరిగింది మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ధ్వజం -
● సీజన్ ముగుస్తున్నా...
రబీ సీజన్ దాదాపు ముగుస్తోంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజ కూడా వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అర్భాటంగా జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. కానీ రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించక పోవడంతో దళారీలు కొనుగోలులో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. సాధారణంగా బస్తా 76 కేజీలైతే దళారీలు మాత్రం 78 నుంచి 80 కేజీల వరకు వేసుకుంటున్నారని పలువురు రైతులు తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా రైతాంగం వేడుకుంటోంది. -
పది ఫలితాల విడుదలపై వదంతులు నమ్మొద్దు
కడప ఎడ్యుకేషన్: పది ఫలితాల విడుదలపై వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వదంతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మొద్దని జిలా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. శుక్రవారం చాలా వాట్సప్ గ్రూపుల్లో 25వ తేదీన పది ఫలితాలు విడుదలవుతున్నట్లు ప్రకటనలు వచ్చాయని, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని అన్నారు. పది ఫలితాలు ఈ నెలాఖరులో కానీ, మే మొదటి వారంలో గాని విడుదలవుతాయని పేర్కొన్నారు. వాట్సప్ల్లో ఇలాంటి పోస్టులను పెట్టేవారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు హుండీల ద్వారా సమర్పించుకున్న కానుకలను కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. మార్చి 26 వ తేదీ నుండి ఏప్రిల్ 24 వ తేదీ వరకు శాశ్వత హుండీల ద్వారా రూ 3,35,860 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీల ద్వారా రూ 94,950, సేవా టికెట్ల ద్వారా రూ 1,37,880, అన్న దానం కోసం ఇచ్చిన చందాల ద్వారా రూ 1,00,708 వచ్చిందని, దీంతో మొత్తం కలిపి రూ 6,69,398 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ రవి శేఖర్ రెడ్డి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ డీ సుబ్బారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే డీలర్లు ఎరువుల అమ్మకాలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరరావు సూచించారు. కడప కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని ఏడీఏలు, మార్కెఫెడ్ డీఎం ఎరువుల కంపెనీ ప్రతినిధులు, హోల్సేల్ డీలర్లతో ఎరువులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ యూరియా జిల్లాకు వచ్చిన తర్వాత మార్కెఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలకు, కొంత డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. డీలర్లు ఎరువులను పంట సాగు చేసిన రైతులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందన్నారు. పంటలు సాగు చేయని రైతులు కూడా ముందు జాగ్రత్తగా ఎరువులను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారని అలాంటి వారి గుర్తించి ఇవ్వకుండా ఆపాలన్నారు. ఈ విషయంలో ఏడీఏలతోపాటు మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డీఎం పరిమళజ్యోతి, జేడీ కార్యాలయ ఏడీఏ మాధవి తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: ఈ నెల 30వ తేదీన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లోని అదీప్ ల్యాబొరేటరీ యూనిట్లో నిర్వహిస్తున్న ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా విపత్తుల నిర్వహణపై సంబందిత జిల్లా అధికారులతో జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి సమీక్షా సమావేశం నిర్వహింహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ నెల 30వ తేదీన ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ప్రక్రియ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడుతుందన్నారు. జిల్లాలోని కొప్పర్తి పరిశ్రమల ప్రాంతంలో ఉన్న అడీప్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సమీపంలోని పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మాక్ డ్రిల్ ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రమాదం, ప్రమాదకర రసాయనాల లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను మోడల్ రూపంలో ప్రదర్శించి, సంబంధిత విభాగాల సమన్వయాన్ని పరీక్షించనున్నారన్నారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళి, ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ చీఫ్ చిన్నారావ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26వ తేదీ అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ఉదయం 10 గంటలకు ‘వైఎస్సార్సీపీ బీసీ గళం’సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాలు మారినా బీసీల తలరాతలు మారలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు 139 బీసీ కులాలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారన్నారు. యాదవులకు రాయితీపై గొర్రెలు, శాలివాహనులకు మట్టికి కావల్సిన భూమి ఇస్తామని, వడ్డెరలకు క్వారీలు, మత్స్యకారులకు బోట్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ అఽధికారంలోకి వచ్చాక బీసీల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, జువ్వలదిన్నెల్లో ఉన్న ఫిషింగ్ హార్బర్లను పీపీపీ పద్దతిలో ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎ్స్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని, కూటమి సర్కార్ వచ్చాక బీసీలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాజకీయంగా దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. రాజకీయ కుట్రల్లో బీసీలను పావులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఛలో అనంతపురం పేరుతో బీసీ గళం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల బీసీ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి సమ్మెట బసవరాజు, రాష్ట్ర కార్యదర్శి కొప్పుల శివయాదవ్, 21వ డివిజన్ ఇన్చార్జి సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఈనెల 26న అనంతపురంలో ‘వైఎస్సార్సీపీ బీసీ గళం’ పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
హా‘కీ’ కష్టాలు తొలగినట్లే!
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్ఏ ఆవరణలో నిర్మించిన హాకీ టర్ఫ్ పిచ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. నిర్మాణం పూర్తయినా తాళం వేసి న విషయాన్ని ఈ నెల 20న ‘హా‘కీ’తో ఆటలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి శాప్ అధికారులు స్పందించారు. ఈ విషయమై డీఎస్డీఓకు వివరణ అడిగారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారుల వద్ద ఉన్న సదరు ఫైల్ను స్వాధీనం చేసుకున్న డీఎస్ఏ అధికారులు శాప్కు లెటర్ పంపారు. ఈ మేరకు శాప్ అధికారులు హాకీ టర్ఫ్ పిచ్ కోర్టును ప్రారంభించాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 8 కోట్లతో ఈ హాకీ టర్ఫ్ పిచ్ను నిర్మించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ టర్ఫ్ పిచ్ను ప్రారంభం చేయకపోవడంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. త్వరలో ఈ హాకీ టర్ఫ్ పిచ్ ప్రారంభం కానుండటంతో క్రీడాకారులకు ప్రాక్టిస్ సమస్య తీరినట్లే. -
నిర్వహణపై నిర్లక్ష్యం
ఎత్తిపోతల పథకాల పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణ పరిధి మినీ సెక్రటేరియట్లోని ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డిలు రైతులతో కలిసి వచ్చారు. ఇరిగేషన్ శాఖ డీఈలు సారథి, సాయి రంగనాథ్, జ్యోతి, జేఈలు చైతన్య, సతీష్, అనిల్లను కలిశారు. ఈ సందర్భంగా అధికారులతో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను సరిగా ఆపరేట్ చేయకపోవడంతో సాగునీరు అందక రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. అధికారులు ఒకరోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, మరొకరోజు మోటార్లు చెడిపోయాయని సాకులు చెబుతున్నారన్నారు. ఎందుకు సకాలంలో మోటార్లను రిపేర్లు చేయించడం లేదని గట్టిగా అధికారులను నిలదీశారు. మోటార్లు సరైన సమయంలో ఆడించకపోవడం వల్ల సాగునీరు అందక లింగాల, వేముల మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి అధికారులు వారం రోజుల్లోపు మోటార్లు రిపేర్లు చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీకి తెలిపారు. వారం రోజుల్లోపు సమస్యను పరిష్కరించకపోతే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేపడతామని అవినాష్రెడ్డి, సతీష్రెడ్డిలు అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్కు ఫోన్ ద్వారా రైతుల పరిస్థితిని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్కు తెలియజేశారు. వెంటనే ఇక్కడి రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు. రాజకీయం తగదు: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. లింగాల, వేముల మండలాల్లోని అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారందరి సమస్యలు విన్నవించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, వేముల, లింగాల మండలాలకు చెందిన రైతులతో కలిసి లింగాల కుడి కాలువ సంబంధించిన ఆఫీస్కు వెళ్లామని తెలిపారు. కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, గుణకణపల్లె, తాతిరెడ్డిపల్లె, లోపట్నూతల తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. సీబీఆర్లో 10 టీఎంసీల నీరు ఉండి కూడా ఇంత అథోగతి పట్టడమనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే అన్నారు. లింగాల కుడిి కెనాల్ వద్ద 5, కుంట వద్ద 5, బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం వద్ద 4 మోటార్లు పని చేస్తే ఈ సమస్య రాదని, అన్ని గ్రామాలకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చన్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేరు చేయించే దిక్కులేదు, పోనీ మేం ముందుకు వచ్చి రిపేరు చేయిస్తామంటే లేదు.. అధికార పార్టీ వాళ్లు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్లు చెబితేనే ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తామంటారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ సీబీఆర్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీరు, పైడిపాలెం రిజర్వాయర్లో 6 టీఎంసీల నీరు ఉన్నా ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 200 అడుగులలో ఉన్న నీటి మట్టం, ఈ రోజు అధికారుల వైఫల్యాల వల్ల 1600 అడుగులకు నీటి మట్టం దిగజారిపోయిందని, దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజకీయ కారణాలతో ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెట్టవద్దని, వెంటనే అధికారులందరూ అప్రమత్తమై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ సెక్రటరీలు స్పందించి ఈ ప్రాంతానికి నీరు అందే మోటార్లను రిపేరు తయారు చేయించాలని ఎంపీ, అదే విధంగా జగన్ కూడా ఆదేశించారన్నారు. అధికారులకు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నా మీరు ఏ కారణం చేతయినా పనులు చేయలేకపోతే దయచేసి అవి మాకు అప్పగించండి, ఎంపీ, జగన్లు వారి సొంత నిధులతో పూర్తి చేసి రైతులను ఆదుకుంటారన్నారు. జెడ్పీటీసీ బయపురెడ్డి, వేముల, లింగాల మండలాల కన్వీనర్లు సాంబశివారెడ్డి, అంబకపల్లె బాబు, రైతు నాయకుడు చంద్రశేఖరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, పెద్దకుడాల శ్రీనివాసులరెడ్డి, విద్యానందరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నాగేంద్ర, మల్లికేశవరెడ్డి, శివరామిరెడ్డి, పుల్లారెడ్డి, హేమాపతిరెడ్డి, నాగచంద్రారెడ్డి, బాబాతోపాటు రైతులు పాల్గొన్నారు. సాగు నీరందక రైతులకు అష్టకష్టాలు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినా కనెక్షన్లు ఇవ్వని వైనం అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్న ఇరిగేషన్ అధికారులు వారం రోజుల్లోపు సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తాం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి,వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి -
యువతి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పటేల్ రోడ్లో నివాసముంటున్న నాదెండ్ల రాజ రెండవ కుమార్తె అయిన రెహనాకు రెండు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మారన్నగారి వీరయ్య, వహీదాల కుమారుడైన షాజహాన్తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థమైన తర్వాత రెహనాతో షాజహాన్ మాట్లాడే క్రమంలో నీవు అంటే ఇష్టం లేదని తెలిపారు. నిశ్చితార్థమైన తర్వాత ఇలా మాట్లాడితే అవమానం భరించలేక చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పినా వినలేదు. అతని తల్లిదండ్రులు వహీదా, వీరయ్యలు కూడా షాజహాన్కు సపోర్ట్ చేస్తూ.. నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్యమని కఠినంగా మాట్లాడారు. రెహానా వారు మాట్లాడిన మాటలకు చనిపోవాలని నిర్ణయించుకుని తన ఇంటిలో సూసైడ్ నోట్ రాసి తన ఇంటి బెడ్ రూములో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషయమై రెహనా తండ్రి నాదెండ్ల రాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21 వ తేదీన చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లోఎస్ఐ ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కేసులోని నిందితులైన మారన్నగారి షాజహాన్, అతని తల్లిదండ్రులు మారన్నగారి వహీదా, మారన్నగారి వీరయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ తెలియజేశారు. -
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం వేంపల్లి రోడ్డులోని గానుగ వీధిలో ఉండే దేరంగుల వెంకటజ్యోతి (17) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి అన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గానుగ వీధిలో నివాసం ఉండే విశ్వనాథ్కు కుమార్తె వెంకటజ్యోతి ఉంది. విశ్వనాథ్ పదేళ్ల కిందటే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి కూలి పని చేసుకుంటూ కుమార్తెను పోషించింది. వెంకటజ్యోతి కడపలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వారిని విచారణ చేసినా ఫలితం లేకపోయింది. ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘జలధార’ను పకడ్బందీగా చేపట్టండి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జలధార అమలు, 22ఏ, రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, స్వచ్ఛ సర్వేక్షన్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యదర్శులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్, జేసీ, జిల్లా అధికారులు హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జలధార కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జి డీఆర్వో వెంకటపతి, సీపీఓ హజరతయ్య, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ అబ్దుస్ సమీ, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
కడప అర్బన్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజంపేట, పులివెందుల సబ్ – డివిజన్ల నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. పగలు, రాత్రి గస్తీ పెంచాలని, విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేయాలని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మిస్సింగ్ కేసులను ఛేదించాలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, రాజంపేట, పులివెందుల సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
దస్తగిరి హత్య కేసులో టీడీపీ రాజకీయ కుట్ర
పులివెందుల : వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు పోచమిరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిలకు పెద్ద దస్తగిరి బినామీ అంటూ, దీని వెనుక తాడేపల్లె పెద్దలు ఉన్నారంటూ కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి తదితరులు నిసిగ్గుగా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని, ఆయనకు వైఎస్సార్సీపీ నేతలతోనే కాక టీడీపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని మృతుడి భార్య కలమల్ల రమణమ్మ స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏమి జరిగినా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ, కూటమి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఇది వారి నీచ రాజకీయానికి పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. కూటమి సర్కార్ వచ్చిన 23 నెలల్లో 21 రాజకీయ హత్యలు జరిగితే వాటిని వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులపై రుద్దడంలో కూటమి నేతలు సిద్ధహస్తులుగా మారారన్నారు. రెండు వారాలకు ముందు పెద్ద దస్తగిరి హత్య వ్యక్తిగతంగా జరిగితే.. దస్తగిరితో ఎలాంటి విభేదాలు లేని, పూర్తి సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించడం రాజకీయ లబ్ధికేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాలు, ఉద్యమాల్లో నిత్యానందరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నందునే ఆయనను నిందితుడిని చేశారని ఆందోళన వ్యక్తపరిచారు. వైఎస్సార్సీపీ వారిని చంపి, వారిపైనే దాడులు చేసి మళ్లీ వైఎస్సార్సీపీ వారినే నిందితులుగా చేసి జైలుకు పంపడం టీడీపీ, కూటమి నేతలకు పరిపాటిగా మారిందన్నారు. వైఎస్ జగన్ను ఆశీర్వదిస్తే అర్చకులకు నోటీసులా? ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనంతోపాటు శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేస్తే వారికి టీటీడీ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాకపోవడంతో ఆయన సొంత జిల్లాకు రావడంతో.. అర్చకులు ఆయనను కలిసి ఆశీర్వదిస్తే దానిని నేరంగా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక తప్పదని హెచ్చరించారు. -
భక్తిశ్రద్ధలతో చక్రస్నానం
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు గురువారం త్రిశూల, చక్ర స్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి త్రిశూలం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి చక్ర తాళ్వార్ల చక్రస్నానాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు, శ్రీనివాస మూర్తిల ఆధ్వర్యంలో స్వామి వార్ల త్రిశూలం, సుదర్శన చక్రాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పాలు, చందనం, నెయ్యి, పెరుగు, పసు పు, పన్నీరు, కొబ్బరి నీరుతో అభిషేకం నిర్వహించా రు. అనంతరం రెండు ఆలయాల్లో ధ్వజ అవరోహణం చేసి, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలను ముగించారు. కనులపండువగా పుష్పయాగం రాత్రి శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామికి పుష్పయాగాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో, వేద మంత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి నిర్వహించిన పుష్పయాగాన్ని చూసిన భక్తులు పులకించారు. అనంతరం తిరుచ్చి వాహన సేవలో భాగంగా గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు -
నమో వీరబ్రహ్మేంద్రస్వామి
విద్యుత్ దీపాలంకరణలో దేవస్థానం శేషవాహనంపై ఆశీనులైన వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అర్చనామూర్తులకు ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణం చేశారు. కమనీయంగా శేషవాహనోత్సం రాత్రి శేషవాహనోత్సవం కమనీయంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పంచ శిరస్సులు గల శేషవాహనంపై ఆశీనులను చేశారు. స్వామి, అమ్మవారికి మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి విశేష పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠం వరకు సాగింది. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం యడవల్లి రమణయ్య భాగవతార్ ఆధ్వర్యంలో హరికథను ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు. దాతలు అన్నదానం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. ప్రొద్దుటూరుకు చెందిన పేర్ల వెంకట బ్రహ్మానందరెడ్డి, గుంటూరుకు చెందిన చేవూరి నరసింహాచారి ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పీపీఎన్ ప్రసాద్, దత్తాత్రేయస్వామి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆరాధనోత్సవాలు ప్రారంభం స్వామి వారికి ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు -
అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటర్వ్యూలు
కడప సెవెన్రోడ్స్: కడప, చింతకొమ్మదిన్నె, కమలాపురం సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు గురువారం కడప ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు సెలెక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు జరిగాయి. కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి రమాదేవి పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్–2026కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, నోడల్ ఆఫీసర్ ఎంవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగర శివార్ల లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు. జిల్లాలో పాలిసెట్ పరీక్ష నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను జిల్లావ్యాప్తంగా 10360 మంది విద్యార్థులు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్కు త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు 50 బస్సులు చొప్పున, తిరుపతి జిల్లాకు 350 బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. జోన్ వ్యాప్తంగా 4196 బస్సులు ఉండగా, సీ్త్ర శక్తి పథకానికి 2852 బస్సులను నడుపుతున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు 45 ఏళ్లు నిండిన డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదికి రెండుమార్లు మెడికల్ పరీక్షలు వచ్చేనెల నుంచి ప్రారంభిస్తున్నామన్నా రు. ఆర్ఎం గోపాల్రెడ్డి పాల్గొన్నారు. కడప అర్బన్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కడపలోని జిల్లా కోర్టులో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎన్. శాంతి కడప మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. శ్రీనివాసులు కడప ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా రానున్నారు. కడప నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి. దీనబాబు గుంటూరు మహిళా కోర్టు న్యాయమూర్తిగా, రాయచోటి 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి కృష్ణణ్ కుట్టి చిత్తూరు జిల్లా తిరుపతి కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. నెల్లూరు నుంచి న్యాయమూర్తి సుమలత బదిలీపై రాయచోటికి, కడప జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి టి. కేశవ అనంతపురం అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. నెల్లూరు జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం.ఏ సోమశేఖర్ కడప ఫోక్సో కోర్టు న్యాయమూర్తిగా రానున్నారు. ప్రొద్దుటూరులో కొత్తగా ఏర్పాటైన 8వ అదనపు జిల్లా కోర్టుకు పదోన్నతిపై హిందూపురం కోర్టు నుంచి డి. వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. కడప అర్బన్: ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని అన్నారు. భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్ ) కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమిటీ అధ్యక్షుడు వి. రాజగోపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ, ప్రధాన కార్యదర్శి నాగ అర్చన, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలసుబ్బయ్య, నగర ఆర్గనైజర్ కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి కార్యదర్శి వేణుగోపాల్, బాల య్య తదితరులు గురువారం జిల్లా ప్రధాన న్యా యమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని న్యాయవాదులు కాపాడాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
తొండూరు : తొండూరు బస్టాప్ వద్ద గురువారం ఉదయం లారీ ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గురు ప్రణీత్ అనే విద్యార్థి స్థానిక బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం నుంచి వేసవి సెలవులు కావడంతో తన స్వగ్రామమైన వేంపల్లెకు వెళ్లేందుకు ఆటోలో తొండూరు బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసమై సమీపంలో ఉన్న కూల్ డ్రింక్స్ షాపు వద్దకు వెళ్లి తీసుకొస్తుండగా రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. దీంతో ఆ విద్యార్థి రోడ్డు దాటుతుండగా.. ముద్దనూరు వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తొండూరు బీసీ హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. కడప రిమ్స్లో చూపించిన అనంతరం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. రాయచోటి సమీపంలోకి వెళ్లగానే మృతి చెందినట్లు పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో పాఠశాల నుంచి వేసవి సెలవులు పూర్తి చేసుకుని 7వ తరగతిలో జాయిన్ అవుతామని తోటి విద్యార్థులతో చెప్పిన విద్యార్థి.. నిమిషాల వ్యవధిలోని రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెలవులకు ఇంటికి వెళ్తుండగా ఘటన -
మహర్షికి ఘన నివాళి
భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి తదితరులు భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని ఆయన జీవిత సారాంశం తెలుపుతుందని ఇన్ఛార్జి డీఆర్ఓ వెంకటపతి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత భగీరథ మహర్షి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ● ధృఢ సంకల్పం, అచంచల భక్తి, నిస్వార్థ త్యాగం ఈ మూడు గుణాల సమ్మేళనం మహర్షి భగీరథ జీవితమని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. మహర్షి భగీరథ జయంతి సందర్భంగా గురువారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి భగీరథ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. –కడప సెవెన్రోడ్స్/కడప అర్బన్ -
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని...
● భర్తను అంతమొందించేందుకు భార్య స్కెచ్ ● కారుతో గుద్ది చంపేందుకు యత్నం ● తప్పించుకున్న ఈశ్వర్రెడ్డి ప్రొద్దుటూరు క్రైం : కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది. ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుధీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్ను ఆశ్రయించింది. తన భర్త ఈశ్వర్రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో సుపారి కుదుర్చుకుంది. ఈ క్రమంలో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డిని కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నేడో రేపో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుధీర్ ఈశ్వరరెడ్డి శిల్పారెడ్డి(ఫైల్) -
పొలం గట్టు తగాదాలో ఒకరి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు దువ్వూరు : మండల పరిధి దాసరిపల్లె గ్రామంలో పొలం గట్టు వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పిక్కిలి లక్ష్మీనారాయణ, నరసమ్మ, వీరన్నలకు పొలం ఉంది. వీరి పొలం పక్కనే మేకల శ్రీనివాసులు, ప్రతాప్, వీరాంజనేయులుకు పొలం ఉంది. బుధవారం మేకల ప్రతాప్ గట్టు మీద ఉండే గడ్డి కోసి గట్టుపైన వేస్తుండగా.. పిక్కిలి నరసమ్మ తమ గట్టుపైన ఎందుకు వేస్తున్నావు అని ప్రశ్నించడంతో.. మొదలైన వివాదం సాయంత్రానికి ఘర్షణకు దారి తీసింది. పిక్కిలి వీరన్న గొడ్డలి తీసుకుని మేకల శ్రీనివాసులు, వీరాంజనేయులుపై దాడి చేశాడు. ఈ దాడిలో మేకల శ్రీనివాసులు, వీరాంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసులు పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో వీరన్న ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన మేకల శ్రీనివాసులు తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు -
గ్రామీణ పారిశుధ్యంలో సీఎస్సీలు కీలకం
కడప సెవెన్రోడ్స్: గ్రామీణ పారిశుద్ద్యంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల పాత్ర కీలకమని జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, ఎంపీడీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి స్థలం లేని వారికి ఉపయోగపడటం కోసమే శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఓడీఎఫ్ ఫ్లస్ లక్ష్యాలను పరిపూర్తి చేయడమే శానిటరీ కాంప్లెక్స్ల ఉద్దేశమన్నారు. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ద్యాన్ని మెరుగు పరిచేందుకు చెత్త సేకరణ వాహనాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీడీఓలు ఉదయాన్నే ఫీల్డ్ విజిట్కు వెళ్లాలని సూచించారు.డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు. డివిజనల్ డెవలప్మెంట్ అఽధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి -
వైభవం.. హరిహరుల రథోత్సవం
వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం హరిహరుల రథోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వైద్యనాథేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథ స్వామి రథంలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శివ నామాన్ని స్మరిస్తూ భక్తులు పోటీలు పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ● సాయంత్రం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి గ్రామోత్సవాలలో వివిధ వాహనాలపై ఒంటరిగా దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవంతో పరిపూర్ణుడై శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంపై ఆశీనులయ్యారు. బంగారు ఆభరణాలతో అలంకార భూషితులైన స్వామివారు ఇరువురు దేవేరులతో కలిసి దర్శనమివ్వడంతో సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీహరి అంశకు చెందిన శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకున్నట్లుగా భక్తులు పులకించి పోయారు. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో రథం వద్ద పూజలు చేశారు. ● రధాల వద్ద జరిగిన పూజల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి పాల్గొన్నారు. ● రాత్రి మొదట శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామికి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామికి అశ్వ వాహనంపై గ్రామోత్సవం జరిగింది. పుష్పగిరిలో నేడు: బహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం త్రిశూల, చక్రస్నానం జరుగుతుంది. అనంతరం ధ్వజ అవరోహణం జరుగుతుంది. -
బద్వేలు టీడీపీలో ముదిరిన విభేదాలు
● అభివృద్ధి పనుల శంకుస్థాపన విషయంలో ఇరువర్గాల మధ్య రచ్చ ● పలుచోట్ల శంకుస్థాపనలు చేసిన సూర్యనారాయణరెడ్డి ● తాజాగా తెలుగుగంగ రోడ్డు శంకుస్థాపన పనులను అడ్డుకున్న రితీష్ వర్గీయులు ● పోలీసుల జోక్యంతో ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం శంకుస్థాపన పనులు అడ్డుకునేందుకు వచ్చిన రితీష్రెడ్డి వర్గీయులు విద్యానగర్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సూర్యనారాయణరెడ్డి (ఫైల్) సాక్షి టాస్క్ఫోర్స్ : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరాయి. మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బుధవారం స్థానిక తెలుగుగంగ కాలనీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉండగా రితీష్రెడ్డి వర్గీయులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు రితీష్ వర్గీయులకు సర్దిచెప్పడంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది. శంకస్థాపన విషయంలో ముదిరిన విభేదాలు .. బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొంత కాలంగా రితీష్రెడ్డి, సూర్యనారాయణరెడ్డిల నడుమ ఆధిపత్యపోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి కొందరు రితీష్రెడ్డి చెంత, మరికొందరు సూర్యనారాయణరెడ్డి చెంత చేరారు. పార్టీ కార్యక్రమాలు ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బద్వేలు మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్బీపీఎస్ స్కీం కింద సుమారు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో పట్టణంలోని 35 వార్డుల్లో రూ.1.40 కోట్లతో ఒక ప్యాకేజీ, రూ.1.45 కోట్లతో మరో ప్యాకేజీ చొప్పున రెండు ప్యాకేజీలుగా అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. 6 శాతం లెస్తో టెండర్లు దక్కించుకున్న పుల్లంపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక విద్యానగర్లో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డితో శంకుస్థాపన చేయించారు. తిరిగి బుధవారం నాడు తెలుగుగంగకాలనీ రోడ్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టాల్సిన సీసీ రోడ్డు పనులకు సూర్యనారాయణరెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇంతలో విషయం తెలుసుకున్న రితీష్రెడ్డి వర్గీయులు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన పనులను అడ్డుకునేందుకు బయలుదేరారు. అయితే ముందస్తుగానే విషయం తెలుసుకున్న సూర్యనారాయణరెడ్డి ఉన్నతాధికారుల సూచనల మేరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పటికే తెలుగుగంగకాలనీ రోడ్డుకు చేరుకున్న రితీష్రెడ్డి వర్గీయులు స్థానిక ఎన్జీవో కాలనీలోని సూర్యనారాయణరెడ్డి ఇంటి సమీపంలోకి వచ్చి గుమికూడారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ కొండారెడ్డిలు సిబ్బందితో వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించారు. కొద్దిసేపు సూర్యనారాయణరెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్న రితీష్రెడ్డి వర్గీయులు దగ్గరలోనే ఉన్న మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి ప్రెస్మీట్ నిర్వహించారు. గతంలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రితీష్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్శాఖ మంత్రి నారాయణ వద్దకు వెళ్ళి పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించామని, కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తమ ప్రమేయం లేకుండా ఇతరులతో శంకుస్థాపన ఎలా చేయిస్తారని, ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని తెలిపారు. ఇదే సమయంలో సూర్యనారాయణరెడ్డి ఇంటి వద్ద సైతం ఆయన అనుచరులు గుమికూడారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతానికి ఈ సమస్య సద్దుమణిగింది. -
24న అవగాహన కార్యక్రమాలు
కడప కోటిరెడ్డిసర్కిల్: రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై ఈనెల 24వ తేదీన కడప, మదనపల్లెల్లోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ సదస్సుల్లో రియల్టర్లు, డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్టేక్ హోల్డర్లు పాల్గొనాలన్నారు. సదస్సులో గ్రౌండ్ లెవల్ సమస్యల పరిష్కారం, వాల్యుకేషన్, రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పిస్తారన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆంగన్వాడీ వర్కర్లు, ఆంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆయా పరిధిలోని మండలాలకు అభ్యర్థులు గురువారం ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (ఆర్కే వ్యాలీ) నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం విజయ్ ప్రకాష్ను నియమిస్తూ బుధవారం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్జీయూకేటీ ఉప కులపతి, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం డైరెక్టర్లను నూతనంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు సంబంధించిన రసాయన విభాగంలో హెచ్ఏజీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించారు. -
కడప కార్పొరేషన్కు కొత్త రూపు
కడప కార్పొరేషన్: కడప నగర పాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా. వాటిని 66కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేసి. డివిజన్ల ప్రతిపాదన సిద్ధం చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న డివిజన్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ల పునర్విభజన జరగనుండగా, 01.01.2026 నాటికి అప్డేట్ అయిన ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లలో 7వేల నుంచి 8వేల మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి డివిజన్లోనూ 4700 నుంచి 5200 ఓటర్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని ప్రకారం ఒకట్రెండు డివిజన్లు చిన్నవిగాను, రెండు, మూడు డివిజన్లు కొంచెం పెద్దవిగాను ఏర్పడే అవకాశముంది. ప్రతిపాదనలు ఇలా.. కడప కార్పొరేషన్ పరిధిలో 4 జోన్లు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లుగా వాటిని విభజించారు. ప్రతి జోన్లోనూ ప్రస్తుతం 12 నుంచి13 డివిజన్లు ఉన్నాయి. ఇకపై ప్రతిజోన్లో సుమారుగా 16 నుంచి 17 డివిజన్లు వచ్చే అవకాశముంది. ఈ డివిజన్ల విభజన రోడ్లు, కాలువలు, ల్యాండ్ మార్కుల ఆధారంగా విభజించనున్నారు. మొదటి డివిజన్ గండివాటర్ వర్క్స్, మోడమీదపల్లె నుంచి మొదలై చివరి 66వ డివిజన్ పాలెంపల్లె, బచ్చుంపల్లె వరకూ ఏర్పాటు కానున్నాయి. 7వేల నుంచి 8వేల జనాభా ఉన్న డివిజన్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఓటర్ల సంఖ్య సరాసరి 5000గా ఉండనుంది. ప్రజాభిప్రాయ సేకరణ.. ముసాయిదా జాబితాల ప్రతిపాదనలు ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కమిషనర్ రాకేష్ చంద్ర ఆదేశాల మేరకు సిటీ ప్లానర్, ఏసీపీల ఆధ్వర్యంలో డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేసి ప్రాథమికంగా ముసాయిదా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రూపాందించిన మూసాయిదాపై కడప ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. అనంతరం ముసాయిదాలో. చేయాల్సిన మార్పులు, చేర్పులను చేస్తారు. ఖరారైన ముసాయిదాను ఈ నెల 27 నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారు. ఆ తర్వాత డ్రాఫ్టు నోటిఫికేషన్ను ప్రభుత్వానికి పంపిస్తారు. కమలాపురానికి ప్రాతినిధ్యం లేనట్లేనా.... కడప నగరపాలక సంస్థలో విలీనం అయిన గ్రామ పంచాయతీల్లోని కొన్ని డివిజన్లు అటు కడప, కమలాపురం నియోజకవర్గాలకు వర్తించే విధంగా ఉండేవి. అంటే భౌగోళికంగా కడప నగరపాలక సంస్థలో ఉన్నప్పటికీ ఆ డివిజన్ల ప్రజలు మాత్రం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లతోనే వార్డుల పునర్విభజన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు జనాభా, ఓటర్ల సంఖ్యలో తేడాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డివిజన్ల ఏర్పాటు ఇలా.. (ఓటర్ల సంఖ్య ఆధారంగా అంచనా) ఓటర్ల సంఖ్య ఏర్పాటయ్యే డివిజన్లు 4700–5000 మధ్య 30 5000–5200 మధ్య 36 కొలిక్కివచ్చిన డివిజన్ల పునర్విభజన కసరత్తు 50 నుంచి 66కు పెంచుతూముసాయిదా ప్రతిపాదన ప్రతి డివిజన్లో 4700 నుంచి5200 ఓట్లు ఉండేలా విభజన ఈ నెల 27 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కడప నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు కాకుండా కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒత్తిడి మేరకు వారు చెప్పినట్లే చేస్తున్నారని, డివిజన్లను వారికి అనుకూలంగా ఇష్టం వచ్చినట్లు కోసేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు సాయంత్రం వేళల్లో గంటలు గంటలు వారితో భేటీ కావడం విమర్శలకు బలం చేకూరుతోంది. అలాగే కొందరు టీడీపీ డివిజన్ ఇన్చార్జులు చెప్పిట్లుగానే వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను డివిజన్గా రూపొందించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. -
● అధినేతతో నేతల భేటీ
సాక్షి కడప: ‘కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు భయపడొద్దు... ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు.. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు.. మీకు తోడుగా ఉంటా.. ప్రతి కష్టం వెనుక నేనుంటా..’నని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ప్రజా దర్బార్లో భాగంగా ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేమకయ్యారు. పార్టీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇప్పట్లలో పర్యటించిన వైఎస్ జగన్ అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. అడుగడుగునా.. పులివెందుల నుంచి బుధవారం ఉదయం 9గంటలకు ఇప్పట్లకు బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగడుగునా ‘జన’స్వాగతం లభించింది. అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ ఆయన కాన్వాయ్ను ఆపారు. పులివెందులలోన్ని అన్ని రింగ్ రోడ్డులతోపాటు లింగాల రోడ్డుకు తిరగగానే కోతి సమాధి ఆంజనేయస్వామి ఆలయం, చిన్న రంగాపురం, గురుకుల పాఠశాల, ఇప్పట్ల క్రాస్... ఇలా ఇప్పట్లకు వెళ్లేలోపు కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్ను కలిశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం కాన్వాయ్ని ఆపి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ముందుకు కదిలారు. యువత సెల్ఫీలు కావాలని కోరగా.. వైఎస్ జగనే సెల్ఫీ ఫొటోతో అవకాశం ఇచ్చారు. పర్యటన ఆద్యంతం అభిమానులు మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్లపై నిలబడి ఆత్మీయ స్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకుని గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయ స్సు కోరడంతోపాటు సంతోషంగా జీవించేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ ఇప్పట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కేశంరెడ్డి సుధాకర్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇప్పట్ల గ్రామానికి వచ్చారు. ముందుగా దివంగత సుధాకర్రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాకర్రెడ్డి భార్య గాయత్రి, ఆయన కుమారుడు ధనుంజయరెడ్డి, కుమార్తె అనూషలతోపాటు కుటుంబీకులను ఓదార్చారు. కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. నూతన జంటకు ఆశీర్వాదం దివంగత మార్తల పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్థన్రెడ్డి వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన జంట విష్ణువర్థన్రెడ్డి, అమృతారెడ్డిలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో పలు అంశాలపై ముచ్చటించారు. అంతకుముందు గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కాసేపు గడిపారు. పులివెందులలోని క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, (ఇన్సెట్) అవ్వను పలకరిస్తున్న వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు కలిశారు. రాజకీయ అంశాలతోపాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత చర్యలతోపాటు ఇతర అంశాల గురించి చర్చించారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఎస్.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, చాంద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మాజీ మేయర్లు కొత్తమిద్ది సురేష్బాబు, పాకా సురేష్, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఇళ్లు కోల్పోతున్న బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మధ్యాహ్నం రాజారెడ్డి కాలనీ వాసులు కలిశారు. ప్రధానంగా నేషనల్ హైవే అధికారులు కదిరి – ముద్దనూరు రోడ్డు విస్తరిస్తున్నారని.. తద్వారా తాము ఇళ్లు కోల్పోతున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందించే పరిహారం చాలా తక్కువ మొత్తంలో ఉందని, ఈ ప్రాంతంలో భూముల స్థలాల ఎక్కువ రేటు ఉన్న నేపథ్యంలో పరిహారం పెంచి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ద్వారా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. జననేత రాకతో క్యాంపు కార్యాలయం వద్ద కోలాహలం కనిపించింది. -
ప్రశ్నించే ఉద్యోగులపై చర్యలు దారుణం
● ఉద్యోగ సంఘ నేత కె. వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడం అన్యాయం ● ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలవుతున్నా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా, పైపెచ్చు వారి మీద చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పీఆర్సీ వేస్తామని, పెండింగ్లో ఉన్న డీఏ, ఐఆర్ బకాయిలు, ఉద్యోగస్తులందరికీ రావాల్సిన అన్ని రకాల బకాయిలు కూడా వెంటనే ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయడం అన్యాయమన్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపేనని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వారి సమస్యల మీద విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్షలు చేయడం జరిగింది. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగ యువకులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని,అవి ఇచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి, ప్రతినెల 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి కాలేజీలు సజావుగా జరిగేటట్లు చూడాలన్నారు. పాఠశాలలు తెరిచేనాటికి నాడు–నేడు ద్వారా చేపట్టి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి విద్యార్థులందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. -
కల్యాణం... కమనీయం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మాల దీక్ష భక్తుల ఆధ్వర్యంలో బుధవారం బ్రహ్మంగారిమఠంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను స్థానిక మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వామి, ఈశ్వరీ దేవి మఠం మఠాధిపతి శివ కుమార స్వాములు పర్యవేక్షించారు. బ్రహ్మంగారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానుండడంతో మండలంలో ఉన్న బ్రహ్మంగారి మాల దీక్ష బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బ్రహ్మంగారిమఠ వేద పండితులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
26న వాసవీకన్యకా పరమేశ్వరిదేవి జయంతి
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఈ నెల 26న శ్రీ వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవతో మొదలుకుని విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, సప్తశతీపారాయణం, లోక కల్యా ణార్థం గణపతి, నవగ్రహ, రుద్ర, చండీహోమం, అ మ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలతో పాటు ప్ర త్యేక అలంకరణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాద వినియోగం ఉంటుందన్నారు. సాయంత్రం 6.30 గంటలకు స్వర్ణ శ్రీచక్రమేరువునకు హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు శ్రీ విద్యారణ్యభారతీ స్వామిజీ ఆధ్వర్యంలో 102 మంది ఆర్యవైశ్య సుహాసినులతో శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించనున్నామన్నారు. -
24న ఏపీఆర్ఎస్ క్యాట్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ఏపీఆర్ఎస్ కామన్ అడ్మిషన్ టెస్టు(ఏపీఆర్ఎస్ క్యాట్), ఏపీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెస్టు టెస్టు(ఏపీఆర్జేసీ అండ్ డిసీ సిఈటి–2026)ను ఈ నెల 24వ తేదీ నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రవేశ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్లో 2 పరీక్షా కేంద్రాలలో, మధ్యాహ్నం సెషన్లో 9 పరీక్షా కేంద్రాలలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్సులో కలిసి జిల్లావ్యాప్తంగా 2322 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం సెషన్ 10 గంటల నుంచి 12 గంటల వరకు , మద్యాహ్నం సెషన్ 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. -
ప్రసాదం అందజేత
కమలాపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కమలాపురం పెద్ద దర్గాగా పిలిచే దర్గా–ఏ–గఫారియా ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన మహా ప్రసాదాన్ని బుధవారం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ అందజేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కమలాపురం పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి తదితరులకు షేక్ ఇస్మాయిల్ ప్రపాదాన్ని అందజేశారు. కాగా ఉరుసు ఉత్సవాల నిర్వహణ గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ను అడిగి తెలుసుకున్నారు. -
అనుమతులకు పూర్తి సమాచారాన్ని సమర్పించాలి
కడప కార్పొరేషన్ : వ్యాపారులు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో వివిధ అనుమతులను నిర్ణీత సేవా ప్రమాణాల కాలపరిమితిలో వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయడం జరుగుతోందని కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు సుధ కురుబా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ప్రతిపాదకులు తమ దరఖాస్తులను సమర్పించే సమయంలో అవసరమైన పూర్తి, సంబంధిత సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలు అందించిన పక్షంలో అదనపు వివరణ కోరాల్సిన అవసరం లేకుండా దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తవుతుందన్నారు. వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను దరఖాస్తు దారులు పాటించాలని ఆమె సూచించారు. అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతను కొన్ని రోజులుగా ఆస్పత్రి అత్యవసర విభాగం సమీపంలో ఉన్న పార్కింగ్ వద్ద పడుకొని ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అతను మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు తగు ఆధారాలతో ఆస్పత్రి అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. జూదరులు అరెస్ట్ కొండాపురం: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సమీపంలోని కంపచెట్లల్లో పేకాట ఆడుతుండగా 25 మందిని అరెస్ట్ చేసినట్లు కొండాపురం ఎస్ఐ జయరాయులు బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. స్థానికుల సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నగదు రూ. 2.42,730 స్వాధీనం చేసుకొని మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం పులివెందుల రూరల్ : పులివెందుల ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ39యూఎఫ్ 9451 అనే నెంబర్ గల బస్సు పులివెందుల నుంచి కదిరికి బయలుదేరి వెళ్లింది. నామాలగుండు – గొల్లపల్లె తండా మధ్య రోడ్డు పనులు జరుగుతుండగా తలుపుల వైపు నుంచి కనంపల్లె వైపు వస్తున్న ద్విచక్రవాహనం బస్సును ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు మా వాహనాన్ని బస్సుతో ఢీకొట్టాడని డ్రైవర్ మద్దిలేటి రెడ్డిని చితక బాదారు. దీంతో డ్రైవర్ మద్దిలేటిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తలుపుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషయంగా ఉండడంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రి రెఫర్ చేసినట్లు సమాచారం. -
ఎన్నికల్లో లబ్ధికే అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె.సురేష్బాబుకడప కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(సీఈసీ) సభ్యులు కె. సురేష్ బాబు, పార్టీ నాయకులు మండిపడ్డారు. పెద్దదస్తగిరి హత్యకేసును వైఎస్సార్సీపీకి అంటగడ్డటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్లతో కలిసి కె. సురేష్ బాబు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలాంఖన్పల్లెలో గంగమ్మ జాతర సందర్భంగా జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసిందన్నారు. రాజా, రవి అనే వారిని అప్పటి సీఐ పురుషోత్తం రెడ్డి మండలం నుంచి బహిష్కరిస్తే, వారు ఆలాంఖన్పల్లెలో వచ్చి చేరారు. గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ సాయంత్రమైతే పానీపూరీ బండ్లు మొదలుకొని ప్రతి షాపు నుంచి మామూళ్లు వసూలు చేసేవారు. ఇవన్నీ పోలీసులకు తెలియవా...రౌడీ మూకలు చేసిన దాన్ని వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. . ఇందులో భాగంగా రోజుకొక పేరు తెరపైకి తెస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిప్పటి నుంచి జోగిరమేష్, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి, మిథున్రెడ్డి, నందిగం సురేష్ ఇలా ఎవర్నీ వదలకుండా కేసులు పెట్టి జైలుకు పంపారు. తమ కార్యకర్త చనిపోయి తామంతా బాధలో ఉంటే తమపైనే నిందలు వేయడం దుర్మార్గం. ఫోటోలు దిగినందుకే హత్య కేసు అంటగడతారా...చంద్రబాబు 420 కాబట్టే ఇలాంటివి చేస్తున్నారు. ఇంతటి నీచ సంస్కృతి దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే... ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్సీపీపై నిందలు వేస్తున్నారు. గంజాయి మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా...ప్రతి చిన్న సంఘటనను వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణం. గంజాయి, డ్రగ్స్ సేవించే వారు డబ్బు కోసం దోపీడీలు చేస్తూ రౌడీయిజం చెలాయిస్తున్నారు. నిందితులతో ఫోటోలు దిగినంత మాత్రానా సంబంధం ఉన్నట్లేనా... – ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ. గంజాయి, డ్రగ్స్ మూలాలను వెలికి తీయాలి మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుండం వల్లే శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో పోలీసులు వెలికి తీయాలి. పెద్ద దస్తగిరి ఇంటిపై సుమారు 40 దాడి చేసినప్పుడే అతను పోలీసుల రక్షణ కోరాడు. అప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులపై రుద్దుతున్నారు. నిత్యానందరెడ్డికి, దస్తగిరికి మధ్య ఎలాంటి గొడవలు, విభేధాలు లేవు. నిత్యానందరెడ్డిపై జరిగిన ఒక్క లావాదేవీ కూడా పోలీసులు చూపలేదు. రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తిని వేధించడం సరికాదు. – పాకా సురేష్ కుమార్, మాజీ మేయర్. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇదంతా... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొ ని కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్థానిక ఎన్నికలపై వారు నిర్వహించిన సర్వేలో కడపలో ఆరు సీట్లు కూడా రావని తెలుసుకొని, వైఎస్సార్సీపీని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం హత్య జరిగిందని మంత్రులు ఆరోపించడం సిగ్గుచేటు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. – ఎస్. యానాదయ్య, ఎస్ఈసీ సభ్యులు. వైఎస్సార్సీపీ -
బ్రహ్మంగారిమఠం.. ఉత్సవ శోభితం
● నేటి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రాంగణంలో శోభాయమానంగా రంగవళ్లులు వేశారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. వెరసి ఉత్సవాలను పురస్కరించుకుని క్షేత్రం నూతన శోభ సంతరించుకుంది. ఉత్సవాలు ఇలా.. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. భారీగా భక్తుల రాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు చలువ పందిళ్లు వేశారు. వసతి, మంచినీరు, మజ్జిగ, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏర్పాట్లు చేయడంలో మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం పాలుపంచుకుంటున్నారు. -
ఖాకీలు.. కథలు అల్లుతున్నారు!
సాక్షి ప్రతినిధి, కడప: ఓ జాతరలో యువకుల మధ్య తలెత్తిన గొడవ చినికిచినికి గాలివానగా మారింది.. పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్య వరకూ వెళ్లింది. నిజానికి ‘గొడవ’ సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటనే జరిగేది కాదు.. ఒక నిండు ప్రాణం పోయేదికాదు.. ఖాకీల నిర్లక్ష్యం వల్లే ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఘర్షణ సమయంలో పూర్తిగా అలసత్వం వహించిన పోలీసులు హత్య కేసు దర్యాప్తుకొచ్చేసరికి కూటమి నేతల కుట్రలో పావుగా మారారు. హత్యకు రాజకీయ రంగు పులిమి..స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కూటమి నేతలు వేసిన స్కెచ్లో భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించే యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిందితులతో అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకుని...నిత్యానందరెడ్డే హత్య చేయించినట్లు కథలు అల్లుతున్నారు. ● ఈ నెల 6వ తేదీన రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన దాడిలో ఆలంఖాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ హత్యను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు పెద్ద స్కెచ్ వేశారు. చనిపోయిన పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనే ఒకే ఒక తీగను పట్టుకుని నిత్యానందరెడ్డే హత్య చేయించాడనే స్థాయికి కేసును మళ్లించేశారు. నిందితుల్ని చితకబాది... తొలుత కేసు జాతరలో చోటుచేసుకున్న వివాదంపైనే విచారణ సాగింది. ఆపై రాజకీయ రంగు పులుముకొని ఇన్ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతే వేగంగా వైఎస్సార్సీపీ టార్గెట్గా అడుగులు పడ్డాయి. నిందితులను కడప డీటీసీలో చితకబాది నిత్యానందరెడ్డి పేరు చెప్పించుకుని...కేసును వైఎస్సార్సీపీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారని నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి ఆరోపిస్తున్నారు. విచారణ జరుపుతున్న అధికారులు మార్చడంలోనే అనుమానాలుంటే...తమకు గతంలో వివాదాలున్న ఓ డీఎస్పీ చేతికి కేసు విచారణ ఇవ్వడంలో పెద్ద కుట్ర దాగుందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు... ఆలంఖాన్పల్లెలో దాడి వ్యవహారం పోలీసులకు చేరవేస్తే తక్షణమే స్పందించాల్సింది పోయి, రిమ్స్లో అడ్మిట్ కావాలని ఉచిత సలహా ఇచ్చారు. అటువైపు కన్నెత్తి చూడలేదు. రిమ్స్ వరకూ భద్రత కల్పించాలని కోరినా నిష్ప్రయోజనమే అయ్యింది. ఈమొత్తం వ్యవహారం పోలీసుశాఖను చుట్టుముట్టింది. దాంతో తక్షణమే నగర డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా సీఐ రెడ్డెప్పను బదిలీ కూడా చేశారు. పోలీసుల వైఫల్యం తేటతెల్లం కావడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు హత్య కేసును అనేక మలుపులు తిప్పుతున్నారు. పోలీసులు అనుకున్న చట్రం చుట్టూ హత్యకేసు దర్యాప్తు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్కుమార్పై థర్డ్ డిగ్రీ రూ.5లక్షలు నగదు నరేంద్ర చేరవేశానని ఒప్పుకోవాలంటూ కోటింగ్ పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు దర్యాప్తులో అనేక మలుపులు సెర్చ్ వారెంట్ తీసుకొని నిత్యానందరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి సోదాలు చేసిన పోలీసు అధికారులు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్కుమార్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం. నిత్యానందరెడ్డి రూ.5లక్షలు నగదు ఇస్తే ఆ మొత్తం కేసులో ఉన్న నరేంద్రకు అప్పగించానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ రింగ్ రోడ్డులోకి తీసుకొని కోటింగ్ ఇచ్చారు. కేవలం ఇంటి పనులు, వ్యక్తిగత పనులకే పరిమితమైన తనకు ఇవేవి తెలియవన్నందుకు ఖాకీలు కర్రలతో దాడులు చేశారు. ఇదే విషయాన్ని రాజ్కుమార్ సైతం వాపోతున్నారు. దీనిని బట్టే పోలీసుల విచారణ ఎలాంటి దిశలో పయనిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
‘వీరజవాన్’ను మరిచిన బాబు సర్కార్
సాక్షి ప్రతినిధి, కడప: ‘జై జవాన్, జై కిసాన్’ స్ఫూర్తి నేటి పాలకులకు కొరవడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జవాన్ వీరమరణం చెందితే ఆదుకోవాలనే కనీస స్పృహలేకుండా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర్రగా పరిహారం ఇవ్వకపోగా, కుటుంబాన్ని ఆదుకోవాలనే దిశగా ఒక్క అడుగూపడని దుస్థితి నెలకొంది. ● బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొడవటికంటి రాజేష్ (36) ఇండో టిబెటన్ పోర్ట్ బార్డర్ (ఐటీపీబీ)లో 17ఏళ్లుగా జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా చత్తీస్గడ్ అడవుల్లో మావోయిస్టుల దుశ్చర్య కారణంగా 2024 అక్టోబర్ 19న మృత్యువాత పడ్డారు. 36ఏళ్ల వయస్సులో జవాన్ రాజేష్ మృతి చెందడంతో ఆ కుటంబం దీనావస్థకు చేరింది. ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం సతీమణి స్వాతికి కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిన్నర్రగా రాష్ట్ర ప్రభుత్వం కరుణ కోసం అనేక పర్యాయాలు కలెక్టరేట్ దరికి చేరింది. వీరజవాన్ కుటుంబానికి అండగా నిలవాలని, రాష్ట్ర ప్రభుత్వ పరంగా లభించాల్సిన పరిహారం, వ్యవసాయ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నా అమె అభ్యర్థన బుట్టదాఖలే అయ్యింది. ఇదివరకే మృతి చెందిన వీరజవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వపరంగా డబ్బులు, ఇంటి స్థలం. 5 ఎకరాల పొలం, రాజేష్ భార్య స్వాతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కూడా మరుగుపర్చారు. వీరజవాన్ కుటుంబంపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు సర్కార్ను పలువురు తూర్పారబడుతున్నారు. మావోయిస్టు దుశ్చర్యలో మృతి చెందిన జవాన్ రాజేష్ ఏడాదిన్నర్ర అయినా ప్రభుత్వం నుంచి లభించని పరిహారం పలుమార్లు కలెక్టర్ను కలిసినాఫలితం శూన్యం వీరజవాన్ కుటుంబాన్ని ఆదుకోండి బి.మఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన కె రాజేష్(36) చత్తీస్గడ్ అడవులల్లో మావోయిస్టుల మందుపాతరలకు బలి అయ్యారు. ముగ్గురు పసిబిడ్డలున్న రాజేష్ కుటుంబం పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం బాధకరం. ఇప్పటికై నా రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. –ఫిలిప్స్, అధ్యక్షుడు, మాజీ సైనిక పెన్షనర్స్ అసోసియేషన్, కడప -
ఉపాధి కూలీలకు త్వరలో వేతనాలు
కడప సిటి: జిల్లాలో ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరలోనే వారి ఎన్పీసీఐ ద్వారా లింకై న ఖాతాలకు జమ అవుతాయని డ్వామా పీడి ఆదిశేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025 డిసెంబర్ 12 నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు అందనున్నాయిని తెలిపారు. వైఎస్సార్ కడపజిల్లాకు రూ. 22.36 కోట్లు చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కడప సెవెన్ రోడ్స్: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాలో ఆరుగురు సీఐల బదిలీ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. వి.ఆర్. అనంతపురం రేంజ్లో పని చేస్తున్న వి. శ్రీహరిని పులివెందుల ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ పీఎస్లో ఉన్న పి. రామాంజులును కర్నూల్ మహిళాపీఎస్కు, కడప రిమ్స్ యూపీఎస్ (అప్గ్రేడ్ స్టేషన్)లో పని చేస్తున్న బి.రామకృష్ణారెడ్డిని చిన్నచౌక్ యూపీఎస్కు బదిలీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం రాజగోపాల్ను రిమ్స్ యూపీఎస్కు, కడప ట్రాఫిక్ యూపీఎస్ సీఐఎ. సరేష్ రెడ్డిని ప్రొద్దుటూరు ట్రాఫిక్ యూపీఎస్కు , వీఆర్లో ఉన్న ఎం. తులసీరామ్కు కడప ట్రాఫిక్ యూపీఎస్కు బదిలీచేశారు. బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతం కావడంతోపాటు కొండపై అధిక వేడి ఉండటం, చల్లదనం లేకపోవడంతో సందర్శకులు ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దాంతోపాటు మైదాన ప్రాంతాల్లో ఉంటున్న ఎండలే కొండపైనా ఉండటంతో అక్కడికి వెళ్లినా అంతే అన్న భావనతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఫలితంగా కొండపై గదులు ఖాళీగా ఉండగా, సాధారణ సందర్శకులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొండపై పర్యాటకుల సంచారం లేక బోసిపోతోంది. మంగళవారం కూడా కొండపై 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు కాస్త తగ్గిన ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. రాయచోటి: రాయచోటి పట్టణం ఠానా సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రాజంపేట వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. మంగళవారం ఉదయం పట్టణంలో రద్దీగా ఉన్న ఠానా వద్ద చేటుచేసుకున్న ఈ సంఘటన.. అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి డిపోకి వెళ్తున్న బస్సు ఠానా సర్కిల్ నుంచి సుండుపల్లి రోడ్డు వైపు తిరగగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ గమనించి కేకలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే సర్కిల్లో డ్రైవర్ అరుపులు విని పక్కకు పరుగులు తీశారు. కానీ ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూనియర్ అసిస్టెంట్ జయరాం నిద్రపోతూ కనిపించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చిన రైతులు తమ కెమెరాల్లో బంధించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఆఫీస్లో నిద్ర పోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్కు సరెండర్ చేశారు. దీంతో కలెక్టర్ రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయానికి మూడు నెలల క్రితం డిప్యూటేషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ తహసీల్దార్ కిరణ్ కుమార్ వివరణ కోరడానికి ప్రయత్నించగా.. ఆయన రెండు రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలిసింది. -
నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య -
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వాముల కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరిగాయి. క్షేత్రాధిపతియైన పరమ శివుని అంశలోని వైద్యనాఽథ స్వామి కల్యాణంతోపాటు క్షేత్ర పాలకుడైన విష్ణు అంశలోని చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం ఒకే రోజు జరగడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఉదయం శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై శ్రీ కామాక్షీ వైద్యనాథుల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి కొండపై చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని మంటపంలో ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాలను కనులారా చూసి తరించారు. అనంతరం శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి, శ్రీ చెన్నకేశవ స్వామికి గజవాహన సేవను నిర్వహించారు. గరుడ వాహనంపై చెన్నకేశవుడు కాగా మంగళవారం తెల్లవారుజామున శ్రీచెన్నకేశవస్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్రామ మాడ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి రథోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 4. 30 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల రథోత్సవం జరుగుతుంది. వైద్యనాఽథుని కల్యాణ మహోత్సవంలో మంగళసూత్రాన్ని చూపుతున్న పురోహితులు శ్రీ చెన్నకేశస్వామి కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న వేద పండితులు -
23 నుంచి ఫుట్బాల్ జిల్లాస్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● ఈనెల 23న పుట్బాల్ విభాగంలో సబ్ జూనియర్ అండర్–15, అండర్–20 విభాగంలోని క్రీడాకారులకు నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నా రు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ● ఈ నెల 24న సబ్ జూనియర్ అండర్–15, జూనియర్స్ అండర్–19 బాల బాలికలకు నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. మే 2 నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలు రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 616 జయంతి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో మే 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు తాళ్లపాక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. 8వతేది వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 2న తాళ్లపాకలోని ధ్యానమందిరంలో గోష్ఠిగానం, సప్తగిరి సంకీర్తనలు, 10గంటలకు శ్రీవారి కళ్యాణం ఉంటుందన్నారు. అలాగే అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సాయంత్రం ఊంజలసేవ నిర్వహిస్తారన్నారు. 3 నుంచి 8వతేది వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. కడప సీసీఎస్ ఇన్స్పెక్టర్గా హాజివలి కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప సీసీఎస్ ఇన్స్పెక్టర్గా హాజివలి సోమవారం బాధ్యత లు స్వీకరించారు. నంద్యాల డీటీసీ నుంచి కడపకు బదిలీపై వచ్చారు. ఈయన గతంలో పులివెందుల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా, లింగాల ఎస్ఐగా, పులివెందుల ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్ఐగా పనిచేశారు. పోలీసు శాఖలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కడపలో నేరం నియంత్రణపై దృష్టి పెట్టనున్నట్లు హాజివలి తెలిపారు. ఏసీబీ సోదాలు రాయచోటి : రాయచోటిలో సోమవారం ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ సహాయ అధికారిగా బాలాజీ పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట విధి నిర్వహణలో ఉంటూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కదిరితో పాటు రాయచోటిలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం తిరిగి సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ సోదాలలో పలు భూమి రికార్డులు, బంగారు నగలు, డబ్బులు భారీగా పట్టుబడినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆయన ఇంటితోపాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఘనంగా చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ కడప ఎడ్యుకేషన్: కడప నగరం రహమతుల్లా వీధిలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి అమిరురన్నిసా ఇంటి నుండి గంధం కళాశాన్ని తీసుకువచ్చి దర్గాలో గంధాన్ని సమర్పించారు. అలాగే దర్గా ఆవరణంలో ఉన్న జెండా ను అలంకరించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ గంధం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా ముతవల్లి అమిరున్నిసా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాష, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా!
రాజంపేట : దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దళితుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశమే అని అనన్నారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని తెలిపారు. గతంలో అనేక సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. దళితులను హత్య చేసేందుకు అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనుకంజ వేయడం లేదనడానికి ఒంటిమిట్ట దళిత యువకుడు ఈరి హర్షవర్ధన్పై జరిగిన దాడే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వాతావరణానికి ముప్పు తెచ్చేలా టీడీపీ రౌడీమూకలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అగ్రకులానికి చెందిన వారు దళిత యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరచడం దారుణమన్నారు. టీడీపీ రౌడీమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ నేత దండుగోపి ధ్వజం -
దస్తగిరి హత్య కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి :కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు.రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యా ప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన కడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ వస్తారని.. ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కల్పించాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం. టార్గెట్ నిత్యానందరెడ్డి...?: వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో... దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శకు వస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం పోలీసుల డొల్లతనం బహిర్గతం అవుతుందని దర్యాప్తు డైవర్ట్ పాత పరిచయాలు, ఫొటోల ఆధారంగా కేసు చుట్టే యత్నంనిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప టాస్క్ఫోర్సు : కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించినట్లు తెలిసింది. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
● అమ్మ కావాలి..!
వాల్మీకిపురం : అంకుల్ అమ్మకు ఏమైంది.. అమ్మ కావాలి.. అంటూ చిన్నారి లోక్షిత రోధిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఆదివారం హత్యకు గురైన మౌనిక మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెంగళూరు నుంచి మృతురాలి కుమారుడు కౌసిక్ (7), లోక్షిత (5) ఆసుపత్రికి చేరుకున్నారు. తన అమ్మను చూడాలని గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో లోక్షిత పడిన తపన, ఆరాటాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పాపను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గంటల తరబడి ఏడుస్తూ తన అమ్మ కోసం పరితపించిపోయింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం బాధాకరం
పులివెందుల : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల లోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారకతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే వైఎస్ జగనన్న శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలులో ఉండేదని, ఆ తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో దానిని అమలు చేయలేదన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థలలో ఏకంగా 54శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కొత్త అర్థం తీసుకొచ్చారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఉంటే మహిళలు విధాన నిర్ణయాలలో భాగస్వామ్యులై ఉండేవారన్నారు. వైఎస్ జగనన్న చెప్పినట్లుగా 50శాతం సీట్ల పెంపుదలే ఉత్తమమైన విధానమని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ అవినీతిని, లోపాలను ప్రశ్నించిన వారిపై ఏకంగా దేశ ద్రోహం కేసులు పెట్టి రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు వీరు చేసే అరాచకాన్ని చూస్తున్నారని బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
జీతాలు, పెన్షన్లకు గ్రాంటు విడుదల చేయాలి
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేయాలి. లైబ్రరీ సెస్సు ఎప్పటికప్పుడు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలి. నిధులు మంజూరు చేయకుండా లైబ్రరీల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి. – నాదెండ్ల బాబ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం, కడప -
గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు
కడప కోటిరెడ్డి సర్కిల్ : సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా ఎస్సీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. జిల్లా ఎస్సీ కార్యాలయంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ మాట్లాడుతూ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో జన్మించి సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు అన్నారు. బసవేశ్వరుడు భక్తి మార్గాన్ని ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వచనల రూపంలో ప్రవచించారన్నారు. ఈ వచనాలు సరళమైన భాషలో ఉన్నప్పటికి లోతైన సాత్విక సందేశాన్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ రమణయ్య, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలిప్రజల నుంచి పీజీఆర్ఎస్కు వస్తున్న ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. -
రజకుని హత్య కేసులో నిందితుడు అరెస్టు
రాజంపేట : మండలంలోని పులపత్తూరు గ్రామంలో రజకుడు దంపెట్ల మల్లికార్జున హత్య కేసులో గోబుగారి సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతకక్షల కారణంగా పథకం ప్రకారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారన్నారు. పరారీలో ఉన్న సుబ్బారెడ్డిని నారమరాజుపల్లె నవోదయ కాలనీ వద్ద అరెస్టు చేశామన్నారు. రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గంజాయి కేసులో ఇద్దరు అరెస్ట్వేంపల్లె : వేంపల్లెలో గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాయార్ హుస్సేన్లతో కలిసి పులివెందుల – రాయచోటి బైపాస్ రోడ్డులోని గవి మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద వేంపల్లెలోని శ్రీరాంనగర్కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, యల్లంకూరు వెంకటేష్లు గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింహులు చెప్పారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతిమైదుకూరు : మండలంలోని వనిపెంట వద్ద సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని వనిపెంట సిద్ధమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త సీతారామాపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి, సిద్ధమ్మ దంపతులు మైదుకూరుకు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్లేందుకు బ్రహ్మంగారిమఠం వెళ్లే బస్సు ఎక్కి వనిపెంటలో దిగారు. భర్త వీరారెడ్డి రోడ్డు దాటి వెళ్లగా సిద్ధమ్మ కూడా భర్తను అనుసరిస్తూ రోడ్డు దాటుతుండగా మైదుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
ఆర్ఐపీఈగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆర్ఐపీఈ)గా డాక్టర్. ఎస్ రామకృష్ణ సోమవారం కడపలోని పాఠశాల విద్య ఆర్జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురం జిల్లా బుక్కపట్నం డైట్ కళాశాల ఇన్చార్జు ప్రిన్సిపల్గా పనిచేస్తూ బదిలీపై ఎఫ్ఏసీ ఆర్ఐపీఈగా జిల్లాకు వచ్చారు. ఈ మేరకు బాధ్య తలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆర్ఐఈపీని కలిసిన ఏపీ పీఈటీ అండ్ సాప్ అసోసియేషన్ నాయకులు ఆర్ఐఈపీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్. ఎస్ రామకృష్ణను ఏపీ పీఈఓ అండ్ సాఫ్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అగ్గిరప్పయాదవ్, సంఘం సలహాదారు జిలానీబాష, సంఘ సభ్యులు మాధవి, లక్ష్మి, రాయుడు, మహేశ్వర్రెడ్డి, ఓబులేసు, విశ్వనాథ్లతోపాటు ఉపాధ్యాయులు కలిసి పూలగుచ్చంతో అభినందనలు తెలిపారు. ఏఐ..ప్రపంచాన్ని శాసిస్తుంది కురబలకోట: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఏఐ నిలవబోతోందని బెంగళూరులోని క్లౌడ్ సెక్ కంపెనీ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ జయంత్ శర్మ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ప్రాజెక్ట్ ఎక్స్పో ఆన్ ఏఐ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ణానాలు భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయన్నారు. -
సంబరాలకు డబ్బుంది.. రైతులను ఆదుకోవటానికి లేవా
● అమరావతి పేరుతో దోచుకుంటున్నారు ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్రంలో రైతులు పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరలు వస్తాయని అశించారు.అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు లేక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరితే తమ వద్ద డబ్బులు లేవంటూ అమరావతి పేరుతో ఊరురా సంబరాలు చేయడం కోసం ఖర్చు పెడుతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్క పొగాకు పంటలు వేసి నష్టపోయిన రైతులు చాలా మంది మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఎకరాకు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 40క్వింటాళ్ల వరకు వచ్చింది. ఈ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కింద రూ. 2400 ప్రకటించింది. అయితే ఎక్కడ కూడా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కోనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి రైతులు అమ్మకాలను కొనసాగిస్తుంటే వారు క్వింటాకు కేవలం 1700 రూపాయలు చెప్పి తరుగులు తీయడంతో క్వింటాకు రైతులకు 1600 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. శనగ పంటను రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు సాగుచేశారు.ఈ ఏడాది ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.5875 ప్రకటించింది.అయితే శనగ కొనుగోలు కేంద్రాల్లో శనగలు కొనుగోలు చేయడంలేదు. కొనుగోలు చేస్తున్నా కాంట్రాక్టర్లు చిలక్కొట్టుడు కొడుతుండటంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో వ్యాపారుల వద్ద రూ. 4900కే శనగలు అమ్ముకుంటున్నారు. శనగ రైతు ప్రతి క్వింటాకు 900 నుంచి 1000 నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకోసం కేంద్రానికి లేఖలు పంపామని, ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు రూపాయలు దొచుకోవడం కోసం ఆగమేఘాలమీద అమరావతి బిల్లును కేంద్రానికి పంపించి, రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక చట్టం తెచ్చామని కూటమి నాయకులు చెబుతున్నారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో ఎందుకు లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో 3.56 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టారా అంటే ఆదీలేదు అని అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీతోపాటు ఇన్సూరెన్స్లు ఇచ్చి రైతులను ఆదుకుందని తెలిపారు.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి రమణారెడ్డి, రైతు విభాగ నాయకుడు విశ్వనాథ్రెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలి
జేసీ నిధి మీనాకడప సెవెన్ రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్తో పాటు ఇన్చార్జి డీఆర్ఓ వెంకట పతి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందులో కొన్ని...... ● జిల్లాలో ఎన్హెచ్ డీసీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల చేనేత కార్మికులు నష్టపోతున్నారని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున తెలిపారు. రాయతీ సౌకర్యం కల్పించే ఆ పథకాన్ని ప్రతి చేనేత కార్మికున్ని అందేలా చూడాలన్నారు. ● వేసవి తీవ్రత అధికంగా ఉన్నందువల్ల నగరపాలక సంస్దలో పని చేసే కార్మికుల విధి నిర్వహణ సమయాన్ని ఉదయం 5.30 నుంచి 11.30 వరకు ఉండేలా చూడాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుంకర రవి, కంచుపాటి శ్రీరాములు, ప్రకాశ్లు కోరారు. అలాగే విధి నిర్వహణలతో మరణించి అప్కాస్ మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగవకాశం కల్పించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
రాజంపేట : చిట్వేలి పోలీసుసేష్టన్లో విధులు నిర్వర్తించేందుకు కానిస్టేబుల్ కే.సుధాకర్రాజు (56) రాజంపేట నుంచి బయలుదేరిన క్రమంలో సోమవారం పోలిచెరువు వద్ద డివైడర్ను ఢీ కొని మృతి చెందారు. దీంతో రాజంపేట సబ్బ్డివిజన్ పోలీసువర్గాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుధాకర్రాజు గతంలో రాజంపేట, మన్నూరు పోలీసుస్టేషన్లో పనిచేశారు. విధి నిర్వహణలో సుధాకర్రాజు క్రమశిక్షణతో పనిచేసేవారని తోటి కానిస్టేబుళ్లు గుర్తుచేసుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టరం నిర్వహించి, సంబంధీకులకు అప్పగించారు. సుధాకర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ నుంచి ఏ ఆర్, అక్కడి నుంచి సివిల్ కానిస్టేబుల్గా ప్రస్తుతం చిట్వేలిలో పనిచేస్తున్నారు. నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతిబి.కోడూరు : మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన చిన్నగురయ్య, సుమతిల మూడు సంవత్సరాల కుమారుడు మున్నెల్లివిహాన్ సోమవారం రాత్రి ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి మృతిచెందాడు. విహాన్ కనిపించలేదని వెతుకుతుండగా నీళ్లబకెట్లో పడి ఉండటాన్ని గమనించారు. బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. -
ఘనంగా అక్షయ తదియ
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో ని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాల లో భాగంగా సోమవారం అక్షయ తదియ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెన్నా నదిలో స్నానాలు ఆచరించారు. అ నంతరం ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు చెన్నకేశవ స్వామి ఎదుట తడి బట్టలతో సాష్టాంగ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుందనే ప్రగా ఢ విశ్వాసంతో అనేక మంది భక్తులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. వైభవంగా చెన్న కేఽశవుని పూలంగి సేవ శ్రీ చెన్నకేశవ స్వామికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధేశ్వర ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇష్ట వాహనాలపై హరిహరులు రాత్రి శ్రీ చెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై భక్తుల కు దర్శనమిచ్చారు. గ్రామంలోని శ్రీ కామా క్షీ వైద్యనాఽథేశ్వర స్వాములు నంది వాహనంపై భక్తులను కరుణించారు. నేడు కల్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వాములకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామికి శ్రీదేవి, భూదేవిలతో కళ్యాణోత్స వం జరుగుతుంది. రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
● 21వ తేదీ మధ్యాహ్నం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ● క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణ ● 22న ఇప్పట్లలో వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ ● 23న తిరుగుపయనంపులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. ● 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు. 9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ● 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
విచారణకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు
కడప కార్పొరేషన్ : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 9వ తేదీ వైఎస్సార్సీపీ నాయకులు గుంటి నాగేంద్ర, డాక్టర్ నాగార్జునరెడ్డిలు చేసిన నిరసనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం వారు విచారణకు హాజరయ్యారు. కొత్త పలుకు అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చెబితే వారు తమ భార్యలను చెల్లెళ్లుగా భావించి ఇతరులకు సంబంధాలు చూసి పెళ్లి చేసే వెన్నెముక లేనివారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు ఎన్. నాగార్జునరెడ్డి తదితరులు ఈనెల 9వ తేదీ రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆ పత్రిక బ్రాంచి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు ఈనెల 17వ తేదీ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో సోమవారం వారు పోలీసుల ఎదుట హాజరయ్యారు. కేసులో నమోదు చేసినవన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావడంతో పోలీసులు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, చల్లా పవన్, సతీష్ తదితరులు ఉన్నారు. -
పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో ఆదివారం చైతన్య సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక –2026ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని, కవి నరాల రామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలపిట్ట మాస పత్రిక వారు 51 కథల సంకలనంగా ఉగాది ప్రత్యేక సంచిక మార్చి –2026ను తెచ్చిన ప్రతిక ఎడిటర్ గుడిపాటి వెంకట్ను ప్రశంసించారు. వివిధ ప్రాంతాల్లోని ప్రసిద్ధ కథకుల కథలను తీసుకుని కథా సంకలనంగా తేవడం ద్వారా పాఠకులు వివిధ ప్రాంతాల సంస్కృతి ఆచార సంప్రదాయాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. పట్టణానికి చెందిన కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావు కథలు ఉండటం విశేషమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డీకే చదువుల బాబు కాశీవరపు వెంకటుబ్బయ్య రచించిన అల్లెంగుండు కథను సమీక్షించారు. రచయిత ఈ కథలో పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. రచయిత జింకా సుబ్రహ్మణ్యం పల్లా వెంకటరామారావు రచించిన దిద్దుబాటు కథనం సమీక్షించారు. ఈ కథలో పిల్లల దురాలవాట్లతో చెడిపోతున్నప్పుడు ఉపాధ్యాయుడు యుక్తిగా విద్యార్థులను చెడు అలవాట్ల నుంచి మాన్పించడం గొప్పగా ఉందన్నారు. ఈ సందర్భంగా కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు పల్లా కృష్ణ, కొత్తపల్లి శీను, కామనూరు రామ్మోహన్, ఆవుల శ్రీనివాస్, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, కుంభం పామిలేటి పాల్గొన్నారు. -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి తర్వాత వేగంగా ఉపాధి పొందే అవకాశాలు కలిగిన కోర్సు పాలిటెక్నిక్. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సెక్టార్లోను పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులభంగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువత పాలిటెక్నిక్పై ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 28,152 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 9283 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆపరాధ రుసుంతో పాలిసెట్కు దరఖాస్తు చేసుకునే వెసలుబాటు ఉంది. దీంతో దరఖాస్తు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం.... గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అమ్మాయిలకు ప్రత్యేకం... కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్(ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్(ఈసీ), సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లమా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాలలో ఒక బ్రాంచికు 60 సీట్లు చొప్పున 240 సీట్లు ఉన్నాయి. దీంతోపాటు హాస్టల్ వసతి కూడా కలదు. ప్రారంభమైన ఉచిత శిక్షణ... జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్ను అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి ఉచిత పాలిసెట్ శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ర్యాంకు సాధిస్తాం... ఈ నెల 25వ తేదీ నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షలో తప్పకుండా ర్యాంకును సాధిస్తాం. కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో తీసుకున్న కోచింగ్ నాకు బాగా ఉపయుక్తంగా ఉంది. బాగా చదువుకున్నాను. తప్పకుండా ర్యాంకు సాధిస్తా. – వినంత్ , విద్యార్థి, కడపచక్కటి ఉపాధి డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడటానికి పాలిటెక్నిక్ సరైన మార్గం, విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువు లకు సైతం ఉపయోగపడుతుంది.– సీహెచ్ జ్యోతి, పాలిసెట్ కన్వీనర్, ప్రభుత్వ మహిళా పాటిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, కడప. ఉచిత మెటీరియల్తో ఉపయోగం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఇచ్చిన మెటీరియల్ బాగా ఉంది. దీంతోపాటు కళాశాలలో చెప్పిన ఉచిత కోచింగ్తో రెండింటితో తప్పకుండా ర్యాంకు సాధిస్తాం. – మధురిమ, విద్యార్థి,కడప 2పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇన్పిరేషన్ టెక్నాలజీ (ఐటి)తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలోని కడప, పొద్దుటూరు, వేంపల్లి, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, కమలాపురంలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. అలాగే జిల్లాలొ 12 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4200 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 8000 దాకా సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రారంభమైన ఉచిత పాలిసెట్ శిక్షణ జిల్లావ్యాప్తంగా 9283 మంది దరఖాస్తు 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష... -
ఎడతెగని అల్ట్రాటెక్ పంచాయితీ
సాక్షి టాస్క్ఫోర్సు : వైఎస్సార్ కడప జిల్లా చిలంకూరు ప్రాంతంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నాలుగు రోజులుగా కూటమి శ్రేణులు శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలోని సిమెంట్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నప్పటికీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా యంత్రాంగం స్పందించక పోవడం పట్ల ఈ ప్రాంతంలోని కార్మిక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పరిశ్రమతో ఏమాత్రం సంబధం లేని వ్యక్తులు శిబిరాన్ని ఏర్పాటు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఎంతకు దిగిరాక పోవడంతో అసహనానికి గురైన కూటమి శ్రేణులు ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బోధపడక పరిశ్రమలను నిర్బంధిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల వల్ల చాలామంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరస్థితి నెలకొంది. కార్మిక శాఖతో పాటు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతలు కావడంతో అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.స్పందించని జిల్లా అఽధికార యంత్రాంగం -
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో వృద్ధురాలు మృతి
వల్లూరు : పుష్పగిరిలో ఆదివారం రాత్రి మైదుకూరు ప్రాంతానికి చెందిన సుమారు 70 సంవత్సరాల వయసు గల సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని దైవ దర్శనాలతోపాటు రాత్రి పుష్పగిరిలో బస చేయాలనే ఉద్దేశంతో కొందరు బంధువులతో కలిసి వచ్చింది. పెన్నా నది ఒడ్డున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్ద అందరితో కలిసి భోంచేసింది. అనంతరం అందరూ కలిసి సమీపంలో కూర్చుని మాట్లాడుకుంటుండగా సుబ్బమ్మ గుండెల్లో నొప్పిగా వుందంటూ పక్కకు ఒరిగింది. ఆమెకు సపర్యలు చేసినప్పటికీ అప్పటికే మృతి చెందింది. ఎండ తీవ్రత నేపథ్యంలో వడదెబ్బతో ఆమె మృతి చెంది ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. -
కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆదివారం ఏ–20 నిందితుడిని స్థానిక 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ పావని తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్సత్రిలో విజయవాడకు చెందిన సాడి జమున(29) కిడ్నీ తొలగించే క్రమంలో వైద్యం వికటించి ఆమె మత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్ టెక్నీషియన్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్లసత్య, పిల్లి పద్మ, సూరి బాబుతో పాటు కిడ్నీ తొలగించిన డాక్టర్లు ఆంజనేయులు, పార్థసారథిరెడ్డితో కలిపి మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయగా అందులో 11మందిని అరెస్టు చేశారు. ఆదివారం 20వ నిందితుడిగా ఉన్న కడపకు చెందిన గ్లోబల్ ఆస్పత్రి ఓటీ అసిస్టెంట్ నవీన్ (28)ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. -
పెద్ద దస్తగిరి హత్య కేసులో 11 మంది నిందితుల అరెస్ట్
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఆవరణలో ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున కలమల్ల పెద్ద దస్తగిరి (53) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన 11 మంది నిందితులను ఈనెల 18న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లు , కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్కు పంపించారు. అరెస్టయిన వారిలో చెన్నూరు టౌన్కు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తున్న అన్నదమ్ముల్లో తమ్ముడు పేరం రవి, అన్న పేరం రాజు అలియాస్ రాజాను, కడప నగరం అలంఖాన్ పల్లెకు చెందిన అవ్వారి వెంకటేష్, తిరుపతి సురేంద్ర అలియాస్ సురేంద్ర అలియాస్ జాకీ, అలంఖాన్ పల్లె, రాణితోటకు చెందిన వనపర్తి వెంకట మనోహర్ అలియాస్ మనోహర్, వల్లూరు మండలం చిన్నలేబాక గ్రామానికి చెందిన లేవాకు ఉపేంద్ర రెడ్డి అలియాస్ ఉపేంద్ర, అలంఖాన్ పల్లెకు చెందిన గంధం విజయకుమార్, హరిగోపుల శివప్రసాద్, ఆదిమూలపు వెంకట నరేంద్ర అలియాస్ నరేంద్ర, కడప నగరం పక్కీరుపల్లెకు చెందిన గొడుగునూరు రామగోపాల్ వర్మ అలియాస్ వర్మ, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన పెయ్యల శివ ఉన్నారు. వీరు ఈనెల 6న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఐపీ, ఓపీ భవనాల మధ్య ఉన్న తారురోడ్డులో కలమల్ల పెద్ద దస్తగిరి(53)ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిని కత్తిపోట్లకు గురి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కలమల్ల వెంకట దస్తగిరి ఫిర్యాదు మేరకు రిమ్స్ పీఎస్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారుడు వెంకట దస్తగిరి ఫిర్యాదులో తన తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తుండగా, తల్లి రమణమ్మ ఇంటి పనులు చూసుకునేది. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు, బీటెక్ చదువుతున్న అతని ఇద్దరు సోదరీమణులు నాగపద్మిని, రాగిణి. వెంకటదస్తగిరికి చదువులో అంతగా పట్టు లేకపోవడంతో, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ చదివి, రెండోసంవత్సరం పరీక్షలు రాసి, ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా, వెంకట దస్తగిరి రాత్రి ఊరేగింపులో పాల్గొని, ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు వారి గ్రామానికి చెందిన హత్య కేసులో నిందితుడైన అవ్వారి వెంకటేష్ అలియాస్ వెంకీపై పడ్డాడు. దీంతో వెంకీ అతనిపై దాడి చేశాడు. వెంకట దస్తగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. అతని తండ్రి, హతుడు పెద్ద దస్తగిరి, అతని మేనమామ చిన్న దస్తగిరి, ఇతర కుటుంబ సభ్యులు వెళ్లి అవ్వారు వెంకటేష్ అలియాస్ వెంకీని మందలించారు. దీంతో వెంకీ, అతని స్నేహితులు ఇంటికి తిరిగి వచ్చి జిల్లాపరిషత్ ఉన్న పాఠశాల సమీపానికి చేరుకున్నారు. వెంకీ స్నేహితులైన వనపర్తి వెంకట మనోహర్ అలియాస్ మనోహర్ వారిపై పగ పెంచుకున్నారు. ఈనెల 5వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు, వెంకటేష్, మనోహర్లు వెంకట దస్తగిరితో గొడవపడి దాడి చేశారు. అతను వెళ్లి తన తండ్రికి, తనకు కావాల్సిన వారికి చెప్పవచ్చని బెదిరించారు. అతను ఫోన్న్లో తన తండ్రికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే మనోహర్తో పాటు, వెంకీ పెద్ద దస్తగిరి ఇంటికి వెళ్లి ఇంటిలోని వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారంతా వైద్య సేవల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వారికి సహాయం చేసేందుకు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరితో పాటు, కుటుంబసభ్యులు వెళ్లారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి ఈ హత్య కేసులో అరెస్టయిన వారంతా కత్తులతో నేరుగా రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాల్లో రిమ్స్కు చేరుకున్నారు. 5వ తేదీ అర్థరాత్రి నుంచి కాపుకాసి, 6వ తేదీన తెల్లవారు జామున (3 గంటల ప్రాంతంలో రిమ్స్ ఐపీ, ఓపీ భవనాల మధ్యన పెద్ద దస్తగిరిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తరువాత తాము వచ్చిన వాహనాల్లో పరారయ్యారు. మారెమ్మ తిరునాలలో జరిగిన చిన్న ఘర్షణ ఒక వ్యక్తి హత్యకు, మరొకరు ప్రాణాపాయస్థితికి చేరుకునేలా చేసిందని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా నివేదికలో పేర్కొన్నారు. ఎట్టకేలకు కడపలోని పోలీసు శిక్షణా కేంద్రం (డీపీటీసి) సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. రిమాండ్ కోసం కడప కేంద్రకారాగారానికి పంపించామని రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఇంకా ఈ హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.పథకం ప్రకారమే హత్య చేశారని విచారణలో వెల్లడి -
రాజంపేటలో దందా!
● పెట్రోల్ బంక్ స్థలం కొట్టేయడానికి యత్నాలు ● క్వారీలను కట్టబెట్టాలని బెదిరింపులు ● అల్లాడిపోతున్న అన్ని వర్గాలురాజంపేట : రాజంపేటలో టీడీపీ ముఖ్యనేత దందా యథేచ్ఛగా కొనుసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ నేత తీరు తెన్నులపై ఇక్కడ ప్రజానీకంలో చిన్నచూపు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తాననని పదేపదే ప్రచారం చేసుకుంటున్న తరుణంలో దోచుకుంటున్నారనే అపవాదును ఇక్కడి ముఖ్యనేత మూటకట్టుకున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్నాయని అధికారపార్టీలో చర్చ జోరుగా కొనసాగుతోంది. పురపాలిక పెట్రోలుబంక్ స్థలం కొట్టేసేందుకు .. రాజంపేట నడిబొడ్డున ఉన్న పెట్రోల్బంకు నిర్వహణ పురపాలికస్థలంలో ఉన్నందుకు పురపాలికకు కేవలం రూ.1 అద్దె చెల్లిస్తూ కొన్నేళ్లుగా కొనసాగింది. రాజంపేటకు పురపాలిక సంఘానికి కమిషనరుగా ఫజులుల్లా వచ్చిన నేపథ్యంలో పెట్రోలు బంకు నిర్వహణ, స్ధలం వ్యవహారం వెలికి తీసారు. అప్పట్లో పెట్రోలు బంకు యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కమిషనర్లు ఎవరూ పట్టించుకోలేదన్న వాదన పట్టణవాసుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం కౌన్సిల్ పురపాలిక స్థలంలో పెట్రోలు బంకు నిర్వహణపై దృష్టి సారించింది. పెట్రోలు బంక్ నిర్వహణను అడ్డుకున్నారు. అయినప్పటికీ దొడ్డిదారిలో నిర్వహణ కొనసాగుతోందని కౌన్సిల్లో ఆరోపించారు.అంతేకాకుండా పెట్రోలు బంకు స్థలంపై కొందరి కన్ను పడిందని కౌన్సిల్ మీట్లో ఆరోపించారు. పెట్రోలుబంకు స్థలం కోట్ల రూపాయిలు విలువ చేస్తుంది.దీనిని ముఖ్యనేత తమ తమ్ముళ్లుకు అప్పజెప్పాలనే యోచనలో ఇప్పటికే పావులు కదిపినట్లు ప్రచారం. ఇప్పుడు పురపాలికస్ధలాలు కాపాడుకోవాలనే యోచనలో పురపాలిక కౌన్సిల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. క్వారీలను కట్టబెట్టాలని.. బెదిరింపులు మండలంలో కొందరి క్వారీలను తమకు కట్టబెట్టాలని సంబంధిత యజమానులపై బెదిరింపులు, ఒత్తిళ్లకు టీడీపీ ముఖ్యనేత దిగారు. చివరికి సంబంధిత మైన్స్ అధికారులను క్వారీ వద్దకు పంపించడం, లేని పోని ఆంక్షలు, నిబంధనలతో క్వారీ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. క్వారీని కట్టబెట్టడమో, లేక ఆదాయంలో వాటాను ఇవ్వాలని రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే చెయ్యేరులో ఇప్పుడు నడుస్తున్న ఇసుక రీచ్లో ముఖ్యనేతకు వాటా ఇవ్వాల్సిందేనని ఇసుకరీచ్ నిర్వాహకులకు హుకుంజారీ చేశారు. ఆదాయం కోసం పక్కదోవ.. నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేత ఆదాయం కోసం పక్కదోవ పడుతున్నాడు. ప్రతిదానిలో కమిషన్ ఉండాల్సిందేనని టీడీపీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కొందరైతే నేరుగా చినబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యనేత చేతిలో నుంచి పగ్గాలను తీసేయాలని అధిష్టానానికి సీనియర్లు మొరపెట్టుకున్నారు. కేవలం ముఖ్యనేత వర్గమే నియోజకవర్గంలో చేపడుతున్న ఆధిపత్యాన్ని అన్ని సామాజికవర్గాలకు చెందిన తమ్ముళ్లు మదనపడుతున్నారు. -
● కూటమి ఆటంకాలు...
కూటమి నేతలు క్రీడాకారులకు ఆటంకాలు సృష్టిస్తోంది. ‘పూర్తయిన టర్ఫ్ పిచ్ గ్రౌండ్కు తాళం వేశారు.. కీ ఓపెన్ చేయండి సార్’ అంటూ పలువురు ఆటగాళ్లు పొరుగునే ఉన్న క్రీడా శాఖ మంత్రిని విన్నవించారు... కనిపించిన అధికారులను అడిగారు.. కడప ఎమ్మెల్యేని వేడుకున్నారు.. ఎవరికీ మనసు రాలేదు.. జాతీయ క్రీడపై, క్రీడాకారులపై కాస్తయినా కనికరం చూపలేదు.. అధికారంలో ఉన్న వీళ్లు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. హాకీ కోర్టుకి వేసిన తాళం తీస్తే చాలు..అది చేయడానికి వీరికి చేతు లు రావడం లేదు.. సందర్భం వస్తే వేదికలపై గొప్ప ఉపన్యాసాలు, విన్యాసాలు చేసే కూటమి నేతలకు, అధికారులకు క్రీడాకారులకు మేలు చేయాలనే తలంపు లేకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా హాకీ కోర్టుకి వేసిన తాళం తీసేసి ప్రాక్టీస్ చేసుకునే చర్యలు చేపట్టాలని క్రీడాకారులు కోరుతున్నారు -
సమస్యల పరిష్కారానికి కృషి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కడప జిల్లా రికగ్నైజ్డ్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్ట్ అసోసియేషన్ (క్రుష్మ) జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. క్రుష్మ జనరల్ బాడీ సమావేశం ఆదివారం కడపలోని రాయచోటి రోడ్డు రోడ్డులో ఉన్న ఎస్పీ కన్వెన్షన్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ తరుణంలో కలసికట్టుగా ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయలు ఇవ్వలేదన్నారు. దీనివల్ల ప్రవేట్ పాఠశాలలకు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నామయన్నారు. ఈ విషయమై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను కలిసినప్పుడు ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఒక్క సంవత్సరానికి మాత్రమే ఫీజు బకాయిలు చెల్లించారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కచ్చితంగా పూర్తి బకాయిలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు క్రుష్మ నాయకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. నూతన కమిటి ఎన్నిక : జనరల్ బాడీ సమావేశం అనంతరం క్రుష్మ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లెక్కల జోగిరామిరెడ్డి (పవన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కడప), ప్రధాన కార్యదర్శిగా సిఎస్.రామాంజనేయరెడ్డి (స్వామి వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్, వేంపల్లి), శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ సుబ్రమణ్యం కోశాధికారిగా మరో 25 మంది కరస్పాండెంట్లను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వివిధ హోదాల్లో ఎన్నుకున్నారు.క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి -
చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని కల్లూరు గ్రామ శివారులో చేపలు పట్టేందుకు వెళ్లిన కంబగిరి (50) విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లమాపురం గ్రామానికి చెందిన కంబగిరి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామంలోని కొందరు వ్యక్తులతో కలిసి అతను ఆదివారం కల్లూరు కేసీ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి లైను లాగి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా అందరూ చేపలు పట్టసాగారు. ఈ క్రమంలో కంబగిరి అనుకోకుండా నీళ్లలోకి దిగడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి
ఒంటిమిట్ట: చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిజన వాడకు చెందిన ఈరి హర్షవర్ధన్ అలియాస్ నాని (23) అనే దళిత యువకునిపై శనివారం రాత్రి టీడీపీ అగ్రకుల మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ నెల 5వ తేదీ పుష్పయాగం రోజు రాత్రి జైంట్ వీల్ వద్ద ఒంటిమిట్ట హరిజన వాడ యువకులకు– గంగపేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామ యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. చిన్నకొత్తపల్లికి చెందిన యువకులు దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. గొడవతో ఎలాంటి సంబంధం లేని హరిత హోటల్లో సర్వర్గా పని చేస్తున్న హర్షవర్ధన్కు చిన్నకొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఫోన్ చేసి ‘హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ సర్వీస్ చేయాలి’ అంటూ పిలిచాడు. హోటల్ వద్దకు వెళ్లగానే హర్షవర్ధన్పై మల్లికార్జున, పలుకూరి కిరణ్, హేమంత్, కట్టా వేణు, కట్టా కిశోర్, కట్టా బాలకృష్ణ మూకుమ్మడిగా దాడి చేశారు. ‘మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి.. తరువాత అంతా మన టీడీపీ నాయకులు చూసుకుంటారు’ అంటూ కుల దూషణ చేస్తూ ముఖంపై రక్తం వచ్చేలా పిడి గుద్దులు గుద్దారు. నడుముపై క్రికెట్ బ్యాట్తో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న హర్షవర్ధన్ను స్థానికులు, బంధువులు వైద్యం కోసం స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు 108 సహాయంతో తరలించారు. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనతో కేసు నమోదు విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట దళితవాడ, అరుంధతి వాడ ప్రజలు ఆదివారం బాధితుడితో కలిసి ఒంటిమిట్ట పోలీసుస్టేష న్ వద్దకు చేరుకున్నారు. న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు . స్టేషన్ బయట ఉన్న జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేసి, నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, ప్రశాంతంగా ఉండే ఒంటిమిట్ట మండలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం పురుడు పోసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు. హర్షవర్ధన్పై దాడి చేసిన వారే గతంలో చెంచుగారిపల్లి వద్ద ఉన్న చిల్లర అంగడిని కూడా పెట్రోల్ పోసి దహనం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. దళితునిపై టీడీపీ రౌడీ మూకల విచక్షణారహిత దాడి వైఎస్సార్ కడప జిల్లా, ఒంటిమిట్టలో దారుణం -
26న చలో తిరుపతి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18 రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్,కేసి. బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలోని హోచిమిన్ భవన్లో దీనికి సంబంధించిన పోస్టర్లను అవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు నోయిడాలో కార్మికుల ఆందోళన కార్యక్రమాలు చూసైనా కళ్ళు తెరవాలన్నారు మహాసభలలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేసి చర్చిస్తామని, రాబోయే కాలంలో కార్మికవర్గ పోరాటలకు దిశానిర్దేశం చేయడానికి దోహదపడుతాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటిస్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు. కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మద్దిలేటి, జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, నగర అధ్యక్షులు మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
22న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని జయనగర్ కాలనీ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ఈ నెల 22న జిల్లాస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు మే 1 నుంచి 4 వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. కడప అగ్రికల్చర్: కడప మార్కెట్యార్డులో సోమవారం పసుపు క్రయవిక్రయాలు జరగవని కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ బి. శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఇక మీదట పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలను చేపడతామని తెలిపారు. ప్రస్తుతం రైతులు భారీగా పసుపును అమ్మకం నిమిత్తం కడప మార్కెట్యార్డుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఒకే రోజు టెండర్, తూకాలతోపాటు తూకం అయిన సరుకు బయటకు పంపడం ఆలస్యం అవుతుందని తెలిపారు. అంతేకాక కడప మార్కెట్యార్డు సామర్థ్యం రోజుకు 2500 క్వింటాళ్ల కాగా ప్రస్తుతం రోజుకు 3500 క్వింటాళ్లు సరుకు వస్తోందని తెలిపారు. వచ్చిన మొత్తం సరుకును అన్లోడింగ్ చేసి టెండరుకు పెట్టడానికి మార్కెట్యార్డులో స్థలం సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు కోనుగోలుదారులు, కమీషన్ ఏజెంట్లతో చర్చించి రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నందలూరు: శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైందని ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ యద్దల సుబ్బరాయుడు తెలిపారు. ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు 2026 సంవత్సరం మార్చి 31వ తేదీకి వివిధ బ్యాంకుల్లో రూ.2,51,38,720లకు చేరుకున్నా యని పేర్కొన్నారు. ఆదివారం సేవ ట్రస్ట్లో ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ 2025– 26 మార్చి నాటికి అన్నదాన పథకానికి అయిన జమా ఖర్చులు పరిశీలించామని తెలిపా రు. ఈ వేసవి కాలంలో భక్తులకు మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, కార్యదర్శి కె.శైలేంద్రనాథ్, గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య, సర్దార్ పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కలెక్టరేట్లో సోమవారం జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ● సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కలెక్టరేట్ లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్ )‘ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా ఉంటుందని వివరించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు. -
కూటమి ప్రభుత్వం క్రీడాకారులతో ఆటలాడుకుంటోంది. ఆటల్లో రాణించి బంగరు భవితకు బాటలు వేసుకుందామనే యువత ఆశలను ఆదిలోనే నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంపై అక్కసుతో జాతీయ క్రీడ హాకీకి ఆటంకాలు కలిగిస్తోంది . జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో మూత వేసి
వాకర్స్ మధ్యలో హాకీ ఆడుతున్న క్రీడాకారులు కడప వైఎస్సార్ సర్కిల్: జాతీయ క్రీడ హాకీపై కడప క్రీడాకారులకు ఆసక్తి ఎక్కువ. గతంలోనూ ఇక్కడి నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు. నేటితర ఆటగాళ్లు కూడా హాకీలో రాణించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇక్కడి క్రీడాకారుల ఆసక్తిని గమనించి.. వారిని మరింత ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మున్సిపల్ స్టేడియంలో ఆస్ట్రనాట్ టర్ఫ్ పిచ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సహకరించిన ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మేయర్ కడప స్పోర్ట్స్ స్కూల్ నుంచి బయటికొచ్చిన ఆటగాళ్లు క్రీడల్లో మరింత రాటుదేలాలనే కసితో మున్సిపల్ స్టేడియంలో రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేక డీలాపడుతున్నారు. ముఖ్యంగా హాకీని ఎంచుకున్న ఆటగాళ్లు ఎర్రమట్టి పిచ్పైనే సాధన చేస్తూ.. జాతీయస్థాయిలో టర్ఫ్ పిచ్పై ఆడడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో అప్పటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్రెడ్డి సహకారం కూడా తోడైంది. స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం టర్ఫ్ కోర్టు నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. సీమ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే సదాశయంతో ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో టర్ఫ్ పిచ్ను అత్యున్నతంగా తీర్చిదిద్దింది. రూ.8కోట్లతో 2023లో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు 2024ప్రారంభంలో పూర్తయ్యాయి. ఆపై ఎన్నికల కోడ్ రావడం.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రారంభానికి ఆమడదూరంలో ఉండిపోయింది. మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం డీఎస్ఏ క్రీడా మైదానంలో మట్టిలో హాకీ ప్రాక్టీస్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా క్రీడాకారుల సంక్షేమం కోసం ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ కావాలని గత వైఎస్ఆర్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రీడాకారులందరం అడిగిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కడపలో ఈ పిచ్ నిర్మాణానికి సహకరించారు. పూర్తయి మూడేళ్లయినా ప్రారంభం కాలేదు. మైదా నం బయట ఆడుతుంటే వాకర్స్ మమ్మల్ని తిడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ను ప్రారంభించాలి. –ప్రదీప్, హాకీ స్టేట్ ప్లేయర్ వైఎస్సార్ కడప జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహానేత వైఎస్ఆర్ కడపలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మించారు. అందులో చేరినవారు ఇప్పటికే పతకాల పంట పండించారు. ఎంతోమంది జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే రంజీ మ్యాచులు జరిగే విధంగా ఏసీఏ –వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. మహానేత వైఎస్సార్ ఎంతో ముందు చూపుతో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే నేటి కూటమి ప్రభుత్వం క్రీడలపై చిన్నచూపు చూస్తోంది. హాకీ టర్ఫ్ కోర్టును పూర్తి చేసినగత వైఎస్సార్ సీపీ సర్కారు రెండేళ్లుగా తాళం వేసిన కూటమి సర్కారు ప్రాక్టీస్ కోసం తీవ్ర ఇబ్బందులుపడుతున్న క్రీడాకారులు మూడేళ్లయినా ప్రారంభం కాలేదు టర్ఫ్ పిచ్ పూర్తయి దాదాపు మూడేళ్లయినా ఇంతవరకు ప్రారంభం కాలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా క్రీడాకారుల భవిష్యత్ కోసం ఈ పిచ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హాకీని మట్టిపై ఆడటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రౌండ్లో ఆడుతుంటే వాకర్స్కు మాకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి ఇంటర్నేషనల్ హాకీ టీం ఆడాలంటే ఈ పిచ్లు ఎంతో అవసరం. దీనిని ప్రారంభించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్, డీఎస్డీవోకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జితేష్, క్రీడాకారుడు.కడప కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కడపతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎర్రమట్టిపై హాకీ ప్రాక్టిస్ చేసి ఇంటర్నేషన్లో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్పై ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో దాదాపు రూ.8. కోట్లతో టర్ఫ్ పిచ్ నిర్మించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షతతో ప్రారంభించకపోవడం బాధాకరం. –దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం -
వైభవంగా చెన్నకేశవుని చందనోత్సవం
నేడు అక్ష తదియ తిరునాలవల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై నయనానందకరంగా వున్న స్వామి వారి దివ్య రూపాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ● పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధ స్వామి రాత్రి మయూర వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పగిరిలో నేడు అక్ష తదియ ఉత్సవాలు: బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరుణాల ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. -
ఓఅండ్ఎం విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఇవ్వాలి
కడప కార్పొరేషన్ : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని ఓఅండ్ఎం విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దవనం దొరబాబు, డిస్కం సెక్రటరీ బి. మురళీమోహన్, డిస్కం ప్రెసిడెంట్ డి. మౌలాలి డిమాండ్ చేశారు. ఆదివారం కో ఆపరేటివ్ కాలనీలోని ఓ ప్రైవేట్ భవనంలో తమ డిమాండ్లతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 2026 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికై నా విద్యుత్ సంస్థ యాజమాన్యం తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, ఓ అండ్ ఎం కార్మికులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, ఆ మేరకు సిబ్బంది నియామకాలు జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ జి. చంద్ర ఓబుల రెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. దస్తగిరి, డివిజనల్ సెక్రటరీ హరి ప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ గురు ప్రసాద్, టి. శేఖర్, జగదీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్ను ముట్టడించిన దళితులు
ముద్దనూరు : స్థానిక అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ను ఆదివారం సాయంత్రం ఎస్వీగిరి కాలనీకి చెందిన దళితులు ముట్టడించారు.సుమారు గంటసేపు స్టేషన్ ఆవరణలో గుమికూడారు.బాధిత దళితుల సమాచారం మేరకు ఎస్వీగిరి కాలనీకి చెందిన శివకుమార్ అనే దళిత యువకున్ని ఆదివారం ఉదయం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఎటువంటి కారణం లేకుండా పోలీసులు కొట్టారని, దీంతో శివకుమార్కు గాయాలయ్యాయని, బాధితున్ని బయటకు పంపించాలని నినదించారు.అనంతరం శివకుమార్ను బంధువులు ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటనపై సీఐ నగేష్బాబు మాట్లాడుతూ ఆదివారం ఉదయం స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించామని, శివకుమార్ కూడా రౌడీషీటర్ కావడంతో కౌన్సెలింగ్లో భాగంగా అతనిని మందలించినట్లు తెలిపారు. -
అగ్గితో ఆటలొద్దు గురూ!
● ఓవైపు మండే ఎండలు...మరోవైపు చెలరేగుతున్న మంటలు ● జిల్లాలో కొనసాగుతున్నఅగ్నిమాపక వారోత్సవాలు కడప అర్బన్: ఎండలు మండే నిండు వేసవి కాలమిది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మంటలు చేలరేగి అగ్ని ప్రమాదాలు సంభవించే సమయమిది.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన వారోత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేయనున్నారు. ● గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు అగ్నిమాపక శాఖకు 111 కాల్స్ వచ్చాయి. ● ఇందులో 15 రిస్క్ ఆపరేషన్ ప్రమాదాలు జరి గాయి. రూ. 7,94,26,500 నష్టం జరిగింది. ● రూ.27,15,44,000 ఆస్తినష్టాన్ని ఫైర్ అధికారులు రక్షించారు. ఇక అగ్ని ప్రమాదాలు నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా 10 మంది చనిపోగా, 10 మందిని అగ్నిమాపక శాఖ ద్వారా కాపాడారు. ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖ లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 10 ఫైర్ స్టేషన్లున్నాయి. ముద్దనూరులో ఫైర్ స్టేషన్ నిర్మాణ దశ త్వరలో పూర్తి కానుంది. కాగా ఆయా అగ్నిమాపక కేంద్రాల్లో లీడింగ్ ఫైర్మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్ కమ్ ఆపరేటర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. పలుచోట్ల స్టేషన్ ఫైర్ ఆఫీసరు లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్ పైర్మెన్ విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ కమ్ ఆపరేటర్ 35 మందికిగాను ప్రస్తుతం 33 మంది విధులు నిర్వహిస్తున్నా రు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్మెన్ 108 మంది ఉండాల్సి ఉండగా 36 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే 101కు సమాచారం అందించాలిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధం అగ్ని ప్రమాదాలు, విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డులకు కూడా రెస్క్యూ ఆపరేషన్లపై శిక్షణ ఇచ్చాం. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. –శరత్బాబు,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ‘అగ్నిని ఆర్పడం కంటే అగ్ని నిరోధక చర్యలే’మేలు...! చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు. ఐ.ఎస్.ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి. పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్లోడ్ వేయకూడదు. ఎలక్ట్రికల్ సాకెట్లో దాని కెపాసిటీకి తగిన ప్లగ్ను మాత్రమే వాడాలి. ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్వ్ను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్/ఆఫ్ చేయరాదు. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్లో ఆర్సీ సీ లేదా కాంక్రీట్ శ్లాబులను పైకప్పుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములను నివాస ప్రాంతాలకు దూరంగా వుండేలా చూసుకోవాలి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్పై శిక్షణ ఇవ్వాలి. -
రేపటి నుంచి డీఎల్ఈడీ సెమిస్టర్స్
కడప ఎడ్యుకేషన్: డీఎల్ఈడీ (డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మొదటి, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి 25 తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. దీంతోపాటు సీఎల్ఐఎసీ(సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్సు) పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన హాల్టికెట్సును www.bse.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 25న శ్రీ సీతా జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఆలయ ప్రదక్షణతో ప్రారంభమై, భగవత్ అనుగ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసు దేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలను పొందాలని కోరారు. కడప సెవెన్రోడ్స్: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చులు, సహజ మరణానికి సంబంధించిన ఆర్థికసాయం అనే నాలుగు పథకాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. భవన ఇతర నిర్మా ణ రంగ కార్మికులు పై పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులను సమీపంలోని సహాయ కార్మిక అధికారి లేదా గ్రామ సచివాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డులో లబ్దిదారులుగా తమ పేర్లు నమోదు, నవీకరణ చేసుకుని ఆయా సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని అత్యున్నత పద్మ అవార్డులతో ( పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) భారత ప్రభుత్వం ఏటా సత్కరిస్తోందని.. వీటికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్డీవో షేక్ గౌస్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, లిటరేచర్, విద్య, క్రీడలు, మెడిసిన్, సోషల్ వర్క్, సైన్స్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీసెస్, ట్రేడ్ ఇండస్ట్రీ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారితో పాటు క్రీడల్లో విశేష ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ పోర్టల్ https://awards.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు జిల్లా ప్రాధికార సంస్థ కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. -
రైతు బిడ్డకు 99 శాతం మార్కులు
మైలవరం : హలం పట్టి పొలం దున్ని చెమటోడ్చి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్న ఓ కన్నతండ్రి కష్టానికి సార్థకత చేకూర్చింది ఆ పల్లెటూరి అమ్మాయి. తల్లిదండ్రులు తనపై ఉంచిన బాధ్యతను చిన్నవయసులోనే గుర్తెరిగి శ్రద్ధతో చదివి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 99 శాతం మార్కులను సాధించింది. కన్నవారి కలలను సాకారం చేసే దిశగా తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితాన్ని అందించి పెద్దల ఆశలకు ఒకింత రూపునిచ్చింది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన వెంపలాకు పెద్దిరాజు కుమార్తె లక్ష్మీ ప్రణీత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 455 మార్కులకుగాను 451 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తనను చదివిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తెరిగిన.. ఆ అమ్మాయి అహర్నిశలు కష్టపడి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును చేరుకోగలిగింది. ఆంగ్లంలో మూడు మార్కులు, సంస్కృతంలో ఒక మార్కు కోల్పోయిన ఆ విద్యార్థిని గ్రూపు సబ్జెక్టుల్లో వంద శాతం మార్కులను సాధించింది. వైద్యవిద్యలో సీటు సంపాదించి పల్లె సీమల్లో ఉచిత సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని లక్ష్మీ ప్రణీత గట్టి విశ్వాసంతో చెబుతోంది. వాస్తవానికి ఆమె తండ్రి పెద్దిరాజు కూడా డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ కష్టపడి పిల్లలను చదివిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద కుమార్తె లక్ష్మీప్రణీత తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని అందించి చెల్లికి, తమ్మునికి ఆదర్శంగా నిలిచింది. ఉత్తమ మార్కులు సాధించి కుటుంబానికి ఆనందాన్ని మిగిల్చింది. ఇంటర్మీడియట్లో విద్యార్థిని విశేష ప్రతిభ తండ్రి కష్టాన్ని గుర్తెరిగి చదివిన పల్లెటూరి అమ్మాయి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు -
వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం
వల్లూరు: పుష్పగిరి శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా పూజలు జరిపారు. ఉదయం స్వామి వారికి విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం జరిపారు. వివిధ రకాల పరిహారాల కోసం బింబశుద్దితో 108 కళశాలను ఏర్పాటు చేసి వివిధ నదుల్లో ని పుణ్య జలాలలతో, విశేష ద్రవ్యాలతో, ఆవు పాలు, నెయ్యి, తేనె,గంధోధకంతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కళశాలలోని ద్రవ్యాలతో శ్రీ దేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ చెన్న కేశవ స్వామి యాళీ వాహనంపై కొలువు దీరగా మంగళ వాయిద్యాల నడుమ దివిటీల వెలుగులో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. – శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామిని పురుషాన్ మృగ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు చందనోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. రాత్రి శ్రీ వైద్యనాథ స్వామికి మయూర వాహన సేవ జరుగుతుంది. -
మన జలమే.. మన జీవనం
ఎర్రగుంట్ల: మన జలమే మన జీవనం అన్న విధంగా నీటిని వృథా కాకుండా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శనివారం పోట్లదుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాను కాలుష్యరహిత, స్వచ్ఛజిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, గ్రౌండ్ వాటర్ పీడీ మురళీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, జమ్మలమడుగు ఇన్చార్జి ఆర్డీఓ శిరీషా పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్ పరిశీలన: ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న స్మార్ట్ కిచెన్ను శనివారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. ఇక్కడ పనిచేస్తున్న పొదుపు సంఘాల మహిళలకు సూచనలు అందించారు. వంటవార్పునకు సంబంధించి శిక్షణ తీసుకున్నారా అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దెన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి విజయ్కుమార్, ఏడీఈ కిరణ్కుమార్, అర్డబ్ల్యూఎస్ ఎఈ రామ్మోహన్రెడ్డి, ఏపీఎం జగదీశ్వరి పాల్గొన్నారు. ‘పీఎం రాహత్’తో ఆరోగ్య భద్రత కడప సెవెన్రోడ్స్: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం జిల్లా ప్రజల పాలిట వరం అని, వారి ఆరోగ్య భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రచురించిన.. ‘పీఎం రాహ త్ పథకానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కో సంఘటనకు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించబడుతుందని చెప్పారు. ‘‘గోల్డెన్ అవర్’’లో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించడమే ఈ పథక లక్ష్యమని వివరించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
మిర్చికి తెగుళ్ల ఘాటు!
పంట ఏదైనా రైతన్న కంట కన్నీరొలుకుతూనే ఉంది.. సాంప్రదాయ పంటలే కాదు ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసినా నష్టమే పలకరిస్తోంది. చేసిన కష్టమంతా చేలోనే బూడిదవుతోంది. జిల్లాలో మిరప సాగు చేసిన రైతన్నలదీ ఇదే పరిస్థితి. తెగుళ్ల దెబ్బకు మిర్చి ఘాటు చిన్నబోయింది. ఓ వైపు దిగు బడి రాక.. గిట్టుబాటు కాక.. మరోవైపు ప్రభు త్వం నుంచి భరోసా దక్కక మిరప రైతు జీవితం కష్టాలమయమైంది.. ● భారీగా తగ్గిన దిగుబడి ● నష్టాలతో మిరప రైతు కుదేలు ● ఆదుకోని కూటమి ప్రభుత్వం సిద్దమూర్తిపల్లె వద్ద సాగులో ఉన్న మిరప పంట ముడత తెగులు సోకిన మిరప పంట కలసపాడు: మిరప సాగు చేసిన రైతులు కుదేలయ్యారు. కష్టనష్టాలకోర్చి పైరు సాగు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా తెగుళ్లతో భారీగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మిరప రైతుకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. మిరప రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది మిరప రైతులు భారీ నష్టాలు మూట కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిర్చి సాగైంది. ఒక్క కలసపాడు మండలంలో 37.8 ఎకరాలలో రైతులు మిరప సాగు చేశారు. మండలంలోని కొత్తకోట, పెండ్లిమర్రి, మహానందిపల్లె, మామిళ్లపల్లె, సిద్దమూర్తిపల్లె తదితర గ్రామాల్లో రైతులు మిరప సాగు చేశారు. మిరప విత్తనాల నుంచి పైరు సాగు వరకు ఒక ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఇప్పటివరకు రైతులు ఖర్చు చేశారు. కానీ పైరు ఎదుగుదల లేకుండా పూత, కాయలు లేకుండా పోయాయి. మిరప పంటకు సోకిన నల్లి వల్ల వారానికి రెండు సార్లు రైతులు పురుగు మందులు పిచికారి చేసినా పైరు ఎదుగుదల లేకుండా పోయింది. ఏప్రిల్ నెల ముగుస్తున్నప్పటికీ పైరులో ఎటువంటి ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సగం పెట్టుబడి కూడా రైతుకు అందే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో పైరు సాగుచేసిన రైతులకు ప్రభుత్వం పంటలు బీమా మంజూరు చేసేది. కాని ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎటువంటి పంటల బీమా మంజూరు చేయకపోవడం, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో రైతులకు ఎటువంటి ఆసరా లేకుండా పోయింది. దీంతో మిరప రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుని పైర్ల సాగుపై అనాసక్తి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. 5 ఎకరాలు సాగు చేశాను నేను 5 ఎకరాలలో మిరప పంట సాగు చేశాను. ఎకరాకు ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశాను. కానీ దిగుబడి గత ఏడాది కన్నా సగం తగ్గిపోయింది. మిరప రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎనుముల అనిల్రెడ్డి, రైతు, ఎగువ రామాపురం, కలసపాడు మండలం తీవ్రమైన తెగుళ్లు ఈ ఏడాది మిరప పైరుకు తీవ్రమైన తెగుళ్లు ఏర్పడ్డాయి. వారానికి రెండుసార్లు మందులు పిచికారీ చేసి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చుచేసినాం. అయినా రైతుకు పెట్టుబడి దక్కే పరిస్థితి కూడా లేదు. – నాగిరెడ్డి జయరామిరెడ్డి, రైతు, పెండ్లిమర్రి, కలసపాడు మండలం -
జిల్లాలో చురుగ్గా జనగణన
కడప సెవెన్రోడ్స్: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ‘‘సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్’’ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ‘‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’’ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రం జనగణన ఎన్యుమరేషన్ కు సంబంధించి ఆన్ లైన్ నమోదు ప్రక్రియను తెలియజేశారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వైభవం.. బ్రహ్మోత్సవం
వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాధ్యస్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవ నిర్వహించారు.సాయంత్రం వివిధ హోమాలు జరిపారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామివారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.● హంస వాహంపై చెన్న కేశవుడు ● సింహ వాహనంపై వైద్యనాఽథేశ్వరుడు -
సోలార్ కోసం భూముల పరిశీలన
మైలవరం: మండల పరిధిలోని సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం జాయింట్ కలెక్టర్ నిధిమీనా భూములను పరిశీలించారు. శుక్రవారం మండల పరిధిలోని దొడియం, రామచంద్రాయపల్లి, వద్దిరాల, తలమంచిపట్నం, కోనా అనంతపురం గ్రామాలకు సంబంఽధించిన భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇన్చార్జి అర్డీఓ శీరిష , తహసీల్దార్ షఫీలు వివరించారు. కడప ఎడ్యుకేషన్: ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లె కళాకేత్రంలో జాతీయ త్రిభాష కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు, సంస్థ చైర్మన్ మహమ్మద్ ఫారూఖ్ షిబ్లి, ఉర్దూలకు ఆహ్వానం పంపారని రాయల సీమ ఉర్దూ రచయితల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తార్ ఫైజి తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా నుంచి ఉర్దూ కవులు ఆచార్య సత్తార్ సాహిర్, మహమూద్ షాహిద్, సత్తార్ ఫైజీ, ఇఫ్తెఖార్ జమాల్, హాషిం తలీఖ్, తాబిష్ రబ్బానీలు పాల్గొంటారని చెప్పారు. హిందీ, తెలుగు కవులు పి. రజనీ, జి. సాంబశివరావు, బి. మాధవరావు, పి. మోహన్ రావు, ప్రసాద్, వి. వల్లభరావు, ఉమర్ ఫారూఖ్లు పాల్గొంటారు. త్రిభాష కవి సమ్మేళనంలో రాష్ట్ర ప్రగతి, సాహిత్య వైభవం, సంస్కృతిపై కవితలు వినిపించనున్నారని సత్తార్ ఫైజి తెలిపారు కడప ఎడ్యుకేషన్: ఏపీ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించబోయే 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్(ప్రాక్టికల్స్) వేసవి శిక్షణా తరగతులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులను కడప చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ బాలికలోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు మే 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, సంబంధిత ట్రేడ్లో కనీస టెక్నికల్ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీలోపు రూ. 1000 ఫీజు చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసిన దరఖాస్తు, విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్తో సహా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ ర్కొన్నారు. -
చైన్ స్నాచింగ్
ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి బద్వేలు నుంచి విచ్చేసిన సుధామణి అనే మహిళ మెడలోని బంగారు తాలిబొట్టు సరుడును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన వెలుగు చూసింది. బస్సు పార్కింగ్ పాయింట్ వద్ద తన మెడలోని 40 గ్రాముల బంగారు తాలిబొట్టు సరుడును లాక్కెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక అదృశ్యం ఒంటిమిట్ట : ఒంటిమిట్టకు సమీపంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం అయినట్లు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురు గురువారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీప బంధువులు, స్థానికులను విచారణ చేసినా ఆచూకీ తెలియరాలేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంఖాన్పల్లిలో వున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45– 50) మృతి చెందాడు. అతని చేతిపై క్రిస్తువేణి అనే పచ్చబొట్టు వుంది. అతని ఆచూకీ తెలిసిన వారు తమ దృష్టికి తీసుకుని రావాలని కడప తాలూకా సీఐ నరసింహరాజు తెలియజేశారు. ఫోన్ నంబర్లు: 9121100514, ఎస్ఐ 9121100516కు సమాచారం ఇవ్వాలని కోరారు. షార్ట్ సర్క్యూట్తో కూలీ మృతి బి.కోడూరు : మండలంలోని టమటంవారిపల్లె గ్రామ సమీపాన గల మెగా ఇంజినీరింగ్ ఇండస్ట్రియల్ లిమిటెట్ కంపెనీలో సబ్ కాంట్రాక్టు తీసుకుని ప్రియాన్స్ కంపెనీలో పని చేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జగదీష్ (38) అనే వ్యక్తి షార్ట్సర్క్యూట్తో శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జగ్దీష్ టమటంవారిపల్లె గ్రామ సమీపాన జరుగుతున్న కాంక్రీటు పనుల్లో భాగంగా క్యూరింగ్ చేసే పనుల్లో మోటార్ ఆన్ చేయబోయి షార్ట్సర్క్యూట్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అదే కంపెనీలో పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నేడు బండలాగుడు పోటీలు
కమలాపురం : కమలాపురంలో ఎల్లమ్మ(హేలాంబ) తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ క్యాటగిరి వృషభ రాజములకు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతి రూ.1.20 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1 లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదవ బహుమతి రూ.50 వేలు, ఆరవ బహుమతి రూ.40 వేలు, ఏడవ బహుమతి రూ.30 వేలు, 8వ బహుమతి రూ.25 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు, పదవ బహుమతి రూ.15 వేలు, 11వ బహుమతి రూ.10 వేలు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన వారు ఆలయ ప్రాంగణంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రాత్రి నాటకాల ప్రదర్శన భక్తుల కాలక్షేపం కోసం రాత్రి నాటకాల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రామాంజనేయ యుద్ధ సన్నివేశం, చింతామణి భవానీ సీను, గయోపాఖ్యానం(యుద్ధసీను), సత్య హరిశ్చంద్ర నుంచి వారణాసి, కాటి సీను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు తిలకించాలని వారు కోరారు. మండల పరిధిలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన కీ.శే. ఓబులాపురం జనార్ధన్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుజాత, తనయులు శ్యాం సుందర్రెడ్డి, చంద్రకాంత్రెడ్డి, కుమార్తె డాక్టర్ మాధవిరెడ్డి భక్తుల సౌకర్యార్థం మూడు పూటల అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండిబజారు వీధిలో గోనె సంచుల షాపులో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది సుబ్బరాజు, శివయ్య, రామకృష్ణ, చంద్రశేఖర్, సురేష్ శుక్రవారం దాడులు నిర్వహించారు. 31 బ్యాగుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సుబ్బారెడ్డి, ఆషిద్ రెహమాన్లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘అల్ట్రాటెక్’ వద్ద కొనసాగిన నిరసన సాక్షి ట్రాస్కఫోర్సు : ఎర్రగుంట్ల మండల పరిధి చిలంకూరు గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు చేస్తున్న నిరసన మూడో రోజుకు చేరింది. శుక్రవారం ఫ్యాక్టరీలోకి విధులకు వెళ్తున్న కార్మికులను శిబిరం వద్ద ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధుల్లోకి పోకుంటే తమకు ఇబ్బందులు వస్తాయని కార్మికులు సీఐ విశ్వనాథ్రెడ్డితో చెప్పుకొన్నారు. పోలీసులు ఇరు వర్గాల వారితో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. కాగా ఆందోళనకారులతో పరిశ్రమ యజమాన్యం ఇప్పటి వరకు చర్చలకు రాకపోవడంతో.. శిబిరం శనివారం కూడా కొనసాగే అవకశాం ఉందని కూటమి శ్రేణుల ద్వారా తెలుస్తోంది. తాము వీధులకు వెళ్లాలని చూస్తున్నా అక్కడ ఉన్న ఆందోళనకారులు లోనికి పోనివ్వడం లేదని కొందరు కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమకు వెళ్లే దారులన్నింటినీ ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో పరిశ్రమలో మూడు రోజు కూడా మొత్తం పనులన్నీ నిలిచిపోయాయి. -
పోట్లదుర్తిలో ఉద్రిక్తత
● మృతదేహం పూడ్చడానికి వచ్చిన దళితులు ● ఆలయ ఆవరణలో వద్దన్న నిర్వాహకులు ● ఎట్టకేలకు సమస్యను పరిష్కరించిన అధికారులు ఎర్రగుంట్ల : మండల పరిధి పోట్లదుర్తి గ్రామంలోని ఎస్సీ వర్గానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చిన క్రమంలో దళితులు, గ్రామంలోని పెద్దలు, ఆలయ కమిటీ నిర్వహుకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళితే... పోట్లదుర్తిలో పెద్దమ్మతల్లి దేవాలయం ఉంది. ఈ ఆలయ స్థలం విషయంపై గతంలో గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు జిల్లా కలెక్టర్ సైతం ఆలయాన్ని పరిశీలించి దేవదాయ శాఖ అధికారులతో మాట్లాడి చుట్టూ ప్రహరీ కట్టించారు. ఆ ప్రహరీ లోపల దళితుల శ్మశాన వాటిక ఉండేది. కానీ ఇప్పుడు దళిత కులానికి చెందిన నరసింహులు మృతి చెందడంతో మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు వచ్చి అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మృతదేహాన్ని ఏ విధంగా పూడ్చతారని వారు అన్నారు. తమ పూర్వీకుల నుంచి ఇక్కడే శ్మశాన వాటిక ఉండేదని దళితులు అన్నారు. అయితే ప్రహరీ కట్టే సమయంలో ఎందుకు అడ్డుకోలేదని నిర్వాహకులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తహసీల్దార్ అమరేశ్వరి, సీఐ విశ్వనాథరెడ్డిలు వారితో చర్చించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయట పూడ్చుకోవాలని, తర్వాత శాశ్వత శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయిస్తామని అధికారులు తెలపడంతో సమస్య సద్దమణిగింది. -
మావిగన్.. మంచి విజన్
మావిగన్పై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎంత విషప్రచారం చేసినా.. వాస్తవాలను వైఎస్సార్సీపీ ప్రజలకు వివరిస్తుండటంతో ప్రజలు చంద్రబాబు కుటిల ప్రయత్నాలను అర్థం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మావిగన్ ప్రయోజనాలను తెలుపుతూ కడపలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘మావిగన్.. రాష్ట్రానికి మంచి విజన్’ అంటూ వారు పేర్కొంటుండటం విశేషం. – కడప కార్పొరేషన్


