YSR District News
-
సెన్సేషనల్.. సన్షైనింగ్ !
చంద్రుడిలోని కాంతినంతా దోసిళ్లతో కుమ్మరించినట్లు .. కాంతి పుంజమేదో నేలపై వాలినట్లు.. ప్లడ్ లైట్లు వెలుగులు పంచగా.. ఆట మెరిసింది.. పాట విరిసింది.. తొలిసారి ‘ఏపీఎల్ పండగ’ కడపకు రాగా.. అభిమానుల గుండె గడప ఉత్సాహంతో నిండిపోయింది... పిల్లా జల్లా తరలిరాగా వైఎస్ రాజారెడ్డి స్టేడియం జనసంద్రమైంది.. మైదానంలో బ్యాటర్లు విజృంభించడంతో ‘బౌండరీ’ చిన్నబోయింది.. అప్పుడప్పుడూ బంతి చుక్కల్ని ముద్దాడుతూ సిక్సుగా మారింది.. గ్యాలరీలో క్రీడాభిమానుల కేరింతలకు మైదానం మురిసిపోయింది.. బుధవారం విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ జరిగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. క్రికెట్ జిల్లా వాసులకు కనువిందు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్ హెబ్బర్సాక్షి ప్రతినిధి, కడప : కడపలో బుధవారం జరిగిన మ్యా చ్లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు, తుంగభద్ర వారియర్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రసవత్తర పోరులో 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్పై విజయవాడ సన్ షైనర్స్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన విజయవాడ.. ముందుగా మ్యాచ్ ప్రారంభానికి గాను బీసీసీఐ మెంబర్ చాముండేశ్వరి నాథ్ టాస్ వేసి ఈ సీజన్ను అధికారికంగా ప్రారంభించారు. టాస్ గెలిచిన విజయవాడ సన్షైనర్స్ జట్టు కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయవాడ ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ వీరవిహారం చేశాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 85 పరుగులు సాధించి జట్టుకు భారీ పునాది వేశాడు. అతనికి తోడుగా లోకల్ బాయ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జహీర్ అబ్బాస్ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో విజృంభించాడు. దీంతో విజయవాడ సన్షైనర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్ 2 వికెట్లు, హిమ శ్రీనివాస్ 2 వికెట్లు తీశారు. పోరాడి ఓడిన తుంగభద్ర వారియర్స్.. అనంతరం 199 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ను ప్రారంభించిన తుంగభద్ర వారియర్స్ జట్టును విజయవాడ బౌలర్ భరత్ తన పదునైన బౌలింగ్తో వణికించాడు. అయితే, తుంగభద్ర ఓపెనర్ సమన్యు 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి గట్టిగా రాణించాడు. అతనికి తోడుగా సత్యనారాయణ 21 బంతుల్లో 4 ఫోర్లతో రాణించగా.. మ్యాచ్ ఆఖరిలో సౌరవ్కుమార్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో (24 పరుగులు) ధాటిగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. విజయవాడ సన్షైనర్స్ బౌలర్ భరత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టగా, సుమిత్ 2 వికెట్లు తీశారు. దీంతో తుంగభద్ర వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దంచికొట్టిన ఇన్నింగ్స్ ఆడిన విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్ అశ్విన్ హెబ్బర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. -
అదరగొట్టిన ‘లోకల్ బాయ్’
సాక్షి కడప : వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కడప లోకల్ బాయ్ అదరగొట్టాడు. విజయవాడ తరఫున మిడిల్ ఆర్డర్లో బరిలో దిగిన కడపకు చెందిన జహీర్ అబ్బాస్ కేవలం 25 బంతులలోనే నాలుగు 4 సిక్స్లు, మూడు ఫోర్లతో 52 పరుగులు చేశారు.. లోకల్ బాయ్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది అబ్బాస్ సిక్స్లు, ఫోర్లు కొట్టినప్పుడల్లా ‘పక్కా లోకల్’ పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆకట్టుకున్న ‘రోబో’ కడపలోని వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రోబో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా వీఐపీలు వచ్చిన సందర్భంలోనూ.. ఇతర కెప్టెన్లు టాస్కు వెళుతున్న సందర్భంలో రోబో అలా స్టేడియంలో కనిపించి సందడి చేసింది. జహీరో అబ్బాస్ 52 నాటౌట్ (24 బంతుల్లో) సిక్సర్లు 4, ఫోర్లు 3 -
పాత్రధారులకు శిక్షతో సరిపోతుందా!
‘పచ్చ’గా గంజాయి దందా..పెద్దతిప్పసముద్రం/ప్రొద్దుటూరు క్రైం : ఒకప్పుడు సాగునీరు, పాడిపంటలతో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాయలసీమ గడ్డ.. నేడు మత్తు పదార్థాల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే అడ్డాగా మారుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా విభజన తర్వాత ఏర్పాటైన కడప, అన్నమయ్య జిల్లాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా, వినియోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెల నుంచి నగరాల నడిబొడ్డు వరకు గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో, పాత నేరస్థులు సైతం ఎటువంటి భయం లేకుండా బెంగళూరు, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ యువతను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టి.సదుం క్రాస్ వద్ద 2 కిలోల గంజాయి.. పాత నేరస్థుడికి పచ్చజెండా! అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో తాజాగా జరిగిన గంజాయి పట్టివేత ఉదంతం క్షేత్రస్థాయిలో సాగుతోన్న అక్రమ వ్యాపారానికి నిలువెత్తు అద్దం పడుతోంది. మండలంలోని టి.సదుం క్రాస్ వద్ద పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో రెండు కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలోని బెంగళూరు రోడ్డు, గిరిరావ్ వీధికి చెందిన గంగిశెట్టి శివకుమార్ (22) అనే నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి గత చరిత్రను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గతంలోనూ బెంగళూరులో గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ మదనపల్లి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ప్రొద్దుటూరు శివారులో 3.5 కిలోల సరుకుతో ’అనిల్’ అరెస్ట్! మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ శివారులోని కొత్తపల్లె సర్కిల్ వద్ద ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి నెట్వర్క్ మరో ముక్క బయటపడింది. ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠారెడ్డిలు సంయుక్తంగా మైదుకూరు రోడ్డులో తనిఖీలు చేపట్టారు. కొత్తపల్లె సర్కిల్ వద్ద ప్లాస్టిక్ సంచిని చేతిలో పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న పెరుగు అనిల్ కుమార్ అనే యువకుడు, అధికారుల వాహనాలను చూసి అకస్మాత్తుగా పారిపోవడానికి ప్రయత్నించగా ఎకై ్సజ్ సిబ్బంది వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పెరుగు అనిల్ గతంలో వ్యాపారం చేసేవాడు. ఇటీవల నష్టాలు రావడంతో కుటుంబ పోషణ సాకుతో, సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందాలోకి దిగాడు. ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఈ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నట్లు నిందితుడు ఎకై ్సజ్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 3.5 కిలోల ఎండు గంజాయి విలువ మార్కెట్లో రూ. 40 వేల పైనే ఉంటుందని అధికారులు నిర్ధారించారు. గతంలో భారీ నెట్వర్క్లపై వేటు.. నేడు పాలకుల ఉదాసీనత! కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ముఠాల కదలికలు కొత్తేమీ కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పీటీఎం–ములకలచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన సండ్రడవి వద్ద ఏకంగా 104 కిలోల గంజాయితో పాటు 12 మంది నిందితులను వాహనాలతో సహా పట్టుకుని యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.కానీ కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత మళ్లీ పాత నెట్వర్క్లు పుంజుకున్నాయి. అధికార పార్టీ నేతలు జూదం, క్రికెట్ బెట్టింగులు, ఇసుక, మట్టి మాఫియాల్లో మునిగితేలుతూ సొంత లాభాలు చూసుకుంటున్నారే తప్ప, జిల్లాలో యువతను నిర్వీర్యం చేస్తోన్న గంజాయి కట్టడిపై చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ నల్లమందు సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు సిసలైన ’పెద్ద తలకాయల’ను ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండు జిల్లాలను డ్రగ్స్ రహితంగా మార్చాలంటే కేవలం చిన్న చిన్న పాత్రధారులను కాకుండా, అధికార పార్టీ అండతో చెలరేగిపోతోన్న ప్రధాన గంజాయి మాఫియా డెన్లపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గ్రామాలకు పాకిన మహమ్మారి.. గాడి తప్పుతున్న యువత! గతంలో కేవలం పెద్దపెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలను వ్యాపారస్థులు నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరింపజేశారు. ప్రొద్దుటూరులో పట్టుబడిన అనిల్, పరిసర ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థులకు, రోజువారీ కూలీలకు నిత్యం గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గంజాయి అమ్మకాలు, వినియోగానికి ఊరి చివర ప్రాంతాలు, ప్రహరీ గోడల వెనుక, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా మార్చుకుని విక్రేతలు దర్జాగా దందా సాగిస్తున్నారు. పరిసర మండలాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతుండటంతో యువత మత్తులో మునిగి తేలుతోంది. మత్తుకు బానిసలైన యువత తమ జీవితాలను అర్ధాంతరంగా చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ‘పచ్చ‘నోట్ల కక్కుర్తి కోసం సాగుతున్న ఈ గంజాయి దందా.. పచ్చని జిల్లాల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది. పాలకపార్టీలకు చెందిన కొందరు నాయకుల అండతో సాగుతున్న ఈ అక్రమ నెట్వర్క్ను తక్షణమే ఉక్కుపాదంతో అణచివేయకపోతే యువత మత్తు ఊబిలో శాశ్వతంగా కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. కూటమి రాజ్యంలో బార్లా తెరిచిన అంతర్రాష్ట్ర సరిహద్దులు పల్లె పల్లెకూ విస్తరిస్తున్న మహమ్మారి! ఒరిస్సా, బెంగళూరు డ్రగ్స్ మాఫియాతో పాత నేరస్థుల లింకులు వరుస పట్టివేతలతో కదులుతున్న నెట్వర్క్! సూత్రధారులను పట్టుకునేదెన్నడు? -
సౌమ్యనాథ స్వామికి రూ.5,93,130 ఆదాయం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రూ.5,93,130 వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. 30 రోజులకు సంబంధించి ఆదాయం లెక్కించినట్లు చెప్పారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి ఏసుదాసు, భక్తులు పాల్గొన్నారు. ఆన్లైన్ రుణం పేరుతో మోసంముద్దనూరు : స్మార్ట్ఫోన్లో ఆన్లైన్ ద్వారా రుణం మంజూరు చేస్తామంటూ ప్రకటన చూసి ఓ ఆటోడ్రైవర్ మోసపోయాడు. స్థానిక పాతవీధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో రుణ ప్రకటనచూసి హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధిని సంప్రదించాడు.ఆధార్,పాన్కార్డు పంపిస్తే రూ.5లక్షలు రుణం మంజూరు చేస్తామని తెలిపారు.ఇందుకుగాను మొదటి రూ.26వేలు చెల్లించాలని తెలిపారు.ఫోన్ ద్వారా రూ.26వేలు చెల్లించిన తర్వాత మరో విడతో రూ.3వేలు చెల్లించాడు.తన ఖాతాలో సొమ్ము ఎప్పుడు వేస్తారని ఆటోడ్రైవరు సంస్థ ప్రతినిధిని ఆడగ్గా.. మరో రూ.5300లు ఫోన్ఫోచేస్తే 5 నిమిషాల్లో రూ.5లక్షల రుణం మీ ఖాతాల్లో జమ అవుతుందని ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.అయితే అప్పటికే సుమారు రూ.30వేలు నష్టపోయిన ఆటోడ్రైవర్కు పలువురు ఇదంతా మోసమని తెలియజెప్పడంతో బాధితుడు డబ్బునష్టపోవడమే కాకుండా తీవ్ర నిరాశకు గురయ్యాడు. మైదుకూరు ఏఎంసీ కార్యదర్శి సస్పెన్షన్ మైదుకూరు : మైదుకూరు వ్యవసాయ మార్కె ట్ కమిటీ (ఏఎంసీ) కార్యదర్శి పి.వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వెంకటలక్ష్మి అవకతవకలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దువ్వూరు మండలంలోని ఓ ప్రైవేట్ వ్యవసాయ గోదాం విషయంలో ఏఎంసీ కార్యదర్శి అవకతవకలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశాలతో కలెక్టర్ ఆమెను సెస్పండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. -
అధునాతన గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఐదు రోజులు జరిగే ఏపీఎల్ క్రికెట్ పండుగ బుధవారం ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్ల కోసం ఇప్పటికే గ్రౌండ్ను పలు అభివృద్ధి పనులు చేశారు. దీనికి సంబంధించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వర్చువల్గా ప్రారంభించారు. దేశవాళీ మ్యాచ్లను సైతం కడప ఆతిథ్యం ఇవ్వాలని అధ్యక్ష కార్యదర్శులు ఆకాంక్షించారు. స్టేడియంను నూతనంగా రెన్యువెట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ మెరుగైన మ్యాచ్లు నిర్వహిస్తూ మంచి గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నా రు. రాబోయే రోజుల్లో మరింతగా సౌకర్యాలు పెంచి మరిన్ని మ్యాచులు కడప స్టేడియంలో జరిగే విధంగా చూస్తామని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్, సి ఓ ఓ గిరీష్ డోంగ్రి , సీఏఓ జై కిషన్, ఏసీ ఏ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్, కడప క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముని కుమార్ రెడ్డి, సెక్రటరీ రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆకట్టుకున్న సునీత ప్రదర్శన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సినీ నేపధ్య గాయనీ సునీత తన గానమాధుర్యంతో అందరినీ అలరించా రు. సినిమాల్లో ఆలపించిన గీతాలతోపాటు ఇతర పాటలను పాడి అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ అభివృద్ధి పనులు వర్చువల్గా ప్రారంభం -
సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని పోస్టు కార్డు ఉద్యమం
● దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి వెల్లడి కడప కార్పొరేషన్: దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించలేమని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కోరారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి కడపలో దేశవ్యాప్త పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 2026 మార్చిలో చింతాడ ఆనంద్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఓ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. చర్చి పాస్టర్ అయిన చింతాడ ఆనంద్ పెట్టిన ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు చెల్లదని తీర్పునివ్వడం బాధాకరమన్నారు. దళితులు చర్చికి పోయినంత మాత్రాన వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పురాదని, సొంత విశ్వాసంతో వారు చర్చికి పోతున్నారన్నారు. చర్చికి పోయే దళితులను బీసీ–సీలుగా గుర్తించడం సరికాదన్నారు. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తీర్పే వచ్చినప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో అదే రకమైన తీర్మానం చేశారన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందని దళిత క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రం ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ వేయడమో, మరొకటో చేయాల్సి ఉందన్నారు. కానీ కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జైనులు, బౌద్దులు, సిక్కులు మతం మారితే వారి కులం మారడం లేదని.. ఒక్క దళితుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు పోస్టు కార్డు ద్వారా తెలియజెప్పేందుకు కడప నుంచి తొలిసారిగా పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా దీనికి మద్దతుగా స్పందన రావాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు సీహెచ్ వినోద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు త్యాగరాజు, సుబ్బరాయుడు, పార్టీ నాయకులు రాయల్ బాబు, డా. పెంచలయ్య, చార్లెస్, దానం, కంచుపాటి బాబు, సంపత్, రత్న కుమారి, సుశీలమ్మ, తులశమ్మ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్
సిద్దవటం : ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ నిందితులను అరెస్టు చేసి 11 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే తెలిపారు. సిద్దవటం మండలం భాకరాపేట వద్ద బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని ఎస్ఐ హారిక, హెడ్ కానిస్టేబుల్ అంజినాయక్, హోంగార్డు ప్రదీప్కుమార్లు వెంబడించి అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వారు ప్రతిఘటించారన్నారు.హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా సిద్దవటం,ఒంటిమిట్ట, చిత్తూరు జిల్లా బంగారుపాలెం, తిరుపతి జిల్లా భాకరాపేట, తమిళనాడు రాష్ట్రంలోని మహాలింగాపురం, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పోలీస్స్టేషన్లలో కేసులతో పాటు గతంలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అంగీకరించారన్నారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు, కేటీఎం ద్విచక్రవాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ప్రధానంగా వృద్ధ మహిళలు, ఒంటరిగా ప్రయాణించే మహిళను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అద్దెకు తీసుకున్న బైక్లను ఉపయోగించడం, నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడం, హెల్మెట్లు, మాస్కులు ధరించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లెకు చెందిన వెంకటేష్ బాలమురుగన్, తమిళనాడు రాష్ట్రం రామనాధపురం జిల్లాకు చెందిన ముత్తుపాండి ముత్తు రామలింగంలను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిద్దవటం ఎస్ఐ హారికకు, కానిస్టేబుల్ అంజినాయక్, హోంగార్డు ప్రదీప్కుమార్లకు జిల్లా ఎస్పీ నగదు రివార్డు ప్రకటించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, కడప సీసీఎస్ సీఐ హాజీవలి, సిద్దవటం ఎస్ఐ హారిక, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నీట్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్కు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హాల్ టికెట్ చూపించి నీట్ విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీలు కడప అర్బన్: కడప జిల్లాలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప డీసీఆర్బీలో ఉంటున్న ఎం. సత్యనారాయణను జమ్మలమడుగు యూజీఎస్కు బదిలీ చేశారు. జమ్మలమడుగు యూజీఎస్లో విధులు నిర్వహిస్తున్న పి. హైమావతిని తలముంచి పట్నం పీఎస్కు, అక్కడ పని చేస్తున్న సి. లక్ష్మీనారాయణను కడప వన్టౌన్కు బదిలీ చేశారు. జి. అమర్నాథ్ రెడ్డిని కడప వన్టౌన్ నుంచి డీసీఆర్బీకి, టి. హరిప్రసాద్ను కడప తాలూకా నుంచి చిన్నచౌక్ పీఎస్కు బదిలీ చేశారు. అలాగే కడప సైబర్సెల్లో విధులు నిర్వహిస్తున్న వి. నారాయణను కడప తాలూకాకు, వీఆర్లో ఉంటున్న ఎస్ కే అహ్మద్ను పీసీఆర్ ప్రొద్దుటూరు పీఎస్కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీ సీఈఓ తనిఖీ రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిషత్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ డిఫ్యూటీ సీఈఓ రామచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమీషన్) నిధులపై చర్చించారు. అలాగే జనరల్ ఫండ్ నిధులు, అక్షరాంధ్ర కార్యక్రమం, తల్లికి వందనం, పథకాలపై చర్చించారు. ఆయా పథకాల పురోగతి ఎలా ఉందనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కడప ఎడ్యుకేషన్: ఉర్దూ భాషను ప్రోత్సహించడం, ఉర్దూ మాట్లాడని వారికి సులభంగా ఉర్దూ బోధించడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ రూపొందించిన ‘ఆవో ఉర్దూ సీఖేన్’ పుస్తకం ఆధారంగా కడపలోని ఎస్.కె.ఆర్ – ఎస్.కె.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 30 రోజుల ప్రత్యేక ఉర్దూ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం బాషా మాట్లాడుతూ, ఉర్దూ ఏ మతానికో లేదా ఒక ప్రత్యేక వర్గానికో చెందిన భాష కాదని, అది భారతదేశ ఉమ్మడి నాగరికత, సంస్కృతి సంప్రదాయానికి ఒక అందమైన ప్రతీక అని అన్నారు. అడకమిక్ కో ఆర్డినేటర్ డా. నాగమణి రెడ్డి సహకారంతో, ఉర్దూ విభాగ అధ్యక్షురాలు డా. షాజియా బేగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖిద్మత్–ఎ–ఖల్ఖ్ ఫౌండేషన్ ఛైర్మన్ ముహమ్మద్ గియాస్ షరీబ్ , కడప ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్ ఇన్చార్జి మహమ్మద్ జహీర్, ఉర్దూ కంప్యూటర్ ఫ్యాకల్టీ షేక్ మస్తానీ, లైబ్రేరియన్ హసీనా బానో పాల్గొన్నారు. -
బెయిల్పై నిత్యానందరెడ్డి విడుదల
కడప అర్బన్ : కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఏప్రిల్ 6న అలంఖాన్ పల్లెకు చెందిన కలమల్ల దస్తగిరి (53) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రతో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని పోలీసలు ఏ13 నిందితుడిగా చేర్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డిని, న్యాయవాది నాగిరెడ్డి గతనెల 11న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. 12వ తేదీన సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో విచారణ చేసి నిత్యానందరెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా కడప కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. బుధవారం కడపలోని జిల్లా కోర్టులో బెయిల్ కోసం వేసిన పిటీషన్పై విచారణ జరిపారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం సాయంత్రం నిత్యానందరెడ్డి విడుదలయ్యారు. మాజీ మేయర్ పాకా సురేష్కుమార్, ఎస్ఈసీ సభ్యుడు మాసీమబాబు, సోషల్ వెల్పేర్ మాజీ చైర్మన్ పులీసునీల్కుమార్, సిహెచ్ వినోద్కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బరాయుడు, మాజీ కార్పొరేటర్ శ్రీరంజన్ రెడ్డి, జిల్లా యువజన నాయకుడు ఫయాజ్, షఫీ, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సునీతారెడ్డి,తదితరులు,వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు కడప కేంద్రగారం వద్ద నిత్యానందరెడ్డిన కలిశారు.చోరీ కేసులో ఇద్దరికి జైలుశిక్ష బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్కుమార్ తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా సీఎస్.పురం మండలం కొండరాజుపల్లె గ్రామానికి చెందిన కొండరాజుసురేష్, తిరుపతి జిల్లా చిత్తూరు టౌన్ కామరాజనగర్కు చెందిన షేక్మస్తాన్లు బద్వేలులోని విద్యానగర్లో రాయల్ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా సాక్షాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అర్బన్ సీఐ రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్ నాగరాజులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడి అరెస్ట్కు పోలీసుల మోహరింపుకడప అర్బన్ : కడప వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల గంజాయి కేసులో నిందితుడిగా ఓ వ్యక్తి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నాడు. ఈనెల 16వ తేదీన అతనికి బెయిల్ మంజూరైంది. అయితే నిందితుడు అల్మాస్పేట వద్ద గత నెల 9వ తేదీన జరిగిన ఘర్షణలో పాల్గొన్న కొందరు వ్యక్తులకు డబ్బులను ఇచ్చి ఏర్పాటు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు సమాచారం. అతన్ని అల్మాస్పేట ఘటన కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు మోహరించారు. -
ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణం
ఒంటిమిట్ట : కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప వైపు వెళుతున్న ఆటోను తిరుపతి వెళుతున్న లారీ ఢీ కొట్టడంతో ఆటో చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో లో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రేణుకా(27) అనే వివాహిత బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకుని, మండల కేంద్రంలోని దిగువ వీధికి చెందిన షేక్ రఫీ(46) ఆటోలో వన్ మాధవరం, లక్ష్మీపురంలోని తన పుట్టింటికి బయలు దేరింది. ఈ క్రమంలో ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి కల్యాణ వేదిక మొదటి స్వాగత తోరణం వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై బళ్లారి నుంచి శ్రీకాళహస్తి కి ఐరన్ ఓర్ లోడుతో వస్తున్న లారీ ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రేణుక ను 108లో కడప రిమ్స్కు తరలించారు. రఫీ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు. రఫీ మూడు ఏళ్ల కిందట కువైట్ నుంచి ఇంటికి వచ్చి బతుకు తెరువు కోసం ఆటో తోలుతున్నాడు. ఇతనికి భార్య ఆశ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రేణుకకు ఇటీవల అసిస్టెంట్ రైల్వే లోకో పైలెట్ గా పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి తో వివాహమైంది. వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట వన్ మాధవరం, లక్ష్మీపురంలోని పుట్టింటికి వచ్చి, బుధవారం రామయ్య దర్శనం చేసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కున్న రఫీ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రత్యేక వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
గుమాస్తా దొంగావతారం
● చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ ● రూ. 22.91 లక్షల నగదు స్వాధీనంప్రొద్దుటూరు క్రైం : అతను ఎన్నో ఏళ్ల నుంచి తన యజమాని వద్ద నమ్మకంగా పని చేస్తున్నాడు. అయితే ఇంట్లో లక్షల నోట్ల కట్టలు చూసిన అతనికి ఆశ కలిగింది. దీంతో తనను నమ్మిన యజమానినే మోసగించి నోట్ల కట్టలతో ఉడాయించాడు. పట్టణ శివారులోని రైల్వేస్టేషన్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 నగదును త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కలిసి ఇటీవల బంగారు వ్యాపారి అనికేత్ జయవంత్ బాబర్ ఇంట్లో రూ. 23 లక్షలు దోచుకున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అరెస్ట్ వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్ జయవంత్ బాబర్ కొన్నేళ్లుగా బంగారు పని చేసుకుంటూ ఇక్కడే నివసిస్తున్నాడు. అతను పట్టణంలోని సూపర్బజార్ వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతనికి సహాయకుడిగా సొంత రాష్ట్రానికి చెందిన ప్రథ్మేష్ బాబాసాహెబ్ కోలిని గుమాస్తాగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అనికేత్ జయవంత్, తన భాగస్వాములు కలిసి బంగారు కొనుగోలు చేసుకునేందుకు రూ. 23 లక్షలు సమకూర్చుకున్నారు. ఆ డబ్బును అనికేత్ జయవంత్ తన ఇంట్లోనే భద్రపరిచాడు. ప్రథ్మేష్ బాబాసాహెబ్ తన స్నేహితుడు మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్కు పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు విషయం చెప్పాడు. ఈ డబ్బు దొంగలిస్తే ఇద్దరి కష్టాలు తీరిపోతాయని, జాలీగా జీవించవచ్చని మాట్లాడుకున్నారు. ఇంట్లో భద్రపరిచిన నగదును దొంగలించేందుకు ఇరువురు వ్యూహం రచించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం అనికేత్ జయవంత్ బాబర్ వాకింగ్ కోసమని బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నిందితులిద్దరూ ఇంట్లోని రూ. 23 లక్షలు తీసుకొని పరారయ్యారు. వాకింగ్కు వెళ్లిన జయవంత్ ఇంటికి వచ్చి చూసుకోగా నగదు కనిపించలేదు. ఇంట్లోని గుమస్తా కూడా కనిపించకపోవడంతో అతనే చోరీ చేసి ఉంటాడని భావించిన జయవంత్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రథ్మేష్ బాబాసాహెబ్తో పాటు అతనికి సహకరించిన మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్ను బుధవారం త్రీ టౌన్ పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐలు సంజీవరెడ్డి, మైనుద్ధిన్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి
చాపాడు : చాపాడు మండల పరిధిలోని రేపల్లెలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కంభంపాటి రామాంజనేయులు (42) బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. రేపల్లె గ్రామంలో మృతుడు తన ఇంటికి ప్రొద్దుటూరుకు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం పొందాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కొన్ని కంతులు పెండింగ్లో పడ్డాయి. దీంతో ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెందిన రామాంజనేయులు మంగళవారం పురుగుల మందు తాగాడు.ప్రొద్దుటూరులో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ‘20న మదనపల్లెలో సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటాం’ కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనను అడ్డుకుంటామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం కడప పాత మున్సిపల్ కార్యాలయంలో డైలీ వేజ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఎక్కడికి అక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకోవాలని నిర్ణయించినట్లు, ఇందులో భాగంగా మదనపల్లెలో జరుగుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రెండు లక్షలకు పెంచి ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై నెల 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు వీరమల్లి నరసింహులు, కలువాయి ఈశ్వరయ్య, కోశాధికారి వెంకటాద్రి, యూనియన్ నాయకులు వేలంగి రాజశేఖర్, బక్క రాజేష్, అశోక్ పాల్గొన్నారు. యువతిని మోసగించిన కేసులో వ్యక్తి అరెస్ట్ కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న మహేశ్వర్రెడ్డికి భార్య, పిల్లలున్నారు. రాయచోటికి చెందిన సచివాలయ ఉద్యోగితో ఇన్స్ట్రాగాంలో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి సన్నిహిత జీవితాన్ని గడిపాడు. నిందితుడికి భార్య, పిల్లలున్నారని, తనను మోసం చేశాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ నరసింహారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతిమైదుకూరు : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై చింతకుంట బయనపల్లె వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. మైదుకూరు మండలం వనిపెంట అటవీ రేంజ్ గంజికుంట బీట్ పరిధిలో ఈ సంఘటన జరిగిందని ఎఫ్ఆర్ఓ చలపతి నాయుడు తెలిపారు. -
మాకు న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : తమ ఇంటిని తెలియకుండా ఇతరులకు అమ్మడమే కాకుండా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి బారి నుంచి కాపాడి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మస్తాన్, ఆయన కుటుంబ సభ్యులు కోరారు. మంగళవారం వారు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరం భవానినగర్ అక్కాయపల్లె ప్రాంతంలో తాము 40 ఏళ్లుగా నివాసముంటున్నామన్నారు. అయితే వైద్య శాఖలో పని చేస్తున్న శ్రీదేవి అనే మహిళ ఇంటికి లోను ఇప్పించగా, 2017 నుంచి 2020 వరకు తాను లోను కట్టానని తెలిపారు. ఆ తర్వాత శ్రీదేవి మిగిలిన రుణాన్ని చెల్లించి ఇంటిని ఇతరులకు విక్రయించడం జరిగిందన్నారు. రుణం మంజూరు సందర్భంగా తాను ఐదు లక్షల వరకు కమీషన్ సైతం ఇవ్వడమే కాకుండా క్రమం తప్పక ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా శివ అనే యువకుడితోపాటు కొంత మంది అల్లరి మూకల కారణంగా తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామన్నారు. తమ ఇంటికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు తమ విషయంపై విచారణ చేసి, అల్లరి మూకల నుంచి తమను కాపాడాలని, తమ ఇంటిని తిరిగి తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుడు మస్తాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ కళా జాగృతి బృందం నాటక ప్రదర్శనచింతకొమ్మదిన్నె : జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం సీఎంఆర్ పల్లె సమీపంలోని అంగడివీధిలో పోలీస్ కళా–జాగృతి బృందం ఇన్చార్జ్ నరసరామ్ బృందంచే ‘ఓ యువతా... మేలుకో’ నాటక, పాటల ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, సమాజంలోని రుగ్మతలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. మత్తు పదార్థాల ఆచూకీ తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఈగల్ టీం అధికారులు ఆయూబ్ ఖాన్, గురుశేఖర్, చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగని మోటారు వైర్ల చోరీలుబి.కోడూరు : మండలంలో కొంత కాలంగా వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురవుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రభలవీడు, నర్సయ్యకొట్టాలు, పెద్దుళ్లపల్లె గ్రామాల్లో గతంలో కేబుల్ వైర్లు దొంగలిస్తున్న దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించినా చోరీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సోమవారం రాత్రి ఐత్రంపేట గ్రామంలో కూడా ఎనిమిది మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. దీంతో మండలంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కేబుల్ వైర్లను చోరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. -
ఏపీఎల్కు సర్వం సిద్ధం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో తొలిసారిగా నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్–5 మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏసీఏ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి తెలిపారు. మంగళవారం నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయన్నారు. రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్లను జిల్లా ప్రజలు వీక్షించి ప్రోత్సహించాలన్నారు. ఈ మ్యాచ్ల్లో కడపకు చెందిన 9 మంది క్రీడాకారులు ఆడనున్నట్లు వివరించారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉచితంగా మ్యాచ్లను వీక్షించవచ్చని తెలిపారు. బీసీసీఐ మెంబర్ చాముండేశ్వరినాథ్తో పాటు ఏసీఏ నుంచి పలువురు పెద్దలు హాజరు కానున్నారన్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ సీఈఓ గిరీష్ గోగ్రే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్ గ్యారీ స్టేడ్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డిప్రసాద్, అధ్యక్షుడు మునికుమార్రెడ్డి, స్టేడియం కమిటీ మెంబర్ సంజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
అట్లూరు : ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి సుశాంత్(13) అనే బాలుడు మృతి చెందిన సంఘటన అట్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కమలకూరు గ్రామానికి చెందిన కొర్రపాటి తిరుపాల్, రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుశాంత్, రెండో కుమారుడు సునీల్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇరువురు పిల్లలు గ్రామ సమీపంలో ఉన్న చిన్న చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. ముందుగా సుశాంత్ చెరువులోకి దిగాడు. మునిగిపోతున్న సుశాంత్ను చూసిన సునీల్ గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు తెలిపారు. బంధువులు, స్థానికులు అక్కడికి వెళ్లే సరికి సుశాంత్ మృతి చెందాడు. కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుశాంత్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతిలో చేర్పించాలని తల్లిదండ్రులు కలల కన్నారు. ఇంతలోనే ఈత రూపంలో తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
‘అంతరార్థం’.. ‘పిండి’తార్థం చెబుతాం!
● అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సొసైటీపై విచారణకు ఆదేశం ● ‘సాక్షి’ సంచలన కథనానికి ఎండోమెంట్ అధికారుల స్పందన ● క్షేత్రస్థాయికి ఇన్స్పెక్టర్లు ● గుట్టు రట్టవడంతో సొసైటీ సభ్యుల ఉలికిపాటు ● ‘రద్దు చేస్తాం.. రాద్దాంతం వద్దు’ అంటూ బుకాయింపు ● తమ మెడకు చుట్టుకుంటుందని అర్చకుల ఆందోళనప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని చరిత్రాత్మక శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ ట్రస్టుబోర్డుకు సమాంతరంగా కొందరు ప్రైవేట్ సొసైటీని ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఎండోమెంట్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సాక్షాత్తూ ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకులు సతీష్కుమార్, మహేశ్వర శర్మలు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో దొడ్డిదారిన సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే . ఈ కుట్రలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’అంతరార్థం అగస్త్యేశ్వరునికెరుక’ శీర్షికన ఇచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కథనంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమాలపై ఆరా తీశారు. అడ్డంగా దొరికిపోయి.. రద్దు చేస్తామంటూ బుకాయింపు! ‘సాక్షి’ దెబ్బకు అక్రమ సొసైటీ సూత్రధారుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. ఆలయ నిధులను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ఈ సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎండోమెంట్ ఉన్నతాధికారులు సదరు కమిటీని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో అడ్డంగా దొరికిపోయిన కొందరు సొసైటీ సభ్యులు.. ‘దీనిపై చర్చించాల్సింది, చెప్పుకోవాల్సింది ఏముంది.. కావాలంటే సొసైటీని రద్దు చేస్తాం, ఎందుకు దీన్ని ఇంతగా రాద్దాంతం చేస్తున్నారు‘ అంటూ భయంతో అధికారుల ముందే బుకాయించినట్లు సమాచారం. అయితే, ఈ సొసైటీ ఏర్పాటు వ్యవహారం ఎండోమెంట్ శాఖలోని కొందరు కిందిస్థాయి అధికారులకు తెలియకుండా జరిగి ఉండదని భక్తులు గట్టిగా ఆరోపిస్తున్నారు. మా మెడకు చుట్టుకుంటుంది.. కొందరు అర్చకుల ఆవేదన! ఇదిలా ఉండగా, ఈ అక్రమ సొసైటీ వ్యవహారం ఆలయ అర్చక వర్గాల్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా, తమ అంగీకారం తీసుకోకుండా కేవలం చైర్మన్, ప్రధాన అర్చకులు బలవంతంగా తమ పేర్లను సొసైటీలోకి లాగారని కొందరు తోటి అర్చకులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన కింద ఈ దొంగ సొసైటీ వ్యవహారం ఎక్కడ తమ ఉద్యోగాల మెడకు చుట్టుకుంటుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించిన అసిస్టెంట్ కమిషనర్ శివాలయంలో వెలుగుచూసిన ఈ సమాంతర ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు విషయమై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కర్బాలాజీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఇన్స్పెక్టర్కు స్పష్టం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు వాస్తవమని తేలితే చైర్మన్, అర్చకులతో సహా బాధ్యులందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
చికెన్ వ్యర్థాలనూ వదలని నేతలు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాల వ్యాపారానికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కాంట్రాక్టర్లు మారుతున్నారు. ఆదాయం కోసం పోటీపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ వ్యర్థాలను తమ పార్టీ నాయకుడికి ఇవ్వాలని స్థానిక అధికార పార్టీ నేతలు సిఫారసు చేశారు. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఏకంగా చికెన్ సెంటర్ల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రొద్దుటూరులో సుమారు వందకుపైగా చికెన్ షాపులు ఉన్నాయి. చికెన్ తయారు చేసేటప్పుడు వెలువడే వ్యర్థాలను షాపుల యజమానులు భద్రపరచడం, కాంట్రాక్టర్లు వీటిని వ్యాన్ల ద్వారా తరలించడం జరుగుతోంది. ఈ వ్యర్థాలను గతంలో మైలవరానికి చెందిన కాంట్రాక్టర్ తీసుకెళ్లేవారు. ఏడాది కిందట నంద్యాలకు చెందిన కాంట్రాక్టర్ అనధికారికంగా పోటీపడి వ్యాపారం దక్కించుకున్నారు. చికెన్ వ్యర్థాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఏడాది పాటు అనుమతి పట్టణంలో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను మంగదొడ్డి ఓబులేసుకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గత నెల 29న చికెన్ షాపుల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు ఏడాది పాటు ఈ కాంట్రాక్టర్కు అనుమతి ఇచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సాధారణంగా కాంట్రాక్టర్ వాహనం ఏర్పాటు చేసుకుని వ్యర్థాలను తరలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంట్రాక్టర్ అధికార పార్టీ నేత కావడంతో.. ఆ వాహనానికి ఏకంగా మున్సిపాలిటీ స్టిక్కర్ అతికించుకుని వ్యర్థాలను తరలిస్తున్నారు. వాహనం చూసిన వారంతా మున్సిపల్ సిబ్బంది వీటిని తరలిస్తున్నారేమోనని చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ స్టిక్కర్ అతికించారని మున్సిపాలిటీ సిబ్బందిని ప్రజలు ప్రశ్నిస్తుండగా.. కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. పట్టణంలోని చికెన్ షాపుల వారు పురపాలక సంఘం వారికి సహకరించి ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అంటువ్యాధులు వ్యాపించకుండా సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని సుమారుకు వందకుపైగా చికెన్ షాపుల నుంచి టన్నుల కొద్ది ఉత్పత్తి అయ్యే చికెన్ వ్యర్థాలను కాంట్రాక్టర్ సేకరిస్తున్నారు. వీటిని చేపలకు ఆహారంగా వినియోగించేందుకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మా వారికే ఇవ్వండి అధికార పార్టీ నాయకుడి ఆదేశాలు సర్క్యులర్ జారీ చేసిన కమిషనర్ మున్సిపాలిటీ స్టిక్కర్తో రవాణాకాలుష్యాన్ని తగ్గించేందుకే.. పట్టణంలోని చాలా మంది చికెన్ సెంటర్ యజమానులు చికెన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ కాలువల్లో, రోడ్లపై వేస్తున్నారు. ఈ కారణంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు ఆయనకు అప్పగించాం. ఇందుకు ఎలాంటి టెండర్లు పిలువలేదు. పలు మున్సిపాలిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేశారు. వ్యాన్కు ఉన్న మున్సిపాలిటీ స్టిక్కర్ను తొలగిస్తాం. – రవిచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు. -
అనుమానం నిజమైంది.. ‘సర్’లో పారదర్శకత లోపించింది. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేల ఓట్లే, ఇంటి పేర్లే గల్లంతవడం చూసి సామాన్య ఓటరులో కలవరం మొదలైంది. ఓట్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతున్నా.. పట్టపగలు పచ్చ నేతలు ఓటు పేరిట డేటా చోరీ చేస్తున్నా అధికార యంత్రా
● ఐటీడీపీ యాప్ ద్వారా వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు స్కెచ్: రాచమల్లు ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా గృహ నంబర్లే గల్లంతు ● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓటు మాయం ● తమ ఓటుహక్కు ఎక్కడ పోతుందోనని మైనార్టీల్లో తీవ్ర భయాందోళనలు ● సచివాలయాల వద్ద ప్రజల క్యూలు కడప సెవెన్రోడ్స్: జిల్లాలో సాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని చూస్తుంటే.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు, సానుభూతిపరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకేనన్న అనుమానాలు పతాకస్థాయిలో బలపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రక్రియలో సాక్షాత్తు మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా సొంత నివాస గృహ నంబర్లు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం ఇందుకు గట్టి బలాన్ని చేకూరుస్తోంది. నియోజకవర్గాల్లోని కీలక అగ్రనేతల ఓట్లకే దిక్కులేకపోవడంతో సామాన్య ఓటర్లు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఓటుహక్కు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళనలతో వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. ఐటీడీపీ యాప్తో ఓట్ల వేట.. ఆర్ఓకు రాచమల్లు ఫిర్యాదు! ఈ ఓట్ల తొలగింపు కుట్రల వెనుక డిజిటల్ మాఫియా నడుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మంగళవారం ఆయన ప్రొద్దుటూరు ఏఈ ఆర్ఓ విజయభాస్కర్రాజుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారిక ‘ఐటీడీపీ’ యాప్ను ఉపయోగించి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి, వారి ఓట్లను టార్గెట్ చేసి తొలగించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంటింటి పరిశీలనలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ‘సర్’ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కమలాపురం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఉత్తమారెడ్డి, టౌన్ కన్వీనర్ గంగారెడ్డి తదితరులు కమలాపురం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం మైనార్టీల్లో ‘సర్’ కలకలం ç³Õa-Ð]l$-»ñæ…-V>ÌŒæ, ½àÆŠæ, E™èl¢-Æý‡{ç³-§ólÔŒæ, ™èlÑ$-âýæ-¯éyýl$ Æ>[ÚëtÌZÏ VýS™èl…ÌZ fÇ-W¯]l A¯]l$-¿ýæÐéÌS ¯ól糫§ýlÅ…ÌZ OÐðl$¯éÈ-tÌS Krϯ]l$ ¿êÈV> ™öÌS-W…-^ól…-§ýl$MóS MýS*rÑ$ {糿¶æ$™èlÓ… D çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² Aç܈…V> Ðéyýl$-MýS$…-sZ…-§ýl¯ól ºÌS-OÐðl$¯]l B…§øâýæ¯]l Ð]l¬QÅ…V> Ð]l¬íÜÏ… OÐðl$¯é-Èt Ð]lÆ>YÌZÏ Ð]lÅMýS¢-Ð]l$-Ð]l#-™ø…-¨. ©…™ø C…sìæ…sìæ G¯]l$ÅÐ]l$-Æó‡çÙ¯ŒS {´ëÆý‡…¿ýæ… M>MýS-Ð]l¬…§ól ç³Ë$Ð]l#Æý‡$ Ð]l¬íÜÏ… ¯ól™èlË$ 2002 ¯ésìæ KrÆý‡Ï gê¼-™éË$ ¡çÜ$MýS$° „óS{™èl-Ýë¦-Ƈ$$ÌZ {ç³f-ÌSMýS$ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-µçÜ*¢ çÜçßæ-MýS-Ç-çÜ$¢-¯é²Æý‡$. C™èlÆý‡ Ð]lÆ>YÌSMýS$ ^ðl…¨¯]l KrÆý‡$Ï MýS*yé ÐéÇ Ð]l§ýlªMýS$ ÐðlãÏ ™èlÐ]l$ KrÏ çÜÐ]l*-^éÆý‡… ™ðlË$-çÜ$-MýS$…-r$-¯é²Æý‡$. ½G-ÌŒæ-KË$ C…sìæ…sìæ ç³Ç-Ö-ÌS¯]lMýS$ Ð]l_a¯]l çÜ…§ýl-Æý‡Â…ÌZ {ç³fË$ MýS*yé A…§ýl$»ê-r$ÌZ E…yìl gê{VýS-™èl¢V> G¯]l*Å-Ð]l$-Æó‡-çÙ¯ŒS ¸ëÆ>Ë$ ç³NÇ…_ çÜÐ]l$-Ç-µ…-^éÍÞ E…r$…-¨. {ç³fË$ C糚yýl$ gê{VýS™èl¢V> E…yýl-MýS´ù™ól Æ>¯]l$¯]l² G°²-MýSÌZÏ Kr$-çßæ-MýS$P¯]l$ Ô>ÔèæÓ-™èl…V> MøÌZµÄôæ$ {ç³Ð]l*§ýl… E…§ýl° Æ>f-MîSĶæ$ ÑÔóæÏçÙ-MýS$Ë$ òßæ^èla-Ç-çÜ$¢-¯é²Æý‡$. Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Æý‡-Ò…-{§ýl-¯é£Šl-Æð‡yìlz, Ð]l*i yìlç³NÅsîæ ïÜG… A…f-§Šæ-»ê-Úë, GÐðl$Ã-ÎÞ G…Ò Æ>Ð]l$-^èl…-{§éÆð‡yìlz, Ð]l*i Ðól$Ķæ$ÆŠ‡ ´ëM> çÜ$Æó‡‹Ù ™èl¨-™èlÆý‡ ¯ól™èlÌS º–…§ýl… hÌêÏ MýSÌñæMýStÆŠ‡ yéMýStÆŠ‡ }«§ýlÆŠ‡ ^ðlÆý‡$-MýS*ǰ MýSÍíÜ D A{MýS-Ð]l*ÌSOò³ íœÆ>ŧýl$ ^ólÔ>Æý‡$. {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$Ë$ M>MýS$…yé sîæyîlï³ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ KrÆý‡Ï ÍçÜ$t-ÌS™ø †Æý‡-VýS-yýl…Oò³ Ñ^é-Æý‡×æ fÆý‡´ë-ÌS-°, çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² ి ´ëÆý‡-§ýl-Æý‡Ø-MýS…V> fÆý‡-V>ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. కడప నగరం బీకేఎం వీధిలోని ఇంటి నెంబరు 19/420లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. అయితే, ప్రస్తుత 2002 సర్ జాబితాలో ఆయన నివాస గృహ నంబరుతో పాటు వరుసగా మరో నాలుగు ఇంటి నంబర్లు మాయమయ్యాయి. తద్వారా ఆ ఇళ్లలోని ఓట్లను డిలీట్ చేయడానికి పక్కా స్కెచ్ వేశారని స్పష్టమవుతోంది. దీనిపై అంజద్బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు పతాకస్థాయికి చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి స్వగ్రామమైన నక్కలదిన్నెలో ఆయన పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు 2002 ఓటర్ల జాబితాలో పూర్తిగా గల్లంతయ్యాయి. చాపాడు మండలం చిన్నగులువలూరు గ్రామంలో రఘురామిరెడ్డి కుమారుడు, కోడలి ఓట్లను కూడా అక్రమంగా డిలీట్ చేశారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరో గ్రామానికి చెందిన పేర్లను చొప్పించి గందరగోళం సృష్టిస్తున్నారని రఘురామిరెడ్డి అధికార యంత్రాంగంపై ధ్వజమెత్తారు. -
గురుకులంలో గందరగోళం
కడప రూరల్ : కడప చిన్నచౌక్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించగా.. ప్రవేశ పరీక్ష రాసిన వారితోపాటు పరీక్ష రాయని వారు కూడా హాజరయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఆ పాఠశాల సిబ్బంది మొదట ప్రవేశ పరీక్షలు రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఖాళీలు ఉంటే మిగతా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రం అందరికీ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడంతోనే వచ్చామని తెలిపారు. కాగా 8,9వ తరగతి విద్యార్థులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సిబ్బంది చెప్పడంతో, కౌన్సిలింగ్కు వచ్చినవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చామని, మళ్లీ కౌన్సెలింగ్కు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని పలువురు వాపోయారు. కాగా చిన్న చౌక్ కడప నగరానికి కాస్త దూరంగా ఉండటంతో కౌన్సెలింగ్కు వచ్చిన పిల్లలు, పెద్దలు ఆహారానికి, తాగునీటికు ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్కు హాజరైన వారిలో ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ విషయమై ఆ శాఖ జిల్లా కోఆర్డినేటర్ ఉదయశ్రీ ని ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
ఈ వంతెనల కథ అంతేనా !
● కూటమి సర్కారు రాజకీయ కక్షతో స్తంభించిన రూ.76 కోట్ల ఆర్అండ్బీ ప్రాజెక్టులు ● కె.రాజుపల్లె వంతెన పూర్తయి రెండేళ్లయినా అప్రోచ్ రోడ్డు కరవు ● రైతులకు చెల్లించని పరిహారం ● జగనన్న హయాంలో పూర్తయిన ‘గండి కొవ్వూరు’ వంతెన చక్రాయపేట: వర్షాకాలం ముంచుకొస్తున్నా పాపాఘ్ని నదీతీర ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. గత జగనన్న పాలనలో నదీతీర గ్రామాల భయాలను పారదోలుతూ శాశ్వత పరిష్కారం కోసం ఆఘమేఘాలపై వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా.. నేటి పాలకుల రాజకీయ కక్ష, నిర్లక్ష్యం వల్ల నిధులున్నా పనులు నిలిచిపోయి వంతెనల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జగనన్న సర్కారు మాస్టర్ ప్లాన్.. కూటమి బ్రేకులు 2020 వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి రూ.76 కోట్ల భారీ నిధులతో హైలెవెల్ వంతెనల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా కుప్పం – కె.రాజుపల్లెల మధ్య రూ.23 కోట్లతో నిర్మించిన వంతెన వైఎస్సార్సీపీ హయాంలోనే రికార్డు స్థాయిలో పూర్తయింది. అయితే, అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన 4.73 సెంట్ల భూములకు సంబంధించిన రైతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో అప్రోచ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. బ్రిడ్జి పూర్తయి రెండేళ్లు దాటుతున్నా కూటమి నేతలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో, రానున్న వర్షాకాలంలో రాకపోకలు మళ్లీ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది. నత్తనడకన అద్దాలమర్రి.. మరోవైపు, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసి ప్రారంభించిన అద్దాలమర్రి బ్రిడ్జి పనులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత రెండేళ్లుగా ఇక్కడ కేవలం 50 శాతం మేర మాత్రమే పనులు జరిగాయని స్థానికులు వాపోతున్నారు. ఇదే సమయంలో, గత ప్రభుత్వంలో పీఎంజీఎస్వై కింద రూ.28.5 కోట్ల కేంద్ర నిధులతో శ్రీకారం చుట్టిన గండి కొవ్వూరు–వెన్నపల్లె వంతెన పనులను కాంట్రాక్టర్ ఏడాదిలోనే పూర్తి చేశారు. కేంద్ర నిధులు కావడంతోనే కూటమి ప్రభుత్వం ఇక్కడ వివక్ష చూపలేకపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. -
హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లో జరిగిన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ చోరీ కేసులో ఎట్టకేలకు త్రీ టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ మెగా స్కామ్లో ప్రధాన నిందితుడు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యంను పోలీసులు సోమవారం రాత్రి అధికారికంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్ నుంచి ఇటీవల సుమారు 268.71 టన్నుల ప్రభుత్వ ఐరన్ మాయమైంది. ఈ గోడౌన్కు ఇన్చార్జిగా ఉన్న ఏఈ సుబ్రమణ్యం ప్రమేయం లేకుండా ఇంత భారీ ఎత్తున ఐరన్ పక్కదారి పట్టే అవకాశం లేదని నిర్ధారించిన హౌసింగ్ పీడీ రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26న త్రీ టౌన్ పోలీసులు ఏఈపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఏఈ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినప్పటికీ ఏఈ సుబ్రమణ్యం పోలీసుల విచారణకు అస్సలు సహకరించడం లేదని సమాచారం. ఇనుమును ఎక్కడకి తరలించారు, ఎవరికి విక్రయించారు అనే ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులకు ఈ విచారణ సవాల్గా మారింది. దీంతో పూర్తి నిజాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్దల గుండెల్లో రైళ్లు.. బయటపడనున్న అసలు సూత్రధారులు కొన్ని రోజుల క్రితం ఏఈ సుబ్రమణ్యం ఒక వీడియో విడుదల చేస్తూ, ఈ ఐరన్ చోరీ వెనుక కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుత పోలీసు విచారణలో కూడా కొందరు హౌసింగ్ అధికారులతో పాటు బయటి వ్యక్తుల పేర్లను ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. వీరంతా నోరు విప్పితే హౌసింగ్ శాఖలోని పెద్ద తిమింగలాల పాత్రతో పాటు ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. రూ.1.70 కోట్ల ఐరన్ చోరీ కేసు రూరల్ హౌసింగ్ గోడౌన్లో 268 టన్నుల ఇనుము మాయం కడప సెంట్రల్ జైలుకు తరలింపు నోరు విప్పని నిందితుడు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు త్రీటౌన్ పోలీసుల కసరత్తు కీలక అధికారుల పాత్రపై ఏఈ ఆరోపణలు త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం -
వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య
● వంశీ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ ● ప్రధాన నిందితుడి కోసం గాలింపుకడప అర్బన్ : తన భార్యతో డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానంతో యజమాని చింతా రామసుబ్బారెడ్డి మరో ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాజగోపాల్ వెల్లడించారు. హత్య సంఘటనకు రెండు రోజులు ముందు ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి సింగపూర్ టౌన్షిప్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మరో ముగ్గురు నిందితులైన దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఈ నెల10వ తేదీ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామసుబ్బారెడ్డి తన సహచరులతో వంశీని సదరు ఇంటికి పిలిపించుకుని కత్తులతో దారుణంగా హత్య చేశారు. తన భార్య మధురవాణితో కారు డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానం పెనుభూతంగా మారింది. వంశీ, మధురవాణిలు వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు పది రోజులు కానీ, 20 రోజులు అక్కడే ఉండి కలిసి ఉంటున్నట్లు, అలాగే తన పిల్లలు, తన భార్య కూడా రామసుబ్బారెడ్డి మాట వినకుండా, డ్రైవర్ వంశీనే మంచోడు అని చెబుతూ కుటుంబ సభ్యులందరూ లెక్క చేయకపోవడంతో అది చూసి ఓర్చుకోలేకపోయాడు. రామసుబ్బారెడ్డి ఎలాగైనా డ్రైవర్ వంశీని అడ్డు తొలగించాలనుకున్నాడు. తనకు తెలిసిన బుడ్డాయపల్లెకు చెందిన దేవకుమార్, మోడీమీదిపల్లికి చెందిన నాగార్జున, శ్రీనివాసులు సహాయం తీసుకున్నాడు. పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం హత్యకు ప్లాన్ వేసి అతన్ని సింగపూర్ టౌన్షిప్లోని ఒక ఇంటిలోనికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని ఒంటిమిట్ట మండలం సాలాబాదు రోడ్డులోని సోమశిల జలాలకు దగ్గరలో గుర్తుతెలియని ప్రదేశంలో కొండ దగ్గర పడేశారు. ఈ హత్య కేసులో దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులును అరెస్టు చేసి వారి వద్ద నుంచి, రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, రెండు రాడ్లు ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు పంపించారు. ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహిళలు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను నేర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని ఇందిరా మహిళా మండలి ప్రెసిడెంట్ వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలో గల రిమ్స్ సమీపంలోని ఇందిరా మహిళా మండలిలో మొదటి విడత ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా మహిళా మండలి ద్వారా పేద ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతోందన్నారు. టైలరింగ్తోపాటు ఇతర శిక్షణా కార్యక్రమాలను మహిళలు ఎంత మంది అయినా వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చన్నారు. అనంతరం దాదాపు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా మండలి ట్రైనింగ్ ఇన్చార్జి సరస్వతమ్మ, మెంబర్లు ఎ.సుశీలమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
నేడు డీఆర్సీ సమావేశం
కడప సెవెన్రోడ్స్ : కడప కలెక్టరేట్ లోని ిపీజీఆర్ఎస్ హాలులో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. దర్గాలో ప్రార్థనలు జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని ఆస్థాన యే గౌసియా దర్గాను ఐపీఎస్ అధికారిణి షేక్. షీరిన్ బేగం మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్ షా గౌస్పీరా ఖాద్రీ ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఆమె విజయవాడ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ గౌస్, జహంగీర్ భాష, మూగ్దుమ్ సాబ్రి, రజాక్ పీర్, చాపాడు మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీపీపీలో క్వార్టర్స్ ప్రక్షాళనకు శ్రీకారం ఎర్రగుంట్ల : మండల పరిధి డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని క్వార్టర్స్ ప్రక్షాళనకు యజమాన్యం శ్రీకారం చుట్టింది. క్వార్టర్స్లో నివాసం ఉండే బయటి వ్యక్తులు, ఇతరులు వెంటనే ఖాళీ చేయాలని మెయింటెనెన్స్ విభాగ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీపీపీలో 1420 మంది దాకా అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 1650 మంది పని చేస్తున్నారు. వీరి నివాసం కోసం వీవీరెడ్డి కాలనీలో 1739 క్వార్టర్స్ నిర్మించారు. అయితే కొందరు అధికారుల, ఉద్యోగులు బాడుగకు ఇచ్చి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులు వెంటనే ఖాళీ చేయాలని 125 మందికి ఆర్టీపీపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పది రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసులలో పేర్కొన్నట్లు ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు తెలిపారు. ఫైనాన్స్ వారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం చాపాడు : మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రేపల్లెకు చెందిన కంభంపాటి రామాంజనేయులు గ్రామంలోని తన ఇంటికి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్లో హౌస్ లోన్ పొందాడు. కొన్నేళ్లుగా పెండింగ్ లేకుండా కంతులు కడుతూ ఉండగా ప్రస్తుతం రెండు కంతులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ వారు తరచుగా ఇంటి వద్దకు వచ్చి మహిళలపై ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన తన భర్త పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రామాంజనేయులు భార్య శ్రీలత తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల పారదర్శకత, రోగులకు అందించే వైద్య సదుపాయల నాణ్యతను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో క్షయ రోగులకు అందుతున్న సేవల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫీక్ ఫాషా తదితరులు పాల్గోన్నారు. మొహర్రం మాసం ప్రారంభంచిన్నమండెం : నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం నుంచి మొహర్రం మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు చిన్నమండెం మండల కేంద్రంలో గంధపు పీర్లను నిలబెట్టారు. మండల కేంద్రంలోని పీర్లమకాన్లో గంధపు పీర్లను నిలబెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటి నుంచి పది రోజుల పాటు మొహర్రం వేడుకలను నిర్వహించనున్నారు. -
ఛిద్రమవుతున్న చిత్రావతి
● అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు ● కూటమి నాయకుల దందా ● పట్టించుకోని అధికారులులింగాల : లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి నది ఛిద్రమవుతోంది. కూటమి నాయకులు యథేచ్ఛగా ఇసుకను భారీ యంత్రాలు, టిప్పర్లతో తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూటమి నాయకుల దందా కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిఘా కొరవడింది. దీంతో పార్నపల్లె చిత్రావతి నదిలో ఇసుక రీచ్ లేకపోయినా అక్రమంగా రాత్రి సమయంలో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. చిత్రావతి నది బ్రిడ్జి సమీపంలో టన్నుల కొద్ది ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తుండటంతో బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పార్నపల్లె గ్రామ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీబీఆర్ బ్రిడ్జి వద్ద పోలీసు చెక్పోస్టు, సీసీ కెమెరాల నిఘా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు చెక్పోస్ట్ ఎత్తేసి సీసీ కెమెరాలు తొలగించారు. దీంతో నిఘా కొరవడింది. అటు భూగర్భగనుల శాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారింది. ప్రతి రోజు రాత్రి 10 గంటల తర్వాత భారీ పొక్లెయిన్లు చిత్రావతి నదిలోకి తీసుకెళ్లి భారీ టిప్పర్లతో టన్నులకొద్ది ఇసుకను తవ్వుతున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలో ఓ కంపెనీ వారు నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రానికి, రాష్ట్ర సరిహద్దులు దాటి కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుకను అరికడతామని, వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. చేసిందేమీ లేదన్నారు. భారీ ఎత్తున ఇసుక తరలుతున్నా భూగర్భ గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తుండటంతో ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చిత్రావతి బ్రిడ్జికే కాక, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి నాయకులు ఇసుకను భారీ తరలించి జేబులు నింపుకొంటున్నారు. పరిసర గ్రామాల రైతులు తట్టెడు ఇసుకను గృహ అవసరాలకు తీసుకెళ్లాలన్నా భయాందోళనకు గురవుతున్నారు. అయితే కూటమి నాయకులు యథేచ్ఛగా టన్నులకొద్ది ఇసుకను తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలను అధికారులు ఆపివేయకపోతే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగించే కుట్ర
ప్రొద్దుటూరు : ఐ టీడీపీ యాప్ ద్వారా వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి, తొలగించే కుట్ర జరుగుతోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభమై ఒక్క రోజు మాత్రమే అయిందని, ఆ ఒక్క రోజులోనే టీడీపీ లీలలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఏఈఆర్ఓ, తహసీల్దార్ ఉదయకుమార్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైందని, మన ఓటును మనమే సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటర్లు గతంలో పాలకులను నిర్ణయించేవారని, ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయించి ఎవరి ఓటు ఉండాలి.. ఎవరి ఓటు వద్దు.. అనేది నిర్ణయిస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 800 నుంచి 1,100 ఓట్లు ఉన్నాయని, ఐటీడీపీ యాప్ ద్వారా టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి, ఫాం 7 ద్వారా తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అమృతానగర్లో బూత్ లెవెల్ అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే చేయకుండా, కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లను పిలిపించుకోవడం సరికాదన్నారు. శంకరాపురంలో బీఎల్ఓ.. టీడీపీ వారు ఉన్న వీధుల్లోకి రావద్దని వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు చెప్పడం సరికాదన్నారు. కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఈవీఎంల ద్వారా తాము ఓటమి పాలయ్యామని, సర్ ద్వారా వచ్చే ఎన్నికల్లో మోసపూరితంగా మళ్లీ తమను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. అర్హులైన ఓటర్లను తొలగించిన అధికారులకు ఉరి శిక్ష వేసినా తప్పు కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. సర్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లతోపాటు ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.● ఒక్క రోజులోనే వెలుగులోకి టీడీపీ లీలలు ● ఇళ్ల వద్దకు వెళ్లకుండా ఒకచోట కూర్చొని సర్వే చేయడం సరికాదు ● అర్హులైన ఓటర్లను తొలగించిన వారికి ఉరి శిక్ష వేసినా తప్పులేదు ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపాటు -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు !
కడప సెవెన్రోడ్స్ : జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ‘నీట్’ పరీక్ష నిర్వహణపై ఎస్పీనచికేత్ విశ్వనాథ్, డీఆర్వో మల్లికార్జునుడు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా కడపలో 8 కేంద్రాలు, ప్రొద్దుటూరులో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 264 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లుతెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నీట్ (యూజీ)–2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప, ప్రొద్దుటూరు సిటీ కో ఆర్డినేటర్స్ మునీష్ మీనా, జయచంద్రా రెడ్డి, పోలీసు, రెవెన్యూ, ఏపీఎస్పీడిసిఎల్, మెడికల్, లేబర్, డిసేబుల్, పోస్టల్ తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాధీన సామగ్రి భద్రతపై ప్రత్యేక దృష్టి ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తు సామగ్రి భద్రత కోసం జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్రక్క్ఆ హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ఎస్. కమలాకర రెడ్డి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి.. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) చట్టం కింద స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల భద్రత కోసం జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న శాశ్వత నిల్వ కేంద్రాల నిర్మాణ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువుల తాత్కాలిక, శాశ్వత భద్రతా ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలు, నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బందికి సోమవారం ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల పదోన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కడపలోని ఇంటర్ విద్య ఆర్జేడీ కార్యాలయంలో సోమవారం ఈ పదోన్నతి కార్యక్రమాన్ని ఆర్జేడీ సురేష్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బంది అయిన పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ,, అశ్విని, భాస్కర్, కిషోర్, శివకుమార్ తదితరులకు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారిని చిత్తూరు నాన్ టీచింగ్ స్టాప్ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల విద్య ఆర్జేడీ సురేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
సర్ ఎన్యూమరేషన్ ప్రారంభం
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలోని బీఎల్ఓలు ఆయా ఏఈఆర్ఓ కార్యాలయాల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకుని ఇంటింటి సందర్శన కార్యక్రమానికి వెళ్లారు. ఓటర్లకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ప్రధాన పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బీఎల్ఓల వెంట ఇంటింటిని సందర్శించారు. తొలిరోజు కావడంతో చాలా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఇంటింటికి బీఎల్ఓలు వెళ్లలేకపోయారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చాలా ప్రాంతాల్లో బీఎల్ఓలు రాలేదని ప్రజలు తెలిపారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం వచ్చేనెల 14వ తేది వరకు జరగనుంది. మృతి చెందిన, డూప్లికేట్, శాశ్వత వలసలు వెళ్లిపోయిన వారి ఓట్లను జాబితాలో నుంచి తొలగించనున్నారు. అలాగే విదేశీయులు ఎవరైనా జాబితాలో ఓటరుగా ఉంటే గుర్తించి తొలగిస్తారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీయే ‘సర్’ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 18,94,520 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 19,952 ఉండగా, బీఎల్ఓలు అదే సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు 1963 మంది బీఎల్ఓలు 52,959 ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. -
ఎవరెవరికి అవకాశాలు?
● వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ ధమాకా ● తొలిసారి ఫ్లడ్లైట్ల వెలుగుల్లో మ్యాచ్లు ● బుధవారం నుంచి సమరం ● అభిమానులకు ఉచిత ప్రవేశం ● సందడి చేయనున్న సింగర్స్ సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో క్రికెట్ క్రీడాభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026’ రెండో దశ మ్యాచ్లు బుధవారం (జూన్ 17) నుంచి తొలిసారిగా జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. స్థానిక వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు మొత్తం 9 మ్యాచ్లను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్స్ వెలుగుల్లో ఈ టీ–20 పోరు సాగనుండటంతో జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏసీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్, రికీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటడానికి ఇప్పటికే కడపలో అడుగుపెట్టారు. ఏడు జట్ల హోరాహోరీ.. రోజుకు రెండు మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో 7 జట్లు తలపడనున్నాయి. ప్రతి రోజూ రెండు మ్యాచ్లు జరగనుండగా, మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో హై–వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ను పంచనున్నాయి. ఊరూరా విస్తృత ప్రచారం.. పాఠశాలల ప్లాన్! కడపలో ఏపీఎల్ నిర్వహణపై ఏసీఏ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ టోర్నీ కోసం విడుదల చేసిన ప్రత్యేక సాంగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగ్స్, బెలూన్స్ ద్వారా ఏపీఎల్పై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ క్రికెట్ మ్యాచ్లు చూపించాలనుకుంటుండటంతో ఏపీఎల్ పండగలా మారింది. చక్కటి వసతులు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం! కడపలో మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చే క్రీడాభిమానులకు స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతులు సమకూర్చినట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి, జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మునికుమార్రెడ్డి, రెడ్డిప్రసాద్లు తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 ప్లేఆఫ్స్ (టాప్–4 స్థానాల) రేసు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా ఏడు జట్ల ప్లేఆఫ్స్ అర్హత అవకాశాలు క్రింది విధంగా ఉన్నాయి. క్యాపిటల్ అమరావతి రాయల్స్/భీమవరం బుల్స్ ఈ రెండు జట్లు తలా 6 పాయింట్లతో టేబుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అర్హత సమీకరణం: అమరావతి రాయల్స్ ఆడిన 3 మ్యాచ్లూ గెలిచి అజేయంగా ఉంది. వీరు కడప లెగ్లో ఆడబోయే 3 మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ సీటు ఖరారవుతుంది. భీమవరం బు ల్స్ ఒక్క విజయం సాధిస్తే సేఫ్ జోన్లో ఉంటుంది. కాకినాడ కింగ్స్/విజయవాడ సన్షైనర్స్ఈ రెండు జట్లు తలా 4 మ్యాచ్లు ఆడి, 2 విజయాలతో 4 పాయింట్లు సాధించాయి. అర్హత సమీకరణం: ఈ జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే కడప దశలో వీరు ఆడబోయే రెండు మ్యాచ్లలో కనీసం ఒకటైనా భారీ రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా క్వాలిఫై అవుతారు. సింహాద్రి వైజాగ్ లయన్స్/తుంగభద్ర వారియర్స్ ఈ రెండు జట్లు కేవలం ఒక్కో విజయం (2 పాయింట్లు)తో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. అర్హత సమీకరణం: వీరికింకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రేసులో నిలవాలంటే కడప గడ్డపై ఆడబోయే 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. నెట్ రన్ రేట్ చాలా మైనస్లో ఉన్నందున భారీ విజయాలు అవసరం. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆడిన 3 మ్యాచ్లలోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అర్హత సమీకరణం: రాయలసీమ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై అద్భుతం జరగాలి. కడపలో వారు ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్లలోనూ భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, విజయవాడ, కాకినాడ జట్లు తమ మిగిలిన మ్యాచ్లలో ఓడిపోవాలని ప్రార్థించాలి. కెప్టెన్: షేక్ రషీద్ ప్రధాన ఆటగాళ్లు: జె. సాకేత్ రామ్, ఎస్.ధ్రువ కుమార్ రెడ్డి, తేజ రెడ్డి ఎర్రగుడి, సాయి పూర్ణ తేజ గరిమెళ్ల, వంశీ కృష్ణ మామిడి, వాసు యెడ్ల, ఎన్. మాధవ్. -
పాలకులకు సైట్.. పింఛన్లు క్లోజ్
పాత పింఛన్లే దిక్కు.. ఎన్నికల హామీలపై మౌనం !● ప్రభుత్వ పింఛన్ల వెబ్సైట్ మూసివేత ● ‘రీ వెరిఫికేషన్’ పేరిట 4 వేల దివ్యాంగుల పింఛన్లకు కోత కాశినాయన: కూటమి సర్కార్లో కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు కానీ, ప్రస్తుతం వస్తున్న పాత పింఛన్లను కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో ప్రభుత్వం ఊడబీకుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలు, ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లను సైతం వెరిఫికేషన్ సాకుతో తీసేస్తుండటంతో సామాజిక పింఛన్దారులలో తీవ్ర భయాందోళనలు, అసహనం వ్యక్తమవుతున్నాయి. 4 వేల దివ్యాంగ పింఛన్ల కట్.. కడప, ప్రొద్దుటూరుకు తిప్పలు! సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం మొదట దివ్యాంగులను లక్ష్యంగా చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4,000 మంది దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరిట నిలిపివేసి ఘోర అన్యాయం చేశారు. అర్హులైన దివ్యాంగ పింఛన్దారులకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నోటీసులు ఇస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ నోటీసుల ప్రకారం రీ వెరిఫికేషన్ కోసం కడప రిమ్స్ లేదా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులలోని మెడికల్ బోర్డుల (సదరం క్యాంపుల) చుట్టూ తిరగాలని అధికారులు నిబంధనలు పెడుతున్నారు. తీవ్రమైన శారీరక వైకల్యంతో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు అంతదూరం ప్రయాణాలు చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రెండేళ్లయినా తెరచుకోని వెబ్సైట్.. సిబ్బంది అవస్థలు! ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో నిలిపివేసిన పింఛన్ల వెబ్సైట్ను, కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయినా ఇప్పటికీ తెరవకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, వికలాంగులు ఆశతో గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. అయితే సైట్ ఓపెన్ కాలేదని చెప్పడానికి సచివాలయ సిబ్బంది సైతం చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా వృద్ధులు కార్యాలయం బయట కనిపిస్తే ఏం సమాధానం చెప్పాలా అని సిబ్బంది మదనపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సర్దిచెప్పే సమాధానం ఇచ్చి పంపిస్తుండటంతో, లబ్ధిదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. గతంలో నిరంతర ప్రక్రియ.. నేడు గగనం! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియలా సాగేది. అప్పట్లో పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి గ్రామ వలంటీర్లే నేరుగా దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్ చేసేవారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఆరు నెలలకోసారి (జూన్, డిసెంబర్లలో) క్రమం తప్పకుండా కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్సైట్ను పూర్తిగా నిలిపివేయడంతో అర్హులైన వారు నిత్యం సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల్లో పనికాకపోవడంతో, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో సైతం పింఛన్లు మంజూరు చేయాలంటూ వేలాదిగా అర్జీలు సమర్పిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2,55,719 పింఛన్లు లబ్ధిదారులకు అందుతున్నాయి. అయితే, ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం సచివాలయాల్లో కేవలం ఒకే ఒక రకమైన పింఛన్ ప్రక్రియ మాత్రమే సాగుతోంది. అదేమిటంటే.. ఇప్పటికే పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతడి వారసత్వంగా ఆ పింఛన్ను భార్యకు బదిలీ చేసి ఇస్తున్నారు తప్ప కొత్తగా అర్హత సాధించిన ఎవ్వరికీ నూతన పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు, తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కీలక హామీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ఉన్న పింఛన్లను తొలగించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
వైఎస్ఆర్ జిల్లా
7మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026కెప్టెన్: సీ.ఆర్. జ్ఞానేశ్వర్ ప్రధాన ఆటగాళ్లు: సౌరభ్ కుమార్, ఎమ్.దీపక్, ఎమ్.కె.దత్తా రెడ్డి, గుట్టా రోహిత్, ప్రణీత్ మాన్యాల. కెప్టెన్: నితీష్ కుమార్ రెడ్డి ప్రధాన ఆటగాళ్లు: పి.వి.సత్యనారాయణ రాజు, హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కల్లూరు, టి.వి.సాయి శ్రవణ్, మునీష్ వర్మ భూపతిరాజు, బైలపూడి యశ్వంత్, ధీరజ్ కుమార్ మైచర్ల, భువనేశ్వర్ రావు, రవికిరణ్ మోపాడ, వంశీ కృష్ణ తన్నేరు, గిరీష్ కుమార్ రెడ్డి, సతీష్ నోదగాల. కెప్టెన్ : అశ్విన్ హెబ్బార్ ప్రధాన ఆటగాళ్లు: జి. సాయి వెంకట సుమిత్, జహీర్ అబ్బాస్, ఎమ్.అభినవ్, ఎ.లలిత్ మోహన్, తేజస్వి పిన్నింటి, విజయ్ ఆకుల. కెప్టెన్: కె.ఎస్.భరత్ ప్రధాన ఆటగాళ్లు: పిన్నింటి తప స్వి, గొలమారు మనీష్, మిత్తా లేఖాజ్ రెడ్డి, కె.పి.సాయి రాహు ల్, మిద్దె అంజనేయులు, కె.సుదర్శన్, షేక్ కమరుద్దీన్, అభిషేక్ ఎమ్. రెడ్డి. -
అంతరార్థం అగస్య్తేశ్వరునికెరుక !
● ప్రొద్దుటూరు శివాలయంలో సమాంతర సొసైటీ కలకలం ● చైర్మన్, అర్చకులు అధ్యక్ష, కార్యదర్శులుగా సేవా సంఘం రిజిస్ట్రేషన్ ● ఈఓ, అధికారిక రశీదులను కాదని సొంత అకౌంట్లతో చందాల వసూళ్లకు స్కెచ్ ● నేటి నుంచే మహా కుంభాభిషేకం ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ కొంతకాలంగా తరచూ వివాదాలు నడుస్తున్నాయి. తాజా గా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో ఆల య కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకుడు సతీష్కుమార్ అధ్యక్షుడిగా, మరో అర్చకుడు మహేశ్వర శర్మ ఉపాధ్యక్షుడిగా, ఉదయ్భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా సంస్థను రిజిష్టర్ చేయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సంస్థ బైలాలో కూడా శివాలయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. జీతాలు ప్రభుత్వానివి.. సొసైటీలు ప్రైవేటా?! ఎండోమెంట్ ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అర్చకులు, దేవాదాయ శాఖ నుంచి గౌరవవేతనం తీసుకుంటున్న చైర్మన్ శివాలయం పేరుతో మరో సొసైటీని ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఎండోమెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆలయ పెద్దలే ఇందులో ఉండటం వల్ల ఈ సొసైటీ ఆలయానికి అధికారికంగా సంబంధించిందేనని భ్రమపడి సామాన్య ప్రజలు, శివయ్య భక్తులు ఇతోధికంగా భారీ విరాళాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన కమిటీ ఉండగా, మళ్లీ ఈ కమిటీలోని వ్యక్తులే దొడ్డిదారిన మరో సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈఓ పర్యవేక్షణకు పాతర.. నిబంధనల ప్రకారం ఆలయ ట్రస్టు బోర్డు ద్వారా చందాలు లేదా విరాళాలు వస్తే దానికి తగిన అధికారిక రశీదు ఇచ్చి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పర్యవేక్షణలోనే ట్రస్టు బోర్డు సభ్యులు వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగానో, ప్రైవేట్ సొసైటీల పేరుతోనో చందాలు వసూలు చేయడం, తమకు ఇష్టమొచ్చినట్లు స్వతహాగా ఖర్చు చేయడం ఎండోమెంట్ యాక్ట్కు పూర్తిగా విరుద్ధం. మహా కుంభాభిషేకం వేళ అధికారుల ఆరా! ఈ వివాదం ఇలా ఉంటే, మంగళవారం (జూన్ 16) నుంచి ‘మహా కుంభాభిషేకం మహోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఇటువంటి పవిత్రమైన సందర్భంలోనే ఈ అక్రమ సేవాసంఘం వ్యవహారం బయటకు రావడంతో భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కడప ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఫోర్టో రాష్ట్ర కో చైర్మన్ ఎస్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సేవలో చేరిన తర్వాత ప్రత్యేక అర్హత పరీక్షలు లేవన్నారు.కానీ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సమంజసం కాదన్నారు. 20 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు మరోసారి పరీక్ష రాయమని చెప్పడం వారి అనుభవాన్ని, సేవలను అవమానపరచడమే అని ఆయన అన్నారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో అనేక రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పలు అంశాలపై తీర్మానం చేశారు. జూన్ 15, 16 తేదీల్లో ప్లకార్డులతో నిరసన, జూన్ 20 నుంచి ఎంపీలకు ప్రాతినిధ్యాలు అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తుపాకుల మురళి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, విద్యాసాగర్, శ్రీరాములు పాల్గొన్నారు. -
చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి
కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) అంకితభావంతో పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కడపలోని మానస ఇన్ సమావేశ మందిరంలో ఆదివారం ఇంటాక్ కడప చాప్టర్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కె. చిన్నపరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బ్రహ్మంగారిమఠంలో పాక్షికంగా దెబ్బతిన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహాన్ని (పురాతన కట్టడం) దాని సహజత్వం దెబ్బతినకుండా పునర్నిర్మించే బాధ్యతను ప్రభుత్వం ఇంటాక్ సంస్థకు అప్పగించారన్నారు. భవిష్యత్తులో సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి,కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీం బాషా, ఇంటాక్ కో–కన్వీనర్ పి.వి. సుబ్బారెడ్డి, రాజంపేట చాప్టర్ కన్వీనర్ వెంకటరమణ, డాక్టర్ ఓ.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు‘బెంగ’.. ఖాళీ ‘క్వార్టర్స్’ !
బద్వేలు: పట్టణ కేంద్రంలోనే ఉన్నా పగలే నిర్మానుష్య వాతావరణం.. చీకటి పడితే పోకిరీలకు కొండంత అండ.. ఇదీ బద్వేలు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుగంగ కాలనీ క్వార్టర్ల ప్రస్తుత దయనీయ స్థితి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో కళకళలాడిన ఈ ప్రభుత్వ భవనాలు, రెండు దశాబ్దాలుగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నయా అడ్డాగా మారాయి. విద్యాసంస్థలు, మున్సిపాలిటీ ఆఫీస్ నడుమ ఘోరం ఈ శిథిలావస్థకు చేరుకున్న తెలుగుగంగ క్వార్టర్లు పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల మధ్య ఉండటం గమనార్హం. ఒకవైపు ప్రముఖ బిజివేముల వీరారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణం, మరోవైపు తెలుగుగంగ ప్రధాన రహదారి వీధి.. ఇంకోవైపు అత్యంత సమీపంలోనే బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయ సముదాయం ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన లొకేషన్లలో ఉన్నప్పటికీ, ఈ సువిశాల ఖాళీ స్థలం పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉంటుంది. క్వార్టర్ల చుట్టూ ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో కంపచెట్లు విపరీతంగా పెరిగి చూడటానికి ఒక ‘చిట్టడవి’లా తయారైంది. ఈ చిట్టడవే ప్రస్తుతం మందుబాబులకు, పేకాట రాయుళ్లకు ప్రత్యేక రక్షణ వలయంలా ఉపయోగపడుతోంది. గదుల నిండా మద్యం బాటిళ్లు.. గంజాయి, వ్యభిచారం కలకలం! తెలుగుగంగ కాలనీలో నిర్మించిన ఈ 30కి పైగా క్వార్టర్ల భవనాలలో ఒక్కో దానికి ఐదారు గదులు ఉన్నాయి. ఈ విశాలమైన గదుల వసతి పోకిరీలకు మరింత సౌకర్యంగా మారింది. భవనాల గదుల లోపల, పైన ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొందరు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇక్కడ చేరి మద్యం సేవిస్తూ, పేకాట జోరుగా సాగిస్తున్నారు. ఈ పాడుపడిన క్వార్టర్లను ఆవాసాలుగా చేసుకుని కొందరు వ్యభిచారం కూడా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు కొందరు రిక్షా కార్మికులు, ఆకతాయిలు ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతూ డ్రగ్స్ దందాకు కూడా తెరలేపుతున్నారు. పోలీసుల గస్తీ.. శూన్యం! దారుణాలపై స్థానిక కాలనీవాసులు పలుమార్లు పోలీసులకు గట్టిగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులు మాత్రం పోలీసులు ఆ ప్రాంతంలో మొక్కుబడిగా గస్తీ నిర్వహించి, ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల గస్తీ నిలిచిపోవడంతో అల్లరి మూకలు మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కంపచెట్లను పూర్తిగా తొలగించి, అక్కడ పటిష్టమైన పోలీసు నిఘా మరియు శాశ్వత గస్తీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. బద్వేలు నడిబొడ్డున అసాంఘిక కార్యక్రమాలు మున్సిపల్ ఆఫీస్ పక్కనే పోకిరీల రాజ్యం కాలనీలో మద్యం, వ్యభిచారం, గంజాయి జోరు D M>ÓÆý‡t-ÆŠ‡ÞMýS$ çÜÒ$-ç³…ÌZ¯ól ™ðlË$-VýS$-VýS…VýS Æøyýl$z M>ÌS-±, ÒÆ>-Æð‡yìlz 1, 2 M>ÌS± {ç³fÌS °Ðé-ÝëË$ E¯é²Æ‡$$. CMýSPyìl MýS$r$…»êÌSMýS$ ^ðl…¨¯]l í³ÌSÏË$, Ð]l$íßæ-âýæË$ {ç³†Æøþ D ¿ýæÄ¶æ*-¯]lMýS M>ÓÆý‡tÆý‡Ï Ò$§ýl$-V>¯ól ™èlÐ]l$ ѧéÅçÜ…çܦ-ÌSMýS$, 糯]l$-ÌSMýS$ वे-âêÏÍÞ E…r$…-¨. AMýSPyýl °Æý‡…-™èlÆý‡… †ÇVóS AÌSÏÇ Ð]lÊMýS-ÌS¯]l$, AÝë…íœ$MýS ÔèæMýS$¢-ÌS¯]l$ ^èl*íÜ Ñ§éÅ-Æý‡$¦Ë$, ÝëÐ]l*¯]lÅ {ç³fË$ ¡{Ð]l ¿ýæÄ¶æ*…§ø-âýæ-¯]l-ÌSMýS$, Cº¾…§ýl$ÌSMýS$ VýS$Æý‡-Ð]l#-™èl$-¯é²Æý‡$. -
మేఘం మెరిసెను.. చినుకే కురిసెను!
● జిల్లా అంతటా వర్షం ● ఆరుతడి పంటలసాగుకు సమాయత్తం ● సత్తువ పంటలతో పాటు ఆరుతడి పంటల సాగుకు సన్నద్ధం ● నీటి వసతి ఉన్న రైతులు నారుమడులసాగుకు ఉపక్రమణ ● ఖాజీపేట మండలంలో అత్యధికంగా 94.8 ఎంఎం వర్షం ● అన్నదాతలల్లో చిగురించిన ఆశలు కడప అగ్రికల్చర్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన విస్తారమైన వర్షాలు పల్లెల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అక్కడక్కడ జల్లులు పడుతున్నప్పటికీ, తాజా భారీ వర్షంతో నేల పూర్తిగా పదును కావడంతో సాగు పనులను ప్రారంభించేందుకు అన్నదాతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆరుతడి పంటల సాగుకు ఇదే తగిన అదును జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ, కంది, పసుపు, మినుము వంటి ఆరుతడి పంటల సాగుకు ఇదే అత్యంత అనుకూలమైన సమయం (అదును) అని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో చాలా చోట్ల రైతులు ఆరుతడి పంటల సాగు కోసం ఇప్పటికే దుక్కి దున్నడం చేసి సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న ఆరుతడి, ఉద్యానవన పంటలకు ఈ వర్షపు నీరు అమృతంలా మారి ఎంతో మేలు చేసింది. సత్తువ విత్తనాల పంపిణీ ముమ్మరం.. నారుమడుల హడావుడి జిల్లావ్యాప్తంగా ఇటీవల అధికారులు పంపిణీ చేసిన పచ్చిరొట్ట ఎరువులైన జీలుగలు, జనుములు, పెసల విత్తనాల సరఫరా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ వర్షపు పదునును ఉపయోగించుకుని రైతులు వీటిని సత్తువ పంట కింద సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్ ప్రధాన పంట అయిన వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ’రైతు భరోసా కేంద్రాల’ ద్వారా ముమ్మరంగా సాగుతోంది. కేసీ కాలువతో పాటు పెన్నా నది పరివాహక ప్రాంతాలైన చెన్నూరు, ఒంటిమిట్ట, చాపా డు, రాజుపాలెం తదితర ఏరియాల్లో సొంత నీటి వసతి (బోర్లు, బావులు) ఉన్న కొంతమంది రైతులు ఇప్పటికే సత్తువ పంటలను సాగు చేసి, నారుమడుల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఈ నదీ పరివాహక ప్రాంతాలలో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున నారుమడులు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖాజీపేట మండలంలో అత్యధిక వర్షపాతం జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఓస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే అత్యధికంగా ఖాజీపేట మండలంలో 94.8 మిల్లీమీటర్ల (ఎంఎం) భారీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ మరి యు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షంతో ఖాజీపేట పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తగిన యాజమాన్య పద్ధతులు పాటించి ఖరీఫ్ పంటల సాగును ప్రారంభించాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. -
వంశీని హత్య చేసింది యజమాని రామసుబ్బారెడ్డే !
కడప అర్బన్: పక్కాగా స్కెచ్ వేసి అక్కుపల్లి వంశీ(26) అనే యువకుడిని అతని యజమానే దారుణంగా హత్య చేశాడనీ పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఈనెల 10న విన్యాస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చింతా రామసుబ్బారెడ్డి, తన భార్య మధురవాణితో తమ దగ్గర పనిచేసే డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. తరువాత గుట్టు చప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లో దాచేసి కారులో సోమశిల బ్యాక్ వాటర్స్లో మృతదేహాన్ని పడేయాలని భావించి రాజంపేట వైపు వెళ్లాడు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ రోడ్లో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీప్రాంతంలో పడేశారు. 11వతేదీన వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పీఎస్లో అదృశ్యం కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా ఫొటోలను జిల్లాలోని పోలీసులకు పంపించారు. సంఘటన స్థలంలో మృతదేహాన్ని స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, వంశీ తండ్రి మునెయ్యను పిలిపించి గుర్తుపట్టాక కడప రిమ్స్ వైద్యబృందం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తరువాత రామసుబ్బారెడ్డి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందం గాలింపుచర్యలు చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వంశీ ఆరునెలల క్రితమే రామసుబ్బారెడ్డి వద్ద డ్రైవర్ ఉద్యోగం చాలించి ఇంటివద్దనే వుంటున్నాడు. ఇటీవల వంశీని మళ్లీ డ్రైవర్గా పిలిపించారు. మరోవైపు రామసుబ్బారెడ్డికి, అతని భార్య మధురవాణితో విభేదాలు ముదిరిపోయాయి. ఇంకోవైపు ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే వంశీని హత్య చేశాడని సమాచారం. ఈహత్యకు మరో నలుగురు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలను తీసుకుంటామనీ కడప రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్ తెలియజేశారు. ● భయాందోళనలో ప్రజలు కడప అర్బన్: కడప నగరంలో మైనర్ డ్రైవింగ్ స్టంట్స్ రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రిమ్స్,శిల్పారామం మార్గంలో ఆదివారం సాయంత్రం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ బైక్ పై స్టంట్స్ చేశారు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్టంట్స్ వదలడంలేదు. కొద్ది నెలల క్రితం విమానాశ్రయం సమీపంలో బైక్ పై స్టంట్స్ చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బైక్ లకు ఎటువంటి నంబర్ ప్లేట్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు. గాలివీడు : మండల పరిధిలోని నూరివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెకు చెందిన మహిళా రైతు కె.సాలమ్మ, బి.శివారెడ్డిలకు చెందిన విద్యుత్ వైర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జలాశయాల్లో తగ్గుతున్న నీటి మట్టం
జమ్మలమడుగు : గండికోట, మైలవరం జలాశయాల్లో నీరు తగ్గిపోతుంది.రెండు నెలల కిందట గండికోటలో 20 టీఎంసీలు నిల్వ ఉండటంతో దిగువన ఉన్న మైలవరం జలాశయం, పైడిపాలెం, సర్వరాయసాగర్ ప్రాజెక్టులకు గండికోట ద్వారా నీటిని విడుదల చేశారు.దీంతో గండికోట జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం గండికోటప్రాజెక్టులో 17టీఎంసీల నీరు నిల్వ ఉంది. మైలవరం జలాశయంలో నీటి సామర్థ్యం 6.5టీఎంసీగా ఉంది. మైలవరం జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ కాలువలతోపాటు ఆర్టీపీపీ తాగునీటి అవసరాలకోసం జమ్మలమడుగు పెన్నానదిలోనికి నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం మైలవరం జలాశయంలో1658 టీఎంసీలు మాత్రమే మిగిలింది. బొమ్మెపల్లి ఎత్తిపోతల పథకానికి 28 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరి కొద్దిరోజులపాటు సరైన వర్షాలు పడకపోతే మైలవరం జలాశయం అడుగంటిపోవడంతోపాటు ఖరీఫ్లో రైతులు పంట సాగుచేస్తే నీరు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. -
‘సర్’సరా.. సాగుతోంది!
జమ్మలమడుగు: జిల్లాలో ఓటర్ల జాబితా ల్యాండ్ మ్యాపింగ్ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం (సర్) అత్యంత వేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు 2002 నుండి 2025 వరకు ఉన్న పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న డేటాను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. జూన్ 13వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 74.26 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు జూన్ 15వ తేదీ సోమవారం నుంచి జూలై 15 వరకు ఒక నెల రోజుల పాటు బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఇంకా 4.25 లక్షల మందికి పైగా మ్యాపింగ్ అవసరం! ప్రింటెడ్ జాబితా పంపిణీ.. 2002 రికార్డులతో నిఘా సోమవారం నుండి క్షేత్రస్థాయికి వెళ్లే బీఎల్ఓలు తాము మ్యాపింగ్ చేసిన ఓటర్ల జాబితాను ప్రింట్ తీసి నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దే అందజేస్తారు. 2002లో ఓటు హక్కు లేని వారు కూడా ఈ సర్వే ద్వారా తమ స్థానికతను నిరూపించుకోవచ్చు. తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? 2002 నాటికి వారు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేస్తూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గతంలో ఓటు హక్కు ఉండి, ప్రస్తుతం జాబితాలో పేరు లేకపోతే.. ‘మీకు ఓటు హక్కు ఎందుకు తొలగించబడింది? కారణాలు ఏమిటి?‘ అనే విషయాలపై బీఎల్ఓలు లోతుగా ఆరా తీస్తారు. ఈ సర్వే ద్వారా ఓటర్ల లిస్టులో ఉన్న అక్షరదోషాలు, తప్పు అడ్రసులు, వయసు మరియు ఫొటోలకు సంబంధించిన తప్పు ఒప్పులను సరిదిద్దుకోవచ్చు. అలాగే డూప్లికేట్ (బోగస్) ఓట్లను మరియు చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి పూర్తిగా తొలగిస్తారు. అధికారుల సన్నద్ధత.. నూతన నమోదుకు 30 రోజుల ఛాన్స్! బీఎల్ఓలు క్షేత్రస్థాయి సర్వే సజావుగా నిర్వహించడానికి వీలుగా జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష చేతుల మీదుగా గొడుగు, టోపీ, వాటర్ బాటిల్, రైటింగ్ ప్యాడ్, స్కేల్, పెన్సిల్, రబ్బరు వంటి 13 రకాల వస్తువులతో కూడిన కిట్లను అధికారులకు అందజేశారు. సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఆమె హెచ్చరించారు. బీఎల్ఓలు సేకరించిన డేటా ఆధారంగా తయారుచేసే ఓటర్ల నూతన జాబితాను ప్రభుత్వం పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలలో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం కోసం ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రత్యేక సమయాన్ని కేటాయించనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వైఎస్సార్సీపీతో పాటు కూటమి నాయకులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించారు. కడప జిల్లాలో 74.26% పూర్తి 13 రకాల కిట్లతో నేటి నుంచి ఇంటింటికీ బీఎల్ఓలు వైఎస్సార్ కడప జిల్లా ఓటర్ల మ్యాపింగ్ ‘సర్’ వివరాలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ పూర్తి శాతం ఇంకా చేయాల్సినవి బద్వేలు 2,22,043 1,69,454 76.32% 52,589 కడప 2,83,973 1,89,288 66.66% 94,685 పులివెందుల 2,30,276 1,82,535 79.27% 47,741 కమలాపురం 2,06,701 1,69,240 81.88% 37,461 (టాప్) జమ్మలమడుగు 2,45,095 1,87,471 76.49% 57,624 ప్రొద్దుటూరు 2,50,513 1,63,594 65.30% 86,919 (లీస్ట్) మైదుకూరు 2,13,852 1,65,538 77.41% 48,314 మొత్తం 16,52,453 12,27,120 74.26% 4,25,333ముఖ్యాంశాలు: జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా కమలాపురం (81.88%), అత్యంత తక్కువగా ప్రొద్దుటూరు (65.30%) నమోదు. (ఈనెల 13వతేదీ నాటికి మ్యాపింగ్ అయిన డేటా) జిల్లాలోని మొత్తం ఓటర్లు : 16,52,453 మంది ఇప్పటివరకు పూర్తయిన మ్యాపింగ్ : 12,27,120 మంది 74.26 శాతం ఇంకా చేయాల్సిన మ్యాపింగ్ : 4,25,333 మంది -
18న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప వైఎస్సార్ సర్కిల్ : ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఈవో సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీలు), అలాగే వైఎస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. నేడు ’డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’కడప కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 15వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలోనూ ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీ ర్ దష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్కు కాల్ చేయవచ్చు. సౌత్ జోన్ అండర్–16 క్రికెట్ పోటీలకు ఎంపిక మదనపల్లె సిటీ : సౌత్ జోన్ అండర్–16 బాలుర అంతర్ జిల్లా మల్టీ డే క్రికెట్ పోటీలకు మదనపల్లెకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ జనార్థన్ తెలిపారు. షారిక్ అక్తర్ , తేజేష్ , ఎస్ఎండి మౌలా , వి.జె.నోయల్ ఎంపికై నట్లు తెలిపారు. జులై 2 వరకు వాల్మీకిపురంలోని జీవీఎస్సీఎస్ క్రికెట్మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు. ‘మిట్స్’కు 4ఏ రేటింగ్కురబలకోట : కేరీర్స్ ర్యాంకింగ్స్–26లో మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి 4ఏ రేటింగ్ దక్కినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు వంటి కీలక అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జాతీయస్ఠాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించడానికి కారణమైన సిబ్బందిని ఛాన్సలర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి అభినందించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చుకడప కోటిరెడ్డి సర్కిల్ : విద్యార్థులు బట్టీ చదువులకు పరిమితం కాకుండా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని భారతీయ రైల్వేస్ నాగపూర్ జాయింట్ జనరల్ మేనేజర్ గాలి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం తొగటవీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కింద నగదు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు మాత్రమే సాధించడం కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, ఆలోచన సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమన్నారు. విద్య అనేది జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, ఏ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వారైనా విద్య ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. సంఘం నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కల్యా సుధాకర్, పల్లా నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో తాలూకా సీఐ నరసింహరాజు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు, ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి టేకూరు సుదర్శన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లా మురళీకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు చౌడం సూరిబాబు పాల్గొన్నారు. -
చమర్తి దౌర్జన్యాలకు చరమగీతం!
● రాజంపేట టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి ● రణరంగంగా మారిన మంటపంపల్లిఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీరుపై సొంత పార్టీ సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లిలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ స్వామి నివాసంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ముఖ్య నేతలు అత్యవసర అసమ్మతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ గెలుపు కోసం, జెండా మోసి కష్టపడిన నిబద్ధత గల నాయకులను, కార్యకర్తలను ఇన్ఛార్జ్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఇసుక, మట్టి మాఫియా శక్తులను చమర్తి చేరదీస్తున్నారని.. వారికే కీలక పదవులు కట్టబెడుతూ, వారు చెప్పిందే వేదంగా పాలిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ధ్వంసం.. నేతల బాహాబాహీ పోరు చమర్తిపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఇన్ఛార్జ్ వర్గానికి చెందిన జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల బాషా, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మరికొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి దూసుకొచ్చారు. తమకు సమాచారం లేకుండా ఒంటిమిట్టలో సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సీనియర్ నేతలతో వాదనకు దిగారు. సమావేశాన్ని బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి బాహాబాహీ వరకు దారితీసింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఇరువర్గాలకు తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో అసమ్మతి నాయకులు తమ సమావేశాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. నాయకత్వ లోపం బయటపడుతుందనే భయం చమర్తి వర్గీయుల దాడితో సమావేశం రద్దయిన అనంతరం, టీడీపీ సీనియర్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, ఒంటిమిట్ట నేత కిరణ్ స్వామి సంయుక్తంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చమర్తి జగన్ మోహన్ రాజు నాయకత్వ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే తమ సమావేశాన్ని రౌడీయిజంతో భగ్నం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలతో అస్సలు సంబంధం లేని చమర్తి అనుచరులను, సొంత కుటుంబ సభ్యులను మండల ఇంచార్జ్లుగా నియమించి.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కరుడుగట్టిన కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని హెచ్చరించారు. ఇంచార్జ్ పదవి చూసుకుని గర్వంతో ఊగిపోతూ పార్టీ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న చమర్తి జగన్ మోహన్ రాజు అక్రమాలపై త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని నేతలు స్పష్టం చేశారు. -
గంగమ్మ ఆలయంలో చోరీ
తొండూరు : తొండూరు మండలంలోని గంగనపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ గుడిలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. ఆదివారం ఉదయం అర్చకుడు ఆలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. హుండీలో ఎంత నగదు ఉందనే విషయం తెలియరాలేదు. కొన్ని వారాలుగా హుండీ ఆదాయాన్ని లెక్కించలేదు. దీంతో హుండీలో ఎక్కవ మొత్తంలో నగదు ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో వెండి నగలు అపహరణ ముద్దనూరు : మండలంలోని మంగపట్నం గ్రామంలో వెలసిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో అమ్మవారి వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. స్థానిక హెడ్కానిస్టేబుల్ రమేష్ సమాచారం మేరకు శనివారం రాత్రి దుండగులు ఆలయం తలుపులు పగలగొట్టి వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. అర్చకుడు మహేశ్వరరావు ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లాడ్జీల్లో తనిఖీలు కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం లాడ్జీల్లో తనిఖీ చేశారు. ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జీల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్ ను పరిశీలించారు. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. -
ఏపీ ఎయిమ్స్ యాప్ను నిలిపివేయాలి
కడప కార్పొరేషన్: ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా రైతాంగానికి సరిపడా ఎరువులను వైఎస్సార్ కడప జిల్లాలో పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం యాప్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన మేరకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. వరి పంటకు సంబంధించి ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు ఎరువులు అవసరం కాగా ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కేవలం ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులకు సరిపోవడం లేదన్నారు. శాస్త్రవేత్తలు సిఫారసు మేరకు ఒక ఎకరాకు 100 నుంచి 110 కేజీల యూరియాను అధిక దిగుబడుల కోసం తప్పనిసరిగా వాడాలని నిబంధనలు ఉండగా,ప్రస్తుత నూతన విధానం ద్వారా కేవలం 60 నుంచి 70 కేజీలు మాత్రమే వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయడం సరికాదన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా కేవలం 15,000 మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైయస్సార్సీపీ నాయకులు పి. మహేశ్వర్రెడ్డి, ఎం. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. కమలాపురం : కమలాపురం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల సుమిత్రా భర్త రాజశేఖర్ రెడ్డిపై దాడి చేసిన సునీల్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి రాజశేఖర్రెడ్డి భోజనం చేశాక వాకింగ్ చేస్తుండగా అదే గ్రా మానికి చెందిన ఉప్పర సునీల్ కత్తితో పొడిచాడన్నారు. శరీరం వెనుక, ముందు వైపు కూడా దాదాపు 12 చోట్ల పొడిచాడన్నారు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ రెడ్డి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న కేక్ కట్ చేసే నేపథ్యంలో గ్రామంలోని యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి వారిని మందలించి ఇంటికి పంపారు. అప్పటి నుంచి రాజశేఖర్రెడ్డిపై పగ పెంచుకున్న సునీల్ దాడికి పాల్పడి ఉండాడని గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నారు. భాధితుడి భార్య సుమిత్రా ఫిర్యాదు మేరకు సునీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. జమ్మలమడుగు రూరల్ : ప్రమాదవశాత్తు నాపరాయి గనిలో పడి గురుకుమార్ (20) అనే యువకుడు మృతి చెందిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. ఎస్ఐ హైమావతి వివరాల ప్రకారం.. మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన భీమునిపాటి గురుకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అతడి తమ్ముడు భీమునిపాటి గురుకుమార్ సిమెంట్ పని చేసి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అన్న గురు రాత్రి అయినా ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. గురు బయటకు వెళ్లాడని చెప్పడంతో అన్నను వెతుకుతూ బయటకు వెళ్లారు. గంట తరువాత అన్న వచ్చాడు. కానీ అన్న కోసం వెళ్లిన గురుకుమారు రాలేదు. దీంతో తండ్రి పెద్ద గురుస్వామి మైలవరం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం జమ్మలమడుగు మండల పరిధిలోని పొన్నతోట నాపరాయి గునుల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలపడంతో మృతదేహన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతుడు గురుకుమార్గా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తల్లిని దూషించాడనే.. చంపేశాడు!
మైదుకూరు : తన తల్లిని దూషించినందుకు మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గాలి సుదర్శన్రెడ్డి.. అదే కాలనీకి చెందిన సంపంగి నాగేంద్ర అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంపంగి నాగేంద్ర అదే కాలనీకి చెందిన సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యంగా అతని తల్లిని పదే పదే అవమానకరంగా దూషిస్తూ అసభ్య పదజాలంతో వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్రెడ్డి నాగేంద్రను హత్య చేయాలని మనసులో పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఈనెల 7న తెల్లవారుజామున కాలనీలోని ఆలయం ముందున్న అరుగుపై నిద్రిస్తున్న నాగేంద్రపై మచ్చు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతుడి సోదరుడు నాగేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అర్బన్ సీఐ కె.రమణారెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుదర్శన్రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. శనివారం మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిలోని ఎర్ర చెరువు సమీపంలో సుదర్శన్రెడ్డిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడని, అతడు చూపించిన ప్రదేశం నుంచి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐలు కె.చిరంజీవి, కె.వెంకటరమణ, ఏఎస్ఐ శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శివభాస్కర్రెడ్డి, కానిస్టేబుల్ నవీన్కుమార్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.హత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
ఎర్రగుంట్ల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి కుటుంభ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని శనివారం విశ్వభార్గవరెడ్డి కుమారుడు యర్రంరెడ్డి ఉదయ్కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడద్దని చెప్పారు. 17 నుంచి ఏపీఎల్ మ్యాచ్లుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియల్ లీగ్ ఐదవ సీజన్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 9 మ్యాచ్లు కడపలో జరుగుతాయన్నారు. ఇందులో విజయవాడ సన్సైనర్స్, తుంగభద్ర వారియర్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, బీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు రూ.7 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ మ్యాచ్లకు రోజుకొక అతిథితో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయడంతోపాటు టాస్ వేయడం జరుగుతుందన్నారు. మ్యాచ్లో సినీ ప్రముఖులైన గాయకులు సునీత, సింహా, గీతామాధురి, కృష్ణచైతన్య, సంగీత వాయిద్యకారులు శ్రీహరి పాల్గొని ప్రేక్షకులను అలరిస్తారన్నారు. ఈ మ్యాచ్లను తిలకించేందుకు ఎంట్రీ ఉచితమని వివరించారు. గ్యాలరీల్లో ప్రేక్షకులకు కావాల్సిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మునికుమార్రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్, స్టేడియం చైర్మన్ శ్రావణ్రాజ్రెడ్డి, వైస్ చైర్మన్ పృథ్వి, స్టేడియం కన్వీనర్ సంజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాలా దోపిడీ!
● ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోత ● 30 శాతం వరకు పెంపుతో సామాన్యుడి వెతకడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ చదువులు మధ్యతరగతి తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వేటను మొదలుపెట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచేయడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1,86,514 మంది విద్యార్థులలో సగానికి పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు.ఫీజుల దోపిడీ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల ఆవేదనే నిదర్శనం. ఎల్కేజీలో చేర్పించాలంటేనే భయం కడప నగరంలోని ముత్యాలమ్మకుంటకు చెందిన రాజేష్ అనే లబ్ధిదారుడు తన పాపను ఎల్కేజీలో చేర్పించేందుకు ఒక కార్పొరేట్ స్కూల్కు వెళ్లగా.. కేవలం స్కూల్ ఫీజే రూ.28,000 అడిగారు. దీనికి తోడు అడ్మిషన్ ఫీజు, పుస్తకాల ఖర్చులు కలిపి ఒక్కసారిగా రూ.35,000 కట్టమనేసరికి అంత ఫీజు ఎలా కట్టాలో తెలియక భయమేస్తోందని ఆయన వాపోయారు. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి 7 వేలకు పెంపు నగరానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది 3వ తరగతికి రూ.25,000, 5వ తరగతికి రూ.28,000 చొప్పున ఫీజు కట్టాడు. కానీ ఈ ఏడాది ఆ ఫీజులను ఒక్కసారిగా రూ.32,000 మరియు రూ.35,000లకు పెంచేశారు. ఇవి కాకుండా కేవలం పుస్తకాల కోసమే అదనంగా రూ.8 వేల నుండి 10వేలు అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూల్ భారం కడప నగరంలో నివసించే ఒక మేసీ్త్ర తన కుమారుడికి 8వ తరగతిలో గతేడాది రూ. 35,000 ఫీజు చెల్లించాడు. ఈ ఏడాది 9వ తరగతికి వచ్చేసరికి ఆ ఫీజును ఏకంగా రూ. 45,000లకు పెంచేశారు. దీనికి తోడు పుస్తకాల కోసమే రూ. 8 వేలకు పైగా వసూలు చేశారు. డీజిల్ సాకుతో బస్ ఛార్జీల పెంపు ట్యూషన్ ఫీజులతో పాటు రవాణా, ఇతర సామగ్రి పేరుతో ప్రైవేటు స్కూళ్లు చేస్తున్న నిలువు దోపిడీ సామాన్యుడిని అప్పులపాల్జేస్తోంది. గతేడాది రూ. 10,000 ఉన్న స్కూల్ బస్ ఛార్జీలను ఈ ఏడాది రూ. 15,000లకు పెంచేశారు. దీనిపై యాజమాన్యాలను నిలదీస్తే.. డీజిల్ ధరలు పెరిగాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. సిలబస్ పేరుతో బ్లాక్మెయిల్ పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, యూనిఫాం, బూట్ల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు కొందామంటే.. శ్రీఈ బుక్స్ మా స్కూల్ సిలబస్కు సంబంధించినవి కావు, మా వద్దే కొనాల్ఙి అంటూ యాజమాన్యాలు కచ్చితంగా నియమం పెడుతూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఫౌండేషన్ కోర్సులు, ప్రాజెక్టుల పేరిట హడావుడి చిన్న వయసు నుంచే ఐఐటీ–జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ పాఠశాలలు సరికొత్త హడావుడిని సృష్టిస్తూ, రెగ్యులర్ ఫీజుకు అదనంగా వేలాది రూపాయలను ఒకేసారి రాబడుతున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రాజెక్టు వర్కులు, స్మార్ట్ క్లాసుల పేరిట నిరంతరం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.విద్యాశాఖ తనిఖీలు చేపట్టాలి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – అంకన్న, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
కడప, రాజంపేటలో రైల్వే జీఎం పర్యటన
రాజంపేట/కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేస్టేషన్లలోని పలు విభాగాలను పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వీటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు రాజంపేటలో గుంతకల్ డీఆర్యూసీ సభ్యుడు తల్లం భరత్కుమార్రెడ్డి.. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వివిధ రైల్వే సమస్యలపై రూపొందించిన లేఖలను అందజేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు. జీఎంను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడగలం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ నాయకుడు ధారా వెంకటరమణ తదితరులు ఉన్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్ తదితరులు తమ ప్రాంత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కడపలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కడప డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ వినీత్కుమార్, ఇతర అధికారులు సురేష్కుమార్, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, మనోజ్, సుదర్శన్రెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, మోహన్రెడ్డి, జనార్దన్ పాల్గొన్నారు. -
అవయవ దానం చేసి.. ఆదర్శంగా నిలిచి..
బ్రహ్మంగారిమఠం : తాను చనిపోయినా.. మరొకరికి జీవితాన్ని ఇవ్వాలని సంకల్పించాడు. తన అవయవాలను దానం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు భోగిరెడ్డి సిద్దారెడ్డి (40) ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తేదీన బైక్లో కమలాపురం నుంచి ఖాజీపేటకు వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. అతన్ని హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అవయవాలలోని కళ్లు, కిడ్నీలు, గుండెలను దానంగా ఇవ్వడం జరిగిందని సిద్దారెడ్డి తమ్ముడు డోజర్ సిద్దారెడ్డి తెలిపారు. మృతి చెందిన సిద్దారెడ్డికి భార్య, చిన్న పిల్లలైన బాబు, పాప ఉన్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే పరామర్శ భోగిరెడ్డి సిద్దారెడ్డి మృతదేహానికి నివాళి అర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి ఆదివారం వస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఎం. రత్నకుమార్యాదవ్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 1న అనారోగ్యం కారణంగా జిల్లా ఆస్పత్రిలో చేరిన అతను తన పేరు బాలగంగాధర్ (56) అని ఐపీ రిజిస్టర్లో రాయించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన బంధువులు జిల్లా ఆస్పత్రిలోని అవుట్ పోస్ట్లో సంప్రదించాలని ఔట్ పోస్ట్ ఇన్చార్జి షబ్బీర్ బాషా తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఒక ఆటో చోరీ చేసిన కేసులో శనివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకర్ల సమావేశంలో మన్నూరు సీఐ ఎస్.లింగప్ప వివరాలు వెల్లడించారు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న వినాయక గుడి వెనుక వైపు పార్కింగ్ చేసి ఉంచిన ఆటో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చోరీకి గురి అయింది. దీనిపై బాధితులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేపట్టారు. నిందితుడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్లో నివాసం ఉంటున్న చిట్టివడ్డి మురళీ కృష్ణ అని తెలియడంతో అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. నిందితుడిపై ఇది వరకే కదిరి టౌన్ పీఎస్, పీలేరు పీఎస్, తిరు మల 2 టౌన్ పీఎస్లో ఆటో, మోటార్ సైకిల్ చోరీల కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. ఆటో, బైక్ రికవరీమైదుకూరు : మైదుకూరు పట్టణంలో ఆటో, ఓ మోటార్ బైక్ చోరీ కేసులో ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులు అనే నిందితుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తన కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. మైదుకూరులో గత నెల 29న ఆటో, ఈ నెల 3న మోటార్ బైక్ చోరీకి గురి కాగా వాటి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసుల్లో ఉన్న ఇద్దరు నిందితుల్లో జగనన్న కాలనీకి చెందిన ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులును మైదుకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన మరో నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన ఆటో, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇడగొట్టు రాఘవేంద్రపై ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో రెండు దొంగతనాల కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రాజంపేట ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
రాజంపేట : రాజంపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. సూపరింటెండెంట్ పీవీఎన్ రాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్టకు చెందిన 45 ఏళ్ల వయసు కలిగిన వివాహిత గురువారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె కుడి తొడపై పెద్దగడ్డ ఉంది. దానిని ప్రాంతీయ వైద్యుల సలహాతో డాక్టర్ పి.వెంకటేశ్వరరాజు, అనస్తీషియా డాక్టర్ శిరీష, సిస్టర్ సరళ, విజయ్కుమార్, ప్రియాంక, సహాయకుడు భార్గవ్, శ్రీలత ఆపరేషన్ పూర్తి చేశారు. గడ్డ శ్యాంపిల్ను పరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు పంపించారు. శనివారం రోజు ఆమెను డిశ్చార్జి చేశారు. కాగా ఈ మహిళ గడ్డతో బాధపడుతూ అనేక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఆమె రాజంపేట ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ పీవీఎన్ రాజును సంప్రందించారు. ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేశారు. అనంతరం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ పీవీఎన్ రాజు, ఆసుపత్రి సిబ్బంది సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. గడ్డ బరువు కేజీ ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ పీవీఎన్ రాజు మాట్లాడుతూ ఆపరేషన్ అనంతరం రోగి ఆరోగ్యకరంగా ఉన్నారని, ఆమెను డిశ్చార్జి కూడా చేశామన్నారు.తొడపై ఉన్న కేజీ గడ్డ తొలగింపు -
‘ఆది నారాయణరెడ్డి .. ఓ చిల్లర వ్యక్తి’
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఓ చిల్లర డాన్ అని, డబ్బుల కోసం దౌర్జన్యాలు, గుండాయిజం చేసి ఫ్యాక్టరీల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి చిల్లర తీసుకునే వ్యక్తి అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది అంటేనే అబద్ధం, అరాచకమని అలాంటి వ్యక్తికి.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే.. దాల్మియా కంపెనీ ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశ పడి దాల్మియా బాధిత రైతుల కుటుంబాలను తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి.. ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే అన్నారు. దాల్మియా రెండో ప్లాంట్ కోసం చుట్టు పక్కల గ్రామాల ఎన్విరాన్మెంట్ ఓపెన్ ఫోరంగా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి.. చివరకు దాల్మియాకు దాసోహం అయ్యారన్నారు. అదే విధంగా ఉన్నత స్థానంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం దాల్మియా బాధిత రైతులకు అన్యాయం చేశారన్నారు. దాల్మియా యాజమాన్యం పెద్దలు.. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని తనకు హామీ పత్రం ఇచ్చిన తర్వాతనే.. ఈ సమావేశానికి రావడం జరిగిందని నెల రోజుల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని, గ్రామాలను మార్చాల్సిన అవసరం లేదంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించి రైతులకు, ప్రజలకు మోసం చేశారన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, బీసీ నాయకుడు సుబ్రమణ్యం, తలమంచిపట్నం వినయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి అంతానికి ఇది ఆరంభం
● వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీల సక్సెస్తో కూటమిపై వ్యతిరేకత ఎంతుందో తెలిసింది ● తిరుపతిలో టీడీపీ విజయోత్సవ సభలో బాబు చెప్పినవన్నీ అబద్దాలే ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నుంచి కురుపాం వరకూ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో నిన్న జరిగిన ర్యాలీలతో తెలిసిపోయిందన్నారు. కూటమి పాలన అంతానికి ఇది ఆరంభమన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ర్యాలీలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఈ సారి కూటమిగా వచ్చిన మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో తాము ఎంత ఎంత నష్టపోయామో ప్రజలు లెక్కలేసుకుంటున్నారన్నారు. ‘మీ హామీలు ఏమయ్యాయి... చంద్రబాబు’ అని రాష్ట్ర ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో రైతులను, మహిళలను, యువతను, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతనే లేదని, ప్రతి క్షణం మోసం, ప్రతి పనిలో దగా.. అంతా స్కామ్లమయమేనని ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి, సంక్షేమం కాదని, పచ్చి అబద్ధాల ప్రచారమన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వమని’ చెప్పుకునే కూటమి పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో లక్షల మంది యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రతి హామీని గుర్తుంచుకుంటున్నారని, ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారని హెచ్చరించారు. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, వ్యతిరేకతకు అద్దంపట్టాయి... వారి ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలను పరిశీలిస్తే....కూటమికి కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, బద్వేలు ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని, ఆ సభ ప్రభుత్వ పతనానికి వీడ్కోలు సభలా అనిపించిందన్నారు. రెండేళ్లయినా ఇంకా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, వైఎస్ జగన్ నామస్మరణ చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అన్నివర్గాల అండ, ప్రజాబలం, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రజలకు ... వారికి తోడుగా నిలబడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఫయాజ్ పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం!
● 8.50 లక్షల ఇళ్ల పూర్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ● మంత్రి కొలుసు పార్థసారథి ప్రొద్దుటూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్లో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను మంత్రి నిశితంగా పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలను వెలికితీసి నిధులు పక్కదారి పట్టించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల ఇళ్ల లక్ష్యం రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ రంగాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేస్తామని, ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, తహసీల్దార్ ఉదయభాస్కర్, హౌసింగ్ డీఈలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. -
కొండకింద ఊరు.. గుర్తింపుకోసం పోరు !
గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం ‘పెద్ది’ సినిమాలోని కొండకింద ఊరును తలపిస్తోంది. ఈ ఊరు పరిధిలో సుమారు 328 మంది రైతులకు సంబంధించి 1800 వందల ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల వరకు అంటే.. కూటమి కొలువుదీరక ముందు వరకు రెవెన్యూ రికార్డుల్లో ఊరు భద్రంగా ఉంది. భూములకు, వన్బీలు, ఆండంగ్లు, మ్యూటేషన్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీరి బతుకు దుర్భరంగా మారింది. ఏకంగా ఊరంతా రెవెన్యూ రికార్డుల్లో మాయమైంది. ఆన్లైన్లో గ్రామానికి సంబంధించిన ఒక్క రైతు భూమి కనిపించడం లేదు. దీంతో రెండేళ్లుగా ఆగ్రామంలో ఒక్కరికి కూడా రెవెన్యూ సేవలు అందకపోగా రైతులకు సంబంధించిన వ్యవసాయ పథకాలు అందడం లేదు. తాజాగా ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లోనూ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి చెందిన వేలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫలితంగా గ్రామానికి చెందిన328 మంది రైతులు రైతు గుర్తింపు కార్డుల కోసం యుద్ధమే చేస్తున్నారు. రెండేళ్లుగా రెవెన్యూ సేవలు బంద్ చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబందించి రెండేళ్లుగా రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలోనూ చిట్టిబోయనపల్లె భూములకు సంబందించి ఎటువంటి మ్యూటేషన్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో అడంగల్, ఒన్బీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకమీదట రైతులకు రైతు భరోసా పథకం వర్తించాలంటే తప్పనిరిగా రైతుగుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా 6125 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్సైట్లో నమోదు చేశారు. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగకపోవడం విచారకరం. -
ప్రజలను నిండా ముంచిన కూటమి
పులివెందుల రూరల్ : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జనాలకు వెన్నుపోటు పొడిచిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నప్పటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, పరిశ్రమలు ఏర్పాటు గానీ చేయలేదని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వారిపై కేసులలో పెడుతున్నారని మండిపడ్డారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఇలా అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్లో ప్రజల వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజా దర్బార్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
15 నుంచి ఆందోళనలు
ఎర్రగుంట్ల : విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరాల కోసం ఈ నెల 15 నుంచి దశల వారీగా చేస్తున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీపీపీలో తన యూనియన్ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.నేడు కవితా పురస్కార సభ ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేటలోని శ్రీకోదండరామస్వామి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పల్లా జాతీయ కవితా పురస్కారం–2026 సభ నిర్వహించనున్నట్లు యువ సాహితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది అనంతపురానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు ఉమ్మడిశెట్టి రాధేయ రాసిన పావుకోళ్లు కవితా సంపుటికి పురస్కారం దక్కిందని వివరించారు. సాహితీ మిత్రులు సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా రైతుకు పురస్కారం కడప అగ్రికల్చర్: పెండ్లిమర్రి మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పి.రాజశేఖర్కు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ స్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అభ్యుదయ రైతు’ పురస్కారాన్ని అందజేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) సత్యనారాయణ చేతుల మీదుగా రైతు రాజశేఖర్ ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకున్నారు. రైతు పి.రాజశేఖర్ సాధించిన ఈ విజయానికి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డాక్టర్ వి.శిల్పకళ, సిబ్బంది ఆయనను శనివారం ఘనంగా సత్కరించారు. గిరిజన బిడ్డకు ఐఐటీలో సీటు వేంపల్లె : బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన బంజారా గిరిజన బిడ్డ ధార్మిక్ వెంకట్ నాయక్ చైన్నె ఐఐటీలో సీటు దక్కించుకున్నారు. శనివారం వేంపల్లె జెడ్పిటీసీ రవికుమార్ రెడ్డి ధార్మిక్ వెంకట నాయక్ను అభినందించారు. ఐఐటీలో ఆలిండియా 27వ ర్యాంకు సాధించి సీటు పొందడం సంతోషకరమైన విషయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రమేష్ నాయక్, తావు నాయక్ పాల్గొన్నారు. -
మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతా బాయి
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం(జోన్–4) రీజనల్ డైరెక్టర్గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రీజనల్ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ స్థానంలోకి డాక్టర్ గీతాబాయి రానున్నారు. డాక్టర్ నాగరాజుకు ఆర్డీగా పదోన్నతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పని చేస్తున్న డాక్టర్ నాగరాజుకు రీజినల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈయన గుంటూరు(జోన్ –3) ఆర్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు. కడప ఆర్డీగా రావడానికి ప్రయత్నాలు కాగా కడప ఆర్డీగా డాక్టర్ గీతా బాయిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడికి ఆర్డీగా రావడానికి ఒకరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెద్ద స్థాయిలో పావులు కదిపితే ఆ అధికారి ప్రయత్నం ఫలిస్తుందని, లేదంటే ఇక్కడికి ఆర్డీగా గీతాబాయి రావడం తథ్యం అనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఈ నెల 30తో తెరపడనుంది. పసికందు మృతదేహంపై విచారణకడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ సమీపంలో ముళ్ల పొదల్లో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహాన్ని గుర్తుతెలియని వారు పడేసిన సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన పవన్, సింహాద్రిపురానికి చెందిన దివ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భవతిగా ఉన్న దివ్య ప్రసవ వేదనతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నెల 8న దివ్యకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అక్కడ నుంచి కడపలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 10న ప్రైవేట్ ఆసుపత్రి వైద్య బృందం దివ్య ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆపరేషన్ ద్వారా మగ బిడ్డను ప్రసవింపచేశారు. అయితే.. అప్పటికే మగబిడ్డ విగత జీవిగా మారిపోయాడు. అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్న నరసింహులు చేతికి పసికందు మృతదేహాన్ని తండ్రి పవన్ దహన సంస్కారాలు చేయాలని అప్పగించాడు. అందుకు రూ.1500 డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్ నరసింహులు మద్యం తాగి పసికందు మృతదేహాన్ని వినాయకనగర్లోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ మృతదేహాన్ని తమ నోటికి కరిపించుకొని కుక్కలు తీసుకెళ్తూ ఉండగా స్థానిక ప్రజలు గమనించి వెంటపడ్డారు. కుక్కలు మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాయి. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ సెల్కే నచ్చితే విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా సీఐ నరసింహారాజు, ఎస్సై రఫీ తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. సెక్యూరిటీ గార్డ్ నరసింహులును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలియజేశారు. పోలీసుల అదుపులో పరారైన జీవిత ఖైదీకడప అర్బన్ : ౖవెఎస్ఆర్ కడప జిల్లా కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తూ ఈనెల 11వ తేదీన తెల్లవారుజామున తిరుమల ఎక్స్ప్రెస్లో గూడూరు సమీపంలో ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన జీవిత ఖైదీ సాకే రాజ్కుమార్ను ప్రొద్దుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది తప్పిదమా? లేక రాజ్ కుమార్ ఎస్కార్ట్ సిబ్బంది కన్నుగప్పి పరారయ్యాడా? అనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. పోలీసు గాలింపు చర్యల్లో ఎట్టకేలకు 24 గంటల్లోపే.. ఖైదీని అదుపులోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం జరిగింది. సంఘటనలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
– సోషల్ మీడియాలో వీడియో వైరల్ జమ్మలమడుగు : తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ్రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణ పరిధి బెడుదూరుకు చెందిన మనోజ్ శుక్రవారం వీడియో రికార్డు చేసి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. స్థానికులు ఆయనను తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి బంధువుల వివరాల ప్రకారం.. మనోజ్ గతంలో బెడుదురులో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత భూమి విక్రయించిన రైతు బంధువులైన గురుశేఖర, లక్షుమయ్య రెండెకరాల భూమిని తమకు తిరిగి ఇవ్వాలంటూ మనోజ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతోపాటు పోలీసులను ఆశ్రయించారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ్ వద్ద పంచాయితీ పెట్టించారు. ఈ కేసుకు సంబంధించి మనోజ్ హైకోర్టు నుంచి ఎస్ఐకి నోటీసులు పంపించారు. దీన్ని మనసులో పెట్టుకుని ఎస్ఐ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎస్ఐతోపాటు మరికొందరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి మనోవేదనకు గురి చేస్తుండటంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్లో ఉన్న 268 టన్నుల స్టీల్ దొంగతనం విషయం హౌసింగ్ పీడీతోపాటు మరికొందరి అధికారుల పాత్ర ఉందని ఈ కేసులో సస్పెండ్ అయిన రూరల్ ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసు కేసు నమోదైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పీడీ సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం తాను ఊరు వదిలి వెళ్లానని చెబుతూ శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎవరికి స్టీల్, సిమెంట్ అదనంగా ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిల్వలను అలాగే ఉంచాలని హౌసింగ్ ఎండీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గతేడాది విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి స్టీల్ నిల్వలు ఉన్నా యని ధ్రువీకరించారన్నారు. ఈ ఏడాది మొదట్లోనే స్టీల్ మాయమైందన్నారు. అధికారులు 268 టన్నులు మాయమైనట్లు చెబుతున్నారని, వాస్తవానికి 212 టన్నులు మాత్రమే అని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ జయ నరసింహులు, రవికుమార్, ఏఈ టీకే ప్రతాప్రెడ్డి, ఈఈ రాజశేఖర్ల పాత్రపై తనకు అనుమానం ఉందన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ జయ నరసింహులు కోట్ల రూపాయలు అక్రమా స్తులు సంపాదించాడన్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, గతంలోనే బద్వేలు మండలానికి అదనపు విధులు నిర్వహించాలని పీడీ సూచించారన్నారు. తానే వద్దని వెళ్లలేదని తెలిపారు. -
సమస్యలే తొలి పాఠం
కడప ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ యజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో అసౌకర్యాలు స్వాగతం పలికాయి. ‘బడి తెరిచిన రోజే పిల్లలందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేస్తాం. అదే రోజు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలకు జమ చేస్తాం’ అని చెప్పిన మాటలన్నీ నీటి మీద బుడగలనేని మరోమారు కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బడి తెరిచిన రోజే అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక పంపిణీ చేసి ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా విద్యార్థులు పాత యూనిఫాం, పాత బ్యాగులు, పాత చెప్పులతో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు విద్యాకానుక కిట్లు ఇచ్చినా.. అందులో అన్ని వస్తువులు అందలేదు. బ్యాగు, బెల్ట్, షూ, సాక్సులతోపాటు 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలు అసలు పాఠశాలకే రాలేదు. దీంతోపాటు కొన్ని పాఠశాలల్లో నోట్బుక్స్, వర్క్బుక్స్, పాఠ్యపుస్తకాలు కూడా కొంతమంది విద్యార్థులకు అందలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు నిరాశ చెందారు. ఇక తల్లికి వందనం విషయానికి వస్తే పాఠశాలలు తెరిచిన రోజే తల్లుల ఖాతాలకు నగదు జమ చేస్తామని చెప్పారు. అది కూడా ఎంత మంది పిల్లలను బడికి పంపితే.. అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాకు నగదు జమ చేస్తామన్నారు. తీరా బడి తెరిచే నాటికి జూలై మొదటి వారంలో జమ చేస్తామని చెప్సి తుస్సుమనిపించారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మొదటి రోజే పిల్లలు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సి వచ్చింది. మొదటి రోజు... జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథకోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 3145 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 324371 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 277980 మంది విద్యార్థులు హాజరై 85.5 శాతం హాజరు నమోదైంది. మొదటి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం తర్వాత మరుసటి రెండు రోజులు సెలవులు కావడంతో విద్యార్థులు పెద్దగా రాలేదు. దీంతో పాఠశాలల్లో పండగ వాతావరణం కన్పించలేదు. పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు అరకొరగా విద్యామిత్ర కిట్లు తొలిరోజు అంతంత మాత్రమే హాజరు -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి
కడప సెవెన్రోడ్స్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్మిక, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మెకానిక్ షాపులు, హోటళ్లు, గ్యారేజీలు, గనులు, సిమెంట్ పరిశ్రమల్లో బాల కార్మికుల నియామకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతకుముందు స్థానిక మున్సిపల్ హైస్కూల్లోని స్మార్ట్ కిచెన్ను సందర్శించిన శ్రీనివాసమూర్తి, వంట సిబ్బంది తప్పనిసరిగా చేతి తొడుగులు, తల టోపీలు, ఏప్రాన్లు ధరించాలని సూచించారు. స్థానిక రామాంజనేయపురంలోని రెవెన్యూ సేవా సమితి నిర్వహిస్తున్న అమ్మఒడి ఆశ్రమాన్ని సందర్శించిన డా.శ్రీనివాసమూర్తి, అక్కడి బాలలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కడప సెంట్రల్ జైలు, మహిళా జైలును సందర్శించిన ఆయన, రిమాండ్ ఖైదీలలో 18 సంవత్సరాల లోపు బాలలు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించారు. సాయంత్రం సీకే దిన్నె మండలంలోని బుగ్గలపల్లి దళితవాడను సందర్శించి, అంగన్వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రమాదేవి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, పోలీసు శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాలబాలికలు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’నిరసన కార్యక్రమం విజయవంతమైంది. సీఎం చంద్రబాబు సర్కార్పై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నియోజకవర్గ కేంద్రాలు శుక్రవారం నిరసన ర్యాలీలతో హోరెత్తాయి. ప్రజల్ని వంచించిన సీఎం చంద్రబాబుకు పాలించే అర్హత లేదంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రజల్ని వంచించిన ముగ్గురు మోసగాళ్లుంటూ ధ్వజమెత్తారు. వేలాది మంది నిరసనలో పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద దివంగత వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకూ వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతి ఏదంటూ మండిపడ్డారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎక్కడంటూ చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని వంచించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సూపర్ సిక్స్ పేరుతో మోసం జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం వద్దనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులు అర్పించిన అనంతరం.. నారాపుర స్వామి దేవాలయం మీదుగా పాలగాడిమోట్, కాపు వీధి, పెద్దమ్మ మోటు, మార్కెట్ వీధి మీదుగా పాత బస్టాండ్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సర్కార్ అన్నీ వర్గాల ప్రజల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా పేదల సంక్షేమమే ఎజెండాగా వైఎస్సార్సీపీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలిస్తే, తద్భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బద్వేల్ పట్టణంలో సిద్దవటం రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సుమారు 145 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ విస్మరించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ ఆటలు ఆడుతోందని, డీఎస్సీలో సైతం అక్రమాలకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు. రాజంపేటలోని ఆర్అండ్బి అతిథి గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మ్యానిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలంటూ చంద్రబాబు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. కమలాపురంలో గ్రామ చావిడి వద్ద నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలతో ప్రజలు విసిగిపోయారని, నీతి తప్పిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టగా వర్ణించారు. నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్రామాంజులరెడ్డి మాట్లాడుతూ దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కాపాడగలరన్నారు. చంద్రబాబు సర్కార్ను ప్రజలు బంగాళఖాతంలో కలపనున్నట్లు తెలిపారు. ముగ్గురు మోసగాళ్ల శైలిపై ధ్వజం ప్రొద్దుటూరులో మున్సిపల్ ఆఫీసు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పార్టీ రంగులతో కూడిన గొడుగులు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్, పవన్కళ్యాణ్ కలిసికట్టుగా ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముగ్గురు మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మైదుకూరు పట్టణంలో ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న మూలబాట నుంచి కడప రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద మోసగాడు చంద్రబాబేనని తెలిపారు. జీవితమంతా ప్రజల్ని వంచించడమేనని విమర్శించారు. కడప నగరంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కోటిరెడ్డిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ అపరమేధావి ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకొనే చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారు. మాజీ మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ కూటమి సర్కార్లో అరాచకాలు, దౌర్జన్యాలు అధికం అయ్యాయని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాబట్టే వైఎస్సార్సీపీకి విశేష మద్దతు లభిస్తోన్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్లమయం అయ్యిందని, పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని, సీబీఐ విచారణ చేయించాలని కోరితే సర్కార్ తోకముడుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొని కదం తొక్కాయి. ప్రజలు ఎక్కడికక్కడ భారీగా పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం విశేషం. కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు వంచించిన చంద్రబాబుకు పాలించే అర్హతలేదని మండిపాటు హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల ఆగ్రహం నియోజకవర్గ కేంద్రాల్లో వెల్లువెత్తిన నిరసన ర్యాలీ -
కడపలో యువకుడి దారుణ హత్య
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఒంటిమిట్ట మండల పరిధిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ సంఘటనపై కడప రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, మృతుడి తండ్రి మునెయ్య, బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వేకోడూరు మండలానికి చెందిన చింతా రామసుబ్బారెడ్డి గత 15 సంవత్సరాలుగా కువైట్కి జీవనాధారం కోసం వెళ్లి ఇండియాకు అప్పుడప్పుడు వస్తుంటాడు. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల కిందట రామ సుబ్బారెడ్డి, తన భార్య మధురవాణి, కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి కడపలో రిమ్స్కు వెళ్లే దారిలో ఉన్న విన్యాస అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. అప్పటి నుంచి చిట్వేలి మండలం సిద్ధారెడ్డిపల్లెకు చెందిన అక్కుపల్లి మునెయ్య కుమారుడు వంశీ(25).. రామసుబ్బారెడ్డి వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నాడు. రామ సుబ్బారెడ్డి గత ఏడాది నుంచి కడపలోనే ఉంటున్నాడు. రామ సుబ్బారెడ్డి సతీమణి మధురవాణి కడపకు వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ వ్యాపారం చేస్తూ, కువైట్ ఇతర దేశాలకు వస్తు సామగ్రిని ఎగుమతి, దిగుమతి చేస్తుండేది. ఈ క్రమంలో మధురవాణి, డ్రైవర్ వంశీతో సన్నిహితంగా ఉండేదని రామసుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రామసుబ్బారెడ్డి తమ డ్రైవర్ వంశీని తనతో పాటు వాహనంలో బయటికి తీసుకెళ్లాడు. తర్వాత ఇంటికి రాలేదు. ఈ నెల 11వ తేదీన వంశీ తండ్రి మునయ్య తన కుమారుడికి ఫోన్ చేసినా స్పందించలేదు. వంశీ యజమాని రామసుబ్బారెడ్డికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీతోపాటు రామసుబ్బారెడ్డి ఇంటికి రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీపంలో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి శవం కనిపిస్తే స్థానిక ప్రజలు అక్కడి కానిస్టేబుల్కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఈనెల 11వ తేదీ రాత్రి అక్కుపల్లి వంశీ కనిపించడం లేదని రిమ్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. మునెయ్యను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి యువకుడి మృతదేహాన్ని పరిశీలింప చేయగా తన కుమారుడు వంశీ మృతదేహమే అని గుర్తించాడు. ప్రాథమికంగా ఇది హత్యగా గుర్తించారు. కడప రిమ్స్ వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తండ్రికి అప్పగించారు. మృతదేహంపై దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు. తన కుమారుడి మరణానికి అతని యజమాని రామసుబ్బారెడ్డి కారణమని పోలీసులకు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై రిమ్స్ సీఎస్ సీఐ రాజగోపాల్, ఇన్చార్జి ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో కలిసి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించం !
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల చట్టాల అమలులో అలసత్వం వహిస్తే సహించబోమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యా హక్కు అమలు, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణ, పాఠశాలలు–హాస్టళ్లలో భద్రతా ప్రమాణాల అమలుపై జిల్లా స్థాయి వర్క్షాప్, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యా హక్కు చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, జువైనెల్ జస్టిస్ చట్టం అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
బాబు హామీ మూగబోయింది
● అరకొరగానే విద్యాకానుక ● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● నేటికీ రాని బ్యాగులు, షూ, బెల్ట్, డిక్షనరీలు కడప ఎడ్యుకేషన్ : కూటమి మాట ఒట్టిమాటేనని తేలిపోయింది.. బడాయి మాటలు చెప్పడం ఆపై వెనకడుగు వేయడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పాఠశాలలు తెరిచేనాటికి విద్యాకానుక ఇస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పిన హామీలు నీటి మూటగానే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. విద్యాకానుక కోసం ఎదురు చూస్తున్న పిల్లల ఆశలపై బాబు సర్కారు నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు తొలి విడతగా యూనిఫాం, నోట్బుక్స్, టెక్స్బెక్స్, వర్కుబుక్స్, డిక్షనరీలు మాత్రమే పంపిణీ చేయ నుంది. మిగతా బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్తోపాటు డిక్షనరీలు అసలుకే రాలేదు. బుక్స్ ఇస్తారు సరే .. ఆ పుస్తకాలను ఎక్కడ పెట్టుకోవాలోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అరకొరగా విద్యాకానుక వస్తువులు.... జిల్లావ్యాప్తంగా 40 మండలాల్లో 2425 పాఠశాలలు ఉన్నాయి, ఇందులో 1,37,498 మంది విద్యార్థులు ఉన్నారు. నోట్బుక్స్(6వ తరగతి నుంచి 10వ తరగతి) 7,24,453 రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 717428 రాగా ఇంకా 7025 నోట్బుక్స్ రావాల్సి ఉంది. ఇక వర్కుబుక్స్ 5967, టెక్స్ బుక్స్ 29172 రావాల్సి ఉంది. ఇక బ్యాగులు, బె ల్ట్, ఆక్స్పర్డ్ డిక్షనరీ(6వ తరగ తి)సంబంధించి షూ, సాక్సులు ఒక్కటీ పాఠశాలలకు చేరలేదు. జగన్ హయాంలో తొలిరోజే విద్యాకానుక.. గత వైఎస్సార్సీపీ సర్కార్ పాఠశాలలు పునః ప్రారంభంరోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్ అందించేది. దీంతో పిల్లల ముఖంలో ఆనందం వెల్లివిరిసేది. విద్యాకానుక కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగు, జత షూ, రెండు జతల సాక్సులు, బెల్ట్లు ఉండేవి, దీంతోపాటు యూనిఫాంకు సంబంధించి కుట్టుకూలి కూడా ప్రభుత్వమే చెల్లించేది. నెల రోజుల ముందుగానే విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుని అందుకు తగ్గట్టుగా షూ పంపేవారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికబారం పడేదికాదు, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా ఇంకా బ్యాలెన్సే పెట్టింది. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వారంలో అన్నీ అందజేస్తాం... విద్యాకానుకకు సంబంధించి ఇంకా రాని వస్తువులను వారం రోజుల్లో అందజేస్తాం. యుద్ధం కారణంగా కొన్ని వస్తువుల వచ్చే దానికి ఆలస్యమైంది. అవి రాగానే పిల్లలకు అందచేస్తాం. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. విద్యా కానుక వివరాలు ఇలా..కాంపోనెంట్ ఇండెంట్ వచ్చినవి రావాల్సినవి బ్యాగ్స్ 129654 0 129654 బెల్టులు 89472 0 89472 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 11758 0 11758 (6వ తరగతి) షూ అండ్ సాక్స్ 129654 0 129654 నోట్బుక్స్ 724453 71,7428 7025 (6 నుంచి 10) వర్కు బుక్స్ 120996 115029 5967 టెక్స్ బుక్స్ 565852 536680 29,172 -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పులివెందుల : ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు అనేక అబద్ధపు హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో సంతకాలు చేసిన బాండ్ల కాపీలు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు కానీ, వాటితోపాటు మేనిఫెస్టోలో పెట్టిన మరో 143హామీలు ఎంతమాత్రం అమలుపరిచారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి పెద్దలకు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్లలో అంతా చేశామని చెప్పుకుంటూ విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడం కూటమి నేతలకే చెల్లిందని విమర్శించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమవుతున్నా.. తల్లికి వందనం పథకం ఊసేలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానంగా పవిత్రంగా భావించి మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కూటమి నాయకులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. నేటి ర్యాలీలను జయప్రదం చేయండి... చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసన ర్యాలీలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. -
జోన్ మారుతోంది !
● జోన్ 4 నుంచి జోన్–5లోకి కడప ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ ● తగ్గనున్న ఉద్యోగుల సంఖ్య.. పని భారం ● మారనున్న వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన స్వరూపం కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖ జోన్ విభాగంలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం కడప కేంద్రంగా ఉన్న జోన్ –4 ప్రాంతీయ కార్యాలయం కడప పాత రిమ్స్లో కొనసాగుతోంది. ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి సత్యసాయి మొత్తం 8 జిల్లాలు వస్తాయి. దాదాపు 17 కేడర్లు, మొత్తం 11 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ కు సంబంధించిన అంశాలతో పాటు ఉద్యోగ నియామకాల అంశాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. తాజాగా జోన్ లను విభజించడంతో ఆ శాఖ పరిధి తగ్గడంతో పాటు ఉద్యోగుల సంఖ్య.. పరిపాలనాపరమైన అంశాలు గ ణనీయంగా తగ్గనున్నాయి. ఉదాహరణకు కడప కేంద్రంగా ఉన్న జోన్–4 కార్యాలయం పరిధిలోకి ప్రస్తుతం 8 జిల్లాలు ఉండగా, ఇకపై జోన్–5 గా మారడంతో ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్ కడప తో పాటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు మాత్రమే రానున్నాయి. మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 జోన్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం జోన్–1, రాజమండ్రి జోన్ –2, గుంటూరు జోన్–3, వైయస్సార్ కడప జోన్ –4 గా ఉన్నాయి. తాజాగా జోన్ ల విభజనకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను, రాష్ట్ర ప్రభుత్వం జీఓ ను జారీ చేసింది. ఆ ప్రకారం 2 మల్టీ జోన్ లు, ఆరు జోన్ లు ఏర్పాటు కానున్నాయి. ఒక మల్టీ జోన్ పరిధిలోకి మూడు జోన్ల చొప్పున ఉంటాయి. ఆ ప్రకారం మల్టీ జోన్ –1 పరిధిలో జోన్–1 గా విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలు, జోన్ –2గా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, జోన్–3గా వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కష్ణాజిల్లాలు ఉంటాయి. మల్టీ జోన్–2 లో జోన్–4 గా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–5గా వైయస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, జోన్–6గా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కొనసాగనున్నాయి. జోన్ కేంద్రాల కొనసాగింపుపై సందిగ్ధం.. ఇప్పటివరకు కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు కేంద్రాలుగా ప్రాంతీయ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. విభజన కారణంగా అదనంగా మరో రెండు కొత్తగా రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పనిచేస్తున్న ప్రాంతీయ కార్యాలయాలు అదే కేంద్రంలో పనిచేస్తాయా.. లేక మరొక చోటికి తరలిస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు కానున్న రెండు ప్రాంతీయ కార్యాలయాలు ఆ జోన్ లకు సంబంధించి ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు అనే చర్చ ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా కొనసాగుతోంది మార్పు వచ్చేనా...? జోన్ల పెంపు.. జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాల కుదింపుతో ఆ శాఖ కార్యాలయం పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అలాగే నియామకాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. కాగా కొత్త జోన్ల ఏర్పాటుతో ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్థానభ్రంశం కలగనుంది. అంటే అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి మరొకచోటికి పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు ఇక్కడ మేము పనిచేయలేమంటూనే, ఉన్న సీట్లోనే పాతుకు పోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంతమంది మరో ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ కార్యాలయం‘ఖజానాకు నిలయం’గా భావించడంతో కొంతమంది ఉద్యోగులు అక్కడ సీటు సంపాదించడానికి పాకులాడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఇక్కడ కొంతమంది ఉద్యోగ నేతల మధ్యవర్తిత్వం.. పెత్తనం పెద్దగానే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. -
వంచనపై గర్జన
● కూటమి మోసపూరిత హామీలపై వైఎస్సార్ సీపీ రణభేరి ● రెండేళ్లపాలనపై నేడు నిరసన ర్యాలీలు కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ రణ భేరికి సిద్ధమైంది. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నేడు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోర్యాలీలు కొనసాగనున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాయి. రెండేళ్లు పూర్తయినా వాటిని సక్రమంగా అమలు చేయలేదని, ప్రధానమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి వాటిని విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అనేక స్కామ్లతో ముందుకు వెళుతుండడం, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో విఫలం కావడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు రణభేరి మోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4వ తేదిన ఎక్కడికక్కడ టీడీపీ మ్యానిఫెస్టో ప్రతులను ప్రధాన కూడళ్లలో దహనం చేసి నిరసన తెలియజేశారు. అనంతరం 8,9 తేదీలలో నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించి ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో వివరించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా రవిశంకర్
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం జాయింట్ సెక్రటరీగా మైదుకూరుకు చెందిన జి.రవిశంకర్రెడ్డి నియమితులయ్యారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ రజక విభాగం అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన ఎం.లింగమయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 14న పురస్కారాలు ప్రదానం కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించిన తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగరశాఖ అధ్యక్షుడు కళ్యా సుధాకర్, ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావు వెల్లడించారు. గురువారం సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా 13 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఈనెల 14న ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుకరిస్తామన్నారు. కాశీపురం సుధాకర్రెడ్డికి ‘మట్టి మనిషి’పురస్కారం కడప సెవెన్రోడ్స్ : అవుకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గంగిరెడ్డి సుధాకర్రెడ్డిని ‘మట్టి మనిషి’పురస్కారానికి ఎంపిక చేశారని తపన సాహిత్యవేదిక వ్యవస్థాపకులు సడ్లపల్లె చిదంబరరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో నిరంతరం అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న సుధాకర్రెడ్డిని ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేసిందని పేర్కొన్నారు. ఈనెల 21వ తేది ఉదయం 10 గంటలకు హిందూపురం టీచర్స్ కాలనీలోని తమ కార్యాలయంలో పురస్కార ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. మట్టిమనిషి పురస్కారానికి సుధాకర్రెడ్డి ఎంపిక కావడంపై కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ప్రతినిధి దండా ప్రసాద్, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జనార్దన్రాజు హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివితే ఉజ్వల భవితమదనపల్లె సిటీ: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కంటి ఆస్పత్రిలో 2025–26 సంవత్సరంలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాఽధించిన 16 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. -
ఇకపై ఇలా...
● ముగిసిన వేసవి సెలవులు ● తల్లిదండ్రులపై గురుతర బాధ్యత కడప ఎడ్యుకేషన్: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఇళ్లల్లో అల్లరి చేసిన చిన్నారులు ఇక బడిబాట పట్టనున్నారు. మూలన పడేసిన స్కూల్ బ్యాగులు దుమ్ముదులిపి సర్దుకొని భుజాన తగిలించనున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా వారిని బడికి పంపేందుకు సన్నద్ధమవుతూ వారికి కావాల్సిన విద్యా సామగ్రిని సిద్ధం చేసి వారిని బడికి పంపే పనిలో పడ్డారు. ఒకటా రెండా 50 రోజుల పాటు అల్లరి చేసిన పిల్లలు ఒక్కసారిగా బడిబాట పట్టాలంటే కాసింత భారంగా ఉంటుంది. భారమైన బడివైపు అడుగులు వేయాల్సిందే. వారిని సిద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులదే. వారం ముందు నుంచే ప్రణాళికతో... తల్లిదండ్రులు వారం ముందు నుంచే తమ పిల్లల చదువులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు, ఇతర వస్తువులు సమకూర్చుకున్నారు. దీంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో ముందుగా ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం డబ్బులను కట్టి విద్యాసామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఠారెత్తించిన ఎండలతో... దుమ్మురేగిన ఆటలతో కుస్తీ ముగిసింది.. బళ్లో పాఠాలతో.. పుస్తకాల బ్యాగులతో దోస్తీ కట్టే వేళయింది.. అమ్మమ్మ ఊరిలో చేసిన సందడికి.. అయ్య కారులో తిరుగుతూ చేసిన అల్లరికి బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. అదిగో.. గణగణమంటూ బడిగంట శబ్దం మోగింది... ఇదిగో.. సావాసగాడితో జతకట్టి వెళ్లే క్షణం రానే వచ్చింది... సుమారు యాభై రోజుల వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. రా రమ్మంటూ పిల్లలను ఆహ్వానిస్తున్నాయి.. బడికెళ్లేటప్పుడు ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేసేవారో ఇప్పుడు అదే సమయానికి పిల్లలను మేల్కొనేలా చూడాలి. సెల్ఫోన్లు చూడటం మాన్పించాలి. ఇప్పటి వరకు రోజుకు రెండు మూడు గంటల చూస్తే వచ్చే వారం పదిరోజులు రోజుకు అరగంట మించకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. కథల పుస్తకాలు, జీవిత చరిత్ర, వ్యక్తిత్వ వికాస, తరగతి పుస్తకాలు రోజుకు కనీసం అయిదారు పేజీలైనా చదివేలా చూడాలి బడికెళ్లేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర వేళకు భోజనం క్రమశిక్షణగా చేసినట్టే ఇప్పుడూ అలవాటు చేయాలి. చిరుతిళ్లను మాన్పించాలి. పాఠశాలల్లో భోజన సమయాలను తెలుసుకుని ఇప్పటినుంచే ఆ విధంగా అందించాలి 1361 బేసిక్ ఫౌండేషన్ స్కూల్స్207 జిల్లాలో ఫౌండేషన్ స్కూల్స్35 అప్పర్ ప్రైమరీ స్కూల్స్397 మండల పరిషత్తు స్కూల్స్ 307 హైస్కూల్స్(ఇంక్లూడింగ్ బీపీఎస్ +ఎంిపీఎస్)886 ప్రైవేటు స్కూల్స్64 ఎయిడెడ్ స్కూల్స్ -
పారదర్శకంగా ‘సర్’
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సభా భవనంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఈడీటీలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తరుచూ ప్రజలు వలసలు వెళ్లడం, ఒకే వ్యక్తి పేరు పలు ప్రాంతాల్లో నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకే సర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎన్యుమరేషన్ దశలో బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను స్వీకరించి డిజటలైజేషన్ చేయాలన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే మూడుసార్లు సందర్శించి ఫారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి ఓటునైనా విచారణ నిర్వహించిగానీ తొలగించడానికి వీలుండదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా జే.భరత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. జెడ్పీలో నియామకాలు కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, సీఈఓ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఈఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్: రాష్ట్రంలోకి రుతు పవనాల ఆగమనంతో జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 32.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 18.2, లింగాల, దువ్వూరు మండలాల్లో 5.2, సీకేదిన్నె మండలంలో 4.6 ముద్దనూరు మండలంలో 2.4, బద్వేల్ మండలంలో 1.2, గోపవరంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. దుప్పి మాంసాన్ని పంచుకున్న ఇద్దరు అరెస్టు మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్లోని గంగాయపల్లె బీట్లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్ అధికారి చలపతి నాయుడు తెలిపిన వివరాల మేరకు.. గంగాయపల్లె బీట్లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్ దొరికారు. ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. డీప్యూటీ ఈఓ మీనాక్షిపై వేటు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారి మీనాక్షిపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఇటీవల జరిగిన డీఆర్సీలో ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తప్పించడంతో పాటు విద్యాశాఖ డైరెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియ ఆదేశాలు జారీ చేశారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఆ సమయాల్లో ప్రత్యేక నిఘా, పటిష్ట ట్రాఫిక్ అమలు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 51 బ్లాక్ స్పాట్లు, 125 జీరో ఫెటాలిటీ క్రాష్ ప్రోన్ ప్రాంతాలు, 162 యాక్షనబుల్ ప్రదేశాల వద్ద తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. డివైడర్లను పగలగొట్టి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో అధిక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యల్లో మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఇంటిల్లిపాదికీ యోగానందం
కడప వైఎస్ఆర్ సర్కిల్: మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’ కార్యక్రమానికి సుమారు 4 వేల మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే ‘టూరిజం, హెరిటేజ్ యోగా’థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తితో పాటు మంచి జీవనశైలి కుడా అలవడుతుందన్నా రు. సబ్ కలెక్టర్, కడప నగర కమిషనర్ హెచ్.ఎస్. భావన మాట్లాడారు. కడప ఆర్డీఓ మురళి, ఎస్డీసి హరిప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, డీఎంహెచ్ఓ నాగరాజు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నిధీ మీనా -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఆది వర్గీయుల దాడి
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ దాడిలో ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లి మేకల వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మాలేపాడులోని సర్వే నంబర్ 373లో 86 సెంట్ల స్థలాన్ని 2013లో ప్రసాద్రెడ్డి తండ్రి మేకల సుబ్బిరెడ్డి రూ.90 వేలకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో పంట సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని ఎవరికీ తెలియకుండా ప్రొద్దుటూరుకు చెందిన టంగుటూరు మారుతీప్రసాద్, రావుశ్రీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ప్రొద్దుటూరు మండలంలోని రామాపురానికి చెందిన పైడికాలువ జగన్కు విక్రయించారు. బాధితులు 2015లో దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలలో తామే అనుభవంలో ఉన్నామని ప్రసాద్రెడ్డి ఆధారాలతో సహా నిరూపించుకోగా, ఆ భూమి ప్రసాద్రెడ్డిదేనని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు పైడికాలువ జగన్, ఆయన తండ్రి ఓబన్న అలియాస్ జయన్న, పైడికాలువ ప్రసాద్, ఎర్రమాసి ప్రతాప్, పైడికాలువ భరత్ మరో 20 మంది కలిసి మారణాయుధాలతో భూమిలో దిగారు. ప్రసాద్రెడ్డి తల్లి వరలక్ష్మి వారికి అడ్డుచెప్పగా వారు ఆమైపె తీవ్రంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు నుంచి నేరుగా ఇంటికి రాగా, ఎమ్మెల్యే వర్గీయులు ఆయనపైనా దాడి చేశారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శించారు. ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లికి తీవ్రగాయాలు -
బాబు పేరు చెబితే మోసం గుర్తుకువస్తుంది
● 12న చేపట్టే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలి ● వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.సురేష్ బాబుకడప కార్పొరేషన్ : ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది నిర్వహించనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. సురేష్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక అపూర్వ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పింఛన్లు తప్పా మరేమీ ఇవ్వలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చారన్నారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి రూ.13వేలే ఇస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 20లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని కేవలం 5 సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే మోసం, దగా, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, క్లస్టర్ పార్టీ అధ్యక్షులు పి. రామ్మోహన్రెడ్డి, బీహెచ్ ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన క్రికెట్ బుకీలపై చర్యలేవీ..?
ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు రెండు నెలల పాటు జరిగాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకమునుపే పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై దృష్టి సారించారు. అన్ని స్టేషన్ల పరిధిలోని బుకీలను పిలిపించి స్వయంగా ఏఎస్పీ విభూకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐపీఎల్ ప్రారంభం అయ్యేనాటికే రెండు, మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కౌన్సిలింగ్కు ప్రధాన బుకీలెవ్వరూ హాజరు కాలేదు. చిన్నా చితకా క్రికెట్ పందేలు నిర్వహించే బుకీలు మాత్రమే కౌన్సిలింగ్కు వచ్చారు. ఈ ఏడాది మార్చి 28న ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మే 31న ముగిశాయి. ప్రధాన బుకీలందరూ ఇతర దేశాలకు వెళ్లారు. అక్కడే ఉంటూ రెండు నెలల పాటు నిర్విరామంగా బెట్టింగ్ నిర్వహించారు. టోర్నమెంట్ ముగియడంతో కౌన్సిలింగ్కు డుమ్మా కొట్టిన వారు, పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలు ఇప్పుడిప్పుడే సొంత గూటికి వస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం.. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్్ అనేది ఈ రోజు పుట్టింది కాదు. ఇక్కడ క్రికెట్ పందేలను ప్రారంభించిన అనేక మంది బెట్టింగ్ డాన్లుగా ఎదిగారు. వీరి నీడన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది బుకీలు పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు విషయానికొస్తే అధికార పార్టీలో ఉంటున్న కొందరు బుకీలు స్థానికంగా చక్రం తిప్పుతున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్బుకీలు, కొరియర్ బాయ్లుగా ఉన్న యువకులు నేడు బడా బుకీలుగా మారారు. జిన్నారోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు బెట్టింగ్ కార్యకలాపాలను విస్తరించాడు..ఇతను కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ప్రధాన బుకీతో కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నాడు. వన్టౌన్ ప్రాంతంలో ఒకరు, బంగారు అంగళ్ల వీధిలో ఒక యువబుకీ, మైదుకూరు రోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అతని సోదరుడు క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పొలిటికల్ అండతో ప్రొద్దుటూరులో అనేక మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాగానే వీళ్లంతా కువైట్, దుబాయ్, మస్కట్, శ్రీలంక తదతర దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే యాప్ల ద్వారా, ఫోన్లలోనూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. పోలీసుల భయంతో రెండు నెలల పాటు ఇతర దేశాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ఇటీవలే ఐపీఎల్ సీజన్ ముగియడంతో తిరిగి ఒక్కొక్కరుగా ప్రొద్దుటూరుకు వస్తున్నారు. నాడు పోలీసుల భయంతో పారిపోయినోళ్లే.. నేడు పోలీసుస్టేషన్ల ముందే ఫోజులు కొడుతున్నారు ఐపీఎల్, టీ ట్వంటి వరల్డ్కప్ లాంటి క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో వారం రోజులు ముందే క్రికెట్ బుకీలు వారెంచుకున్న ప్రాంతాలకు వెళ్లిపోతారు. క్రికెట్ మ్యాచ్ల ముందు పోలీసులు పట్టుకుంటే బెట్టింగ్ నిర్వహించుకునేందుకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందుగా స్థావరాలకు చేరుకుంటారు. ఒక వేళ క్రికెట్ సీజన్ ప్రారంభమైనా బిక్కు బిక్కుమంటూ పోలీసులకు కనిపించకుండా దాక్కొని తిరుగుతుంటారు. క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ నంబర్లను మార్చుకొని పందేలు నిర్వహిస్తుంటారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తిస్తారేమోననే భయంతో కొత్త సిమ్ కార్డులను తీసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. క్రికెట్ మ్యాచ్లు ముగిసిన వెంటనే బుకీలు ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. రెండు నెలల క్రితం వరకు పోలీసులను చూస్తే భయపడిన బుకీలే ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై పోలీసుల ముందే జెంటిల్మెన్లా తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమ క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు, నిఘా సంస్థలు ఎంత మేరకు పర్యవేక్షణ చేస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్రికెట్ సీజన్లో నీడలా మాయమై..ఫైనల్ మ్యాచ్ ముగిశాక ప్రత్యక్షమయ్యే ఈ జెంటిల్మెన్ల వ్యవహారంపై ఆయా పోలీస్స్టేషన్ల పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన క్రికెట్ పందేలు నిర్వహించే కొందరు వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీస్స్టేషన్లకు వెళ్లి పంచాయతీలు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పాల్గొంటున్న వ్యక్తులతో కొందరు పోలీసు సిబ్బంది సన్నిహితంగా కనిపించడం ప్రొద్దుటూరులో పరిపాటిగా మారుతోంది. పలువురు ప్రధాన బుకీలపై కేసులు..? ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రొద్దుటూరు పోలీసులు పలువురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీసులు 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి రూ.11 లక్షలుపైగా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు షేక్ జావిద్ అలియాస్ బాలాజీ, అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సోదరుడు షేక్ జిలానిబాషాలు అరెస్ట్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మరో రూ. 14 లక్షలను జప్తు చేశారు. అలాగే వన్టౌన్ పోలీసులు ఆరుగురు బుకీలను అరెస్ట్ చేసి రూ. 2.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ. 4.14 లక్షలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ రెండు స్టేషన్లలో నమోదైన బెట్టింగ్ కేసుల్లో పలువురు ప్రధాన బుకీలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కారణంగా 5–6 మంది ప్రధాన బుకీలు ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం రెండు నెలల పాటు విదేశాల్లో మకాం వేసిన క్రికెట్ బుకీలు ఇటీవల ఐపీఎల్ సీజన్ ముగియడంతో సొంతగూటికి పయనం క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలే.. నేడు పెద్ద మనుషులుగా, సమాజ సేవకులుగా చలామణి మోస్ట్ వాంటెడ్ బుకీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారా..! -
● ఏ తల్లి పాపమో !
అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డ.. ముళ్లపొదల్లో చేరి మృత్యు కౌగిట్లో జారిపోయాడు.. తండ్రి చేతుల్లో పెరగాల్సిన బిడ్డ.. శునకాల నోట చిక్కి విలవిల్లాడిపోయాడు.. ఎవరి పాపమో.. విధి శాపమో గానీ.. కళ్లు తెరవకుండా శాశ్వతంగా కన్నుమూశాడు.. కడప వినాయకనగర్ సమీపంలో ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. వినాయకసాగర్ ముళ్లపొదల సమీపంలో కుక్కలు ఓ పసికందును నోట కరుచుకుని తీసుకెళ్తుండటాన్ని గమనించారు. తీవ్ర గాయాలతో అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ తెలిపారు. – కడప అర్బన్ -
కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాపాడు మండలంలోని రాజువారిపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి తనతో మాట్లాడాలని ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన వివాహితను కొన్ని రోజులుగా వేధించేవాడు. తన వెంట పడొద్దని సదరు మహిళ పలుమార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో మహిళ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యపుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. మహిళకు పాము కాటుమదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
జూద స్థావరంపై పోలీసుల దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం బ్రాహ్మణపల్లె రోడ్డులోని జూదస్థావరంపై ఎస్ఐ తిమోతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 8 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టగా, నిందితులు పట్టుబడ్డారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని ఎస్ఐ తిమోతి పేర్కొన్నారు. గొర్రెల చోరీపై కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలు చోరీ చేసిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గోపవరం గ్రామంలో రేకుల షెడ్డును కత్తిరించి అందులో ఉన్న 13 గొర్రెలు నిందితులు చోరీ చేశారు. గొర్రెలను నిందితులు బొలెరో వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు అనిల్కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొర్రెలు విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు బనగానపల్లెలో వాసులుగా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాజు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్(31) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి బుధవారం తెలిపారు. చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్, గురుశేఖర్లు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేపలను నిల్వ చేసుకోవడానికి ఐస్ కోసమని ఇద్దరు కలసి ఈ నెల 8వ తేదీన స్కూటర్పై చెన్నూరుకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా తిప్పలూరు గ్రామంలోని సచివాలయం వద్దకు రాగానే తుఫాన్ వాహనం వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ గౌస్పీర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసమని కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వృద్ధుడు అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని బొల్లవరానికి చెందిన వృద్ధుడు పందిటి సామేల్ (80) అదృశ్యంపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సామేల్ తమిళనాడులోని వేళాంగినికి వెళ్తున్నానని చెప్పి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు వెళ్లిన అతను ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లలోనూ, తెలిసిన చోట్ల వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రోబోటిక్ ల్యాబ్ను పరిశీలించిన డీఈఓ
రాజంపేట టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ను బుధవారం డీఈఓ షంషుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ఈరోబోటిక్ ల్యాబ్ను త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మరో పది పాఠశాలల్లో రోబోటిక్ ల్యాబ్లను, స్టెమ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైస్కూల్స్లోని రోబోటిక్ ల్యాబ్స్ సిద్దాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తూ అనుభవాలుగా మారుస్తాయన్నారు. ఫలితంగా విద్యార్థులు రోబోలను డిజైన్ చేసేందుకు, నిర్మించేందుకు, కోడ్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సి, ఇంజనీరింగ్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. హై స్కూల్ స్థాయిలో ఈ ప్రయోగాలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు. రోబోటిక్ ల్యాబ్ వల్ల విద్యార్థులు వైఫల్యాలను విశ్లేషించడం, కోడ్లోని సమస్యలను పరిష్కరించడం, హార్డ్వేర్ను సర్దుబాటు చేయడం, సవాళ్ళను ఎదుర్కోవడానికి పునరావృతమయ్యే దశలవారీ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి విద్యార్థులు నేర్చుకుంటారని తెలిపారు. భవిష్యత్తులో రోబోల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీపై పట్టు సాధించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ లంకాయగారి నాగయ్య, ఎంఈఓ–1 కొండూరు రఘునాధ్రాజు, ఎంఈఓ–2 సుబ్బరాయుడు, హెచ్ఎం నాగమణి, సైన్స్ ఉపాధ్యాయుడు, రోబోటిక్ ల్యాబ్ ఇన్ఛార్జ్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నా భర్తను అప్పగించండి మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సర్టిఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది. -
రవాణా శాఖ నిబంధనలు ఇవీ..
● ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు ● బడి బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ● అన్నీ సక్రమంగా ఉంటేనే ఎఫ్సీ ఇస్తామంటున్న అధికారులు కడప వైఎస్ఆర్ సర్కిల్: వేసవి సెలవులకు బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. పిల్లలు బడిబాట పట్టే వేళయింది. పిల్లలే కాదు వారిని తీసుకెళ్లే బస్సులు కూడా సిద్ధం కావాల్సిన తరుణం రానే వచ్చింది. అవును.. రవాణాశాఖ ఆధ్వర్యంలో అన్ని సామర్థ్య పరీక్షలు చేసుకుని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. కాగా గత ఏడాది జారీ చేసిన సర్టిఫికెట్లకు కాలం చెల్లడంతో ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రక్రియ జరుగుతోంది. విద్యా సంస్థలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి కండీషన్లో ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏటీసీ సెంటర్ ద్వారా ఎఫ్సీలు జారీ గతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రతి వాహనాన్ని ఒకటి రెండు కిలోమీటర్లు నడిపి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఈ పనిని బాబు సర్కారు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. జిల్లాకు సంబంధించి వైవీయూ యూనివర్శిటీ సమీపంలో ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల నుంచి బడి బస్సులను ఇక్కడికే తీసుకువచ్చి ఎఫ్సీ పొందాల్సి వస్తోంది. ఈ ఏటీఎస్ సెంటర్పై ఏమాత్రం అజమాయిషీ లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉదయం ఆరు గంటలకు బస్సు తీసుకొని వస్తే రాత్రి 9 గంటలైనా పని పూర్తి కావడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 460 బస్సులు తనిఖీ జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, ప్రాంతాల్లో దాదాపు 618 పైగా విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 460 బస్సులను తనిఖీ చేశారు. వీటిలో 92 బస్సులకు ఎఫ్సీలు జారీ చేశారు. బడి బస్సులో లోపాలు ఉన్న 368 బస్సులకు నోటీసులు ఇచ్చారు. గుర్తిస్తున్న లోపాలు ఇవీ...... రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయ టకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పని చేయకపోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్ లేకపోవడం, ఎక్స్పైరీ డేట్తో ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తిస్తున్నారు ● స్కూల్ బస్సుకు డ్రైవర్గా 60 ఏళ్లు నిండిన వారు అనర్హులు ● బస్సు నడిపే డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ● డ్రైవర్ నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తప్పనిసరిగా తెలియ జేయాలి. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభవం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి నెల వాహనం ిస్థితి గతులను నమోదు చేయాలి. ఫిర్యాదు పుస్తకం ఉండాలి. ● బస్సులోని అన్ని లైట్లు, సిగ్నల్స్ ఖచ్చితంగా పని చేయాలి. ● బ్రేకులు కండీషన్లో ఉండాలి ● ఎమర్జెన్సీ డోర్, అగ్ని ఆర్పే పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి విద్యా సంస్థల బస్సులకు తప్పనిసరిగా ఎఫ్సీ కలిగిఉండాలి. దీనిపై ఇప్పటికే జిల్లాలోని విద్యా సంస్థలకు సమాచారం ఇచ్చాం. ఎఫ్సీ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా బస్సులను సీజ్ చేసి జరిమానా విధిస్తాం. వీటిపై ప్రత్యేక బృందాలను నియమించాం. – వీర్రాజు, ఇన్చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా -
ఇసుకమాఫియా కోరల్లో పెన్నమ్మ
● పరివాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ● ఇసుక తోడేస్తుండటంతో దెబ్బతింటున్న తాగునీటి పైపులైన్ ● ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులుట్రాలీని వదిలి ఇంజన్తో పరారైన ఇసుకాసురులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్న అధికారులు ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పరిధి పోట్లదుర్తి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రొద్దుటూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు అధికార పార్టీ అండదండలతో వారి అనుచర వర్గీయులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోట్లదుర్తి గ్రామ సమీపంలోని బ్రిడ్జి సమీంలోనే ఇసుకను తోడేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెన్నానది అంతా గుంతలు పడింది. అడుగుభాగాన ఉన్న ఇసుకను తోడేయడంతో మట్టి మాత్రం నదిలో మిగిలింది. అధికారుల రాకతో పరుగులు పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రని గ్రామంలోని కొందరు బుధవారం రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ అమరేశ్వరీ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రమీల వీఆర్ఓ పెన్నానదిలోకి వెళ్లి దాడులు చేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను వదిలి పరుగులు పెట్టారు. నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అడుగంటిపోతున్న భూగర్భజలాలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్నానదిలోని ఇసుకపై అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల కన్నుపడింది. దీంతో ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా పైపులైన్ దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు నుంచి అధికంగా ఇసుక మాఫియ దారులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక బయట ప్రాంతాలకు తరలిపోతోంది. -
చీటింగ్ వెనుక గూడుపుఠాణి !
రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత సహకారం? .. నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. నాగేంద్రవర్మకు సహకరించినది ఎవరు..? నిష్పక్షపాతంగా పోలీసు విచారణ జరిగేనా? మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగేనా రూ.కోట్లాది మార్పిడిపై ఐటీ దాడులు ఏవీ.. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు : పట్టణంలోని యూబి కాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా .. 15 ఏళ్ల క్రితం అహ్మద్బాషాతో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముది వేడు వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలి పరిస్థితి విషమించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించామన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
కూటమి ముంగిట పోరు షురూ !
టీడీీపీ వర్సెస్ జనసేన! ● తెరపైకి డిప్యూటీ సీఎం పేరెంట్స్ మీటింగ్ బిల్లుల వివాదం ● స్వయంగా ట్వీట్ చేసిన జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ● పొత్తు ధర్మం ఏనాడైనా పాటించారా? నిలదీస్తున్న జనసేన నాయకులు సాక్షి ప్రతినిధి, కడప: కూటమి ముంగిట కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి రాజ్యసభ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి టీడీపీ, జనసేన మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతేడాది కడపలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు బిల్లులే ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ సమావేశానికి అయిన ఖర్చులు ఎక్కడా? అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే.. అసలు శ్రీనివాసులురెడ్డి ఏనాడైనా పొత్తు ధర్మం పాటించారా?అంటూ జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు. పవన్ను ప్రశ్నించిన వాసు కడప నగరంలోని మున్సిపల్ హైస్కూళ్లో 2024 డిసెంబర్ 7వ తేదీన పవన్కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో పాల్గొన్నారు. ఆ బిల్లులు ఎక్కడా అని శ్రీనివాసులురెడ్డి నేరుగా ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్నే ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనసేన శ్రేణులు దాంతో మాకేం సంబంధం అంటూ, అసలు మీరు కడప జనసేన వారికి చేసిందేమీటంటూ ప్రశ్నిస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పొత్తు ధర్మం విస్మరించడంపై ధ్వజమెత్తారు. బిల్లుల స్వాహాకు యత్నించారని ఎదురుదాడి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కోసం ఏర్పాట్ల ఖర్చు విషయంలోనూ టీడీపీ నేతలు అక్రమాలకు తెరలేపారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎందుకు ఖర్చులు పెట్టాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. అవే బిల్లులు రాబట్టుకునేందుకు టీడీపీ నేతలు ఆర్అండ్బీలో బిల్లులు పెట్టారు. దాదాపు 20 లక్షలు చెల్లించాలని కోరారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అదే బిల్లులను కడప కార్పొరేషన్లోనూ ఎందుకు పెట్టారని జనసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10న నిర్వహించిన కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ సభ ఖర్చుల చిట్టాను ఉంచారు. పాలకవర్గం అంతా పరిశీలించి, తమకు సంబంధం లేని అంశం అంటూ ఆ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఇదే విషయాన్ని జనసేన నేతలు దెప్పి పొడుస్తున్నారు. అక్రమాలకు నిలయంగా నాటి హడావుడి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్తో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, నాటి హడావుడి ఇప్పుడు కూటమిలో చోటుచేసుకున్న అక్రమాలను బహిర్గత పర్చింది. సాక్షాత్తు పవన్ కల్యాణ్ కోసం చేసిన ఏర్పాట్ల బిల్లులనే ప్రభుత్వం ఇవ్వడం లేదనేది ఒక ఎత్తైతే...అసలు ఒకే బిల్లును రెండు శాఖల్లో వసూలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు డిప్యూటీ సీఎంను సైతం రోడ్డుమీదకు తెస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
వైన్షాప్లో చోరీ
వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్షాప్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్షాప్లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు. పిచ్చి కుక్క వీరంగంమదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ కంబాలపల్లిలో మంగళవారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది. గ్రామంలో ఊర, పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
స్మార్ట్ కిచెన్లతో ఆరోగ్యానికి భరోసా
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి శుభ్రమైన,సురక్షితమైన, పోషక విలువలు కలిగిన వేడివేడి భోజనం అందించడమే స్మార్ట్ కిచెన్ల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్మార్ట్ కిచెన్ల నిర్వహణపై సంబంధిత స్టేక్ హోల్డర్స్ కు అవగాహన పెంచే ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్య సభ్యులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఈఓ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వృద్ధులకు శాపం
● జిల్లా ఆస్పత్రిలో ఆగిన కంటి శస్త్రచికిత్సలు ● రోజూ వచ్చి వెనుతిరుగుతున్న వైనం ● పనుల నిర్వహణపై శ్రద్ధ చూపని కూటమి నాయకులుప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో రూ. 20.50 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కాకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది నవంబర్ 17న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర పనులు కొంచెం ఆలస్యంగా చేసినా.. కంటి విభాగం మాత్రం మొదటి ప్రాధాన్యతగా మార్చి చివరి నాటికి పూర్తి చేసి తమకు అప్పగించాలని ఆస్పత్రి అధికారులు కోరారు. అంతకంటే ముందుగానే పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు, టీడీపీ నాయకులు చెప్పారు. కంటి విభాగం పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతుండటంతో ఈ ఏడాది కంటి శస్త్రచికిత్స ఒక్కటి కూడా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలంలో 300కు పైగా కంటి ఆపరేషన్ల నిర్వహణ వేసవి కాలంలో పేద వృద్ధులు కంటి ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్రొద్దుటూరులో ప్రైవేట్ కంటి ఆస్పత్రులు అనేకం ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద కూడా శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఆపరేషన్లు చేయడానికి 20 నుంచి 30 రోజుల వరకు సమయం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ మంది జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు. పైగా ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు బాగా చేస్తారనే భావనతో.. ఇక్కడికి రావడానికే ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో ప్రతి యేటా 300కు పైగా జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. అయితే వేసవి ముగుస్తున్నా ఇప్పటికి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని కంటి విభాగంలో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారే కానీ.. ఇంత వరకు శ్వాబ్ పరీక్ష నిర్వహించలేదు. వారానికి ఒక సారి చొప్పున రెండు వారాలు ఆపరేషన్ థియేటర్లో శ్వాబ్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు, గాలిలో సూక్ష్మ జీవుల కాలుష్యాన్ని గుర్తించడం కోసం ఈ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడో.. కంటి ఆపరేషన్లు ప్రారంభమయ్యేది ఎప్పుడోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోగుల ఇబ్బందులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. చేతులెత్తేశారు.. నవంబర్లో పనులు ప్రారంభించినా.. మొదట్లో రెండు, మూడు నెలలు మందకొడిగా సాగాయి. తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు ఇతర టీడీపీ నాయకులు రెండు, మూడు సార్లు జిల్లా ఆస్పత్రిని సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. శిలాఫలకాన్ని ప్రారంభించి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఆస్పత్రిలోని 47 బ్లాకుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో చిన్న పిల్లల వార్డు, బ్లడ్బ్యాంక్, మూడు ఆప రేషన్ థియేటర్లను ఆధునీకరించాల్సి ఉంది. 200 వరకు మరుగు దొడ్లు కూడా నిర్మించాలి. అలాగే గ్రౌండ్ఫ్లోర్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాన్ఫరెన్స్ హాల్, శానిటేషన్ వర్కర్ల గదులు, అంబులెన్స్ షెల్టర్ తదితర పనులను ఇంకా ప్రారంభించనే లేదు.కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం కంటి విభాగం భవనాన్ని ఈ నెలాఖరు నాటికి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెప్పాడు. సాధ్యమైనంత తొందరగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కంటి విభాగం భవనంలో రూఫ్ వర్క్, పెయింట్ పనులు జరుగుతున్నాయి. తొందరలోనే కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆనంద్బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
సుండుపల్లె : జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు అయ్యాయి. సుండుపల్లె మండల పరిధిలోని బూడిదేటిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుణా ల వేడుకల రద్దీ వల్ల ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పీలేరుకు చెందిన మల్లిఖార్జునకు కాలు విరగ్గా, సుండుపల్లెకు చెందిన ఆసీఫ్, బాబ్జాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం – కారు ఢీ కలసపాడు : మండలంలోని పెండ్లిమర్రి వద్ద ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుడిమెరామ్మోహన్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. తన ద్విచక్ర వాహనంలో ఓ పని నిమిత్తం పోరుమామిళ్ళకు బయలుదేరాడు. పెండ్లిమర్రి వద్ద కలసపాడు నుండి పోరుమామిళ్లకు వెళుతున్న ఓ డ్రైవింగ్ స్కూల్ వాహనం రోడ్డుపై ఓ మహిళను తప్పించబోయి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న రామ్మోహన్ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రామ్మోహన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. -
ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.ముత్యాలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలసి ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటాలకు ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు టి.ముత్యాలరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీకి చెందిన విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం, డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ విలువైన స్థలాలను లీజు పేరుతో ప్రవేటువారికి దారా దత్తం చేయడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని పేర్కొన్నారు. -
సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కడప సెవెన్రోడ్స్ : కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోమ్మల వరప్రసాద్ అన్నారు. కర్నూలులో ఈనెల 6వ తేదిన మృతి చెందిన వీఆర్వో మహమ్మద్ హుసేన్కు నివాళులర్పిస్తూ మంగళవారం సాయంత్రం కడప సచివాలయ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోమ్మల వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు సెక్రటరీలకు పూర్తి స్థాయిలో పదోన్నతి ఇవ్వలేదన్నారు. ఐదు నెలలుగా మున్సిపల్ పన్నుల వసూళ్లు, వివిధ రకాల సర్వేలు, జనాభా లెక్కల సేకరణ, సిటిజన్ ఈకేవైసీ, కౌసలం సర్వే, బీఎల్ఓ డ్యూటీలు తమతో చేయిస్తున్నారని వివరించారు. దీంతో పండుగలు, పబ్బాలు అంటూ ఏమి లేకుండా కుటుంబాలతో గడిపే అవకాశాన్ని కోల్పొతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నాగార్జున, శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 112 కాల్
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి వేగవంతమైన స్పందన, తక్షణమే రంగంలోకి దిగిన ఇద్దరు బ్లూకోట్ పోలీసుల సమయ స్ఫూర్తితో.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడారు. డయల్ 112కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి కేవలం 10 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాలనుకున్న వ్యక్తిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చి శభాష్ పోలీసు అని ప్రజల మన్నననలు పొందారు. పోలీసు వివరాల మేరకు.. కడప నగరం ప్రకాష్నగర్ పరిధిలో ఓ వ్యక్తి చికెన్ సెంటర్ను నడుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరాడు. ఆందోళనకు గురైన ఇంటిలోని కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కమాండ్ కంట్రోల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ హెడ్కానిస్టేబుల్ మూర్తి, కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్రఫితోపాటు బ్లూకోట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి బాధితున్ని గుర్తించే క్రమంలో ట్రాక్ వెంబడి జల్లెడ పడుతూ వెళుతుండగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి లొకేషన్ను గుర్తించి కడప రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గంలో పుట్లంపల్లి సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ట్రాక్ వెంబడి గాలిస్తూ ట్రాక్పై ఉన్న బాధిత వ్యక్తిని తక్షణమే ట్రాక్ నుంచి తప్పించి సురక్షితం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారికి అప్పగించారు. కడప తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫి, బ్లూకోట్ సిబ్బంది, హెడ్కానిస్టేబుల్ నజీర్, కానిస్టేబుల్ రంగనాథ్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
పగలంతా ఉక్కపోత.. రాత్రికి కుండపోత !
కడప కోటిరెడ్డిసర్కిల్: పగలంతా ఉక్కపోత... సాయంత్రానికి నల్ల మబ్బుల జాతర.. కాస్త పొద్దు వాలగానే ఒక్కసారిగా కుండపోత.. ఇదీ మంగళవారం కడపలో వాతావరణం. నల్లని మబ్బులన్నీ ఒక్కసారిగా కరిగిపోవడంతో కడప నగరం వర్షంలో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారుల్లోనే వర్షపు నీరు వరదలా పారింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్జీఓ కాలనీ, మృత్యుంజయకుంట, అప్సర సర్కిల్, చిన్నచౌకు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మొత్తం మీద ఓ మోస్తరు వర్షం కారణంగా నగర వాసులకు తిప్పలు తప్పలేదు. కడపలో మురికి నీటితో కలిసి రోడ్డుపై పారుతున్న వర్షపునీరు -
చిట్టీల వ్యాపారి కుచ్చుటోపీ
రాజంపేట : రాజంపేటలో చిట్టీల వ్యాపారి చేసే కంచి నాగేంద్ర వర్మ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. అధికార పార్టీకి చెందిన నేతను అడ్డుపెట్టుకుని మోసం చేశా డు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు స్కెచ్ వేశాడు. బాధితుడు ధనుజంయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కంచి నాగేంద్రవర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్స్టేషన్కు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట పట్టణం ఎల్లాగడ్డ గ్రామానికి చెందిన కంచి నాగేంద్రవర్మ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. రాజంపేటతోపాటు రైల్వేకోడూరు ప్రాంతంలోనూ చిట్టీలు వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 50 కోట్లకు పైగా చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో నమ్మకస్తుడిగా వ్యవహరించిన నాగేంద్రవర్మ కొన్ని రోజులుగా తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండ చూసుకుని కుచ్చుటోపీకి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు 70 లక్షల రూపాయలు మోసపోయానని గ్రహించిన ధనంజయ అనే వ్యక్తి రెండు రోజుల కిందట ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ రాజంపేట అర్బన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో నాగేంద్ర వర్మ మోసం చేశాడన్న విషయం తెలిసి బాధితులు.. ఒక్కొక్కరిగా రాజంపేట అర్బన్ స్టేషన్కు తరలిరావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లో బాధితుల పంచాయితీ ఉదయం కొనసాగుతూనూ వచ్చింది. నాగేంద్రవర్మ బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల రూపాయిలు బాకీ అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు రూ.50 కోట్ల వరకు చిట్టీల లావాదేవీలు జరిపినట్లుగా సమాచారం వస్తోంది. ఈ విషయమై సీఐ నాగార్జునను వివరణ కోరగా నాగేంద్రను విచారణ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఇన్చార్జిపై ఆరోపణలు చేసిన బాధితుడు పోలీసుస్టేషన్లో ఉన్న చిట్టీల వ్యాపారి విషయంలో బాధితుడు జాఫర్ అనే వ్యక్తి పీఎస్ వద్ద టీడీపీ ఇన్చార్జి జగన్మోహన్రాజుపై ఆరోపణలు చేశారు. నాగేంద్రవర్మకు అతని అండ ఉందని తెలిపాడు. కొంత సేపు గడిచాక తిరిగి తనకు తెలియదంటూ, ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి చెప్పమంటే చెప్పానంటూ ప్లేటు ఫిరాయించడం గమనార్హం. స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు టీడీపీ నేతపై ఆరోపణలు చేసిన జాఫర్పై పచ్చమూకలు దౌర్జన్యం చేయడానికి రాజంపేట పట్టణ పోలీసు స్టేషన్కు తరలిరావడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో బాధితునికి, ముఖ్య నేత వర్గీయులకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ నాయకులు దూషణపర్వం కొనసాగించారు. దాదాపు 20 మందికిపైగా పచ్చమూకలు స్టేషన్ ఎదుట వీరంగం సృష్టించారు. రాజంపేటలో సంచలనంగా మారిన వ్యవహారం పోలీసుల అదుపులో చిట్టీల వ్యాపారి నాగేంద్ర స్టేషన్కు తరలివచ్చిన బాధితులు ఉదయం నుంచి రాత్రి వరకు ఠాణా వద్ద ఉద్రిక్తత స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు -
బిల్లులు లేకుండా బంగారు నగలు విక్రయించొద్దు
ప్రొద్దుటూరు క్రైం : బిల్లులు లేకుండా బంగారు నగలను విక్రయించరాదని ప్రొద్దుటూరు బంగారు దుకాణ యజమానులకు ఏఎస్పీ విభూకృష్ణ సూచించారు. పట్టణంలోని బంగారు వ్యాపారులు, అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం ఏఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దుకాణ యజమాని నాణ్యమైన సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. మెయిన్బజార్, దర్గాబజార్, పాతమార్కెట్ సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దుకాణదారులు సహకరించాలన్నారు. రహదారికి ఇరువైపులా దుకాణాల ముందు ఒక లైన్ను ఏర్పాటు చేసుకొని లైన్ లోపలే బైక్లు నిలుపుకొనేలా ఎవరికి వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బంగారు నగలను విక్రయించడానికి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దొంగ బంగారు కొనుగోలు చేసి ఎవరూ ఇబ్బందులు పడరాదని సూచించారు. బిల్లులు లేకుండా బంగారు విక్రయించరాదని, తగు ఆధారాలతో బంగారు నగలను విక్రయించడం శ్రేయష్కరమన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బుశెట్టి రామ్మోహన్రావు, ఉప్పలూరు ఇలియాస్, సీఐలు టీవీ కొండారెడ్డి, వంశీనాథ్, ట్రాఫిక్ సీఐ సురేష్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంగారు హారం అపహరణ
ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ధరించిన బంగారు హారం మంగళవారం చోరీకి గురైంది. బాధిత మహిళ సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన ప్రమీళ అనే మహిళ కడపలో ముద్దనూరుకు చెందిన వారి వివాహానికి హాజరై తిరిగి మధ్యాహ్నం కడపలో బైపాస్ రైడస్ బస్సులో ఎక్కింది. ముద్దనూరులోని 4 రోడ్ల కూడలిలో బస్సు దిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి గమనించగా తన మెడలో ధరించిన సుమారు 3 తులాల బంగారు హారం చోరీకి గురైనట్లు గుర్తించింది. కడప బస్టాండు నుంచే ఇద్దరు మహిళలు తన పక్కలోనే వున్నారని, వారిరువురు కూడా తనతోపాటు బస్సులో ఎక్కి, వారు కూడా ముద్దనూరులోనే దిగి వెళ్లిపోవడం తాను చూశానని ఆమె తెలిపారు. బస్సులో ప్రయాణించే సమయంలోనే వారు హారం కాజేసి వుంటారని ఆమె పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య మైదుకూరు : మున్సిపాలిటీలోని గడ్డంవారిపల్లె వద్ద ఉన్న ఇండస్ట్రీయల్ సముదాయంలో వాచ్మెన్గా పని చేస్తున్న చల్ల ఆంజనేయులు(70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయులు నిత్యం మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. తాను బతకనని భార్య సావిత్రి, కొడుకు లక్ష్మీనారాయణతో చెప్పేవాడు. శుక్రవారం ఓ వేరుశనగ ఆయిల్మిల్లు సమీపంలో విషద్రావణం సేవించగా అక్కడున్న వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మృతి చెందాడు. కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి(40) చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో ఉదయం 5 గంటలకు మృతి చెందారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తి మృతి జమ్మలమడుగు : పట్టణంలోని ధనలక్ష్మీ సినిమా హాల్ వీధికి చెందిన కాకరవాద దస్తగిరి(53) అనే వ్యక్తిని సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పెన్నానదిలో పడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దారిన పోతున్న కొంత మంది వ్యక్తులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది దస్తగిరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున గౌస్పీర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్బన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడిచక్రాయపేట : మండలంలోని ఎర్రబొమ్మనపల్లె గ్రామ సమీపంలో మంగళవారం పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. నాగరాజునాయక్, అనిల్ కుమార్, వెంకట రామిరెడ్డి, అమర, నాగిరెడ్డితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.52,340లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు తెలుగు తమ్ముళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దొరికిన మొత్తం కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు ఆ ప్రాంతీయులు తెలిపారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ సామగ్రిని అపహరించిన నలుగురిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని మట్టిమసీదు వీధికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్ కార్పెంటర్ పని చేసేవాడు. ఇతను ముగ్గురు మైనర్ బాలురులతో కలసి యర్రగుంట్ల, జమ్మమడుగు బైపాస్ రోడ్డులో గత నెల 17న రాత్రి సమయంలో కడ్డీలు కటింగ్ చేసే మిషన్ను దొంగలించాడు. అదే రోజు రాత్రి మరో రెండు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పని ముట్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు షేక్ సాధక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో ఉండగా ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో మాతృభాష అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ యం.వి రామచంద్రారెడ్డి కోరారు. అపుస్మా కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నాగార్జున మోడల్ స్కూల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలుగు భాష ప్రపంచ రికార్డు’లక్ష్యంతో కూడిన రెండు రోజుల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో వాగ్దేవి బిరుదాంకితుడు భాస్కర్ రాజు, వారి కుమార్తె అశ్విని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తెలుగు భాషను విద్యార్థులకు సులభతరంగా, ఆసక్తికరంగా బోధించే పద్ధతులతోపాటు తెలుగు భాష ప్రపంచ రికార్డు కార్యక్రమం గురించి ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సభకు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రేమాభిమానాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యాలు, అతిథులను అభినందించారు. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అపుస్మా జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి రమణారెడ్డి, అపుస్మా కడప జిల్లా అధ్యక్షుడు బి.గంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, జనరల్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, ట్రెజరర్ నాగసుబ్బారెడ్డి, కడప సిటీ అధ్యక్షురాలు మైథిలి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పద్మనాభరెడ్డి, అపుస్మా జిల్లా నాయకులు రామక్రిష్ణారెడ్డి, రమణారెడ్డి, నిర్మల, షహనాజ్ బేగంతోపాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా !
కడప కార్పొరేషన్/కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాచునూరు, నందిమండలం, అలిదెన, పగిడాల పల్లె, జమాల్పల్లె, కొండపేటలో మట్టి, గ్రావెల్, నల్లమట్టి మాఫియా రెచ్చిపోతోందని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విలువైన మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రూ.కోట్లలో మట్టి, గ్రావెల్ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ దందాను బీజేపీ తరఫున ఖండిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా మైనింగ్ శాఖ స్పందించి, అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి -
‘ఆర్టీపీపీలో చిరుత ఆనవాళ్లు కనిపించలేదు’
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచారం చేసిన అనవాళ్లు కనిపించలేదని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆర్టీపీపీలో ఫారెస్ట్, ఎస్పీఎఫ్, విజిలెన్స్, ఆర్టీపీపీ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా చిరుత సంచరించిందని స్థానికులు చెప్పిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీపీపీలో చిరుత పాదముద్రలు, గుర్తులు ఇతర ఆధారాలు లభించలేదన్నారు. ఆర్టీపీపీ పరిసరాలు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణుల సంచారం సాధారణమన్నారు. వారానికి రెండు, మూడు సార్లు రాత్రి వేళల్లో బాణసంచా పేల్చడం ద్వారా అడవి జంతువులు ప్లాంట్ సమీపంలోకి రాకుండా చూడొచ్చన్నారు. రాత్రి షిఫ్టులలో విధులు నిర్వహించే వారు చీకటి ప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దన్నారు. వ్యక్తిగత భద్రత కోసం లాఠీ, కర్రను వెంట ఉంచుకోవాలన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ హనుమన్న, ఎస్పీఎఫ్ ఏసీ క్రిష్ణయ్య, ఆర్ఐ రమేష్, విజిలెన్స్ సీఐ నారాయణయాదవ్ ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. -
ఇంధన ధరల పెంపుపై నిరసన
కడప సెవెన్రోడ్స్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించకుండా మోదీ ప్రభుత్వం అమెరికా కాళ్ల వద్ద సాగిలపడిందని విమర్శించారు. చౌకగా వస్తున్న రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేజీ బేసిన్లోని గ్యాస్ నిక్షేపాల్లో 50 శాతం రాష్ట్ర వాటాను కేంద్రం నుంచి తీసుకు రాలేకపోయిందని ధ్వజమెత్తారు. సీపీఐ నాయకుడు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, కేసీ బాదుల్లా, వెంకట శివ, మద్దిలేటి, సీపీఎం నాయకుడు రామ్మోహన్రెడ్డి, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ – జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం కడప సెవెన్రోడ్స్ : వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం ఆదేశించారు. మంగళవారం కడప జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, స్వచ్ఛరథం కార్యక్రమాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించి లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆదేశించారు.బాధితులకు ఆశ్రయం కడప సెవెన్రోడ్స్ : సోమశిల వెనుక జలాల్లో చేపల వేటకు వెళ్లి దళారుల వలలో చిక్కుకున్న 11 మంది బాధితులకు అధికారులు విముక్తి కలిగించారు. అనంతరం వారిని కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహానికి చేర్చారు. వీరిలో ఏపీకి చెందిన వారే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిని స్వగ్రామాలకు పంపించే వరకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. వీరికి రక్షణగా నందలూరు పోలీసులను ఏర్పాటు చేశా రు. కాగా వీరిని కొందరు దళారులు చేపల వేటకోసమంటూ మభ్యపెట్టి ఇక్కడికి రప్పించుకుని సరైన జీతభత్యాలు ఇవ్వకుండా.. ఇళ్లకు పోనియకుండా వేధిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్, ఏఎస్పీ సూచనల మేరకు వీరికి ఆ శ్రయం కల్పించామని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. యోగాతో ఆరోగ్య భాగ్యం కడప సెవెన్రోడ్స్ : యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్ రాజారెడ్డిక్రికెట్ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఫ్యామిలీ యోగా కార్యక్రమం ఉంటుందని, ఇందులో ప్రతి కుటుంబం ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ యోగాంధ్ర.ఏపీ.జీఓవీ.ఇన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్ !
● ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుల్లో వైఎస్సార్సీపీ నేతలు ● కడప, కమలాపురం నియోజక వర్గాల్లో నిరసన సదస్సులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసనలో భాగంగా కడపలో జరిగిన సదస్సులో నినదిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు సురేష్ బాబు, పాకా సురేష్, మాసీమబాబు తదితరులు కమలాపురంలో నిరసన సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కడప కార్పొరేషన్: మోసం, అబద్ధాలు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కె. సురేష్ బాబు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. మంగళవారం కడపలోని మున్సిపల్ మైదానం వద్దనున్న ఐఎంఏ హాలులో నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతూ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ కడప నియోజకవర్గ పరిశీలకులు ఎస్. గురుమోహన్, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డాక్టర్ సొహైల్, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నమ్మించి వంచించడం చంద్రబాబుకు బాగా అలవాటన్నారు. ● కమలాపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీ ఎస్ఈసీ సభ్యులు సంబటూరు ప్రసాద్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, ఆరు మండలాల కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రతిసారీ ఆయన అబద్ధాలతోనే అధికారంలోకి వస్తున్నారని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని కోరారు. -
గాయపడిన వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని వై.కోడూరు గ్రామానికి చెందిన యాపరాల చిన్న నాగిరెడ్డి(83) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఈ నెల 1న నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారుబాలుడికి తీవ్ర గాయాలు మైదుకూరు : విహార యాత్రకు వెళుతున్న ఆ కుటుంబానికి విషాదం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన దాదాపీర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో సొంత ఆటోలో నెల్లూరు జిల్లా కలువాయికి విహార యాత్రకు బయల్దేరారు. అక్కడ అందమైన ప్రకృతి, జలపాతాలు చూసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళుతుండగా బళ్లారి – కృష్ణపట్నం హైవే బైపాస్పై మున్సిపాలిటీలోని సరస్వతి పేట వద్ద ఆటోను కారు ఢీకొన్నది. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా షామీర్ అనే 13 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. -
బధిరుడిగా నటించి.. నగలు అపహరించి..
● తమిళనాడు వాసి అరెస్ట్ ● రూ.14.50 లక్షల బంగారు, వెండి నగలు స్వాధీనంప్రొద్దుటూరు క్రైం : అతను బధిరుడు కాదు.. అయితే మూగ, చెవిటి వాడిలా నమ్మించి భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన తమిళనాడు వాసిని ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా ఉదయరాజు పాలెం గ్రామానికి చెందిన శివకుమార్ మునియప్పన్ కూలి పని చేస్తుంటాడు. రోజూ కష్టపడ్డా డబ్బులు మిగలడం లేదని భావించిన అతను మూగవాడి ముసుగులో చిన్న చిన్న దొంగతనాలు చేయాలని భావించాడు. అయితే స్థానికంగా తిరిగితే ఎవరైనా గుర్తు పడతారని భావించి, ప్రొద్దుటూరుకు వచ్చాడు. తమిళనాడు నుంచి రైలులో బయలుదేరి ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఎర్రగుంట్లలో దిగాడు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరుకు వచ్చాడు. తన వద్ద ఒక చీటి పెట్టుకున్నాడు. ఒక డాక్టర్ సర్టిఫైడ్ చేసినట్లుగా ఉన్న ఆ చీటిలో ‘ఈ వ్యక్తికి చెవుడు, మూగ. ఇతనికి తల్లిదండ్రులు బంధువులు ఎవరూ లేరు. ఈ చీటి చూసిన వారు తగిన ఆర్ధిక సాయం చేయగలరు’ అని రాసి ఉంది. అతను బంగారు అంగళ్లలోని ఇళ్లకు తిరుగుతూ ఆ చీటీని చూపించేవాడు. చీటి చూసిన కొందరు మానవతా హృదయంతో ఆర్థిక సాయం చేసేవారు. ఇలా ఎవరూ చూడని సమయంలో ఇంట్లోని మొబైల్ ఫోన్లు, వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు దొంగలించేవాడు. ఈ క్రమంలో శంకరయ్య గారి వీధి గుండా వెళ్తున్న అతను గంగనపల్లి శివాజీరావు ఇంట్లోకి వెళ్లాడు. శివాజీరావు భార్య అస్వస్థతతో పడుకొని ఉండగా నేరుగా పూజ గదిలోకి వెళ్లి బంగారుతో అల్లిన రుద్రాక్ష మాల, బంగారు చైన్, బంగారు, వెండి ఉంగరాలను దొంగలించి పారిపోయాడు. శివాజీరావు ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ, నాట్గ్రిడ్ టెక్నాలజీ ద్వారా పోలీసులు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. ఈ క్రమంలో అతన్ని వాసవి సర్కిల్లో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ,14.50 లక్షలు విలువైన బంగారు, వెండి నగలతోపాటు హెచ్పీ ల్యాప్టాప్, ట్యాబ్, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసలుఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరచి నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పూర్తి స్థాయిలో చోరీ సొత్తును రికవరీ చేయడంలో విశేష కృషి చేసిన వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కే బాషా, వై నరసింహనాయుడు, సాయికిశోర్లను ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. -
బ్యాంకు అధికారులపై రైతుల ఫిర్యాదు
లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామ అరటి రైతులు సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాలలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఫిర్యాదు చేశారు. గతేడాది మే నెలలో వీచిన ఈదురు గాలులకు గుణకణపల్లెలో భారీగా అరటిపంట నేలకొరిగిందన్నారు. అప్పట్లో ఉద్యాన శాఖ అధికారులు నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. గతంలో ఏపీజీబీ బ్యాంక్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఐఎస్ఎఫ్సీ కోడ్ మారడంతో.. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదన్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించగా తాము రైతుల అకౌంట్ నంబర్లు, బ్యాంకు ఐఎస్ఎఫ్సీ కోడ్ నంబరు ఇచ్చామన్నారు. నష్టపరిహారం డబ్బులు కూడా అందులో పడ్డాయని, బ్యాంక్ అధికారుల తప్పిదంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలుమార్లు బ్యాంక్ చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని గ్రీవెన్స్ సెల్ అధికారి రైతులకు హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మునేశ్వర్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, బెస్త రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
మైదుకూరులో పట్టపగలే చోరీ
మైదుకూరు : మైదుకూరు పట్టణ పరిధిలోని శ్రీనగరంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామంలోని గోశెట్టి చిన్నరామ తులసయ్య అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఇంట్లో ఉండగానే.. ఇంటి యజమాని రామ తులసయ్య రావడంతో వెనుక వైపున తలుపు తీసుకొని పారితోతుండగా గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామతులయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. కొన్నేళ్ల కిందట ఆయన భార్య రామలక్షుమ్మ మృతి చెందడంతో రామతులసయ్య ఒంటరిగా ఉంటున్నారు. ప్రతి రోజూ మైదుకూరుకు వెళ్లి మధ్యాహ్నం వేళ పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన కుమార్తె ఇంటి నుంచి భోజనాన్ని తీసుకుని ఇంటికి వచ్చేవాడు. సోమవారం ఇంటికి తాళం వేసి యథావిధిగా రామతులసయ్య మైదుకూరుకు వెళ్లాడు. రోడ్డుపై ఇల్లు ఉండటం, ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇదే అదనుగా భావించిన దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఓ గదిలో ఉన్న మూడు బీరువాల తలుపులను అక్కడ ఉన్న స్క్రూ డ్రైవర్తో తెరిచాడు. బీరువాల్లో విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగానే రామతులసయ్య తలుపు తట్టాడు. యజమాని వచ్చినట్టు భావించిన అగంతకుడు వెనుక వైపునున్న తలుపును తెరిచి గోడ దూకి పరుగెత్తాడు. గ్రామస్తులు గమనించి వెంబడించి పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దొంగ జేబుల్లో వెతకగా రామతులసయ్య ఇంట్లో బీరువా నుంచి తీసిన రూ.800 నగదుతోపాటు కొంత బంగారం ఉన్నట్లు గుర్తించారు. తన ఇంట్లో బంగారు ఆభరణాలేవీ పెట్టలేదని, కేవలం కొంత నగదు మాత్రమే దొంగలించాడని ఈ సందర్భంగా రామతులసయ్య తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి నగదు, బంగారాన్ని, దొంగను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. రామతులసయ్య ఇంట్లో చోరీ చేసే ముందు సదరు దొంగ దువ్వూరు మండలంలో చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణను వివరణ కోరగా దొంగను నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన జగన్నాథం కిరణ్గా గుర్తించామని, విచారణ చేస్తున్నామని తెలిపారు.దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు -
టెట్లో అర్హత మార్కులు అందరికీ సమానంగా ఉండాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఒక్కొక్క రాష్టం ఒక్కొక్క విధంగా అర్హత మార్కులు పెట్టాయని, ఇది సబబుగా లేదని ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, ఓసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కందనూరు వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కాలేజీలో వారు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టెట్లో ఓసీలకు 90 మార్కులు(60శాతం), బీసీలకు 75 మార్కులు(50 శాతం), ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు(40 శాతం ) అర్హతగా నిబంధనలు పెట్టి ఓసీలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద ఒకే విధంగా అన్ని వర్గాలకు సమానంగా అర్హత మార్కులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పెట్టి ఓసీలను సర్వ నాశనం చేసారని అన్నారు. ఈ విధానం తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని అన్నారు. టెట్లో పెడితే అందరికి సమానంగా అర్హత మార్కులు పెట్టాలి లేదా ఓసీలకు 15 శాతం అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. -
దగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి
కడప సెవెన్రోడ్స్ : డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్కుమార్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకుడు సీహెచ్ వినోద్కుమార్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. డీఎస్సీ ఎలిజబుల్, మెరిట్ జాబితాలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ నిర్వహించాలన్నారు. ఇందుకు బాధ్యులైన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. 1:1 నిష్పత్తి మేరకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు అంటే మోసమని, అదే బాటలో ఆయన తనయుడు లోకేష్ కూడా వెళుతున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు త్యాగరాజు, బాబు, రవి, పెంచలయ్య, ప్రభుదాసు, రత్నకుమారి, మరియలు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆందోళన -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 191 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీంతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేత వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 120 మంది పోలీస్ సిబ్బందికి హ్యాట్స్, చలువ కళ్లద్దాలు, మాస్క్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, స్పెషల్బ్రాంచ్ సీఐ సదాశివయ్య, ట్రాఫిక్ సీఐ మర్రి తులసీరామ్, ట్రాఫిక్ ఎస్ఐలు నారాయణ, నాగరాజు, సిద్దయ్య, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ పాఠశాలలపై పన్నుల భారం తగదు
కడప ఎడ్యుకేషన్ : ఎప్పుడూ లేని విధంగా ప్రొఫెషన్ టాక్స్ పేరుతో చిన్నా చితక బడ్జెట్ స్కూల్స్కు కూడా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని, ఇది చాలా అన్యాయమని కృస్మా జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి అన్నారు. చిన్న పాఠశాలలు నెలనెలా జీతాలు ఇవ్వడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్ల నుంచి ప్రొఫెషన్ టాక్స్ కట్టించాలి అని చెప్పడం ఎంత వరకు న్యాయం అన్నారు. ఈ విషయమై కమర్షియల్ టాక్స్ శాఖ జారీ చేసిన ప్రొఫెషన్ ట్యాక్స్ నోటీసులపై సోమవారం కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ కేథారేశ్వరావును ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్తో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ చిన్న జీతాలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఇటువంటి టాక్స్ కట్టాలని చెప్పడం వల్ల ప్రైవేట్ టీచర్లు ఆ వృత్తి మానుకొని దినసరి కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల జీతాలు, విద్యుత్ చార్జీలు, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాలు గణనీయంగా పెరగడంతో పాఠశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రొఫెషన్ ట్యాక్స్ భారం తక్కువ బడ్జెట్ పాఠశాలలపై మరింత ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇటువంటి పాఠశాలలకు మినహాయింపు లేదా ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజానికి సేవ చేస్తున్న తక్కువ బడ్జెట్ విద్యాసంస్థల పరిస్థితిని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులను కలసి సమస్యలపై చర్చిస్తామన్నారు. తాము పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన పలువురు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆల్విన్
● ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని ఆల్విన్ వెనుకవైపు నుంచి ఢీకొనడంతో ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామానికి చెందిన కట్టా వాసుబాబు(39) తన స్వగ్రామం నుంచి మదనపల్లెకు టమాట లోడు తీసుకువచ్చేందుకు బయలుదేరాడు. బద్వేలు సమీపంలోకి వచ్చేసరికి చెన్నంపల్లె వద్ద రోడ్డు పక్కన ఓ లారీ ఆపి ఉండటంతో.. అర్ధరాత్రి పూట సరిగా కనిపించక వెనుకవైపు నుంచి లారీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో వాసుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించి వాసుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు. మైదుకూరు : జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరులోని కొత్త కొట్టాలు వీధికి చెందిన పసుపుల నరసింహ, నాగేళ్ల పవన్ కుమార్ అనే వారు దువ్వూరు నుంచి మోటార్ బైక్పై మైదుకూరుకు వస్తుండగా శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సంఘటనలో నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే విధంగా దువ్వూరుకు చెందిన పున్నం నడిపి సుబ్బరాయుడు, అతని కుమారుడు రామసుబ్బయ్య మైదుకూరు నుంచి ఎర్రగడ్డల బస్తాలు తీసుకుని ఆటోలో వెళుతుండగా.. వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరికీ గాయాలయ్యాయి. కుక్క అడ్డు రావడంతో.. కడప అర్బన్ : కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని బంజారాహిల్స్లో నివసిస్తున్న షేక్ ఖాసిం సాహెబ్, భార్య షేక్ రహజాన్, కుమారుడు అబ్బాస్ అలీ, కుమార్తె ఆయేషాలు కారులో కడపకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. కడపలో బంధువుల ఇంటికి వివాహానికి హాజరు కావాలనుకుని వచ్చారు. వినాయక నగర్ దగ్గరికి వచ్చేసరికి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రహజాన్, అబ్బాస్ అలీ, ఆయేషాలు గాయపడ్డారు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు ‘డయల్ యువర్ సీఎండీ
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి డీఆర్వో మల్లికార్జునుడుకడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ● కలెక్టరేట్లోని సభా భవన్లో సోమవారం ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని డీఆర్వో సూచించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం పదిలం మదనపల్లె సిటీ : క్రీడలతో మానసికోల్లాసం, మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని బీటీ కాలేజీ మైదానంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు, సైక్లింగ్ వల్ల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.సైక్లింగ్ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో రిటైర్డు డీఎస్డీఓ సయ్యద్బాషా, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత
కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వినయ్కుమార్ సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’పై ఆదివారం కడపలోని గాంధీనగర్ హైస్కూల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వినయ్ కుమార్ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్ల పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చేతులు కడుక్కోవాలన్నారు. బయటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన లేదా కాలం తీరిన ఆహారం తీసుకోకూడదు సూచించారు. అలాగే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్లైన్ నెంబర్ 1098, ఉచిత న్యాయ సాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారి దృష్టికి తీసుకొని రావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారులు హరిత, రమేష్ కుమార్రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ చంద్రకాంతమ్మ, సంత, ప్రవీణ్, కడప మండలంలోని హోటల్స్ సిబ్బంది, పార లీగల్ వాలంటీర్స్ దశరథరామిరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మైదుకూరులో యువకుడి దారుణ హత్య
మైదుకూరు : మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సంపంగి నాగేంద్ర(37) అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరు అర్బన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేంద్ర ఆటో డ్రైవర్గా, బేల్దారిగా పని చేస్తుంటాడు. ఆయనకు ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన జ్యోతి అనే యువతితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల నయనిక అనే కుమార్తె ఉంది. రోజూ మద్యం తాగుతుండటంతో జ్యోతి నాగేంద్రతో గొడవపడి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. మద్యం తాగాక నాగేంద్ర రోజూ కాలనీలోని గుడి ఆవరణలో ఉన్న అరుగుపై పడుకునేవాడు. కాలనీకే చెందిన గాలి సుదర్శన్రెడ్డి అనే యువకుడితో కలిసి తిరిగేవాడు. సుదర్శన్రెడ్డి తల్లి గురించి నాగేంద్ర చెడుగా ప్రచారం చేసేవాడు. తన తల్లిపై దుష్ప్రచారం మానుకోకపోతే నాగేంద్రను ఎప్పుడైనా చంపుతానంటూ సుదర్శన్రెడ్డి చెప్పేవాడు. ఆ ప్రకారమే శనివారం రాత్రి గుడి ఆవరణలోని అరుగుపై నిద్రపోతున్న నాగేంద్రపై ఆదివారం తెల్లవారుజామున సుదర్శన్రెడ్డి మచ్చుకత్తితో దాడి చేసి ముఖంపై పలుమార్లు నరికాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగేంద్ర తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ అలియాస్ చిన్న షకీలా.. సుదర్శన్రెడ్డి తన అన్నను నరుకుతున్నాడని చూసి గట్టిగా కేకలు వేసి వెంబడించగా అతను పారిపోయాడు. నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేసి సుదర్శన్రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
బైక్పై నుంచి పడి యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మండలం మాచుగారిపల్లె వద్ద బైక్పై నుంచి కింద పడి కొండెపోగు కళ్యాణ్కుమార్(32) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠం అంబేడ్కర్ నగర్కు చెందిన కళ్యాణ్ కుమార్ కడపలోని ఓ బ్యాంక్లో అటెండర్గా పని చేస్తుంటాడు. అక్కడే ఉంటూ వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి తన బంధువు భాస్కర్తో కలిసి బైక్పై కడప నుంచి మైదుకూరు మండలంలోని జీవీ సత్రం మీదుగా ఇంటికి బయల్దేరాడు. మాచుగారిపల్లె వద్ద బైక్ అదుపు తప్పడంతో కళ్యాణ్ కుమార్ బైక్పై నుంచి బోర్లా కిందపడ్డాడు. ముఖం, ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై మృతి చెందాడు. సంఘటనపై మృతుడి తమ్ముడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
విత్తన ఎంపికే కీలకం
● నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు ● చీడపీడలకు చెక్ ● ఖరీఫ్లో 79,773 హెక్టార్లలో సాగు కడప అగ్రికల్చర్: పంటలసాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతోపాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపికతో చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో నిర్లక్ష్యం చేయకుండా..వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదులుకుని దిగుబడి వరకు.. పెట్టిన పెట్టుబడి ఖర్చు, రైతుల కష్టం నేలపాలు అవుతుంది.అందువల్ల పంటల సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ప్రారంభమైన ఖరీప్ సీజన్... రాష్ట్రానికి మరో వారం రోజుల్లో రుతుపవనాల రానున్నాయి. రుతుపవనాలతో సంబంధం లేకుండా ఇప్పటికే జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కూడా కాడి, మేడి సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దుక్కులు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 79,773 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీతో మంజూరు చేసింది. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన సిద్దవటం, చెన్నూరు. కమలాపురం, చాపాడు తదితర మండలాల పరిధిలో నీటి వసతి ఉన్న వారు వరినారు సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వేరుశనగ సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు.అయితే వ్యవసాయ అధికారుల సర్టిఫైడ్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. దీంతోపాటు కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంటపేరు సాగు (హెక్టార్లలో) వరి 33078 కంది 5992 మొక్కజొన్న 1495 మినుము 3745 వేరుశనగ 4446 ఉల్లి 5203 సోయాబీన్ 1074 సన్ఫ్లవర్ 837 సజ్జ 994 కొర్ర 569 జొన్న 428 వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తనాలను కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటినవి ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. విత్తనాల సంచిపైన సీల్ ఉందా, లేదా అని చెక్ చేసుకోవాలి. రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలకశాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థల్లో.. రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థలు, ఏఆర్ఎస్ సెంటర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అక్కడ వీలుకాకపోతే లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలకశాతం చెక్ చేసుకోవాలి.మొలక శాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. – ప్రభాకర్రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఊటుకూరు, కడపడీలర్లు వద్ద విత్తనాలు కొనుగోలు చేసే రైతులు డీలర్లను అడిగి బిల్లులు తీసుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు వీటిని భద్రంగా దాచుకోవాలి. పంటలో పూత పిందె, దిగుబడిలో తేడా వస్తే స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – మట్టా. సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
రీచార్జ్ బోర్వెల్స్ ప్రాజెక్టు విజయవంతం
● మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఈ వినూత్న ప్రాజెక్టుకుర శీకారం: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ● ప్రాజెక్టు విజయవంతంపై రైతుల హర్షంలింగాల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతోనే మండలంలోని గుణకనపల్లెలో రీచార్జ్ బోర్ల ప్రాజెక్టును ప్రారంభించామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లింగాల మండలం గుణకనపల్లె గ్రామంలో ఆదివారం భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుణకనపల్లె గ్రామానికి కృష్ణా జలాలను తరలించేందుకు సుమారు రూ. 5 కోట్ల నిధులు వెచ్చించారన్నారు. దీంతో ప్రత్యేక పంపుహౌస్, మోటార్లు, పైపులైన్ పూర్తి చేశామన్నారు. సుమారు 100 మీటర్ల మేర అక్కడి రైతులు భూ సేకరణకు అంగీకరించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. తాజాగా తమ గ్రామానికి కృష్ణా జలాలను తరలించాలని అక్కడి ప్రజలు, రైతులు, కుడికాలువ అధికారులు కోరడంతో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని ఎంపీ తెలిపారు. ఆయన ఆదేశాలతో సుమారు రూ. 15 లక్షల ఎంపీ నిధులను వెచ్చించి వంద మీటర్ల పైపులైన్ ఏర్పాటుతోపాటు ఐదు బోరుబావులను తవ్వించామని వెల్లడించారు. బోరు బావులకు ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలను బోరు బావుల్లోకి పంపించా మని వివరించారు. బోరు బావుల్లో సుమారు 20–30 అడుగుల సొరంగమార్గాలు ఏర్పడ్డాయని, పొడవు కిలోమీటర్ల మేర ఉండవచ్చన్నారు. ఈ బోరు బావుల్లోకి పంపిస్తున్న కృష్ణా జలాలు సొరంగ మార్గాల ద్వారా వెళ్లి పరిసర ప్రాంతాలు, గ్రామా ల్లోని రైతుల బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని వివరించారు. చిత్రావతి నుంచి పాపాగ్ని నది వరకు భూగర్భంలో ఉన్న సొరంగ మార్గాలలో 120 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా కృష్ణా జలాలు బోరు బావుల ద్వారా సొరంగ మార్గాల్లో వెళుతుండడంతో గుణకనపల్లె, రామట్లపల్లె గ్రామాలలో భూగర్భజలాలు పెరిగాయని అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి కొత్త ప్రాజెక్టుకు జీవం పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ చైతన్యరెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బాబురెడ్డి, పులివెందుల నియోజకవర్గ రైతు విభాగ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మునీశ్వర్రెడ్డి, శేఖర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, కొండారెడ్డి, మునిరెడ్డి, గోపాల్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, మునికిట్ట, ప్రతాపుడు, గూడు సాహెబ్, రఫీ, బాబా హుసేన్, గంగాదర్రెడ్డి, రవి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, ఏవీ శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీను, శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి, మోహన్రెడ్డి, రఘునాథరెడ్డి,మండలంలోని వివిధ గ్రామా ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
పాముకాటుతో దంత వైద్యురాలు మృతి
గాలివీడు : మండల పరిధి కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన దంత వైద్యురాలు గొట్టివీటి శివనాగమణి(34) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొట్టివీటి శ్రీరాములు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అయిన శివనాగమణి బీడీఎస్ విద్యను పూర్తి చేసి గుర్రంకొండ, తంబళ్లపల్లి, గాలివీడు ప్రాంతాల్లో ప్రైవేట్ దంత వైద్యశాలలను నిర్వహిస్తూ వైద్య వృత్తిలో స్థిరపడింది. వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం తండ్రి సంరక్షణలో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా ఆమెను పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, విష ప్రభావం శరీరంలోని కీలక భాగాలకు వ్యాపించడంతో శనివారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివనాగమణి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 146 కేసులు నమోదు చేసి, రూ. 38,710 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
స్వేచ్ఛ పరిమితంగానే ఉండాలి
టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. విద్యార్థులకు కాలేజీ లైఫ్ ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. అయితే విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఉన్నత చదువులు చదివి, నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ పరిమితంగా ఉంటేనే పిల్లలు సన్మార్గం వైపు పయనించి చదువులో రాణించగలరు. – బండి చంద్రమోహన్, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట -
ఆపేదేల్యా!
● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పచ్చ నేతలు ● ఆగస్టు 15వరకు ఇసుక తరలించవద్దన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ● పాపాఘ్ని, పెన్నా నదులను గుళ్ల చేస్తున్న వైనం ● కన్నెత్తి చూడని పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులుసాక్షి ప్రతినిధి, కడప : ‘నదీగర్భాల్లో ఇసుక రవాణా ఆగస్టు 15వరకూ నిషేధిస్తున్నాం.. ఇదివరకూ డంప్ చేసిన యార్డుల ద్వారా ఇసుక తీసుకెళ్లాలి.. ’ఈ నెల 6వ తేదీ శనివారం జరిగిన జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు ఇవి. పచ్చ నేతలకు ఈ మాటలు చెవికెక్కలేదో.. అధికార టీడీపీ నేతలకు కలెక్టర్ మినహాయింపు ఇచ్చారో గానీ.. ఇసుక అక్రమ రవాణా ఎక్కడా ఆగడం లేదు. పట్టుమని 24 గంటలు కూడా ఇసుక తవ్వకుండా ఉండలేకపోయారు. ఇక మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం కలెక్టర్ ఆదేశాలను అమలు చేయలేకపోయారు. ఫలితంగా పెన్నా, పాపాఘ్ని నదులు గుల్లవుతున్నాయి. అధికార నేతల దోపిడీ పర్వానికి విలవిల్లాడుతున్నాయి. ఒళ్లంతా గుంతలు తేలి..తడారి ఎడారిగా దర్శనమిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సర్కార్లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇసుక అక్రమ ఆదాయ వనరుగా మారింది. ఉచిత ఇసుక మాటున నదులు లూఠీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పాపాఘ్ని, పెన్నా, చిత్రావతి, చెయ్యేరు నదులను తెలుగుతమ్ముళ్లు చెరబట్టారు. పేరుకే ప్రభుత్వ రీచ్లు, ఆయా రీచ్ల నుంచి అనధికారికంగా నిత్యం వేలాది టన్నులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కమలాపురం, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. అక్రమ సంపాదన కోసం పోటీ పడుతోన్నారు. ప్రభుత్వ రీచ్లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, కొండూరు, సంబటూరు ఇసుక రీచ్లు నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను దక్కించుకున్న తెలుగుతమ్ముళ్లు ఆ మాటునా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇదే తంతు కొండాపురం, సిద్దవటం ప్రాంతాల్లో కూడా తెరపైకి వస్తోంది. అధికారిక రీచ్లను అడ్డుపెట్టుకొని అనధికారిక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు.అక్రమ రవాణాకు అడ్డుకట్టేదీ? వర్షాభావ దుస్థితి, రాబోవు రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ శ్రీధర్ ఆగస్టు 15 వరకూ ఇసుకను నదీ గర్భాలల్లో తరలించవద్దని ఆదేశించారు. ఆమేరకు సాండ్ కమిటీ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాపాఘ్నిలో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడలేదు. మారెళ్లమడక, సోగలపల్లె, నందిమండలం, యర్రబల్లె, పైడికాల్వ, సంబటూరు ప్రాంతాల నుంచి, పెన్నా నదిలో కొండాపురం, సిద్ధవటం ప్రాంతాల నుంచి యధేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రీచ్లతో నిమిత్తం లేకుండా అనధికార రీచ్ల నుంచి కూడా తెలుగుతమ్ముళ్లు యధేచ్ఛగా అక్రమంగా తరలించకు వెళ్తున్నారు. యంత్రాలతో లోడింగ్ చేసి, భారీ టిప్పర్లతో ఇసుక కన్పించకుండా పట్ట కట్టుకొని బెంగుళూరు పట్టణానికి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నదుల్లో అధికారిక రీచ్లల్లో ఇసుక అలాగే కొనసాగిస్తూ ఆ మాటున పొరుగు గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటన కమలాపురం నియోజకవర్గంలో యధేచ్ఛగా కొనసాగుతోంది. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికై నా అక్రమార్కుల నుంచి నదులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉజ్వల భవితకు వారధి
డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్, లాయర్, ఛార్టెర్డ్ అకౌంటెంట్, టీచర్, టెక్నీషియన్, సివిల్ సర్వెంట్, గ్రూప్ అధికారి.. ఇలా మీ లక్ష్యం ఏదైనప్పటికీ.. వాటిని చేరుకోవడానికి ఇంటర్మీడియట్ వారధిగా నిలుస్తుంది. ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా కూడలి లాంటిది ఇంటర్. అందుకే భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు ఇంటర్ను బాగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అందిస్తున్న కథనం. రాజంపేట టౌన్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులది కౌమార దశ. ఈ దశలో ఉండే వారి ఆలోచనలు, ఉరకలేసే ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, చిన్నపాటి విషయాలకే హర్ట్ అయ్యే సందర్భాలు, చదువుకోవడాలు, కాలేజీకి డుమ్మా కొట్టడాలు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ నుంచే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే టెన్త్ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన విద్యార్థులకు ఇంటర్మీడియట్లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి విద్యార్థిలో అదేదో తెలియని అనుభూతి ఉంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్నీ కూడా విద్యార్థులకు కొత్తగాను, వింతగాను అనిపిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికీ అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమి తెలియని తనం ఆవహిస్తుంది. విద్యార్థులు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది. పరాజయం బాటలో నడుస్తుంది. తొలిసారి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. జీవితంలో కీలక అడుగులన్ని ఇంటర్మీడియట్లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడి తప్పి అంధఃపాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్లోనే బీజం పడుతుంది. హైస్కూల్ విద్యతోనే ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్మీడియట్లో మరింత పురి విప్పుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో ప్రధానమైనదని విద్యావేత్తలు చెబుతున్నారు. చదువుపైనే దృష్టి సారించాలి ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. అందువల్ల వారి ఆలోనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు. అయితే మనసు అదుపులో ఉంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అందుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేల్లా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి. స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం ప్రధానంగా ఇంటర్మీడియట్లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇంటర్లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టెన్త్ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గం వైపే పయనిస్తారు. అయితే ఇంటర్ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పి తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే.. పిల్లలు కూడా చెడ్డవారితో స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. చెడ్డవారితో స్నేహం ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడేందుకు అడ్డుపడుతుంది. మొదలైన ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు గాడి తప్పితే జీవితమే గందరగోళం క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉజ్వల భవిష్యత్తు -
విచ్చలవిడి దోపిడీ..
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్పైపు అడుగు లేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి ‘క్యాస్’ చేసుకుంటున్నాయి. అడ్మిషన్ టెస్టుల నుంచే దోపిడీ పర్వం మొదలుపెట్టాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్, షూ వంటి వాటిని తమ పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్ ధరలకంటే అధిక రేట్లతో విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాలపై పలువురు విద్యార్థి సంఘ నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే విమర్శలు మెండుగా వినిపిస్తున్నాయి. -
పందుల దొంగల ముఠా అరెస్ట్
● రూ.10 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం పులివెందుల రూరల్ : పట్టణంలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి వద్ద పందులు, గొర్రెల దొంగల ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్బన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సీఐ శ్రీరామ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో.. పందులు, గొర్రెల దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల నగదు, బుల్లెట్, బొలెరో వాహనాలతో పాటు పందులు, గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగల ముఠాను శనివారం పార్నపల్లె రోడ్డులోని కోతి సమాధి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులలో అనంతపురం జిల్లాకు చెందిన ఎరుకుల శ్రీరామ్, భాస్కర్, చంద్రశేఖర్, చిరంజీవి, రాజు, భరత్కుమార్ ఉన్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం చోరీ కేసులో శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఇర్ఫాన్ అను కూబాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బోడా శ్రీను, విజయ్ పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐలు సిద్దార్థ, వర్మ, పోలీసులు పాల్గొన్నారు. మదనపల్లె టౌన్ : అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మదనపల్లె మండలం నడింపల్లి పంచాయతీ జంగాలపల్లికి చెందిన గంగప్ప భార్య మునెమ్మ (80) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. -
గరం గరం!
రాజ్యసభ సీటు దక్కకపోవడంపై వాసు కినుక సోషల్ మీడియాలో శ్రీనివాసులరెడ్డి పోస్టు హల్చల్ వాసును అనునయించిన తెలుగుతమ్ముళ్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు మూకుమ్మడి రాజీనామా చేయాలనే దిశగా ఆలోచనలు అధిష్టానం వాకబు చేయడంతో వెనక్కు తగ్గిన వైనం సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం మొండిచేయి చూపించింది. రాజ్యసభ సీటుపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. తుది వరకు సభ్యత్వం ఆశించి ఆపై భంగపాటుకు గురయ్యారు. వెరశి 13ఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నా అధిష్టానం నిర్ణయం కలత కలిగించిందని, అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన ఘటనగా మిగిలిపోతుందని పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈపరిస్థితులల్లో కడప తెలుగుతమ్ముళ్లు గరంగరంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతోందని గత కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కారణాలేమైనప్పటికీ టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తొలుత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.తర్వాత పొలిట్బ్యూరో సభ్యుల జాబితా నుంచి గెంటేశారు. జోనల్ కోఆర్డినేటర్ పదవితో మాత్రమే సరిపెట్టారు. అయినప్పటీకీ ఎలాంటి అసంతృప్తి బహిర్గత పర్చకుండా సైలెంట్గా ఉండిపోయినా, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో కడప నియోజకవర్గంలో ఆయన అభిమానులు సైతం కినుక వహించారు. మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే దిశగా అనుచరులు అడుగులు వేశారు. అధిష్టానం నిశితంగా పరిశీలన.. టీడీపీ అధిష్టానం తెలుగుతమ్ముళ్ల అడుగులను నిశితంగా పరిశీలన చేసినట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి అనుచరుల ప్రత్యేక సమావేశం గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆపై పొరుగున ఉన్న నేతలను సైతం పురమాయించినట్లు సమాచారం. సమావేశం వీగిపోయేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ అధిష్టానం డైరెక్షన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులల్లో శ్రీనివాసులరెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయరాదని, అధిష్టానం గురించి మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతమ్ముళ్లు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయాలని భావించినప్పటికీ శ్రీనివాసులరెడ్డి వారిని కట్టడి చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు అనేకం. సమావేశం నిర్వహిస్తే పొరుగు నేతల ప్రమేయం కడపలో పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో టీడీపీకి అన్నీ తానై వ్యవహారించిన శ్రీనివాసులరెడ్డికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరి మద్దతు లభించడం లేదు. ప్రత్యేకించి అధిష్టానం ఎదుట శ్రీనివాసులరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరిన సందర్భమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుచరుల సమావేశాన్ని సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
‘సర్’ త్వరగా పూర్తి చేయండి
సిద్దవటం : మూడు రోజుల్లోగా 95 శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన అధికారులను ఆదేవించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం సబ్ కలెక్టర్ బీఎల్ఓలు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సిద్దవటం మండలంలో ఇప్పటి వరకు 62.5 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తహసీల్దార్ విజయ్కుమార్ సబ్ కలెక్టర్కు వివరించారు. కిచెన్ షెడ్డును త్వరగా పూర్తి చేయాలిమండల కేంద్రమైన సిద్దవటంలో నిర్మిస్తున్న కిచెన్షెడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన కాంట్రాక్టర్ను ఆదేశించారు. సిద్దవటం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన నిర్మిస్తున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కిచెన్ షెడ్లను నిర్మిస్తోందన్నారు. కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.రాజంపేట సబ్ కలెక్టర్ భావన -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● యువతి మృతి, యువకుడికి తీవ్రగాయాలు కడప అర్బన్: కడప ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయకనగర్ నుంచి అలంఖాన్పల్లెకు వెళ్లేదారిలో ఆర్ఎల్టి పెట్రోల్ బంకు ఎదురుగా ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడప నగరం నకాష్కు చెందిన సయ్యద్ మొహీసీన్ (18) అక్కడికక్కడే మృతి చెందగా..సయ్యద్ అమీనుల్లా (18) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరు అలంఖాన్పల్లెకు వెళ్లేదారిలో ఉన్న కల్యాణమండపంలో బంధువుల వివాహానికి బైక్లో వెళ్లారు.వివాహానంతరం తిరిగి బయలుదేరారు. సంఘటన స్థలానికి వచ్చేసరికి కర్నూలు– బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు (ఏపి39 యుపి2577) వేగంగా వచ్చి బైక్ను ఢీకొనడంతో యువకుడు ఎగిరి పడ్డాడు. యువతి అదుపుతప్పి బస్సు కిందపడటంతో వెనుకవైపు టైరు ఆమెతలపైకి ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి నెల రోజుల్లో ఓ యువకుడితో వివాహం జరిపేందుకు నిశ్చయం చేశారు. సయ్యద్ అమీనుల్లా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు సీఐ వెల్లడించారు. -
గాలి మాటలతో సరి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు మహానాడు వేదికగా ‘కడప ఉక్కు–రాయలసీమ హక్కు’ అంటూ రంగురంగుల గ్రాఫిక్స్ చూపించారు. నేడు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ‘రైజింగ్ రాయలసీమ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హక్కులనే సాధించలేని వీరు సీమను రైజింగ్ చేస్తామనడం హాస్యాస్పదం. గత 30 ఏళ్లుగా తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నేటికీ పంట కాలువలు లేవు. జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి) ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాలకులవన్నీ గాలిమాటలే. – చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై ఓబుళాపురం సమీపంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని మారుతి (30) అనే యువకుడు మృతి చెందాడు. సీఐ నగేష్బాబు వివరాల ప్రకారం.. ఓబుళాపురం గ్రామానికి చెందిన మారుతి బైక్లో కొండాపురం నుంచి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నగేష్బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మారుతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడని, 3 నెలల కిందటే వివాహమైనట్లు బంధువులు తెలిపారు. -
అస్మదీయులకు అభయం
రాజంపేట: కడప–తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని చరిత్రాత్మక ‘రెడ్డికుంట’ చెరువు కబ్జా పర్వంలో రాజంపేట రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అధికార పార్టీ పక్షపాతం పూర్తిగా బట్టబయలైంది. 13.72 ఎకరాల ప్రభుత్వ నీటి వనరును దర్జాగా మింగేస్తున్న అసలైన కబ్జాదారులను కాపాడేందుకు అధికారులు పక్కా స్కెచ్ వేశారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల నేపథ్యంలో కేవలం కొద్దిమంది పాత రికార్డుదారులకే నోటీసులు ఇచ్చి, ప్రస్తుతం చెరువును అక్రమంగా చెరబట్టిన టీడీపీ నేతలను విచారణ పరిధి నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన ఆక్రమణదారులను కాపాడటానికే చెరువులో నామమాత్రంగా ఒక హెచ్చరిక బోర్డు తగిలించి, రెవెన్యూ శాఖ దర్జాగా చేతులు దులుపుకుందని స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ్ముళ్లకు నోటీసులు లేవు.. అస్మదీయులకు అభయం! తహసీల్దార్ ఆదేశాల మేరకు జరిగిన రెవెన్యూ విచారణ అంతా ఒక వైపు మాత్రమే సాగిందని జిల్లా రైతాంగం ఆరోపిస్తోంది. పాత రికార్డుల్లో పేర్లు ఉన్న మృతుల వారసులను పిలిపించి నోటీసులు ఇచ్చిన అధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం చెరువు గర్భాన్ని మట్టితో పూడ్చి, ప్లాట్లుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అసలైన ఆక్రమణదారుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీకి చెందిన కొందరు ముఖ్య అనుచరులు, స్థానిక నేతలు ఈ 13 ఎకరాల కుంటను గద్దల్లా తన్నుకుపోతుంటే.. అధికారం అడ్డుపెట్టుకుని వారి పేర్లను బయటపెట్టకుండా రెవెన్యూ యంత్రాంగం తెరవెనుక నాటకమాడింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా కేవలం బోర్డుతో సరిపెట్టడం వెనుక అధికారులపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెవెన్యూ హెచ్చరిక బోర్డులో ఏముందంటే..? కబ్జాదారుల పేర్లు బయటకు రాకుండా రాజంపేట తహసీల్దార్ పేరుతో రెడ్డికుంట చెరువులో నామమాత్రంగా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు పాఠకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆ బోర్డు సారాంశం ఇలా ఉంది. ‘పోలి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 1488 విస్తీర్ణం 13 ఎకరాల 72 సెంట్ల కుంట.. ఇది ప్రభుత్వ భూమి కనుక ఎవరైనా ఆక్రమిస్తే వారు శిక్షార్హులు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. ఇట్లు.. తహసీల్దారు, రాజంపేట.‘ ఈ బోర్డును చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏకంగా 13.72 ఎకరాల ప్రభుత్వ భూమి కళ్లముందే కనుమరుగైపోతుంటే.. ఆక్రమణలను కూల్చేయకుండా, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుండా, కేవలం ‘ఎవరైనా ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డు పెట్టి వదిలేయడం అధికారుల కపట నాటకానికి పరాకాష్ట అని దెప్పిపొడుస్తున్నారు. రెడ్డికుంటను దర్జాగా కబ్జా చేస్తున్న తెలుగుతమ్ముళ్లు సర్వే నంబరు 1488 పరిధిలోని 13.72 ఎకరాల కుంటపై సాగుతున్న పచ్చ దోపిడీ తమ్ముళ్లను దాచేసి రెవెన్యూ ‘హెచ్చరిక’ బోర్డుతో సరి -
ఎరువు కోసం ఏకరువు
● ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం! ● జిల్లాలో విత్తనాలు, ఎరువుల తీవ్ర కొరత ● ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని, గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నదాతల ఆగ్రహంకడప అగ్రికల్చర్ : -Q-È‹œ ïÜf-¯Œl {´ëÆý‡…¿ê°MìS Ð]l¬…§ól hÌêÏÌZ° OÆð‡™èl-¯]l²-ÌS¯]l$ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ¿ýæÄ¶æ$ò³-yýl$-™èl$-¯é²Æ‡$$. JMýS-OÐðlç³# Ðé™é-Ð]l-Æý‡×æ Ð]l*Æý‡$µ-ÌS™ø ç³…rË$ çÜÇV> ç³…yýl-MýS-´ùÐ]l-yýl…, Ð]l$ÆøOÐðlç³# ç³…yìl¯]l ç³…rMýS$ {糿¶æ$™èlÓ… Wr$t»êr$ «§ýlÆý‡ MýSÍ-µ…-^èl-MýS-´ù-Ð]lyýl…™ø Cç³µ-sìæMóS Ð]lÅÐ]l-ÝëĶæ$… ¿êÆý‡…V> Ð]l*Ç…-¨. D {MýSÐ]l$…ÌZ QÈ‹œ ò³r$t-º-yýl$ÌS MøçÜ… G§ýl$-Æý‡$-^èl*çÜ$¢¯]l² çÜÐ]l$-Ķæ*°MìS M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ºÝë¢Oò³ ₹200 ¯]l$…_ ₹450 Ð]lÆý‡MýS$ ò³Æý‡-VýS-yýl…™ø MýSÆý‡Û-MýS$Ë$ Ð]l$Ç…™èl MýS$…W´ù-™èl$-¯é²Æý‡$. ïÜf-¯Œl {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ð]l#™èl$¯é² ¯ólsìæMîS Ñ™èl¢-¯éË$, GÆý‡$-Ð]l#Ë$ OÆð‡™èl$-ÌSMýS$ A…§ýl$-»ê-r$ÌZMìS Æ>Ð]l-yýlÐól$ Ìôæ§ýl$. ©…™ø D Hyé¨ QÈ‹œ ÝëVýS$ {ç³Ô>²-Æý‡¦-MýS…V> Ð]l*Ç…-¨. లక్షలాది ఎకరాల్లో సాగు.. నేటికీ దొరకని విత్తనాలు! జిల్లాలో లక్షలాదిమంది రైతులు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదంతో పాటు జొన్న, వరి, అలసంద, ఉలవ తదితర పంటలు సాగు కానున్నాయి. భూములు సిద్ధమైనా ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, సరిపడా ఎరువులు ముందస్తుగా సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధర కరువు.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు గత రబీ సీజన్ లో నీటి వసతి ఉండి కష్టపడి పంటలు పండించినా.. వాటికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ఇప్పు డు ఎరువుల ధరలు కూడా పెంచితే తాము వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని గాలివీడు పరివాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి ఇప్పటికై నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా అవసరమైన వేరుశనగ, ఇతర విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ కాకుండా పాత ధరలకే ఎరువులు లభించేలా కఠిన నిఘా పెట్టాలని కోరుతున్నారు.పాత స్టాక్ను పాత ధరలకే అమ్మాలి రైతులు కూడా బస్తాపై ఉన్న ధరనే చెల్లించాలి జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు కడప అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిందని, ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు అన్నారు. అయితే పాత స్టాక్ను మాత్రం పాత ధరలకు అమ్మాలని డీలర్లు, వ్యాపారులకు సూచించారు. రైతులు కూడా బస్తాపై ఉన్న రేట్లను మాత్రమే చెల్లించాలని తెలిపారు. అలాగే కొత్త స్టాక్ను మాత్రం పెంచిన ధరలను అమ్మాలని డీలర్లకు సూచించారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షించమని ఏడీఏలు, వ్యవసాయ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. -
108 వాహనంలో ప్రసవం
కమలాపురం: మండంలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మ కమలాపురం 108 వాహనంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. 108 సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మకు శనివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో 108 వాహనం గ్రామానికి చేరుకుని నారాయణమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై ప్రసవం జరిగింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. నారాయణమ్మ కుటుంబం 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. 165 బస్తాల విత్తన వడ్లు స్వాధీనంప్రొద్దుటూరు రూరల్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డు లో ఉన్న వరసిద్ధి వినాయక విత్తన కేంద్రంలో శనివారం విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయశాఖ అధికారు లు తనిఖీ చే శారు. దుకాణంలో విత్తన చ ట్టం 1965 నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 165 బస్తాల కేఎన్ఎం రకం వరి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, దుకాణ యజమాని రమణారెడ్డిపై 6–ఏ కేసు నమోదు చేశారు. 30 కేజీల తూకం కలిగిన విత్తన వడ్ల బస్తాను రూ.1200లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గు ర్తించారు. తనిఖీల్లో స్థానిక మండల వ్యవసాయాధికారి వరహరికుమార్,విజిలెన్స్అధికారిజి.లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
బైక్ డివైడర్ను ఢీకొని ఒకరికి గాయాలు
మైదుకూరు : పట్టణ శివారులోని జాతీయ రహదారి బైపాస్లో మోటార్ బైక్ డివైడర్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న అబ్దుల్ అనే యువకుడు గాయపడ్డాడు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన యువకుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. హౌసింగ్ స్టీల్ మాయంపై విచారణ ప్రొద్దుటూరు : హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో ఉన్న హౌసింగ్ గోడౌన్లలో విజిలెన్స్ అధికారి కృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 270 టన్నుల స్టీల్ నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం రెండు టన్నులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం 268 టన్నుల స్టీల్ కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఏఈఈ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, రాజంపేట ఈఈ మురళి, ప్రొద్దుటూరు ఈఈ రాజశేఖర్ ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి విజిలెన్స్ బృందం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు పీడీ తెలిపారు. -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని వెంకటాపురం రహదారిలో శనివారం భూమిరెడ్డి పెద్ద మాదన్న గారి రమణమ్మ అనే మహిళ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు రమణమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి పెద్దమాదన్నగారి రమణమ్మ, భర్త కొండయ్య మృతి చెందడంతో మైదుకూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని వినాయక నగర్లో ఉంటున్న ఆమె రెండేళ్ల కిందట వెంకటాపురం రహదారిలో సొంత ఇల్లు కట్టుకుని నివాసాన్ని అక్కడికి మార్చింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు సునీల్ రైల్వే కోడూరు సమీపంలోని ఫారెస్ట్ చెక్పోస్టులో పనిచేస్తున్నాడు. ఇంట్లో రమణమ్మ ఒక్కతే ఉంటుంది. శనివారం ఉదయం ఆమె గడ్డమాయపల్లె ప్రాంతంలో ఓ రైతు పొలంలో వేరుశనగ కాయలను ఏరేందుకు పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపునకు తాళం చెవి పెట్టేందుకు ప్రయత్నించగా తలుపులు అవే తెరుచుకున్నాయి. గాబరాతో ఆమె తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. ఆందోళనతో బీరువాలో చూడగా బంగారు గొలుసు, కమ్మలు, ఉంగరాలు, చెవి మాటీలు, చెవి బుట్టలు, వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడు, వెండి గిన్నెలు తదితర వస్తువులు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగిందని భావించి స్థానిక విజయనగర కాలనీలో ఉంటున్న చిన్న కుమార్తె అల్లుడుకు సమాచారం తెలిపింది. వారు వచ్చి ఇంటి పరిసరాలు వెతికారు. ప్రధాన తలుపు గుండా వచ్చిన అగంతకులు చోరీ అనంతరం ఇంట్లో నుంచి తూర్పు వాకిలి గుండా వెళ్లి బయట గడియ వేసినట్టు గుర్తించారు. బీరువాలో ఉన్న 8.7 తులాల బంగారు వస్తువులు, 43 తులాల వెండి వస్తువులు, రూ.4వేలు నగదు చోరీకి గురైనట్టు ఈ సందర్భంగా బాధితురాలు రమణమ్మ తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, వేలి ముద్రల నిపుణులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. -
పదవులు–పంపకాలు కోసమే
½gôæ-ï³MìS {´ë…¡Ä¶æ$ AÀÐ]l–-¨®Oò³ _™èl¢-Ô¶æ$¨® Ìôæ§ýl$. ™èlÐ]l$ Æ>f-MîSĶæ$ ç³§ýlÐ]l#Ë$, ç³…ç³-M>ÌS MøçÜÐól$ C糚yýl$ Mö™èl¢ ¯érM>Ë$ Byýl$-™èl$-¯é²Æý‡$. Ñ¿ýæ-f¯]l ^èlrt… {ç³M>Æý‡… Ððl¯]l$-MýS-º-yìl¯]l hÌêÏÌS AÀ-Ð]l–-¨®MìS CÐéÓ-ÍÞ¯]l MýS±çÜ ₹50 MørÏ MóS…{§ýl °«§ýl$Ë$ HÐ]l$Ķæ*ÅÆ‡$$? MýSyýl-ç³ÌZ EMýS$P MýSÆ>Ã-V>Æý‡… HÆ>µ-r$Oò³ ^èlrt… ^ólíÜ.. C糚yýl$ Ýë«§ýlÅ… M>§ýl…r* ÐéÆó‡ ^ðlç³#¢-¯é²Æý‡$. D {´ë…™é-°MìS G…™ø MîSÌS-MýS-OÐðl$¯]l MýSyýlç³&»ñæ…-VýSâ¶æ*Æý‡$ OÆð‡ÌôæÓ-OÌñ毌S VýS$Ç…_ MóS…{§ýl… ç³NÇ¢V> Ð]l$Ça-´ù-Ƈ$$…¨. A…™èlÆŠæ Æ>[ÚëtÌS ±sìæ ÑÐé-§éÌSMýS$ Ð]lÊÌS-M>-Æý‡-MýS$Ë$ ½gôæï³ ¯ól™èlÌôæ. Kr$Ï&-ïÜr$Ï Ñ$¯]là ÒÇMìS ïÜÐ]l$ {ç³Äñæ*f-¯é-ÌS™ø ç³°-Ìôæ§ýl$. – జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ -
అలసత్వం వద్దు.. అప్రమత్తతే ముద్దు
కడప ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు (అయ్యవార్లు) పాఠశాలల నిర్వహణ పట్ల కాసింత ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి సెలవులు మొత్తం పాఠశాలలు మూసి ఉంచడంతో చెత్తాచెదారం, దుమ్ము, ధూళి అంతా పేరుకుపోయి ఉంటుంది. దీనికితోడు ఇటీవల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసాయి. ఈ కారణంగా తరగతి గదులన్నీ వర్షపు నీరు, దుమ్ముతో నిండి ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేటప్పుడు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం నెలకొంటుంది. విద్యుత్ భద్రత – భవన పటిష్టత : సెలవుల్లో విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకడం లేదా వర్షాల తేమ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, లైట్ల వైరింగ్ను ఎలక్ట్రీషియన్తో చెక్ చేయించాలి. భవన మరమ్మతులు : మే నెలలో కురిసిన వర్షాలకు భవనం ఎక్కడైనా లీకేజీలు ఇస్తోందా, గోడలు లేదా పై కప్పుల నుంచి సిమెంట్ ఊడిపడుతుందా అనేది గమ నించి, అవసరమైన తక్షణ మరమ్మతులు చేపట్టాలి. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం : జిల్లాలో ఇంకా ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్లాస్ రూమ్స్లో ఫ్యాన్లు సరిగ్గా తిరిగేలా చూడాలి. ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్ను సిద్ధంగా ఉంచుకోవాలి. ఒత్తిడి లేని వాతావరణం : పాఠశాలలు తెరిచిన మొదటి వారం పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచకూడదు. సెలవుల్లో వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎలా ఎంజాయ్ చేశారనే అంశాలపై ఆటపాటలు, కథల ద్వారా చర్చిస్తూ వారిని క్రమంగా పాఠశాల వాతావరణానికి అలవాటు చేయాలి. జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి పాఠశాలల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవాలి. పిల్లలు బడికి వచ్చే సమయానికి పాఠశాలల్లో పూర్తి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలి. – షేక్ షంషుద్దీన్,డీఈఓ, కడప బడి గంట మోగేలోపే పాఠశాలల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి చెత్తాచెదారం, దుమ్ము, ధూళిపై సెలవుల్లోనే సమర శంఖం తొలిరోజు అడుగుపెట్టే విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి పిల్లల శారీరక, మానసిక భద్రతపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలుఆట స్థలం నిర్వహణ పొదల తొలగింపు : నెలన్నరపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో మైదానంలో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తక్షణం తొలగించాలి. లేనిపక్షంలో విషపురుగులు, పాములు వంటివి చేరే ప్రమాదం ఉంటుంది. సామాగ్రి భద్రత : పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తుప్పు పట్టకుండా బలంగా ఉన్నాయో లేదో ఉపాధ్యాయులు భౌతికంగా తనిఖీ చేయాలి.ఉపాధ్యాయులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గదుల శానిటైజేషన్ : సెలవుల్లో మూసి ఉంచిన క్లాస్ రూమ్లు, డెస్కులు, ల్యాబ్లు, లైబ్రరీ, స్టాఫ్ రూమ్లను దుమ్ము, ధూళి లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణ : పాఠశాలలోని బాత్రూమ్స్, మరుగుదొడ్లను ఫినాయిల్ లేదా యా సిడ్తో కడిగించాలి. పిల్లలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం నీటి వసతి ఉండేలా రన్నింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. చెదలు మందులు, క్రిమిసంహారక చర్యలు: తరగతి గదుల్లో చేరిన చెదలు, బూజును పూర్తిగా శుభ్రం చేసుకుని, వాటి నివారణకు ముందుగానే మందు పిచికారీ చేసుకోవాలి. ఫాగింగ్ – బ్లీచింగ్ : వర్షాకాలం కూడా ప్రారంభమయ్యే సమయం కాబట్టి దోమలు చేరకుండా గదుల్లో, ఆట స్థలంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదా ఫాగింగ్ చేయించడం ఎంతైనా మంచిది. వాటర్ ట్యాంకుల శుభ్రత : పాఠశాలలోని తాగునీటి ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్లను పూర్తిగా కెమికల్స్తో క్లీన్ చేయించి, స్వచ్ఛమైన నీరు లభించేలా చూడాలి. పైపుల్లో చాలా రోజులుగా నిలిచిపోయిన పాత నీటిని పూర్తిగా వదిలేసి, కొత్త నీటితో నింపాలి. -
అన్నీ తానై ...అన్నిట్లో తలమునకలై
టాస్క్ఫోర్సు: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై గత కొద్ది రోజులుగా ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. దీనికి ఉక్కిరి బిక్కిరవుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక ఎక్కడిక్కడ ఖడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కడపలోని హరిత హాటల్లో ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అనుబంధ విద్యార్థి, అనుబంధ టీచర్ల సంఘాల నాయకులతోపాటు కొత్తగా ఉద్యోగాలకు ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు అనే కార్యక్రమాన్ని నిర్వహించి డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అంతా పారదర్శకంగా నిర్వహించామంటూ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ఇందులో జిల్లా ఓపెన్స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ సాంబ శివారెడ్డి పాల్గొని అన్నీ తానై వ్యవహరించారు.ఎమ్మెల్సీ వెంట తిరగడం, వచ్చిన వాళ్లను పలకరించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ హడావుడి చేస్తూ కనిపించాడు. కొన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రీవెన్స్లో ఫిర్యాదుకు సమాయత్తం... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సాంబశివారెడ్డిపై విద్యార్థి సంఘనాయకులు సోమవారం ప్రజా పిర్యాదుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా అయన పాల్గొనటం మేమినటి ప్రశ్నించారు. ప్రైవేట్ కార్యక్రమంలో హల్ చేసిన ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు హాజరు -
పిల్లల్లో మానసిక లోపాలను గుర్తించేందుకే ‘నవచేతన’
కమలాపురం : ఆరేళ్లలోపు చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన అనే ఏఐ యాప్ను రూపొందించిందని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా ఐసీడీఎస్ సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణలో చెబుతున్న అంశాలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో స్థూల, సూక్ష్మ, చలన నైపుణ్యాలు, భాషా వికాసం, జ్ఞాన వికాసం, సామాజిక భావోద్వేగాల వృద్ధిని నవచేతన ద్వారా అంచనా వేస్తామన్నారు. లోపాలను గుర్తించి ముందస్తు జోక్యం ద్వారా సరిచేయవచ్చన్నారు. సీడీపీఓ శ్రీలతారెడ్డి, అర్బన్ పీహెచ్సీ డాక్టర్ ముని శేఖర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకట సుబ్బమ్మ, పార్వతి, లక్ష్మీదేవి తదితరులు సిబ్బందికి నవచేతన యాప్లో చిన్నారుల పై చేసిన సర్వే అంశాల నమోదు పై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.ఐసీడీఎస్ పీడీ రమాదేవి -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు (అట్లూరు) : బద్వేలు మండలం రాజుపాళెం గ్రామ సమీపంలో కడప – బద్వేలు రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు సిద్ధవటం నుంచి బద్వేలుకు వెళుతున్న ఆటో, బద్వేలు నుంచి సిద్ధవటం వెళుతున్న కారు రాజుపాళెం గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అట్లూరు మండలం లింగాలకుంటకు చెందిన సంగటి వెంకటసుబ్బమ్మ, బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన గంగమ్మ, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామానికి చెందిన సుబ్బమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్లో బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని కడప రిమ్స్కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
తల్లీబిడ్డల మృతిపై జిల్లా వైద్యాధికారుల విచారణ
జమ్మలమడుగు : జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు రోజుల కిందట జరిగిన తల్లీబిడ్డల మరణాలపై జిల్లా వైద్యాధికారులు శనివారం విచారణ చేపట్టారు. గురుగడ్డ వీధికి చెందిన పటాన్ రుక్సానాను ప్రసవానికి కుటుంబ సభ్యులు తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శుక్రవారం ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం నవజాత శిశువు మృతి చెందింది. రుక్సానా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రొద్దుటూరుకు తరలించారు. మార్గంమధ్యలో రుక్సానా కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా వైద్యాధికారి డీఐఓ డాక్టర్ ప్రవీణ్ బృందం శనివారం విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులను విచారించారు. బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం రామలింగారెడ్డి ఆసుపత్రి వైద్యులను విచారించారు. వైద్యుల నుంచి మృతురాలి కేర్షీట్, వాడిన మందుల వివరాలను నమోదు చేసుకున్నారు. విచారణలో జిల్లా వైద్యాధికారి శాంతి, ప్రైవేట్ ఆసుపత్రి ఆసోసియేషన్ వైద్యులు అగస్టీన్రాజు, ఎంఎల్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
మంత్రి సమావేశానికి స్పందన కరువు
పులివెందుల రూరల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ శనివారం పులివెందులలోని పాత బస్టాండ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన సమావేశం కార్యకర్తలు లేక వెలవెలబోయింది. అరకొరగా వచ్చిన కార్యకర్తలు సైతం సమావేశం మధ్యలోనే వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కుర్చీలన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రి సత్యకుమార్ పులివెందులకు రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పాత బస్టాండ్లోని ప్రధాన కూడలి వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ నడిరోడ్డుపై ఉంచడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన నిఖిల్ జమ్మలమడుగు : పట్టణంలోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన కుందవరపు జెఫన్యా నిఖిల్ గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినట్లు తల్లిదండ్రులు కుందవరపు సురేష్, రాణి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల ఆధ్వర్యంలో 22దేశాలకు చెందిన 2వేల మంది కీబోర్డు వాయిద్యకారులతో ఏకకాలంలో ఏకస్వరంతో కీబోర్డు వా యించి ప్రతిభను చాటాడు. ఈ మేరకు శుక్రవా రం హెలెన్ మ్యూజిక్స్కూల్ వ్యవస్థాపకుడు ఆగస్టీన్ ఆధ్వర్యంలో ఇండియన్ పెంతకోస్టల్ చర్చి విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు రికార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేసినట్లు వివరించారు. -
వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం
పులిచెర్ల (కల్లూరు) : కల్లూరులో వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు బీసీ కాలనీలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వారిని చూసిన కారు డ్రైవర్ కొంత దూరం వెళ్లి.. వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు పరిశీలించగా.. కారులో 12 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గమనించారు. వాహనాన్ని కల్లూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అందులో 12 దుంగల బరువు 358 కేజీలుగా గుర్తించారు. వాటి విలువ రూ.16.46 లక్షలు, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
భూసమస్యల పరిష్కారానికి జవాబుదారీగా ఉండాలి
బద్వేలు అర్బన్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చొరవ చూపుతోందని,ఇందుకోసం అధికారులంతా జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం్ఙకార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశం లో స్వీకరించిన సుమారు 200 ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన గడువును విధించామని తెలిపారు.రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో వీటిని పరిష్కరించి,తుది నివేదికను దరఖాస్తుదారులకు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా,ఆయా శాఖల జిల్లా అధికారులు,బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్,డీసీసీబి చైర్మన్ మంచూరుసూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న ‘స్టార్ట్ అప్ కడప’ కడప సెవెన్రోడ్స్ : జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న శ్రీస్టార్ట్ అప్ కడప్ఙఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని పి–4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్ గా నిర్మిస్తున్న శ్రీస్టార్ట్ అప్ కడప్ఙఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడొద్దని సంబందిత ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, హౌసింగ్ ఇంజనీర్లు, ఏడిపి యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఐపీపీబీ ఖాతాల ద్వారా పథకాల నగదు చెల్లింపు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎన్పీసీఐ మ్యాపర్లో ఆధార్ సీడింగ్ లేకపోవడం వల్ల అందుకోలేకపోతున్న వారికి.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల ప్రారంభం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.రాజేష్ తెలిపారు. శుక్రవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా ఖాతాల్లో జమ కావడానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అన్నారు. అయితే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి 4,180 మంది లబ్ధిదారుల ఖాతాలు ఎన్పీసీఐ మ్యాపర్తో అనుసంధానం కాకపోవడంతో వారికి పథకాల ప్రయోజనాలు అందడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోస్టల్ శాఖ ద్వారా ఐపీపీబీ ప్రీమియం ఖాతాల ప్రారంభ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఇనాక్టివ్గా మారిన వారు తమ ఖాతాలను ఈ నెల 13వ తేదీలోపు పునరుద్ధరించుకోవాలని సూచించారు. అదే విధంగా ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా లేని అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్తో ఐపీపీబీ ఖాతాను సులభంగా ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఈ ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా జమ అవుతుందని వివరించారు. ప్రత్యేకంగా ఐపీపీబీ ఖాతాదారులకు తపాలా సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి నగదు చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన పౌరులందరూ తమ సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్రెడ్డికి బెదిరింపు లేఖ
ప్రొద్దుటూరు : ‘త్వరలో మీ ఇంటిపై దాడి చేసి చంపుతాం.. పూర్వం మీ అబ్బ పెద్ద వీరారెడ్డిని ఎలా చంపారో అలాంటి పరిస్థితే నీకు వస్తుంది’ అని టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డికి స్పీడ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖ రాశారు. లేఖలో రాసిన ఫోన్ నంబర్, అడ్రెస్ ఫేక్ అని తెలుసుకున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గీయుల మధ్య రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగిన పది రోజులు కాకమునుపే ఈ లేఖ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎస్ మాల్ విషయంపై జీవీ ప్రవీణ్ కుమార్రెడ్డి ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణకు వచ్చిన సందర్భంగా గత నెల 26వ తేదీన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు, ప్రవీణ్కుమార్రెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వుకున్న సంఘటన తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం పరిపాటి. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుతం ఆర్.ఈశ్వర్రెడ్డి పేరుతో ప్రవీణ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. లేఖలో టౌన్ బ్యాంక్ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో మీ ఇంటిపై దాడి చేస్తామని, దమ్ముంటే ప్రాణాలను కాపాడుకోవాలని లేఖలో పొందుపరిచారు. ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు మార్కెట్యార్డులో శనగలను కొనుగోలు చేశారు. దీనిపై ఆర్టీఐ పెట్టిన ప్రవీణ్ కుమార్రెడ్డి వర్గీయుడు పర్లపాడు చంద్రను కూడా బెదిరించినట్లు ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. తాటాకు చప్పులకు బెదరను ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరా లేని చోట ఈ లేఖను రాసి పంపారన్నారు. దమ్ముంటే అధికారికంగా రాసి పంపాలని కోరారు. వ్యవసాయ మార్కెట్యార్డు డైరెక్టర్ సుధాకర్ రాసినట్లుగా ఈ అక్షరాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇంతటితో తాను ఆగనని, డీఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూల్, సుందరయ్య నగర్, తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. మైలవరం కాలువపై అక్రమ నిర్మాణాల విషయం గురించి కూడా మాట్లాడుతానన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపుతారా అని ప్రవీణ్ అన్నారు. ఈ విషయంపై ఏఎస్పీ విభూ కృష్ణకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇంటికొచ్చి చంపుతామని లేఖలో పేర్కొన్నారు రాళ్లు రువ్వుకున్న సంఘటన మరువక ముందే మరో ఘటన -
ఆ తల్లిని ఓదార్చడం.. ఈతరం కాదు !
● ఈతకొట్టేందుకు నీటిలోకి దిగిన నలుగురు పిల్లలు ● ఇద్దరిని కాపాడిన తల్లి ● కళ్ల ఎదుటే నీటిలో మునిగి మరో ఇద్దరు మృతి ● ఖాజీపేటలో హృదయవిదారక ఘటన ఖాజీపేట : అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఆ తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. నీటిలో దూకి ఇద్దరిని కాపాడింది. మరో ఇద్దరు తన కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడలేక గుండెలవిసేలా విలపించిన హృదయవిదారక ఘటన ఖాజీపేటలోని మండలం దుంపలగట్టు గ్రామంలోని గుట్టులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం సమీపంలోని గుట్టుపై 10 ఏళ్లుగా పందులను మేపుతూ శివకృష్ణ, శ్రీవాణి దంపతులు జీవనం సాగిస్తున్నాయి. పందులను నీటి గుంటలో శుభ్రం చేసేందుకు ప్రతి రోజు శివకృష్ణ వెళ్లి వచ్చేవారు. శుక్రవారం శివకృష్ణ ఇతర పనులపై కడపకు వెళ్లారు. దీంతో శ్రీవాణి నీటిలో ఉన్న పందుల కంచె వద్దకు వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు గౌతమ్, కార్తీక్తో పాటు వనం సంజన (18) వనం అర్చన (14) వెళ్లారు. శ్రీవాణి పందుల కంచె వద్ద ఉండగా నీటిలో ఈత కొడదాం అని పిల్లలు తల్లిని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీవాణి అంగీకరించారు. నలుగురు పిల్లలు నీటిలోకి దిగారు. నీటిలోని కుంట లోతుగా ఉండటంతో నలుగురు నీటిలో మునిగిపోతుండగా శ్రీవాణి గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గౌతమ్, కార్తీక్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సంజన, అర్చన అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాపాడే ప్రయత్నం చేసేలోగానే ఇద్దరూ గల్లంతయ్యారు. గట్టిగా కేకలు వేడయంతో స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం నీటిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఖాజీపేట సీఐ వంశీధర్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే చెన్నూరు నుంచి గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కలిసి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు రోప్ సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్కు తరలించారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే మృత్యుఒడిలోకి.. శ్రీ వాణి కళ్ల ఎదుటే తన ఇద్దరు కుమార్తెలు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఆమె రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరామర్శ దుంపలగట్టు గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదం నుంచి బయట పడిన కార్తీక్, గౌతమ్ -
వైద్యం వికటించి తల్లీశిశువు మృతి
● మృతదేహాలతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వైద్యం వికటించి తల్లి, నవజాత శిశువు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జమ్మలమడుగు పట్టణంలోని గడ్డవీధికి చెందిన పఠాన్ రుక్సానా (28) అనే గర్భిణిని గురువారం ప్రసవానికి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు.. మృతదేహాలతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనపై అరా తీశారు. పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్ట్మార్టం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని సీఐ నరేష్బాబు బాధితులకు సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని, వైద్యులతో తమకు క్షమాపణ చెప్పించాలని కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమై డాక్టర్ లక్ష్మీరెడ్డిని వివరణ కోరగా.. రుక్సానాను గురువారం తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమెకు నొప్పులు రాకపోవడంతో శస్త్రచికిత్స చేసి నవజాత శిశువును బయటకు తీశామన్నారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో రుక్సానాకు మూర్ఛ, గుండెపోటు రావడంతో వెంటనే ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని సూచించామన్నారు. -
ఇన్చార్జ్ పాలన ఇంకెన్నాళ్లు..!?
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగర శివారులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఇన్చార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. గత రెండేళ్ల కిందట లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి డీటీసీ చంద్రశేఖర్రెడ్డిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్ ఆరు నెలల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్రెడ్డి నాలుగు నెలలు అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం డీటీసీగా ఉన్న వీర్రాజు 2025 సెప్టెంబర్ నుంచి ఇన్చార్జ్ డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారంలో బుధ, గురువారాల్లో మాత్రమే రవాణా శాఖ కార్యాలయంలో వాహన యజమానులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను ఇన్చార్జ్ డీటీసీ మొత్తం పూర్తి చేసి వెళుతున్నారు. మిగిలిన రోజులో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత రవాణా శాఖ కార్యాలయంలోని సిబ్బందిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. దీంతో ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఒక డీటీసీ, ఎంవీఐ ఒకరు, ఏ ఎంవీఐలు ముగ్గురు, ఏఓలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాలి. అయితే ప్రస్తుతం డీటీసీ లేకపోగా ఏంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ఇద్దరు, ఏవోలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు సెలవుపై వెళ్లినా పనులు సకాలంలో జరగక పెండింగ్లో పడిపోతున్నాయి. ఇన్చార్జ్ డీటీసీ లేని సమయంలో వాహనదారులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ పరిధిలో ఉన్న పనులను ఎంవీఐ, ఏ ఎంవీఐలు చేస్తున్నారు. డీటీసీ పరిధిలో ఉన్న పనులు పెండింగ్లో ఉండక తప్పడం లేదు. జిల్లాలోని నాలుగు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలలో సిబ్బంది కొరతతో అగచాట్లు పడుతున్నారు. రవాణా శాఖ అధికారులు రెగ్యులర్ డీటీసీని నియమించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయానికి రెగ్యులర్ డీటీసీని నియమించాలని వాహనదారులు కోరుతున్నారు. రెగ్యులర్ డీటీసీ లేక వాహనదారులకు ఇక్కట్లు రెండేళ్లుగా భర్తీ కానీ పోస్టు వారంలో రెండు రోజులు మాత్రమే సేవలు -
బాధ్యతల స్వీకరణ
కడప అర్బన్: కడప సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఓబులేసు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం కడప ఫారెస్ట్ రేంజ్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత కడప నగరవనంలో జరిగిన కార్యక్రమంలో కడప డిఎఫ్ఓ వినీత్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఆర్జేడీగా మధుసూదన్ వర్మ కడప ఎడ్యుకేషన్: కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మధుసూదన్ వర్మకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం కడపలోని కళాశాల ఆర్జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మధుసూదన్ వర్మకు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, ఏఓ రమణరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు.గర్భాలయంలోని మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సిద్ధవటం ఎస్ఐ హారిక, ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలి కడప రూరల్ : ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం కడపలో వైద్యాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0–5 సంవత్సరాల పిల్లలలందరికి మొదటి రోజునే చుక్కల మందు వేయాలన్నారు. రెండో రోజు, మూడోరోజు ఇంటింటి సర్వే ద్వారా మార్కింగ్ చేస్తూ, మిస్ అయిన పిల్లలకు ఇంటి దగ్గర వేయాలని తెలిపారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన తరువాత, ఎడమ చిటికెన వేలికి మార్క్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఐఓ ప్రవీణ్, డాక్టర్ రవిబాబు, డాక్టర్ ఆరిఫ్, జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్పీ కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 252 కేసులు నమోదు చేసి, రూ. 60,778 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


