breaking news
YSR District News
-
రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ
కడప కార్పొరేషన్ : విజయవాడలోని మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ ఆకాడమీ వేదికగా నిర్వహించిన కామ్రెడ్ ఎన్వీఎస్ స్పోర్ట్స్ కార్నివాల్–2026లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప జట్టు ప్రతిభ కనబరిచిందని బ్యాంకు రీజనల్ మేనేజర్ ఏ. లక్ష్మి తులసి తెలిపారు. బుధవారం క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు సేవల్లో తీరిక లేకుండా ఉండే అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయన్నారు. బ్యాంకు కార్యకలాపాలతోపాటు క్రీడల్లో కూడా రాణించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కడప యూనియన్ బ్యాంకు జట్టు మూడో స్థానం సాధించిందన్నారు. అలాగే టగ్ ఆఫ్ వార్లో కడప జట్టు రాష్ట్ర చాంపియన్గా నిలించినట్లు చెప్పారు. క్రీడా స్ఫూర్తి, పట్టుదలతో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ వ్యాన్ ఢీ: వ్యక్తికి తీవ్ర గాయలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీ గౌతమ్ హైస్కూల్కు చెందిన వ్యాన్ మధ్యాహ్నం విద్యార్థులతో కడప రోడ్డు మార్గలో వెళుతోంది. అదే సమయంలో నల్లింగాయపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూల్కు తీసుకెళ్లారు. చెరువులో పడిన కారుఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని రామతీర్థం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారును లారీ ఢీ కొట్టడంతో కారు చెరువులో పడింది. పోలీసుల వివరాల మేరకు..కడప నుంచి ఆకేపాడుకు వెళుతున్న కారు ఒంటిమిట్ట రామతీర్థం వద్ద చెరువు కట్టపైకి రాగానే రాజంపేట నుంచి వస్తున్న ఓ లారీ ఢీ కొట్టడంతో పక్కనే ఉన్న చెరువులో పడింది. డ్రైవర్ కదిరి బ్రహ్మయ్య కారు డోరు తెరచుకుని ఈదుకుంటూ బయటకు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని చెరువులో పడిన కారును బయటకు తీయించారు. దెబ్బతిన్న కారును, ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడి : ఆటో డ్రైవర్పై కేసు మదనపల్లెటౌన్ : బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ను స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు స్థానిక ఇందిరానగర్లోని చైతన్య టెక్నో స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సయ్యద్ పక్కింటికి చెందిన ఏడేళ్ల బాలుడికి చాక్లెట్ ఇస్తానని ఇంటిలోకి పిలిపించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత లైంగిక దాడికి పాల్పడడంతో బాధితుడు గట్టిగా కేకలు వేశాడు. కేకలు విన్న స్థానికులు తలుపులు పగలగొట్టి ఇంటి లోనికి వెళ్లి ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు.పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆటో డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ సయ్యద్పై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. -
రూ.లక్షలు ఆఫర్ చేసినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పార్టీ వీడలేదు
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు : అంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కౌన్సిలర్లే.. పార్టీని వీడితే రూ.లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారు.. అయినా పార్టీని వీడకుండా చివరి వరకు తమ వెంట నడిచారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక కొవ్వూరు గ్రాండ్లో బుధవారం నమ్మకానికి పురస్కారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పదవీకాలం పూర్తి చేసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవితోపాటు కౌన్సిలర్లందరికి విందును ఏర్పాటు చేసి అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ టైలర్ కుటుంబానికి చెందిన సాధారణ చేనేత మహిళ అని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న తన బావమరిది పాతకోట బంగారు రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం చేతకాని టీడీపీ నేతలు మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి వెళ్లి రూ.40లక్షలు ఆఫర్ చేశారన్నారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతోపాటు తనకు సమాచారం అందించిందని అన్నారు.మున్సిపాలిటీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి టీడీపీ నేతలు విఫలమయ్యారన్నారు. ఆరో వార్డుకు చెందిన ఎస్సీ కౌన్సిలర్ జయంతికి డబ్బు ఆఫర్ చేశారన్నారు. ఎంత మందికి ఆఫర్లు ఇచ్చినా పార్టీని వీడకుండా తన వెంట వచ్చారన్నారు. ఒకరిద్దరు టీడీపీలో చేరి పొరపాటైందని చెప్పి వెంటనే తన వద్దకు వచ్చారని అన్నారు. వందేళ్లకుపైగా చరిత్రగల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదేళ్ల పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మాత్రమే అన్నారు. ఈ పాలక వర్గ హయాంలోనే సుమారు రూ.150 కోట్లు అభివృద్ధి పనులు మున్సిపాలిటీలో జరిగాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలి మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాచమల్లు ్డ తెలిపారు. మున్సిపాలిటీలో మళ్లీ వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తామని భరోసా కల్పించారు. ఇందు కోసం కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, మంత్రిగా కూడా అవకాశం వస్తుందని తెలిపారు. తమ పార్టీ నేతలను అవమానించిన వారిని దెబ్బకు దెబ్బ కొట్టి వడ్డీతో సహా తీర్చుకుంటామన్నారు. అనంతరం కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారుమునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా,వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, హౌస్ బిల్డింగ్ సొ సైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాజుపాళెం జెడ్పీటీసీ అంజనీకుమారి, గోపల్లె సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు పందిటి సరోజమ్మ, ద్వార్శల భారతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,రాచమల్లు రమాదేవి, పాతకోట మునిశంశీధర్రెడ్డి,కోఆప్షన్ సభ్యులు మల్లికార్జున ప్రసాద్, ఆప్కాబ్ మాజీ చైర్పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, కోఆపరేటివ్ స్టోర్స్అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు చింతల దానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మదనపల్లెలో జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం
మదనపల్లెటౌన్: మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని రేస్ బీఈడీ కాలేజి వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీన్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, కలెక్టర్ నిశాంత్ కుమార్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అంతకుముందు వేద పండితుల ఆశీర్వచనాలు, మంగళవాయిద్యాల నడుమ సాయుధ పోలీసుల దళం (ఏఆర్) గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులు కార్యాలయంలోని వివిధ విభాగాలను రికార్డు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు ఇది ఒక మైలురాయి అన్నారు. అత్యాధునిక , సాంకేతిక, మెరుగైన వసతులతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇక నుంచి సేవలన్నీ ఎస్పీ కార్యాలయంలోనే జిల్లా ప్రజలు పొందవచ్చు అని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ నేర నియంత్రణలోనూ ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలోనూ ముందుకు పోతున్నట్లు చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరణకు రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. పాలనా వికేంద్రీకరణ వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్, జిల్లా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సీఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరీక్షలు ముగిసిన వేళ..
● జ్ఞాపకాలు నెమరేసుకున్న విద్యార్థులు.. ● ఇళ్లకు వెళ్లే సమయంలో బరువెక్కిన చిట్టి హృదయాలు ఆ క్షణం.. పరీక్షలు ముగిశాయన్న సంతోషం కంటే తెలియని భావోద్వేగమేదో కదలాడింది..చూస్తుండగానే వారి కంట నీరొలికింది.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో..ఏ కళాశాలలో కలిసి చదువుతామో అనే దిగులే వారి ముఖాల్లో తారసపడింది.. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల మోముల్లో కనిపించిన హావభావాలివి. రెండేళ్లపాటు కలిసి చదువుకున్న తోటివారిని వీడిపోతున్నామనే బాధతో.. రెండేళ్ల జ్ఞాపకాల భారంతో వీడ్కోలు పలికారు.. రాజంపేట టౌన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రెండేళ్ల పాటు ఒకే కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇకపై అందరు ఒకేచోట కలిసి చదువుకోవడం వీలుపడదు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు పరీక్ష అయిపోయాక కళాశాలలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ వంటి చదువుల కోసం వేరు, వేరు కళాశాలల్లో చేరినా తమ స్నేహం ఇలాగే ఉండాలంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. చివరగా బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు పయనమయ్యారు. భవిష్యత్తుపై స్పష్టతతో విద్యార్థులు ఒకప్పుడు పరీక్షలు ముగిశాక విద్యార్థులు ఏ ఊరెళ్లాళి, సెలవుల్లో ఎలా సందడి చేయాలని ఆలోచించేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సమయం వృధా చేసుకోకూడదన్న ఆలోచనా ధృక్పథమే వారిలో స్పష్టంగా కనిపించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అనేక మంది విద్యార్థులు సెలవులు సద్వినియోగం చేసుకొని తద్వారా ఉన్న త చదువులు చదవాలన్న ఆలోచనా సరళిలో ఉన్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలు రాసి బయటకు వచ్చిన పలువురు విద్యార్థులను ‘సాక్షి’పలకరించగా భవిష్యత్తుపై వారికున్న ఆలోచన స్పష్టమైంది. ముగిసిన ఇంటర్ పరీక్షలు – జిల్లావ్యాప్తంగా చివరి రోజు పరీక్షకు 259 మంది గైర్హాజర్ కడప ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. గత నెల 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా చివరిరోజు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్–2 పరీక్షకు 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సందడి చేస్తూ ఇళ్లకు పయనమయ్యారు. నేను డిగ్రీలో చేరుతాను. డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతాను. బ్యాంకులో ఉద్యోగం సాధించాలన్నదే నాకోరిక. అందువల్ల పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సందర్భంలో బ్యాంకులలో పోస్టులు పడితే బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. ఒకవేళ బ్యాంకులో ఉద్యోగం రాకుంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా. – సుస్మిత, రాజంపేట నేను ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తా. మొదట నాముందున్న లక్ష్యం బీటెక్ చేయడం. బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ చేయాలన్నది నాకోరిక. బట్ బీటెక్ తరువాత అప్పటి పరిస్థితులను బట్టి నా ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఏది ఏమైనా లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలన్నదే నాకోరిక. – ఫుర్ఖాన్, నందలూరు ఇంటర్మీడియట్ తరువాత అభ్యసించే విద్య భవిష్యత్తుకు ఎంతో ప్రధానమైనది. రాబోవు ఆరేడేళ్ల తరువాత ఎలాంటి ఉద్యోగాలు మెండుగా లభిస్తాయి, అందుకు తగ్గట్లు ఏ కోర్సులు చేయాలి అన్న విషయాలపై తల్లిదండ్రులు, విద్యావంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.అందువల్ల ఒకటికి పదిమార్లు బాగా ఆలోచించి కోర్సులను ఎంపిక చేసుకోవాలి. – ఆకేపాటి రజనీకాంత్రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, రాజంపేట మా అమ్మ, నాన్న ఇద్దరు నిత్యం కష్టపడతారు. నేను ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాశాను. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తాను. బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకొని మెకానికల్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు కష్టపడకుండా చూసుకోవా లన్నదే నా ఆశయం. – బిందు, రాజంపేట -
బైక్ దొంగ అరెస్టు
జమ్మలమడుగు : బైక్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పెద్దముడియం పోలీసులు అరెస్టు చేసి దొంగ నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం రూరల్ సీఐ భాస్కర్రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దముడియం మండలంలోని పాలూరు బైపాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీలను నిర్వహించగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సరావు భాస్కరాచారిని అదుపులోకి తీసుకున్నారు. అతను వృత్తి పరంగా బైక్ మెకానిక్. అతని వద్దనుంచి ఆరుబైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. తమ విచారణలో ఆదోని, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ,దేవనకొండ, కౌతాలం,విడవనకల్లు, పత్తికొండ, ఆటూరు, పెద్దపప్పురు, మద్దికేర, తుగ్గలి, కసాపురం, గుంతకల్లు, మంత్రాలయం పోలీసుల స్టేషన్ పరిధిలో మోటర్, హుండీ దొంగతనాలు చేసినట్లు తేలిందన్నారు.ఈ కార్యక్రమంలోఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు. -
పోలింగ్బూత్ కమిటీలే క్రీయాశీలకం
రాజంపేట : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ కమిటీలే క్రీయాశీలకమని పోలింగ్ బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అధ్యక్షతన ఆకేపాటి ఎస్టేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పార్లమెంటరీ స్ధాయి బూత్స్ధాయి సమావేశం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ కమిటీలు పక్బండందీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. త్వరలో ఎస్ఐఆర్ సర్వే జరగనున్నదన్నారు. ఈ సర్వేలో పోలింగ్ బూత్ల వారీగా ఓట్లను కోల్పోకుండా చూడాలన్నారు. అందుసంబంధించి ధృవపత్రాలను జతపరిచి, వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్ధితులను కల్పించుకోవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, టీడీపీ ఎత్తుగడలను తిప్పికొడుతూ, ముందుస్తుగా ఓట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితులు నేడున్నాయన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ల నియామకంపై కూడా ఇప్పటి నుంచి దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికలసంఘం నియమనిబంధనలను అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బలోపేతంగా పనిచేసినప్పుడే ఎన్నికల ప్రక్రియలో మంచి ఫలితాలు చూడగలమన్నారు. పోలింగ్బూత్ నియమాకానికి సంబంధించిన అంశాలపై పకడ్బందీగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఓటు కీలకమనేది గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలంటే ఇప్పటినుంచే గ్రామ, మండల, నియోకవర్గస్థాయి వరకు కమిటీలో ఉన్న వారు చురుగ్గా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్ధానిక సంస్ధల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంకావాలన్నారు. టీడీపీని ఓడించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. ఐదు సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలప్రక్రియ కీలకమైందన్నారు. రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం కృషిచేద్దామన్నారు. పోలింగ్బూత్ కమిటీలు, గ్రామస్థాయి కమిటీలే ఎన్నికల ప్రక్రియలో కీలకభూమి పోషిస్తాయన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారంతా పార్టీని బలోపేతం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్బూత్ స్ధాయి వర్క్షాపులో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్రెడ్డి చెప్పేసూచనలు, సలహాలు పాటించేలా ముందుకెళ్లాలన్నారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబులరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కావాల్సింది కార్యకర్తలకు భరోసా ఇవ్వడమే అని అన్నారు. వారిలో మనోధైర్యం నింపే బాధ్యత నియోజకవర్గ స్థాయి నేతలు తీసుకోవాలన్నారు. కేసులకు భయపడే ప్రసక్తిలేదని, తిరిగి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. రాయలసీమ జోన్ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటీ అధ్యక్షుడు నడివీధి సుధాకర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, మండలపార్టీ కన్వీనర్ గోపిరెడ్డి, దొడ్డిపల్లె భాస్కర్రాజు, రామస్వామిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు రెడ్డి హరి, సూరం సుబ్బారెడ్డి, రవికుమార్రెడ్డి, తిప్పన నాగభూషణం, డీలర్ సుబ్బరామిరెడ్డి, పోలి రఘు, సుబ్బరామిరెడ్డి, భాస్కర్యాదవ్, కిషోర్కుమార్, బూత్ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెహిమాన్ఖాన్, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, బూత్కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.బూత్కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రతపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాల్ లో మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో వేర్వేరుగా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీల్లో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. గస్తీ ని పెంచాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దష్టి సారించి గస్తీని పెంచడంతో పాటు గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకష్ణ, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్.ఐ లు పాల్గొన్నారు. ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ‘శ్రీ పరాభవ‘ నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని, తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఎస్పీ ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని పేర్కొన్నారు.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి బుధవారం తెలిపారు. కళాశాలలో నిర్వహిస్తున్న డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులకు న్యూఢిల్లీ నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సంస్థ నుంచి గుర్తింపు లభించిందన్నారు. ఎన్బీఏ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కళాశాలను సందర్శించి, విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించినట్లు చెప్పారు. అనంతరం కంప్యూ టర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులకు 2026 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు అక్రిడిటేషన్ మంజూరు చేసినట్లు ఎన్బీఏ ప్రకటించిందన్నారు. -
ఆటోల దొంగ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ఆటో దొంగ అనిల్కుమార్ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ వంశీనాథ్ బుధవారం సాయంత్రం వివరాలు మీడియాకు వెల్లడించారు. కడపలోని ఎన్జీఓ కాలనీకి చెందిన తుమ్మలూరు అనిల్కుమార్ ఆటో నడుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే అతను ఆటోలను చోరీ చేయడం అలవాటు చేసుకున్నాడు. పార్క్ చేసిన ఆటోలను చాకచాక్యంగా స్టార్ట్ చేసుకొని దొంగలించుకొని వెళ్తుంటాడు. రైల్వేకోడూరు, చిన్నచౌక్, తిరుపతి ఈస్ట్, తిరుపతి వెస్ట్, తిరుచానూరు పోలీస్స్టేషన్లలో అతనిపై ఆటో చోరీ కేసులు ఉన్నాయి. ఈ నెల 8న ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద పార్క్ చేసిన ఒక ఆటోను, కడపలోని కొత్తబస్టాండు, గోకుల్లాడ్డి వద్ద నిలిపి ఉన్న రెండు ఆటోలను చోరీ చేశాడు. ఈ క్రమంలో టూ టౌన్ ఎస్ఐలు మహబూబ్బాషా, రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలిసి బుధవారం ప్రకాష్నగర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చి అనిల్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనిల్కుమార్పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.మూడు ఆటోలు స్వాధీనం -
జూనియర్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలి
కడప సెవెన్రోడ్స్ : ఇరిగేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రణీత్రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్ల సంఘం బుధవారం ఇరిగేషన్ శాఖ ఎస్ఈకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో బద్వేలు డీఈ వేణుగోపాల్రెడ్డి అక్కడే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్రెడ్డిల మధ్య పనుల విషయంగా ఘర్షణ జరిగింది. ఈ మేరకు ఇరువురు పోలీసుస్టేషన్లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. బుధవారం డీఈ వేణుగోపాల్రెడ్డితో కలిసి ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఎస్ఈ అబ్దుస్ షమీని కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేసి అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అక్కడ జరిగిన విషయం తమకు ఎలా తెలుస్తుందని, వెంటనే ఇక్కడికి ఈఈ చెంగల్రాయుని రమ్మని చెప్పాలని ఇంజినీర్లకు ఆయన తెలియజేశారు. దాదాపు గంటసేపు ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఎస్ఈ కార్యాలయంలోనే ఉండి ఈఈ వచ్చిన తర్వాత కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పదేపదే చెప్పారు. ఈ విషయమై ఎస్ఈ అబ్దుల్ షమి ఈఈ చెంగల్రాయుడిపై సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన ఉద్యోగులు కార్యాలయంలోనే ఘర్షణకు దిగుతుంటే ఏం చేస్తున్నారని, ఘర్షణకు తావివ్వకుండా ముందే విషయాన్ని ఇంతవరకు రానీయకుండా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఈఈ చెంగ్రలాయులుకు ఎస్ఈ మెమో ఇచ్చారు. ఈ సంఘటనపై పూర్తిగా విచారణ చేపట్టి తమకు నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని సూచించారు. అందుకు సంబంధించి మెమోను కూడా ఇచ్చినట్లు ఎస్ఈ వివరించారు. నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.ఈఈకి మెమో ఇచ్చిన ఎస్ఈ -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్ : వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. కలికిరి మండలం, మంచూరుకు చెందిన శివశంకర్(40) ప్రైవేట్ వాహన డ్రైవర్ గా పనిచేస్తాడు. మూడు రోజుల క్రితం శివశంకర్తో గొడవపడి గీత పుట్టినిల్లు అయిన చౌడేపల్లెకు అలిగి వచ్చేసింది. దీంతో భర్త భార్యను కాపురానికి పిలవడానికి అత్తగారి ఇళ్లు అయిన చౌడేపల్లెకు మంగళవారం వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో పురుగుల మందు తాగాడు.. గమనించిన స్థానికులు చౌడేపల్లి 108 సమాచారం అందించడంతో వారు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందించి, ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్చేశారు. ఘటనపై చౌడేపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● మరో ఘటనలో అనంతపురం జిల్లా, పెనుగొండకు చెందిన జేసీబీ డ్రైవర్ వి.గణేష్(23) మదనపల్లెకు వచ్చి స్థానిక నీరుగట్టువారిపల్లె సమీపంలోని అమ్మచెరువుమిట్ట డౌన్ లో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో వారు బాధితున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబీకుల సమాచారం అందించారు. వారు ఎంతకూ రాకపోవడంతో ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● మదనపల్లె పట్టణం, నిమ్మనపల్లె క్రాస్ రోడ్డులో నివశిస్తున్న నాగేంద్ర(43), క్రాస్ రోడ్లు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా తాను ఉంటున్న ఇంట్లోనే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని రుయారు రెఫర్ చేశారు. -
కర్నూలు, అనంతపురం జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగుటు చేసింది. ఆ జట్టులోని కరణ్ షిండే 124 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. నాయిముల్లా 32 పరుగులు చేశాడు, నెల్లూరు జట్టులోని సాకేత్ రామ్ 2 వికెట్లు, భరత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 47.1 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని సుబ్రమణ్యం 28 పరుగులు, రోషన్ పవన్కుమార్ 46 పరుగులు, భరత్ 48 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్య తేజరెడ్డి 4 వికెట్లు, సుదర్శన్రెడ్డి 2, అంజనేయులు 2, ఖనిష్ 2 రెండు వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 68, ఎంకె దత్త రెడ్డి 72 పరుగులు, హానిష్ వీరారెడ్డి 62 పరుగులు, గిరినాఽథ్రెడ్డి 68 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నారెడ్డి 2, పఠాన్ షరీఫ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 48.3 ఓవర్లకు 277 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని ధృవకుమార్ రెడ్డి 75, వంశీకృష్ణ 50, వాసుదేవ రాజు 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లిఖార్జున 4 వికెట్లు, ప్రమోద్ కుమార్ 3 వికెట్లు తీశారు. దీంతో 86 పరుగులు తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
మదనపల్లెటౌన్ : భర్తతో దూరంగా ఉంటూ అనాథ ఆశ్రమంలో రిసెష్పనిస్టు ఉద్యోగం చేసుకుంటున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై టూటౌన్ పోలీసుల కథనం మేరుకు.. మదనపల్లె మండలం, బసినికొండకు చెందిన తేజ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వాల్మీకిపురం మంలం, చింతపర్తికి చెందిన చంద్రయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె స్వాతి(29)ని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా విభేదాలు తలెత్తి గొడవపడి విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి పట్టణంలోని బర్మావీధిలోని చైతన్య సర్వీసెస్ సోసైటీ(అనాథ పిల్లల ఆశ్రమం)లో రిసెష్పనిస్టుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. భార్య భర్తలు ఇద్దరు ఐదేళ్ల క్రితం కోర్టులో కేసులు వేసుకున్నారు. వాయిదాలకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి జరిగిందో ఏమో స్వాతి తాను ఉంటున్న సొసైటీలోని గదిలో మంగళవారం అర్థరాత్రి తన చున్నీతో భవంనం పైకప్పునకు ఉన్న కమ్మీకి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఉదయం గమనించిన సొసైటీ సిబ్బంది వెంటనే రెండో పట్టణ పోలీసులకు, మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు ఆశ్రమానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రూ.1.54 కోట్ల విలుబైన సెల్ ఫోన్లు రికవరీ
మదనపల్లెటౌన్ : సెల్ ఫోన్ పోయిందంటే ఇక రాదు అనే పాత నమ్మకాన్ని చెరిపేస్తూ, అన్నమయ్య జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ఒకే విడతలో రూ.1.54,36 కోట్లకు పైగా విలువచేసే 716 సెల్ ఫోన్లను రికవరీచేశారు. బుధవారం జిల్లా కేంద్రం మదనపల్లెలో జరిగిన తొమ్మిదో విడత సెల్ ఫోన్ల రికవరి మేళాలో బాధితులకు కర్నూల్ రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు కలిసి బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో రూ.6.20 కోట్ల విలువైన 2,953 సెల్ ఫోన్లను రికవవరీ చేసి ప్రజలకు అప్పగించినట్లు చెప్పారు.సెల్ పోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైం సిఐ మహమ్మద్ అలీ, ఛంద్రశేఖర్ వారి సిబ్బందిని అభినందించారు. ● ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కు రానవసరం లేదన్నారు. కేవలం 86888 30012 వాట్సాప్ నంబర్కు హాయ్ అని మేసేజ్ పంపితే మీరు పోగొట్టుకున్న ఫోన్ను మేమే వెతికిస్తామని తెలిపారు. ఈ సేవలకు ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వొద్దని, సేవలన్నీ పూర్తిగా ఉచితమని చెప్పారు. ● వాట్సాప్ ద్వారా 8688830012 కుమెసేజ్ పంపి వివరాలు నమోదు చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆన్ లైన్ ద్వారా www.ceir.gov.in వెబ్సైట్లో మీ ఫోన్ను వెంటనే బ్లాక్ చేయాలన్నారు. -
పనుల పరిశీలన
కొండాపురం: గండికోట జలాశయం నుంచి కుప్పానికి తాగునీరు అందించేందుకు రూ.2,370 కోట్లతో పనులు చేపట్టినట్లు ఇరిగేషన్ సీఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్న కుమార్ తెలిపారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జల్ జీవన్ పథకంలో భాగంగా రెండు విడతల్లో కుప్పానికి తాగునీరు తీసుకెళ్లేందుకు పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో మదనపల్లె పీలేరు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. జలాశయం వద్ద ఇంటెల్ వెల్ నిర్మాణంతో పాటు పైపులైను నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఓ ఉమా మహేశ్వర్లు జ్ఞానేందర్ రెడ్డి సుదర్శన్, విద్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
– కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల : జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అహంకారం, స్వార్థం వంటి దుర్గుణాలను జయించి ముందుకు సాగడమే పరాభవ అర్థమని పేర్కొన్నారు. ఏడాదంతా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల వారికి తాము ఎంచుకున్న రంగాలలో విజయాలు కలిగి ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు. 151 మంది గైర్హాజరు కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 167 పరీక్షా కేంద్రాలలో 27732 మంది విద్యార్థులకుగాను 27581 మంది హాజరుకాగా 151 మంది గైర్హాజరయారు. పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు 49 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా 80 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్వాడ్ ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పరీక్షకు 31 పరీక్షా కేంద్రాలకుగాను 2386 మంది అభ్యర్థులకుగాను 1969 మంది హాజరుకాగా 387 మంది గైర్హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్ బాయిస్లో ఒకరిని డీబార్ చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. వాల్మీకిపురం: వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని టీటీ డీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక పట్టాభిరామాలయంలో టీటీడీ అధికారులు, అర్చకులతో కలసి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. అలాగే 29న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం , 30వ తేది రథోత్సవం, 2వ తేది పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని, స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయా లని ఆమె కోరారు. టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
భూ కబ్జాలకు నిలయంగా ఒంటిమిట్ట
సాక్షి టాస్కపోర్స్: ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లి పంచాయతీ, వడ్డిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార పార్టీ నాయకుడు ఆక్రమించినట్లు అదే గ్రామానికి చెందిన చల్లా చంద్ర శేఖర్ అనే వ్యక్తి కడప జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు..వడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 158 లో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంత కాలంగా ఆక్రమించి ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకుడైన గడ్డెం సుబ్బారెడ్డి నుంచి కాపాడాలని విన్నవించారు. కబ్జా దారుడైన స్థానిక గెడ్డెం సుబ్బారెడ్డికి సర్వే నంబర్ 157లో 0.93 సెంట్ల సొంత భూమి ఉంది, అయితే అదే సర్వే నంబర్కు ఆనుకుని ఉన్న 158 సర్వే నంబర్లో దాదాపు 100 సంవత్సరాలుగా వడ్డె కులస్తుల అనుభవంలో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల గ్రామకంఠాన్ని గడ్డెం సుబ్బారెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా అక్రమించుకొని, తన భూమిలో కలుపుకున్నాడన్నారు. ఇదే కాకుండా సదరు గ్రామానికి అనుకుని ఉన్న పలు ప్రభుత్వ భూములు, గ్రామకంఠాల స్థలాలను అధికార పార్టీ ముఖ్య నాయకుడి అండ చూసుకొని, దాదాపు 8ఎకరాల వరకు గడ్డెం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించినట్లు ఫిర్యాదు దారుడు తెలిపాడు.అక్రమించుకున్న ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలను చదును చేసి కొన్ని చొట్ల కంచెను వేయగా, మరికొన్ని చోట్ల చెట్లను నాటి సాగు చేసుకుంటున్నాడని ఫిర్యాదు దారుడు చల్లా చంద్ర శేఖర్ పేర్కొన్నారు. కబ్జా రాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పండుగ కళ !
● జీవితం రుచి తెలిపే పండగ ఉగాది ● పంచాంగ పఠనానికి ఏర్పాట్లు పూర్తితెలుగు లోగిళ్లకుకడప సెవెన్రోడ్స్ : తెలుగు సంవత్సరాది..ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా ప్రజలు నిర్వహించుకోనున్నారు. తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాదితోనే. ఈ సందర్భంగా జిల్లాలోని తెలుగులోగిళ్లు నవ వసంత శోభను సంతరించుకున్నాయి. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే పలు ఆలయాల్లో కూడా పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ఈ ఏడు వర్షాలు, పాడి పంటలు, ధరలు వంటి విషయాలను పంచాంగ పఠనం చేసే పండితులు తెలియజేస్తారు. కష్టసుఖాల సమ్మేళనం జీవితం.. జీవితాంతం హాయిగా..ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎంత వద్దనుకున్నా..ఎంత ధనవంతులకై నా కష్టాలు తప్పవు....జీవితమంటే కష్టసుఖాల కలయిక అని తెలుపుతూ ఉగాది పండుగ నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరిస్తారు. జీవితమంటే చేదు, తీపిల కలయిక అని సందేశం ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం చేకూర్చే ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటిలోనూ తప్పక తయారు చేస్తారు. ఈ సీజన్లో వచ్చే ఎన్నో వ్యాధులను ఈ పచ్చడి తినడం ద్వారా నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కవుల పండుగ ఉగాదిని కవుల పండుగగా చెప్పవచ్చు.పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అంతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. కవులను దార్శనికులుగా భావిస్తారు గనుక వారి కవిత్వాన్ని ఈ పండుగ సందర్భంగా శ్రద్ధగా వింటారు. వైఎస్సార్ జిల్లాను కవుల గడపగా పేర్కొంటారు. జిల్లా అంతటా స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజానికి సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందజేయనున్నారు. మత సహనం మన జిల్లాను మత సహనానికి మారుపేరుగా పేర్కొంటారు. ఉగాది సందర్భంగా దేవునికడప ఆలయంలో పలువురు ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట, రాయచోటిలలో కూడా ఈ ఆచారం ఉంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెలుపల నాటి ముస్లిం ప్రముఖులు తవ్వించిన ఇమామ్ బేగ్ బావి మత సామరస్యానికి మారుపేరుగా నేటికీ నిలిచి ఉంది. కడప నగరం బ్రాహ్మణ వీధిలోని జూల ఆంజనేయస్వామి ఆలయాన్ని కడప నిర్మితమైన తొలిరోజుల్లో ముస్లిం సుల్తాన్ నిర్మింపజేసినట్లు తెలుస్తోంది. పండుగ సందడి ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లాతోపాటు కడప నగరంలో సందడి నెలకొంది. ఉదయం నుంచి నగరంలోని వైవీ స్ట్రీట్, ఇతర వాణిజ్య కూడళ్లలో ప్రజలతో రద్దీగా కనిపించాయి. దుస్తులతోపాటు మార్కెట్లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లు కొనసాగాయి. అలాగే వన్టౌన్ సర్కిల్, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, దొంగల చెరువు కట్ట, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాల్లో అరటి పిలకలు, మామిడాకులు, పూలు, పండ్లు, టెంకాయలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే పండుగ నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు. కడపలో మామిడాకులుకొంటున్న జనం -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని భాకరాపేట రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న మహబూబ్నగర్ గ్రామ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మగ వ్యక్తి (50) మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా గాయాలయ్యాయన్నారు. మృతి చెందిన వ్యక్తి ఆరెంజ్, తెలుపు గళ్ల చొక్కా, లైట్ బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి మరణానికి గల కారణాలు, మృతుడి ఆచూకీ గురించి విచారణ చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే సీఐ 9247575623, ఎస్ఐ 9247575624లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
లింగాల : మండల పరిధి కోమన్నూతల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళ సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన జ్యోష్న (24), కోమన్నూతల గ్రామంలోని నారప్పగారి వీరబాబు ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరబాబు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా కూలీ పని చేసి సంపాదించిన మొత్తాన్ని మద్యానికి వెచ్చిస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. సోమవారం వీరబాబు పులివెందులకు అరటి కాయల లోడు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కూడా ఫోన్ చేసి భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించి తోడి కోడలు రోజా ఇంట్లోకి వచ్చి చూడగా, ఉరి వేసుకుని వేలాడుతున్న జ్యోష్నను చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే జ్యోష్న అప్పటికే మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. జ్యోష్న మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
మఠంలో నివాసం రగడ
● తక్షణం ఖాళీ చేయాలి : మఠాధిపతి ● గడువు కావాలి : మారుతీ మహాలక్ష్మమ్మ బ్రహ్మంగారిమఠం: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం అధికారిక నివాసం విషయంలో ప్రస్తుత మఠాధిపతి వెంకటాద్రి స్వామి, పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపక్షాల వాదనలు ఇలా ఉన్నాయి. తక్షణం ఖాళీ చేయాల్సిందే: మఠాధిపతి వెంకటాద్రి స్వామి ‘మఠాధిపతిగా నన్ను ఎన్నుకున్నందున, మఠం ఆభరణాలు, రికార్డులు నాకు అప్పగించారు. సిద్ధాంతం ప్రకారం మఠాధిపతి నివాసంలో కేవలం పీఠాధిపతి కుటుంబం మాత్రమే ఉండాలి. హోమాలు నిర్వహించి మేము అక్కడికి చేరుకుంటాం. మహాలక్ష్మమ్మ అక్కడ ఉంటే మాకు భద్రత ఉండదు. ఇప్పటికే అధికారుల ద్వారా ఆమెకు సమాచారం ఇచ్చాం. గతంలో ఆమె స్వయంగా ‘నియామకం జరిగితే ఖాళీ చేస్తానని’ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. తక్షణం ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’ మూడు నెలల సమయం కావాలి: మారుతీ మహాలక్ష్మమ్మ ‘మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబం ఉండాలనేది నిజమే. కానీ, నేను నా ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లాలంటే కనీసం మూడు నెలల గడువు కావాలి. ఆస్తుల భాగ పరిష్కారాలు ఇంకా జరగలేదు, మేము ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. కనీసం నా పనిమనుషులను కూడా ఉంచడం లేదు. మఠాధిపతి నుంచి అధికారికంగా లేఖ వస్తే ఖాళీ చేసే విషయం ఆలోచిస్తాను. నా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారి పని వారిది.. నా పని నాది.’ ఒకవైపు ఆచారాల ప్రకారం నివాసం ఖాళీ చేయాలని మఠాధిపతి పట్టుబడుతుండగా, మరోవైపు మానవతా దృక్పథంతో గడువు కావాలని మహాలక్ష్మమ్మ కోరుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. -
కూటమి నేతల కీలుబొమ్మగా సునీత : రెడ్యం
ఖాజీపేట : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి సునీత కూటమి నేతల చేతిలో కీలుబొమ్మలా మారి వైఎస్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసుతో వైఎస్ భారతి, జగన్మోహన్రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పినా, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే సునీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గంటకు కోటి రూపాయలు తీసుకునే లాయర్లకు సునీతకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నేరచరిత్ర లేని అవినాష్రెడ్డిని కేసులో ఇరికించడం దారుణమని, చివరకు వైఎస్ కుటుంబం కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిప్పర్ కింద పడి వ్యక్తి దుర్మరణం లింగాల : మండల పరిధి బోనాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టిప్పర్ కింద పడి దస్తగిరి (40) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. బోనాల నుంచి పొలాలకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో దస్తగిరి తన టిప్పర్కు మట్టి లోడు పోయించుకునేందుకు టిప్పర్ నుంచి దిగి మట్టిని లోడు చేయిస్తుండగా.. మరో టిప్పర్ రివర్స్లో వచ్చి వెనుక ఉన్న దస్తగిరిపై వెనుక టైర్లు ఎక్కాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దస్తగిరి స్వగ్రామం వేముల మండలం చింతలజూటూరు. ఆయనకు భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దస్తగిరి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఇంత వరకు పోలీసులకు దీనిపై ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. పోరుమామిళ్ల పోస్టాఫీసులో చోరీ పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పోస్టాఫీసులో రెండు లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఎస్ఐ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం పోస్టాఫీసు సిబ్బంది తలుపులు తెరచి ఉండటం గమనించి లోపల పరిశీలించారు. నగదు చోరీ జరిగినట్లు వారు గమనించి సమాచారం పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్ఐ హనుమంతు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాధవరం దుకాణంలో.. సిద్దవటం : మండల పరిధి మాధవరం 1,2,3 వార్డుల పంచాయతీలోని సుధాకర్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడి రూ.1.45 లక్షల నగదు అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుధాకర్ సోమవారం రాత్రి 9 గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. దుకాణంలో ఉన్న నగదు రూ.25 వేలు, తన భార్య సురేఖ పొదుపు చేసుకున్న నగదు రూ.40 వేలు, బీరువాలో దాచుకున్న రూ.80 వేలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సుధాకర్ వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఏఎస్ఐ సుబ్బరామచంద్రను వివరణ కోరగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. -
ప్రపంచ వీక్షణగా వైవీయూ వెబ్సైట్
వీసీ ఆచార్య రాజశేఖర్కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం వెబ్సైట్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, సమాజానికి మరింత చేరువయ్యేలా తీర్చిదిద్దాలని ఉపకులపతి (వీసీ) ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం వీపీ చాంబర్లో వెబ్సైట్లోని నూతన మీడియా కార్నర్ను కులసచివులు ఆచార్య పి.పద్మ, ఐటీ సెల్ డైరెక్టర్ తుమ్మలకుంట శివతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ సమాచారం ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండాలని, పబ్లిక్కు అవసరమైన ప్రతి అంశం వెబ్సైట్లో కనిపించాలని సూచించారు. మీడియా కార్నర్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం మరియు వర్సిటీ ఈవెంట్స్ వివరాలను అందుబాటులో ఉంచాలని బాధ్యులను ఆదేశించారు. ఐటీ సెల్ డైరెక్టర్ శివ వెబ్సైట్లో కొత్తగా చేర్చబోయే విభాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా కార్నర్ బాధ్యులు డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు, రఖీబ్ పాల్గొన్నారు. -
కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం సమీపంలోని నిడివెల్ల వద్ద ఉన్న కస్తూరర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని పాఠశాల ఎస్ఓ గురుదేవి తెలిపారు. మంగళవారం ఆమె తెలుపుతూ 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40సీట్లు, రెండవ సంవత్సరంలో ఖాళీగా ఉన్న 9 సీట్లకు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ఎంపికై న విద్యార్థుల జాబితా, ఏప్రిల్ 13 నుంచి 17 వరు విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9948454910 ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. కై జిన్– 2కే26లో విజేతలకు ప్రశంసలు కడప ఎడ్యుకేషన్ : నంద్యాలలోని ఆర్జీఎం కాలేజీలో కై జిన్– 2కే26 పేరుతో నిర్వహించిన మేనేజ్మెంట్ మీట్లో యోగివేమన విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగ విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. వారిని ఆ శాఖ విభాగ అధిపతి డాక్టర్ పి.సరిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యంగ్ మేనేజర్ ఈవెంట్లో పి.గురుబాయి, జి.వైష్ణవి, బి.రూపాదేవి, కె.పూర్ణ విజేతలుగా నిలిచి, నగదు బహుమతి పొందారని చెప్పారు. పేపర్ ప్రజెంటేషన్లో పి.శ్వేత, యస్.చరిత రెండవ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకున్నారన్నారు. బజ్ స్పార్క్ పోటీలో బి.నందిని, ఎం.వినోద్ కుమార్, డి.విక్రాంత్, ఎ.చైతన్య తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. వారిని మేనేజ్మెంట్ శాఖలోని అధ్యాపకులు ప్రశంసించారు. -
రెండేళ్లు దాటినా ఉపాధి లేదు
ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రకేసరి రోడ్డుకు చెందిన బోదన సలోమి రెండేళ్లు దాటినా ఉపాధి లభించకపోవడంతో ఎదుచూస్తూ ఉంది. సలోమి భర్త ఓబులేసు మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ విభాగంలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ 2024 మార్చి 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త స్థానంలో తనకు ఉపాధి కల్పించాలని ఆమె ఇప్పటి వరకు అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరో వైపు గత రెండేళ్లుగా వితంతువు అయిన ఈమె సామాజిక పింఛన్కు కూడా నోచుకోలేదు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చేసేందుకు పని లేకపోవడంతోపాటు పింఛన్ రాకపోవడంతో కుటుంబ భారాన్ని మోయడం ఆమెకు కష్టంగా మారింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేసింది. ఎర్రచందనం కేసులో జైలుశిక్ష, జరిమానా సిద్దవటం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన అన్నామలై పలని స్వామి అనే ముద్దాయికి ఎర్రచందనం కేసులో తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టు జడ్జి నరసింహమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించినట్లు తీర్పును వెలువరించారు. 2017 సంవత్సరంలో సిద్దవటం రేంజ్లో సిద్దవటం బీట్లో తమిళనాడుకు చెందిన అన్నామలై పలని స్వామి అనే వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ మంగళవారం తిరుపతి ప్రత్యేక కోర్టు నరసింహమూర్తి అతనికి ఐదు సంవత్సరాల శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించినట్లు తీర్పును వెలువరించారు. సిద్దవటం అటవీ అధికారి కళావతి మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో ముద్దాయికి శిక్ష పడటానికి సిద్దవటం అటవీ సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. -
సేవా భావంతో వైద్య వృత్తిలో రాణింపు
రాజంపేట : సేవా భావం అలవర్చుకుంటే వైద్య వృత్తిలో రాణిస్తారని అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత, చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి తెలిపారు. మంగళవారం అన్నమాచార్య యూనివర్సిటీలోని పార్మసీ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు జగన్మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైద్య సైన్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ రంగంలో ఉన్న వారికి సానుభూతి, సహానుభూతి అత్యంత అవసరమన్నారు. ఒక వైద్యసేవకుడు కేవలం చికిత్స చేయడమే కాదు, రోగికి మానసికంగా ధైర్యం చెప్పగలిగే వ్యక్తిగా ఉండాలని సూచించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే నేటి సమాజంలో విద్యార్థులు రాణించగలరన్నారు. ఏయూ వీసీ డా.సాయిబాబా మాట్లాడుతూ విద్యతోపాటు విలువలు కూడా నేర్చుకోవడా న్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం జాసిమ్, కీర్తనా, అనీసా విద్యార్థులకు ప్రశంసాపత్రాలను చొప్పా గంగిరెడ్డి, డా.జగన్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఇన్చార్జి డా.ద్వారకనాథరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హత్యాహత్నం కేసులో రెండేళ్లు జైలు
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి శివప్రశాంత్కు కడప అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి జీసీ ఆసిఫా సుల్తానా రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2023 అక్టోబరు 26న సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డు క్రిష్ణాపురం గ్రామానికి చెందిన పిల్లనారిగాండ్ల గంగాదేవి కుమారుడు జగదీశ్ సింహాద్రి గ్రామంలోని రోడ్డు పైన హెయిర్ కటింగ్ కోసం వెళ్తుండగా.. కొంత మంది రోడ్డుపై నిలుచొని ఉండి, వారిలో ఒకరు జగదీష్ను ఊరు, పేరు వివరాలు అడిగారు. అలాగే ఎక్కడికి పోతున్నావ్ అని, నా గురించి నీకు తెలియదా అని అడగగా.. తెలియదని జగదీష్ సమాధానం తెలిపి తాను రామ్మోహన్రెడ్డి అంగడి వద్దకు నడుచుకుంటూ పోయేసరికి వెనుక వైపు నుంచి శివప్రశాంత్ స్కూటీలో వచ్చాడు. వచ్చి రావడంతోనే జగదీష్ను ఏరా కొడకా నేను అడిగితే సరిగ్గా సమాధానం చెప్పవా ఇంతకు ముందు ఒకరిని చంపినా, అయినా కూడా నా గురించి తెలియదా అంటూ బెదిరింపులకు దిగాడు. నాకే ఎదురు సమాధానాలు చెప్తావా నిన్ను చంపితే నీకు ఎవరు దిక్కు అని తన వద్ద ఉన్న బీరు బాటిల్తో తలపై కొట్టి వెంటాడి చంపాలనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి రాగా పారిపోతూ ఎప్పటికై నా నీ చావు నా చేతిలోనే అని బెదిరిస్తూ వెళ్లిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు కడప రిమ్స్ హాస్పిటల్లో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లో 2023 అక్టోబర్ 31న కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేసి నిందితుడు నరసరామయ్యగారిపల్లెకు చెందిన శివప్రశాంత్ అని గుర్తించి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కేసు విచారణ సమయంలో చింతకొమ్మదిన్నె పోలీసులు సాక్షులను ప్రవేశ పెట్టడంతో, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కసాం శ్రీనివాసులు సమర్థంగా వాదనలు వినిపించారు. నేరం నిరూపణ కావడంతో కోర్టు వారు ముద్దాయికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించారు. నేరం నిరూపించడటంలో దర్యాప్తు అధికారి ఎస్ఐ.శ్రీనివాసులురెడ్డి, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, హోంగార్డు రెడ్డయ్య, కేసు పర్యవేక్షణ చేసిన ప్రస్తుత సీఐ బాల మద్దిలేటిని ఎస్పీ అభినందించారు. -
గ్యాస్ కొరత లేదు...వదంతులు నమ్మొద్దు!
కడప సెవెన్రోడ్స్: గ్యాస్ సరఫరాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో డీఎస్ఓ రఘురామ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లోలోని 58 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే సంభందిత డివిజనల్ అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించమన్నారు. జిల్లా, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగ గ్యాస్ కొరత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని కేవలం 25/45 రోజులు (పట్టణ/గ్రామీణ వినియోగదారులు) గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్ల ను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా పాలన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు.గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్యఅవసరాల కోసం తరలించిన/ వినియోగించిన అట్టి వారిపై నిత్యావసరాల చట్టం 1955, ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలకు సంప్రదించాల్సిన నెంబర్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా -
వైఎస్సార్, జగన్ల కృషితోనే కడప ప్రగతి
కడప కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిల హయాంలోనే కడప నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కడప నగర పాలక సంస్థ ఆవరణలో నిర్వహించిన మూడవ పాలకవర్గ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి పథంలో నగరం 2005లో వైఎస్సార్ హయాంలో రూ. 1,582 కోట్లు, 2019 నుంచి జగన్మోహన్రెడ్డి హయాంలో రూ. 2,272 కోట్లు వెచ్చించి కడపను తీర్చిదిద్దారని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, స్మశానాలు, పార్కుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ వైఎస్సార్ వల్లే సాధ్యమైందన్నారు. జగన్ హయాంలో కొత్త పార్కులు, వరద ముంపు నివారణకు డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ మళ్లీ కార్పొరేటర్లుగా గెలవాలని ఆయన ఆకాంక్షించారు. కృతజ్ఞతలు తెలిపిన మేయర్: మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యలపై గొంతెత్తడం వల్లే తనకు మేయర్ అవకాశం దక్కిందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు, సహకరించిన నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కడప అభివృద్ధిలో మూడు పాలకవర్గాల కృషి ఉందన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు ముంతాజ్బేగం, నిత్యానందరెడ్డి, కమిషనర్ రాకేష్ చంద్ర ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఈఈ విజయ్కుమార్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. చివరగా కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఐదుగురు నాయకులపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఐదేళ్లపాటు పార్టీలో పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించినందుకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సస్పెన్షన్కు గురైన వారిలో బండి జయమ్మ (5వ డివిజన్ కార్పొరేటర్), ఎస్. శివకోటిరెడ్డి (12వ డివిజన్ కార్పొరేటర్), ఎం. రామలక్ష్మణ్రెడ్డి (13వ డివిజన్ కార్పొరేటర్), ఓ. బాలకొండయ్య (నగర ఉపాధ్యక్షుడు), నాగేంద్రారెడ్డి (46వ డివిజన్)లున్నారు. పార్టీ నిబంధనలను అతిక్రమించి ఇతర పార్టీలోకి వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఘనంగా కడప కార్పొరేషన్ మూడవ పాలకవర్గ వీడ్కోలు సమావేశం -
నేడు మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్
కడప సెవెన్రోడ్స్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంలోని మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నగరంలోని నూర్జహాన్ కల్యాణ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లింగురువులు, పెద్దలు హాజరవుతారన్నారు. ముస్లింలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా సహకార అధికారిగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యను జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారిగా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీపీఓగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి ఉద్యోగ విరమణ చేయడంతో ఆమె స్థానంలో వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. జిల్లాకు కొత్త డీపీఓ వచ్చే వరకు వెంకట సుబ్బయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతారు. ● కడప ఆర్డీఓగా ఎ.మురళి కడప సెవెన్రోడ్స్: జిల్లా రెవెన్యూ అధికారిగా కె.మల్లికార్జునుడును నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నం. 583ను జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని హంద్రీ–నీవా భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ డీఆర్వోగా పనిచేస్తున్న ఎం.విశ్వేశ్వరనాయుడును విశాఖపట్టణం డీఆర్వోగా బదిలీ చేశారు. నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న ఎ.మురళిని కడప రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టు యూనిట్–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్.శివరాముడును రాజమహేంద్రవరం ఆర్డీఓగా నియమించారు. కడపలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్గా పనిచేస్తున్న ఎస్.ప్రేమంత్కుమార్ను ధర్మవరం ఆర్డీఓగా నియమించారు. కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం ప్రత్యేక ’సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించనున్నట్లు సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలవారు పారిశ్రామిక విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎస్ఈ కార్యాలయాల్లో మొదటి బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పరిష్కారం కాని సమస్యలను, ఈ మూడవ బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో నేరుగా సీఎండీని కలిసి విన్నవించవచ్చని తెలిపారు. ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ’వనజీవి’ దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన లఘు చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఎంపీటీసీ బూసం రవీంద్రనాథ్ నిర్మించిన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేస్తూ ‘గద్దర్ అవా ర్డు’ను ప్రకటించింది. చిత్రసీమలో తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రవీంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించారు. కోటిన్నర మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందిన రామయ్య బయోగ్రఫీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. ఈనెల 19న ఉగాది పండుగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభు త్వం నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రొద్దుటూరు గడ్డకు గర్వకారణంగా నిలిచిన రవీంద్రనాథ్ను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. -
వెంకటాద్రికి నందలూరులో స్టాపింగ్!
రాజంపేట: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో చిత్తూరు–కాచిగూడ (12798–12797)మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రైల్వేబోర్డు అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంగళవారం రైల్వేబోర్డు అధికారులు తనకు తెలియజేశారని ఎంపీ మేడా రఘునాథ రెడ్డి వెల్లడించారు. వెంకటాద్రి సూపర్పాస్ట్ ఎక్స్ప్రెస్ నిలుపుదల విషయంపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విశేష కృషి చేశారు. రైల్వేబోర్డుకు రైల్వేస్టాడింగ్ కమిటీ కౌన్సిల్ సభ్యుడి హోదాలో మేడా రఘునాథరెడ్డి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ అంశంపై ఇటీవల రైల్వేబోర్డు అధికారులతో చర్చించారు. నందలూరు స్టేషన్ ప్రాధాన్యత .. ప్రయాణికుల అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని.. త్వరలో హాల్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారని మేడా ధృవీకరించారు. ఏడేళ్లకు వెంకటాద్రి హాల్టింగ్కు మోక్షం కోవిడ్–19 కంటే ముందు నందలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉండేది. లాక్డౌన్ తర్వాత అన్ని రైళ్లను రద్దీ చేసిన అధికారులు.. తిరిగి పునరుద్ధరించే క్రమంలో నందలూరులో హాల్టింగ్ను ఎత్తివేశారు. తాజా గా నందలూరులో నిలుపుదలకు రైల్వే బోర్డు అంగీకరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైమింగ్ ఇలా.. కాచిగూడ నుంచి బయలుదేరే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నందలూరు రైల్వేకేంద్రానికి ఉదయం 4.45 తెల్లవారుజామున చేరుకుంటుంది. తిరుపతికి ఉదయం 6,15, చిత్తూరుకు 8.15 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు రైల్వేస్టేషన్లో సాయంత్రం 4.30 గంటలు బయలుదేరి 8.15కు నందలూరు రైల్వేకేంద్రానికి చేరుకుంటుంది. కాచిగూడకు ఉదయం 6.గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు నిలుపదలకు కృషిచేసిన ఎంపీ రఘునాథరెడ్డిని ప్రయాణికులు, ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు. రైల్వే స్టాండింగ్కౌన్సిల్కు హాజరైన మేడా రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైనట్లు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రధానంగా భారతీయ రైల్వేరోలింగ్ స్టాక్ ఉన్నతీకరణ,ఆధునీకరణ అనే అంశంపై జరిగిన సమావేశానికి తాను హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందలూరులో వెంకటాద్రి హాల్టింగ్ అంశాన్ని ప్రస్తావించగా.., రైల్వేబోర్డు స్పందించిందన్నారు. రైల్వేబోర్డు నుంచి గ్రీన్సిగ్నల్! ఫలించిన రాజ్యసభ సభ్యుడు ‘మేడా’కృషి -
బాధితులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.కడప స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సుధాకర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 97 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి.అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఈ.బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు. -
‘బార్’ ఎన్నికల వేడి!
● నామినేషన్ల పర్వం ప్రారంభం ● ప్యానెళ్ల వారీగా బరిలోకి ప్లీడర్లు ● సీఈవోలు నామినేషన్ల స్వీకరిస్తున్న వైనంరాజంపేట : జిల్లా న్యాయవాద వర్గాల్లో ఆయా బార్ అసోసియేషన్ ఎన్నికలు రాజుకున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో.. జిల్లాలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (155), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. సభ్యుల సంఖ్య ఇటీవల పెరిగి ఉండవచ్చని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇలా.. నామినేషన్ల పర్వం సోమవారం మొదలైన నేపథ్యంలో రాజంపేట కోర్టు వరకు వస్తే ఈనెల 22 వరకు కొనసాగనుంది. 23న పరిశీలన నిర్వహించనున్నారు. 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 25న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 30న పోలింగ్ ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రకియ కొనసాగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలను ఆయా బార్ అసోసియేషన్ల కేటాయించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని రాజంపేట సీఈవో సురేష్ కుమార్ ధ్రువీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి బార్ అసోసియేషన్ జరుగుతాయని, బార్ కౌన్సిల్ నుంచి నియమనిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్ డిపాజిట్ ఇలా.. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ దాఖాలు చేయాలంటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వివిధ హోదాలకు ఒక్కో రకంగా డిపాజిట్ నిర్ణయించారు. ప్రెసిడెంట్కు రూ.3వేలు, వైస్ ప్రెసిడెంట్కు రూ.2,500, జనరల్ సెక్రటరీకి రూ.2వేలు, జాయింట్ సెక్రటరీ రూ.1,500, లైబ్రరీ సెక్రటరీకి రూ.1500, ట్రెజరీకి రూ.1500, స్పోర్ట్స్–కల్చరల్ సెక్రటరీకి రూ.1500, మహిళాప్రతినిధికి రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా బార్ అసోసియేషన్ల నిర్ణయం మేరకు డిపాజిట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈనెలాఖరులోపు బార్ అసోసియేషన్కు ఎన్నికలు జరగకుంటే,అందులోని సభ్యులకు రాష్ట్ర బార్కౌన్సిల్ నుంచి వచ్చే లబ్ధి దూరమవుతుందని సీనియర్ న్యాయ వాది కొండూరు శరత్కుమార్ రాజు తెలిపారు. జిల్లాలోని వివిధ కోర్టులో పరిధిలోని సీనియర్ న్యాయవాదులు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్యానెల్ను సిద్ధం చేసుకుంటున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వివిధ రాజకీయపార్టీ మద్దతుదారులు కూడా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. -
హత్యకేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు
సిద్దవటం : సిద్దవటం మండలంలోని కపర్దీశ్వర స్వామి కోన వద్ద సెప్టెంబర్1, 2014వ తేదీన జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు, ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి జి.దీనబాబు సోమవారం తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ హారిక తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎ1 పంగా అరుణ వివాహేతర సంబంధం కారణంగా అడ్డుగా ఉన్న భర్త కనపర్తి సిద్దారెడ్డిని చంపాలనే ఉద్దేశంతో మిగిలిన ముగ్గురు ఎ2 షేక్ హుస్సేన్బాషా, ఎ3 మారబోయిన బాలకృష్ణ అలియాస్ సురేంద్ర, ఎ4 నస్రుద్దీన్ గౌస్పీర్లతో కలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం భర్తను చంపి అతని దగ్గర ఉన్న బంగారు నగలను తీసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని దొంగలు తన భర్తను చంపి బంగారు నగలను దోచుకున్నారని కట్టు కథ అల్లేందుకు ప్రయత్నించిందన్నారు. ఈ కేసులో ఎ1 పంగా అరుణ గతంలో వివాహమై విడాకులు తీసుకున్నట్లు, ఎ2 హుస్సేన్బాషాను ప్రేమించిందన్నారు. అతనితో వివాహం చేసేందుకు తన తల్లి అంగీకరించలేదు. బద్వేల్కు చెందిన (వికలాంగుడైన) కనపర్తి సిద్దారెడ్డితో వివాహం జరిపించింది. అందుకు ఎ1 పంగా అరుణ తన భర్తను చంపి, బంగారు నగలను తీసుకుని మనం ఎక్కడికై నా వెళ్లి బతుకుదామని ఎ2 హుస్సేన్బాషాకు చెప్పింది. అందుకు ఎ2 హుస్సేన్బాషా తన స్నేహితులైన మారబోయిన బాలకృష్ణ, గౌస్పీర్లతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముగ్గురు సిద్దవటం మండల కపర్తీశ్వరస్వామి కోన వద్ద వేచి ఉన్నారు. ఎ1 పంగా అరుణ తన భర్తని మోసగించి అక్కడికి తీసుకురాగా నిందితుల అందరూ కలిసి అతని దగ్గర ఉన్న బంగారు నగలను దోచుకొని రాళ్లతో కొట్టి మృతుడి బెల్టు తీసి మెడకు బిగించి, అక్కడ పడవేసి వెళ్లిపోయారని ఎస్ఐ తెలిపారు. ఎ1 పంగా అరుణ తన అమ్మ, మేనమామల సహాయంతో అత్తవారింటికి వెళ్లి తన భర్తను ఎవరో గుర్తు తెలియని దొంగలు చంపి బంగారం నగలను దోచుకొని వెళ్లినట్లు చెప్పిందన్నారు. వారు అనుమానంతో దబాయించగా తన భర్తను కొట్టి పడేసిన చోటుకు తీసుకెళ్లగా కొన ఊపిరితో ఉన్న మృతుడు కనపర్తి సిద్దారెడ్డిని కడప రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నె విజయ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత మృతిచెందినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. మృతుడి తండ్రి కనపర్తి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ అధికారి అప్పటి ఒంటిమిట్ట సీఐ టి.రెడ్డప్ప విచారణ చేసి, రెండు రోజుల్లో కేసును ఛేదించి సెప్టెంబర్3, 2014 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు నగలను సీజ్ చేసి జ్యుడీషియల్రిమాండ్కు తరలించారన్నారు. కేసును విచారించి కోర్టులో చార్జిషీటు ఫైల్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసును ఎస్సీ, ఎస్టీ, 4 ఏడీజే కడప కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి సాక్షులను విచారించి నిందితులు ఎ1, ఎ2, ఎ3, ఎ4 నేరం చేసినట్ల నిరూపణ కావడంతో న్యాయమూర్తి జి.దీనబాబు వీరికి జీవితఖైదు, ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ ఎల్.బాలాజీని అప్పటి ఒంటిమిట్ట సీఐ టి.రెడ్డప్పను, ప్రస్తుత రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ప్రస్తుత ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్ఐ హారిక, కోర్టు కానిస్టేబుల్ సి.మల్లిఖార్జునరావును కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘రైతన్నా మీకోసం‘ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : రెవెన్యూ సమస్యల పరిష్కార ప్రాధాన్యతతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం‘కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జేసీ డాక్టర్ నిధి మీనా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జేసీ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో జేసీ మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత, పరిష్కారానికి పీజీఆర్ఎస్ సేవలతో పాటు ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ప్రత్యేక కౌంటర్ల ద్వారా వచ్చిన అర్జీలను రెవెన్యూ అధికారులు స్వీకరించి సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ నెల 16 వ తేదీ నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం‘వారోత్సవాలను జిల్లాలో ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమా ర్, ఎంప్లాయిమెంట్ అధికారి సురేష్ కుమార్, గ్రౌండ్ వాటర్ డిడి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.జేసీ డాక్టర్ నిధి మీనా -
కేఎంసీ అద్దెగదిలోకి అక్రమ ప్రవేశం
● అద్దె చెల్లించలేదని 13 ఏళ్లక్రితమే షాపురూమును సీజ్ చేసిన కార్పొరేషన్ ● అధికార పార్టీ అండతో అక్రమంగా ప్రవేశించిన అఫ్సర్ ● కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో తీవ్ర వాగ్వివాదం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎంసీ అధికారులుకడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులో బాలాజీ కాంప్లెక్స్ పక్కన యునాని కాంప్లెక్స్లో 13 సంవత్సరాల క్రితం కడప మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) వారు సీజ్ చేసి తాళం వేసిన అద్దె గదిలోకి అఫ్సర్బాష అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో అతను తాళం పగులగొట్టి షాపురూములోకి ప్రవేశించి మరమ్మతు పనులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోనే అతను అంత ధైర్యంగా తాళం పగులగొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యునాని కాంప్లెక్స్లో ఉన్న ఈ షాపు రూముకు అద్దె సుమారు రూ.40లక్షలు చెల్లించనందు వల్ల అనేక డిమాండ్ నోటీసులు, ఫైనల్ నోటీసులు ఇచ్చిన తర్వాత 13 ఏళ్లక్రితం అనగా 2013లో నగరపాలక అధికారులు ఈ షాపును సీజ్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత దీన్ని తెరవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 17వ తేదికి నగరపాలక వర్గం గడువు కూడా ముగిసిపోనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల భరోసాతో పక్కా ప్రణాళికతోనే గది తాళం పగులగొట్టినట్లు తెలుస్తోంది. అతను ఇదివరకే కార్పొరేషన్కు చెందిన మరో గదిని కూడా అక్రమించుకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న 31వ డివిజన్ కార్పొరేటర్ అజ్మతుల్లా మేయర్ పాకా సురేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే రెవెన్యూ అఽధికారులను అప్రమత్తం చేసి, కార్పొరేషన్ ఆస్థిని కాపాడాలని ఆదేశించినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన నగరపాలక అధికారులు, టాస్క్ఫోర్స్ సిబ్బందితో అఫ్సర్ బాష తీవ్ర వాగ్వివాదం చేసినట్లు తెలిసింది. దీంతో అఫ్సర్ బాషపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నగరపాలక కమిషనర్ రాకేష్ చంద్ర వన్టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..
పులివెందుల టౌన్ : ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థిని పరీక్ష రాసిన ఘటన సోమవారం పులివెందులలో చోటుచేసుకుంది. వివరాలు.. పులివెదుల పట్టణంలోని స్థానిక బయమ్మ తోటలో నివాసం ఉంటున్న దండు శివయ్య గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆదివారం రాత్రి శివయ్య మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. శివయ్యకు భార్య భాగ్యమ్మతోపాటు కుమార్తె దండు ధరణి, కుమారుడు ధనుష్లు ఉన్నారు. ప్రస్తుతం ధరణి పదోతరగతి చదువుతోంది. తెల్లవారితే పది పబ్లిక్ పరీక్ష.. తండ్రి చనిపోయిన బాధ ఒకవైపు.. పరీక్షలు రాయాలనే తలంపు మరో వైపు. దిక్కుతోచని పరిస్థితిలో ధరణి బాధాతప్త హృదయంతో దుఃఖాన్ని దిగమింగుకుని పులివెందుల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. పాము కాటుతో రైతు మృతివేంపల్లె : వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లెలో పాము కాటుతో రైతు పి.మహేందర్ (35) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వివరాలు.. మండలంలోని బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన మహేందర్ తన నిమ్మ తోటలోకి ఈ నెల 11వ తేదీ వెళ్లారు. పాము కాటుకు గురి కావడంతో నాటు వైద్యంతోపాటు పుట్టపర్తిలోని సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బంధువులు చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మహేందర్ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పుష్పవతి, ఇద్దరు కుమారులు శశాంక్, సాత్విక్ లు ఉన్నారు. మృతుని తమ్ముడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులపై కేసు నమోదుకొండాపురం : అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త, మామ వేధింపులకు గురి చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు మండలంలోని దొబ్బుడుపల్లెగ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసులతో నంద్యాల జిల్లాలోని సంజాల మండలం రెడ్డిపల్లె కు చెందిన నాగలక్ష్మికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది.అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతుండటంతో గతంలో ఇతన్ని బంధువులు మందలించారు. తన కూతురును ఎందుకు వేధిస్తున్నారని నాలక్ష్మి తల్లి శివమ్మ అడగ్గా తండ్రి, తల్లితో కలిసి అల్లుడు కొట్టడంతో ఆమె తలకు తీవ్రగామైంది.నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. సోమవారం పొట్టిశ్రీరాములు 125వ జయంతి సందర్భంగా గోకుల్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి మేయర్ పాకా సురేష్ కుమార్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతి, ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగువారు మర్చిపోలేరన్నారు. పొట్టిశ్రీరాములు సేవలకు గుర్తుగా దివంగత వైఎస్సార్ హయాంలో గోకుల్ సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక తమ పాలకవర్గంలోనే పొట్టి శ్రీరాములు సర్కిల్ను ఆధునికీకరించి, నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివ ప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, నార్త్ జోన్ అధ్యక్షులు ఇలియాస్, కార్పొరేటర్లు అజ్మతుల్లా, బాలస్వామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సీహెచ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితా
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీ ప్రొద్దుటూరు పరిధిలో పనిచేస్తున్న సెంకడరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా, పాఠశాల సహాయకులు, తత్సమాన కేటగిరీల నుంచి ప్రధానోపాధ్యాయుగా పదో న్నతి కోసం సీనియారిటి జాబి తాను సబ్జెక్టుల వారీగా డీఈఓ వెబ్సైట్ www.kadapa deo.inలో పొందుపరిచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యా లయంలో సమర్పించాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)–2026 నకు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. డిగ్రీ ఇప్పటికే పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే వారు ఈ వెబ్సైట్ https://cets. apsche.ap.gov.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వైవీయూలో 29 కోర్సులు ఉన్నాయని ఆయా అర్హతలను బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్ పి లక్ష్మిప్రసాద్ సెల్ నెంబర్ (8317532040)ను, డాక్టర్ సరిత (81066 04789)లను సంప్రదించాలని సూచించారు. కడప సెవెన్రోడ్స్: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 35 మండలాలకు 510 ట్రై సైకిళ్లను మంగళవారం నుంచి పంపిణీ చేస్తున్నామని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓలకు మండల ప్రధాన కేంద్రాల్లో నేరుగా ట్రై సైకిళ్లను అందజేస్తామన్నారు. అట్లూరుకు 11, బి.కోడూరు 10, బి.మఠం 10, బద్వేలు 10, చక్రాయపేట 16, చాపాడు 21, చెన్నూరు 9, సీకే దిన్నె11, దువ్వూరు 21, గోపవరం 7, జమ్మలమడుగు 13, కలసపాడు 13, కమలాపురం 14, ఖాజీపేట 20, కొండాపురం 23, లింగాల 19, ముద్దనూరు 17, మైదుకూరు 11, మైలవరం 17, పెద్దముడియం 20, పెండ్లిమర్రి 18, పోరు మామిళ్ల 14, ప్రొద్దుటూరు 10, పులివెందుల 6, రాజుపాలెం 10, కాశినాయన 17, సిద్దవటం 17, సింహాద్రిపురం 20, తొండూరు 14, వల్లూరు 15, వీఎన్ పల్లె 22, వేంపల్లె 15, వేముల 16, ఒంటిమిట్ట 12, ఎరగుంట్ల మండలంలో 11 ట్రైసైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వివరించారు. హుండీ ఆదాయం లెక్కింపు బ్రహ్మంగారిమఠం: బి.మఠంలో ఉన్న శ్రీమాతా ఈశ్వరీదేవి మఠంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ 5,09,041 నగదు వచ్చిందని మఠం ఈఓ బివీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అలాగే తలనీలా కోసం వేలం వేయగా రూ 71వేలు ఆదాయం వచ్చిందని చెప్పారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్జారీ చేశారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.విజయ్కుమార్నుప్రొద్దుటూరుకు బదిలీ చేశా రు.బద్వేలు తహసీల్దార్ డి.ఉదయభాస్కర్రాజు ను పోరుమామిళ్లకు, బి.కోడూరు తహసీల్దార్ యు.దస్తగిరయ్యను రాజంపేటకు, కాశినాయన తహసీల్దార్ వి.వెంకట సుబ్బయ్యను పులివెందు ల ఆర్డీఓ కార్యాలయ ఏఓగా నియమించారు. చె న్నూరు తహసీల్దార్ టి.సరస్వతిని కలెక్టరేట్లోని ల్యాండ్ రీఫామ్స్ విభాగ స్పెషల్ తహసీల్దార్గా నియమించారు. పులివెందుల ఆర్డీఓ కార్యాలయ ఏఓ జి.రవీంద్రారెడ్డిని కలసపాడు తహసీల్దార్గా నియమించారు. సింహాద్రిపురం తహసీల్దార్ కె.వెంకట సాయినాథరెడ్డిని జమ్మలమడుగు, వేంపల్లె తహసీల్దార్ వై.హరినాథరెడ్డిని రాజుపాలెం, జమ్మలమడుగు తహసీల్దార్ పి.శ్రీనివాసరెడ్డిని కమలాపురానికి, ఎర్రగుంట్ల తహసీల్దార్ కె.శోభన్బాబును పెండ్లిమర్రికి బదిలీ చేశారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్యను కలెక్టరేట్ పరిపాలన అధికారిగా నియమించారు. రాజంపేట తహసీల్దార్ ఎస్.పీర్ మున్నిని బద్వేలు తహసీల్దార్గా, నందలూరు తహసీల్దార్ జి.అమరేశ్వరిని ఎర్రగుంట్లకు, సుండుపల్లె తహసీల్దార్ ఎస్.మహబూబ్చాంద్ను కడపకు బదిలీ చేశారు. వీరు కాకుండా మైలవరం తహసీల్దార్ ఎం.లక్ష్మినారాయణ, కలసపాడు తహసీల్దార్ జీవీ మధురవాణిని బదిలీ చేస్తూ కలెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చేసే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ సీవీఎస్వో మురళికృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రధాన ద్వారానికి ఉండే రిబ్బన్ కటింగు చేయడంతో పాటు సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అందించాలని ఉద్దేశంతో అన్ని వసతులు ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు. దీనికి ముందు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని మూలవిరాట్ ని ఆయన దర్శించుకున్నారు. -
అమరజీవి త్యాగం స్ఫూర్తిదాయకం
కడప సెవెన్రోడ్స్: ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితం ప్రతి తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్లో పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ డీఆర్వో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వరుసగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, చివరికి జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మన తెలుగువారని చెప్పుకోవడం గర్వకారణం అన్నారు. కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు -
రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలి
కడప అర్బన్: రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్– డివిజన్ నేర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా , శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. భూ వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల వల్ల క్రిమినల్ కేసులు నమోదైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని, దాడులు ఉధృతం చేయాలని ఆదేశించారు.సమావేశంలో కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
తొలి రోజు పరీక్షలు ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పిల్లలకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షా కేంద్రాలలోకి పంపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అములులో పెట్టారు. దీంతోపాటు పరీక్ష విధులకు హాజరైన చీఫ్ సూపరెండెంటెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, పరీక్షల ఇన్విజిలేటర్స్తోపాటు సిబ్బంది ఎవరికి కూడా సెల్ఫోన్ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 161 కేంద్రాలలో... జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 167 పరీక్షా కేంద్రాలలో 27,766 మంది విద్యార్థులకుగాను 27,600 మంది హాజరుకాగా 166 మంది గైర్హాజరయ్యారు. పది పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 బృందాలు ప్లైయింగ్ స్క్వాడ్ జిల్లాలోని 42 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. మరో 47 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ను ఏర్పాటు చేశారు. ఓపెన్ స్కూల్కు సంబంధించి... జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 31 పరీక్షా కేంద్రాలలో 2333 మంది అభ్యాసకులకుగాను 1944 మంది హాజరుకాగా 389 మంది గైర్హాజరయారు. పది ఓపెన్ పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 6 బృందాలు ప్లైయింగ్ స్క్వాడ్ 31 పరీక్షా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అబ్జర్వర్ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రాష్ట్ర డైరెక్టర్ మధుసూధన్రావు జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాలను తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాలలోని చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి ఆరోఫణలకు తావులేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా....డీఈఓ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్, సెంట్రల్ జెయిల్ ఉర్దూ పాఠశాల, జయనగర్ బాలికల హైస్కూల్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కడప గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 167 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పది పరీక్షలను రాస్తున్నారన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమై అన్ని రకాల మౌలిక వసతులను కల్పించామన్నారు. ఎక్కడ కూడా పిల్లలకు నేలబారు పరీక్షలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్దం చేశామన్నారు. ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీటి సౌకర్యంతోపాటు ఓఆర్ఎస్, మెడికల్ కిట్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా మాల్ప్రాక్టీస్ జరిగినట్లు తమ దృష్టికి వస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పలు పరీక్షా కేంద్రాలను.... జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాలను పది పరీక్షల జిల్లా అబ్జర్వర్ మధుసూధన్రావు పరిశీలించగా డీఈఓ షంషుద్దీన్ కడపలోని మూడు పరీక్షా కేంద్రాలను, 7 ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 42 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కడపలోని గాంధీనగర్ స్కూల్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షకు హాజరైన విద్యార్థులు 27,766 మందికిగాను 27,600 మంది హాజరు జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్, డీఈఓలు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద144 సెక్షన్ అమలు -
‘104’ వాహనాల వేలం పాట
కడప రూరల్: నిరుపయోగంగా ఉన్న 104 సంచార వాహనాల వేలం పాటను నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సోమవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలోని చాంబర్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పరిమితి దాటి నిరుపయోగంగా ఉన్న 104 సంచార వాహనాలను ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వేలం వేయుటకు కమిటీ తీర్మానం చేసిందన్నారు. మొత్తం 17 వాహనాలను నిబంధనల మేరకు వేలం వేస్తామన్నారు. అనుమతి పొందిన వేలం పాటదారులు కొనుగోలు.ఏపీ.జీఓ.ఇన్ లో కనీస రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఏఓ విజయ భాస్కర్, డాక్టర్.ప్రవీణ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఖాన్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ధీలేశ్వరరావు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో షబ్ ఏ ఖద్ర్ ప్రార్థనలు
విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్ ఏ నకాష్ కడప సెవెన్రోడ్స్: మసీదులన్నీ విద్యుద్దీప కాంతులతో ధగధగలాడాయి.. ఆ ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక చింతనతో వెలిగిపోయాయి. పవిత్ర ఖురాన్లోని దైవ సందేశం గురించి వివరిస్తున్న గురువుల బోధనలతో భక్తిభావనను నింపాయి.. షబ్బే ఖద్ర్ (బడీరాత్) ప్రత్యేక ప్రార్థనలతో ఆయా ప్రాంతాలు కొత్త కళను సంతరించుకున్నాయి. రంజాన్ మాసంలోని పవిత్ర షబ్ ఏ ఖద్ర్ రాత్రి సోమవారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బడీరాత్ నిర్వహణ కోసం రెండు, మూడు రోజుల ముందునుంచి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని మసీదుల్లో రాత్రి తరావీ ప్రార్థనల అనంతరం ముఖ్యఘట్టం ప్రారంభమైంది. ఈరోజున ఆధ్యాత్మిక సందేశం ఇచ్చేందుకు ఆహ్వానించిన దేశంలోని ప్రముఖ గురువులు బోధనలను ప్రారంభించారు. పవిత్ర ఖురాన్లోని పలు ముఖ్యమైన ఘట్టాలను వారు ఈ సందర్భంగా వివరించారు. మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) జీవితంలోని ముఖ్యమైన అంశాలు, ఆయన బోధనలను గురించి కూడా తెలియజేశారు. భక్తుల సామూహిక ప్రార్థనలు (జికర్) నిర్వహించారు. రాత్రంతా మసీదు ప్రాంగణాలలో భక్తులు పూర్తి ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. దాదాపు తెల్లవారు జామున సెహరి వరకు ఈ బోధనలు కొనసాగాయి. వెల్లివిరిసిన భక్తిభావం రాత్రంతా ప్రార్థనలు భక్తులతో కళకళలాడిన మసీదులు -
హోటళ్లు మూతపడే అవకాశం
నార్త్ ఇండియన్ ఫుడ్, టిఫెన్ ఐటమ్స్ తయారీ ఇక చేయలేం. స్థలం తక్కువగా ఉండే కిచెన్లో ఎక్కువ పొయ్యిలు ఉపయోగించలేం. ఐటమ్స్ తగ్గడం వల్ల పనివాళ్ల సంఖ్యను సైతం మేము తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందువల్ల పలువురి ఉపాధి దెబ్బతింటుంది. టర్నోవర్ తగ్గడం వల్ల నష్టాలు వచ్చి ఒక దశలో హోటళ్లు మూతపడే అవకాశం లేకపోలేదు.వంట గ్యాస్ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు టూరిజంపైన ఉంటుంది. – టంగుటూరి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ, ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, కడప వంట గ్యాస్ కమర్షియల్కు వినియోగిస్తే చర్యలు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో వంట గ్యాస్ను జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరైనా గృహావసరాలకు కేటాయించిన గ్యాస్ను కమర్షియల్కు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. డైవర్షన్కు పాల్పడే రీ ఫిల్లింగ్ సెంటర్లు, ఏజెన్సీలపై చర్యలు తప్పవు. సింగిల్ సిలిండర్ కలిగిన వినియో గదారులు 25 రోజులకు, డబల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 30 రోజులకు ఒకసారి ఇకపై బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్రెస్డ్ నేచ్యురల్ గ్యాస్ (సీఎన్జీ) వినియోగించే వాహనాలకు ప్రస్తుతానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. –రఘురాం, జిల్లా పౌరసరఫరాల అధికారి, కడప -
శుభాల రేయి షబ్–ఏ–ఖద్ర్
కడప సెవెన్రోడ్స్: ముస్లింలకు శుభప్రదమైన, పుణ్యప్రదమైన రాత్రి షబేఖదర్ రానే వచ్చింది. దీనిని లైలతుల్ఖదర్ అని కూడా పిలుస్తారు. షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే ఉన్నతమైన అని అర్థం. రంజాన్ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్ ఏ ఖద్ర్ రోజునే పవిత్ర దివ్యఖురాన్ అవతరించిందని ముస్లింల నమ్మకం. సోమవారం ముస్లింలు లైలతుల్–ఖదర్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రేయంతా ఇషా నమాజ్ నుంచి తెల్లవారుజామున సెహరి వేళ వరకు ముస్లింలు అధ్యాత్మికంగా గడుపుతారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుజ్, తజ్బీ, తహజ్జుద్ నమాజ్, దువా ఇలా రేయంతా అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు. తోబా,ఆస్తగ్ పిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుతారు. ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రంతా జాగరణ చేసి, అధ్యాత్మికంగా గడిపిన వ్యక్తికి వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం. ● నేడు బడీరాత్ పర్వదినం ● విద్యుత్దీపాల అలంకరణలో మసీదులు ప్రత్యేక ప్రార్థనలతో అధిక ఫలితం షబే ఖదర్ రోజున జాగర ణ చేసి, అధ్యాత్మికంగా గడపాలి. నమాజ్, తరావీహ్, నఫిల్ నమాజ్, తహజ్జూద్ వంటి ప్రత్యేక ప్రార్థనలతో అధికంగా ఫలితం లభిస్తుంది. ఈ రేయంతా అల్లాహ్ స్మరణలో గడిపితే వెయ్యి నెలల పుణ్యం లభిస్తుంది.రవీంద్రనగర్లోని మస్జిద్ ఏ బుఖారియాలో షబ్ ఏ ఖద్ర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. – సయ్యద్ సిరాజుద్దీన్ బుఖారి, ఇమాం, మస్జిద్ ఏ బుఖారియామసీదులు విద్యుద్దీపాలంకరణతో శోభిల్లుతు న్నాయి. షబ్బే ఖద్ర్ సందర్బంగా మత గురువులు, ఆధ్యాత్మికవేత్తలు భక్తులనుద్దేశించి పవిత్ర మాసం విశిష్ఠతలను తెలియజేయనున్నారు. ఇప్పటికే తాఖ్ రాత్లను నిర్వహిస్తున్న మసీదుల్లో తెల్లవారుజామున సెహరీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మసీదు కమిటీ ప్రతినిధులు విశేష ఏర్పాట్లు చేశారు. -
డిగ్రీ విద్యార్థి అదృశ్యం
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక బలిజ సంఘం వీధికి చెందిన నామా వెంకట పూజిత్ అనే డిగ్రీ విద్యార్థి అదృశ్యమైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనువాసులు, హేమలత తెలిపారు. వెంకట పూజిత్ కడప నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం వేంపల్లె నుంచి కళాశాలకు వెళుతున్నానని ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన విద్యార్థి ఆదివారం కూడా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులకు చెందిన వాట్సాప్లో తాను ఇంటికి రాను, ఇంట్లో వాళ్లు చెబుతున్న పనులు చేయలేనని మెసేజ్ పంపినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య ముద్దనూరు : మండల కేంద్రంలోని యానాదికాలనీకి చెందిన సుశీల(34) అనే వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఏఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సమాచారం మేరకు వివరాలు..సుశీల తన భర్త నితిన్తో కలిసి డీఎన్పల్లె సమీపంలోని ఓ తోటలో కాపలాకూలీలుగా పనిచేస్తున్నారు.గత కొంత కాలంనుంచి కడపలో ఉన్న సుశీల తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ఆమె సోదరితో సమస్య నెలకొంది.ఈనేపథ్యంలో శనివారం రాత్రి సుశీల ఆమె భర్తతో కలసి తోట వద్ద తన తండ్రి ఆస్తివిషయంపై చర్చించి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. నియామకంకడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతాపార్టీకి బత్తల పవన్ కుమార్ అందించిన సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కడప జిల్లా చైర్మన్గా నియమించింది. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలియజేశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిసిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామం ఎంపీపీ స్కూల్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హారిక మాట్లాడుతూ భాకరాపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా అతన్ని గుర్తుపడితే 9121100581, 9121100584 నంబర్లకు సమాచారం తెలపాలని ఎస్ఐ తెలియజేశారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాల మేరకు రాయవరం సెక్షన్ రాయవరం క్రాస్ దగ్గర అటవీ శాఖ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక ఇన్నోవా వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. అటవీ శాఖ సిబ్బంది దానిని వెంబడించి గుండ్లపల్లి సమీపంలోని గొల్లపల్లి చెరువు దగ్గర డ్రైవర్ కారును వెనుకకు మల్లించే క్రమంలో కారు బోల్తాపడింది డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. అందులో 612 కేజీలు బరువున్న 21 ఎర్రచందనం దుంగలు, కారును అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. అలాగే జిల్లెళ్ల మంద బీట్ సమీపంలోని పోర కనుమ ప్రదేశంలో 254 కేజీల బరువున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాటి విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. -
పరీక్షలకు సర్వం సిద్ధం..
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి లేదు. అన్ని పరీక్షా కేంద్రాలలో కూడా డెస్కులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఏలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వచ్చి పరీక్షలను రాయాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్జిల్లా పది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, ఫర్నీచర్తోపాటు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి 8.45 గంటల నుంచే అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలేవైనా ఉంటే తెలిపేందుకు వీలుగా ఈనెల 16 నుంచి కడప డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 91218 46205 నెంబర్ సిద్ధం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విధి నిర్వహణలోని ఉపాధ్యాయులు కంట్రోల్ రూమ్ సేవలను ఉపయోగించుకుని సలహాలు, ఫిర్యాదులు తెలపవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు. జిల్లాలో 9 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు... జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇందులో బి.మఠం మండలం కందిమల్లాయపల్లె జెడ్పీ హైస్కూల్, జెడ్పీ బాలికల హైస్కూల్, కమలాపురం జెడ్పీ బాలికల హైస్కూ ల్, జెడ్పీ బాలుర హైస్కూల్, సిద్దవటం ఎగువపేట జెడ్పీ హైస్కూల్, వల్లూరు జెడ్పీ హైస్కూల్, వేంపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్, జెడ్పీ బాలికల హైస్కూల్, మైదుకూరు జెడ్పీ ఉర్దూ హైస్కూల్స్ను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. విద్యార్థులు హాల్టికెట్ చూపించి బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ టెన్త్ పరీక్షలకు 2424 మంది.. సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ పది పరీక్షలు) పరీక్షలకు జిల్లాలో 2424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. మాస్కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా రాసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయించాం. విద్యార్థులంతా 8.45 గంటల నుంచే పరీక్షా కేంద్రాలలోని అనుమతించాలని చెప్పాం. పొరపాటున ఏ పరీక్షా కేంద్రంలోనైనా ఆరోపణలు వచ్చినా చర్యలు ఉంటాయి. పరీక్ష విధులకు కేటాయించిన సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహించాలి. ఎక్కడ కూడా మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. – కాగిత శ్యాముల్, ఆర్జేడీ, పాఠశాల విద్య ప్రశాంతంగా వెళ్లాలి.. విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఈ పబ్లిక్ పరీక్షలను సైతం గతంలో రాసిన మోడల్ పరీక్షలే అనుకున్నట్లయితే మరింత ఆత్మవిశ్వాసంతో రాయగలరు. మనసులో ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష ప్రశాంతంగా ప్రారంభించాలి. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరడం ఉత్తమం. పరీక్షకు వచ్చే ముందు ఖచ్చితంగా ఏదో ఒకటి తిని రావాలి. – ఓ. వెంకటేశ్వరెడ్డి, ప్రముఖ సైకాలజిస్టు -
ప్రాణం తీసిన బైక్ పొగ
● పుంగనూరులో విషాదం ● ఒకే కుటుంబంలో నలుగురు మృతి ● నిద్రలోనుంచి..మృత్యుఒడికి ● ప్రాణాలతో బయటపడ్డ బిందుకుటుంబ పెద్ద అమాయకత్వం ఆ ఇంటిలోని నలుగురి పాలిట శాపంగా పరిణమించింది. కుటుంబ పనుల కోసం సౌకర్యంగా ఉంటుందని కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం కన్న తండ్రి, కడుపున పుట్టిన బిడ్డలపాలిట మృత్యు శకటంగా మారింది. టూ వీలర్ నుంచి వెలువడిన విషవాయువులతో ఆదమర్చి గాఢ నిద్రలో ఉన్న నలుగురు విగత జీవులుగా మారారు. ఈ విషాదకర ఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగింది. పుంగనూరు : పుంగనూరులో విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు.. వివరాలు.. పట్టణంలోని త్యాగరాజవీధిలో నాయీబ్రాహ్మణ కులానికి చెందిన మురళి, ఆయన భార్య రేవతి, మురళి తండ్రి రామచంద్ర (75) ఉంటున్నారు. మురళికి కార్తీక్(15), బిందు (14)తో పాటు కవలపిల్లలు చందన(7), చరిత(7) ఉన్నారు. కార్తీక్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చరిత, చందనలు ప్రైవేట్స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నారు. ఇలా ఉండగా మురళికి చెందిన ద్విచక్రవాహనం బోరుకు రావడంతో మెకానిక్ వద్దకు వెళ్లి శనివారం బాగు చేయించాడు. బైక్ను తీసుకొచ్చి రాత్రి మెకానిక్ సూచనల మేరకు స్టార్టింగ్లోనే ఇంటిలోని హాల్లో పెట్టాడు. మురళి దంపతులు మిద్దైపెన గల గదిలో పడుకున్నారు. తాత రామచంద్ర, మనవడు కార్తీక్ ,కవలపిల్లలు చరిత, చందనలు తాతతో కలసి నిద్రకు ఉపక్రమించారు. కాగా మరో మనవరాలు బిందు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆ పాప ఇంటిలో లేదు. ఇంట్లో కిటికీలు లేకపోవడంతో బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ ఇంట్లో చుట్టుకుంది. తాత, మనవడు, మనవరాళ్లు ఆ విషవాయులను పీల్చడంతో రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మిద్దైపె నుంచి కిందకు వచ్చిన మురళి, ఆయన భార్య నలుగురు చనిపోయిన విషయాన్ని గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో మురళి ఇంటికి వచ్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రాణాలతో బయటపడిన బిందు.. విషవాయువులు పీల్చి మృతి చెందిన కుటుంబంలో ఉన్న బిందు ప్రాణాలతో బయటపడింది. శనివారం తమ బంధువుల ఇంటికి వెళ్లింది. లేకపోతే విషవాయువులకు బిందు కూడా బలయ్యేది. ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిదున్రెడ్డిలు సంతాపం తెలిపారు. తక్షణమే మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాను సంఘటన స్థలానికి పంపారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు. -
లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో జిల్లాకు ప్రథమ స్థానం
కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఈనెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,03,591 కేసులు పరిష్కారం చేసి లబ్ధిదారులకు రూ.24,01,72,158 కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా 103343 క్రిమినల్ కేసులు, 248 సివిల్ కేసులు, 53 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలియజేశారు. కడపలో 11720 కేసులు, పొద్దుటూరు, మైదుకూరులో 15303, రాజంపేటలో7116, రాయచోటిలో 9635, బద్వేల్లో 8105, జమ్మలమడుగులో 9700, సిద్ధవటంలో 5070, రైల్వేకోడూరులో 6117, పులివెందులలో 8394, నందలూరులో 6055, లక్కిరెడ్డిపల్లిలో 10093, కమలాపురంలో 6283 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు అధికారులకు, కృతజ్ఞతలను తెలియజేశారు. కేసుల పరిష్కారంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ టీచర్స్ ఆసోసియేషన్ నూతన కార్యాలయం వేదిక కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడపలోని నాగరాజుపేట స్మిత్ రోడ్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ. రామచంద్రారెడ్డి, కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఐఆర్, నాలుగు డీఏలను పెడింగ్లో పెట్టారన్నారు. పీఆరీసీ నూతన కమిటీ చైర్మన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ఏపీ వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడి, ప్రధాన కార్యదర్శి కిరణ్, వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కడపలో వైఎస్సార్టీఏ కార్యాలయం ప్రారంభం -
నేడు సభాభవన్లో పీజీఆర్ఎస్
కడపసెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమ వారం సభాభవన్లో నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చున్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవ స్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. ● ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించు కోవాలని డీఆర్వో సూచించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ’డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూ రు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661 మొబైల్ నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. సర్కిల్ స్థాయిలోనూ ‘డయల్ యువర్ ఎస్ఈ’ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 08562 242457 నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలిలోని సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణా పోలీస్ అధికారి డా.తరుణ్జోషి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఏకాతాతయ్యను దర్శించుకున్నారు. అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామిని కూడా దర్శించుకున్నారు. అనంతరం హత్యరాలలో వెలసిన శ్రీ కామాక్షి త్రేతేశ్వరాలయంను దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామిని తెలంగాణ రాష్ట్రం అడిషనల్ ఐజీ డాక్టర్ తరుణ్జోషి ఆదివారం దర్శించుకున్నారు. కడప కార్పొరేషన్: వినియోగదారులు తమ హక్కులు, రక్షణ చట్టం–1986 గూర్చి తెలుసుకోవాలని ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ నేషనల్ చైర్మన్ డా. సాయి రమేష్ అన్నారు. ఆదివారం నగర శివార్లలోని నిర్మల ఫార్మసీ కాలేజీలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి రమేష్తో పాటు కన్స్యూమర్ ఫోరమ్ అడ్వకెట్ మల్లికార్జున, కడప నగరపాలక కమిషనర్ రాకేష్ చంద్ర, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఆశ, లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వినియోగదారునికి కొన్ని హక్కులుంటాయన్నారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు బిల్ కచ్చితంగా తీసుకోవాలని, నాణ్యమైన ఐఎస్ఐ, ఐఎస్ఓ మెట్రోలజీ సర్టిఫికెట్ కలిగిన, తయారు చేసే వాటిని మాత్రమే వినియోగించాలన్నారు. జిల్లాలో 80 శాతం సర్టిఫికెట్ లేకుండా నాణ్యమైన నీరు ఇవ్వకుండా కొన్ని వాటర్ప్లాంట్లు తక్కువ ఖర్చుతో ఎక్కుల లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు. కొన్ని రెస్టారెంట్లలో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్లు వాడుతున్నారన్నారు. ఫార్మసీ యాక్టు ప్రకారం ప్రతి మెడికల్ షాపులో ఒక పార్మసిస్ట్ ఉండాలని, కానీ అలా ఉండటం లేదన్నారు. దీనివలన వినియోగదారుడు చాలా నష్టపోతున్నాడని, ఎవరైనా వస్తువులు కొని నష్టపోతే వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చని తెలిపారు. -
కారు, బైక్ ఢీ: యువకుడి దుర్మరణం
వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన పెద్దగాండ్ల బాలాజీ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సొంత పని మీద వల్లూరుకు వచ్చిన బాలాజీ ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుకుంటుండగా కడప నుంచి కమలాపురం వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు, స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 262 కేసులు నమోదు చేసి, రూ.53,145 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్లు ఢీ: ఒకరు మృతిపుంగనూరు : మండలంలోని భీమగానిపల్లె సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలిలో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పట్రపల్లెకి చెందిన సుబ్బిరెడ్డి(65) పుంగనూరుకు సొంత పనులపై బైక్లో వస్తుండగా, పుంగనూరు నుంచి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఎన్ఎస్.పేటకు చెందిన నజీర్(35 ) నదీమ్ (30) భీమగానిపల్లె సర్కిల్ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుబ్బిరెడ్డి అక్కడేక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేసీ్త్ర అదృశ్యంపై కేసు నమోదుమదనపల్లెటౌన్ : మదనపల్లెలో మేసీ్త్ర అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న మారెప్ప కుమారుడు ఎస్.సోమశేఖర్ (34), మేసీ్త్ర పనులు చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుండి పనుల నిమిత్తం వెళ్లిన సోమశేఖర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించారు.ఆచూకీ లభించక పోవడంతో చేసేది లేక సోమశేఖర్ భార్య సోను టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య లక్కిరెడ్డిపల్లి : జీవితంపై విరక్తి చెంది వంటేరు ప్రసాదు (26) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గోల్గొండ శోభ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరురాజుగారిపల్లికి చెందిన వంటేరు వ్రసాద్ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పట్లో మృతుడిపై కేసు నమోదైంది. ఈ కేసుపై కొన్ని రోజులుగా కోర్టుకు వాయిదాలు తిరుగుతున్నాడు. గురువారం లక్కిరెడ్డిపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి పందేళపల్లి సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో విషద్రావణం తాగి శుక్రవారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం పశువుల కాపరులు ఆ మార్గంలో వెళ్తుండగా వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
నేటినుంచి అందుబాటులోకి అన్నప్రసాద వితరణ కేంద్రం
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట కోదండరామాలయంలో సోమవారం నుంచి ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. తూర్పు గాలిగోపురం ఎదురుగా మండపం సమీపంలో దాతల సహకారం, తిరుమల తిరుపతి దేవస్ధానం నిధులతో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉచిత అన్న ప్రసాదవితరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక బంతికి 200 మంది కూర్చొని భుజించేలా ఏర్పాటుచేస్తున్నామని తిరుమ తిరుపతి దేవస్ధానం డిప్యూటీ ఇంజినీరు (సివిల్) మాదాసి నాగరాజు తెలియజేశారు. పనులను ఇన్చార్జి డిప్యూటీ ఈవో శివప్రసాద్, టీటీడీ సివిల్ డీఈ నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతులు పర్యవేక్షించారు. కాగా బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా అన్నప్రసాదవితరణ కేంద్రాన్ని తీసుకొస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. . తొక్కిసలాట, తోపులాటకు తావులేకుండా ప్రశాంతంగా అన్నప్రసాదాలను భక్తులు స్వీకరించేలా సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ డీఈ మాదాసి నాగరాజు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మూడు పూటల అన్నప్రసాదవితరణ కేంద్రం భక్తులకు సేవలందించనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
వీరబల్లి : వీరబల్లి మండలం, కోనేటివాండ్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరబల్లి సబ్ ఇన్స్పెక్టర్ సి సుస్మిత, టి సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆదివారం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలసుకున్న స్మగ్లర్లు పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు.వారిని విచారించగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. వారు దాచిపెట్టిన 13 ఎర్రచందనం దుంగలు, మూడు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ఎర్రప్పల్లికి చెందిన గురప్ప భార్య శాంతమ్మ(37) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడింది. దీంతో తీవ్ర మనస్థాంచెంది పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. మదనపల్లెటౌన్ : భార్య అలిగి పుట్టినింటికి వెళ్లిందన్న కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఆరోగ్యపురానికి చెందిన ప్రభుకుమార్(32) భార్య రవణమ్మ కుటుంబ సమస్యల కారణంగా భర్తతో గొడవపడి, అలిగి రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి పిలిచినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రభుకుమార్ పురుగుల మందుతాగాడు. కుటుంబీకులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతని ఆరోగ్యం కుదుట పడక పోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు రెఫర్చేశారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సమస్యతో యువకుడు.. మదనపల్లెటౌన్ : పురుగుల మందుతాగి యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకుములకలచెరువు మండలం, పర్తికోటకు చెందిన మంజునాథ్(27), కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో వారితో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపాఆనికి గురై పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్తితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్చేశారు. ములకలచెరువు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
భూ ఆక్రమణకు యత్నం
సిద్దవటం : అధికార పార్టీ నాయకుల కబ్జాల పర్వం తారస్థాయికి చేరింది.ఖాళీ జాగా కనపడితే చాలు అది శ్మశాన స్థలం అయినా సరే దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. మాధవరం ఆసుపత్రి వెనుక వైపున శ్మశాన స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నించి గ్రామస్తులు ఏకమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేసరికి వెనుకడుగు వేశారు. సిద్దవటం మండలంలోని శాకరాజుపల్లి రెవెన్యూ గ్రామం మొహిద్దీన్ సాహెబ్ పల్లి మజరాలో సర్వే నంబర్ 246లో దాదాపు 24 ఎకరాలు ఉండగా ఇందులో 1.50 ఎకరాల భూమి తాడిగట్ల కుమారి పేరుతో దాదాపు 25 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న భూమిలో ఉలువ, సజ్జలను పండించేవారు. సదరు భూమి రెవెన్యూ రికార్డు 1 బీ, అడంగల్ కూడా నమోదై ఉంది. అయితే టీడీపీ అధికారంలో ఉందన్న అహకారంతో స్థానిక టీడీపీ కార్యకర్త సదరు భూమిలో కంచె వేయాలని నాటిన సిమెంట్ పోళ్లను తొలగించి ఆక్రమణకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక వీఆర్ఓ హరిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, బాధితురాలు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు.అడ్డుకున్న గ్రామస్తులు -
ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు
రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాలు తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి పాలు, పెరుగు, తేనే, పంచదార, టెంకాయ నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు శుద్ధి చేశారు.అనంతరం హారతి , మహానివేదన చేపట్టారు. భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. నగరసంకీర్తన.. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్యకు నిర్వహించిన నగరసంకీర్తనలో పాల్గొన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహించారు. అన్నమయ్య ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు.అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద, తాళ్లపాకలోనూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు సంగీతసభ, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హరికఽథ కార్యక్రమాలను అన్నమాచార్య ప్రాజెక్టు, స్థానిక కళాకారుతో నిర్వహించారు. -
సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక
మదనపల్లె రూరల్ : ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, అన్నమయ్యజిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఆదివారం జిల్లా సర్వే కార్యాలయ ఆవరణలో జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి ఏ.సోమశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వై.ఎస్.సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ బి.శ్రీనివాసులునాయక్, కార్యదర్శిగా గుర్రంకొండ మండల సర్వేయర్ జి.కిరణ్మయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీలో మదనపల్లె మండల సర్వేయర్ బీ.వి.సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా, చౌడేపల్లె విలేజ్ సర్వేయర్ బి.సురేంద్రనాయక్ జాయింట్ సెక్రటరీ, ములకలచెరువు మండల సర్వేయర్ ఎస్.మహమ్మద్ రఫీ ట్రెజరర్గా, డిస్ట్రిక్ట్ సర్వే కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్, పెద్దమండ్యం మండల సర్వేయర్ ఎస్.హసీన్తాజ్, రాయచోటి విలేజ్ సర్వేయర్ ఎం.భారతి, పుంగనూరు విలేజ్ సర్వేయర్ బి.రామమూర్తి, జిల్లా సర్వే కార్యాలయం చైన్మెన్ బి.గంగయ్య, మదనపల్లె విలేజ్ సర్వేయర్ వై.చక్రపాణి నాయుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎన్నికయ్యారు. అన్నమయ్యజిల్లాలో సర్వేశాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూత న కార్యవర్గం కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు. -
19 నుంచి పెద్దపీరయ్య ఆరాధన మహోత్సవాలు
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞా ప్రభోదకర్త శ్రీ పోతులూ రు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ శిశ్యుడు దూదేకుల సిద్దయ్య పెద్దకుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధ న మహోత్సవాలు ఉగాది పర్వదినాన గురువారం ఘ నంగా నిర్వహించేందుకు మఠాధిపతులు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఉత్సవ కార్యక్రమాలు 19న ఉదయం 10 గంటలకు పూలపూజ, బి.మఠం మండలం గొడ్లవీ డు గ్రామానికి చెందిన కనపర్తి నాగిరెడ్డి, కనపర్తి సిద్దారెడ్డిల జ్ఞాపకార్థం వారికుమారులు రాత్రికి గ్రామోత్స వం ఏర్పాటు చేశారు. భక్తులు అన్నదానాలు, భజనలు,డ్రామాలు, చిన్నాయపల్లె గ్రామస్తుల ఆద్వర్యంలో సీనీ పాటకచ్చేరీ, కోలాటాలు నిర్వహించనున్నారు. 20న బండలాగుడు పోటీలు శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతల ఎడ్ల య జమానులకు నగదు బహుమతి అందించనున్నారు. అలాగే గుండు ఎత్తే పోటీలు నిర్వహించనున్నారు. -
కారు,ట్రావెల్స్ బస్సు ఢీ
మృతి చెందిన పవన్కుమార్మేనక మృతదేహంకడప అర్బన్ : కడప నగర శివారులోని కడప– తిరుపతి హైవేలో ఈనెల 13వ తేదీ రాత్రి హెచ్పీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్, టాటా షోరూం సమీపంలో కారును, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పల్లిపట్టు గ్రామానికి చెందిన పవన్ కుమార్ (27), నాగ మేనక (28)తో పాటు బెంగళూరు నగరానికి చెందిన వెంకటరాజు (54), సాయి (26) కారులో తమ గ్రామం నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళుతుండగా కడపలో ఎదురుగా ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్ సీఐ తెలిపారు.ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
యువకుడు అనుమానాస్పద మృతి
మైదుకూరు : కంకర తయారు చేసే స్టోన్ క్రషర్ వద్ద కూలిగా పనిచేస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె వద్ద జరిగింది. అర్బన్ ఎస్ఐ చిరంజీవి శనివారం తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శెట్టివారిపల్లెకు చెందిన నల్లిపోగు చంద్రమోహన్ (33)కు ఐదేళ్ల కిందట బద్వేలు మండలం వల్లెలవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణితో వివాహమైంది. ఈ యువకుడు పదేళ్లుగా శెట్టివారిపల్లెకు చెందిన కొప్పర్తి వేణురామిరెడ్డి కంకర క్రషర్లో పనిచేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం క్రషర్ వద్దకు పనికివెళ్లాడు. సాయంత్రం 5 గటల ప్రాంతంలో క్రషర్ మిషన్ వద్ద పనిచేస్తున్న చంద్రమోహన్ తీవ్రంగా గాయపడగా అక్కడున్న వారు చికిత్స కోసం కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుని భార్య వెంకటరమణి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మృతునికి నాలుగేళ్ల మోక్షిత, మూడేళ్ల మోహన ప్రియ అనే కుమార్తెలు ఉన్నారు. -
ఇఫ్తార్ విందు పుణ్యకార్యం
గఫారియా ఫ్యామిలీ వితరణ చేసిన ఈదీని పేద కుటుంబాలకు అందిస్తున్న ఎంపీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి తదితరులను గజమాలతో సన్మానిస్తున్న ఇస్మాయిల్కమలాపురం : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించే వారికి ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు పుణ్యకార్యం అని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, ఆర్టీసీ మాజీచైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి తెలిపారు. శనివారం కమలాపురం లోనిదర్గా–ఈ–గఫారియాలో దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ వలంటీర్స్ వింగ్ జోన్–5 షేక్ ఇస్మాయిల్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వారు హాజరయ్యారు. నాయకులను గజమాలతో సత్కరించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి వారికి శాలువా కప్పి నన్మానించారు. ఇస్తార్ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు ముస్లింలకు పండ్లు, ఫలాలు ఇచ్చి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం దర్గాలో స్వాముల వారి మజార్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రంజాన్ మాసంలో ఈ దర్గాలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇఫ్తార్ విందు పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు. కాగా గఫారియా ఫ్యామిలీ వితరణ చేసిన ఈదీ (పండుగ సరుకులు)ని వారు 2000 మంది పేద ప్రజలకు అందజేశారు. అనంతరం ఇస్మాయిల్ ఏర్పాటు చేసిన విందులో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి స్వామి, మౌలానా, గౌస్ పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు సాయినాథశర్మ, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాసీమ బాబు, సంబటూరు ప్రసాద్రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మహ్మద్ సాదిక్, గండి భాస్కర్, గఫార్, జావీద్, మోనార్క్ తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడితో కలిసి దొంగతనాలు చేయించిన తల్లి, అక్క అరెస్ట్
● రూ.7.50 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన చిన్నచౌక్ సీఐ ఓబులేసుకడప అర్బన్ : కడప నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల కేసులను చిన్నచౌక్ పోలీసులు ఛేదించారు. కుమారుడు, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయిస్తున్న తల్లి, అక్కను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల 50 వేల విలువ చేసే 50 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. అరెస్టు అయిన వారిలో కడప నగరం ఎం. జె కుంట చెందిన ఉదయగిరి అమ్మాజాన్, చిరిదాపల కులాయమ్మలు ఉన్నారని తెలిపారు. తన కుమారుడు పెద్ద కుల్లాయప్ప అలియాస్ లడ్డూ, అతని స్నేహితులతో కలిసి కడపలోని శంకరాపురం, చిన్నచౌక్ ప్రాంతం, ఎర్రముక్కపల్లి, ఏపీహెచ్బీ కాలనీ ప్రాంతాల్లో జరిగిన 5 దొంగతనాల కేసుల్లో తమ పాత్ర ఉన్నట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. లడ్డూను గతంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరు గతంలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. పెద్ద కుల్లాయప్పపై కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వీరు తమ కుమారుడికి అండగా నిలుస్తూ, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయించి, దొంగిలించిన సొత్తును కుదువకు పెట్టడం లేదా అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వంటి చర్యలు కూడా చేస్తూ వచ్చారన్నారు. గతంలో ఒక సందర్భంలో తన కుమారుడిని విడుదల చేయకపోతే విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఘటన కూడా జరిగినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. ఓబులేసు, ఎస్ఐలు ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, యు. ప్రతాప్ రెడ్డి పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దొంగతనాల కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ,ఎస్ఐలను, పోలీసు సిబ్బందిని కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు అభినందించి రివార్డులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
● రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం ● సమస్యాత్మక కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ● విలేకర్ల సమావేశంలో డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రాస్తున్నట్లు తెలిపారు. వారి కోసం జిల్లాలో 167 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని వెల్లడించారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్, 30 సిట్టింగ్ స్క్వాడ్లను సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 9 సమ స్యాత్మక కేంద్రాలను గుర్తించామని వాటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. అలాగే మిగతా పరీక్షా కేంద్రాలలో కూడా ఎక్కడ సమస్యలను లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షా కేంద్రాలలో నిరంతరం విద్యుత్తుతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ల లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది పరీ క్షా కేంద్రాల్లో వాటర్ బాయిస్ ఉండరని పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతి లేదని వివరించారు. విద్యార్థులకు దాహం వేస్తే పరీక్ష గది ముందు ఏర్పాటు చేసిన చోటికు వచ్చి మంచినీటిని తాగవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఎవరైనా కోడ్ ఆప్ కాంట్రాక్టు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలలో ఏవైనా సమస్యలుంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9121846205 ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలో పది పరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర అబ్జర్వర్గా టెక్స్బుక్స్ డైరెక్టర్ మధుసూదన్రావును ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డీఈఓ తెలిపారు. ఓపెన్ స్కూల్ పది పరీక్షల కోసం.... ఓపెన్ స్కూల్ పది పరీక్షల కోసం కూడా జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 2424 మంది విద్యార్థులు రాస్తున్నారని తెలిపారు. 6 ఫ్లయింగ్ , 16 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అక్రమాలు
● ప్రకాష్ నగర్లో 2.10 ఎకరాలు ఆక్రమించేందుకు యత్నం ● బాధితుడు అంబవరం సహదేవరెడ్డి ఆరోపణకడప కార్పొరేషన్ : అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అక్రమణలకు పాల్పడుతున్నారని కడప నగరానికి చెందిన అంబవరం సహదేవరెడ్డి ఆరోపించారు. శనివారం వివాద స్థలం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో చిన్నచౌకు గ్రామ పొలంలో సర్వే నంబర్ 9.8 నందు 22.50 ఎకరాల భూమిపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందన్నారు. ఇందులో కోర్టు 4.20 ఎకరాలను సబ్ డివిజన్ చేసి 1ఏ, 2బీగా నిర్ణయించి, నాకు, మా అన్నదమ్ములకు చెరి సగం పంచుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఆస్తిపై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కన్నేసి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి రూ.30కోట్ల విలువ చేస్తుందని, అందువల్ల తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. 2006 సంవత్సరం నుంచి 2018 వరకు ఈ కేసు కోర్టులో నడిచి తీర్పు వచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాకు సంబంధించిన 2.10 ఎకరాల భూమిలో రోడ్డు, ప్లాట్లు వేసి దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. అందులో ఉన్న తమ చిన్నాన్న ఏ. రామక్రిష్ణారెడ్డి సమాధిని కూడా కూల్చివేశారన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. 2018లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎమ్మెల్సీ తన వారసులతో హైకోర్టులో అప్పీలు చేశారని కోర్టు దానిని డిస్మిస్ చేసిందన్నారు. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని తాము అడ్డుకోగా తమపై చిన్నచౌకు పోలీస్స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారన్నారు. అది తప్పుడు ఫిర్యాదు అని పోలీసులు రెఫర్ చేశారన్నారు. ఈనెల 13వ తేది కూడా ఎమ్మెల్సీ అనేకమంది రౌడీలతో తమ భూమిలో డోజర్తో చదును చేస్తూ మాపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆయన వల్ల తమకు ప్రాణహాని ఉన్నదని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. -
మేము ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు
రాజంపేట: జిల్లా కేంద్రం కడప నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు రైలు ప్రయాణం చేయాలన్న జిల్లా వాసుల ఆకాంక్ష దశాబ్దాలుగా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కడప–బెంగళూరు మధ్య నేరుగా రైలు మార్గం పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ, అది నేటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి గురవుతూ, భారీ వ్యయంతో బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పరిష్కారం ఉన్నా పట్టించుకోరా? జిల్లా వాసుల ఇబ్బందులకు మైసూరు–రేణిగుంట సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22135/22136) పొడిగింపు రూపంలో ఒక చక్కని పరిష్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ రైలు శనివారం ఉదయం 8 గంటలకే రేణిగుంట చేరుకుని, తిరిగి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఖాళీగా (స్టేబుల్) ఉంటోంది. ఈ తొమ్మిది గంటల విరామ సమయంలో రైలును లైనుపై నిలపడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా, ప్లాట్ఫారమ్ రద్దీ పెరిగి అనేక రైళ్లు ఔటర్లో ఆగాల్సిన దుస్థితి నెలకొంది. అదే సమయంలో ఈ రైలును కడప వరకు నడిపితే లైను రద్దీ తగ్గడమే కాకుండా, జిల్లా వాసులకు వారంతంలో బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దీనికి కడప, నందలూరు, రాజంపేట, కోడూరు స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. అటకెక్కిన పాత మార్గం.. అంతుచిక్కని కొత్త లైను: కడప–బెంగళూరు రైలు మార్గానికి 2008–09 బడ్జెట్లో ఆమోదం లభించింది. 2010లో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమైనా, వైఎస్సార్ మరణం తర్వాత అవి పెండ్లిమర్రి వద్దే ఆగిపోయాయి. మరోవైపు 2020లో రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైనును తెరపైకి తెచ్చినా, అది కాగితాలకే పరిమితమైంది. పొరుగు జిల్లాల నుంచి బెంగళూరుకు అనేక రైళ్లు ఉన్నా, కడప జిల్లా పట్ల రైల్వే అధికారులు చూపుతున్న వివక్షపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. బెంగళూరుకు పట్టాలెక్కని కల.. కడపకు రైల్వే శాఖ మొండిచెయ్యి! దశాబ్దాల నాటి డిమాండ్.. అటకెక్కిన వైఎస్సార్ హయాం నాటి ప్రాజెక్టు మైసూరు ఎక్స్ప్రెస్ను పొడిగిస్తే తీరనున్న జిల్లా వాసుల ఇబ్బందులు రేణిగుంటలో రైలు ‘విశ్రాంతి’.. జిల్లా ప్రయాణికులకు ‘అశాంతి’ -
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి –2026కు సంబంధించి ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి కంట్రూల్ రూము ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ జోన్ –4 పరిధిలోని 1125 పరీక్షా కేంద్రాలలో మొత్తం 2,17,651 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో రెగ్యుల్ విద్యార్థులు 2,08,859 మందికాగా ప్రైవేటు విద్యార్థులు 8,792 మంది ఉన్నారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల లేదా ప్రజలకు ఎదురయ్యే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధింత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఎవౖరైనా తమ ఫిర్యాదులు లేదా సమస్యలను తెలియజేయాలనుకుంటే బాబునాయక్, సూపరింటెండెంట్(9441683500), ఎం. సురేష్కుమార్, సూపరింటెండెంట్(8008244717) నెంబర్లకు తెలియజేయాలని సూచించారు. 8 మంది డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడ్హక్ బేసిస్పై తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించి వివిధ చోట్ల పోస్టింగ్ ఇస్తూ శనివారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వేంపల్లెలో పనిచేస్తున్న ఎ.శివలక్ష్మిని నందలూరు తహసీల్దార్గా నియమించా రు. కడప తెలుగుగంగ యూనిట్కు ఎస్డీసీ కార్యాలయంలో స్పెషల్ డీటీగా పనిచేస్తున్న పి.విజయకుమారిని చెన్నూరు తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టరేట్ కేఆర్ఆర్సీ డీటీగా పనిచేస్తున్న ఏపీ లక్ష్మినారాయణను కడప అర్బన్ తహసీల్దార్గా నియమించి, కలెక్టరేట్లోని ఎన్హెచ్ఏఐ విభాగానికి డిప్యూటేషన్పై పంపారు. వల్లూరులో పనిచేస్తున్న జె.లక్షుమ్మను సుండుపల్లె తహసీల్దార్గా, ముద్దనూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జిగా ఉన్న వి.షఫీని మైలవరం తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. కమలాపురం డీటీ బి.అనూరాధను తర్వాత పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. కడప ఎన్ఫోర్స్మెంట్ డీటీ మనోజ్ను బి.కోడూరు తహసీల్దార్గా నియమించారు. లక్కిరెడ్డిపల్లె డీటీ బి.రెడ్డెన్నను అన్నమయ్య జిల్లాలో నియమించారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు వీణా రాఘవాచార్యాలు, వీణా మనోజ్ కుమార్ లు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లకు స్పాట్ బుకింగ్లకు అనుమతి లేదు కడప సెవెన్రోడ్స్ : ఎల్పీజీ సిలిండర్ల స్పాట్ బుకింగ్లను అనుమతించబోమని, ఓటీపీ ఆధారంగా మా త్రమే డెలివరీ చేయా లని కడప ఆర్డీఓ భావ న ఆదేశించారు. శనివారం గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. ముందుగా అందజేసే విధానం (ఎఫ్ఐఎఫ్ఓ) ఆధారంగా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ జరగాలన్నారు. ఎల్పీజీ పంపిణీ సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డు ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా జరగాలన్నారు. విని యోగదారుల నుంచి అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్, ఏదైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08562–295990 అనే కంట్రోల్ రూముకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు ఖాళీ ఎల్పీజీ సిలిండర్లు ఉంటేనే రిజిష్టర్ మొబైల్ నెంబరు నుంచి బుకింగ్ చేసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా బుకింగ్ ఐఓసీఎల్ కోసం 7718955555, బీపీసీఎల్ కోసం 7715012345 లేదా 7718012345, హెచ్పీసీఎల్ కోసం 8888823456లకు ఫోన్ చేయాలన్నారు. మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారు ఐఓసీఎల్ కోసం 84549 55555, బీపీసీఎల్ కోసం 77109 55555, హెచ్పీసీఎల్ కోసం 94936 02222లకు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. -
మున్సిపల్ టెండర్ల మాయజాలం
జమ్మలమడుగు : మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే కూరగాయాల మార్కెట్, కబేలా, బస్టాండ్లకు గతంలో వేసిన టెండర్ల సమయం పూర్తయింది. దీంతో మళ్లీ టెండర్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ముల్లాజానీ, అతని తమ్ముడు ఫయాజ్లు టెండర్లలో పాల్గొనటానికి 18 లక్షల రూపాయల విలువగల టెండర్లను తీసుకువచ్చారు. అయితే అధికారులు టెండర్ వేయటానికి ఎవరూ ముందుకు రాలేదని, టెండర్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ టెండర్లు ఎప్పుడు నిర్వహించేది మున్సిపల్ అధికారులు ప్రకటించలేదు. అధికార పార్టీకి కట్టబెట్టేటందుకు కమిషనర్ ప్రయత్నాలు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మీరు ఎలా చేసుకున్నారో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాగే జరుగుతుందని ఓ అధికారి బాహాటంగానే చెప్పుకువచ్చారు. టెండర్లను కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కట్టబెట్టేవిధంగా.. ఆది కూడా తక్కువ కోటేషన్లతో ఇచ్చేలా మున్సిపల్ అధికారులుముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులకు టెండర్లు వాయిదా వేశామని చెప్పి వారిని బయటకు వంపించిన తర్వాత అధికార పార్టీకి చెందిన వారి టెండర్ చెక్కులు రహస్యంగా తీసుకుని వారికే టెండర్ వచ్చినట్లు ప్రకటించడానికి యత్నిస్తున్నారు. అందులో భాగంగానే నేను, నా తమ్ముడు వేసిన టెండర్లకు సంబంధించిన చెక్కులకు తీసుకుని పోవాలని మున్సిపల్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కౌన్సిలర్ వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారికే టెండర్ ఇచ్చి మున్సిపల్ అదాయానికి గండికోట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.అధికార పార్టీవారికి టెండర్లు కట్టబెట్టేందుకు యత్నం -
అక్రమ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులపై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్: కడప ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు వైఎస్సార్ కడప జిల్లాలోని 8 హోటల్స్, దుకాణాలు, రీఫిలింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6ఏ ఈసీ యాక్ట్ ప్రకారం 8 కేసులు నమోదు చేసి 34 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించేవారిపై, గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కె ట్లో విక్రయించేవారిపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని అధికారి కరిముల్లా షరీఫ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్కు విశేషస్పందన
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని ● జిల్లావ్యాప్తంగా 77028 కేసులకు, రూ.3కోట్ల 52 లక్షల నష్టపరిహారం కడప అర్బన్: జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 7708 కేసులు పరిష్కారం కాగా... రూ.3,52,00,000లు కక్షిదారులకు చెల్లించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కడపలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 5, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 2, రాయచోటిలో 3, బద్వేల్లో 2, సిద్దవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వే కోడూరులో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ మెంబెర్స్, కక్షిదారులు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి కేసులను పరిష్కరించుకున్నారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేసినందుకు గాను న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు , ఇన్స్యూరెన్స్, బ్యాంకు, చిట్ ఫండ్ , లేబర్ డిపార్ట్మెంట్, వైద్య తదితర శాఖల అధికారులందరికీ జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. -
● నమోదుకు అవసరమైన పత్రాలు
రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, మరియు ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ను తీసుకుని సమీపంలోని రైతు సేవా కేంద్రం (ఖఓ)లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (అఅ)ని సంప్రదించాలి. అక్కడ వివరాలు నమోదు చేయగానే 11 అంకెల ఐడీ కేటాయించబడుతుంది. రైతు ఐడీ లేని వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉండదు. తమ గ్రామంలో నివసించకపోయినా, భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ నెల చివరిలోపు ఐడీ తీసుకోవాలి. దీనిపై మండల వ్యవసాయ అధికారులతో అవగాహన కల్పిస్తున్నాం. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి. -
ఐఈఆర్టీ యశోదకు అవార్డు
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రంలో పనిచేస్తున్న ఐఈఆర్టీ కె.యశోదకు అవార్డును ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మహ్నవ్ ఎబిలిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన మహిళలను ఘనంగా సత్కరించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 30మంది ప్రేరణాత్మక మహిళలను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని భవిత దివ్యాంగుల కేంద్రంలో పనిచేస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్టీ) కోటపాటి యశోద దివ్యాంగులకు చేస్తున్న సేవలను గుర్తించి ప్రతిభా అవార్డు అందజేసి సత్కరించారు. ఈ అవార్డును (సుప్రీం కోర్టు అడ్వకేట్) మాల్యాద్రి, నడింపల్లి యమునా పాఠక్ మోటివేషనల్ సైకాలజిస్ట్, ఓం స్వరూప్ స్వామిజీ, భారత్ వేదిక్ పర్యాటన నిగమ్ ట్రస్ట్ చైర్మన్ సుదర్శన్ పాఠక్, నటి మిస్ హీనా భాటియా సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరై అందజేశారు. దాడి చేయకపోయినా తప్పుడు ఫిర్యాదు చేశారు కడప కోటిరెడ్డిసర్కిల్ : తాము ఎవరిపై దాడి చేయకపోయినా సగిలి గుర్రమ్మ అనే మహిళ తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని ఎర్రముక్కపల్లెకు చెందిన సట్టి భారవి ఒక ప్రకటనలో తెలిపారు. మా పూర్వీకుల ఆస్తిలో మా స్వాధీన అనుభవంలో ఉన్న ఇంటిని కబ్జా చేయాలని జనవరి 26వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు రెండు జేసీబీలతో వచ్చి దుర్మార్గంగా మా ఇంటిని కూల్చివేశారన్నారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, న్యాయం చేయాలని ఆందోళనలు చేశామన్నారు. వారు కూల్చివేసిన ఇంటిని తాము మళ్లీ నిర్మించుకుంటుంటే అప్పుడు దౌర్జన్యం చేసిన వారే మళ్లీ వచ్చి గోడలను, దౌర్జన్యంగా తోసివేశారన్నారు. సీపీఐకు చెందిన ఎన్. వెంకట శివ, భాగ్యలక్ష్మిలు తాము కలిసి గుర్రమ్మ అనే మహిళపై పిడిగుద్దులు కురిపించామనడం పూర్తి అవాస్తవమన్నారు. ఇదంతా కబ్జాదారుల ఎత్తుగడ అని తెలిపారు. -
ప్రమాదంలో గాయపడిన యువకుడికి అర్థిక సహాయం
పెండ్లిమర్రి : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయ్ కుమార్రెడ్డికి డిక్సన్ కంపెనీ ప్రతినిధులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పి.నరేన్ రామాంజులరెడ్డి సమక్షంలో శనివారం అర్థిక సహాయం అందజేశారు. మండలంలోని పెసవాండ్లపల్లె గ్రామానికి చెందిన విజయ్కుమార్రెడ్డి గత నెల 7వ తేదీన ద్విచక్ర వాహనంలో కొప్పర్తి సమీపంలోని ఈఎంసీ కంపెనీకి వెళుతుండగా డిక్సన్ కంపెనీకి చెందిన రాజ్యలక్ష్మి ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో బస్సు యాజమాన్యం వైద్య చికిత్స చేయిస్తామని చెప్పి స్పందించకపోవడంతో గ్రామస్తులు ఈవిషయాన్ని నరేన్ రామాంజులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందిచి బస్సు యాజమాన్యానికి ఫోన్ చేశాడు. వారి వద్ద నుంచి సరైన సమాదానం రాకపోడంతో డిక్సన్ కంపెనీ వద్దకు వెళ్లి ట్రావెల్స్ బస్సులు నిలిపివేస్తామని కంపెనీ ప్రతినిధులను హెచ్చరించడంతో వారు పైస్థాయి అధికారులతో మాట్లాడి బాధిత వ్యక్తికి వైద్య చికిత్స చేయించి అర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు డిక్సన్ కంపెనీ ప్రతినిధులు రూ.3లక్షల నగదు అందజేసి, కోలుకున్న తర్వాత కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. నరేన్ రామాంజురెడ్డికి బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వండ్లవాండ్లపల్లె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు ఓనూర్సాబ్ను నరేన్రామాంజులరెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చౌర్మన్ బాలయ్య, పొలతల మాజీ చైర్మన్ నాగమల్లారెడ్డి, రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి, రామచంద్రారెడ్డి, హైదర్బాషా, పాల్గొన్నారు. -
సంక్షేమం కోసం ‘ఐడీ’యా !
కడప అగ్రికల్చర్: వ్యవసాయ భవిష్యత్తుకు భద్రతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆధార్ కార్డు తరహాలోనే రైతులకు 11 అంకెలతో కూడిన ‘యూనిక్ డిజిటల్ ఐడీ’ని ప్రభుత్వం జారీ చేస్తోంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఐడీనే కీలకం కానుంది. ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే: పథకాల అనుసంధానం: పీఎం కిసాన్ నిధులతో పాటు, ఎరువుల సబ్సిడీ, పంటల భీమా, మరియు రాయితీపై అందే వ్యవసాయ పనిముట్లు ఈ యూనిక్ నంబర్ ఉన్న వారికే అందుతాయి. బ్యాంకింగ్ – రుణాలు: ఈ ఐడీని కిసాన్ క్రెడిట్ కార్డు ( ఓఇఇ)తో అనుసంధానిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడి నుంచైనా రైతు రుణ అర్హత, బకాయిలు మరియు ప్రభుత్వ లబ్ధి వివరాలను బ్యాంకులు సులభంగా తెలుసుకోవచ్చు. మద్దతు ధర – ఇతర సేవలు: పండించిన పంటకు కనీస మద్దతు ధర ( క్క) పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే నీటి పారుదల సలహాలు, తెగుళ్ల నియంత్రణ మరియు వాతావరణ సూచనలు కూడా ఈ ఐడీ ద్వారా పొందవచ్చు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి: కడప జిల్లాలో మొత్తం 2,56,000 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 2,11,000 మంది ఐడీలు పొందారు. అవగాహన లేమి లేదా నిర్లక్ష్యం కారణంగా ఇంకా 45,000 మంది రైతులు రిజిస్ట్రీకి దూరంగా ఉన్నారు. నిరక్షరాస్యత వల్ల కొందరు రైతులు దీనిపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. సేద్యం చేస్తున్న రైతు ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించిన కరపత్రం నమోదు చేసుకోకుంటే రైతన్నకు పథకాలు కట్! -
నవభారత నిర్మాణానికి నైపుణ్యాలే పునాది
కడప ఎడ్యుకేషన్: పట్టభద్రులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమాజాభివృద్ధికి, దేశ నిర్మాణానికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, యోగి వేమన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కడప–తిరుపతి బైపాస్ రోడ్డులోని పాలెంపల్లె వద్ద గల డీఎస్ఆర్ పారడైజ్ ఫంక్షన్ హాల్లో వైవీయూ 11, 12, 13, 14వ స్నాతకోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై ప్రసంగిస్తూ నవభారత నిర్మాణానికి నైపుణ్యాలే పునాది అని వ్యాఖ్యానించారు. మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కడప జిల్లా గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని, మత సామరస్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. దేవుని కడప, పెద్ద దర్గా, సెయింట్ మేరీస్ కేథడ్రల్ వంటి క్షేత్రాలు ఇక్కడి ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు. జాతీయ విద్యా విధానం–2020 ద్వారా విద్యార్థులను ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు బడ్జెట్లో రూ. 56,727 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. వినూత్న ఆలోచనలే పునాది: డాక్టర్ కోట హరినారాయణ ప్రముఖ శాస్త్రవేత్త, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) రూపశిల్పి డాక్టర్ కోట హరినారాయణకు గవర్నర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు నవభారత ఆవిష్కరణకు యువత విశ్లేషణాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘ఇన్నోవేషన్ ఇంజనీరింగ్‘ నేటి అవసరమని, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. అగ్రశ్రేణి వర్సిటీగా వైవీయూ: వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ వార్షిక నివేదికను సమర్పిస్తూ.. పీజీ సెంటర్ స్థాయి నుంచి వైవీయూ నేడు దేశంలోని టాప్–100 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ’పీఎం–ఉష’ ( PM& USHA) పథకం కింద వర్సిటీకి రూ. 20 కోట్ల నిధులు అందాయని తెలిపారు. అలాగే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ( ANRF) భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి ఉమ్మడి పరిశోధనలు నిర్వహిస్తున్నామని వివరించారు. పట్టాల పండుగ: అనంతరం గవర్నర్ చేతుల మీదుగా మొత్తం 11,664 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 64 మందికి పీహెచ్డీలు, 176 మందికి బంగారు పతకాలు, 1,194 మందికి పీజీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ మధుమూర్తి, రిజిస్ట్రార్ ఇన్–ఛార్జ్ ప్రొఫెసర్ పి. పద్మ, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు, వర్సిటీ డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. డాక్టర్ కోట హరినారాయణకు డాక్టరేట్ ఇస్తున్న గవర్నర్యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, విద్యార్థులుగవర్నర్ చేతుల మీదుగా బంగారుపతకాలు, డాక్టరేట్ పట్టాలు పొందిన విద్యార్థులు ● రైతు బిడ్డకు మూడు పతకాలు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన దేవారెడ్డి, సావిత్రిల కుమార్తె స్వర్ణకుమారి గణిత శాస్త్రంలో (M.Sc Maths) మూడు బంగారు పతకాలను సాధించి రికార్డు సృష్టించింది. పీజీలో అత్యధిక మార్కులు సాధించినందుకు ఒకటి, ఆల్రౌండర్ విభాగంలో మరొకటి, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ విభాగంలో ఇంకొకటి చొప్పున పతకాలను అందుకుంది. తండ్రి వ్యవసాయం చేస్తూ ఆమెను ప్రోత్సహించగా, స్వర్ణకుమారి తన ప్రతిభతో తండ్రి కష్టానికి ఫలితాన్ని అందించింది.కె.భారతిపి. కీర్తి వి. అంజలి ఫసిహ బేగం పి. హేమ వర్ధిని ఈ. మౌనిక కే. ప్రేమ్ దీప్ కే. మహేష్ గంగధర్ పాండవ ఎం. సైరా బాను గురులక్ష్మి కోలా ఆర్.లక్షి ప్రవళిక బి. పవన్ కుమార్ తస్లీమా వైవీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వైవీయూ 11, 12, 13, 14వకాన్వొకేషన్ అత్యంత ఘనం ఎల్సీఏ రూపశిల్పి కోట హరినారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం పీఎం–ఉష కింద వర్సిటీకి రూ.20 కోట్ల నిధులు: వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ -
పొలం విషయమై ఘర్షణ
– 8 మందిపై కేసు నమోదు కొండాపురం : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రేనాటి బాలజి అదే గ్రామానికి చెందిన నకిలి డిఎస్పి వెంకటరమణ మధ్య పొలం విషయంపై ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రక్తపు గాయాలు కావడంతో ఇరు వర్గాలకు చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాఽథ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన రేనాటి బాలాజికి వెంకటరమణకు బురుజుపల్లె పొలంలో భూ వివాదం గతంలో ఉండేది. ఈ భూ వివాదం కోర్టులో నడుస్తుండగా రేనాటి బాలజి పొలంలో వెంకటరమణ ట్రాక్టర్తో దున్నటంతో మాటకుమాట పెరిగి ఘర్షణ పడ్డారు. గొడవలో రక్తపు గాయాలు కావడంతో ఇరు వర్గాలకు చెందిన 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నకిలి డిఎస్పి వెంకటరమణ తన మనుషులతో ధర్నా చేయడంతో మరో కేసు నమోదు చేశామన్నారు. కార్లు అద్దెకు తీసుకొని చీటింగ్ – ముగ్గురు నిందితుల అరెస్ట్ కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కార్లను అద్దెకు తీసుకుని ఆపై కుదవలకు పెట్టి, జల్సాలకు పాల్పడుతూ.. తమ దగ్గర కార్లు లేవని ఆపై ఓనర్లను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను సీఐ ప్రసాద్ రావు, ఎస్సై రామకృష్ణ, ఏఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎరగ్రుంట్ల మండలం పెద్దనపాడు గ్రామానికి చెందిన పాలగిరి చెన్నకేశవులు, కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన దానం సుజన్ కుమార్, పెదనపాడు గ్రామానికి చెందిన బోరెడ్డి సిద్దేశ్వరరెడ్డి ఉన్నారు. కారు, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రా యచోటి–వేంపల్లి జాతీయ రహదా రి మార్గంలోని లక్కిరెడ్డిపల్లి సమీ పంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చక్రాయపేట మండలం, దేవరగుట్టపల్లికి చెందిన జగదీష్, ఓబయ్య అనే ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయచోటి నుంచి పనులు ముగించుకొని స్వగ్రామమైన చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లికు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా లక్కిరెడ్డిపల్లి సమీపంలో వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పగిలి ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని రాయచోటికి తీసుకెళ్లగా వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శోభ తెలిపారు. గాయపడిన జగదీష్, ఓబయ్య -
నేలకొరిగిన వృక్షం
పులివెందుల రూరల్ : పట్టణ పరిధి పార్నపల్లె రోడ్డు సమీపంలోని లక్ష్మీహాలు వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడటంతో ఆ వీధిలో ఉన్న ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వృక్షాన్ని తొలగించి స్తంభాలను సరిచేసి విద్యుత్ను పునరుద్ధరించారు. మొత్తం మీద గంట సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు శిథిలావస్థకు చేరడంతో కూలింది. చెట్టు కూలినప్పుడు, విద్యుత్ స్తంభాలు విరిగినప్పుడు కానీ ఎటువంటి ప్రమాదం జరగపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనం ఢీకొని దుప్పి మృతి గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సెంచూరీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి చెందింది. వాహనం ఢీకొన్న వెంటనే దుప్పి ప్రాణంతో ఉండటంతో స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ దుప్పిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ భయంతో దుప్పి ప్రాణాలు విడిచింది. కాగా అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం, సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడం పరిపాటిగా మారింది. అసలే వేసవికాలం కావడం, దీనికి తోడుగా కొండలకు నిప్పు పెట్టడంతో అక్కడ ఉన్న వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడింది. మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన విజయ్(26) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
వీబీజీ రామ్జీ నెలరోజులు వాయిదా
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు మరియు నూతన విధివిధానాల అమలు మరో నెల రోజులు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ’వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్–2025’ మే 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు చేపట్టాలని భావించినప్పటికీ, విధివిధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సమావేశంలో స్పష్టత: ఈ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ అధికారులతో ఈ నెల 17, 18 తేదీలలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాతే నిధుల కేటాయింపు, పనిదినాల పెంపు (100 నుంచి 125 రోజులకు) మరియు ఇతర సాంకేతిక మార్పులపై పూర్తి స్పష్టత రానుంది. కొత్త పథకం తక్షణమే అమలులోకి వచ్చి ఉంటే, పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద చేసిన పనుల బిల్లులు పెండింగ్లో పడతాయని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు అదనంగా ఒకటిన్నర నెల గడువు లభించడంతో, మార్చి నెలాఖరులోపు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, బిల్లులు చెల్లించేందుకు అవకాశం దక్కింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఊపిరి పీల్చుకున్న అధికారులు పాత బకాయిలు, పెండింగ్ పనుల పూర్తికి దక్కిన వెసులుబాటు -
ఎత్తెకాఫ్.. ఏకాంత ఆరాధన
రాజంపేట టౌన్ : రంజాన్ మాసంలో వచ్చే బడీరాత్కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎత్తెకాఫ్కు కూడా అంతే ఉంటుంది. రంజాన్ మాసంలో చివరి పదిరోజులు చాలా మంది ముస్లింలు ఎత్తెకాఫ్ను ఆచరిస్తారు. ఇదిలావుంటే మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని అనేక మసీదుల్లో ముస్లీం సోదరులు ఎత్తెకాఫ్ను పాటిస్తున్నారు. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఎత్తెకాఫ్ కల్పిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. రంజాన్ మాసంలో ఒక ఊరిలో ఒక వ్యక్తి కూడా ఎత్తెకాఫ్ ఉండకపోతే ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కనపెట్టి వీలు పడినన్ని రోజులు (కనీసం 24 గంటలు) అయినా మసీదులో గడపడమే ఎత్తెకాఫ్. అన్నింటిని త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు చెబుతున్నారు. అయితే పెద్దతరహాలో ఉండే అనేక మంది పదిరోజుల పాటు ఎతె్ాత్కఫ్ను పాటించనున్నారు. ఈనెల 10వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన ఎత్తెకాఫ్ నెలవంక కనిపించేంత వరకు కొనసాగనుంది. ఎత్తెకాఫ్ ఇలా.. ఎత్తెకాఫ్ ఉండాలంటే శుద్ధిస్నానం చేసి మసీదుకు వెళ్లి వజూ (ముఖం, చేతులు, కాళ్లను నీటితో శుద్ధి చేసుకోవడం) చేయాలి. ఎతె్ాత్కఫ్ నియ్యత్ను చదవాలి. ఇతరుల నుంచి భంగం లేకుండా మసీదులో డేరా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి. తహతుల్ వజూ, తహతుల్ మజీద్ల రెండేసి రకాత్ల నఫిల్ నమాజు చదవడం మంచిది. ఖురాన్ పఠనం, దువా, జికర్ ఇతర నమాజ్లు చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన, వజూ, గుసూల్ స్నానం కోసం మాత్రమే డేరాల నుంచి బయటకు రావాలి. మసీదు గడపదాటరాదు. సహర్, ఇఫ్తార్, దావత్లు ఇస్తే స్వీకరించాలి. లేదా ఇంటి నుంచి భోజనం, ఆహార పదార్థాలు తెప్పించుకోవాలి. కలిమా ఏ తయ్యిబా లాయిలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం), అస్తగ్ ఫిరల్లాహ్ బాగా పఠించాలి. సహరి కంటే ముందు 12 రకాతుల తహజూద్ (కనీసం రెండు రకాతులు) నమాజ్, సజ్దాలో దువా చేస్తే అల్లాహ్ సమీపం నుంచి మొర వింటారని ఖురాన్ బోధిస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల కష్ట సుఖాలతో పాటు సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ దువా చేస్తే ఉత్తమం. ఇఫ్తార్ సమయం నుంచి మరుసటి రోజు ఇఫ్తార్ వరకు ఒకరోజు అవుతుంది.మసీదులో అడుగు పెట్టగానే ‘బిస్మిల్లాహి దాఖల్తువ అలైహి తవక్కల్తు వనవైతు సున్నతుల్ ఎత్తెకాఫ్ నియ్యత్ చదవాలి.నెలవంక కనిపించేంత వరకు మసీదుల్లోనే గడపనున్న పలువురు ముస్లింలుమోక్షమార్గానికి అనువైన రోజులు రంజాన్ మాసంలో చివరి పది రోజులు మోక్షమార్గానికి అనువైన రోజులు. ఎత్తెకాఫ్లో ఉన్న వారు కఠోర దీక్ష చేపట్టి ఖురాన్ను పఠించాలి. మసీదు గడప దాటకుండా అనుక్షణం అల్లాహ్ స్మరణలోనే ఉంటే తప్పక పుణ్యం, మోక్షం లభించడంతో పాటు ఏ పరిస్థితిలో ఉన్నా సాటి మానవుడి పట్ల ప్రేమాభిమానాలు చూపే గొప్ప మనస్తత్వం కలుగుతుంది. – మౌలానా సాబిర్, ఇమామ్, అబుహురైరహ్ మస్జిద్, రాజంపేట -
కరెంటోళ్ల జనబాటతో సమస్యలు పరిష్కారం
ఒంటిమిట్ట : కరెంటోళ్ల జనబాటతో విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యుత్ శాఖ తిరుపతి సర్కిల్ జీఎం ఎస్.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండమాచుపల్లి గ్రామంలో జిల్లా, మండల విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విద్యుత్ తీగకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది చేత తొలగించడం, విద్యుత్ వినియోగదారులను అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లూజుగా ఉన్న విద్యుత్ లైన్లను బిగిస్తామని, దెబ్బతిన్న కరెంట్ స్తంభాలను మారుస్తామని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రం చేయిస్తామన్నారు. అలాగే విద్యుత్ మీటర్లలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఏదేమైనా ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమాచుపల్లి సర్పంచ్ మేరువ శివనారాయణ, ఏడీ పి.సుబ్రమణ్యం, ఏఈ జయకేశవరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, లైన్ మెన్ జనార్దన్రెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఒంటిమిట్ట : మండల పరిధి కొత్తమాధవరం గ్రామంలోని జాంబవంతుని వీధిలో శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 142 బస్తాల రేషన్ బియ్యాన్ని కడప విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కడప విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు కొత్తమాధవరం గ్రామం జాంబవంతుని వీధిలోని ఓ ఇంటిలో పీడీఎస్ రేషన్ బియ్యం డంపు చేసి, ఒక ఆటో సహాయంతో అక్రమంగా రవాణా చేయుచున్నారనే సమాచారంతో ఒంటిమిట్ట సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సౌజన్యతో కలిసి కడప విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కొలిమిగుండ్ల పద్మావతి అనే మహిళ ఒంటిమిట్ట మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఒక ఇంటిలో 142 బస్తాలుగా దాచిన 6,517 కేజీల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని, రవాణాకు సహాయపడ్డ ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఒంటిమిట్ట సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్కి అప్పగించారు. వీటి విలువ రూ.2,62,925 గా ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న కొలిమిగుండ్ల పద్మావతి, ఆటో డ్రైవర్ పి. గోవింద, సుబ్బరాజుపై ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లో డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు కడప విజిలెన్స్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీసీటీవో బి.బాబు మోజెస్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
మొల్లమాంబ సాహిత్యం సామాజిక చైతన్యానికి తోడ్పాటు
కడప సెవెన్రోడ్స్ : మొల్లమాంబ సాహిత్యం, తెలుగు భాషా అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి ఎంతో తోడ్పడిందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రి అని తెలిపారు. ఎందరో కవులు శ్రీరాముని చరిత్రను వివిధ విధాలుగా రచించినప్పటికీ, సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు వాడుక భాషలో శ్రీమొల్ల రామాయణంశ్రీను రచించడం ఆమె ప్రత్యేకత అని తెలిపారు. కవయిత్రి మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, సాహిత్య కృషి గురించి సంక్షిప్తంగా వివరించడంతో పాటు, సమాజానికి ఆమె అందించిన ప్రేరణాత్మక సందేశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సన్మానం మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ను కలెక్టరేట్లో మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్వాన్ గానుగ పెంట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి జీవీ మనోజ్ కుమార్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కలెక్టర్లు హరి ప్రసాద్, నాగరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటసుబ్బయ్య, పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, ప్రముఖ అష్టావధాని లోకా జగన్నాథ శాస్త్రి, రంగస్థలం కళాకారుడు కడియంపాటి అరుణ్ ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త వంకధార రఘునాథ్ గుప్తా, ఎన్సీసీ ప్రోగ్రాం ఆఫీసర్ భూమిరెడ్డి రవి కళ్యాణ్, సిద్ధ మల్లేశ్వర ఆలయ అభివృద్ధి చైర్మన్ నాగ మల్లారెడ్డి, పుష్పగిరి గిరి ప్రదక్షిణ తీర్థధర్మ సభ్యులు నిత్య పూజ శ్రీనివాసులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన వెంటనే గంటల్లోపు రైతు భరోసా పథకం కింద నిధులు జమ అయ్యేవి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే ఒక్క ఇరవై రోజులు ముందు ఏర్పాటు చేసి ఉంటే ప్రతిరైతుకు మేలు జరిగి ఉండేది. – నారాయణ రెడ్డి, వెలవలి గ్రామం, రాజుపాళెం మండలం, వైఎస్సార్ కడప జిల్లా -
దాతృత్వానికి, దైవభక్తికి ప్రతీక రంజాన్ మాసం
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రముఖులుఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లింలు కడప కార్పొరేషన్ : దాతృత్వానికి, దైవభక్తికి రంజాన్ మాసం ప్రతీక అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం బిల్టప్ సమీపంలోని షాహీ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీ నేత ఎస్ఎండీ ఆజమ్ నయీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీతోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, సీఈసీ సభ్యులు కె.సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో పాటించే ఇఫ్తార్లు పేద వారి ఆకలి విలువను తెలియజేయడంతోపాటు అధిక పుణ్య ఫలాలను చేకూరుస్తాయని తెలిపారు. అంతేగాక రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందుల్లో ఆత్మీయత, సహృద్భావాలు ప్రస్పుటమవుతాయన్నారు. పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇఫ్తార్ విందు నిదర్శనమన్నారు. పవిత్ర ఆరాధనలకు, ధార్మిక చింతనకు, క్రమశిక్షణకు రంజాన్ మాసం ఆలవాలంగా నిలుస్తుందన్నారు. ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిపై అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం ప్రముఖులతో కలిసి మగరీబ్ ప్రార్థనలు సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు దస్తగిరి, ఎస్ఈసీ సభ్యులు డాక్టర్ సొహైల్, మైనార్టీ నేతలు నజీర్ అహ్మద్, సలావుద్దీన్, గౌస్, షఫీవుల్లా, జమీల్, సీహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
బ్రహ్మంగారి నివాస గృహం పరిశీలన
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రతుల ద్వారా జరగబోయేవి ముందుగానే అందులో పొందుపరచిన సంఘ సంస్కర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన ఇంటిని శుక్రవారం ఢిల్లీకి చెందిన ఇన్టాక్ బృందం పరిశీలించింది. 2025 నవంబర్, 11న వచ్చిన తుసానుకు స్వామి వారి మట్టి మిద్దె ఒక వైపు కూలి పోయింది. అప్పట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, బద్వేల్ ఆర్డీఓ, పలువురు అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా స్వామి నివాసం పునర్నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం కదలిక వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చి పరిశీలించి, అందుకు కావాల్సిన డీపీఆర్ తయారు చేస్తున్నట్లు ఇన్టాక్ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణం ఎలా చేయాలి అనే అంశంపై మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామితో చర్చించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు పంపుతామని తెలిపారు. మఠం మేనేజర్ ఈశ్వరాచారి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, పీపీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. కడప అర్బన్: ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి యామిని శుక్రవారం తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి 08562– 258622, 244622 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. -
మెరిసిన బంగారుబిడ్డలు
● కష్టార్జితానికి గుర్తింపు.. నందలూరుకు చెందిన మండిపల్లి శ్రీషిత ఎంఎస్సీ (కెమిస్ట్రీ)లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా మూడు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. ఎంఎస్సీ కెమిస్ట్రీలో టాపర్గా నిలవడంతో పాటు, పీజీ కోర్సుల్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచినందుకు, కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఈ పతకాలు లభించాయి. తండ్రి వేణుమాదవ్రెడ్డి వ్యవసాయం చేస్తూ కుమార్తెను చదివించగా, తల్లి పరిమళ గృహిణి. ‘నాన్న కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ● వాచ్మెన్ కుమార్తెకు స్వర్ణ పతకం ప్రొద్దుటూరుకు చెందిన లాజర్,దేవిరాణిల కుమార్తె సువర్ణ ఎంఏ (హిస్టరీ అండ్ ఆర్కియాలజీ)లో బంగారు పతకం పొందింది. లాజర్ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ కూతురిని చదివించారు.‘సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వర్ణ పతకం సాధించడం గర్వంగా ఉంది‘ అని సువర్ణ పేర్కొన్నారు. ● టైలర్ కుమార్తెకు రెండు స్వర్ణాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రకృద్దీన్, షాకీరాల కుమార్తె తస్లీమా ఎంఏ జర్నలిజంలో రెండు బంగారు పతకాలను సాధించింది. తండ్రి టైలర్గా పనిచేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన తస్లీమా శ్రమించి చదివి ఈ ఘనత సాధించింది. పతకాలు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ● టిఫిన్ సెంటర్ నిర్వాకుడి కుమారుడు ప్రతిభ గుంటూరుకు చెందిన శివలింగం నాయక్, ఏసు జమ్మల కుమారుడు పవన్కుమార్ నాయక్ ఎంఏ ఎకనామిక్స్లో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. తండ్రి శివలింగం నాయక్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుమారుడిని చదివించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పవన్ రాణించి పతకాన్ని సాధించాడు. -
20 సిలిండర్ల స్వాధీనం
గోపవరం : మండల రెవెన్యూ పరిధిలో నిర్వహించే వివిధ హోటళ్లలో గృహావసరాలకు ఉపయోగించే 20 సిలిండర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఓ చంద్రమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహావసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను బ్లాక్లో హోటళ్లకు సరఫరా చేస్తే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా వాణిజ్య సిలిండర్ల కొరత అధికంగా ఉండటంతో హోటల్ యజమానులు గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్లను బ్లాక్లో కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మదనపల్లె టౌన్ : కరెంటు షాక్ కొట్టి ఉత్తరప్రదేశ్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులను స్థానిక నీరుగట్టువారిపల్లెకు చెందిన రాము ఇటీవల కూలీ పనులు చేయించుకోవడానికి తీసుకు వచ్చాడు. వారితో రింగు రోడ్డు వద్ద ఓ భవనానికి పీఓపీ పనులు చేస్తుండగా తస్లీం(19)కరెంటు షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని సహచరులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
ముగ్గురు పిల్లలను పోషించే పరిస్థితి ఉందా?
● యువతకు ఉపాధి కల్పించకుండా.. పిల్లల్ని కనమంటే ఎలా? ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : మారిన జీవన పరిస్థితుల్లో ఒక్కో కుటుంబం ముగ్గురు పిల్లల్ని కని పోషించే పరిస్థితి ఉందా అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురు లేదా ఐదుగురు పిల్లల్ని కనమనే ప్రకటన ఎవరికి వర్తిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారి పరిస్థితి ఎలా అని ఆలోచన చేస్తున్నారన్నారు. మూడవ పిల్లవాడికి రూ.25 వేలు, నాలుగో పిల్లవాడికి రూ.50 వేలు ఇస్తామని చెబుతున్నారన్నారు. మూడో పిల్లవాడికి మీరిచ్చే రూ.25 వేలు డైపర్లకే సరిపోతుందని విమర్శించారు. ఆ రూ.25 వేలు కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా ఎగరగొట్టారని తెలిపారు. ముగ్గురు, నలుగురు పిల్లలను పుట్టించుకుంటే వారిని పెంచడానికి పేద, మధ్య తరగతి ప్రజలు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నేటి పరిస్థితుల్లో ఒకరికి మంచి విద్యను అందించడమే భారంగా మారిపోయిందని చెప్పారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చే ఈ సలహా వారి కొంప ముంచుతుందని అన్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కని వారిని పోషించలేక భారమై తల్లిదండ్రులు వదిలేస్తే, వారు అసాంఘిక శక్తులుగా తయారవుతారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించకుండా పిల్లల్ని కనమని చెబితే ఎలా అని ప్రశ్నించారు. ఎంత మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలరో అంత మంది పిల్లలను కనాలని తెలిపారు. -
రాష్ట్రంలో రెడ్డి అధికారులపై టార్గెట్ పాలిటిక్స్?
● వరుస సస్పెన్షన్లు ఆందోళనకరం ● ఆర్సీడీఎస్ జాతీయ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి పులివెందుల టౌన్ : రాష్ట్రంలో రెడ్డి అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ పాలిటిక్స్ చేస్తోందని ఆర్సీడీఎస్ జాతీయ అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్కల మణికంఠరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పోస్టింగ్లు లేకుండా రెడ్డి అధికారులను పక్కన పెట్టడం, అలాగే వరుసగా సస్పెన్షన్లు చేస్తుండటం ఆందోళనకరమన్నారు. గత కొంత కాలంగా అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఆ అధికారుల్లో ఎక్కువగా రెడ్డి అధికారులే ఉండటం యాదృచ్ఛికం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇటీవల ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఆ ఘటనల్లో కూడా రెడ్డి అధికారులే లక్ష్యంగా మారడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా ఒక డీఎస్పీ స్థాయి పోస్టులో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. పోలీస్ శాఖలో పని చేసిన సీఐ అశోక్రెడ్డిపై కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవడం మరింత ఆందోళనకరమన్నారు. పూర్తి స్థాయి విచారణ జరగకముందే రెడ్డి అధికారిపై చర్యలు తీసుకోవడం అన్యాయంగా కనిపిస్తోందన్నారు. రెడ్డి అధికారులను టార్గెట్ చేయడం వెంటనే ఆపాలని, ప్రతి అధికారికి సమాన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట!
కడప సెవెన్రోడ్స్/బద్వేలు : అంతర్జాతీయ పరిణామాల సాకుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి పాలిట గుదిబండగా మారింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ’వంటగ్యాస్ పెంపు’ పిడుగుపాటులా తగిలింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా, ఇక్కడ సామాన్యుడి వంటింటి బడ్జెట్ను అస్తవ్యస్తం చేశాయి. భారీగా పెరిగిన ధరలు : తాజా నిర్ణయంతో గృహ వినియోగ సిలిండర్పై రూ. 60 పెరగగా, వాణిజ్య (కమర్షియల్) కనెక్షన్లపై ఏకంగా రూ. 114 మేర భారం పెరిగింది. ఏడాది కాలంలోనే ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ జిల్లాపై ప్రభావం వైఎస్ఆర్ జిల్లాలో మొత్తం 5,99,865 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పెంపుతో కేవలం ఈ జిల్లాలోని వినియోగదారులపైనే నెలకు సుమారు రూ. 3.59 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి లెక్కగడితే ఇది రూ. 43 కోట్లకు పైగానే ఉండటం గమనార్హం. కుదేలవుతున్న హోటల్ రంగం వాణిజ్య సిలిండర్ ధర రూ. 114 పెరగడంతో హోటల్ మరియు రెస్టారెంట్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు ఇప్పటికే పెరిగి ఉండటంతో, ఇప్పుడు గ్యాస్ భారం కూడా తోడవ్వడంతో తినుబండారాల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది పరోక్షంగా బయట తినే సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. భారం తగ్గించండి.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నెపం సామాన్యుడిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పన్నుల తగ్గింపు ద్వారానైనా ఈ భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ● గ్యాస్ ధరల పెంపు హోటల్ రంగంపై కోలుకోలేని దెబ్బ తీస్తోంది.ఈవిషయమై ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ టంగుటూరి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘కరెంటు, కార్మికుల వేతనాలు, అద్దెలు భారంగా మారాయి. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపుతో నార్త్ ఇండియన్ ఫుడ్, టిఫెన్ ఐటమ్స్ తయారీ కష్టతరమవుతుంది. టర్నోవర్ తగ్గి నష్టాలు వస్తే హోటళ్లు మూతపడే అవకాశం ఉంది, ఇది ఎంతోమంది ఉపాధిని దెబ్బతీస్తుంది‘ అని పేర్కొన్నారు. ● గ్యాస్ కొరత వల్ల వేలాది హోటళ్లు మూతపడే పరిస్థితి ఉంది. కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం వెంటనే గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలి లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అందరికీ గ్యాస్ అందేలా ’జంబ్లింగ్ పద్ధతి’ (రోజు విడిచి రోజు సరఫరా) అమలు చేయాలని కడప హోటల్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు : జేసీ ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ద నేపధ్యంలో గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. గురువారం కలెక్టరేట్లో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ అంశాలను సమీక్షించారు. జిల్లాలో ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరా యధావిధిగా కొనసాగుతుందన్నారు. సింగిల్ సిలిండర్ వారు 25 రోజులకు, డబల్ సిలిండర్ వారు 30 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ఇంటి అవసరాలకు వాడే సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా గ్యాస్ను నిల్వ చేసి కొరత సృష్టించవద్దని హెచ్చరించారు.అష్టకష్టాలు వంట గ్యాస్ సిలిండర్ కోసం తీవ్ర ఇబ్బందులు సింగిల్ సిలిండర్ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు డబల్ సిలిండర్ కోసం 30 రోజులు ఆగాల్సిన స్థితి బుకింగ్కు కాల్ చేసినా స్వీకరించని వైనం హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ బంద్ చిరు వ్యాపారుల ఉపాధిపై పెద్ద దెబ్బగ్యాస్ను మర్చిపోవాల్సిందే కూలి పనులు చేసుకుని బతికే మాకు మాటిమాటికీ ధరలు పెరిగితే చాలా కష్టం. ఇప్పటికే ధరలు భరించలేక కట్టెల పొయ్యిపై వండుకుంటున్నాం. ధరలు తగ్గించకపోతే పేదవాళ్లు గ్యాస్ సిలిండర్ను పూర్తిగా మర్చిపోవాల్సిందే. ప్రభుత్వం పేదల పక్షాన నిలబడాలి. – దేవి, గృహిణి, బద్వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రం పెంచిన ఈ ధరల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, కేంద్రం ధరలు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పెంచిన ధరలను తగ్గించకపోతే ప్రజల ఆగ్రహం తప్పదు. – ఎ. రాజేశ్వరిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అందాల నెలవు.. ప్రమాదాల కొలువు
చల్లనికొండపై మంటలు! ● హార్సిలీహిల్స్లో వరుస కారు ప్రమాదాలు ● మంటలతో కాలి బూడిదైన ఒక టెంపో, రెండు కార్లుట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు:ఎస్పీకడప కోటిరెడ్డిసర్కిల్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 270 కేసులు నమోదు చేసి, రూ. 56,215 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.వివాహిత ఆత్మహత్యరాజంపేట : మండలంలోని బోయనపల్లెలో గురువారం రైల్వేలోకోౖపైలెట్ శ్రీరాంశ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసులుఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు.కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. లాయర్ సతీష్పై దాడిపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని స్థానిక పాత బస్టాండు వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో నివాసం ఉంటున్న లాయర్ సతీష్పై రామిరెడ్డి శివానందరెడ్డి అనే వ్యక్తి కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్ 8 ఏళ్ల నుంచి లాయర్గా ఉంటూ నోటరీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లాయర్ సతీష్ ఆఫీస్కు రామిరెడ్డి శివానందరెడ్డి, అతని భార్య రామిరెడ్డి జ్యోతిలు అఫిడవిట్ చేయించుకోవడానికి వెళ్లారు. లాయర్ సతీష్ అఫిడవిట్ కంప్యూటర్లో తయారుచేసి శివానందర్ రెడ్డికి ఇచ్చారు. ఆఫిడవిట్ను తయారు చేసినందుకు శివానందరెడ్డిని డబ్బులు అడగగా.. ఆయన నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడాడు. అక్కడే ఉన్నా లాయర్ సతీష్ భార్య కూడా ఎందుకు బూతులు మాట్లాడుతున్నావని అడగగా.. ఆమైపె కూడా అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివానందరెడ్డి లాయర్ సతీష్ను చేతులతో కొట్టడంవల్ల కళ్లజోడు విరిగిపోయింది. కంటి కింద గాయాలయ్యాయి. లాయర్ భార్య అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపు శివానందరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శివానందరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉప్పరపల్లిలో భూవివాదం:ఉద్రిక్తతసిద్దవటం : మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో గురువారం భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ ప్రధాన నాయకుడి అనుచరుడు కరమళ్ల మహీంబాషా గ్రామంలోకి వచ్చి భూమి విషయంలో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 936లో ఉన్న 20 సెంట్ల తమ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య గత నెల రోజులుగా గొడవలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో కరమళ్ల మహీంబాషాను అడ్డుకొని చితకబాది తరిమికొట్టినట్లు సమాచారం. ఘటన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే నెల రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసమస్యపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాడి చేశారని ఫిర్యాదుకడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం ఎర్రముక్కపల్లెలోని కందిపాలెంలో ఉన్న తమ ఇంటి స్థలంలో కొందరు బలవంతంగా ఇల్లు నిర్మిస్తుంటే.. ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని సగిలి గుర్రమ్మ వన్టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీ తమ స్థలంలో భారవితోపాటు ఎన్.వెంకట శివ, వి.భాగ్యలక్ష్మి తదితరులు తమపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారన్నారు. గతనెల రోజులుగా స్థల వివాదం జరుగుతోందని, పోలీసులు, రెవెన్యూ వారి ఉత్తర్వుల మేరకు ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు, నిర్మాణాలు జరపకూడదని చెప్పినందువల్ల మేము, మా కుటుంబ సభ్యులం ఆ స్థలం వద్దకు పోలేదన్నారు. కానీ భారవి, భాస్కర్లు కిరాయి రౌడీలతో కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. వాటిని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారన్నారు. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గూడ్స్ రైలు కిందపడి వ్యక్తికి గాయాలుకడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర పరిధి చలమారెడ్డిపల్లెకు చెందిన జయరామిరెడ్డి అనే వ్యక్తి గురువారం సాయంత్రం గూడ్స్ రైలు కిందపడి గాయపడ్డాడు. కడప రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కడప రిమ్స్కు తరలించారు. బి.కొత్తకోట : మండలంలోని చల్లటికొండ హార్సిలీహిల్స్కు విహారానికి వచ్చే సందర్శకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది. ఎన్నడూ జరగనన్ని ప్రమాదాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. పెను ప్రమాదాలు సంభవిస్తున్నా అదృష్టవశాత్తు ప్రాణాలకు ప్రమాదం జరగడంలేదు. గాయాలతో బయటపడుతున్నారు. హార్సిలీకొండ ఘాట్రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండగా ఇటీవల కార్లు మంటలతో కాలి బూడిద అవుతున్నాయి. టెంపో, కార్లు దగ్ధం కొండకు జిల్లాతోపాటు సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన సందర్శకులు అధికంగా వస్తుంటారు. వీరంతా కార్లలోనే కొండపైకి చేరుకుంటారు. కాండ్లమడుగు నుంచి కొండపై 9 కిలోమీటర్ల ప్రమాదకరమైన ఘాట్రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన మలుపుల్లో ఘాట్రోడ్డుపై అవగాహన ఉంటే కార్లు నడిపేందుకు ఇబ్బంది లేదు. లేకపోతే ప్రమాదాలను ఆహ్వనించినట్టే. ప్రశాంత వాతావారణంలో సేద తీరేందుకు వస్తూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. 2013లో ఒక టెంపో ఘాట్రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే మొదటి మలుపు తర్వాత కాలి బూడిదైపోయింది. 2018లో కడపకు చెందిన పర్యాటకులు కారులో వస్తుండగా ఘాట్రోడ్డుపై కారులో మంటలు వ్యాపించడంతో కాలిపోయింది. బుధవారం పుంగనూరుకు చెందిన పర్యాటకులు కారులో రాగా కొత్త వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పిన కారు కిందపడి కాలిపోయింది. ఇలాంటి ఘటనలతో పర్యాటకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. అలాగే ఘాట్రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, చెట్ల కొమ్మలు కమ్మేస్తున్నాయి. దీంతో దూరంగా వస్తున్న వాహనాలకు రోడ్డు కనిపించడం లేదు. వేగ నియంత్రణపై పోలీసులు నిబంధనలు అమలు చేస్తూ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కారు దగ్ధంపై విచారణ బి.కొత్తకోట: మండలంలోని హార్సిలీహిల్స్పై బుధవారం సాయంత్రం కారు దగ్ధమైన ఘటనపై గురువారం సీఐ గోపాల్రెడ్డి విచారణ జరిపారు. కొత్త వ్యూపాయింట్ వద్ద వెనుక్కు తిప్పుకునే ప్రయత్నంలో కింద ఉన్న బండపైకి దూసుకెళ్లి కాలిపోయింది. పుంగనూరుకు చెందిన కారు యజమాని, కారులో వచ్చిన డ్రైవర్లను సీఐ విచారించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను సేకరించారు.ప్రధాన సంఘటనలు కర్ణాటక సందర్శకులు తిరుపతి నుంచి కారులో వస్తూ కొండను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. కడపకు చెందిన సందర్శకులు కారు సైలెన్సర్లో మంటలతో దగ్ధమైపోయింది. మదనపల్లెకు చెందిన కారు రోడ్డుపై ఇసుక కారణంగా బోల్తా కొట్టింది. రాత్రివేళ కొండ దిగుతున్న కారు పైప్లైన్ వద్ద చెట్టును ఢీకొనగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 9వ మలుపు వద్ద మదనపల్లెకు చెందిన పర్యాటకుల ఇన్నోవా లోయలోకి పడబోతూ తప్పించుకొంది. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పైప్లైన్ మలుపువద్ద మదనపల్లెకు చెందిన కారు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి వద్ద అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై గాయపడ్డారు. వివేకానంద విగ్రహం వద్ద నిలిపి ఉంచిన క్వాలిస్ కారు దొర్లుకొంటూ లోయలోకిపడి ధ్వంసమైంది. ఇందులో ఎవరూ లేరు. జిడ్డుకృష్ణమూర్తి సర్కిల్ వద్ద కారు నిలిపివుంచినా అది కాటేజీవైపు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఇందులో ఎవరూ లేరు. తొలి ఘాట్మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రివద్ద కర్ణాటక కారు ప్రమాదంలో ఇద్దరు సందర్శకులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి వస్తున్న కారు–ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినా ఎవరికి గాయాలు కాలేదు. రెండోఘాట్ మలుపులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. తిరుమల ఎత్తు ఘాట్వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి లోయలో పడింది. గంగోత్రి–రెండో ఘాట్ మధ్యలో కారు అదుపుతప్పి కొండను ఢీకొంది. -
రేషన్ బియ్యం వ్యాపారి ఆత్మహత్యాయత్నం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని రేషన్ బియ్యం వ్యాపారి బుధవారం రాత్రి విష గులికలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ప్రముఖ టీవీ చానళ్లలో పని చేస్తున్న ముగ్గురు రిపోర్టతో పాటు ఒక హోంగార్డు వేధింపుల కారణంతోనే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు అతను సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. బాధితులు తెలిపిన, సూసైడ్ నోట్లో ఉన్న వివరాల ప్రకారం.. ఎస్పీ సార్.. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్కాలేజీ రోడ్డుకు చెందిన ఎస్ నజీర్బాషా అను నేను నా భార్యాపిల్లల పోషణకోసం రేషన్ బియ్యం వ్యాపారం చేస్తుంటాను. ఇళ్లిళ్లూ తిరిగి ప్రజల సమ్మతితోనే రేషన్ బియ్యం సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ పనిలో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా కేవలం బతుకుదెరువు కోసమే చేస్తున్నాను. అయితే నా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు నరకయాతనకు గురి చేస్తున్నారు. ముగ్గురు మీడియా ప్రతినిధులు, ఒక హోంగార్డుతో కలిసి నన్ను బెదిరించి గతంలో నా వద్ద నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. అయినప్పటికీ వారి కక్కుర్తి తీరలేదు. మళ్లీ ఈ రోజు నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వమని డిమాండు చేశారు. నేను ఇవ్వలేనని చెప్పినందుకు నా అంగడి దగ్గరకు వచ్చారు. నా బియ్యాన్ని అధికారులకు పట్టించి నా పైనే వన్టౌన్ పోలీస్స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసి మానసిక క్షోభకు గురి చేశారు. ఎస్పీ సార్.. ఒక సామాన్య పేదవాడిగా ఈ వేధింపులు భరించడం నా వల్ల కావడం లేదు. నాకు చావే శరణ్యం అనిపిస్తుంది. నేను చనిపోతే నా భార్య బిడ్డల పరిస్థితి ఏమిటో అని భయంగా ఉంది. మీడియా ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముగ్గురు రిపోర్టర్లు, వారికి సహకరిస్తున్న హోంగార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను. నేను మరణించేది ఎలాగో ఖాయం. కానీ నేను మరణించిన తర్వాత నా కుటుంబానికి నా భార్య పిల్లలకు న్యాయం జరగాలని కోరుతున్నాను.. అని నజీర్బాషా సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నజీర్బాషా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్రోటోకాల్ విస్మరణ
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నక్కలదిన్నె రోడ్డులో నూతనంగా రూ.3కోట్లతో నిర్మించిన భవనాల్లోకి మారుస్తూ గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమమా లేక టీడీపీ కార్యక్రమమా అనే విధంగా శిలాఫలకంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు టీడీపీకి చెందిన వ్యక్తుల పేర్లను అనధికారికంగా పొందుపరిచారు. సంబంధిత శాఖకు చెందిన లేదా మండల అభివృద్ధి సంబంధిత అధికారులు, పాఠశాల భవనాల నిర్మాణాలకు చెందిన అధికారులచే ప్రోటోకాల్ నిబంధనల మేరకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలాంటి శిలాఫలకంలోనే టీడీపీకి చెందిన వారి పేర్లు నిండి ఉన్నాయి. మండల, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కంటే ముందుగానే టీడీపీకి చెందిన ప్రోటోకాల్కు సంబంధం లేని వారి పేర్లను పొందుపరిచారు. ఇలాంటి శిలాఫలకాన్ని సాక్షుత్తు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించి స్కూల్ భవనాలను ప్రారంభించడం గమనార్హం. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసరం ఉందని స్థానిక టీడీపీ నాయకులతోపాటు ఇతర పార్టీకి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వర్తించని ఈ శిలాఫలకాన్ని తొలగించి నిబంధనల మేరకు మళ్లీ కొత్తది ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సూచించారు. ఈయన మాటలు అమలు అవుతాయా లేదా అన్నది వేచి చూడాలి. ప్రభుత్వాలు ఏవైనా ప్రోటోకాల్ పాటించాల్సిందే ఏ పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో నూతనంగా పాఠశాల భవనాన్ని ఏర్పాటు కావడం, దీనికోసం స్థలాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాల భవనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రవిశంకర్, వంశీకృష్ణ, హెచ్ఎం వెంకటలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, కేసీ కెనాల్ పీసీ వైస్ చైర్మన్ గురివిరెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ రవీంద్ర, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ ఆదిలక్ష్మి, టీడీపీ నాయకులు వేమారెడ్డి, అక్బర్, బయపురెడ్డి, బి.రవి, సలీం, సుబ్బరాయుడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ కార్యక్రమమా.. టీడీపీ కార్యక్రమమా అనేలా హైస్కూల్ ప్రారంభం -
అరటిపై అగ్నివర్షం
ఒకవైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఎగుమతులపై యుద్ధం సెగ! ఉమ్మడి కడప జిల్లాలోని అరటి, మామిడి రైతుల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. హోలీ పండుగ వేళ మార్కెట్లు కళకళలాడాల్సిన తరుణంలో, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు జిల్లా ఉద్యానవన పంటలను నిట్టనిలువునా ముంచేశాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వందలాది టన్నుల అరటి నిల్వలు పోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి. దిగుమతిదారులు వెనకంజ వేయడం, ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గించేయడంతో రైతు కళ్ళల్లో కన్నీరు సుడిగుండంలా మారుతోంది. రాజంపేట: అంతర్జాతీయ పరిణామాలు ఉమ్మడి కడప జిల్లాలోని ఉద్యానవన రైతుల పాలిట శాపంగా మారాయి. పశ్చిమాసియా (ఇరాన్ – ఇజ్రాయెల్) మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు జిల్లాలోని అరటి, మామిడి ఎగుమతులను పూర్తిగా స్తంభింపజేశాయి. ఏటా హోలీ పండుగ సీజన్లో ఆశించిన లాభాలు వస్తాయని భావించే రైతులకు, ఈసారి యుద్ధ వాతావరణం తీరని వేదనను మిగిల్చింది. ఎగుమతులు నిలిచిపోవడంతో జిల్లా నుంచి రోజూ జరిగే సుమారు 300 టన్నుల అరటి వ్యాపారం నిలిచిపోయింది. దీనివల్ల నిత్యం రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర రైతులు నష్టపోతున్నారు. ఎగుమతులకు మోక్షం ఏది? జిల్లాలో పండే మేలురకం అరటికాయలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, వేముల, లింగాల మండలాల్లో సుమారు సాగు చేసే ‘జీ–9’ రకం అరటి కువైట్, యూఏఈ, ఇరాన్, యూకే దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి వచ్చి అనంతపురంలో మకాం వేసే వ్యాపారులు హోలీ పండుగకు 10 రోజుల ముందే వెళ్ళిపోవడం, అదే సమయంలో యుద్ధం ముంచుకురావడంతో కొనుగోలుదారులు కరువయ్యారు. పాతాళానికి పడిపోయిన ధరలు కేవలం పది రోజుల క్రితం వరకు టన్ను అరటి ధర రూ. 22,000 నుంచి రూ. 25,000 వరకు పలకగా, యుద్ధ ప్రభావంతో అది ఇప్పుడు రూ. 11,000 కు, కొన్ని చోట్ల రూ. 7,000 – 9,000 కు పడిపోయింది. ప్రస్తుతం రెండో కోత కోయాల్సిన సమయం కావడంతో, కనీసం రూ. 15,000 ధర వస్తేనే పెట్టుబడి అయినా దక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పులివెందులలోని శీతల గిడ్డంగి సామర్థ్యం కేవలం 6,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కావడంతో, దిగుబడిని నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు అడిగిన ధరకే అమ్ముకుంటున్నారు. మామిడి రైతుకూ తప్పని కష్టాలు గత మూడేళ్లుగా కరోనా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురవుతోంది. పూత, కాత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన 70 శాతం పల్ప్ నిల్వలు గోదాముల్లోనే బారల్స్కు పరిమితమయ్యాయి. ఎగుమతులు ఆగిపోవడంతో దిగుబడి మొత్తం ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ వంటి దేశీయ మార్కెట్లకే పరిమితమైంది. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేసి ధరలను ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నారు. సుమారు 20 ప్రధాన ఏజెన్సీల ద్వారా తాడిపత్రి కంటైనర్ల నుండి ముంబై పోర్టుకు చేరిన కాయలు సైతం, షిప్పింగ్ అనుమతులు లేక పోర్టుల్లోనే మూలుగుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతోకుదేలైన ఎగుమతులు జిల్లా నుంచి నిలిచిన 300 టన్నుల లోడ్.. రోజుకు రూ. 3 కోట్ల వ్యాపారం చిన్నాభిన్నం టన్ను రూ. 25 వేల నుంచిరూ.11 వేలకు పతనం గల్ఫ్ దేశాలకు బ్రేక్.. నిల్వ సౌకర్యం లేకమగ్గిపోతున్న ‘జీ–9’ అరటి -
రైతులను ఆదుకోవాలి
‘గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేవారు. యుద్ధం వల్ల ధరలు పడిపోయిన తరుణంలో ప్రభుత్వం దేశీయ మార్కెట్లను బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలి.‘ – సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రైతు విభాగంప్రభుత్వ జోక్యం అత్యవసరం పశ్చిమాసియా యుద్ధం వల్ల జీ–9 అరటి రైతు నట్టేటా మునిగిపోయాడు. ప్రభుత్వాలు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. –వరప్రసాద్రెడ్డి, జాతీయ సృజనాత్మక అవార్డు గ్రహీత, రాజంపేట. -
రేపు జాతీయ లోక్ అదాలత్
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి 08562–258622, 244622 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలోని వ్యవసాయ రైతు ఖాతాలకు శుక్రవారం పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన 1,94.047 మంది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 4 వేల చొప్పున రూ. 77.22 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 2 వేల చొప్పున రూ. 36.08 కోట్లు రైతు ఖాతాలకు నగదు జమ అవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. నేడు కేవీకేలో ప్రత్యక్ష ప్రసారం కడప నగర శివార్లలోని ఊటుకూరు కృష్ణ విజ్ఞా న కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంట లకు 22వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష వీక్షణా కార్యక్రమం జరుగుతుందని కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్ తెలిపారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం టీటీడీ సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ(ఐపీఎస్) పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రాన్ని, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను, అలాగే కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న క్యూలైన్లు, గ్యాలరీల ఏర్పాట్లను, భక్తుల వసతి సదుపాయాలను స్థానిక పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా సంబంధింత అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీజీవో గిరిధర్, ఏవీఎస్వో అంజయ్య, వీఐ దండపాణి, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేడు పట్టాభిషేకం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ (YVU) చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. విద్యార్థి లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పట్టాల పండుగ’ (స్నాతకోత్సవం) శుక్రవారం వైభవంగా జరగనుంది. నాలుగేళ్లుగా (2020–24) పెండింగ్లో ఉన్న 11, 12, 13, 14వ స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించేందుకు వర్సి టీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప– తిరుపతి బైపాస్ రోడ్డులోని డి.ఎస్.ఆర్ పారడైజ్ ఫంక్షన్ హాల్ ఈ చారిత్రక వేడుకకు వేదిక కానుంది. గవర్నర్ రాక విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన స్నాతకోత్సవాలకు ఏ ఒక్క గవర్నర్ కూడా హాజరు కాలేదు. అయితే, ఈసారి రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతుండటం విశేషం. గవర్నర్ రాక దృష్ట్యా పోలీసులు కడప ఎయిర్పోర్ట్ నుండి వేదిక వరకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహించనున్నారు. విద్యార్థులకు సూచనలు – డ్రెస్ కోడ్ సమయం: విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 8:00 గంటల నుండి 9:30 గంటల లోపు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. నిబంధనలు: సభా ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. ఆహ్వాన పత్రం తప్పనిసరి. ఉచిత బస్సు సౌకర్యం విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాల కోసం 7981755635, 9000488637, 8919151738 నంబర్లను సంప్రదించవచ్చు. ఏర్పాట్లను పరిశీలించిన జేసీ నిధి మీనా కడపలోని డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న స్నాతకోత్సవ ఏర్పాట్లను జేసీ నిధి మీనా గురువారం పరిశీలించారు. ఈ వేడుకకు గవర్నర్ హాజరుకానున్నందున, ప్రోటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ భావన, కేఎంసీ కమిషనర్ రాకేష్ పాల్గొన్నారు.విజయవాడలోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్, కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ను యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం కలసి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు.ఈ మెగా స్నాతకోత్సవంలో మొత్తం 12,858 మంది విద్యార్థులు పట్టాలను అందుకోనున్నారు. పీజీ పట్టభద్రులు: 1,194 మంది. డిగ్రీ విద్యార్థులు: 11,664 మంది. డాక్టరేట్లు (PhD): 70 మంది పరిశోధక విద్యార్థులకు. బంగారు పతకాలు: ప్రతిభ కనబరిచిన 176 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. గౌరవ డాక్టరేట్లు: శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన డాక్టర్ కోట హరినారాయణ, డాక్టర్ శేఖర్ సి. మండేలకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. వైవీయూలో చారిత్రక స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం తొలిసారి హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ 12,858 మంది విద్యార్థులకుపట్టాల ప్రధానం.. 176 మందికి బంగారు పతకాలు -
800 మెట్రిక్ టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్: జిల్లాకు బుధవారం 800 మెట్రిక్ టన్నుల యూరియాతోపాటు 60 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. ఇందులో యూరియాకు సంబంధించిన 800 మెట్రిక్ టన్నులలో 500 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 300 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్కు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 60 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పోటాస్కుగాను 60 టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. కడప మండల వ్యవసాయ ఽఅధికారి సురేష్కుమార్రెడ్డి, జేడీఏ కార్యాలయ ఏఓ గోవర్దన్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఘాట్ నుంచే శ్రీకారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని ప్రతి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడి సమాధి ఘాట్ వద్ద నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టేవారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. అభ్యర్థుల ప్రకటనలు....నామినేషన్ పత్రాలు...మొదటి ప్లీనరీ ....ఇలా ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ముందుకు కదిలేవారు. -
నోటిఫికేషన్ రద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ, ప్రాంతీయ బాలసదనం, అక్కాయపల్లె, కొండాయపల్లె ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దయింది. అనివార్య కారణాలతో ఈ రెండు నోటిఫికేషన్లను కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దుచేశామని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14 కాన్వకేషన్లలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల (తేజస్) రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సి. మండేలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎంపిక చేశారన్నారు. ఈనెల 13న జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వారికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తామన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సర కామర్స్ పేపర్–2, సోసి యాలజీ సోసియల్–2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకుగాను 264 మంది గైర్హాజరయ్యారు. ఇందులో భాగంగా జనరల్కు సంబంధించి 2207 మందికిగాను 2083 మంది హాజరుకాగా 124 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషన్కు సంబంధించి 780 మందికిగాను 140 మంది గైర్హాజరయ్యారు. -
రిమ్స్కు రోగం!
కడప అర్బన్: దివంగత నేత వైఎస్సార్ ఆశయాలకు, గత ప్రభుత్వ కృషికి నిలువుటద్దంగా నిలిచిన రిమ్స్ ( GGH) ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నిరాదరణకు గురవుతోంది. కోట్లాది రూపాయలతో సూపర్ స్పె షాలిటీ సౌకర్యాలు కల్పించినా, కనీస మౌలిక సదు పాయాల నిర్వహణలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ’సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో తేటతెల్లమైంది. చక్రాల కుర్చీ లేదు.. స్ట్రెచర్ జాడ లేదు! ఓపి గ్రౌండ్ ఫ్లోర్లోని కీలక విభాగాలైన ఆర్థోపెడిక్, సర్జికల్, ఫిజియోథెరపీ విభాగాలకు వచ్చే రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అటు బయో కెమిస్ట్రీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి అత్యవసర పరీక్షల కోసం వెళ్లే అస్వస్థులైన రోగులకు వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వారి సహాయకులు చేతులపై మోస్తూ తీసుకెళ్లడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. అపరిశుభ్రతకు నిలయాలు సౌకర్యాల లేమి ఒకెత్తయితే, ఉన్న వాటి నిర్వహణ మరో ఎత్తు. ఐపీ విభాగంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బాత్రూంలు అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. దుర్వాసన, అపరిశుభ్రత కారణంగా రోగులు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. చెత్త కుప్పల మధ్యే చికిత్స! ఐపీ విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడవ అంతస్తు వరకు ఎటుచూసినా అపరిశుభ్రతే రాజ్యమేలుతోంది. డస్ట్బిన్ల నుంచి చెత్త బయటకు వచ్చి వార్డుల్లోనే పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సొంత క్లినిక్లకే ప్రాధాన్యత! ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ నిర్వహించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కొందరు వైద్యు లు వాటిని బేఖాతరు చేస్తున్నారు. విధులకు ’డుమ్మా’ కొట్టి, ఆ సమయంలో నగరంలోని తమ సొంత క్లినిక్లలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ కాసులు గడిస్తున్నారు. సీఎం బంధువునంటూ పెత్తనం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిమ్స్ శానిటేషన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న భాస్కర్ నాయుడు అనే వ్యక్తి, తాను ముఖ్యమంత్రికి బంధువునని చెప్పుకుంటూ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల పేరుతో శానిటేషన్ కార్మికులను తొలగించారు. కూటమి ప్రభుత్వంలో జీజీహెచ్ (రిమ్స్)కే రోగం వచ్చింది. సమయానికి వైద్యులు రాక..వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఇక కనీస సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీసం నడవలేని రోగులకు వీల్ఛెయిర్లను సైతం ఇప్పించలేని దుస్థితి ఉంది. ఇక్కడి సౌకర్యాలపై ‘సాక్షి’బృందం చేపట్టిన ‘గ్రౌండ్ రిపోర్ట్’లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ● కడప జీజీహెచ్ (రిమ్స్)లోని అధికారులు వీల్ఛెయిర్లు, స్ట్రెక్చర్ల విషయం ప్రస్తావిస్తే కొరత ఉన్న విషయం వాస్తమమేననీ, మరిన్ని వీల్ఛెయిర్లు, స్ట్రెక్చర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామనీ తెలియజేస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని వివరించారు. ఈ ఫోటోలోని వ్యక్తి పేరు లక్ష్మీనారాయణ. తన కుమారుడు సూర్యనారా యణ మానసిక అనారోగ్యంతో తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురయ్యాడు. బద్వేలు పట్టణం ఆంజనేయ నగర్ లో నివాసముంటు వైద్య సహాయం కోసం రిమ్స్ కు వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో పాటు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ సమస్య కూడా ఉందన్నారు. 100 శాతం వైకల్యం ఉండడంతో రిమ్స్ డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్ కోసం వచ్చానన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు వచ్చామని తమ గోడు ఎవరు వినిపించుకోవడంలేదని తెలియజేశారు. -
ఎంఈఓ, హెచ్ఎంలకు జిల్లాస్థాయి వర్క్షాపు
ప్రారంభించిన డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలకు, ఎస్జీటీ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ టీచర్లకు రెండు రోజుల వర్కుషాపును బుధవారం కడప సీఎస్ఐ కాంపౌండ్లోని డీసీఈబీ హాల్లో నిర్వహించారు.పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్, ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణ కార్యక్రమాన్ని డీసీఈబీ సెక్రటరీ, కోర్సు కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో డీఈఓ షేక్ షంషుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, గణితం కాంపిటెన్సీలలో 3, 6 , 9 తరగతులకు అసెస్మెంట్ ఎలా చేయాలి, విద్యార్థులలో కాంపిటెన్సీలను డెవలప్ చేయడానికి ఏ రకమైన విధానాలను అవలంబించాలను విషయాలను తెలియచేశారు. రిసోర్స్ పర్సన్స్ జయన్న , చంద్రఓబుల రెడ్డి , సురేష్ వర్కుషాపులో పలు అంశాలను వివరించారు. ఈ వర్క్ షాప్ లో జిల్లాకు సంబంధించిన 36 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ఎంఈఓ1 – 2 లు , ఇద్దరు క్లస్టర్ హెడ్ మాస్టర్లు, ఇద్దరు సెకండియర్ టీచర్లు, ఒక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, ఒక స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అందరూ కలిసి మొత్తంగా ఎనిమిది మంది చొప్పున తొలిరోజు శిక్షణకు 285 మంది హాజరయ్యారు. -
నియంతృత్వ ధోరణిని ఎండగడుతూ.. కుట్ర..కుటిల రాజకీయాలను పటాపంచలు చేస్తూ ఆ పార్టీ పురుడుపోసుకుంది.. ఆత్మాభిమానం నినాదంతో.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఆ పార్టీ ఆవిర్భవించింది.. సరిగ్గా పదిహేనేళ్ల కిందట ఇద్దరితో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం.. ఆపై వందలుగా..వేలు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటితో సరిగ్గా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. పార్టీ ఆవిర్భవించిన క్షణం నుంచి .. ఇప్పటివరకు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానేతగా కీర్తి గడించారు. పార్టీని నడపడంలో తిరుగులేని నాయకుడిగా నిలిచారు. చరిత్ర సృష్టించిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణికి విసిగిపోయిన వైఎస్ జగన్ కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే అప్పటి పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ విజయమ్మ కూడా రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. కడప ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఢిల్లీ పీఠం వణికిపోయేలా తీర్పు కట్టబెట్టారు. జిల్లాలోనే వైఎస్ జగన్మోహన్రె డ్డిని కట్టడి చేయా లని కాంగ్రెస్, టీడీపీ పెద్దలు ఏకమయ్యా రు. రాష్ట్రంలోని నాయకులంతా వచ్చి పులివెందుల, కడపలో వాలిపోయారు. మంత్రులు తిష్టవేసి కుట్రలు చేస్తున్నా, ఏమాత్రం బెదరకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడై పోరాడారు. కడప ఎంపీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,678 ఓట్లు మెజార్టీతో అఖండ విజయం సాధించారు. మా చరిత్ర గొప్పదంటూ జబ్బలు చరుచుకుంటూ వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్టు గల్లంతయ్యేలా చేసి దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించారు. బాధ్యతగా నిత్యం ప్రజల్లోనే... 2011 నుంచి ఇప్పటివరకు ప్రజానేతగా, ప్రతిపక్ష నేతగా, ప్రజల ముఖ్యమంత్రిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా అనునిత్యం ప్రజల మధ్యనే గడుపుతున్నారు. హోదా ఏదైనా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి మధ్యనే ఉంటూ ప్రజా హృదయనేతగా గుర్తింపు పొందారు. పాలకుల ప్రజా వ్యతిరేక విదానాలపై ఎప్పటికప్పుడు ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తూనే ముందుకు కదిలారు. ప్రజా సంకల్పం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. కుటుంబానికి కంటే ప్రజలకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు సాధించి రికార్డు సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను కంటిరెప్పలా కాపాడుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించారు. నేరుగా ప్రజలకు లబ్ధిచేకూరేలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు విజయవంతంగా అమలు చేశారు. 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ అనునిత్యం ప్రజల్లో ఉంటూ జననేతగాఎదిగిన పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల గుండెల్లో 2019–24 వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాం చరిత్రలో లిఖింపదగ్గ అధ్యాయంగా గుర్తింపు పొందింది. పేద ప్రజల అభ్యున్నతే ఏకై క లక్ష్యంగా కృషి చేశారు. ప్రతి పథకం మహిళాభ్యుదయం కోసం పథక రచన చేశారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, అమ్మ ఒడి, ఆసరా, నాడు–నేడు, చేదోడు–వాదోడు, గ్రామ సచివాలయం వ్యవస్థ ఇలా అన్ని రకాలుగా ప్రజలకు చేరువయ్యారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రత్యేకంగా నడిపిస్తూ దేశంలోనే రాష్ట్రానికి ప్రత్యేకస్థానం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయాలు, వర్గాలు, ప్రాంతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందించారు. ప్రతి కుటుంబంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రేమాభిమానాలు దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. -
ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రథమ సంవత్సర ఫిజిక్స్ పేపర్–1 పరీక్షకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకు గాను 586 మంది గైర్హాజయ్యారు. ఇందులో భాగంగా జనరల్కు సంబంధించి 13131 మందికి గాను 12741 మంది హాజరు కాగా 390 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్కు సంబంధించి 1210 మందికి గాను 1014 మంది హాజరు కాగా 196 మంది గైర్హాజయారు. ఇలా జనరల్, ఒకేషనల్కు కలిసి మొత్తంగా 14341 మందికి గాను 13755 మంది హాజరు కాగా 586 మంది గైర్హాజరయారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 274 కేసులు నమోదు చేసి, రూ. 56,615 జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, రాంగ్ రూట్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధురాలిపై దాడి.. కేసు నమోదు రాజుపాళెం : మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రణయ్ కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన మాబుచాన్, ఆమె భర్త కరీం ఇరువురు కూలి పనులకు రావడం లేదని రాజుగారి అమిరూన్ కక్ష పెట్టుకున్నాడు. సోమవారం వృద్ధురాలు మాబుచాన్ తలపై అమిరూన్ కట్టెతో కొట్టడంతో ఆమె తలకు రక్తగాయమైంది. దీంతో మాబుచాన్ను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మద్యం బాటిళ్లు స్వాధీనం
కమలాపురం : మండలంలోని కోగటం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 422 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని కమలాపురం సీఐ మోహన్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం రావడంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో తాను కమలాపురం, వల్లూరు ఎస్ఐలు విద్యాసాగర్, శివనాగిరెడ్డి, సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా లేవాక మాధవరెడ్డి వద్ద 205 బాటిళ్లు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. అలాగే మరో వ్యక్తి వద్ద 217 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, అయితే అతను పరారీలో ఉన్నాడన్నారు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాగా ఈ మద్యం సీసాలు కమలాపురం, పోట్లదుర్తి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లోని షాపుల నుంచి తీసుకున్నారని వివరించారు. ఆదివారం ఆ గ్రామంలో దేవర ఉన్నందున అధిక ధరలకు విక్రయించుకోవాలనే ఉద్దేశంతో వారు మద్యం బాటిళ్లను నిల్వ చేశారని సీఐ వివరించారు. కాగా అరెస్ట్ చేసిన మాధవరెడ్డిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్కు తరలించామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ విద్యా సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
కడప సెవెన్రోడ్స్: భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత అని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ డాక్టర్ నిధి మీనా అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు చంద్రమోహన్, చిన్నయ్య, కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని తెలిపారు. శాంతియుత, ఆనంద వాతావరణంలో, ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకుకోవాలని.. శాంతి కమిటీ సంఘం సభ్యులకు సూచించారు. అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పండుగ, ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో మజీద్లు, ఈద్గాలు, దేవాలయాల వద్ద ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రార్థనలు, పూజలు జరిగేలా చూడాలన్నారు. పండుగ, వేడుకల సమయంలో ఆలయాలు, మజీద్ల అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో.. సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను శాంతి కమిటీ సభ్యులు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగ దినాల్లో నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై.. పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జేసీ స్వీకరించారు. జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ నిధి మీనా -
ప్రారంభమైన తాఖ్రాత్లు
కడప సెవెన్రోడ్స్: పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే తాఖ్రాత్ (బడీరాత్ కోసం అన్వేషణ)లు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. చివరి పదిరోజుల్లోని బేసి సంఖ్యలో వచ్చే ఐదు రాత్రుల్లో బడీరాత్ కోసం ముస్లింలు అన్వేషిస్తారు. ఇందులో భాగంగా రాత్రంతా తరావీహ్ నమాజులతో పాటు బయాన్.. దువా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జాగారం చేస్తారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక నమాజులు చేశారు. దువా పఠించారు. పలుచోట్ల మసీదుల్లో సెహరీ అన్నదానం చేశారు. కడప నగరంలోని మస్జిద్ ఏ నకా ష్, బగ్దాదియా మస్జిద్, గుంతబజార్, ఏడురోడ్ల మసీదులతో పాటు ఇతర మసీదుల్లో రాత్రంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈ నెల 12, 14, 16, 18వ తేదీల్లో తాఖ్రాత్ ప్రార్థనలు చేయనున్నారు. -
కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం మధ్యా హ్నం 12.20 గంటల నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. టౌన్ప్లానింగ్ విభాగంలోని సీపీ, ఏసీపీలు, టీపీఓ, టీపీబీఓలు, ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తు లను తనిఖీ చేసి వారి వద్ద అనధికారికంగా ఉన్న సొ మ్మును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఏసీబీ సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ప్లానింగ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బీపీఎస్ కింద భవన యజమానులకు నోటీసులిచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నామని, వాటిని ఫిజికల్గా విచారణ చేసి త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు అనే దానిపై కూడా విచారణ చేస్తున్నామని, ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. లక్షల్లో వసూళ్లు.. వెల్లువెత్తిన విమర్శలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణల పేరిట భవన యజమానులకు నోటీసులిచ్చి, నగదు ముట్టజెప్పిన వారివి తప్ప మిగిలిన వాటిని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సాక్షితోపాటు అన్ని పత్రికల్లో కథనాలు వచ్చినా ఎవరూ లెక్క చేయలేదు. ఇటీవల ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)ను తీసుకురావడంతో అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి బీపీఎస్ కింద రెగ్యులర్ చేస్తామని భవన యజమానులను బెదిరించి, భయపెట్టి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు ప్లానింగ్ సెక్రటరీలు, టీపీబీఓలు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. నగదు లావాదేవీల్లో తేడా రావడంతో నిన్న టౌన్ప్లానింగ్ కార్యాలయంలోనే ఓ ఏసీపీతో కొందరు బిల్డర్లు గొడవ పడినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ మూలం ఇక్కడ జరుగుతున్న అవినీతేనని పలువురు కుండ బద్దలు కొడుతున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న కారు
వాల్మీకిపురం : అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ను ఢీకొన్న సంఘటన మంగళవారం సాయంత్రం మండల పరిధి విఠలం సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. మండలంలోని చింతపర్తి నుంచి వాల్మీకిపురానికి ట్రాక్టర్ వెళ్తుండేది. చైన్నె నుంచి బళ్లారికి కారులో కౌషిక్ వెళ్తున్నాడు. అతివేగంగా కారు నడపడంతో అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండుకు చేరిన మృతుల సంఖ్య
మదనపల్లె టౌన్ : మదనపల్లె పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురం జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలుకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. వలసలపల్లె పంచాయతీ పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శివప్రసాద్(28), అన బావమరిది మోహిత్(6)ను వలసపల్లె కాలనీలో వదిలి రావడానికి బైకులో అర్ధరాత్రి బయలుదేరాడు. స్కూటర్లో వెళ్తుండగా సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మురళి(35) పలమనేరుకు వస్తుండగా రెండు బైకులు జ్యూస్ ప్యాక్టరీ వద్ద ఢీకొన్నాయి. ఈ సంఘటనలో శివప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన కదిరికి చెందిన మురళి, క్రిష్ణాపురానికి చెందిన మోహిత్లను స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించారు. మురళి పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు వచ్చి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మురళి మృతితో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరిందని సీఐ తెలిపారు.. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు మోహిత్కు ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
– రూ.5 లక్షల నెక్లెస్ అప్పగింత కడప అర్బన్ : ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం సిద్దవటం మండలం వంతాటిపల్లి గ్రామానికి చెందిన భూషి విజయకుమారి తన భర్త వెంకటసుబ్బారెడ్డితో కలిసి ఒక బంగారు నెక్లెస్ను కడప టౌన్ బంగారు షాపులో రిపేరు చేయించుకున్నారు. బట్టలు షాపింగ్ చేసుకుని, సదరు బ్యాగును ఏపీ04యూఏ 0779 నెంబర్ గల ఆటోలో మరిచిపోయి విజయ హోటల్ దగ్గర దిగారు. సదరు ఆటో డ్రైవర్ పాత బస్టాండ్ దాటిన తర్వాత బ్యాగును చూసి, బ్యాగును నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించాడు. దీంతో కడప వన్టౌన్ సీఐ చిన్న పెద్దయ్య, సదరు బంగారు నెక్లెస్ను పోగొట్టుకున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. వారిని కనుగొని వారి ఆధార్ కార్డును తనిఖీ చేశారు. 35 గ్రాముల బంగారు నెక్లెస్ను వారికి అందజేయడం జరిగింది. ఆటో డ్రైవర్ నరసింహ రాజాకు సీఐ 500 రూపాయలు నగదును ప్రోత్సహక బహుమతిగా అందజేసి, అభినందించడం జరిగింది. బాధితులు ఒన్టౌన్ సీఐకి, ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
నరాల రామారెడ్డికి ఉగాది విశిష్ట పురస్కారం
ప్రొద్దుటూరు: పట్టణానికి చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ నరాల రామారెడ్డికి మైసూరు తెలుగు సాంస్కృతిక సమితి వారు తెలుగు కోయిల ఉగాది విశిష్ట పురస్కారాన్ని ప్రకటించారు. ఈనెల 19న మైసూరులో పీడీ రెడ్డి భవనంలో మైసూరు తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో అవధాని నరాల రామారెడ్డి పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు సాహితీ వేత్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: కడపలోని పురుషుల ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆడిటోరియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో మెటీరియల్స్, డివైజెస్ పై ఈ నెల 16న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎం.రవి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.ఈ సదస్సును వైవీయూ వీసీ రాజశేఖర్ , విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాస్ రావ్ తదితరులు ప్రారంభిస్తారని తెలిపారు. కన్వీనర్ డా.బి.సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈనెల 17తో ముగియనున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక అఽధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కడప మున్సిపల్ కార్పొరేషన్కు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనాలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ మున్సిపాలిటీలకు ఆయా డివిజన్ల ఆర్డీఓలను, మైదుకూరుకు కడప ఆర్డీఓను, యర్రగుంట్లకు కమలాపురం ఆర్డీఓను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఆరునెలలు లేదా ఎన్నికలు జరిగే వరకూ ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తారు. నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీని మంగళవారం లెక్కించగా రూ.1,98,200 వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించామని పేర్కొన్నారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి మల్లికార్జున, భక్తులు పాల్గొన్నారు. -
అధికారమున సమకూరుచుండు అక్రమాలు
టాస్క్ఫోర్స్: రాజంపేట మండలం మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్ 1066 పరిధిలోని చుండువారిపల్లెలో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం 4 ఎకరాల క్రీడామైదానాన్ని కేటాయించింది. అయితే, ఈ స్థలంపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత చుండు సుధీర్, నిరుపేద గిరిజన బిడ్డల భవిష్యత్తును కాలరాస్తూ ఆ భూమిని దర్జాగా ఆక్రమించారు. అక్కడ ఏకంగా ఫాంహౌస్ నిర్మించి, పండ్ల తోటలు సాగు చేస్తూ సొంత ఆస్తిలా అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి విలువ నాలుగు కోట్ట రూపాయలకు పైగా ఉంది. అంటే రూ. 16 కోట్ల ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతమైంది. కలెక్టర్ ఆదేశాలకే దిక్కులేదు! ఈ కబ్జా వ్యవహారంపై గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారికి పలువురు ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్లు.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రాజంపేట తహశీల్దార్ పీరుమున్నిని ఆదేశించారు. కానీ, సదరు తహశీల్దార్ కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కబ్జాదారుడికి కొ మ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలపై ఉక్కుపాదం.. నేతలకు గులాంగిరీ? తహసీల్దార్ పీరుమున్ని ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా సామాన్యులు సెంటు స్థలంలో తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకుంటే చాలు.. అధికారుల బలగంతో వెళ్లి జులుం ప్రదర్శించే ఆమె, 4 ఎకరాల మైదానాన్ని కబ్జా చేసిన ‘పచ్చ’ నేతపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ అండతోనే... తెలుగుదేశం పార్టీ నాయకుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు చుండు సుధీర్ ముఖ్య అనుచరుడిగా ఉండటం వల్లే క్రీడామైదానం కబ్జాపై కలెక్టర్లకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజ లు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయిల క్రీడామైదానాన్ని కబ్జా చేసినా అధికారులు చర్య లు తీసుకోలేక పోతున్నారంటే రాజంపేటలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు, భూకబ్జాలకు ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు. అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. భావం: పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది. ప్రజాకవి వేమన రాసిన ఈ ప్రముఖ పద్యంలో మూడో పాదాన్ని కాస్త మార్చి... అధికారమున అక్రమాలు సమకూరు‘చుండు’ ధరలోన.. అని నవీకరించాల్సిన అవసరం ఆధునిక సమాజంలో కనిపిస్తోంది. భావం: అధికారబలంతో చేపట్టిన అక్రమాలు అయినా తప్పకుండా సమకూరుతాయి.. గిరిజన విద్యార్థుల కోసం కేటాయించిన ఆటస్థలం కబ్జా రూ. 16 కోట్ల విలువైన4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా స్కూల్ గ్రౌండ్లో టీడీపీ నేత‘చుండు సుధీర్’ ఫాంహౌస్ దర్జా! గిరిజన ఆశ్రమ పాఠశాలకు కేటాయించిన క్రీడామైదానాన్ని టీడీపీకి చెందిన చుండు సుధీర్ కబ్జా చేసిన విషయాన్ని ఇటీవల వైఎస్సార్జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ శ్రీధర్ అయినా కబ్జాదారుడిపై చర్య లు తీసుకొని క్రీడామైదానం కబ్జాదారుడి చెర నుంచి విడిపిస్తారా? లేదా? వేచి చూడాలి. -
పది పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం
● ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి ● పోలీసు స్టేషన్స్కు చేరుతున్న ప్రశ్నపత్రాలు ● ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 16 తేదీ నుంచి ఏప్రిల్ 01 వ తేదీ వరకు 167 పరీక్షా కేంద్రాలలో జరిగే ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 28152 మంది పది పరీక్షలను రాయనున్నారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 167 మంది ఛీప్ సూపరిండెంటెంట్లు, 167 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. సంబంధిత పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు నిర్వహించనున్నారు. ఇన్విజిలేటర్ల నియామకం గందరగోళం పరీక్షల నిర్వహణలో ముఖ్యమైన ఇన్విజిలేటర్ల నియామకం కూడా పూర్తయింది. కాకపోతే ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ నుంచి కాకుండా విజయవాడ కమిషనర్ కార్యాలయం నుంచే డ్యూటీల కేటాయింపు జరిగింది. ఇందులో చీఫ్ సూపరింటెండెంట్లుగా విధులు నిర్వహించాల్సిన గెజిటెడ్ హెడ్మాస్టర్లకు డిపార్ట్మెంట్ అధికారులుగా, జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లకు చీఫ్ సూపరింటెండెంట్లుగా విధుల కేటాయింపులు జరిగాయని సంఘాలు ఆందోళన కూడా చేశాయి. అలాగే ఇంతవరకు కనీసం ఇన్విజిలేషన్ డ్యూటీలు నిర్వహించని వారికి నేరుగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులుగా విధులు కేటాయింపులు జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పది పరీక్షలకు సంబంధించి జిల్లాలో 1600 లకు పైగా ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిసింది. పోలీసు స్టేషన్లకు ప్రశ్నపత్రాలు పది పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 9,10 తేదీలలో జిల్లా కేంద్రమైన కడపకు చేరుకున్నాయి. 9వ తేదీన సెట్–1, 10వ తేదీన సెట్–2 ప్రశ్నపత్రాలు కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్కు చేరుకున్నాయి. అక్కడ నుంచి మండల కేంద్రాలలోని పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల సీఎస్, డీఓలు వాటిని సబ్జెక్టు, తేదీల వారీగా విభజించికుని వాటిని పోలీసు స్టేషన్లలో భద్రపరుస్తారు. రెండు కేటగిరీలుగా పరీక్షా కేంద్రాలు కేటాయింపు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను రెండు కేటగిరిలుగా విభజించారు. ఇందులో ఏ కేటగిరి పరీక్షా కేంద్రాలుగా 101 కాగా బి కేటగిరి పరీక్షా కేంద్రాలుగా 66 కేంద్రాలను కేటాయించారు. మెడికల్ కిట్లు సిద్ధం పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలందేలా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితోపాటు మందులను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎంతోపాటు ఆశా వర్కర్ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులకు సూచనలు ● పరీక్షలు రాసే విద్యార్థులంతా ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి ● ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఆ తరువాత గేట్లు మూసి వేస్తారు. ● విద్యార్థులంతా హాల్ టికెటుపై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లితండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జె క్టులు, పరీక్ష కేద్రంపేరు, చిరునామా సరి చూసుకోవాలి ● తప్పులుంటే ముందుగానే ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలి ● రోల్ నెంబర్ ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తరువాత ఇన్విజిలేటర్ ఇచ్చి బార్ కోడింగ్తో కూడిన ఓఎంఆర్ షీట్ , ప్రశ్నాపత్రం, అన్సర్ బుక్లేట్ అందచేస్తారు. తర్వాత ఓఎంఆర్ షీట్ పూరించే విధానంపై ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా పాటించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయకూడదు ● ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ షీట్పై విద్యార్థి పేరు, పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివి నిర్థారించుకోవాలి -
హామీ ఇచ్చారు.. తర్వాత మర్చిపోయారు
కాశినాయన క్షేత్రంలో కూలగొట్టిన కట్టడాలను తిరిగి నెల రోజుల్లోపల నిర్మిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు. చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – కె. ప్రతాప్ రెడ్డి, వరికుంట్ల గ్రామం, కాశినాయన మండలం కూల్చిన కట్టడాలను పునర్నిర్మించాలి కాశినాయన క్షేత్రంలో కూలగొట్టిన కట్టడాలను ఇచ్చిన హామీ ప్రకారం పునర్నిర్మించాలి. సంఘటన జరిగి ఏడాది పూర్తయినా కూల్చేసిన కట్టడాలను నిర్మించలేదు. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని కట్టడాలను పునర్నిర్మించాలి.–హనుమంతరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్. కాశినాయన మండలం -
● వైఎస్సార్సీపీ పోరుబాట.. దిగొచ్చిన సర్కారు
టైగర్ జోన్ నెపంతో దశాబ్దాల చరిత్ర కలిగిన కాశినాయన ఆశ్రమ భవనాలను, సత్రాలను అటవీశాఖ జేసీబీలతో నేలమట్టం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. సనాతన ధర్మ రక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యవేక్షణలోని అటవీశాఖే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ క్షేత్ర భూములను అటవీ చట్టం నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాసి అండగా నిలిస్తే.. నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విధ్వంసానికి పూనుకుంది. వైఎస్సార్సీపీ పోరుతో దిగొచ్చిన మంత్రి లోకేష్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు చెప్పి, పునర్నిర్మిస్తామని మభ్యపెట్టారు. ఏడాది గడిచినా ఒక్క అడుగు ముందుకు పడకపోగా, భక్తుల సౌకర్యాలను గాలికొదిలేసిన పాలకుల తీరుపై భక్తకోటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: అన్నార్తుల పాలిట అక్షయపాత్ర అయిన కాశినాయన జ్యోతిక్షేత్రంపై కూటమి సర్కారు కక్ష సాధింపునకు దిగింది. ఆధ్యాత్మిక సౌరభంతో విరాజిల్లే ఈ క్షేత్రంపై టైగర్ ఫారెస్టు జోన్ ముసుగులో విరుచుకుపడింది. దశాబ్దాలుగా ఉన్న భవనాలను జేసీబీలతో కూల్చివేసింది. సనాతన ధర్మ రక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యవేక్షణలోని అటవీశాఖే ఈ ఘాతుకానికి సూత్రధారి కావడం గమనార్హం. సిద్ధుడి తపఃఫలం.. భక్తుల నమ్మకం జ్యోతి క్షేత్రంలో పురాతన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. కాశిరెడ్డినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. యోగులు, సిద్ధుల వద్ద దీక్షలు తీసుకున్నారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980 దశకంలో కాశిరెడ్డినాయన జ్యోతిక్షేత్రంలోని పురాతన శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. వందలాది మందికి నిత్య అన్నదానం చేసేలా ఆశ్రమాన్ని నిర్మించి, అన్నార్తుల పాలిట పెన్నిధిగా మార్చారు. 1995లో ఆయన పరమపదించాక ఇది ’కాశినాయన క్షేత్రం’గా భక్తకోటి హృదయాల్లో నిలిచిపోయింది. ఏటా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో గత ఏడాది మార్చిలో ప్రధాన దేవాలయం, సమాధి మినహా దశాబ్దాల చరిత్ర కలిగిన నిర్మాణాలను అటవీశాఖ నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. నాడు అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఈ క్షేత్రం ఉన్నప్పటికీ, గత వైఎస్ జగన్ ప్రభుత్వం భక్తుల ప్రయోజనాలే పరమావధిగా అండగా నిలిచింది. అటవీ చట్టం రాకముందు నుంచే ఇక్కడ ఆలయాలు ఉన్న విషయాన్ని గుర్తించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, క్షేత్ర పరిధిలోని 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు స్వయంగా లేఖ రాశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసి భక్తుల వసతి సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు. నాటి పాలకులు రక్షణ కవచంలా నిలిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనుకాముందు చూడకుండా విధ్వంసానికి పూనుకుంది. గోశాల కూలగొట్టడంతో ఎండలో ఉంటున్న ఆవులు కాశినాయన క్షేత్రంలో ఏడాది క్రితం కూలిగొట్టిన వసతి గృహాల ఫైల్ ఫోటో సత్రాలు: కుమ్మర సత్రం, ఆచారి సత్రం గెస్ట్ హౌస్: శివరంగారెడ్డి అతిథి గృహం గోశాల: గోసంరక్షణ కేంద్రం, పశువుల మేత నిల్వ షెడ్లు ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్సీపీ అప్పట్లో సమరశంఖం పూరించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, అధికార ప్రతినిధి శ్యామల కాశినాయన క్షేత్రాన్ని సందర్శించారు. నిర్మాణాలు పునః నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, లక్షలాది మంది భక్తుల మనోభావాలపై కూటమి సర్కార్ దెబ్బ కొట్టడాన్ని ఎలుగెత్తి నినదించారు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా హిందు సంఘాలు, పలువురు పీఠాధిపతులు కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై నిరశన గళమిప్పడంతో కూటమి సర్కార్ దిగొచ్చింది. క్షమాపణలకే పరిమితమైన లోకేష్! తీవ్ర దుమారం రేగడంతో మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు చెప్పి, సొంత ఖర్చులతో పునర్నిర్మిస్తామని ప్రకటించి మమ అనిపించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం క్షేత్రాన్ని తమ శాఖలో విలీనం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆర్భాటంగాా ప్రకటించారు. తీరా ఏడాది గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కళ్యాణకట్ట రేకుల షెడ్ మాత్రమే మంత్రి నారా లోకేష్ పీఏ పరిశీలించి నిర్మించారని స్థానికులు వాపోతున్నారు. అటు పునర్నిర్మాణం లేదు, ఇటు విలీనం లేదు.. కూటమి పాలకుల తీరు ‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి విధ్వంసక పనులు’ అన్నట్లుగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేలమట్టమైన చారిత్రక కట్టడాలివే జ్యోతిక్షేత్రంలో ఏడాది క్రితం అటవీశాఖ విధ్వంసకాండ నాడు రక్షణగా నిలిచిన జగన్ ప్రభుత్వం.. నేడు జేసీబీలతో నేలమట్టం టైగర్ జోన్ నెపంతో దశాబ్దాల నాటి భవనాల ధ్వంసం పవన్ ఇలాఖాలోసనాతన ధర్మానికి తూట్లు! లోకేష్ ‘ఎక్స్’ క్షమాపణలు..ఆనం హామీలు నీటిమూటలే! వైఎస్సార్సీపీ పోరుతో దిగొచ్చినా..ఏడాదైనా పునర్నిర్మాణం శూన్యం -
ప్రతిష్టాత్మకంగా వైవీయూ కాన్వకేషన్ల నిర్వహణ
● ఈ నెల 13న గవర్నర్ రాక ● వీసీ బెల్లంకొండ రాజశేఖర్ కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగు కాన్వకేషన్లు ఒకేసారి ఈ నెల 13న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయం 11వ (2020–21), 12వ (2021–22), 13వ (2022–23), 14వ (2023–24) కాన్వకేషన్ల నిర్వహణకు వైవీయూ సిద్ధమైందన్నారు. కడపలోని వైవీయూ ఆధ్వర్యంలోని సి.పి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాన్వకేషన్ను విశ్వవిద్యాలయంలో నిర్వహించడానికి అనువైన సమావేశ మందిరం లేదన్నారు. 20 ఏళ్ల విశ్వవిద్యాలయంలో వెయ్యి మంది కూర్చునే ఆడిటోరియం లేక, 300 మంది కూర్చునే సమావేశ మందిరాల్లోనే సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాలుగు కాన్వకేషన్లను ఒకేసారి నిర్వహించాల్సి రావడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రుల సంఖ్య రెండు వేలకు చేరుతుందన్నారు. వారందరి సౌకర్యార్థం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాన్వకేషన్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. విశ్వ విద్యాలయంలో కాన్వకేషన్ను నిర్వహించాలంటే తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి రూ.25 లక్షల ఖర్చు అవుతుందని, దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఆర్థికపరమైన వ్యయం పడుతుందని, దానిని తగ్గించేందుకు సమష్టిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే వచ్చే ఏడాది విశ్వవిద్యాలయంలోనే కాన్వకేషన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో విశ్వవిద్యాలయానికి శాశ్వతమైన సమావేశ మందిరం నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, దాతల సహకారాన్ని కూడా కోరనున్నామన్నారు. 70 మందికి పీహెచ్డీ పట్టాలు ఈ కాన్వకేషన్లో 1,194 పీజీ పట్టభద్రులకు, డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రతిభావంతులకు 176 బంగారు పతకాలు, 70 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు అందజేస్తున్నామన్నారు. నాలుగేళ్లకు కలిపి మరో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నామన్నారు. ఆ ఇద్దరి పేర్లు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి ఆమోదం రాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థుల పట్టాలు అందజేసే మహోన్నత కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కాన్వకేషన్లో ఇన్ ఆప్సెన్షిసియా కింద 11,664 మంది డిగ్రీ విద్యార్థులు డిగ్రీలను అందుకోనున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.ఎస్.వి.కృష్ణారావు, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు ఆచార్య పార్వతి, విశ్వవిద్యాలయ పబ్లిక్ రిలేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పి.సరిత, డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు పాల్గొన్నారు. -
రిమ్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈ నెల 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (55) చికిత్స కోసం వచ్చాడు. కాసేపటికి మృతి చెందాడు. అతని ఆచూకీ కోసం తగిన ఆధారాలతో వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఎర్రగుంట్ల : తన మిత్రుడు ఇచ్చిన పార్టీకి వెళ్లి తిరిగి బైక్లో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మంజులప్రసాద్ (21) అనే యువకుడు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల పట్టణంలోని షాదీఖానా వెనుక వీధిలో నివాసం ఉండే మంజుల వెంకటరమణ కుమారుడు మంజుల ప్రసాద్.. ముద్దనూరులో ఉండే తన మిత్రుడు ఇచ్చిన పార్టీకి సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ విందు ముగించుకుని బైక్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. ఎర్రగుంట్ల పట్టణ సమీపంలోని సుంకులమ్మ గుడి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొందా... లేక ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడా తెలియదు కానీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప–భాకరాపేట రైల్వేగేటు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ (37) మృతి చెందాడు. రైలు కింద శంకర్ పడడంతో త్రీవంగా గాయపడగా, కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మంగళవారం మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. మృతుడిని ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేటకు చెందిన నాగయ్య కుమారుడిగా పోలీసులు గుర్తించారు. -
కలెక్టర్లు కూడా పట్టించుకోకుంటే ఎలా?
గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడలు ఆడుకునేందుకు అధికారులు నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చుండు సుధీర్ దర్జాగా ఆక్రమించుకున్నా గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. కోట్లాది రూపాయిల క్రీడామైదానం ఆక్రమించుకున్నా పట్టించుకోకుంటే ఎలా?. వైఎస్సార్ జిల్లా కలెక్టరయినా చర్యలు తీసుకొని కోట్లాది రూపాయిల ప్రభుత్వ భూమిని కాపడటంతో పాటు ఆ క్రీడామైదానం భూమిని గిరిజన ఆశ్రమ పాఠశాలకు కేటాయించాలి. –గొంటు మణి, వైఎస్సార్ సిపి ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజంపేట -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ముద్దనూరు : స్థానిక ఆర్టీపీపీ రహదారిలో నివసిస్తున్న సగినాలబాషా (60) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మధుసూదన్రెడ్డి సమాచారం మేరకు బాషా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతున్నా ఫలితం లేకపోవడంతో ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం బాషా మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చిన్నారిపై కుక్కల దాడిఎర్రగుంట్ల : ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై ఐదు కుక్కలు దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి ఎర్రగుంట్ల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎర్రగుంట్లలోని క్రాంతినగర్ కాలనీలో నివాసం ఉండే నూర్బాషా, యాస్మీన్ల కుమారుడు జునేత్బాషా (3) ఇంటి ముందు బయట ఉండగా ఒక్కసారిగా ఐదు కుక్కలు వచ్చి దాడి చేశాయి. చిన్నారిని కరవడంతో తీవ్రగాయాలయ్యాయి.బాలుడిని కుక్కలు ఈడ్చుకుంటూ సుమారు 30 అడుగుల దాకా తీసుకెళ్లాయి. చిన్నారి కేకలు విన్న స్థానికులు వచ్చి అదిలించడంతో కుక్కలు పారిపోయాయి. వెంటనే బాలుడిని తల్లిదండ్రులు ప్రోద్దుటూరుకి తరలిచారు. క్రాంతినగర్ కాలనీ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డు ప్రహరీ గోడ పగులకొట్టడంతో అక్కడ నుంచి కుక్కలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జనసేన నేత మహేష్పై ఫిర్యాదుమదనపల్లెటౌన్ : మదనపల్లె జనసేన నేత మహేష్పై మదనపల్లె ఆర్టీసీ కండక్టర్ సహా మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సమ స్యల పరష్కార వేదిక కార్యక్రమం డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి తో కలసి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నిర్వహించారు. పట్టణానికి చెందిన జనసేన రాష్ట్ర ఏఐసీసీ అద్యక్షులు మైఫోర్స్ మహేష్ తన వద్ద రూ.18 లక్షలు డబ్బుతీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న జి.రూప ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసింది. అదే సమయంలో పట్టణానికి చెందిన మరో వ్యక్తి కూడా వచ్చి మహేష్ తనకు రూఫ్ వర్క్ చేయించుకుని సుమారు రూ. 8 లక్షలు డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ కార్యకర్తలు రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు చిన్ని, శివకుమార్లు ఈ సందర్బంగామాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం మినహా నిరుద్యోగులకు చేసిదంటూ ఏమి లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగాఉన్న 2,18,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్చేశారు. సూపర్సిక్స్లో భాగంగా నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. ఉద్యోగాలు రాక పలువురు బలవన్మరణాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది నాటికి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేయకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సునీల్, సహాయ కార్యదర్శి ఎస్కే ఆదిల్, నగర కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షులు పెద్దన్న, జిల్లా మహిళా నాయకురాళ్లు ఫాతిమా, నాగేశ్వరి, స్నేహలత పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు..
ప్రొద్దుటూరు క్రైం : పాపం వారు ఇరువురు వృద్ధులు.. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ వృద్ధులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాకపోవడంతో వారి మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. సంజీవనగర్కు చెందిన అనసూయాదేవి (60)ని ఈ నెల 5న హాస్పిటల్లో చేర్పించగా ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. అలాగే ఓబులేసు (68)ను ఈ నెల 7న జీఈ వార్డులో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతను సోమవారం మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు.చికిత్స పొందుతూ ఇద్దరు వృద్ధులు మృతి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంకు చెందిన సుబ్బరామయ్య (67) మృతి చెందారు. సోమవారం ఉదయం అనంతపురం – చైన్నె జాతీయ రహదారిలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం యండపల్లెవారిపల్లె సమీపంలో రోడ్డు దాటుతుండగా బెంగుళూరు నుంచి అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో గానుగచింత దాసరిగుడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య శంకరమ్మ 7 నెలల కిత్రం ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. -
కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమి కాపాడండి
గోపవరం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతూనే ఉన్నాయని, అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వంత పాడుతున్నారని సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దారు జీవన్చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని గోపవరం రెవెన్యూ పొలం 168/1 సర్వేనెంబరులోని 49 సెంట్ల ప్రభుత్వ భూమిలో వెంటనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, 130, 1633, 1633/1, 1633/2, 1634/1 సత్యా టౌన్షిప్లో ఆక్రమణకు గురైన రెండు లేఅవుట్లలో రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని, వెంటనే ఆ భూములను పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు కోట్ల రూపాయలు పలుకుతుండటంతో ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని, ఇటీవల బదిలీపై వెళ్ళిన తహసీల్దారు సహకారంతోనే ఈ కబ్జాలు జరిగినట్లు ఆరోపించారు. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన కథనాలు ఓ పత్రికలో వరుసగా రావడంతో వెలుగులోకి వచ్చిందని, వెంటనే ఆ భూములను పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దారు 1633, 1634 సర్వేనెంబర్లలోని ప్రభుత్వ భూమిని గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, అనిల్కుమార్, రామరాజు, విజయరావు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న పాలనలో వైద్యరంగానికి స్వర్ణయుగం
రాజంపేట : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైద్యరంగానికి స్వర్ణయుగమని వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి అన్నారు. పులివెందులలో నిర్మితమైన మెడికల్ కాలేజీని సందర్శించి, పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి మెడికల్ కళాశాలలను పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి తీసుకొచ్చారన్నారు. దీనివల్ల అనేక పేద మంది విద్యార్థులు మెడికల్ సీటు కూడా కోల్పోయారన్నారు. అలాగే వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదుకు వెళ్లిపోయారన్నారు. అయితే జగన్మోహన్రెడ్డి మాత్రం ఏపీలో ఉండి, ఎందరో ప్రాణాలను కాపాడేందుకు వైద్యరంగాన్ని మరింతగా బలోపేతం చేశారన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, అపవాదును మూటకట్టుకున్నారన్నారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. ఇప్పుడు వైద్యశాఖలో ఏ ఒక్కరిని కదిలించినా తమకు వైఎస్సార్సీపీ పాలనలో గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో వైద్యరంగం సిబ్బంది అసంతృప్తిలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం నామమాత్రమే అని, అంతా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుదేనన్నారు. నేటి సమాజంలో వైద్యరంగం ప్రాముఖ్యత తెలుసునన్నారు. ఆ రంగాన్ని నేడు నిర్వీర్యంగా మార్చడానికి కారకులు చంద్రబాబే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 156 ఫిర్యాదులు(పిజిఆర్ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప సాయిపేటకు చెందిన దాసరి ఓబుళమ్మ(70) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆమె నేత్రాలను దానం చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు,నేత్ర,రక్త, అవయవదాతల ప్రోత్సాహకులు పల్లవోలు రమణ, డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, వారికి నేత్రదానం గురించి తెలుపగా ఆమె కుమార్తె భాగ్యలక్ష్మి, కుమారుడు అంగీకరించారన్నారు. తర్వాత హైదరాబాద్ కు చెందిన ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు కార్నియాలను సేకరించి ఇద్దరు అంధులకు అమర్చేందుకు పంపించారన్నారు. దీంతో ఇద్దరు అంధులకు చూపు లభించే అవకాశం కలిగిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ మరణానంతరం కూడా మన నేత్రాల ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని తెలిపారు. నేత్రదానం పట్ల అవగాహన పెంపొందించుకుని, మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని వ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య దాసరి ఓబులమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, ఎన్ వెంకట శివ, కేసి బాదులా,్ల జి వేణుగోపాల్, ఎన్ విజయలక్ష్మి, పి చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
హెచ్పీవీ టీకాపై అవగాహన పెంపొందించాలి
కడప సెవెన్రోడ్స్ : హ్యూమన్ పాపిల్లోమవైరస్ (హెచ్పీవీ) టీకా కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిఽధి మీనా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో హెచ్పీవీ టీకా అవగాహన పోస్టర్ను ఇతర అధికారులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హెచ్పీవీ వైరస్ గర్భాశయ ముఖ క్యాన్సర్కు ప్రధాన కారణమన్నారు.ముఖ్యంగా హెచ్పీవీ–16, హెచ్పీవీ–18 రకాలు ఎక్కువ కారణమవుతాయని తెలిపారు.క్యాన్సర్ను ముందస్తుగా నివారించడంలో హెచ్పీవీ టీకా కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కడపలో హెచ్పీవీ టీకా కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతుందని, జిల్లా పరిధిలోని అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీలో ఈ కార్యక్రమం నిర్వహించన్నుట్లు, అర్హులైన బాలికలు ఈ టీకా వేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజ తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రవీణ్ ,జిల్లా లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్ అధికారి డాక్టర్ రవి కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆరీఫుల్లా పాల్గొన్నారు. -
టెన్షన్ వద్దు
● ఒత్తిడిని అధిగమిస్తేనే మంచి మార్కులతో ఉత్తీర్ణత ● పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణమే ప్రధానంరాజంపేట టౌన్ : ప్రతి విద్యార్థి చదువు విషయంలో టెన్షన్, ఒత్తిడికి గురయ్యేది పదోతరగతి పబ్లిక్ పరీక్షల సమయంలోనే అని విద్యావంతులు చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థుల్లోనూ పరీక్షల సమయం దగ్గరపడే కొద్ది ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఈనెల 16వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు వెళ్లేవరకు చాలా మంది విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు తమ పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. అలాగే ప్రతి కుటుంబంలో ఉండే చిన్న, చిన్న కోపతాపాలు, కుటుంబ సభ్యులపై చిరాకుపడటం వంటి వాటికి దూరంగా ఉన్నప్పుడే ఇంటిలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. దీంతో విద్యార్థుల ఆలోచనలు చదువుపైనే ఉంటుందని, పరీక్షలను బాగా రాయగలరని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టెన్త్ కీలక మలుపులాంటిదని, అందువల్ల తల్లిదండ్రులు పరీక్షల సమయంలో తమ పిల్లలతో సరదగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల పాత్ర కీలకం టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభానికి తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలంటే ఈసమయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైంది. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా వారు చూసుకోవాలి. పరీక్షలు పూర్తయినంత వరకు ఇంట్లో చక్కటి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి. – డాక్టర్ బి.పురుషోత్తం, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజంపేటతల్లిదండ్రులు ఇలాంటివి చేయకూడదు ప్రధానంగా పిల్లలపై కోప్పడటం, చిరాకు పడటం చేయకూడదు పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా సున్నితంగా అది తప్పని చెప్పాలి. పదే, పదే చదువుకోమని ఒత్తిడి చేయకూడదు స్లిప్ టెస్ట్ వంటి వాటిల్లో ఇతర పిల్లలకు వచ్చిన మార్కులతో పోల్చి తమ పిల్లలను తక్కువ చేసి మాట్లాడ కూడదు ఫెయిల్ అయితే అనే మాటలతో పిల్లలను దెప్పి పొడవ కూడదు పరీక్షలు పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు కూడా టీవీలకు దూరంగా ఉండాలి. పిల్లల్లో ఆత్మ విశ్వాసం దెబ్బతినకుండా ధైర్యం చెప్పాలి. మంచి మార్కులతో పాస్ అవుతావు అన్న పాజిటివ్ మాటలను పిల్లలకు చెప్పాలి. చదువుకునేందుకు ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి విద్యార్థులు పాటించాల్సినవి పరీక్షల సమయం దగ్గర పడినందున విద్యార్థులు తమ తోటి వారితో పోల్చుకోకుండా ఈ కొన్ని రోజులు సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలి ప్రతి సబ్జెక్టుకు ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి. వెనకబడిన సబ్జెక్టులపై ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని వేకువ జామున చదివితే మంచిది. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వెంటనే చెప్పాలి ఫెయిల్ అవుతామేమో లేక తక్కువ మార్కులు వస్తాయేయో అన్న ఆలోచన పెట్టుకోకూడదు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తామన్న పాజిటివ్ ఆలోచనలతో గడపాలి. ముఖ్యంగా వేళకు ఆహారం తినడం, కంటినిండా నిద్రపోవడం చేయాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం అత్యంత ప్రధానమైనది. ఆహార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతీసుకోవాలి. ఉదయం కొంత సేపు ధ్యానం, యోగా వంటివి చేస్తే ఎంతో మంచిది. ఎండల తీవ్రత ఎక్కువైనందున నూనె పదార్దాలకు దూరంగా ఉండాలి. -
యథేచ్ఛగా భూకబ్జాలు
● వంకలు, వాగులను కూడా వదలని వైనం ● అడ్డుకట్ట వేయని అధికారులుగోపవరం : ఇటీవల కాలంలో భూకబ్జాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వాగు, వంకపోరంబోకులను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ముఖ్యంగా నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే వాగులు, వంకలను కూడా దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఆదిలోనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మండలంలో సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయడంతో బద్వేలు నుంచి పి.పి.కుంట వరకు పట్టా, డీకేటీ భూములు కోట్ల రూపాయలు పలుకుతుండటంతో ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా ప్రభుత్వ స్థలంతో పాటు సమీపంలో ఉన్న వాగులు, వంకలను కూడా కబ్జా చేస్తున్నారు. తాజాగా గోపవరం రెవెన్యూ పొలం 1665 సర్వే నంబరులో పట్టాభూమికి సంబంధించి చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మించుకుంటున్నారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరవకాలువ ఆ మార్గాన వెళుతుంది. ఆ వరవకాలువను కబ్జా చేసేందుకు గతంలో జేసీబీ ద్వారా చదును చేశారు. అయితే అప్పట్లోనే రెవెన్యూ అధికారులు తిరిగి వారి చేతనే వరవకాలువను జేసీబీ ద్వారా తవ్వించారు. అటవీ ప్రాంతం నుంచి ఈ వరవకాలువ ద్వారా వచ్చే నీరంతా దిగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి చేరుకుంటాయి. వరవకాలువను పూడ్చడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు రాకుండా పోతుందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వరవకాలువలో సిమెంటు పైపులు వేసి ఆ స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు తహసీల్దారు జీవన్చంద్రశేఖర్కు సమాచారం ఇవ్వడంతో సంబంధిత వీఆర్ఓను వెళ్లి పరిశీలించాలని తెలిపారు. కానీ రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ వారు పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా బద్వేలు నుంచి పి.పి.కుంటకు వచ్చే జాతీయ రహదారికి ఉన్న కల్వర్టులను కూడా ఆక్రమించి ఏకంగా ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారంటే కబ్జాదారుల నుంచి ముడుపులు అందుతుండువల్లేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు భూ ఆక్రమణ, వంక పోరంబోకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మైదుకూరు : మండలంలోని వనిపెంట వద్ద సోమవారం సెంట్రింగ్ పనులు చేస్తూ విద్యుదాఘాతంతో గారెల్ల విష్ణు (21) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గంజికుంట ఎస్సీ కాలనీకి చెందిన విష్ణు కొద్ది రోజులుగా వనిపెంట వద్ద శ్మశాన వాటికలో గదుల నిర్మాణ పనులకు వెళుతున్నాడు. సోమవారం కాశి అనే మరో యువకుడితో కలిసి గది పైకప్పు కోసం వేసిన సెంట్రింగ్ రేకులను తొలగిస్తుండగా నిచ్చెన జారి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై విష్ణు పడ్డాడు. అతన్ని వెంటనే మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మీనరసమ్మ దంపతులకు వంశీ, విష్ణు ఇద్దరు కుమారులు. వారు చిన్నప్పటి నుంచి గంజికుంటలోని అమ్మమ్మ వద్ద ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. విష్ణు మృతి గురించి తెలియగానే సుంకేసుల నుంచి తల్లిదండ్రులు, గంజికుంట నుంచి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇంటి స్థలం కబ్జా చేస్తున్నారు
మా ఇంటి స్థలాన్ని అధికార పార్టీకి చెందిన గంగవరం సూర్యసుమన్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శివారెడ్డి తదితరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వే నెంబరు 678/బిలో 11 సెంట్ల ఇంటి స్థలం మా తండ్రి పేరిట రిజిష్టర్ అయింది. ఆ స్థలానికి పక్కనున్న మూలే సుబ్బయ్య భార్య, కుమారుడు కలిసి మా స్థలంలో ఐదు సెంట్లు ఇతరులకు విక్రయించారు. కోర్టులో కేసు నడుస్తున్నా జేసీబీతో షెడ్డు తొలగించారు. అలాగే సర్వే నెంబరు 621లోని ఎనిమిది సెంట్ల స్థలం కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. – నత్తడ్ షావలీ, ఖాజీపేట -
‘స్మార్ట్ కిచెన్’ దేశానికే ఆదర్శం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ దేశానికే ఆదర్శమని నీతి అయోగ్ ప్రాంతీయ సదస్సులో నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి గౌరవ్ కత్యార్, సభ్యులు కొనియాడారు. సోమవారం విశాఖపట్నంలో ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం (ఏడీపీ), ఆకాంక్షిత మండలాల కార్యక్రమం (ఏబీపీ)లో భాగంగా దక్షిణ ప్రాంత నీతి ఆయోగ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సమావేశంలో ‘స్మార్ట్ కిచెన్’కార్యక్రమాన్ని ఉత్తమ పద్ధతిగా ప్రదర్శించారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చిన ఆకాంక్షిత జిల్లాలు, మండలాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘స్మార్ట్ కిచెన్’ కార్యక్రమం ద్వారా ఆహార తయారీ వ్యవస్థలో సామర్థ్యం,పరిశుభ్రత, పోషకాహార నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నమూనాను ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేశామ న్నారు. దీని ద్వారా ఆహారనిర్వహణ, పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపారు. ఈ సదస్సులో సభ్యులు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు, మండలాలు విజయవంతమైన పాలన విధానాలు,వినూత్న పరిష్కారాలను పంచుకుని సామాజిక–ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఒక వేదికగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం అమలు చేసిన ‘స్మార్ట్ కిచెన్’కార్యక్రమాన్ని ఇతర జిల్లాలు,రాష్ట్రాల్లో కూడా అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని వారు పేర్కొన్నారు. -
‘డయల్ యువర్ ఎస్ఈ’కి స్పందన
కడప కార్పొరేషన్: కడప నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఈ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఖాజీపేట నివాసి, రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గజ్జల మల్లారెడ్డి రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. పగటి పూట వెలుగుతున్న వీధి దీపాలను ఆపివేయాలని, ఖాజీపేట మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయన్నారు. అలాగే మండలానికి శాశ్వత అసిస్టెంట్ ఇంజనీర్ నియామకం చేపట్టాలని, ఏఈ లేకపోవడం వల్ల పౌర సేవల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. రమణ స్పందిస్తూ వినియోగదారుల ఫిర్యాదులను గమనించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఈ మధుసూదన్, డీఈఈ నాగముని స్వామి, ఏఈ శ్యామ్ పాల్గొన్నారు. -
పరిష్కారం నేలచూపులు !
పింఛన్ ఇవ్వాలని ఓ అవ్వ.. కబ్జాకు గురైన భూమికి కంచె తెంచాలని ఓ తాత రెండు చేతులెత్తి వేడుకుంటారు... ఆదుకోవాలని ఒకరు.. అన్యాయమైపోయామని మరొకరు గోడుగోడుమంటారు.. అధికారుల మనస్సు కరగడం లేదు.. పాలకులకా చిత్తశుద్ధి లేదు.. ఇంకేముంది అవ్వకు పింఛన్ రాదు.. కబ్జా చేసి భూమికేసిన కంచె తెగదు.. పాపం.. బాధితులేమో వారం వారం ఆశగా అక్కడికి వస్తూనే ఉంటారు.. కాళ్లకున్న చెప్పులరిగేలా తిరుగుతూనే ఉంటారు.. ఇదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరు. ముఖ్యంగా భూ బాధితులు ఇచ్చే అర్జీలు కొండల్లా పెరిగి నింగినంటుతున్నా.. పరిష్కారమేమో ‘నేల’చూపులే చూస్తున్నాయ్.. ఉన్నతాధికారుల నోళ్లేమో పరిష్కారం వేగవంతం..నాణ్యవంతమంటూ కబుర్లు చెబుతూనే ఉన్నాయ్. ఎప్పట్లాగే ఈ సోమవారమూ భూ బాధితులు కలెక్టరేట్కు తరలివచ్చారు. ఆశగా మరోసారి అర్జీలు అందజేశారు. కడప సెవెన్రోడ్స్ : భూ సమస్యలు గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా పీజీఆర్ఎస్లో భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకించి రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. అర్జీదారులు మళ్లీమళ్లీ రాకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
● ఆరో తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం ● నిరుపేద కుటుంబాల బాలికలకు సదవకాశం ● ఈ నెల 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలు, అనాథ బాలికల చదువుకు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు భోజనం, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరిస్తున్నాయి. బాలికల ఉజ్వల భవిష్యత్తుకు గట్టిపునాది వేస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తోపాటు 7, 8, 9, 10వ తరగతుల ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అధికారుల వివరాల ప్రకారం ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులే అడ్మిషన్ ప్రక్రియలో పరిగణించబడతాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి కొన్ని అర్హత ప్రమాణాలున్నాయి, పేద కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. ఇందులో అనాథలు, బడిబయట ఉన్న పిల్లలు, చదువు మానేసిన డ్రాపౌట్స్ విద్యార్థులు, పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాల బాలికలకు కూడా ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. 6వ తరగతి ప్రవేశానికి అభ్యర్థి తప్పనిసరిగా 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశ కోసం 10వ తరగతి పాస్ కావాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల... రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతిలోపాటు ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీతో గడువు ముగుస్తుంది. జ్ట్టి ఞ:్చ ఞజుజ ఛఠి.్చ ఞఛిజటట.జీ ుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 1.44 లక్షలకు మించి ఉండకూడదు. జిల్లాలో 19 కేజీబీవీలు.. జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో కేజీబీవీలను ఏర్పాటు చేసింది. 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి 19 కేజీబీవీల్లో 1776 సీట్లు భర్తీ కానున్నాయి. జిల్లాలో ఇంటర్ ఉన్న కేజీబీవీల వివరాలు... జిల్లాలో అట్లూరు, చాపాడు, దువ్వూరు, పెద్దముడియం, కలసపాడు, పోరుమామిళ్ల, ఎస్ఏ కాశినాయన, సింహాద్రిపురం, బి.కోడూరు, బిమఠం, చక్రాయపేట, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, వల్లూరు, వేముల, కలసపాడు, జమ్మలమడుగు, సుండుపల్లిలలో కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. -
వాలీబాల్ టోర్నీ విజేత రాజంపేట జట్టు
ద్వితీయ స్థానంలో నిలిచిన బద్వేలు జట్టు ప్రఽథమ స్థానంలో నిలిచిన రాజంపేట జట్టు కడప వైఎస్ఆర్ సర్కిల్: రౌనక్ హుస్సేన్ స్మారక జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను జిల్లా వాలీబాల్ అసోసియేషన్, జిల్లా సీనియర్ వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన టోర్నమెంట్లో రాజంపేట జట్టు విజేతగా నిలిచిందని డీఎస్డీవో గౌస్ బాషా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొన్నాయన్నారు. ఫైనల్ మ్యాచ్లో రాజంపేట జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి రూ.25వేలు నగదు బహుమతి, రన్నరప్గా నిలిచిన బద్వేల్ జట్టు రూ.15 వేలు నగదు బహుమతి, రాయచోటి జట్టు మూడవ స్థానం సాధించి రూ.10 వేలు నగదు బహుమతి గెలుచుకున్నాయన్నారు. విజేత జట్లకు రౌనక్ హుస్సేన్ కుటుంబ సభ్యులు, డీవీఏ కడప కార్యదర్శి ఎన్. ఖాదర్ వల్లి బహుమతులను అందజేశారు. -
ఆర్థికవ్యవస్థపై అవగాహన ముఖ్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్, హాజరైన విద్యార్థులు అధ్యాపకులు కడప ఎడ్యుకేషన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆకలింపు చేసుకోవడంతోపాటు సాంకేతికత తోడుగా చేసుకొని నడిస్తే యువత అద్భుతాలు సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వ్యవస్థాపకులు, డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం, కళాశాల 21వ వార్షికోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ గ్రంథాలయ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నేడు చాలా మంది విద్యార్థులు గ్రూప్స్, సివిల్స్ అనే ఉన్మాదంలో పడి లక్షల రూపాయలతోపాటు సమయాన్ని వృథా చేసుకుంటున్నారని దాని నుంచి బయటకు రావాలని సూచించారు. నిజంగా ప్రజలకు సేవలు అందించాలనే తపన, అసక్తి ఉంటేనే గట్టిగా ప్రయత్నించాలని పేర్కొన్నారు. మీ కళ్ల ముందు అద్భుతాలు జరుగుతున్నాయని.. మీ భవిష్యత్తు అందంగా ఉంటుందని అయితే దానిలో పాలుపంచుకొనే ధైర్యం ముందుచూపు మీకు ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా మారుతోందనే విషయం గుర్తించి అందుకు అనుగుణంగా సంసిద్ధులు కావాలన్నారు. మనకు తెలియని కొత్త కొత్త వృత్తులు మన ముందుకు రాబోతున్నాయని అది రోబోటిక్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదే కాకుండా మరేదైనా ఉండవచ్చన్నారు. నేటి యువత ఒక అద్భుత యుగంలో ఉన్నారని గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకాశాల్లేవన్నారు. యువత సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇరవై ఏళ్ల కిందట కడప నగరాన్ని చూసినపుడు ఒక మామూలుగా ఉండేదని దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వల్ల కడపకు నిధుల వరద పారిందని.. ఇక్కడికి పెట్టుబడులు వచ్చి వేగంగా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. గౌరవ అతిథి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ డా. జయప్రకాష్ నారాయణ్ నడుస్తున్న గ్రంథాలయమని, ఎంతోమందికి ఆయన స్ఫూర్తిప్రదాత అన్నారు. ఇరవై సంవత్సరాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మీరంతా మరో ఇరవై ఏళ్లలో ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ టి.శ్రీనివాన్ కళాశాల ప్రగతి నివేదించారు. ప్రొద్దుటూరు వైవీయూ వైఎస్సార్ ఇంజినీరింగు కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ జి.జయచంద్రారెడద్ది కళాశాల ప్రగతిని వివరించారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పద్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, ఆచార్య చంద్రమతి శంకర్ పాల్గొనగా ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి సభా సమన్వయం చేశారు. డాక్టర్ సునీత ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, స్కాలర్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫౌండేషన్ డే కళాశాల ఉత్సవం సందర్భంగా బోధన బోధ నేతర సిబ్బందికి నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. కొత్త విషయాలను నేర్చుకుని అన్వయించుకునే వారికే అవకాశాలు మహానేత వైఎస్సార్తోనే కడప వేగంగా అభివృద్ధి ఏపీ ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ -
వైవీయూ స్నాతకోత్సవం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోనా !
కడప ఎడ్యుకేషన్: విశ్వవిద్యాలయ చదువులు ముగించుకొని విశ్వవిద్యాలయంలోనే పట్టా పుచ్చుకోవడం విద్యార్థుల కల అని.. ఆ కలను దూరం చేస్తూ స్నాతకోత్సవాన్ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించటం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా వెంకటయ్య పేర్కొన్నారు. ఈ నెల 13న అలంఖాన్ పల్లె బైపాస్ రోడ్డులో ఉన్న డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరగబోతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. ఒక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విశ్వవిద్యాలయంలో కాకుండా ఫంక్షన్ హాల్లో జరపడమేమిటని వెంకటయ్య ప్రశ్నించారు. ఇంతవరకు యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. -
జిల్లాకు యూరియా రాక
కడప అగ్రికల్చర్: జిల్లాకు సోమవారం 1680 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వర్ రావు తెలిపారు. ఇందులో 1030 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 650 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో రైతులెవరు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీఏ కార్యాలయ ఏవో గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. గండికోట బ్యాక్వాటర్లోకి చేప పిల్లలు కొండాపురం: మత్య్సశాఖ ఆధ్వర్యంలో 12.30 లక్షల చేపపిల్లలను సోమవారం గండికోట బ్యాక్వాటర్లో వదిలారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సి. భూపేష్రెడ్డి మాట్లాడుతూ మత్య్సకారులు తప్పకుండా సకాలంలో బీమా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. మత్య్సకారులకు ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో సి.శివనారాయణరెడ్డి మండల కన్వీనర్ నాగేశ్వర్రెడ్డి, శంకర్రెడ్డి చామలు విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముగ్గురు డిబార్ కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సర మాథమాటిక్స్ పేపర్–11బీ సంబంధించి జిల్లావ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకుగాను 396 మంది గైర్హాజయ్యారు. పులివెందుల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డీఈసీ సభ్యులు డిబార్ చేసినట్లు ఆర్ఐవో వెంకటేశ్వర్లు తెలిపారు. -
వైవీయూకు వసంత శోభ!
వైవీయూ ముఖ ద్వారం కడప ఎడ్యుకేషన్: ప్రజాకవి యోగివేమన పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం 21వ వసంతంలోకి అడుగిడుతోంది. 2006లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు విశ్వవిద్యాలయాలను ప్రకటించగా అందులో యోగివేమన విశ్వవిద్యాలయం ఒకటి. ఆ ఏడాదిలోనే మార్చి 9న 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. జిల్లా వాసి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో వైవీయూ శరవేగంగా అభివృద్ధి చెందింది. నేడు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పి.జి. కళాశాల 29 కోర్సులతో, 1,200 మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపక బృందం, 237 మంది పరిశోధక విద్యార్థులతో అలరారుతోంది. అకడమిక్గా పరిశోధనల పరంగా వైవీయూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. విశ్వవిద్యాలయం నిర్వహణలో ప్రొద్దుటూరులో వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల, అనుబంధంగా వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మరో 68 డిగ్రీ కళాశాలు 50 బీఈడీ కళాశాలలు, రెండు పి.జి. కళాశాలలు ఉన్నాయి. తొలుత ఎస్వీయూ అధికారుల పర్యవేక్షణ విశ్వవిద్యాలయం కొంతకాలం ఎస్వీయూ అధికారుల పర్యవేక్షణలో కొనసాగగా వైవీయూ తొలి, మలి వైస్ చాన్స్లర్గా ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి వ్యవహరించారు. రెండవ వైస్ చాన్స్లర్గా ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ 2013 జూలై 15న బాధ్యతల స్వీకరించి 2016 జూలై వరకు బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్ 17న మూడవ వైస్ చాన్సలర్గా ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి 2019 అక్టోబర్ 6 వరకు పనిచేశారు. అనంతరం 2020 జనవరి 9వ తేదీన ఆచార్య మునగాల సూర్యకళావతి వైవీయూ తొలి మహిళా వైస్ చాన్సలర్గా బాధ్యతలు చేపట్టారు. 2023 జనవరి 7వ తేదీ వరకు కొనసాగారు. 2023 మే 11న ఆచార్య చింతా సుధాకర్ బాధ్యతలు తీసుకొని 2024జులై 18వ తేదీ వరకు సేవలందించారు. 2025ఫిబ్రవరి 18న ప్రణతి ప్రకాష్ బాబు వి.సి గా చేరి మార్చి 17న పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా వెళ్లారు. ఆయన స్థానంలో 2025 అక్టోబర్ 8న వీసీగా ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించి పరిపాలన కొనసాగిస్తున్నారు. అభివృద్ధికి అడుగులు ఇలా... యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారించారు. ఆయన హయాంలో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో 2008లో ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. అనంతరం వైవీయూకు 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. ఏ గ్రేడ్..ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లోనూ చోటు.. వైవీయూకు నాక్ ‘ఏ’గ్రేడ్ లభించడంతో అభివృద్ధికి మళ్లీ బీజం పడ్డట్లయింది. యోగివేమన విశ్వవిద్యాలయాన్ని 2023 డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో నాక్ (నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ) బృందం సందర్శించింది. విశ్వవిద్యాలయ అధికారులు చక్కటి ప్రదర్శన కనబరచడంతో ఎ గ్రేడును కేటాయించింది. నిజానికి ఏ ప్లస్ గ్రేడ్ అతి తక్కువ పాయింట్లతో చేజారింది. అలానే గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఇచ్చిన విశ్వవిద్యాలయాల నేషనల్ ఇన్సిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో 51 నుంచి 100లోపు ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక్కడి ప్రొఫెసర్లు ప్రపంచంలోని టాప్ సైంటిస్టుల్లో మొదటి పది మందిలో ఉండడం విశేషం. పలువురు ప్రొఫెసర్లు పేటెంట్లు అందుకోగా మరి కొంతమంది ప్రఖ్యాత సీవీరామన్ ఫెల్లోషిప్లు, యంగ్ సైంటిస్టు అవార్డులు, రామానుజన్ ఫెలోఫిఫ్లు, హంబోల్డ్ ఫెలోిషిప్పులు అందుకున్న వారు కూడా ఉన్నారు. నేడు వైవీయూ వ్యవస్థాపక దిన వేడుకలు అతిథిగా విశ్రాంత ఐఏఎస్,ఫౌండేషన్ ఫర్ రీపామ్స్ వ్యవస్థాపకులుడా. ఎన్ జయప్రకాష్ నారాయణ రాక 2006 మార్చి 9న పీజీ కేంద్రంనుంచి వర్సిటీగా రూపాంతరం వైఎస్సార్ హయాంలో 652 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటు యూనివర్సిటీ అభివృద్ధికి నిధుల వరద పారించిన వైఎస్సార్ -
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి
కడపసెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, సమాచారం తెలుసుకోవడానికి కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: కాకినాడలో ఈ నెల 11న వైయస్సార్సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జోన్ల వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు పాల్గొంటారన్నారు. వైయస్ఆర్సీపీ ఎస్సీ విభాగ నేతలందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం్ఢ్ఢల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా 08562–242457 నంబర్కు కాల్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఒకప్రకటనలో తెలిపింది. కడప కోటిరెడ్డిసర్కిల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి.రాజశేఖర్ను ఎన్నుకున్నారు. ఆదివారం కడప నగరంలో జరిగిన జనరల్ బాడీ ఎన్నికల సమావేశంలో జిల్లా రిజి స్ట్రార్ పీవీఎన్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈయనను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా ఎస్.ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీగా సీహెచ్ విజయ్రాజు, జాయింట్ సెక్రటరీగా ముని వెంకట రత్నం, కోశాధికారిగా ప్రవీణ్, ఈసీ మెంబర్లుగా కె.రమేష్, పి.అరుణకుమారి, పూల సురేంద్ర, జె.భారతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఎస్.అబ్దుల్ సత్తార్, అజీజుల్లా, డీఎం బాషా పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ బ్లాక్లను సక్రమంగా విభజించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్నారు. లే అవుట్ మ్యాప్లను గుర్తించి డీ మార్కేషన్ చేయాలన్నారు. ఆదివారం కలెక్టరేట్ సభా భవనంలో జిల్లా స్థాయి సెన్సస్ నిర్వహణపై ఛార్జి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెన్సస్ జిల్లా ఇన్ఛార్జి మోహన్ రమణ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎన్యుమరేటర్లు లే అవుట్ మ్యాప్ను ఎలా డ్రా చేయాలో, వీధులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఇళ్ల సంఖ్యలను మ్యాప్లో ఎలా సూచించాలో ఆయన వివరించారు. ఎన్యుమరేటర్లు ఉపయోగించే యాప్ పనివిధానం ప్రదర్శన ద్వారా చూపించారు. యాప్లో వివరాలు నమోదు చేసే విధానం,లైవ్ లోకేషన్ ద్వారా ఎన్యుమరేటర్ల పనిని ఎలా ట్రాక్ చేయవచ్చో డెమో నిర్వహించారు. హౌస్ లిస్టింగ్ పూర్తయిన తర్వాత రూపొందించే డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ తయారీ విధానం గురించి కూడా శిక్షణ ఇచ్చారు. -
ఘనంగా మహిళా దినోత్సవం
కడప కార్పొరేషన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ ,నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ,బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మేయర్ పాకా సురేష్కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళా సాధికారత సాధించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదనే అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా నేతలు రత్నకుమారి, కృష్ణవేణి, నారాయణమ్మ, ఉమామహేశ్వరి, సుశీలమ్మ, తులశమ్మ, సునీత ,మల్లీశ్వరి, జ్యోతి ,నాగమణి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు -
విశ్వ విద్యాలయం ప్రగతి దిశగా...
విశ్వ విద్యాలయం ప్రగతి దిశగా పయనిస్తోంది. 20 ఏళ్లలో పాత విశ్వ విద్యాలయలతో పోటీ పడతూ వైవీయూ తన మార్కును చూపుతోంది. నిధుల సమస్యలు ఉన్నప్పటికి వాటిని అధగమిస్తూనే శక్తికి మంచి పనిచేస్తున్నాం. బోధన, పరిశోధనల్లో ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు అందుకున్నాం. 20 ఏళ్ల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆచార్య తుల్లూరు శ్రీనివాస్, ప్రిన్సిపల్, వైవీయూ పీజీ కళాశాల ప్రఖ్యాత సంస్థల్లో .... రానున్న రోజుల్లో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల్లో వైవీయూ విద్యా ర్థులు ఉండాలనేదే మా కల. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించాలనే దిశగా కృషి చేస్తున్నాం. ఎన్ఐఆర్ఎం ర్యాంకుల్లో మొదటి 50 స్థానాల్లో వైవీయూ ఉండేందుకు సమిష్టిగా ముందుకు వెళ్తున్నాం. ఈ 20 ఏళ్ల ఉత్సవంలో నేను ఇక్కడ వీసీగా ఉండటం చాలా సంతోషానిస్తుంది. అందరం కష్టపడుతూ విశ్వ విద్యాలయాన్ని అభివృద్ధి దిశంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. – ఆచార్య. బెల్లంకొండ రాజశేఖర్, వైస్ చాన్సులర్, వైవీయూ -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
– వ్యక్తి మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని విద్యుత్ తీగలు తగలి రామయ్య(37) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ నాగమురళి శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... నిడుజవ్వి గ్రామానికి చెందిన చౌడయ్య నాపరాయి గని నుంచి రామయ్య అనే వ్యక్తి కూలీలను ట్రాక్టర్లలో ఎక్కించుకొని నిడుజవ్వి నుంచి కదిరివారిపల్లెకు బయలు దేరారు. దారి మధ్యలో అదుపు తప్పి ట్రాక్టర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వెంటనే ట్రాలీలో ఉన్న కూలీలను కిందికి దించేశాడు. తర్వాత తాను కిందకు దిగుతుండుగా తీగలు తగలి రామయ్య మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు సంతానం కలరు. మృతుడి అన్న చౌడయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టరు మూలె సుధీర్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఆర్టీపీపీలో భారీగా పెరిగిన బొగ్గు నిల్వలు ఎర్రగుంట్ల : డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు నిల్వలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగానే నిల్వలు ఉన్నాయని ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు శనివారం తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు బొగ్గు వ్యాగున్లు ఆర్టీపీపీకి వస్తున్నాయన్నారు. 2వ యూనిట్ తప్ప మిగిలిన 1,3,4,5,6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరగుతుందన్నారు. 2వ యూనిట్ ఓవర్రాలింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీపీపీలో 1650 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉందన్నారు. బొగ్గు, నీరు సంవృద్ధిగా ఉన్నాయని ఏపీజెన్కో యాజమాన్యం సూచనల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ సిద్దవటం : మాధవరం–1 గ్రామంలో 12వ నంబర్ రోడ్డులో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక చేనేత కార్మికుడు శ్రీరాందాసు చిన్న వెంకటసుబ్బయ్య ఇంట్లో చొరబడిన దుండగులు నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుడు చిన్న వెంకటసుబ్బయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లారు. శనివారం వారు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి షాక్కు గురయ్యారు. బయటి గేటు తాళం వేసినది వేసినట్లు ఉన్నప్పటికీ.. రక్షణ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టారు. బీరువాలో దాచుకున్న రూ.15 వేల నగదు, 150 గ్రాముల వెండి వడ్డాణం అపహరించారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హారిక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఏపీలోనే బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపిక ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికై ందని ప్రధానోపాధ్యాయుడు గురుభాస్కర్రెడ్డి తెలిపారు. భారతదేశంలోనే నంబర్వన్ స్కూల్ సర్చ్ ఫ్లాట్ఫాంగా పని చేస్తున్న ఎడ్యుకనెక్ట్ ఇన్ సంస్థ ఇండియాలోని 15 లక్షల పాఠశాలలు, 2 లక్షల మంది తల్లిదండ్రులను ఎంపిక చేసుకొని ఒక సర్వే నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కడప జిల్లాలోని 4023 పాఠశాలలకు గాను ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికై ందని తెలిపారు. -
వైఎస్ఆర్ జిల్లా
‘ఆమె’ చేతిలోకొస్తే ‘బంతి’గింగిరాలు పోతుంది.. ఆమె జోలికొస్తే ‘చీపురు’ తిరగబడుతుంది.. ఆమె నాడిపట్టి వైద్యం చేస్తుంది.. జననాడి పసిగట్టి ప్రజా సేవలోనూ తరిస్తుంది.. ఎంతకష్టమొచ్చినా.. ఇంటి ‘బరువు’ను బాధ్యతగా మోస్తుంది.. చంటి పాపల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.. ఆటపాటల్లో.. చదువుసంధ్యల్లో.. ‘ఆమె’ ఎప్పుడూ టాపరే.. ఆటో స్టీరింగ్ తిప్పడంలో.. మెట్రో రైలు పరుగులు పెట్టించడంలో.. బతుకుబండిని ముందుకు నడపడంలో... ‘ఆమె’ ఎప్పుడూ పైలెట్టే.. హైలెట్టే.. పల్లె గల్లీల నుంచి.. విను వీధుల దాకా.. దారి ఏదైనా.. ‘ఆమె’ది నిత్యం సాహస ప్రయాణమే... ఆమెలేని లోకం శూన్యం.. ఆమెతోనే ఈ ‘జీవ’నయానం.. ప్రపంచ పయనం..! ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026


