breaking news
YSR District News
-
పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేశామని పేర్కొన్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్ని రకాల ఇరిగేషన్ కాల్వల పనులను, గ్రామీణ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, స్మశానాలకు ప్రహారీలు వంటి నిర్మాణాలను ఉపాధి నిధులతో పూర్తి చేశామన్నారు. అన్ని మండలాల్లో మినీ గోకులం షెడ్లతోపాటు రైతుల డిమాండ్లను బట్టి చిన్నచిన్న జీవాల షెడ్లను కూడా చేపడుతున్నామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అధిక శాతం సబ్సిడీతో అన్ లిమిటెడ్ రుణ సాయం ఇస్తున్నామనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 10వ తేది అన్ని మండలాల్లోని పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గోకులం భవనాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సూర్యఘర్ పథకాన్ని అనుసంధించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిఽధిలోని రైతులకు మినీ గురుకులాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సీజన్ల వారీగా తెగుళ్ల నివారణ, ఎరువులవాడకంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడుతూ సదరమ్ ఎంట్రీలు ఆన్లైన్లో మూడుసార్లు చేస్తే తర్వాత ఎంట్రీలు చేయడానికి సైట్లో అవకాశం ఉండదని, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరారు. సబ్సిడీ గ్యాస్, రేషన్, రేషన్కార్డులలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. డీఆర్సీ సమావేశంలో మంత్రి సవిత -
ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం
ఉభయ వైఎస్సార్ జిల్లాలో కడప తర్వాత ఏర్పాటైంది రాజంపేట ఆర్టీసీ డిపో. ఇది ఏర్పాటై 50ఏళ్లు పూర్తి కానుంది. కేవలం ఏడు బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.గోల్డెన్ జూబ్లీ చేసుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. రాజంపేట: ఉభయ వైఎస్సార్ జిల్లాలో పార్లమెంటరీ కేంద్రమైన రాజంపేటలో ఆర్టీసీ ఆవిర్భావం ఐదు దశాబ్దాలకు చేరుకుంది. 1975 ఆగస్టు 15న డిపో ఏర్పాటుచేయాలని అప్పట్లో సంస్థ నిర్ణయించింది. కడప తర్వాత ఏర్పాటైన తొలి డిపో. ఈ క్రమంలో రాజంపేట–రాయచోటి రోడ్డులోని ఇప్పుడున్న ఎల్ఐసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా కంచె ఏర్పాటుచేసి, అక్కడి నుంచి ఆర్టీసీ సేవలను తాత్కాలికంగా ప్రారంభించారు. కడపకు అప్పటికే ఏర్పాటైన డిపో నుంచి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులను రప్పించారు. ఏడుబస్సులను తొలిసారిగా రొడ్కెక్కించారు.చరిత్ర ఘనంగా ఉన్నా అభివృద్ధి తిరోగమన దిశలో ఉంది. 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ హయాంలో.. మాజీ శాసనసభ్యురాలు కొండూరు ప్రభావతమ్మ ఆధ్వర్యంలో రాజంపేటలో ఆర్టీసీ ఏర్పాటుకు ప్రస్తుతం ఎర్రబల్లి ప్రాంతంలోని ఆరున్నర ఎకరాలకు పైగా ఉన్న స్ధలాన్ని ఎంపిక చేశారు. ఆ స్ధలంలో బస్స్టేషన్, ఆర్టీసీ కార్మికుల క్వార్టర్స్, డిపో గ్యారేజీల నిర్మాణం చేపట్టారు.ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు ఇదే.ప్రస్తుతం ఈ స్థలాలకు కోట్లాది రూపాయల విలువ ఉంది. ఆర్టీసీ బస్టాండు,డిపో పట్టణానికే కేంద్రంగా మారింది. ● డిపో ఏర్పాటు తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరుతో సమానంగా బస్సు సర్వీసులను ఇక్కడి నుంచి నడిపారు. 2011–2012 వరకు 125 బస్సులు ఉండేవి. ఆర్టీసీ కార్మికులతో కళకళలాడింది. సబ్డివిజన్ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేశారు. పల్లెపల్లెకు బస్సులు నడిచేవి. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వచ్చింది. ● మాజీ ముఖ్యమంత్రి జలగంవెంగళరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ హయాంలో చరిత్ర సృష్టించిన డిపో..ఇప్పుడైతే తిరోగమనదిశలో పయనిస్తుందనే విమర్శలున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోయాయి. సగానికిపైగా పల్లెలకు బస్సులు తిరగడంలేదు. ప్రైవేట్ వాహనాల కారణమని ఆర్టీసీ వారు చెబుతున్నారు. ఆర్టీసీకి 40 బస్సులు ఉండగా, అద్దె బస్సులు 30 ఉన్నాయి. ఆర్టీసీ ఆదాయం కూడా ఘననీయంగా పడిపోతూవచ్చింది. పూర్వవైభవం వచ్చేనా... రాజంపేట ఆర్టీసీ డిపో రోజురోజుకు తిరోగమన దిశలో ఉంది. కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు పుణ్యక్షేత్రాలకు డిపోనుంచి డైరెక్ట్ కనెక్టివిటీ సర్వీసులను ఫ్రీక్వెన్సీగా పెంచాలని ఆర్టీసీ వర్గాలవారు అంటున్నారు. నందలూరు ఆర్ఎస్ టు రాజంపేట ఆర్ఎస్ బసు సర్వీసుతోపాటు పల్లె సర్వీసులను పున రుద్ధరించాల్సిన అవసరం ఉంది. బ్యాటరీ బస్సులను ప్రవేశపెడితే రాజంపేట ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు చెబుతున్నారు. వందలాది రూట్లలో బస్సు సర్వీసులు ఉండగా, ఇప్పుడు 37 సర్వీసులకు వచ్చింది. ప్రస్తుతం 343 మంది కార్మికులు ఉన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. 50 ఏళ్ల కిందట వేసి శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. సిల్వర్జూబ్లీ చేసుకుంటున్న క్రమంలో ఆర్టీసీ అభివృద్ధిలో నూతన మార్పులు వస్తాయా? ఆ దిశగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తుందా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఏడు బస్సులతో డిపో ప్రారంభమైంది కేవలం ఏడుబస్సులతో రాజంపేట ఆర్టీసీ డిపో ప్రారంభమైంది. సాతుపల్లెకు ఎదురుగా ఖాళీస్థలంలో తాత్కలికంగా బస్టాండు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బస్సులను నడిపించారు. 1975లో డిపో ఏర్పాటులో పనిచేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. –ఎం.బ్రహ్మయ్య, మాజీ కండక్టరు. రాజంపేట పూర్వవైభవం తీసుకురావాలి కడప తర్వాత రాజంపేటలోనే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలి. ఆ బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకోవాలి. బస్సుస్టేషన్ ఆధునికీకరణతోపాటు కొత్త బస్సులు, అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి. రాజంపేట డిపోకు పూర్వవైభవం కల్పించాలి. –జీవీ నరసయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ -
కదులుతున్న రైలు నుంచి దూకి తల్లీకూతుళ్లకు గాయాలు
జమ్మలమడుగు : ఎక్కాల్సిన రైలుకు బదులు పొరబాటున మరో రైలు ఎక్కిన తల్లీకూతుళ్లు తీరా రైలు కదులుతున్న సమయంలో కిందకు దూకేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో జరిగింది. తల్లీకూతుళ్లయిన మహాలక్ష్మీ, శ్రీదేవి మంగళవారం మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే రైలు కోసం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. అయితే ఇంతలో మరో రైలు రావడంతో అదే ధర్మవరం రైలు అనుకుని అందులో ఎక్కారు. తీరా కదులుతున్న సమయంలో ఇది ధర్మవరం రైలు కాదని మీరు వెళ్లాల్సిన రైలు మరొకటి అని తోటి ప్రయాణికులు చెప్పారు. అప్పటికే రైలు కదిలింది. దీంతో మహాలక్ష్మీ, శ్రీదేవి వేగం పుంజుకుంటున్న రైలులో నుంచి ఒక్కసారిగా దూకేశారు. తల్లి మహాలక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా కుమార్తె శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులు ఏఏస్ఐ సలాం, సుబ్బరాయుడు పరుగున వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
పోలీస్ స్టేషన్ ముట్టడిపై కేసు నమోదుకు సన్నాహాలు
వేంపల్లె : వేంపల్లె పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీరుపల్లెకు చెందిన సుమియా అనే బాలిక అదృశ్యం కావడంతో సోమవారం రాత్రి పక్కీరుపల్లె, బిడ్డాల మిట్ట, కాలేజీ రోడ్డులో ఉన్న పలువురు పోలీస్ స్టేషన్ను ముట్టడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లోని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్పై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు రువ్వారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలిక సుమియా ఆచూకీ తెలిసిందని ఇక వెళ్లాలని నిరసనకారులకు పోలీసులు తెలిపిన వినకుండా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ సీసీ కెమెరాల్లో బంధించిన వీడియోలను చూసి నిరసనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. నిరసన సమయంలో రాత్రి రోడ్లపై తిరిగే మోటార్ బైకులను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మంగళవారం మోటార్ బైకుల కోసం వచ్చిన వారితో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, మోటార్ బైకు వద్ద ఫొటోలు తీసుకొని పంపించి వేశారు. సీసీ కెమెరాల్లో, పోలీసులు తీసిన వీడియోలో మోటార్బైకుదారులుంటే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో వందల మందిపై కేసు నమోదవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కేసు నమోదుపై పోలీసులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలనేది గుర్తించినట్లు తెలుస్తోంది. బాలిక సుమియాకు కడప రిమ్స్లో చికిత్స.. సోమవారం రాత్రి పక్కీరుపల్లెకు చెందిన సుమియా ఆచూకీ తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు మంచినీరు తాపించి కడప రిమ్స్కు పంపించారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్కు ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వెళ్లి చికిత్స పొందుతున్న బాలిక సుమియాను విచారించారు. మంగళవారం ఆ బాలిక కోలుకుని ఆరోగ్యంగా ఉందని సీఐ నరసింహులు తెలిపారు. వివరాలను బాలిక చెబితే తప్ప నిందితులను శిక్షించలేమని చెప్పారు. ఇప్పటికే చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడక బాబు, వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్ అనే అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
కడప అర్బన్ : యువత మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్ఛిన్నం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ’ఈగల్’ టీం ఆధ్వర్యంలో కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ ఏడీ కృష్ణ కిషోర్, రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడారు. సమాజంలో యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. అంతేగాక చిన్నచిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కూలీల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఉండాలన్నారు. అప్పుడే వారు ఉన్నతమైన స్థాయిలో ఉంటారన్నారు. మత్తు పదార్థాల సేవనం వల్ల మానసిక, శారీరక అనారోగ్యంతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు. పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలకు, హత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా యువత కీలకమని, ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సూచించారు. మనమందరం సమష్టిగా మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలన్నారు. కళాశాల సమీపంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధల వద్ద 100 మీటర్ల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా ’ఆపరేషన్ క్యాంపస్ సేఫ్జోన్’ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు అధికారులు తమ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను సందర్శించి 100 మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణా షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధమని షాప్ నిర్వాహకులకు తెలిపారు. విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. మత్తు పదార్థాల వల్ల జీవితం అంధకారం యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వక్తల పిలుపు -
చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి
ముద్దనూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి జారిపడిన బాలిరెడ్డి(54) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెడ్కానిస్టేబుల్ రమేష్ సమాచారం మేరకు ఈనెల 6వతేదీన బాలిరెడ్డి గ్రామంలో పీర్లపండుగ గుండం కాల్చడానికి మొద్దుల కోసం చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడడంతో అతనిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. వెంటనే ప్రొద్దుటూరుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలిరెడ్డి మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. గొర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులువేముల : వేములకు చెందిన చెల్లుబోయిన రమణయ్య గొర్రెలను సోమవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. రమణయ్య గొర్రెల పెంపకమే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం గొర్రెలను మేతకు తీసుకెళ్లిన అనంతరం మండల కార్యాలయం వెనుక వైపు ఉన్న దొడ్డిలో తోలుకున్నాడు. గొర్రెల దొడ్డి వద్ద రమణయ్య తల్లి కాపలా ఉంటూ నిద్రపోయింది. ఇదే అదనుగా అర్థరాత్రి సమయంలో దొంగలు దొడ్డిలోని 20 గొర్రెలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున చూసేసరికి గొర్రెలు లేకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కడప అర్బన్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబాఫకృద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ సేవాసదన్లో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్ల పాత్ర, డ్రెస్ కోడ్, ప్రవర్తన, నీతి ప్రమాణాలు, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తదితర అంశాలను వివరించారు. అలాగే ప్యానల్ న్యాయవాదుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి జరిగిందని జడ్జి తెలిపారు. ప్యానల్ న్యాయవాదులు విధివిధానాలు, సివిల్ కేసులు, విధులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. 36 జీఓ అమలు కోసం అర్ధనగ్న ప్రదర్శన రాయచోటి టౌన్ : జీఓ నంబర్ 36ను అమలు చేయాలని కోరుతూ రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఇంజినీరింగ్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ పని గంటలు పెంచి రూ.15 వేలు వేతనం ఇస్తున్నారని, పారిశుధ్య కార్మికులకు ఇచ్చినట్లుగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి అప్కాస్ కొనసాగించాలని లేదా పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి శంకరయ్య, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామాంజులు, మున్సిపల్ యూనియన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బీవీ రమణ, నరసింహులు, ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్మన్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో తొలి రోజు మంగళవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. కడప, అనంతపురం జట్లు తలపడగా ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 88.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 461 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 138 బంతుల్లో 20 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. టి.సుదర్శన్ చక్కటి లైనప్తో బ్యాటింగ్ ఆడి 109 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. రోహిత్ వర్మ 85 పరుగులు, ఆర్దిత్ రెడ్డి 70 పరుగులు చేయడంతో కడప జట్టు తొలి రోజు భారీ స్కోరు చేసింది. అనంతపురం జట్టులోని నవదీప్ 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కర్నూలు –చిత్తూరు జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 77.4 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 98 పరుగులు, భార్గవ్ 54 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 4 వికెట్లు, ఘణి 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.తొలి రోజు 461 పరుగులు చేసిన కడప జట్టు -
చెత్తలో కాలిన మందులపై విచారణ
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం చెత్తలో కాలిన మందుల వ్యవహారంపై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మరకు కల్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుమన్తో కలసి ఆమె మంగళవారం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలోని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేశారు. ఈ సంఘటనపై విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, ఐదుగురు ఆశా వర్కర్లకు మెమోలు జారీ చేశారు. కాలం చెల్లిన మందుల నిర్వీర్యం కోసం బయోవేస్టేజి నిర్వహణ పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితోపాటు కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కూలిన బీవీఎస్ కాంప్లెక్స్ గోడ
ప్రొద్దుటూరు : స్థానిక బీవీఎస్ థియేటర్ ముందున్న కాంప్లెక్స్గోడ కూలి శ్రీచక్ర ఫర్నీచర్ షాప్పై పడటంతో తీవ్ర నష్టం జరిగింది. గత పది రోజులుగా కాంప్లెక్స్ను బుల్డోజర్ సహాయంతో తొలగిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో పనులు చేపడుతుండగా ఉన్నట్లుండి 50 అడుగుల పొడవు ఉన్న గోడ కూలి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్పై పడింది. దీంతో ఫర్నీచర్ షాప్లోని బీరువాలు, ఫర్నీచర్ సామగ్రి దెబ్బతింది. పొరపాటున పగటి వేలలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మెయిన్రోడ్డుపై ఉన్న మనుషులపై పడి తీవ్ర నష్టం కలిగేది. ముందుగా హెచ్చరించినా ఫలితం లేదు.. గత పది రోజులుగా బీవీఎస్ కాంప్లెక్స్ను తొలగిస్తున్నారని శ్రీచక్ర ఫర్నీచర్ షాప్ యజమాని గాండ్ల నారాయణ స్వామి తెలిపారు. సరైన నిబంధనలను పాటించకపోవడంతో అప్పుడప్పుడు కాంప్లెక్స్కు సంబంధించిన రాళ్లు తమ దుకాణంపై పడేవన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, సోమవారం ఉదయం నేరుగా టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చానన్నారు. పోలీసులు స్వయంగా వచ్చి జాగ్రత్తలు పాటించాలని సూచించారన్నారు. చెప్పా పెట్టకుండా రాత్రివేళ పనులు ప్రారంభించారని, బీవీఎస్ కాంప్లెక్స్కు సంబంధించిన మొత్తం నిర్మాణమంతా తమ షాపువైపు పడటంతో తమకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. షాపులో సుమారు రూ.2కోట్ల మేర ఫర్నీచర్ ఉందని, దాదాపు రూ.30లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వివరించారు. తమకు బీవీఎస్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి పరిశీలించారు. షాప్ యాజమాని నారాయణస్వామితో మాట్లాడారు.ఫర్నీచర్ షాప్పై పడి రూ.30 లక్షల ఆస్తినష్టం -
సిగరెట్ తాగొద్దు అన్నందుకు యువకుడి ఆత్మహత్య
కురబలకోట : సిగరెట్ తాగొద్దు.. యుక్త వయస్సులో ఇదేమిపని అని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మండలంలోని అంగళ్లులో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ వెల్లడించిన వివరాల మేరకు..అంగళ్లు టమాటా మండీల సమీపంలో గుడిసెలు వేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో గోపాలమ్మకు కుమారుడు రెడ్డెప్ప (20) ఒక్కడే కుమారుడు. నాలుగు రోజుల క్రితం గుడిసెల వద్ద ఇతను సిగరెట్ తాగాడు. గమనించిన తల్లి గోపాలమ్మ మందలించింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఒకే మాట..ఒక్క జీవితం.! ఉన్న ఒక్క కుమారుడు అకాల మరణం చెందడంతో పుత్ర శోకంతో తల్లి గోపాలమ్మ తల్లడిల్లిపోతోంది. రేయ్ రెడ్డెప్ప నన్ను క్షమించరా..సిగరెట్ తాగొద్దనడం నా తప్పయ్యింది.. నీ మేలుకోసమే చెప్పా. నువ్వు ఇంతపని చేస్తావనుకోలేదురా..సిగరెట్ తాగొద్దు అనే ఒక్క మాట నీ జీవితాన్నే తీసుకుపోతుందని ఊహించలేకపోయారా..అంటూ ఆ తల్లి బాధతో రోదించడం కలచివేసింది. -
ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది
నాపేరు షేక్ ఆశాబీ. మాది రాజంపేట పట్టణంలోని బాలాజీనగర్. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల పునర్జన్మ పొందాను. ఆపరేషన్కు ఒక్కరూపాయి కూడా ఖర్చు కాలేదు. గుండెకు పెద్ద ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఆరోగ్యశ్రీ పథకమే లేకుంటే నేను గుండెకు పెద్ద ఆపరేషన్ చేయించుకోలేక ఈ పాటికి ఈలోకానికి దూరం అయ్యేదానిని. వైఎస్సార్ ఇప్పుడు లేకపోయినా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాలాంటి పేదోళ్లకు పునర్జన్మ ఇస్తుంది. ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. -
ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం అందించాలి
కడప సెవెన్రోడ్స్ : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచిస్తూ అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ వెంకటపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్,వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు. జేసీ అదితిసింగ్ -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ ( పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం ) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి .అశోక్ కుమార్ -
బాలిక అదృశ్యం
వేంపల్లె : వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీర్పల్లెకు చెందిన సయ్యద్ సుమియా(18) అనే బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన సోమవారం పకీరుపల్లె గ్రామంలో కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు మాబువలీ, రమీజా గొర్రె పిల్లలను మేపుకొని జీవనం సాగించుకునేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సొంత పని ఉండడంతో కుమార్తె సుమియా చింతలమడుగుపల్లె సమీపంలోని బట్లలకోనకు గొర్రెల పిల్లలను మేపుకునేందుకు తీసుకెళ్లింది. సాయంత్రం 5 గంటలైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గుట్టల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ నరసింహులు, పోలీసు సిబ్బందితోపాటు బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టు పక్కల కొండల్లో పరిశీలించినా గొర్రెల పిల్లలు ఉన్నాయి కానీ, బాలిక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం తాగుతూ అదే ప్రాంతంలో చింతలమడుగుపల్లెకు చెందిన ముగ్గురు యువకులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వాట్సాప్ స్టేటస్లో బాలికకు సంబంధించిన వీడియో కనిపించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక కనపడకపోవడంతో పోలీసు స్టేషన్ వద్దకు పక్కీర్పల్లె వద్దకు భారీ సంఖ్యలో వెళ్లారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.పోలీసుల అదుపులో అనుమానిత యువకులు -
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలపాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి అద్దాలను, కుర్చీలను విరగ్గొట్టారు. గొర్రె పిల్లలను మేపుకొనేందుకు వెళ్లిన బాలిక సుమీయ అక్కడ స్పృహ తప్పిపోయి రాత్రి 10:30 గంటలకు గొర్ల మంద వద్దకు చేరుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. డీఎస్పీ మురళి నాయక్ బాలిక దగ్గరకు వెళ్లి మాట్లాడి తల్లిదండ్రులతో సహా కడప రిమ్స్కు తరలించారు. కాగా గ్రామస్తులు మాత్రం బాలికను చూపించాలని పోలీసు స్టేషన్ వద్ద నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి రాయచోటి : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ల సమక్షంలో ఎస్పీ విద్యాసాగర్నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వాయల్పాడులోని లక్కీ బ్రాందీ షాపు మేనేజర్ నవీన్ కుమార్ దగ్గరకు ఈనెల 26వ తేదీన 500 రూపాయల నోటుతో మద్యం కొనేందుకు కాలేషా అనే వ్యక్తి వచ్చాడన్నారు. ఇంతకు ముందు కూడా రెండుసార్లు దొంగ నోట్లు ఇచ్చావని, తిరిగి ఇప్పుడు దొంగ నోటు తెచ్చావని అనగానే కాలేషా పారిపోయాడన్నారు. లక్కీ వైన్ షాప్ మేనేజర్ నవీన్ కుమార్ వెంటనే వాయల్పాడు పోలీస్ స్టేషన్లో సీఐ జె.ప్రసాద్ బాబుకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా చీకటి పడగానే 500 రూపాయల నకిలీ కరెన్సీని మార్చే పనిలో ఉందన్న విషయం పసిగట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నకిలీ కరెన్సీ చలామణిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఈ ముఠా మదనపల్లి– బెంగళూరు ప్రధాన రహదారిలో వాయల్పాడు క్రాస్ వద్ద గల నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నారని వాయల్పాడు సీఐ తమ సిబ్బందితో వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. 10 మంది నిందితుల అరెస్టు.. సామగ్రి స్వాధీనం నకిలీ కరెన్సీ నోట్ల చలామణి నిందితులను చుట్టుముట్టి పట్టుకుని పెద్దమనుషుల సమక్షంలో విచారించగా షేక్ కాలేషా వలీ ద్వారా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిపారు. ఈ ఘటనలో షేక్ కాలేషా వలీ అలియాస్ కలేసా, వీయం ముస్తాక్ అహమద్ అలియాస్ ముత్తు, ఎస్ఎండీ హఫీజ్, భీమసింగ్ పండిట్ రాథోడ్ అలియాస్ భీమసింగ్ రాథోడ్, టి.కుమారస్వామి అలియాస్ కుమార్, షేక్ షఫీక్ అహ్మద్ అలియాస్ షఫీ, నందిమంగళం యెజాజ్ పాషా అలియాస్ యెజాజ్, వీఎం .ఫుర్ఖాన్, షేక్ ఆసిఫ్, షేక్ సుహెల్లు ఉన్నారన్నారు. వీరితో సంబంధమున్న కర్ణాటకకు చెందిన రాథోడ్, కుమార్, బాబు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 735 నకిలీ 500 రూపాయల నోట్లు, ఒక ఎప్సాన్ ఎకో ట్యాంక్ ఎల్3210 ప్రింటర్, టీఎన్పీఎల్ ఏ4 800 జీఎస్ఎం పేపర్ల మూడు పెట్టెలు, ఒక లెనివో ల్యాప్టాప్, 12 సెల్ఫోన్లు, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించబడిన ఆకుపచ్చ రిబ్బన్ స్వాధీనం చేసుకున్నామన్నారు, దొంగనోట్ల చలామణి గురించి ఒప్పుకున్నారని, వీరు ముగ్గురిపై ఇదివరకే కర్ణాటకలో పాత కేసులు ఉన్నాయన్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిందితులు కర్ణాటకతోపాటు అన్నమయ్య జిల్లా వారిగా గుర్తింపు వివరాలు వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
స్వర్ణ కడప సాధనకు శ్రమిద్దాం
కడప సెవెన్రోడ్స్ : స్వర్ణ కడప సాధన కోసం అందరూ సమష్టిగా శ్రమించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–పీ4 ఫౌండేషన్ అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. పీ4 ఫౌండేషన్ ద్వారా బంగారు కుటుంబం–మార్గదర్శి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదలను అన్ని విధాలా ఉన్నత స్థాయికి తీసుకు వచ్చేందుకు ధనికుల సాయం తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని వెల్లడించారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా 15 శాతం అభివృద్ధి రేటును పెంచుకుంటూ పోవాలన్నది లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డితోపాటు జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, సీపీఓ హజరతయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లింగాలలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి లింగాల : పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన లింగాలలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పర్యటించారు. తమకు తల్లికి వందనం అందలేదని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరు కోసం వికలాంగ సర్టిఫికెట్లు అందించలేదంటూ పలువురు మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన హామీలనేకాక మరెన్నో హామీలను నెరవేరుస్తామని చెప్పారు.ఇన్చార్జిమంత్రి సవిత -
వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తలకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం సరిగా చదవకపోవడం, శుభ్రంగా ఉండటం లేదనే కారణంతో ఓ విద్యార్థినికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపిన సంఘటన వివాదాస్పదమైంది. తాజాగా సోమవారం పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డి.జ్యోతి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంటకు చెందిన డి. జ్యోతి 8 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై గురుకుల పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయిని జ్యోతి ప్రిన్సిపాల్ నిర్మల ఛాంబర్లోకి వెళ్లి టీచింగ్ డైరీ (వర్క్ డన్ స్టేట్మెంట్) అందజేశారు. కొద్ది సేపటికి పాఠశాలలోని ఓ గదిలో ఒక్క సారిగా తూలి కింద పడిపోయిన ఆమె అక్కడున్న స్టాఫ్ నర్స్తో తాను నిద్ర మాత్రలు మింగానని చెప్పారు. దాంతో అక్కడి సిబ్బంది, కొందరు ఉపాధ్యాయులు ఆమెకు ఉప్పు కలిపిన నీటిని తాగించారు. అంతలోనే పాఠశాల వద్దకు చేరుకున్న ఉపాధ్యాయురాలు భర్త సుధీర్ ఆటోలో ఆమెను తీసుకుని వనిపెంటలోని ఓ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. తన చావుకు ప్రిన్సిపాల్ నిర్మల వేధింపులే కారణమంటూ ఉపాధ్యాయిని జ్యోతి రాసినట్టుగా సోమవారం సాయంత్రం 4 పేజీల సూసైడ్ నోట్ వెలుగు చూసింది. పాఠశాలలో 8 ఏళ్లుగా తాను ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయిని జ్యోతి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల తెరిచినప్పటి నుండి ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు మూడు నెలల పాప ఉన్నా రోజూ అన్ని క్లాసులకు హాజరై పాఠాలు చెబుతున్నానని పేర్కొన్నారు. స్కూల్ విషయాలను బయటికి చేరవేస్తున్నట్టు తనపై అనుమానంతో ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని రాశారు. మిగతా ఉపాధ్యాయినులను తనతో మాట్లాడకుండా కట్టడి చేశారని ఆరోపించారు. తనకు మెమో ఇవ్వాల్సిందిగా తన స్నేహితులతోనే ప్రిన్సిపాల్ చెప్పారని, ఆ అవమానంతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలపై ఆరోపణలు వచ్చిన ప్రతి సారి అధికారులు ప్రిన్సిపాల్ చెప్పే మాటలు నమ్మి నిజాలు తేల్చకుండానే వెళ్తున్నారని సూసైడ్ నోట్లో ఉపాధ్యాయిని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయిని జ్యోతి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మైదుకూరు అర్బన్ ఎస్ఐ చిరంజీవి, ఎంఈఓ పద్మలత, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్జున్ వేర్వేరుగా పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన సంఘటనపై విచారించారు.మాట్లాడుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మలఉపాధ్యాయిని జ్యోతి ఆత్మహత్యాయత్నంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వి.నిర్మల మాట్లాడుతూ తాను ఉపాధ్యాయిని జ్యోతిని వేధించలేదన్నారు. అందరితోపాటు ఆమె జూన్ నెల టీచింగ్ డైరీ సబ్మిట్ చేయలేదని తెలిపారు. సోమవారం తనకి తానే తన ఛాంబర్లోకి వచ్చి టీచింగ్ డైరీ ఇచ్చారని చెప్పారు. అందులో ఆమె సెలవులో ఉన్న రోజుల్లోనూ, ఆదివారం కూడా పాఠాలు బోధించినట్టు పొందుపరిచారని వివరించారు. దాంతో అలా తప్పుగా ఎందుకు రాశారని అడిగానని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఉపాధ్యాయినులు ఎవరు ఆ విధంగా చేసినా వివరణ కోరడం మామూలుగా జరుగుతుందని పేర్కొన్నారు. తన ఛాంబర్ నుంచి ఉపాధ్యాయిని జ్యోతి వెళ్లిన కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి తాను నిద్ర మాత్రలు మింగానని జ్యోతి మేడమ్ చెబుతున్నారని తనతో అనగా, వెంటనే చికిత్స కోసం తీసుకెళ్లాలని చెప్పానన్నారు. అదే సమయంలో ఆమె భర్త మరికొందరు బయట వ్యక్తులు పాఠశాల వద్దకు వచ్చి ఆమెను ఆటోలో తీసుకెళ్లారని వివరించారు. కాగా ఉపాధ్యాయిని జ్యోతి తన ఛాంబర్ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే కింద పడిపోవడం, అదే సమయంలో ఆమె భర్త పాఠశాల వద్దకు చేరుకోవడం అతని వెనకే ఎలాంటి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు మోటార్ బైక్లపై పాఠశాలలోకి రావడం ఇదంతా ముందుగా వేసుకున్న పథకంగా అనిపిస్తుందన్నారు. పాఠశాలలో జరిగే సంఘటనల వెనుక బయటి వ్యక్తులు ఉన్నారని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గతంలో బయటి వ్యక్తులు పాఠశాలలో ఇష్టారాజ్యాంగా ఉండేవారని, తాను ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టాక అవన్నీ కట్టడి చేశానన్నారు. ఏదో ఒక విధంగా తనను ఇక్కడి నుంచి పంపించాలని సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గంజాయి కేసులో భార్యాభర్తల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరం డీటీసీ సర్కిల్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. రిమ్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లి గ్రామానికి చెందిన చెన్నుబోయిన రాము గతంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో కాకినాడ టౌన్ తుమ్మలపేటకు చెందిన వాసుపిల్లి భారతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వారిద్దరు కడప శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్నారు. ఎలాంటి పనులకు వెళ్లకుండా గంజాయి వ్యాపారం చేసి తక్కువ సమయంలో డబ్బులు బాగా సంపాదించాలని రాము ఆలోచించాడు. తనకు పరిచయమున్న మహేష్ అనే వ్యక్తి నుండి గంజాయి తెచ్చుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. సోమవారం డీటీసీ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో దంపతులు బైక్పై గంజాయి పెట్టుకొని వస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. భార్యాభర్తల నుండి 2.8 కేజీల గంజాయిని మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రాము అనే నిందితుడిపై గతంలో చైన్ స్నాచింగ్ కేసులు కూడా నమోదయ్యాయి.2.8 కేజీల గంజాయితో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం -
ఏడీసెట్ విడుదల చేయపోవడం వెనుక రాజకీయ కుట్ర
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఆర్కిటెక్చర్ అండ్ డిజైనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏడీసెట్) విడుదల చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎదుట ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ఈ యూనివర్సిటీకి సీఓఏ పర్మిషన్ వెంటనే ఇవ్వాలన్నారు. ఏడీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలను తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్కు ఆయన ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గురు సాయి దత్త, నాయకులు ఇబ్రహీం మియా, సాయిఫ్, తదితరులు ఉన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
ఇంటికి రూ.9,150 విద్యుత్ బిల్లు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలులో 7/135 నంబర్ గల ఇంటికి జూలై నెలకు సంబంధించి ఒకే మారు రూ.9,150 బిల్లు రావడంతో ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలకు సంబంధించి 60 యూనిట్లకు రూ.502 బిల్లు వచ్చింది. జూలై నెలకు సంబంధించి ప్రీవియస్ విద్యుత్ రీడింగ్ 536 యూనిట్లుగా, ప్రజంట్ రీడింగ్ 1582 యూనిట్లుగా నమోదు చేశారు. ఈ ప్రకారం రూ.9,150 బిల్లు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. ఇదేమిటి బిల్లు ఇలా వచ్చిందని ఇంటి యజమాని ప్రశ్నించగా, అవన్నీ మాకు తెలియదు.. వచ్చిన బిల్లు ప్రకారం మీరు డబ్బు చెల్లించాల్సిందేనని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
ఫీజు రీయింబర్స్మెంట్తో పేదరికం తగ్గుముఖం
నాపేరు తంబెల దీప్తి. మాది రాజంపేట. మధ్యతరగతి కుటుంబం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల నేను బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం దేశంలో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన యాక్సెన్చర్ కంపెనీలో మంచి ప్యాకెజీతో ఉద్యోగం చేస్తున్నాను. అదే ఫీజురీయింబర్స్మెంట్ పథకం లేకుంటే పేద, మధ్య తరగతికి చెందిన కొన్ని లక్షల మంది ఉన్నత చదువులకు దూరం అయ్యేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. -
రాజన్నను మరవలేను
నా పేరు ఆదెమ్మ, మాది నీరుగట్టువారిపల్లె. చేనేత కార్మికురాలు. నాకు నలుగురు బిడ్డలు. చీరలు నేస్తేనే ఇళ్లు గడుస్తుంది. పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నదే తపన. మహానేత రాజన్న పుణ్య మాని నా పెద్ద కుమార్తె ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది. బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుంది. రెండవ కుమారుడు హేమంత్కుమార్ బీటెక్ పూర్తి చేసి చైన్నెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ కుమార్తె మంజుల బీటెక్ పూర్తి చేసి సాప్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. నాల్గోవాడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వైఎస్సార్ పథకాల వల్లే మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆయన రుణం మరవలేను. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
కడప అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను ఆయన వెల్లడించారు. ● జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న మొత్తం 159 మందిని అరెస్టు చేసి రూ. 2,85,645 నగదు స్వాధీనం చేసుకుని 22 కేసులు నమోదు చేశామన్నారు. 9 మట్కా కేసులు నమోదు చేసి మొత్తం 16 మందిని అరెస్టు చేసి రూ. 50,570 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ● జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశామన్నారు. ● జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతూ ముమ్మర దాడులు నిర్వహించి 986 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 57 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ● జిల్లాలో కోడి పందేల కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి రూ. 5,050 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ● అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి మొత్తం 3 కేసులు నమోదు చేసి 13.24 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ● అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇతర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 112 కు తెలియజేయాలని సూచించారు. -
ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ సర్వీసు మొరాయించడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఆదివారం మధ్యాహ్నం కడప బస్టాండులో జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ బస్సు మొరాయించింది. ఈ క్రమంలో బస్టాండుకు చేరుకున్న ప్రయాణికులు ఎంతసేపటికీ బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్టాండులోని కంట్రోలర్తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బస్సుకు మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆర్టీసీ అధికారులు చేసేది లేక సాయంత్రం 6 గంటలకు ఇంద్ర సర్వీసును బెంగళూరుకు పంపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను సకాలంలో పంపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బస్సు సకాలంలో రాకపోవడంతో వివిధ సమస్యలు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.మూడు గంటలు ఆలస్యంగా బెంగళూరు సర్వీసు -
వ్యక్తి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనిపెంట అంజాద్ఖాన్ గత నెల 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సల్మా ఈనెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నగర శివార్లలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న అంజాద్ఖాన్ ఇటీవలే బదిలీపై బద్వేల్కు వెళ్లారు. అంజాద్ఖాన్ తన కుటుంబ అవసరాల కోసం, అనారోగ్య విషయమై అప్పులు ఎక్కువగా చేశారని అతని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 28న ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని ఆమె తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కడప చిన్నచౌక్ సీఐ సెల్: 9121100520, ఎస్ఐలు 9121100521, 9121100522కుగానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. బహుజన టీచర్స్ యూనియన్ ఆవిర్భావంకడప రూరల్ : బహుజన టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన సంఘం ఆవిర్భావ సమావేశం ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా మేకల శివార్జున, ప్రధాన కార్యదర్శిగా సి.సుదర్శన్ బాబు, కోశాధికారిగా ఏ.రాజబాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎం.గంగరాజు, కె.గంగాధర్, ఎం.శ్రీదేవి, ప్రేమ సాగర్ నిత్య ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడిగా గంగరాజు, కార్యదర్శిగా బేరి మోహన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కట్టా గంగాధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాంటీ రేబీస్ టీకాలు వేయించాలి కడప అగ్రికల్చర్ : జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించి జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప పశుసంవర్థక శాఖ పాలీ క్లినిక్ కార్యాలయంలో ఉచిత రాబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు జూనొసిస్ (జంతు సంక్రమిత) వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 17వేల డోసులు అందుబాటులో ఉన్నాయని పెంపుడు జంతువుల ప్రేమికులందరూ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. అనంతరం ఈ నెల 7 నుంచి 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాల పోస్టర్లను పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ రంగస్వామి, ఇన్చార్జి డీడీ శ్రీనివాసరెడ్డి, ఏడీ డాక్టర్ సుబ్బరాయుడు, ఏడీ డాక్టర్ నేతాజీ, ఏడీ డాక్టర్ మాధవి, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చాంద్ బాషా, పశుసంవర్థక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
పులివెందుల రూరల్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నెల 30వ తేదీన బోనాల హసీనా అనే మహిళను హత్య చేశారన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డిని విచారించామన్నారు. విచారణలో హసీనా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేదని, ఈ నేపథ్యంలో కరుణ కుమారికి డబ్బులు ఇచ్చిందన్నారు. రెండేళ్లవుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాలని కఠినంగా అడగడంతో కరుణకుమారి కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డి గొంతు, చేతుల మీద కత్తితో పొడిచి చంపాడన్నారు. ఈ హత్యకు ప్రోత్సహించిన కరుణ కుమారిపై కూడా కేసు నమోదు చేశామని, ఆమె పరారీలో ఉందని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉల్లిమెల్ల రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ హాజీవలీ, ఎస్ఐ నారాయణలు పోలీస్ సిబ్బందితో కలిసి లిఖిత్ కుమార్రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు 1వ ర్యాంకు
కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 23, 284 కేసులకు పరిష్కారం చూపి, కక్షిదారులకు రూ.34,53,61,148 చెల్లించామని, తద్వారా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా మొదటి ర్యాంకును సాధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ డాక్టర్.సి.యామిని తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో క్రిమినల్ 22, 700 కేసులు, 213 సివిల్ కేసులు, 371 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. కడపలో 4482 కేసులు, ప్రొద్దుటూరులో 2556 కేసులు, రాజంపేటలో 223 కేసులు, రాయచోటిలో 906 కేసులు, బద్వేల్లో 3652 కేసులు, మైదుకూరు కోర్టులో 1329 కేసులు, జమ్మలమడుగులో 3696 కేసులు, సిద్ధవటంలో 461 కేసులు, రైల్వేకోడూరులో 482 కేసులు, పులివెందులలో 1656 కేసులు, నందలూరులో 909 కేసులు, లక్కిరెడ్డిపల్లిలో 2100 కేసులు, కమలాపురంలో 832 కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించారని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని వెల్లడి -
ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో అనంతపురం జట్టు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో ఆదివారం మూడవ రోజు కర్నూలు జట్టుపై అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో 115 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 51.1 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 87 పరుగులు, మహిత్ 37 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్లో రాణించి 5 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్ నాయుడు 3 వికెట్లు తీశారు. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో 486 పరుగులు చేయగా కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 214 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం 63 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 87 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్ రెడ్డి 97 పరుగులు, ఎస్ఎస్ హమీద్ 67, కారుణ్య ప్రసాద్ 52 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, తేజేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.డ్రాగా ముగిసిన నెల్లూరు–చిత్తూరు మ్యాచ్ -
ఉరి వేసుకుని మహిళా రైతు ఆత్మహత్య
చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన మహిళా రైతు కటారు రామాంజనమ్మ(47) శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ చిన్నపెద్దయ్య, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనమ్మ గత కొన్నేళ్లుగా భర్తతో కలసి వ్యవసాయం చేసుకుంటూ, పాడి పశువులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందటంతో పాటు మతిస్థిమితం సరిగా లేని తన కూతురు విషయం గురించి కూడా ఆమె బాధపడేది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వైభవంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శివ,కేశవుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున అన్నమాచార్యుడు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. శివ, కేశవుల వాహనసేవలివే : బ్రహ్మోత్సవాల తొలిరోజున శ్రీ సిద్దేశ్వరస్వామి హంసవాహనంపై, శ్రీ చెన్నకేశవస్వామి శేషవాహనంపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక, నందలూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భరత నాట్యంలో కలికిరి వాసికి బంగారు పతకం కలికిరి : తమిళనాడు రాష్ట్రం సేలంలో ఎస్ఏఎస్ ఈవెంట్స్, కై లాస మానస సరోవర స్కూల్ ఆధ్వర్యంలో నటరాజ నర్తనం ప్రపంచ భరతనాట్య పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ దేశాలతో పాటు, జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి 3వేల మంది ప్రదర్శకులు హాజరై 30 నిమిషాల పాటు ఒకే సారి ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి, నటరాజ స్వామికి నాట్య నీరాజనాన్ని సమర్పించారు. దీంతో ఈవెంట్ ప్రపంచ రికార్డులకెక్కింది. కార్యక్రమానికి జిల్లా నుంచి కలికిరి పట్టణానికి చెందిన షేక్ రియాజుల్లా(పండు) హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళ నటి ప్రియదర్శిని ఈయనకు బంగారు పతకాన్ని అందజేసి అభినందించారు. -
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కొనియాడారు. ఆదివారం జగ్జీవన్రామ్ 39వ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధునిగా, దేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. కార్మిక శాఖామంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జగ్జీవన్ రామ్ అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళి అంతకుముందు మహావీర్ సర్కిల్లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు పులి సునీల్ కుమార్, సంబటూరు ప్రసాద్రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, షేక్ షఫీవుల్లా, రామక్రిష్ణారెడ్డి, సీహెచ్ వినోద్, చెన్నయ్య పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
గండి టెండర్లలో నిబంధనలకు పాతర
చక్రాయపేట : గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించే టెండర్లలో నిబంధనలకు పాతర వేసినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక పూల అలంకరణకు పూలు సరఫరా, చలువ పందిళ్లు, బారికేడ్లు, విద్యుద్దీపాల అలంకరణ అని ఆలయ అధికారులు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రతికల్లో ప్రకటనలు కూడా అలాగే ఇస్తున్నారు. అయితే ప్రత్యేక పూల అలంకరణ అంటే ఆలయానికా లేక మూలవర్లకా అనే వివరాలు పొందు పరచలేదు. దీనికి తోడు మూలవర్లకు ప్రత్యేక అలంకరణ అంటే తోమాలలు ఎన్ని అవసరం, అవి ఎన్ని కిలోల బరువు ఉండాలి, అలంకరణ బిట్లు ఎన్ని కావాలి, వాటి బరువెంత, అలాగే పలు రకాల అల్లిన పూలు ఎన్ని కావాలి.. ఏయే రకాలు కావాలి అని కాని ఆలయంలో అలంకరణకు బంతి పూలు ఎన్ని మూరలు అనో లేక ఎన్ని కిలోలు అని వివరాలు ఉండటం లేదు. అలాగే చలువ పందిళ్లు అంటే అవి ఎన్ని అడుగులు ఎక్కడెక్కడ ఎన్ని వేయాలి అనే విషయాలు ఉండటం లేదు. బారికేడ్లు, విద్యుద్దీపాలు సీరియల్ సెట్లు, ఫోకస్ లైట్లు, డిజిటల్ బోర్డులు కూడా ఎక్కడ వేయాలి ఎన్ని వేయాలి అనే వివరాలు పొందుపరచలేదు. ముందుగానే వివరాలు ఉండక పోవడంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తక్కువ మోతాదులో తెచ్చి వేయడం, చాలక పోతే మరో వారానికి తెప్పించి వేయడం జరుగుతుంది. దీని వల్ల కాంట్రాక్టర్కు మేలు జరుగుతుంది కాని ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేయిస్తూనే ఉన్నప్పటికీ.. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఏటా అధికారులు టెండర్లు వేయిస్తున్నారు. ఏవేవి ఎన్ని అవసరమో ఆ వివరాలు అన్ని కూడా ఆలయ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు పరిశీలిస్తే ఈ దఫా ఏవేవి ఎన్ని అవసరం అనే విషయాలు కచ్చి తంగా తెలుస్తాయి. గతంలో ఏవి ఎక్కడ వేశారో ఇ ప్పుడు అక్కడే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లయ పరిధిలో విస్తీర్ణం తక్కువగానే ఉంది. ఈ విష యం ఆలోచించకనే దేవదాయశాఖ అధికారులు టెండర్లు పిలవడం నిబంధనలను పక్కన పెట్టినట్లేనని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూల విక్రయ హక్కు టెండర్లలో చెప్పేది ఒకటి జరిగేది మరొకటి.. ఏడాది కాలం పాటు పూలు విక్రయించుకునే హక్కు విషయంలో అధికారులు చెప్పేది ఒకటయితే అనంతరం టెండరు దక్కించుకున్న వ్యక్తి చేసేది మరోలా ఉంటోంది. పూల విక్రయం అంటే పూలు, పూల దండలు మాత్రమే విక్రయించాలి. కాని ఇక్కడ వాటిని అసలు విక్రయించరు. తమలపాకులు తెచ్చి వాటిని దండలా కూర్చి దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ దండలకు చివరన పూలతో కుచ్చును కూడా ఏర్పాటు చేయరు. ఈ విషయాన్ని పలువురు భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల సమయంలో తమలపాకుల దండల ఊసే లేకున్నా కాంట్రాక్టర్లు వాటినే విక్రయించడంపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలం టోల్గేట్ల కాంట్రాక్టర్కు వరం ఆలయ పరిధిలోనే గల నూతన కల్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలం టోల్గేట్ల కాంట్రాక్టర్కు వరంలా మారుతోంది. గత శ్రావణ మాసంలో ఈ ఖాళీ స్థలం టోల్గేట్ కాంట్రాక్టరుకు అప్పగించారు. టోల్ గేట్ టెండర్ల సమయంలో ఈ ఖాళీ స్థలం ప్రస్తావనే లేదు. శ్రావణ మాస ఉత్సవాలు వచ్చే సరికి ఈ స్థలాన్ని సదరు కాంట్రాక్టరుకు అప్పగించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు ఒక్కో దుకాణం వద్ద నుంచి 40 నుంచి 50 వేల వరకు బేరం కుదుర్చుకొని అందులోనే 30 నుంచి 40 వరకు దుకాణాలు, హోటళ్లను ఏర్పాటు చేయించారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు, పాలకమండలి స్పందించి టెండర్ల వివరాలు పూలు ఎన్ని కిలోలు, ఏయే రకాలు, బారికేడ్లు ఎన్ని అడుగుల దూరం, చలువ పందిళ్లు ఎన్ని, వాటి విస్తీర్ణం ఎన్ని అడుగులు, బార్ లైట్లు ఎన్ని, ఫోకస్ లైట్లు ఎన్ని అనే వివరాలు పూర్తిగా వివరించి ఆ మేరకు టెండర్లు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. లేకుంటే ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంటున్నారు. రేపు గండిలో టెండర్లు గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల రోజులకు సంబంధించి పూల అలంకరణ కోసం పూలు సరఫరా, విద్యుత్ దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, బారికేడ్ల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. అలాగే దేవస్థానంలో ఏడాది కాలం పాటు పూలు విక్రయించే హక్కు, టోల్ గేట్ల వసూలు, రెండు సంవత్సరాల కాలానికి షాపింగ్ కాంప్లెక్స్లో గదులకు సంబంధిం టెండర్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సరైన మార్గదర్శకాలు లేవంటున్న భక్తులు ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారని ఆందోళన -
బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి వ్యక్తి గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన ఆనంద (45) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని సందిరెడ్డిపల్లె వద్ద కుక్క అడ్డురావడంతో బైక్ అదపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన ఆనంద స్థానికుల సహాయంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చెవి కొరికేశాడురైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ గుండాలేరు వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అహ్మద్ అనే వ్యక్తి మల్లు శ్రీసాయి అనే వ్యక్తి చెవి కొరికేశాడు. అతని చెవి కొంత భాగం తొలగి పోయింది. శనివారం రాత్రి పీర్ల పండుగను పురస్కరించుకొని అందరూ ఒక చోట చేరడంతో పాత కక్షలు మనసులో పెట్టుకొని వాదులాటకు దిగినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బాబు మోసాలను ఎండగడదాం
కడప సెవెన్రోడ్స్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా పాలన అందించారని, 2.0లో మాత్రం చంద్రబాబునాయుడుకు సినిమా చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా అధ్యక్షతన ఆదివారం నగరంలో నిర్వహించిన ఆ పార్టీ కడప నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఒక బుక్ చూపిస్తుంటే వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త ఒక్కో బుక్ చూపిస్తారంటూ హెచ్చరించారు. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో గెలువడం మనకు వద్దని, పార్టీ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుని గెలవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకోవడానికి కార్యకర్తలు కష్టించి పనిచేయాలని కోరారు. హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలపై తొలుత కార్యకర్తలు అవగాహన పెంచుకుని ప్రజలకు వివరించాలన్నారు. బాబు మెడలు వంచైనా సూపర్ సిక్స్ అమలు చేయించాలన్నారు. కార్యకర్తల నిరుత్సాహం వల్లే ఓటమి వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందని నగర మేయర్ కె.సురేష్బాబు విశ్లేషించారు. బూత్ లెవెల్ కమిటీలు బాగా పనిచేసి ఉంటే అంజద్బాషా గెలుపొందేవారని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క డివిజన్ కూడా టీడీపీ గెలుచుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. పీ4 పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని, పీ4 ఆయనతోనే ప్రారంభించాలన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. పటాకులు పేల్చిన సంఘటనలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్రెడ్డిలపై నక్సలైట్లు, తీవ్ర వాదులపై నమోదు చేసే ఆయుధాల కేసు బనాయించడం అక్రమమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం అప్రజాస్వామికమన్నారు. ● కడప పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు ప్రజలకు ఎంతమొత్తం అందజేసింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయాలను కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు సీహెచ్ దీప్తిరెడ్డి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కంచుపాటి బాబు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షఫీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, డాక్టర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, జోనల్ అధ్యక్షుడు ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పులి సునీల్ కుమార్, బంగారు నాగయ్య యాదవ్, జమాల్వలీ, పి. రామ్మోహన్రెడ్డి, డా. సొహైల్, శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో గెలుపు మనదే: అంజద్బాషా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలోనూ వైఎస్సార్సీపీదే గెలుపని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధీమా వ్యక్తం చేశారు. అన్ని డివిజన్లు టీడీపీకి ఏకగ్రీవం అవుతాయంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటున్నారని,కనీసం ఒక్క డివిజన్లో అయినా ఏకగ్రీవం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు షరతులు విధించారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా, బాబు వచ్చాక అందులో ఐదు లక్షలు తొలగించారన్నారు. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్క దానితో సరిపెట్టడం మోసం కాదా? అని ప్రశ్నించారు.క్యూఆర్ కోడ్ విడుదల చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ 2.0లో బాబుకు సినిమా కేసులకు భయపడవద్దు...అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుపి.రవీంద్రనాథ్రెడ్డి -
నేడు వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన హెలీకాప్టర్ ద్వారా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 7.30గంటల నుంచి 8.15గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం అవుతారు. మంగళవారం సాయంత్రం పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్ నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియామకం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, లా కళాశాలల పరిశీలన, పర్యవేక్షణకు కమిటీని నియమిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించకున్నా పరీక్షలు నిర్వహిస్తోందని విద్యార్థి, ప్రజాసంఘాల నుంచి వినతులు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచా ర్య అల్లం శ్రీనివాస రావు మార్గదర్శకం మేరకు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కమిటీ కళాశాలలను సందర్శించి వాస్తవ స్థితిగతులు తెలియజేస్తుందన్నారు. ఆ మేరకు నివేదిక ఆధారంగా కళాశాలలపై తదు పరి చర్యలు ఉంటాయని ఆమె వివరించారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం -
ఘనంగా గంధోత్సవం
కడప సెవెన్రోడ్స్: కడప పెద్దదర్గా ప్రధాన గురువు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గురువు మజార్ వద్ద విశేష ప్రార్థనలు జరిగాయి. ప్రక్క రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దర్గా నిర్వాహకులకు ఆ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గంధోత్సవం సందర్భంగా దర్గా విద్యుత్ దీప కాంతులతో మెరిసింది. హజరత్ పీరుల్లామాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ప్రతి ఏటా మొహర్రం నెల పదోరోజు గంధోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. లంగర్లో భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. -
నకిలీ.. మకిలీ!
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ నియామకాల్లో బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతమంది అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడి, బోగస్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లుగా సమాచారం. వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తే ఇంకెన్ని నకి‘లీలలు’బయట పడుతాయో... వైద్య ఆరోగ్యశాఖకు అంటుకున్న ఈ మకిలీ ఎప్పుడు తొలగిపోతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. 150 పోస్టులకు గాను దాదాపు 11 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కార్యాలయ సిబ్బంది వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను సిద్ధం చేశారు. ఎందుకై నా మంచిదని... దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను సిద్ధం చేశారు. ఎందుకై నా మంచిదని ఆ శాఖ అధికారులు ఎంపికై న సదరు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం అమరావతిలోని పారా మెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పంపారు. ఆ మేరకు బీఎస్సీ నర్సింగ్ కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, జి ఎన్ ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ ను పారా మెడికల్ బోర్డుకు పంపారు. అందులో 27 మంది అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో బోగస్ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ● ఆ 27 మందికి ఆ శాఖ కార్యాలయం నోటీసులు ఇచ్చి, ఒక వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో కొంతమంది అసలు తాము దరఖాస్తే చేయలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. మరి కొందరి ఇంటి చిరునామా తప్పుగా తేలింది. ఇంకొందరు అసలు సమాధానమే ఇవ్వ లేదు. దీంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి, కాగా నిబంధనల ప్రకారం మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మూడేళ్ల చొప్పున జీఎన్ఎం కోర్స్కు 1800, బీఎస్సీ నర్సింగ్కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతో పాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్తో పాటు ఇతర నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.దీంతో అభ్యర్ధులు దొంగ మార్కుల జాబితాను సమర్పించినట్లు సమాచారం. ● గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహరం పెద్ద దుమారమే లేపింది. ఈ వ్యవహరానికి సంబంధించి కొందరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వెలుగు చూస్తున్న బోగస్ సర్టిఫికెట్స్ కూడా వారిపనే అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. వారి పేర్లు తొలగించాం బోగస్ సర్టిఫికెట్స్గా నిర్ధారణ అయిన అభ్యర్ధుల పేర్లను ఎంపిక జాబితా నుంచి తొలగించాం. ఈ అంశాలను ఉన్నతాధికారులకు విన్నవించాం. నిబంధనల ప్రకారం అభ్యర్థు ల ఎంపిక జాబితాను సిద్ధం చేస్తాం.త్వరలోనే కౌన్సెలింగ్ చేపడతాం. – రామగిడ్డయ్య, ఆర్డీ, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో సూచించారు. నేటి నుంచి మంత్రి పర్యటన కడప సెవెన్రోడ్స్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్.సవిత రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సవిత సోమవారం ఉదయం పులివెందులలో స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం లింగాలలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగే విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం కడప నగరంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ బస చేయనున్నారు. 8వ తేది ఉదయం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్లో జరిగే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి రోడ్డు మార్గాన గుంటూరుకు బయలుదేరుతారని పేర్కొన్నారు. హంసవాహనంపై సౌమ్యనాథుడు నందలూరు: ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం పల్లకీసేవ జరిగింది. సౌమ్యనాథుడు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు సునీల్కుమార్, పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు. -
10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10వ తేదీ మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.ఓ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం, ప్రతిభ వంటి అంశాలను తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానిస్తున్నామన్నారు. విద్యార్థులు, టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను అందజేస్తామన్నారు. విద్యార్థులకు రోజూ అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆరోజు తల్లిదండ్రులకు కూడా వడ్డిస్తామని తెలిపారు. తమ తల్లికి నమస్కరిస్తూ ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్కూలు అబివృద్ధి కమిటీలు, పూర్వ విద్యార్థులు కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అధిక బడ్జెట్ కేటాయిస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలిరోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు వంటివి అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం డేటా బేస్లో కేంద్రీయ విద్యాలయ పిల్లల పేర్లు లేకపోవడం వల్ల వారికి తల్లికి వందనం అందలేదని తెలిపారు. సాంకేతిక కారణాలను సరిదిద్ది మెగా పేరెంట్స్, టీచర్స్మీట్కు ముందే వీరందరికీ తల్లికి వందనం కింద సాయం అందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు రెండో రోజు శనివారం ఉత్సాహంగా సాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో అనంతపురం జట్టు భారీ స్కోరు చేసింది. శనివారం రెండవ రోజు 139 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 82.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి 267 బంతుల్లో 30 ఫోర్లు, 12 సిక్సర్లతో 251 పరుగులు చేశాడు. జయంత్ కృష్ణ 79 పరుగులు, సందీప్ రెడ్డి 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మహిత్ తన చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆ జట్టులోని టీవీ సాయి ప్రతాప్రెడ్డి 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండవ రోజు 14 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తొలి ఇన్నింగ్స్తో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 69.1 ఓవర్లలో 318 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సిద్దు 74 పరుగులు, వరుణ్ 64 పరుగులు, సాయి చరణ్ 60 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. 251 పరుగులు చేసిన అనంతపురం బ్యాట్స్మన్ కేహెచ్ వీరారెడ్డి 486 పరుగుల భారీ స్కోరు చేసిన అనంతపురం జట్టు -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్ : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు చేస్తున్న నాలుగో రోజు నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వంలోనే జీఓ నంబర్–42 ద్వారా యూనివర్సిటీలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ) పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి సీఓఏ అనుమతి వచ్చేలా చర్యలు తీసుకొని యూనివర్సిటీకి కేటాయించిన స్థలం శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందించపోతే పెద్ద ఎత్తున ఉద్యమం విద్యార్థుల దీక్షలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి. సాయిదత్త, ఏఐఎస్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. రవి తదితరులు మద్దతు ప్రకటించి దీక్షల్లో కూర్చున్నారు. ఈ సమస్యపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శివారెడ్డి, సాయి కుమార్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి తేజ పాల్గొన్నారు. సాయిరెడ్డి, రామ్, మేఘసాయి, పవిత్ర, సుష్మ, సుధీర్, సుధాకర్, ఆదిత్య, వసంత్, సింధు, మోహన్, మనోజ్ దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం కడప ఎడ్యుకేషన్ : ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని కలిసి వినతిప్రత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఐక్యవేదిక నాయకులు ఎం.అంకన్న, సుబ్బారాయుడు, జయవర్ధన్, నాగరాజు, నాగేశ్వరరావు, మహేష్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ నాలుగో రోజుకు చేరిన విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు -
భర్తపై వేధింపుల కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన నాగవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు నాగవేణికి కడపకు చెందిన వెంకటసుబ్బయ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అతను గత 2 సంవత్సరాల నుంచి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేని నాగవేణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని టి. చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం పట్టణం రాం నగర్కు చెందిన ముద్దల బాలాజీ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు మండలంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం బాలాజీ తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలోమార్గ మధ్యంలో టి.చదిపిరాళ్ల వద్దకు రాగానే కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు చిన్న వయస్సు గల కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలాజీ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సహజీవనానికి అడ్డొస్తున్నాడని హత్య
జమ్మలమడుగు : తన సహ జీవనానికి అడ్డు వస్తున్నాడని షేక్షావలీ అనే యువకుడిని జాఫర్వలీ అనే వ్యక్తి హత్య చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీన ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు ఆవరణంలో జరిగిన షేక్షావలీ అనే యువకుడి హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన హసీనా భర్త 15 ఏళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన జాఫర్వలీ అనే వ్యక్తి హసీనాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గత నెల 26వ తేదీన హసీనా కడపలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. జాఫర్వలీ ఆమె కోసం కడపకు వెళ్లాడు. అక్కడ ఉన్న హసీనా అన్న షేక్షావలీ నీవు ఇక్కడికి రావద్దు.. మా చెల్లెలిని వదలిపెట్టు అంటూ జాఫర్వలీని మందలించాడు. దీంతో షేక్షావలీపై జాఫర్వలీ కక్ష పెంచుకున్నాడు. తన సహ జీవనానికి అడ్డుగా ఉన్న అతన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన జాఫర్వలి కడపలో షేక్షావలీ నివాసం ఉంటున్న వీధిలోకి వెళ్లాడు. అక్కడ ఎదురుపడిన షేక్షావలీతో జాఫర్ వలీ మాట్లాడి ఇద్దరం కలిసి మద్యం తాగుదాం రమ్మంటూ కడప రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత ఎర్రగుంట్లలో కుక్కలను పట్టుకుంటే ఒక్కో కుక్కకు రూ. 300 ఇస్తారని నమ్మించి షేక్షావలీని ఎర్రగుంట్లకు పిలుచుకుని వచ్చాడు. కడప రోడ్డులో ఉన్న బ్రాందీ షాపులో తిరిగి మద్యం తాగారు. తర్వాత ఎర్రగుంట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో పాత గోడౌన్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి వచ్చారు. పథకం ప్రకారం తక్కువ మోతాదులో మద్యం తాగిన జాఫర్వలీ మద్యం మత్తులో పడిపోయిన షేక్షావలీ తలపై అక్కడ ఉన్న ఇటుక, బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రగుట్ల సీఐ నరేష్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జాఫర్వలీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ నరేష్బాబుతో పాటు మరి కొందరు కానిస్టేబుళ్లను అభినందిస్తూ రివార్డులను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు -
వైఎస్సార్సీపీ నాయకులకు స్విమ్స్లో వైద్య పరీక్షలు
సాక్షి టాస్క్ఫోర్స్ : కడపలో మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందులలోని రింగ్రోడ్డు చుట్టూ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ తోరణాలు, జెండాలు కట్టిన విషయం విదితమే. దీనిపై అప్పట్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర వైఎస్సార్సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీని, మున్సిపల్ కమిషనర్ను కలిసి టీడీపీ తోరణాలు తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్తోపాటు ఇతర వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న తోరణాలను తొలగించారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసు అప్పట్లో జిల్లాలో ఉన్న హోం శాఖ మంత్రి అనిత, పులివెందుల టీడీపీ నాయకుల ఆదే శాల మేరకు పోలీసులు దాదాపు 18 మంది వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం వారిని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు పార్నపల్లె కిశోర్, సాతుపాటి రాజేష్, తావేటి మల్లికార్జున, షేక్ మస్తాన్, పార్నపల్లి వెంకట చలపతి, సాతుపాటి వెంకటపతిలు తమను పోలీసులు అకారణంగా కొట్టారని మెజిస్ట్రేట్ ఎదుట వాపోయారు. దీంతో పులివెందుల మెజిస్ట్రేట్ వారికి పులివెందుల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్టుల్లో అవకతవకలు అప్పట్లో పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆరుగురికి పులివెందుల జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలనివేదికల్లో అనేక అవకతవకలు జరిగాయని సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు, సూపరింటెండెంట్పై పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులచే ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తయారు చేసుకున్నారు. దీంతో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు వైద్య పరీక్షల నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరుగురికి మరలా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్బాషా, వెంకట రమణ పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. వీరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో మంతనాలు జరపడం మీడియా సాక్షిగా బయట పడింది. అంతేకాకుండా కర్నూలు డీఎస్పీ కూడా తమకేమాత్రం సంబంధం లేకున్నా ఆస్పత్రికి వెళ్లి నివేదికలను మేనేజ్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో మరలా ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు తమకు జరిగిన అన్యాయంపై సాక్ష్యాధారాలతో హైకోర్టుకు నివేదించి ప్రైవేటు కంప్లైంటు వేశారు. దీంతో హైకోర్టు మరలా వీరికి తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్బాషాను ఆదేశించింది. స్విమ్స్లోనైనా న్యాయం జరిగేనా..!హైకోర్టు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను శనివారం ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి అర్బన్ సీఐ చాంద్బాషా ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, రూరల్ సీఐ వెంకట రమణలు నివేదికలు తమకు అనుకూలంగా ఉండాలని మేనేజ్ చేసినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అధికార పార్టీ నాయకులతో స్విమ్స్ ఆస్పత్రి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రస్తుతం రక్త పరీక్షలు నిర్వహించి మిగిలిన పరీక్షలు తర్వాత నిర్వహిస్తామని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడైనా తమకు న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు. టీడీపీ తోరణాల తొలగింపు ఘటనలో అక్రమ కేసు పోలీసుల థర్డ్డిగ్రీపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు -
శల్యసారధ్యం వహిస్తున్న సర్కార్
వైఎస్సార్ ఏఎఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం శల్యసారధ్యం వహిస్తుంది. వెరసి సీఓఏ గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 2023 అక్టోబరులో విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, అప్పట్లో టీడీపీ అండ్ కో విశ్వవిద్యాలయ నియామకాలపై కోర్టుకెళ్లి నియామక ప్రక్రియను నిలిపివేసింది. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీఏఓ గుర్తింపు నిచ్చేందుకు నిరాకరించింది. ఈ కారణంగా ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ● యూనివర్శిటీకీ గుర్తింపు రాకుంటే వచ్చే ఏడాది 2027లో కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు సైతం ఇక్కట్లు తప్పవని పలువురు వివరిస్తున్నారు. కాగా, పాలకులు, అధికారులు స్పందించాల్సిందిపోయి విద్యార్థులకు ఉన్న వసతి గృహాలను సైతం ఖాళీ చేయించడం, మూసి వేయించడం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు సైతం నిర్వహించకపోవడం అను మానాలకు దారి తీస్తోంది. ఈ ఏడాది ఏడీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు నిలిపివేయడం, విశ్వ విద్యాలయ ప్రాధాన్యత తగ్గించడం, తద్వారా ఇక్కడి నుంచి తరలించడమో, లేదా మూసి వేయడమో చేయాలన్న కుట్ర కోణం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్కు చెందిన బీసీ సూరారెడ్డి, జమ్మలమడుగుకు చెందిన ఎంబీ శ్రీనివాసులరెడ్డి, కమలాపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్ గఫారి, కిశోర్ బూసిపాటిలను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. బ్రహ్మంగారి సన్నిధిలో ఆమని బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర సన్నిధిలో శనివారం సాయంత్రం సినీ యాక్టర్ ఆమని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి చిన్నకుమారుడు దత్తయ్యస్వామి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా ఆమని మాట్లాడుతూ భవిష్య త్ కాలజ్ఞాన ప్రబోధకర్త సజీవ సమాధిని దర్శించుకోవాలన్న కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్థాని క మఠాధిపతి వీరకుమార స్వామితో మాట్లాడి అమ్మవారి గురించి తెలుసుకున్నారు. తిరుపతి–హిస్సార్ మధ్య ప్రత్యేక రైలు ● ప్రఖ్యాత సూఫీ క్షేత్రం అజ్మీర్ మీదుగా.. కడప కోటిరెడ్డిసర్కిల్: కడప మీదుగా తిరుపతి–హిస్సార్ మధ్య ఈనెల 9 నుంచి సెప్టెంబరు 24వ తేది వరకు ప్రత్యేక రైలును నడపనున్నా రని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717/07718 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప (రాత్రి 2.30), ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్నగర్, కాచిగూడ (మధ్యాహ్నం 3.50), నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, సూర త్, వడోదర, చిత్రదుర్గ్, అజ్మీర్ (శనివారం ఉదయం 5.00), సికార్ జంక్షన్ మీదుగా హిస్సార్కు శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు చేరుతుందన్నారు. ఇదే రైలు ఈనెల 13 నుంచి సెప్టెంబరు 28 వరకు ప్రతి ఆదివారం హిస్సార్లో రాత్రి 11.15 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. 96 గంటల వ్యవధిలో.. 4000 కి.మీ దూరం ప్రయా ణిస్తుందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పెద్దదర్గాకు ఉత్సవ శోభ
కడపలోని పెద్దదర్గా కడప సెవెన్రోడ్స్: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత సూఫీ క్షేత్రం కడప పెద్దదర్గా ఉత్సవ శోభ సంతరించుకుంది. దర్గాలో ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్షా పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్గా నిర్వాహ కులు పూర్తి చేశారు. గంధోత్సవాన్ని దర్శించి తరించేందుకు శనివారం నాటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్గా ఆవరణకు చేరుకున్నారు. తొలి గురువు నేపధ్యం మహమ్మద్ ప్రవక్త వంశీయులుగా చెప్పబడే దర్గా తొలి గురువు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ నుంచి కడపకు వచ్చారు. ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధి స్తుండేవారు. భగవంతుని దృష్టిలో మనుషులంద రూ ఒక్కటేనని, కలిసిమెలిసి జీవించాలంటూ ఆయ న ప్రబోధిస్తూ వచ్చారు. అనతి కాలంలోనే ఆయన మహిమలు, గొప్పతనం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆయన గొప్పతనాన్ని వినడమే కాకుండా ప్రత్యక్షంగా చూసిన సిద్దవటం నవాబు శిష్యునిగా మారారు. హజరత్ పీరుల్లామాలిక్ సాహె బ్ ఇక్కడే జీవ సమాధి పొందారు. సుప్రసిద్ధ హిందూ ధార్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ పండిట్ రవిశంకర్ ఓమారు పెద్దదర్గాను దర్శించారు. దర్గా సందర్శన వల్ల తనకు ఎనలేని ఆత్మసంతృప్తి, ప్రశాంతత లభించాయని తెలిపారు. ప్రధాన గురువు మజార్ వద్ద ఏదో తెలియని ఆకర్శణ శక్తి ఉందన్నారు. దర్గా నిర్వాహకుల అనుమతితో ఆయన కాసేపు మజా ర్ వద్ద కూర్చొని ధ్యానంలో గడపడం విశేషం. నేటి కార్యక్రమాలు .. హజరత్ ఖాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిస్టివుల్ ఖాద్రి సాహెబ్ గంధం ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు గంధ మహోత్సవం జరగనుందని దర్గా ప్రతినిధులు తెలిపారు. మొహర్రం నెల 10వ రోజు గురువులు జీవ సమాధి పొందిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన దర్గా నిర్వాహకులు -
ఈ యాప్పై ఓ లుక్ వేయాల్సిందే !
ఖాజీపేట : ప్రతి మనిషికి ఆశ ఉంటుంది.. తక్కువ పెట్టుబడి డబ్బుతో ఎక్కువ లాభం వస్తుందంటే మనిషి కనీస వివేకం కోల్పోతాడు. మనుషుల్లోని ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని లుక్ యాప్ ద్వారా భారీ దోపిడీ చేసిన సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తూ అత్యాశపరులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. లుక్ యాప్ ద్వారా ఒక సారి డిపాజిట్ చేస్తే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్న కొత్త రకమైన ఆలోచన ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన యాప్ను తయారు చేశారు. ఈ యాప్ గురించి వాట్సాప్ ద్వారా అలాగే వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. రోజు వారి ఆదాయం వారంలో డబ్బు విత్డ్రా చేసుకోవచ్చని అందరిని బురిడీ కొట్టించారు. ఇదికాక ఒకరు డిపాజిట్ చేసిన తరువాత మరో 10 మందిని డిపాజిట్ చేయిస్తే వారి కి ప్రమోషన్ ద్వారా అదనపు ఆదాయం వస్తుందని మోసానికి పాల్పడ్డారు. అలాగే డిపాజిట్ చేసిన వ్యక్తి అమైంట్ను బట్టి వారికి రోజు ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. ఇందులో రూ.2వేల నుంచి రూ.70లక్షల వరకూ డిపాజిట్ చేసే ఏర్పాట్లు చేశారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి రోజు వారి ఆదాయం గురించి వివరించారు. రూ.2వేలు డిపాజిట్ చేస్తే ప్రతి రోజు రూ.150, రూ.70వేలకు రోజుకు రూ.2500 ఇలా వివిధ కేటగిరీలను బట్టి రెండేళ్లపాటు ఆదాయం వస్తుందని నమ్మించారు. అలాగే వారంలో ఒకసారి వచ్చిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మొదట్లో రెండు వారాలు అందరికి డబ్బులు బాగానే వేశారు. దీంతో నమ్మకం కలిగి చాలా మందిని ఈ లుక్ యాప్లోకి చేర్పించారు. సభ్యుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. 25 నుంచి పని చేయని యాప్.. వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి చేరిన బాధితులు ఇలా లక్షల్లో యాప్లో డబ్బులు వేశారు. ఒక్క ఖాజీపేట మండలంలోనే 200 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు రూ.2వేల నుంచి సుమారు మూడు లక్షల రూపాయల వరకూ డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఒక్క ఖాజీపేటలోనే రూ.20లక్షల నుంచి రూ.30 లక్షల డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 2వేల మందికి పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం చూస్తే సుమారు రూ.30 కోట్ల మేరకు డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు అంచనా. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఈ మొత్తం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. కడపలోని ఒక్క వాట్సాప్ గ్రూప్ యాప్లోనే రూ.3కోట్లు పోయినట్లు సమాచారం. ఇలాంటి గ్రూపులు జిల్లాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే గత నెల 25 నుంచి సాంకేతిక కారణాలతో యాప్ను పూర్తిగా రద్దు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. డిపాజిట్ సొమ్ముకు రోజువారి డబ్బు విత్డ్రా లేకపోవడం, యాప్ పనిచేయక పోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. తెర వెనుక ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. ఖాజీపేట మండలంలో ఈ యాప్ ద్వారా రోజువారి ఆదాయం వస్తుందని ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అతని ద్వారా చాలా మంది అతని మాటలు నమ్మి ఈ యాప్లో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ యాప్లోని డిపాజిట్ల బాగోతాన్ని ప్రచారం చేసి అందులో సభ్యులుగా అందరిని చేర్పించినట్లు బాధితులు చెబుతున్నారు. యాప్లో సభ్యులుగా చేర్చిన వారిని డబ్బుల విషయం గురించి అడిగితే తమకేం సంబంధం లేదన్నట్లు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులకు సిద్ధం.. లుక్ యాప్ బాధితులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో బాధితులంతా యాప్ ద్వారా మోసపోయిన తీరుపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ యాప్లో అధికంగా 80 శాతం మహిళలు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే చాలా మంది ఈ యాప్ వల్ల బాధితులం అని తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. మరికొందరు మా ఖర్మ కొద్ది డబ్బులు పోగొట్టుకున్నాం ఎవ్వరికై నా తెలిస్తే పరువు పోతుంది ఎందుకులే అని వదిలేస్తున్నారు. ఇంకొందరు ఇప్పటికే సైబర్ పోలీసులకు నేరుగా, మరికొందరు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లుక్ యాప్ మోసగాళ్లకు శిక్షపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. లుక్ యాప్ పేరుతో భారీ దోపిడీ ఒకసారి డిపాజిట్ చేస్తే రోజూ డబ్బులు ఇస్తామని మోసం వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం జిల్లా వ్యాప్తంగా 2వేల మంది బాధితులు రూ.30 కోట్లు దోపిడీ చేసినట్లు సమాచారం -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధింపు తగదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి 110 ఎకరాల భూమిని కేటాయించి రిజిస్టర్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.350కోట్లు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రూ.250కోట్లు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రానికి విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం నియమించిన 47 డైలీ వేజ్ కార్మికులను, 135 మంది సిబ్బందిని తొలగించింది. దీన్నిబట్టే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోంది. – దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం -
పర్యావరణానికి చాలా ఉపయోగం
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇంటి పైకప్పు పైన సోలార్ ఫలకలు అమర్చుకుంటే పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు సహజ వనరులైన నీరు, బొగ్గు కొరత రాకుండా ఉంటుంది. వినియోగదారుడు ఎన్ని కిలోవాట్లయినా సౌర ఫలకలు అమర్చుకోవచ్చు. వారికి గరిష్టంగా రూ.78వేలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. వినియోగదారులు ప్రతినెలా చెల్లించే విద్యుత్ బిల్లును బ్యాంకు ఈఎంఐ కడితే ఆ తర్వాత విద్యుత్ బిల్లు చెల్లించకుండా ఉచిత కరెంటు పొందవచ్చు. – హరిసేవ్యా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు. కడప డివిజన్ -
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ సీఎం,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటనకు రాను న్నారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకొని.. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి పులివెందులకు చేరుకుని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అదే రోజు సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పర్యటన వివరాలు వైఎస్ జగన్ ఈనెల 7న సాయంత్రం పులివెందులలో ని భాకరాపురం హెలీప్యాడ్కు 5గంటలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలో బస చేయనున్నారు. ఈనెల 8న ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి 7.30గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.15గంటల వరకు ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరుతారు. -
6 నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: డీఈఈ సెట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,7 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 8 నుంచి 12 వరకు విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చన్నారు. 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు, ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 17 నుంచి 22 వరకు డైట్స్లో సర్టిఫికెట్ల పరిశీలన, చివరి అడ్మిషన్ లెటర్ ఇవ్వనున్నట్లు వివరించారు. పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. నేడు లోక్ అదాలత్ కడప అర్బన్: ‘జాతీయ లోక్ అదాలత్’ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కడపలో 6, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 3, రాయచోటిలో 3, బద్వేల్లో 3, లక్కిరెడ్డిపల్లి, రైల్వేకోడూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం కోర్టులలో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్స్: 08562 258622, 244622ను సంప్రదించాలని వివరించారు. 29న ఈశ్వరీదేవి జయంత్యుత్సవం బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలో మాతా శ్రీ ఈశ్వరీదేవి 322వ జయంత్యుత్సవాలను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఈశ్వరీదేవిమఠం ఈఓ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అమ్మవారి భక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాల కోసం భక్తులు సెల్ నంబర్: 9490486064కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని వివరించారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీ తొలగింపు కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీగా పని చేస్తున్న ప్రమీలను ఆ పదవి నుంచి తొలగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆమె స్థానంలో తాను జిల్లా కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టానన్నారు. గతంలో నిర్వహించిన సమావేశంలో కార్యదర్శిగా పని చేస్తున్న ప్రమీలపై సభ్యులంతా ఫిర్యాదు చేశారన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరు కాకపోవడంతో సభ్యుల ఆమోదం మేరకు పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు. పంటల బీమా.. రైతుకు ధీమా కడప సెవెన్రోడ్స్: బీమా పంటలకు రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం వస్తుందన్నారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కౌలు రైతులకు సైతం బీమా అందుతుందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు చంద్రానాయక్, రవిచంద్రబాబు, ఎల్డీఎం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నందలూరు: నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. అర్చకులు నవధాన్యాలు, కలశస్థాపనలు, పూర్ణకుంభ ప్రతిష్ట, పుణ్యాహవచనా బియ్యం, నెయ్యి, బెల్లం, టెంకాయలు, తమలపాకులు సమకూర్చారు. పాంచరాత్ర ఆగమ పండితుల బృందంతో కలశస్థాపన చేసి హోమం నిర్వహించారు. ఆగ్నేయమూలలో వెలసి ఉన్న పుట్ట వద్ద పూజలు జరిపారు. పుట్టమన్ను సేకరించి అంకురార్పణ మంటపంలో ఏర్పాటు చేసిన 12 పాలికలలో ఉంచారు. అందులో నవధాన్యాలు చల్లి అంకురింప చేసే కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం మూలవర్లు, ఉత్సవర్లకు తిరుమంజనం కార్యక్రమం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో నేడు : శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి యాళి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. -
తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఆచార్ల కాలనీలో శుక్రవారం టీడీపీ నేతలు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను నిలదీశారు. చాలా రోజులుగా సిమెంటు రోడ్డుపై వర్షపు నీళ్లు నిలుస్తున్నాయని, డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. పలుమార్లు ఈ సమస్యను పరిష్కరించాలని కోరినా స్పందించలేదని టీడీపీ నేతలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానికులు నిలదీయడంతో దిక్కుతోచని నేతలు.. త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్డుపై నిలిచిన మురికి నీరు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరిన ప్రజలు -
షేమ్.. షేమ్!
● అధికార దర్పానికి జీ హుజూర్ అంటున్న అధికారులు ● కమలాపురం ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణంలో సమీక్షకు హాజరైన అధికారులు ● ప్రభుత్వ కార్యాలయాల్లో కాకపోయినా పరుగెత్తికెళ్లిన వైనం ● నియోజకవర్గ అభివృద్ధిపైఅధికారులతో సమాలోచనలు ● పుత్తా డైరెక్షన్లోకొనసాగిన సమావేశం సాక్షి, టాస్క్ఫోర్స్: అధికార దర్పానికి సెల్యూట్ చేస్తున్న వారు కొందరైతే.. ‘నీ బాంఛన్ దొర’ అనే వారు మరికొందరయ్యారు. పోస్టింగ్స్ కోసం స్థాయిని దిగజార్చుకొని ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంతో నిమిత్తం లేదు, ఎక్కడ సమీక్ష పెట్టినా మీరు ఆదేశిస్తే వచ్చి తీరుతామంటూ తలూపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే శాసనం, చెప్పిందే వేదమని చెప్పకనే చెబుతున్నారు. ఈక్రమంలో మాచిరెడ్డిపల్లె చెట్ల కింద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. పరుగుపరుగునా అధికారులు వాలిపోయారు. ఈ దుస్థితికి వ్యవస్థలను దిగజార్చిన అధికారులు ‘షేమ్..షేమ్’ అని ప్రజాస్వామ్యవాదులు హేళన చేస్తున్నారు. ● కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేందుకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి సిద్ధమయ్యారు. ఆమేరకు శుక్రవారం మాచిరెడ్డిపల్లెకు రావాల్సిందిగా అధికారులకు కబురు పంపారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. అలా కాదు, కూడదంటే.. నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో కూడా చేపట్టవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే పుత్తా ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వారు, ఇలాంటి చర్యలకు ఉపక్రమించరని పలువురు దెప్పి పొడుస్తున్నారు. మాచిరెడ్డిపల్లెలో చెట్ల కింద సమీక్ష నిర్వహించడం ఏమిటని అభ్యంతరం చెబుతున్నారు. ప్రగతి పేరిట పెత్తనం కమలాపురం ఎమ్మెల్యేగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అభివృద్ధిపై సమీక్ష చేపట్టడం సముచితమే. కాకపోతే ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడమే తీవ్ర అభ్యంతరకరమని పలువురు వివరిస్తున్నారు. అదే సమీక్ష ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించి.. ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించించి వారి సలహాలు, సూచనలు తీసుకొని ఉంటే హుందాతనం లభించేది. అలా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేకపోగా తాను చెప్పిందే వేదమన్నట్లుగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో సమీక్ష చేయించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా.. పుత్తా నరసింహారెడ్డి ఆర్డీఓ జాన్ఎర్వీన్తో సమానంగా కూర్చొని అధికారులను ప్రశ్నించారని విపక్ష పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా అధికారులు వ్యవహరించకపోవడం, మాచిరెడ్డిపల్లెలో సమీక్షకు వెళ్లడంపై సర్వోన్నతాధికారి అభ్యంతరం చెప్పకపోవడంపై విశ్లేషకులు హేళన చేస్తుండటం గమనార్హం. -
● హాయిగా.. సురక్షితంగా..
పవిత్రమైన, సుందరమైన శేషాచలం అటవీ కొండలు, పాలకొండల సముదాయంలో గువ్వలచెరువు ఘాట్ ఉంది. ఈ ప్రాంతం అందమైన అటవీ ప్రాంతం, వర్షాకాలంలో ఎటు చూసి నా పచ్చదనం.. జలపాతాల సోయ గాలు కనువిందు చేస్తుంటాయి. అలాంటి ప్రకృతి మధ్య సొరంగ మార్గం ఏర్పాటు కావడంతో.. ఆ ఏరియా అంతా పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా ఇప్పటికే హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాపార, వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఉదాహరణకు మన జిల్లా నుంచి సిమెంట్, మైనింగ్, అరటి, బత్తాయి తదితర వస్తువులు గువ్వలచెరువు ఘాట్ మీదుగా పీలేరు, చిత్తూరు, చైన్నె, మదనపల్లె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఫ్యాక్టరీలకు మిషనరీ, ఇతర పరిశ్రమలకు సంబంధించిన విడి భాగాలు, కెమికల్స్తోపాటు టమోటా తదితర కూరగాయలు, కొబ్బరి బొండాలు.. ఇలా పలు రకాల వస్తువులు భారీ వాహనాల్లో వస్తుంటాయి. వీటిలో కొన్ని వివిధ కారణాల చేత ఘాట్ మలుపుల్లో చిక్కుకొని ప్రమాదాలకు గురి అవుతున్నాయి. సొరంగ మార్గం ఏర్పాటైతే దాదాపు ఒక గంట ప్రయాణం కలిసి రావడంతోపాటు సుఖంగా.. సురక్షితంగా ప్రయాణం సాగించడానికి వీలుకలుగుతుంది. -
మోసం గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం
ప్రొద్దుటూరు : గ్రామం.. వార్డులలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై ఇంటింటికీ వెళ్లి తెలపాలని.. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ.. కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. స్థానిక శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుది చెత్త పరిపాలన అని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయని కారణంగా ఏడాదిలోనే వైఎస్సార్సీపీ మూడు పెద్ద కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. కరెంట్ చార్జీలు, రైతులకు మద్దతు ధర, వెన్నుపోటు కార్యక్రమాన్ని పెద్దస్థాయిలో నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయలేదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తుచేస్తూ పోరాటం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేయని పథకాలను.. తాను చేసినట్లు చూపిస్తున్నారన్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు అందరిపై దొంగ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 143 రోజులు అక్రమంగా జైలులో ఉంచారన్నారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని, టీడీపీ నేతలను గుర్తించి బ్లూబుక్లో నమోదు చేయాలని కోరారు. 2.0 జగన్ పరిపాలనను మనమందరం చూస్తామని, అపుడు కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. చంద్రబాబు తప్పులను గుర్తుచేస్తూ పార్టీని రక్షించుకునేందుకు నిత్యం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, భవిష్యత్తు అంతా కార్యకర్తలదేనన్నారు. ఏనాడు చంద్రబాబు చరిత్రలో పోరాటం చేసిన పరిస్థితి లేదన్నారు. వైఎస్తో రాజకీయ ప్రస్థానం.. వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందని, ఆయన కుమారుడు అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఆయన పరిపాలనకు శుభం కార్డు పడుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. జగన్ పట్ల తాను అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నానని, ఆయన కోరితే దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 2028లో జమిలి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కృషి చేద్దామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు విడిపోతే ఓడిపోతామనే భయం వారికి కల్పించింది మాత్రం జగనే అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతీకారంతో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంట్ పరిశీలకుడు కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలను తెలుసుకోవచ్చన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు సంఘటితంగా పోరాటం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్లను ముఖ్య నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పోరాటంతోనే తల్లికి వందనం అమలు భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు
కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పీపీఎస్ పరిధిలో జరిగిన మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో పోరుమామిళ్ల టౌన్ బెస్త వీధికి చెందిన షేక్ జిలానీ బాషా(26), కలసపాడు మండలం కట్టకిందపల్లికి చెందిన కారు నాగేంద్ర ప్రసాద్(25), పోరుమామిళ్లలోని తురకకోట వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా(26 ) లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కడప నాలుగో ఏడీజే కోర్టు జడ్జి జి.దీనాబాబు తీర్పు ఇచ్చారు. పోరుమామిళ్ల పీఎస్ పరిధిలోని రామాయపల్లి శ్వశానం వద్ద 2019 జూలై, 11న హత్య జరిగింది. ముగ్గురు నిందితులు మతి స్థిమితం లేని యువతిని గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి వీఆర్ఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మోహన్రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో యువతి గొంతు నులిమి హత్యచేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం ముగ్గురికీ పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. సీఐ మోహన్ రెడ్డి, సీఐడీ శ్రీనివాసులు, కొండారెడ్డి, వెంకట సుబ్బయ్యలను ఎస్పీ అభినందించారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప భాకరాపేట రైల్వే స్టేషన్ మధ్య శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందాడు. కడప రైల్వే ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి కథనం మేరకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన వెంకటనారాయణ పనినిమిత్తం గుంతకల్కు రైలులో వెళుతుండగా భాకరాపేట సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు అప్పుల బాధతో ఆత్మహత్య కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్య కొత్త మాధవరం సమీపంలో మల్లికార్జున(38) అనే వ్యక్తి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రైల్వే పోలీసులు వివరాల మేరకు మల్లికార్జున ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వద్ద మేనేజర్ గా పని చేస్తుండే వాడు. రెండేళ్ల కిందట ఇళ్లు కట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు.అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక గురువారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం కడప కోటిరెడ్డిసర్కిల్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ, చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ విధులు, ఆవశ్యకతను వివరిస్తూ బాలల హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పిల్లల పట్ల సున్నితత్వంతో మెలగాలని, మౌలిక వసతులు మెరుగుపర్చాలని కోరారు. కంప్లైంట్ బాక్స్ నిర్వహించాలని, నిఅన్ని కమిటీల వివరాలు ఉండాలన్నారు. హక్కులను పర్యవేక్షించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సవరించుకుంటూ ముందుకుసాగాలన్నారు. సమర్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందన్నారు. చిన్నారుల సమస్యలను పరిష్కరించేందుకు 1098 టోల్ ప్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్య్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డీడీ అంజల, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ హిదయతుల్లా, ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుభాష్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాహిర్ కడప కోటిరెడ్డిసర్కిల్ : షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడపకు చెందిన తాహిర్ నియమితులయ్యారు. కడప నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అలిషేర్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. గత 16 ఏళ్లుగా సామాజిక సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందిన తాహిర్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాహీర్ మాట్లాడుతూ కౌన్సిల్లో తనకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ కడప జిల్లా అధ్యక్షుడు షాబుద్దీన్, కౌన్సిల్ రాష్ట్ర సలహాదారులు బషీర్బుఖారి, కౌన్సిల్ జిల్లా లీగల్ అడ్వైజర్ అలీమ్ అసద్, కౌన్సిల్ ప్రతినిధులు రియాజ్, జమీర్, రెడ్డి, అనూష, లక్ష్మిదేవి, సరస్వతి, గౌస్, సమీర్అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచనకు పదును.. సృజనకు అదును
కడప ఎడ్యుకేషన్ : ఇన్స్పైర్ మనక్– 2005 అవార్డులకు వేళయింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి.. వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి.. వారిని భావి భారత శాస్త్ర వేత్తలుగా తయారుచేయాలనే లక్ష్యంతోభాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డిఎస్టి) ఏటా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ చూసిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులకు బాల శాస్త్రవేత్తలుగా నామకరణం చేసి రాష్ట్రపతి అవార్డు అందజేస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్వరపడాల్సి ఉంది. అర్హతలు... ఎంపికలు ఇలా వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసేందుకు అర్హు లు. వారంతా తమ సైన్సు టీచర్ను గైడ్గా ఏర్పాటుచేసుకుని ఈ పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. స్థానిక సమస్యలను తీర్చే విధంగా ఆలోచనలుండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచన ఎంపిక చేసి అందుకు అవసరమైన ప్రాజెక్టు రూపొందించాలి. విద్యార్థి, తండ్రి పేర్లు, తరగతి నమోదు చేసి విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు రాత పూర్వకంగా సంబంధిత వెబ్ సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయి ప్రతిభా వంతులను ప్రకటిస్తారు. తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా... ఇన్స్పైర్ అవార్డు మనాక్లో పాల్గొనేందుకు విద్యా ర్థులు ముందుగా www.inrpireawardrdrt.gov. in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్కూల్ ఆఽథారిటీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్ను ఎంపిక చేయాలి. పాఠశాల వివరాలను పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడితో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదుచేయాలి. జాగ్రత్తలు పాటించాలి... విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టులలో స్థానిక సమస్యలను ప్రతిబింబించి.. వాటికి పరిష్కార మార్గాలు చూపేలా ఉండాలి. పాతవైనా తాజా పరిస్థితులకు అన్వయించి పరిష్కారం చూపాలి. నమూనాల పొడవు, వెడల్పు ఒక మీటరు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులో నమూనా పరిచయం, పనిచేసే తీరు, ఉపయోగించే పరికరాలు, తయారీ విధానం, పనిచేసే తీరు. ఫలితాల అనువర్తనాలు తప్పని సరిగా ఉండాలి. ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చే న్యాయ నిర్ణేతలకు నమూనా చూపించి ప్రాజెక్టు గురించి తడబాటు లేకుండా వివరించాలి. ఎంపిక పక్రియ... విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచుతారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడ విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో పదర్శించే అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వాటిని ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు అప్పగిస్తారు. వాటిని వారు గొప్ప నమూనాలుగా రూపొందిస్తారు. ఉత్తమ ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయిలో పదర్శనలకు అవకాశం ఉంటుంది. వీటిలో పలు ప్రాజెక్టులను ఫైనల్గా ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్లో జరిగే వారోత్సవాల్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులకు ప్ర భుత్వం పెటెంట్ హక్కులు మంజూరు చేస్తుంది. ఇన్స్పైర్మనక్ –2025కు దరఖాస్తుల ఆహ్వానం బాల మేధావులకు గొప్ప అవకాశం సెప్టెంబర్ 15వ తేదీ వరకు నమోదుకు గడువు విద్యార్థులను ప్రోత్సహించండి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే సైన్సు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోని నూతనత్వాన్ని ప్రతిబింబించేలా ప్రాజెక్టు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు అన్ని పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు కృషిచేయాలి. అనుమానాలుంటే జిల్లా సైన్సు అధికారిని సంప్రదించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి పాఠశాల నుంచి... ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు భాగస్వాములు కావాలి. ఇందులో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ప్రతి ౖసైన్సు ఉపాధ్యాయుడు కృషి చేయాలి. – ఎబినైజర్, జిల్లా సైన్సు అధికారి -
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. వరుసగా ఎనిమిదో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బుశెట్టిరాంమోహన్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ ఖ్యాతిని నలుదిశాల ఇనుమడింపచేస్తామని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బుశెట్టి రాంమోహన్రావు, ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ రవీంద్ర బాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మల్లెంకొండు ప్రతాప్, గౌరవ సభ్యులుగా వంకధార వీరభద్రయ్య, జొన్నలగడ్డ రామచంద్ర ప్రకాష్, పోలేపల్లి రాజబాబు, రేగంటి సురేష్బాబు, మురికి మల్లిఖార్జునలతో పాటు 24 మంది సభ్యులతో సభ లీగల్ అడ్వయిజర్ కొప్పర్తి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాంమోహన్ రావును వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శాలువ కప్పి సత్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్పిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, పిట్టా బాలాజీ, భూమిరెడ్డి వంశీధర్రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, జీవీ ప్రవీణ్ కుమార్రెడ్డిలతోపాటు పలువురినీ సత్కరించారు. -
నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం
కడప కార్పొరేషన్ : డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్(సీఓఏ) అనుమతి వెంటనే ఇవ్వాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.350 కోట్లతో ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్శిటీని మంజూరు చేసిందన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ, సొంత భవనాలు, హాస్టల్ భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనివర్సిటీకి డా. వైఎస్సార్ పేరుందనే ఈ ప్రభుత్వం కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, శివతేజ, అరుణ్కుమార్, ఎన్.రాజేష్, నజీర్, సుధీర్, చంద్ర, శివశంకర్, శ్రీనివాసులు, వెంకటేష్, ప్రశాంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడీసెట్ నిర్వహించాలంటే ముందుగా కన్వీనర్, సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉందని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఇన్చార్జి వీసీ విశ్వనాథ్ అన్నారు. వీలైనంత త్వరగా అన్నీ సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొని.. ఈ యాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు ● టికెట్ బుకింగ్, రిజర్వేషన్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ ● ప్లాన్మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం ఎలా.. ● రైలు స్థితి, ప్లాట్ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్, రీఫండ్ ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్ధితి గతులు, టికెట్ పీఎన్ఆర్ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్ స్టేటస్, రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్టరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరజిం కార్పొరేషన్ లిమిటెట్ (ఐఆర్టీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ ఎలా డౌన్లోడ్... ● ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam ఐవోఎస్ యాప్ నుంచి... httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334 ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక. రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ● mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. ● ప్లాన్ మై జర్నీ లేదా మై బుకింగ్ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకే యాప్లో ఐఆర్టీఎస్ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు. ● సరళమైన ఇంటర్సేఫ్, సింగల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● 2025 డిసెంబర్ నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్ బుకింగ్, 40 లక్షల ఎంకై ్వరీలు నిర్వహించగల సామర్థ్యం. స్పీడ్గా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చిన యాప్ ఐఆర్టీఎస్తో ఫుడ్ ఆర్డరింగ్ నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్ లక్ష్యం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని తాళ్ళపల్లె – ముసల్రెడ్డిపల్లె మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాసం గంగరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసల్రెడ్డిపల్లెకు చెందిన గంగరాజు బైకుపై వేంపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని మోటార్ బైకులో గురువారం రాత్రి వేంపల్లె నుంచి గంగరాజు, దుగ్గన్నగారిపల్లెకు చెందిన బుసిరెడ్డి శివానందరెడ్డిలు ముసల్రెడ్డిపల్లెకు వెళ్తూ గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ వీరి మోటార్ బైకు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే బాసం గంగరాజు మృతి చెందాడు. బుసిరెడ్డి శివానందరెడ్డికి తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగభూషణం, డీఎల్డీఓ, మహిళా సర్పంచులు పాల్గొన్నారు. -
నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి
కడప సెవెన్రోడ్స్: జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో స్వర్ణాంధ్ర విజన్– 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రో యాక్టివ్ గా పని చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల అంశాలను సాధించడానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 78వేల బంగారు కుటుంబాలను గుర్తించామని నియోజకవర్గంలోని మండల వారీగా బంగారు కుటుంబాల మ్యాపింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి చర్యలు తీసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం జిల్లాలో మరో ప్రధాన కీ రోల్ ప్లే చేస్తోందని మున్సిపల్ కమిషనర్లు అందరూ అనుమతులను సులభతరం చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారంలో రెండు రోజులు రియల్టర్లతో ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించాలన్నారు. లేఔట్స్ బిల్డింగ్ నిర్మాణాల వంటి అనుమతుల్లో జాప్యం తగ్గించి త్వరితగతిన మంజూరు చేస్తే మున్సిపాలిటీలకు అధిక రాబడి వస్తుందని ఆ విధంగా మున్సిపాలిటీలు అభివద్ధి చెందుతాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన కడప నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి సాధించాలన్నారు. రాయలసీమలోని కడప నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకు అనుగుణంగా ఎమర్జింగ్ ఏరియాలను గుర్తించి ఓపెన్ లేఔట్లు ట్రేడింగ్ లలో అనుమతులను సరళతరం చేయాలన్నారు. ముందుగా వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, పశుసంవర్ధక, ఫిషరీస్ వంటి శాఖల్లో జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ కనుగుణంగా లక్ష్యాల సాధనకు ఏ విధంగా కృషి చేస్తున్నారన్న అంశాలపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్యా, కడప ఆర్డిఓ జాన్ ఇర్విన్, బద్వేలు ఆర్టీవో చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డిఓ సాయి,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. సంతృప్త స్థాయిలో ప్రజాస్పందనలు ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి స్పందన సానుకూలంగా, సంతృప్త స్థాయి పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. -
తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళ తన పేరిట ఉన్న ఇంటిపట్టాను ముగ్గురు వ్యక్తులకు అమ్మడం ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో బద్వేలు నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ ఉన్నట్లు తెలిసింది. అనుమానితుల్లో కొందరి వద్ద నుండి నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మళ్ళీ తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం సుమారు మూడేళ్ళ క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేలు నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. బద్వేలు కేంద్రంగా ప్రభుత్వ స్థలాలకు, డీకేటీ పట్టాలకు కొంత మంది వ్యక్తులు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో భారీగా నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలకు పాల్పడ్డారు. దీంతో బద్వేలులో ప్రతినిత్యం రెవెన్యూ, పోలీసు కార్యాలయాలకు స్థలాల సమస్యను బాధితులు తీసుకెళుతుండేవారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకులవెంకటరమణ నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించి కొందరు అనుమానితులను గుర్తించి వారిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి నకిలీ పట్టాల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. 2022 మేలో అర్బన్ పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నెం. 112/22 కేసులో 19 మందిపైన, 118/22 కేసులో 7 మందిపైన కేసులు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా పట్టణంలోని మార్తోమానగర్కు సమీపంలో 812 సర్వే నెంబర్లో తన పేరిట పట్టా ఉన్న ఓ మహిళ మొదట ఆ పట్టాను ఓ వ్యక్తి వద్ద కుదువకు ఉంచింది. తర్వాత అదే ప్లాట్ను నకిలీ పట్టాతో మరో వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగక మరో నకిలీ పట్టాను పొంది మూడవ వ్యక్తికి సైతం స్థలాన్ని విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు అర్బన్ పోలీసులను ఆశ్రయించగా విచారించి సదరు మహిళతో పాటు అందుకు సహకరించిన వారిపై మూడు రోజుల క్రితం అర్బన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో అనుమానితులు నకిలీ పట్టాలు సృష్టించి ముగ్గురికి విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళకు నకిలీ పట్టాలు ఎవరు తయారు చేసి ఇచ్చారో తెలుసుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో గతంలో నకిలీ పట్టాల వ్యవహారంలో రిమాండ్లో ఉండి వచ్చిన పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద, నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ వద్ద కొన్ని నకిలీ సీళ్ళు, నకిలీ పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నకిలీ పట్టాల తయారీలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. అందులో భాగంగా గతంలో నమోదైన రెండు కేసుల్లో ఉన్న ఐదు మందిని, బద్వేలు రూరల్ పరిధిలోని నందిపల్లె సమీపంలో గల ఓ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సైతం అనుమానితులను విచారించినట్లు తెలిసింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు? అనుమానితుల్లో ఓ వీఆర్ఓ నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం అక్రమార్కుల గుండెల్లో గుబులు 2022 మే నెలలో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బద్వేలు పరిసర ప్రాంతాల్లో నకిలీ పట్టాల తయారీ సద్దుమణిగింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బద్వేలులో మళ్ళీ నకిలీ పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది. విలువైన స్థలాలు ఉన్న ఎన్జీవో కాలనీ, నెల్లూరు రోడ్డు, మహమ్మద్కాలనీ, చెన్నంపల్లె తదితర ప్రాంతాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్పర్పస్, రస్తా పోరంబోకు స్థలాలకు కొందరు అధికార పార్టీ నాయకులు నకిలీ పట్టాలు తయారు చేయించుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారం అండదండలతో ప్రశ్నించేవారు లేకపోవడంతో యదేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చి కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో ఎక్కడ తమ పేర్లు బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. దీంతో గాయపడ్డ పలువురు విద్యార్థులను వెంటనే 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మడమ తిప్పాడని పలువురు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. -
పదోన్నతి జాబితాలో సీఐలు
కడప అర్బన్: రాయలసీమ జోనల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూనే డీఎస్పీలుగా పదోన్నతుల కోసం వేచివున్న దాదాపు 48 మంది సీఐల జాబితా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. వీరిలో 1995 నుంచి 1996 బ్యాచ్కు చెందిన వారే అధికంగా వున్నారు. 7,8 తేదీల్లో జిల్లాలో షర్మిల పర్యటన కడప వైఎస్ఆర్ సర్కిల్: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు గురువారం డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. 7న కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళి అర్పిస్తారని వివరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన వెంకటయ్యపై ఎలుగుబండి దాడి చేసింది. వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యా యి. ఆయనను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు. రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా చింతకొమ్మదిన్నె: ఊటుకూరు సమీపంలోని ప్రకృతినగర్లోగల రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు యూజీసీ ఈ సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ నెల్సన్ తెలిపారు. నాక్ గ్రేడ్ సాధించినందుకు, మౌళిక వసతులు కల్పించడం, నిష్ణాతులైన ఆచార్య బృందం కలిగి ఉండడం వలన యూజీసీ వారు రామిరెడ్డి ఫార్మసీ కళాశాల కు స్వయంప్రతిపత్తి కల్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ గౌతంరెడ్డి, సెక్రటరీ జయసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ నెల్సన్ కుమార్, కోఆర్డినేటర్ మనోహర్ లను ప్రత్యేకంగా అభినందించారు. కరెస్పాండంట్ గౌతంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు, తల్లితండ్రులకు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహ,రాజారాం,సుచరిత,కల్పన,సలోమి,సుమలత, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
తొలి అడుగు కాదు.. చివరి అడుగు
ప్రొద్దుటూరు : ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనకు తొలి అడుగు కాదని, చివరి అడుగేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. 1978లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ జీవితం 2028కి జగన్తో సమాప్తం కానుందని అన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఇంటింటా తిరుగుతూ గొప్పలు చెప్పుకొంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దొరసానిపల్లెలోని శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హాజరవుతారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ అభిమానులందరూ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎన్నికల సందర్భంగా అలివిగాని హామీలు ఇచ్చారని రాచమల్లు వ్యాఖ్యానించారు. సుమారు 143 హామీలు ఇచ్చినా కేవలం నాలుగైదు మాత్రమే అరకొరగా అమలు చేశారని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నేతలు బాండ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ బాండ్లు ప్రామిసరి నోట్తో సమానమని, వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. ఎమ్మెల్యే వరద సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు ఆయన కుమారుడు కొండారెడ్డి తెలిపారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు రాగుల శాంతి, చింపిరి అనిల్ కుమార్, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, గోపవరం ఉపసర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి, వెంకటేష్, రామమోహన్రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు. గురువారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మోటారు సైకిల్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె – ఓదులపల్లి తండా గ్రామాల మధ్యలో గురువారం మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉడుములకుర్తి నుంచి ద్విచక్ర వాహనంలో గంగరాజు తన కుమారులు ఈశ్వర్, దేవేంద్రతోపాటు భార్యతో కలిసి పులివెందులలోని సర్వజన ఆసుపత్రికి వస్తుండగా.. కనంపల్లె గ్రామ సమీపంలోని ఓదులపల్లె తండా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈశ్వర్, దేవేంద్రతోపాటు గంగరాజు, అతని భార్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీరెడ్డి గాని పల్లెకు చెందిన వీరభద్ర కుమారుడు వి.చంద్రశేఖర(42) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పలమనేరుకు చెందిన మహిళతో వివాహం కాగా, కొంత కాలం క్రితం ఆమె చంద్రశేఖర్ను వదిలి వెళ్లిపోయింది. అనంతరం రమాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి దీక్షిత(9) చైతన్యకుమార్(5) సంతానం ఉన్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర మద్యానికి బానిసై, పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం ఏర్పడి తీవ్ర గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన విషయం బయటకు తెలియలేదు. అయితే గురువారం రాత్రి చంద్రశేఖర ఇంట్లోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య రమాదేవిని విచారణ చేస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, ఎప్పుడు చనిపోయాడు తనకు తెలియదంటూ సమాధానం దాటవేసింది. అంతేకాకుండా మృతుడి శరీరం, తలపై రక్త గాయాలు ఉండడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలుకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర మృతిపై భార్య రమాదేవిని పోలీసులు ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చంద్రశేఖర తమ్ముడు మహేష్ కుమార్ మాట్లాడుతూ... తన సోదరుడు మృతికి రమాదేవి కారణమని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రెండో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడి -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15తులాల బంగారు, రూ.10 వేలు అపహరణ మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో గురువారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. వేద వ్యాస హైస్కూల్ పక్కనే ఉన్న ములపాకు జంగంరెడ్డి చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లెకు చెందిన చిన్న సుబ్బారెడ్డి ఆరేళ్ల కిందట మైదుకూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర చోట్ల ఉన్నారు. గురువారం చిన్న సుబ్బారెడ్డి భార్య మునెమ్మ వరి నాట్లకు వెళ్లగా, ఆయన గ్రామం వద్ద సాగు చేసిన పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు.. ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని గడెలతో సహా పెకలించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో కుడి వైపున బెడ్ రూమ్లో ఉన్న బీరువా తలుపులను పగులగొట్టి అందులో ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భార్యభర్తలు తలుపులు పగలగొట్టి ఉండటం చూసి.. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వస్తువులు, నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వేలి ముద్రల నిపుణులను పిలిపించారు. వారు ఇంటిలోని బీరువా, ఇతర వస్తువులపై పడిన వేలి ముద్రలను సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్లతోపాటు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల దేవదాయ శాఖ, తనిఖీ, కార్యనిర్వహణ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలు సూచించారు. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి. ● కార్యనిర్వహణ అధికారుల ఆధీనంలో ఉన్న దేవదాయల ప్రాపర్టీ రిజిస్టర్లపై పరిశీలన ● రెవెన్యూ వివరాలు నమోదు కాని వివరాల పరిశీలన ● ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పీలు చేయవల్సిన వివరాల పైన.. ● 1బి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో దేవాలయాల పేర్లు చేర్చడం, దాని కోసం మీ సేవ ద్వారా తహసీల్దార్లకు అర్జీలు ఇవ్వడం ● సంస్థల సర్వీస్ ఇనామ్ వివరాలు (ఐఎఫ్ఆర్/ఇనామ్–బి రిజిస్టర్/ఆర్ఎస్ఆర్ ప్రకారం ● సంస్థల భూముల లీజు/ షాప్స్, ఇతరత్రా లైసెన్స్ ఆమోదం ఉత్తర్వులు ● దేవదాయ చట్టం సెక్షన్ 83 కింద ఇప్పటి వరకు ఆక్రమణదారులకు జారీ చేసిన (ఎవికే షన్ నోటీస్) తొలగింపు నోటీసులు ● 11/33 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ● జీవో 60 ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన భూ రక్షణ కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు ● సామూహిక ఆక్రమణల (మాస్ ఎంక్రోచ్మెంట్) స్థితి వంటి విషయలపై చర్చించి అధికారులందరికీ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించారు. -
21 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
వేంపల్లి : బద్వేలులో ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న సీపీఐ 25వ జిల్లా మహాసభల జయప్రదానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర కోరారు. గురువారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతోందన్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2014 ఎన్నికల్లో నల్లధనం వెలికితీత, పన్నుల భారం తగ్గింపు, ధరల నియంత్రణ, ప్రతి అకౌంట్లో లక్షల డబ్బు జమ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి వాగ్దానాలు ఇచ్చిందన్నారు. వాటి అమలులో వైఫల్యాన్ని సీపీఐ ఎండగడుతోందన్నారు. సంపద సృష్టిలో భాగస్వాములైన కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందన్నారు. విభజన హామీలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగిన పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్థిక లోటు భర్తీ, విద్యా, వైద్య సంస్థల సాధనకై దశల వారీ పోరాటాలను సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు, ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, వేంపల్లి మండల కార్యదర్శి అంజనప్ప, తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుచి, శుభ్రత, లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఖాదరబాద్లోని మహ్మద్ బిర్యాని సెంటర్, డీ మార్ట్ ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహా బిర్యాని సెంటర్, సాగర్ రెస్టారెంట్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్, సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడ సెంటర్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. చికెన్ పకోడ తయారు చేస్తున్న వారు వినియోగించే ఆయిల్ బాగలేదని గమనించామన్నారు. కొందరికి నోటీసులు జారీ చేశామని, తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. టీపీసీ మీటర్తో ఆయిల్ను చెక్ చేశామన్నారు. మహ్మద్ బిర్యాని సెంటర్ నుంచి మటన్ బిర్యాని, చికెన్ కర్రీ ఐటమ్స్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోని కొన్ని పదార్థాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్లో ఏమైనా రిమార్క్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నడపకూడదన్నారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకుని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. ఆమె వెంట కొత్తపల్లె, గోపవరం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామమోహన్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
రుత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
బి.కోడూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లె వద్ద గత ఆదివారం కంపెనీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా బైక్ను రుత్విక్ కంపెనీ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించగా మంగళవారం గుంత జయరామిరెడ్డి మృతి చెందాడు. కొండా జయరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతి చెందిన జయరామిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రజాప్రతినిధులతో కలిసి బి.మఠం మండలంలోని డి.అగ్రహారం వద్ద గల రుత్విక్ కంపెనీ క్యాంపు కార్యాలయం సమీపంలోని నేషనల్ హైవేపై ఽబుధవారం సాయంత్రం మృతదేహంతో ధర్నాకు దిగారు. అంతేకాకుండా రుత్విక్ కన్స్ట్రక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు సుమారు బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన పది మందికిపైగా మృత్యువాతపడ్డారని వారు ఆందోళన నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు ధర్నా నిర్వహించినప్పటికీ కంపెనీ వారు స్పందించలేదు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బద్వేలు అర్బన్ సీఐ, మైదుకూరు సీఐ, బి.మఠం ఎస్ఐలు రంగంలోకి దిగి మృతుని బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో చర్చించారు. మృతుడు జయరామిరెడ్డి, తీవ్రంగా గాయపడిన జయరామిరెడ్డిలకు కలిపి కేవలం రూ.12 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలిపినప్పటికీ మృతుని బంధువులు ఒప్పుకోలేదు. మృతునికి భార్య రమాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని పోషించే నాథుడు కరువవడంతో కంపెనీ వారు ముందుకు వచ్చి వారిని ఆదుకుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. -
బాలల రక్షణకు సమన్వయంతో పనిచేయాలి
– ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి కడప కోటిరెడ్డిసర్కిల్ : మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాలల సంరక్షణ లోకీలకంగా వ్యవహరించే తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, బాలల సంక్షేమ పోలీసు అధికారులు, ఎంఈఓలు సమన్వయంతో పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సభా భవనంలో బాలల రక్షణలో భాగస్వాముల పాత్రపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మానవీయ దృక్పథంతో సేవలు అందించాలన్నారు. బాల్య వివాహాల నిరోధంలో తహసీల్దార్లు సహకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీఓల పాత్ర ప్రధానమన్నారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న వారికి మహిళా శిశు సంక్షేమశాఖ తరుపున శ్రీలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ సాయిగ్రేస్తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాయచోటిలో అలజడి
రాయచోటి : ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం. ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది. పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆధారాలు లభ్యం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇరువురి అరెస్టు అనంతరం వారి గృహాల్లో పోలీసులు మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు అణవణువునూ శోధించారు. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ రెండు గృహాలను సీజ్ చేశారు. వివాహాలపై.. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఇద్దరు ఉగ్రవాదులు సంసార సాగరంలో కొనసాగారు. అబూబకర్ గాలివీడు మండల పరిధిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె జన్మించి అనారోగ్యంతో మృతిచెందింది. మహమ్మద్అలీ పట్టణంలోని బిరాంసాహెబ్వీధికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి వివాహానికి, ఇతర కార్యకలాపాలకు సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీవ్రవాదుల భార్యలను, వారి బంధువులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు వీరికి అన్ని రంగాలలో సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిఘా నీడలో రాయచోటి.. దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో జిల్లా ఎస్పీ రాయచోటిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పట్టణంలోకి ప్రవేశిస్తున్న వాహనాలతో పాటు, వివిధ అంశాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు భారీగా పేలుడు పదార్థాల సామగ్రి, సాంకేతిక పరికరాలు, ఉగ్రవాదుల సమాచారం లభ్యం ఉగ్రవాదుల గృహాలను సీజ్ చేసిన పోలీసులు ఎస్పీ అదుపులో ఉగ్రవాదుల కుటుంబసభ్యులు సహకారం అందిస్తున్న వారితో రహస్య విచారణ రాయచోటి పట్టణంలో పటిష్టంగా నిఘా -
డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 మల్టీ డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 232 పరుగులు చేసింది. కడప జట్టు మొదటి ఇన్నింగ్స్లో 303 పరుగులు చేసింది. ఒక వికెట్ నష్టానికి 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు రెండవ ఇన్నింగ్స్లో 114.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 419 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ అద్భుతంగా బ్యాటింగ్లో రాణించి 103 పరుగులు (సెంచరీ) చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 80 పరుగులు, రోహిత్ 73 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 4, చరణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 13.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో కడప జట్టు ఆధిక్యత సాధించింది. -
ఒకే గదిలో ఐదు తరగతులు
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గది ఉండటంతో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు అదే గదిలో ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 25మంది విద్యార్థులు ఉన్నారు. ఏకై క ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు చదువులు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉంది. అలాగే పాఠశాల భవనాలు కూడా వర్షం వచ్చినప్పుడు వర్షపునీరు గదుల్లోకి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరో ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గండి టెండర్లు .. కొన్నింటికే ఆమోదం చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. టెండర్ల కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ, ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, మాజీ చైర్మన్లు కావలి వీరభాస్కరుడు, కల్లూరు వెంకట స్వామి, ఆలయ సూపరింటెండెంట్ సుభాష్, ఆర్కే వ్యాలీ పోలీసులు పాల్గొన్నారు. 8 తులాల బంగారం, రూ.30 వేలు చోరీ సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామంలో రోడ్డు నంబర్ 10వ వీధిలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ఓ ఇంటిలో 8 తులాల బంగారు, రూ. 30 వేల నగదును చోరీ చేశారు. బాధితుడు మోదుగుల నరసింహులు వివరాల మేరకు.. మాధవరం–1 గ్రామంలో ఉన్న తన తండ్రి నరసింహులు(68) ఆదివారం ఉదయం మృతి చెందాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని తన భార్య లక్ష్మిప్రసన్న పొత్తప్పి గ్రామానికి తీసుకెళ్లిందన్నారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని తాను కువైట్ నుంచి సోమవారం పొత్తపికి వచ్చానన్నారు. అంత్యక్రియల అనంతరం బుధవారం మాధవరం–1 గ్రామానికి వచ్చామన్నారు. తమ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న బీరువాను తెరిచి దుస్తులను చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించామన్నారు. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, రూ. 30వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ను అపహరించుకొని వెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ మహమ్మద్రఫీ, ఏఎస్ఐ సుబ్బరామచంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
అస్థిర పాలనలో తప్పటడుగు.!
కడప రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజే ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగుకు బదులుగా ‘అస్ధిర పాలనలో తొలి తప్పటడుగు’ అనేలా సాగిందనే ఆరోపణలు వినిపించాయి. పరువు నిలబెట్టుకొనేందుకు తంటాలు... కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యుతకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం తదితర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నివాసాలను సందర్శించి పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అదే సందర్భంలో పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. పథకాలు అందలేదని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని గ్రహించి, ఆ తలనొప్పి ఎందుకని పార్టీ నేతలు చాలా నియోజక వర్గాల్లో తమకు అనుకూలమైన, ఎంపిక చేసిన నివాసాలను మాత్రమే సందర్శించారు. కొన్ని చోట్ల పింఛన్లు రాలేదు..తల్లికి వందనం డబ్బులు పడలేదు అంటే, ఇళ్లుందా, కారుందా అని అడిగి చూస్తాం..చేస్తాం అంటూ నేతలు చేతులు దులుపుకున్నారు. ప్రొద్దుటూరులో 1వ వార్డులో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను చెప్పుకుంటూ వెళ్లారు. మైదుకూరులో రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు 31వ వార్డు రఘునాథపురంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ సమన్వయకర్త రితీష్రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల నుంచి పథకాల అమలు తీరు గురించి తెలసుకోవడం కంటే పథకాల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. కడప నగరం 10వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఏకరువు పెట్టారు. జమ్మలమడుగులో పార్టీ ఇన్చార్జి భూపేష్రెడ్డి వెంకటేశ్వర కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన నివాసాలను సందర్శించినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణులకు అగ్ని పరీక్షగా మారింది. ఇటు ప్రజల్లో..అటు అధిష్టానం వద్ద పరువును నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నారని ఆ పార్టీలో చర్చసాగుతోంది. ఎంపిక చేసిన నివాసాల సందర్శన ‘చూస్తాం..చేస్తాం’ ఇదీ నేతల తీరు ప్రజల్లోకి వెళ్లాలంటే తమ్ముళ్ల ఇబ్బందులు టీడీపీ ‘ఇంటింటికీ సుపరిపాలన’లో మొదటి రోజే నైరాశ్యం -
సీమకు నీళ్లివ్వండి బాబూ!
‘కరెంట్’ టాపిక్.. ● శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన...రైతుల్లో గుబులు ● సీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు! ● కూటమి ఎమ్మెల్యేలపై సర్వత్రా విమర్శలు కూటమి నేతల నిర్లక్ష్యం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలను విడుదల చేసే విషయంలో సీమకు చెందిన కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యుత ఉత్పాదన చేపట్టారు. వరద ప్రభావం కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఇందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతే కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. –సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, కడప కనీస నీటిమట్టం నిర్వహించాలి శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులను నిర్వహించాలి. ఆపై వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. – దస్తగిరిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతుసంఘం,కడప కడప సెవెన్రోడ్స్: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు బోసిపోయినట్లు అగుపిస్తున్నాయి. వరద ప్రవాహం బాగా ఉన్నప్పుడు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఎమ్మెల్యేలంతా అధికార టీడీపీకి చెందిన వారైనప్పటికీ పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు వద్ద విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. ఆ మేరకు నీరు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయానికి వెళుతోంది. దీంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం ఒక్కసారిగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సీమకు నీటి విడుదలపై ప్రభు త్వం నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడని నేపథ్యంలో బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కర్నూలులోని చీఫ్ ఇంజనీరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ● ఇన్నాళ్లూ ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి వరద ప్రభావం భారీగా వచ్చి చేరడం, విద్యుత్ ఉత్పాదన చేపట్టకపోవడం వంటి కారణాలతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరడంతో రాయలసీమ రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా నీరందితే సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి వీలవుతుందని భావించారు. శ్రీశైలం జలాశయంలో మంగళవారం విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం కుడిగట్టు కాలు వ వద్ద విద్యుత్ ఉత్పాదన ద్వారా 27,708 క్యూసెక్కుల నీరు దిగువనున్న కృష్ణానదిలోకి వదులుతోంది. ఎడమగట్టు కాలువ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ద్వారా 35,315 క్యూసెక్కులు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయం రెండు వైపుల నుంచి 63,023 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. బుధవారం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం 64097 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్ ఉత్పాదన వల్ల కొంత నీరు పోయినా ఇన్ఫ్లో ద్వారా 1074 క్యూసెక్కుల నీరు మిగులు ఉన్నట్లే కదా అని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. అయితే వరద ప్రవాహం స్థిరంగా ఉండదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారమే సోమవారం సుమారు లక్షా 50 వేల క్యూసెక్కులు ఉన్న శ్రీశైలం ఇన్ఫ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 64,097 క్యూసెక్కులకు పడిపోయింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి శ్రీశైలం నీటిమట్టం 875.40 అడుగులుగా ఉంది. ప్రస్తుతం డ్యాంలో 165 టీఎంసీలు ఉన్నాయి. ● తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలకుగాను ప్రస్తుతం 1.83 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 15.12 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ, ఇన్ఫ్లో జీరోగా ఉంది. ఔట్ఫ్లో 80 క్యూసెక్కులు ఉంది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 17.74 టీంఎసీలు కాగా, ప్రస్తుతం 6.24 టీఎంసీ(35.17 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో..అవుట్ ఫ్లో 132 క్యూసెక్కులు ఉన్నాయి. ● గోరకల్లు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.13 టీఎంసీ (25.16 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో, అవుట్ ఫ్లో 70 క్యూసెక్కులు ఉన్నాయి. అవుకు కాంప్లెక్స్ రిజర్వాయర్ సామర్థ్యం 4.15 టీఎంసీకిగాను ప్రస్తుతం 1.68 టీఎంసీ (40.53 శాతం) ఉన్నాయి. గండికోట సామర్థ్యం 26.85 టీంఎసీకిగాను ప్రస్తుతం 14.77 టీఎంసీ (54.99 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 470 క్యూసెక్కులు. మైలవరం సామర్థ్యం 9.98 టీఎంసీకిగాను 2.57 టీఎంసీ గా ఉండగా, ఇన్ఫ్లో 0, అవుట్ ఫ్లో 131 క్యూసెక్కులు. పైడిపాలెం సామర్థ్యం 6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.46 టీఎంసీ ఉన్నా యి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. సర్వరాయ సాగర్ సామర్థ్యం 3.06 టీఎంసీకిగాను ప్రస్తుతం 0.89 టీఎంసీలు ఉండగా, ఇన్ఫ్లో 70, అవుట్ ఫ్లో 48 క్యూసెక్కులు ఉన్నాయి. నోరు మెదపని ప్రజాప్రతినిధులు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూ రు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతి నిద్యం వహిస్తున్న శాసనసభ్యులందరూ అధికార కూటమికి చెందిన వారే. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు మెజార్టీని కట్టబెట్టారు. అయితే, ఈ ప్రాంత సాగునీటి విషయంపై వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఆయకట్టు రైతుల్లో వినిపిస్తున్నాయి. వరద ప్రభావం బాగా వస్తున్న రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాశయాలను నింపేందుకు చర్యలు తీసుకుని ఉండాల్సిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని సాగర్కు విడుదల చేస్తూపోతే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు స్పందిస్తారో లేదో చూడాలి. -
పేద విద్యార్థులకు వరం.. గురుకులం
బ్రహ్మంగారిమఠం: నాణ్యమైన విద్య, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (బాలుర) మహా గురుకులం విద్యాలయం పేద విద్యార్థుల పాలిట వరం అని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. బుధవారం బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో అకడమిక్ భవనాల్లో తరగతులు, వసతి గృహ భవనాలను కలెక్టర్, మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ లతో కలిసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి.మఠం మండల కేంద్రానికి సమీపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో గురు కులం రూపుదిద్దుకుందన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామ ర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 640 మంది విద్యార్థులతో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ మహా గురుకులం కీర్తి రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 21 కోట్ల వ్యయంతో మహా గురుకులం నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. మైదుకురు నియోజకవర్గ అభివృధ్ధి కోసం కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అన్నింటికీ మూలం ఒక్క విద్యనే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉషశ్రీ మాట్లాడారు. అనంతరం అధికారులు తరగతి , హాస్టల్ గదులు.. వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, డీఈవో షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏసీపీ నిత్యానందరాజు,సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మహా గురుకుల విద్యాలయంలో తరగతుల ప్రారంభోత్సవం -
నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ, సాయిబాబా విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై అధికారుల వేధింపులు అధికమయ్యాయన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలిపేందుకు గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి 4 లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. పేద వర్గాలకు సంబంధించి 25 శాతం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ యాక్టు ఉన్నా అందులోని నిబంధనలు పూర్తి స్థాయిలో అధికారులు పాటించడం లేదన్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 90 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అందులో సగం ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ యాక్టు అనేకచోట్ల దుర్వినియోగమవుతోందన్నారు. ఇలా అనేక సమస్యలతో నిర్వహిస్తున్న బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు గంగయ్య యాదవ్, శివశంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇలియాస్ రెడ్డి, మైథిలి తదితరులు పాల్గొన్నారు. -
ఏ.ఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్
కడప అర్బన్: కడప పోలీసు కళాజాగృతి బృందం సభ్యులలో మహిళా డ్యాన్సర్పై అసభ్యంగా ప్రవర్తించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రాథమిక విచారణ చేయించారు. విచారణలో కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ తప్పు చేశాడనీ రుజువు కావడంతో అతనిపై వేటు వేశారు. నియామక పత్రాలు అందజేత కడప కోటిరెడ్డిసర్కిల్: రైల్వే ఇన్స్టిట్యూట్ భవన్ ఎన్నికలు వారం రోజుల కిందట ఏకగ్రీవంగా ముగిశాయి. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం రైల్వే పోలింగ్ ఆఫీసర్ రాధాకృష్ణయ్య, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గంగాదేవి ఎన్నికై న వారికి అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీగా రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా నరేష్కుమార్, కోశాధికారిగా వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటింగ్ కమిటీ సభ్యులుగా లక్ష్మినారాయణ, చినబాబు, ఎలక్ట్రికల్ కమర్షియల్ ఇంజనీరింగ్ ఎస్అండ్టీ కమిటీ సభ్యులుగా రాజేష్కుమార్, గీత, అనిల్కుమార్, మస్తాన్లకు నియామక పత్రాలను అందజేశారు. సహకార సంఘాలు అభివృద్ధికి సహకరించాలి కడప అగ్రికల్చర్: జిల్లాలో సహకార సంఘాల భవిష్యత్తు ప్రణాళికలను రచించి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి సిబ్బంది సహకరించాలని జిల్లా సహకార శాఖాధికారి యం. వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా బుధవారం కడప డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు సక్రమంగా పనిచేయడానికి కృషి చేయాలన్నారు. ప్రొద్దుటూరు సీటీసీ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస రావు మాట్లాడారు. అనంతరం సహకార శిక్షణా కేంద్రం ప్రొద్దుటూరులో 10వ బ్యాచ్ డీసీఎం, సీఏ విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి వారిని కోర్సులో నమోదు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ పుష్పలత, కృష్ణరెడ్డి, నాగరత్నం, సత్యనందం, వెంకట రమణ, శ్రీధర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజన్ ప్లాన్ అమలుపై దృష్టి కడప సెవెన్రోడ్స్: జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్లో స్వర్ణ ఆంధ్ర విజన్– 2047 లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియోజకవర్గ స్పెషల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లా, నియోజకవర్గ, మండలాల అభివృద్ధి విజన్ ప్లాన్పై ప్రతి ఒక్క నియోజకవర్గ స్పెషల్ అధికారులు,మండల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో విజయవంతమైన వారు ఇతరులకు సహకారాన్ని అందించడం,నాలెడ్జ్ షేరింగ్ లాంటి అంశాలు పీ4 పాలసీలో ఇమిడి ఉన్నాయన్నారు. అలాగే ప్రతి గ్రామం, మండలాలలో మార్గదర్శులను గుర్తించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 76 వేలకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. అన్ని మండలాలలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. బీఈడీ పరీక్షలు ప్రారంభం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ కళాశాలల రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె. ఎస్ వి కృష్ణారావుతో కలిసి తనిఖీ చేశారు. కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను, వసతులను పరిశీలించారు. 4,551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను పంపామని, ప్రత్యేకంగా హై పవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. -
‘గురుకులం’ పనులు పూర్తి చేయండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో వెనుకబడిన తరగతుల పేద విద్యార్థులకు అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం త్వరలో నిర్వహణలోకి రానుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులు, వసతులు సంబంధిత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని త్వరలో నూతన భవనంలో మారుస్తామని వెల్లడించారు. రెండు నెలల్లో గురుకులంలో ఎలాంటి మౌళిక సదుపాయాల కొరత లేకుండా రోడ్లు, విద్యుత్, నీటి పైప్ లైన్, గ్రీనరీ, డ్రిప్ ఇరిగేషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఆర్ అండ్ బీ ఈఈ మాధవి, డీఈ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ ఎ.నిత్యానందరాజులు, కాంట్రాక్టు ఏజెన్సీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో కడప–నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. మంగళవారం రెండవ రోజు తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 129 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించగా 67.3 ఓవర్లలో 303 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధీరజ్కుమార్ రెడ్డి 70 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 4 వికెట్లు, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 62 పరుగులు, కారుణ్య ప్రసాద్ 46 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 179 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 58.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిహాన్ 159 బంతుల్లో 29 ఫోర్లు, 2 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. తమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. మంజునాఽథ్ 2 వికెట్లు, తేజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 34.5 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్ నాయుడు 3 వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 4.2 ఓవర్లకు 29 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. 7 వికెట్లు తీసిన అనంతపురం బౌలర్ వరుణ్ సాయి నాయుడు 6 వికెట్లు తీసిన చిత్తూరు బౌలర్ సాయి చరణ్ -
నేటి నుంచి టోల్ ఫీజు
ముద్దనూరు : నూతనంగా నిర్మాణం పూర్తయిన ముద్దనూరు–తాడిపత్రి 4లేన్ల జాతీయ రహదారిలో బుధవారం నుంచి టోల్ప్లాజా ప్రారంభించి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. మండలంలోని మంగపట్నం గ్రామ సమీపంలో ఈ టోల్ప్లాజా నెలకొల్పారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు సుమారు 55 కి.మీ. రహదారిని 4లేన్ల రహదారిగా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ రహదారి పనులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు,నిధులు మంజూరయ్యాయి. అనంతరం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవలే రహదారి నిర్మాణం పూర్తవడంతో నేటినుంచి వాహనాలకు టోల్ఫీజు కూడా వసూలు చేయనున్నారు. తాడిపత్రి,అనంతపురం,గుత్తి,బళ్లారి తదితర ముఖ్య ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. జలాశయాల్లో చేపల వేట నిషేధం కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి కృషి – మత్య్సశాఖ నూతన డీడీ నాగయ్య కడప అగ్రికల్చర్ : జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్(ఎఫ్ఏసీ) నాగయ్య పేర్కొన్నారు.జిల్లా మత్యశాఖ డీడీ గా నాగ య్య మంగళవారం కడప మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. నాగయ్యకు కార్యాలయ సిబ్బంది అభినందించారు.5న మెగా జాబ్మేళా బద్వేలు అర్బన్ : స్థానిక రాచపూడినాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 5న సియట్ కంపెనీ ద్వారా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఏఓ సాయిక్రిష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీసీఏలలో 2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 8297160304, 9703244614 నెంబర్లను సంప్రదించాలని కోరారు. నియామకం కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లా విద్యార్థి విభాగ కమిటీని నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా సి. సాయి నారాయణరెడ్డి(బద్వేల్), బి. శ్రీకాంత్రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కేసీ పాములేటి(జమ్మలమడుగు, ఆర్. మహేష్(కమలాపురం), శ్యామ్ మంచాల (కడప), నరేంద్రారెడ్డి (ప్రొద్దుటూరు), రాయు డు (మైదుకూరు), జిల్లా కార్యదర్శులుగా టి.మధుసూదన్రెడ్డి(మైదుకూరు), చైతన్య (ప్రొద్దుటూరు), పవన్కుమార్రెడ్డి(పులివెందుల), అబ్దుల్ ఖాదర్ (జమ్మలమడుగు), ఎన్. జయరామిరెడ్డి(కమలాపురం),రాకేష్ (బద్వేల్), మహ్మద్ సొహైల్ (కడప)ను నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి. ధీరజ్ గణేష్, ఎస్. లెన్నీ, వి. కార్తిక్ (కడప), విజయ్భాస్కర్రెడ్డి, కె. శ్రీనివాసులురెడ్డి(కమలాపురం), కె. శివప్రసన్న కుమార్, జి. నారారయణరెడ్డి, కె. రవీంద్రారెడ్డి(బద్వేల్), వి. ఆదిత్యనాథ్రెడ్డి, ఎస్. అఖిల్(ప్రొద్దుటూరు), షేక్ మహ్మద్, ప్రకాష్ వేముల(పులివెందుల), భరత్కుమార్రెడ్డి, షేక్ ఖలీల్బాషా (జమ్మలమడుగు), నరసింహారెడ్డి, వై. చైతన్యరెడ్డి(మైదుకూరు)లను నియమించారు. -
కల.. నిజమైన వేళ !
వారంతా శ్రమజీవుల బిడ్డలు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని.. కన్న వారి కలలను నిజం చేయాలని కలగన్నారు. కష్టపడి చదివారు.. వారి కష్టానికి ఫలితం దక్కింది. మహానేత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది. స్వప్నం సాకారమైన వేళ.. వారి కళ్ల నిండా సంతోషం కనిపించింది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ● రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 1010 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. 878 మంది విద్యార్థులు హాజరై ప్రవేశాలు పొందారు. త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. వైఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. భావిభారత ఇంజినీర్లుగా దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని అడ్మిషన్లు పాందిన విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం 878 మంది అడ్మిషన్లు పొందిన విద్యార్థులు -
ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలల విద్యార్థులకు ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం వైవీయూలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆచార్య కె. ఎస్ వి.కృష్ణారావు తనిఖీ చేశారు. పలువురు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మిప్రసాద్, డాక్టర్ ముని కుమారి మాట్లాడుతూ 684 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 99 గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రం అబ్జర్వర్ డాక్టర్ వి.రామకృష్ణ కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పి. చంద్రమౌళి పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలంపై కన్నేశారు !
వల్లూరు (చెన్నూరు) : ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చ నేతలు వాలిపోతున్నారు. వేలు..లక్షలు కాదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారం అండ చూసుకుంటూ.. అధికారుల తీరును ఆసరాగా మార్చుకుంటూ కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న స్థలం చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామ పొలంలో శాటిలైట్ సిటీ సమీపంలో ఉంది. సర్వే నెంబర్ 405/2 –68 సెంట్లు, 406/1– 47 సెంట్లు,406/2– 2.07 రెండు ఎకరాల ఏడు సెంట్లు, 406/3 –11 సెంట్లు వెరసి మొత్తం 3.33 ఎకరాలను ఆక్రమించేందుకు భూబకాసురులు పథక రచన చేశారు. సర్వే నెంబర్ 405 లో 70 సెంట్ల స్థలం కబ్జా విషయమై గత జూన్ 15న ‘సాక్షి’పత్రికలో పతాక శీర్షికన కథనం రావడంతో వెనక్కి తగ్గిన కబ్జాకోరులు ప్రస్తుతం 1 బి అడంగల్ లో 3.33 ప్రభుత్వ భూమిగా కనబడుతున్న దానిని ఆక్రమించేందుకు మళ్లీ పనులు మొదలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నమాచుపల్లి గ్రామ పొలం ప్రాంతంలో భారీగా వెంచర్లు వెలిసి ఉండడంతో, అక్కడి భూములకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ విషయాన్ని కూటమి నేతలు తమకు అనుగుణంగా మార్చుకొని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూ మి ఆక్రమణదారుల పాలు కాకుండా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. రూ. 10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు -
ముందుంది శ్రావణం.. ఏదీ స్వామి దర్శనం.!
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయం అంటే రాయలసీమ జిల్లాల్లో తెలియని వారంటూ ఉండరు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తుకు వచ్చేది కూడా గండిక్షేత్రమే. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. అయితే గండి వీరాంజనేయుడి మూలవిరాట్ దర్శనం కోసం గత నాలుగేళ్ల నుంచి ఎదురు చూసిన భక్త జనానికి ఈ ఏడాది కూడా నిరాశేశే ఎదురవుతోంది. ఇందుకు కారణాలు చూస్తే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయం పట్ల కొందరి నిర్లక్ష్యం. మరి కొందరి పంతాలు పట్టింపులు. ఇంకొందరి అసమర్థత ఇందులో బలంగా కనిపిస్తున్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో విలీనం చేసి కొంత వరకు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా రు.28 కోట్లు నిధులు మంజూరు చేసి చరిత్రను తిరగరాశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి శిలాఫలకం వేశారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే తొలుత పనులు వేగవంతంగా జరిగినా క్రమేపీ మంద కొడిగా సాగాయి. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పుణ్య కాలం కాస్తా పూర్తయింది. ఆలయం పనులు పూర్తవలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.తిరిగి ప్రభుత్వం అదికారం లోకి రాలేదు. ఆలయం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయం పనులు జోరందుకుంటాయని భక్తులు భావించారు. కాని ఇందుకు విరుద్ధంగా గత ప్రభుత్వంలోని పాలక మండలిని రద్దు చేయించి, తాము సీట్లో కూర్చోవాలి తర్వాతనే గుడి పునః ప్రతిష్ట పనులు అనే ధోరణితో కూటమి నేతలు ఉన్నట్లు తెలుసుకొని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభాభిషేకం జరగాలంటే సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కుంభాభిషేకం చేయకూడదని కొందరు చెబుతున్నారు. ఆ నిధులు ప్రభు త్వం నుంచి మంజూరు చేయించాలనే ఆలోచన ఏ ఒక్క కూటమి నేత చేయకపోవడం విచారకరం. పునః ప్రతిష్ట చేస్తే సరిపోతుంది కదా.. ఆలయం పనులు పూర్తయ్యాకే మహా కుంభాభిషేకం అంటున్నారు. ఇందుకు పనులు పూర్తి కాలేదు అంటున్నారు. అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలు మూల విరాట్కు అర్చకులు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఇన్ని చేసేవారు భక్తులకు స్వామి దర్శనం కూడా చేయించవచ్చు కదా అని చర్చించుకుంటున్నారు. పునః ప్రతిష్ట చేసేందుకు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి మహా అంటే వారం పది రోజుల్లో పూర్తవుతాయి. పైగా నిధుల ఖర్చు కూడా తగ్గుతుంది. భక్తులకు మూల విరాట్ దర్శనం చేయించిన వారు అవుతారు. దీనివల్ల ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ కోణంలో అధికారులు ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. పంతాలు పట్టింపులతో సరి.. ఆలయంలో 95 శాతం పైగా పనులు పూర్తయ్యా యని జూన్ నెలాఖరులోపు గుడి పునఃప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసేదుకు ముహూర్తపు తేదీని ఖరారు చేయాలని నాలుగు నెలల క్రితం దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ కర్నూలు డీసీ పట్టెం గురుప్రసాద్లు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులకు ఆదేశించారు. అయితే అర్చకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో ముహూర్తం నిర్ణయించేందుకు వీరు పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండి ఆలయ పునః ప్రతిష్టపై వీడని ఉత్కంఠ నాలుగేళ్లుగా నిరాశలో లక్షలాది మంది భక్తులు ఈ ఏడాదీ అదే పరిస్థితి -
●అవే పనులను కొనసాగిస్తున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పెద్దలు కక్ష రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యంగా పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. ‘డబ్బులు వెచ్చించి కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించాలని..’ ఏడాదిగా అడిగి..అడిగి అలసిపోయిన కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరకున్నాయి. ఈ దశలో ఇంకొంత కాలం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడానికి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ వేసింది. టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు అంటూ మరోమారు విచారణకు ఆదేశించింది. పులివెందులలోని పాడా పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లను మానసికంగా, ఆర్థికంగా ఉద్దేశ్యపూర్వకంగా వేధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, ీసీఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం చేసిన పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను (సహజంగా జిల్లా కేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి, కానీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్ల) విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. అన్ని శ్యాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే ఇక బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ ఎంచుకుంది. విజిలెన్సు ఫర్ టెండర్ వ్యాల్యూయేషన్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తి అయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్సు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించకముందే చేపట్టాలి. ఆయా ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంటు చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంటు విధి విధానాల ప్రకారం సంబంఽధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు జడ్జిమెంటు దశకు చేరుకున్న తరుణంలో అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వారు వాపోతున్నారు. పులివెందుల కాంట్రాక్టర్లపై పగబట్టిన ప్రభుత్వ పెద్దలు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు విచారణల పేరిట కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా అడ్డుకుంటున్న వైనం పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్శాఖల పరిధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను ప్రస్తుతం తెలుగుతమ్ముళ్లు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు, క్వాలిటీ ఫర్ విజిలెన్సు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం గమనార్హం. తెలుగుతమ్ముళ్లు ఆయా పెండింగ్ పనులు చేపడుతున్నారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. అంతెందుకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కాగా కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండటం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా అడ్డుకుంటూ మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
రాష్ట్రంలో విధ్వంసకర పాలన
బద్వేలు అర్బన్ : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారని కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ బయనపల్లె గ్రామంలో ఇటీవల కూటమి నేతల ఒత్తిడితో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన శ్రీకాంత్రెడ్డి ఇంటిని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందనేదానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. అన్యాయంగా ఇంటిని కూల్చి వేసి తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. గుడికి, బడికి 50 మీటర్ల దూరంలోనే మద్యంషాపు ఉండడం అసాంఘికమని..అటువంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిని నిర్మించుకుంటే అప్పుడు చెరువు స్థలమని కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కూల్చివేసిన ఇంటి పక్కనే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేశారని.. అప్పుడు చెరువు స్థలమని ఈ ప్రభుత్వానికి తెలియదా అని అన్నారు. శ్రీకాంత్రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసానిఆదిత్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మాజీ కుడా చైర్మన్ గురుమోహన్, జెడ్పీటీసీ పోలిరెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ గోపాలస్వామి, డీఎల్డీఏ చైర్మన్ మాధవరెడ్డి, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారుశీనయ్య, యద్దారెడ్డి పాల్గొన్నారు. రైతు కుటుంబానికి ఎంపీ పరామర్శ ఖాజీపేట : కూటమి పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. బి. కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి (42) మార్చి 19 న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళవారం రోజున బక్కాయపల్లె గ్రామానికి వచ్చి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సరైన దిగుబడి రాక పోవడం, దిగుబడి వచ్చిన సందర్భంలో గిట్టు బాటు ధర లేక నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ పీవీ రాఘవరెడ్డి, ఎపీఎస్ ఆర్టీసీ కడప మాజీ జోన్ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్రెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ రైతు విబాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి -
రక్తదాన ప్రాధాన్యతను గుర్తించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతి ఒక్కరూ రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రచురించిన రక్త వారోత్సవాల కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల రెండో వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేబీవీఎస్ వ్యవస్థాపకుడు అశోక్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కాశి, సురేంద్ర, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు ఈనెల 12, 13 తేదీలలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి, సెక్రటరీ పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూలై 12వ తేదీ రెండవ శనివారం కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో అండర్ 15, అండర్ 17 విభాగాలకు చెందిన బాల బాలికల ఎంపికలు జరుగుతాయన్నారు. అలాగే 13వ తేదీ ఆదివారం ప్రొద్దుటూరు జార్జ్ క్లబ్లో అండర్ 11, అండర్ 13 బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం లోపు 9440107080 లేదా 9440223908 నంబర్కు ఎంట్రీలను పంపాలని అసోసియేషన్ చైర్మన్ బాషా కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మైదుకూరు/బి.కోడూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బి.కోడూరు మండలం గుంతపల్లెకు చెందిన గుంత జయరామిరెడ్డి (42) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతపల్లెకు చెందిన జయరామిరెడ్డి జూన్ 29న ఖాజీపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే రోజు ఆయన శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తన బంధువు కొండా వెంకట రమణారెడ్డితో కలిసి మైదుకూరుకు వస్తున్నారు. జాతీయ రహదారి సర్వాయపల్లె అండర్ పాస్ వద్ద సిమెంట్ మిక్చర్ వాహనం వారిని ఢీ కొంది. సంఘటనలో జయరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొండా వెంకటరమణారెడ్డి చికిత్స పొందుతున్నాడు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ జయరామిరెడ్డి మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైకుల దొంగ అరెస్టుయశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది. -
శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు
కడప వైఎస్ఆర్ సర్కిల్/ కడప అర్బన్ : నిరంతరం శ్రమజీవుల పక్షాన, అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన, కపటం లేని ప్రముఖ సామాజిక కార్యకర్త, సీహెచ్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పుత్తా శివారెడ్డి(65) ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటని పలువురు రాజకీయ, సామాజిక, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థల నేతలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన శివారెడ్డి భౌతికకాయానికి నగరంలోని బాలాజీ నగర్లోని ఆయన నివాసంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు చంద్ర, చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం శక్తికి మించి శివారెడ్డి పని చేశారన్నారు. సమాచారం పొందడం ప్రజల హక్కు అని రహస్యాలు లేని పరిపాలన కోసం సమాచార హక్కు చట్ట రక్షణకు కృషి చేశారన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజాతంత్ర ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యేవారన్నారు. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టేందుకు ఎన్నికల నిఘా వేదికలో సభ్యులుగా తమ వంతు పాత్ర నిర్వహించేవారన్నారు. రిమ్స్లో శివారెడ్డి మరణించిన కొద్ది సమయంలోనే వారి కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు నేత్రదానం చేశారు. శివారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం రిమ్స్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దేహ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ, హేతువాద సంఘం నాయకులు సిఆర్వీ ప్రసాద్, నాగార్జున రెడ్డి, విరసం వరలక్ష్మి, శ్రీనివాసుల రెడ్డి, ప్రజానాట్యమండలి, నాస్తిక సంఘం నేత పల్లవోలు రమణ, లోక్ సత్తా శ్రీకృష్ణ, ఆప్ నేత డాక్టర్ శ్రీనివాసులు, రాయలసీమ ఎస్సీ ,ఎస్టీ మానవ హక్కుల వేదిక నాయకులు జేవీ రమణ, రిటైర్డ్ అధికారులు గోపాల్, ఫణిరాజు తదితరులు ఉన్నారు. -
సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం
కడప సెవెన్రోడ్స్ : బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకుల పాఠశాలకు తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ సగిలేరు గురుకుల పాఠశాలను యధావిధిగా అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1983లో ఏర్పడిన సగిలేరు గురుకుల పాఠశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి పాఠశాలను బి.మఠంలోని తోట్లపల్లె వద్ద ఉన్న మహా గురుకులంలో విలీనం చేయాలని భావించడం తగదన్నారు. ఇప్పటికై నా అధికారులు తమ నిర్ణయాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీపీఏ నాయకుడు భాస్కర్, ఏఐఎస్బీ రాయలసీమ కన్వీనర్ రాజేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. బాలింత మృతిపై విచారణబద్వేలు అర్బన్ : తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చి బాలింత మృతి చెందిన ఘటనపై సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.నాగరాజు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుండంరాజుపల్లె ఎస్టీ కాలనీలో సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో కాన్పులు చేయడం చాలా ప్రమాదకరమని, ఎలాంటి శిక్షణలేని మంత్రసానులు ఇళ్లల్లో సొంతంగా కాన్పులు చేయకూడదని తెలిపారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలోనే జరగాలని, గర్భిణులను ఆసుపత్రులకు తీసుకొని వెళ్లేందుకు 108 ఉపయోగించుకోవాలని సూచించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి మాత శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బంది పైన ఉందన్నారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు, మృతురాలి బంధువులను అడిగి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఏ. ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది ఖాజామొహిద్దీన్, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీబద్వేలు అర్బన్ : పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఆదివారం అర్ధరాత్రి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మైదుకూరు రోడ్డు వైపున ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ధ్వంసమయ్యాయి. రేణిగుంట నుండి బద్వేలు మీదుగా గోపవరం సమీపంలోని సెంచూరి పరిశ్రమకు కలప లోడుతో వెళుతున్న లారీ నాలుగురోడ్ల కూడలిలోకి వచ్చేసరికి మలుపు తిప్పుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. -
మహిళా పోలీసు కౌన్సెలింగ్లో నిబంధనలకు పాతర
కడప సెవెన్రోడ్స్ : సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్లో ఉన్నతాధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు మహిళా పోలీసులు సోమవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియేట్ మహిళా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమాదేవి, కార్యదర్శి కె.సత్యకుమారి, దీప్తి మాధురిలు మాట్లాడుతూ ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 646 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా లేదన్నారు. నిబంధనలు పాటించకుండా కేవలం స్పౌజ్కే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీఓ నెంబరు 6ను ఉల్లంఘించారని ఆరోపించారు. మెడికల్, పీహెచ్ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. కౌన్సెలింగ్ జాబితా కూడా ముందుగా నోటీసు బోర్డులో ప్రదర్శించలేదని చెప్పారు. ఒకే స్టేషన్లో పనిచేస్తున్న వారు, వేరే మండలాల నుంచి కూడా పనిచేస్తున్న వారు కడప యూఎల్బీలో పోస్టింగ్ తీసుకున్నారని వివరించారు. ఇందువల్ల మెరిట్ జాబితాలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కౌన్సెలింగ్ సమయంలో అన్ని సచివాలయాల పేర్లు చూపించలేదన్నారు. స్పౌజ్ కేటగిరీ కింద 14,215 ర్యాంకు వచ్చిన వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ మేరకు న్యాయమంటూ ప్రశ్నించారు. కౌన్సెలింగ్ రద్దుచేసి నిబంధనల ప్రకారం పారదర్శకంగా రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.జేసీకి మహిళా సంరక్షణ కార్యదర్శుల ఫిర్యాదు -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే ఫిర్యాదులను పరిశీలించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ఆమె అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపారు. ● తమ కుమారులు తమ వద్ద ఉన్న డబ్బు, బంగారం, స్థలాలు తీసుకుని తమను పోషించకుండా వదిలేశారని కడప విజయదుర్గ కాలనీకి చెందిన కుప్పం లక్ష్మినారాయణశ్రేష్టి ఫిర్యాదు చేశారు. వృద్ధులమైన తాను, తన భార్య జీవించడం కష్టంగా ఉందన్నారు. తామిచ్చిన స్థలాలు తమకు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ● వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ డీలర్లు ఇవ్వడం లేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్, కార్యదర్శి సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ● ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాలు మంజూరులో జాప్యం తగదని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ అన్నారు. దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల ద్వారా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారని, తర్వాత అర్హుల జాబితా విడుదల చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డీఆర్వో వెంకటపతి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిజిల్లాలో ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. సంతృప్తికరమైన ఆర్థిక పరిపుష్టిపై మూడు నెలలపాటు జిల్లాలో క్యాంపెయిన్ నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, బ్యాంకింగ్ రంగం ప్రచురించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో జేసీ ఆవిష్కరించారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, బ్యాంకింగ్ యాక్సెస్ విస్తరించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా నైపుణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్తోపాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
కవ్వింపు చర్యలు!
సాక్షి ప్రతినిధి, కడప : అధికార బెత్తం పట్టుకొని ఓ సామాజిక వర్గాన్ని అక్కడ అణగదొక్కారు. వారందర్నీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ ఆలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని వారు పట్టు బట్టారు. చేస్తున్న తప్పును తప్పు అన్నందుకు వివక్ష మరింత అధికమైంది. ఆపై అధికార మదం తోడైంది. ఫలితంగా వెంటవెంటనే కవ్వింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. క్రమం తప్పకుండా వాదులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి పోట్లదుర్తిలో పరస్పర రాళ్లదాడులు తెరపైకి వచ్చాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో కాస్తా ఉపశమనం దక్కినా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎరగ్రుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. తాగుబోతుల మధ్య నెలకొన్న స్వల్ప వాదులాట చిలికి చిలికి గాలివాన లాగా మారి రెండు సామాజిక వర్గాల మధ్య పెద్ద వివాదంగా మారింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. వైన్ షాపులో మద్యం సేవిస్తున్న ఇరువురు ఆ తర్వాత ఖాళీ బాటిల్ను వెనుకకు వేశారు. ఆ వైపు ఉంటూ మద్యం సేవిస్తున్న మరో ముగ్గురు బాటిల్ మా వైపు ఎందుకు వేశారంటూ గొడవ పడ్డారు. చూడకుండా చేసిన పొరపాటును సీరియస్గా తీసుకోవద్దని అక్కడి వారు సర్ది చెప్పారు. అంతటితో వదిలేసి ఉంటే సరిపోయేది. ఊర్లో మీ కథ పెద్దదైంది. మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటూ పరుష పదజాలంతో దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలయ్యాయి. సురేష్నాయుడుపై తిరుగుబాటు.. వైన్ షాపులో చోటుచేసుకున్న వివాదం పోట్లదుర్తి గ్రామంలో సీఎం సురేష్నాయుడు ఇంటిపై తిరుగుబాటుగా మారింది. ఎంతకాలం మీ దౌర్జన్యాలను భరించాలంటూ మరో సామాజిక వర్గం ఆదివారం అర్థరాత్రి తర్వాత సురేష్నాయుడు ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. ఈ క్రమంలో పరస్పర రాళ్ల దాడులు తెరపైకి వచ్చాయి. సుమారు గంట పాటు సురేష్నాయుడు ఇంటి సమీపంలో రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎర్రగుంట్ల పోలీసులు సకాలంలో గ్రామానికి చేరుకొని ఉద్రిక్తతలను శాంతింపజేశారు. ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కవ్వింపు చర్యల కారణంగా ఉత్పన్నమైన ఘర్షణ రెండు సామాజిక వర్గాలకు అంటుకుంది. దీనికి కారణం.. తమకు అడ్డు లేదు అనుకున్న సందర్భంలో పెద్దమ్మ దేవాలయం ప్రాంగణానికి మొత్తం ప్రహారీ నిర్మించాలని కొందరు పట్టుబట్టడమే. వెరసి ఇలాంటి వివాదాలు తరచూ తెరపైకి వస్తున్నాయని పలువురు వివరిస్తున్నారు. అధికారులు వారి విధులను పైరవీలకు తలొగ్గకుండా నిబద్ధతతో నిర్వర్తిస్తే ఇలాంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు. ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామాల్లో సమస్యలకు మూల కారకులుగా అధికారులు మారుతుండటం గమనార్హం. పోట్లదుర్తిలో పోలీసు పికెట్ కొనసాగుతున్నా వ్యవహారం నివురు గప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికై నా నిక్కచ్చిగా వ్యవహరించి కవ్వింపు చర్యలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోట్లదుర్తిలో హైటెన్షన్ మద్యంషాపు వద్ద స్వల్ప వాదులాట రెచ్చగొట్టి దాడికి పాల్పడిన సురేష్నాయుడు వర్గీయులు ఆపై పోట్లదుర్తిలో ఉద్రిక్తత.. పరస్పర రాళ్లదాడులు సకాలంలో స్పందించిన పోలీసు బలగాలు -
కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమ వారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూ రు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రా రంభించిన నెల్లూరు జట్టు 69.3 ఓవర్లకు 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 116 బంతుల్లో 74 పరుగులు, ఇకాషర్ 44 పరుగులు చేశారు. కడప జట్టులోని చరణ్ 4 వికెట్లు, నాగ కుళ్లాయప్ప 2 వికెట్లు, ధీరజ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 18 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు విఘ్నేష్ 53 పరుగులు, రణధీర్ రెడ్డి 47 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్లో అనంతపురం–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లకు 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 55 పరుగులు, లోహిత్ లక్ష్మీ నారాయణ 33 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. వరుణ్ సాయి నాయుడు 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిహాన్ చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 103 బంతుల్లో 108 పరుగులు చేశాడు. హమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, మంజునాఽథ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. ఉత్సాహంగా త్రోబాల్ పోటీలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగర శివార్లలోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ బీ–జోన్ , సీఐఎస్సీఈ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జోనల్ త్రోబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ త్రోబాల్ క్రీడాకారుడు డి. రేవంత్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు, క్రమశిక్షణ, జట్టు సమన్వయం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా –అండర్–17 విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప , ద్వితీయ స్థానంలో శ్రీ వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లి, అండర్–14 విభాగంలో విజేతలుగా స్విస్ రిఫరల్ హాస్పిటల్ స్కూల్ పలమనేరు, రన్నరప్ లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కడప, మూడవ స్థానం స్టెమ్ పబ్లిక్ స్కూల్, గుంటూరు నిలిచాయి. పాఠశాల ప్రిన్సిపాల్ అమిత్ సింగ్ ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెన్నేపల్లిలోనే పాఠశాల కొనసాగించాలి కడప సెవెన్రోడ్స్ : అట్లూరు మండలం చెన్నేపల్లె ప్రాథమిక పాఠశాలను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎస్.వెంకటాపురం పాఠశాలలోకి తరలించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చెన్నేపల్లెలోనే కొనసాగించాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. -
అయ్యో దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..
కురబలకోట : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన మూడు కుంటుంబాల వారు డ్రైవర్తో కలిపి 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రావెల్ టెంపోలో స్వగ్రామానికి వస్తుండగా మండలంలోని చెన్నామర్రి వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మేఘర్ష్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నరసింహారెడ్డి (49), రూప (40) ఆదర్స్ (19), రామంద్రప్ప (45), కళావతి (40), దర్సన్ (16), శివప్ప(42), సునందమ్మ (38) చైత్ర (19) తోపాటు ట్రావెల్ టెంపో ఢ్రైవర్ మంజునాధ (42) ఉన్నారు. అర్తనాదాలు, విలాపాలతో సంఘటన స్థలం శోకతప్తమైంది. విషాదంతో కర్నాటకలోని బాగేపల్లె, కొత్త ఉడుంపల్లె గొల్లు మన్నాయి. పెనుప్రమాదం సంభవించడంతో కురబలకోట, మదనపల్లె ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గాయపడిన వారిని 108 వాహనం, పోలీసు వాహనంలో తరలించారు. డ్రైవర్ మంజునాథ తీవ్రంగా గాయపడడంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. నరసింహారెడ్డి, శివప్ప కుటుంబాలకు చెందిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నాటక రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా ట్రావెలర్ టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.టాప్తో సహా లేచిపోయిందిట్రావెలర్ టెంపో జరిగిన ప్రమాదం చూస్తే గండెలు తరుక్కుపోతాయి. ట్రావెలర్ టెంపో డ్రైవర్ పక్కగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అటు వైపు ఉన్న వారు ముగ్గురు చనిపోగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ వేగంగా ఢీ కొట్టడంతో టెంపో ట్రావెలర్ వాహనం టాప్ ఏమాత్రం లేకుండా లేచిపోయింది. సీట్లలోనే తీవ్ర గాయాలతో అంగలార్చడం చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. సంఘటనఽ స్థలం రక్తసిక్తమంది. పోలీసులు సకాలంలో స్పందించారు. స్థానికులు కూడా సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక్కో కుటుంబలో ఒక్కరు..మండలంలోని చెన్నామర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందడం కలవరాన్ని కల్గిస్తోంది. బాగేపల్లె నుండి నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుటుంబాల వారు తిరుమల యాత్ర వెళ్లారు. నరసింహారెడ్డి కుటుంబంలో అతని కుమారుడు మేఘర్స్ (16), రామచంద్రప్ప కోడలు శ్రావణి (24), శివప్ప కుటుంబం నుండి చరణ్ (17) మృతి చెందారు. వీరిలో శ్రావణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. మిగిలిన వారు విద్యార్థులు.అదృష్టవంతులుప్రమాదానికి గురైన ట్రావెలర్ టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32) కూర్చున్నాడు. ఇతని వెనుక సీట్లో బాగేపల్లె దగ్గరున్న ఎ. కొత్తపల్లెకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమల గుండు చేయించుకున్నారు. వీరు డ్రైవర్కు ఎడమ పక్కన సీట్లలో ఉండడం వల్ల పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 15 మందిలో వీరిద్దరికి రక్త గాయాలు కాలేదు. అంత ప్రమాదంలో వీరు బతికి బట్టకట్టడం అధృష్టమేనని చెబుతున్నారు. -
ప్రజాస్వామ్యానికి ‘కూటమి’ తూట్లు
పులివెందుల : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక భాకరాపురంలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను తుంగలో తొక్కి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపిందన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి.. ఎట్టి పరిస్థితులలోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పనిచేయవద్దని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. పార్టీలనేవి కేవలం ఎన్నికల వరకేనని తర్వాత ప్రజలందరూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగమేనని గట్టిగా నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఎంపీ అవినాష్రెడ్డి విమర్శించారు. సోమవారం కొంతమంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీని కలిశారు. తమను అకారణంగా తొలగిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఆ పథకంలో అవినీతికి అంతులేకుండా పోయిందని.. కూలీలతో చేయించాల్సిన పనులను మిషన్ల ద్వారా కొద్ది గంటలు మాత్రమే చేయించి బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. వ్యవస్థలను దిగజారుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవస్థలను దిగజారుస్తోందని ఎంపీ మండిపడ్డారు. ఇటీవల పులివెందులలో టీడీపీ తోరణాలు తొలగించారన్న కారణంతో మైనర్ బాలురులపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. బెయిల్పై వచ్చిన మైనర్ బాలురు, వారి కుటుంబ సభ్యులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ పిల్లలు చదువుపై దృష్టి సారించాలని, మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా మైనర్ బాలురపై అక్రమ కేసు పెట్టడం నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇలాగే అక్రమ కేసు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తోపాటు ఇతర నాయకులకు ఆయన మనో ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కైలాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులు ప్రదానం చేశారు. 8 కౌంటర్లు.. ఉదయం 6 గంటలకే ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఎంట్రెన్స్ విభాగంలో ఉన్న రాజీవ్ సర్కిల్ వద్ద ముందుగా వచ్చిన విద్యార్థులకు టోకన్లను అందజేశారు. వివిధ దశలలో స్క్రీనింగ్ చేయడానికి 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ● తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు. ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి రవికుమార్, ఫైనాన్స్ అధికారి కోటేశ్వరి, అధికారులు లింగమూర్తి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, రఫి, జ్ఞాన వెంకట్, నవీన్, పవన్ కుమార్, ఆనంద్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ● మంగళవారం రోజు మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. తొలి రోజు 481 మందికి అడ్మిషన్లు -
పారదర్శకంగా మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్
కడప అర్బన్ : సాధారణ బదిలీల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి కడప జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు మొత్తం 646 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు. దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్, తదితరులను వారి సమస్యల ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని, వైద్యుల పర్యవేక్షణలో నిజ నిర్ధారణ చేసుకుని పారదర్శకంగా బదిలీలు చేపట్టామని తెలిపారు. అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పి. బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, డి.పి.ఓ ఏ.ఓ జ్యోతి, సూపరింటెండెంట్లు, శ్రీనివాస నాయక్, సురేష్, క్లర్కులు ఏ8 అగస్టీన్, ఏ10 గురప్ప, ఐ.టి.కోర్ టీమ్ కానిస్టేబుల్ విశ్వనాథ్, డి.పి.ఓ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
పులివెందుల : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె నుంచి పాల ఆటో పులివెందులకు వస్తుండగా జేఎన్టీయూ సమీపంలోకి రాగానే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆ వ్యక్తిని ఆటో ఢీకొట్టి ఆటో పల్టీ పడింది. ఈ ప్రమాదంలో కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారిపల్లెకు చెందిన షబానా, శంషాద్ అనే మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న క్రిష్ణంగారి పల్లెకు చెందిన హనుమంత్ రెడ్డికి నడుము భాగంలో గాయం కావడంతో అతను లేవలేని స్థితిలో రోడ్డుపైనే పడిపోయాడు. ఆ సమయంలో అటువైపుగా పులివెందులకు వస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన కాన్వాయిని ఆపి కిందికి దిగి గాయాలపాలైన హనుమంత్ రెడ్డిని పరామర్శించి అప్పటికి అక్కడికి 108 వాహనం గాని చేరుకోకపోవడంతో తన సెక్యూరిటీ వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించాలని అనుచరులకు ఆదేశించారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెక్యూరిటీ వాహనంలో హుటాహుటిన గాయాలైన హనుమంత్ రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లక్కిరెడ్డిపల్లెలోని అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంగమ్మా ..కరుణించమ్మా.. సకాలంలో వర్షాలు కరుపించు తల్లీ అంటూ భక్తులు అంటూ వేడుకున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
బద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్సీ ఏఎన్ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్సీకి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హుటాహుటిన పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. తన భార్య పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవ డం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది మాత్రం డాక్టర్ వచ్చేలోపే వారు వెళ్లిపోయారని చెబుతున్నారు. -
కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు. డిజిటల్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, డీపీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఖాదర్బాషలు హాజరై డిజిటల్ అసిస్టెంట్ల పత్రాలను పరిశీలించారు. జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఇందులో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారు 274 మంది, రిక్వెస్ట్ బదిలీ కోసం 40మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చని తెలిపారు. ● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చున న్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు
పులివెందుల : పట్టణంలోని భాకరాపురంలో గల డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రి(దినేష్ మెడికల్ సెంటర్)లో ఆదివారం నుంచి డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన డయాలసిస్ యూనిట్ను డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇ.సి.దినేష్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుందని నాన్న (డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి) చెప్పేవారన్నారు. ఆయన కోరిక ప్రకారం ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. నాన్నగారు పులివెందుల నియోజకవర్గంలోని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రిని అప్పట్లో ఏర్పాటు చేశారన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి ప్రజలు పులివెందులకు వచ్చి వైద్య సేవలు పొందేవారన్నారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలోని వైద్య ఖర్చులకు మన ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి బావ ప్రజలకు ఎంతో వైద్య సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గంగిరెడ్డి సార్ వద్దకు వెళితే ఎలాంటి రోగమైనా నయమవుతుందని ఆయన హస్తవాసి చాలా మంచిదని ప్రజలు నమ్మేవారన్నారు. డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఇ.సి. గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఇంతకుమునుపు దూరప్రాంతాలకు వెళ్లేవారని అలా కాకుండా ఇప్పుడు పట్టణంలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డాక్టర్ హర్షవర్దన్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నప్పటికి పడకలు సరిపడక కర్నూలు, నంద్యాల వంటి దూర ప్రాంతాలకు రోగులు వెళ్లేవారన్నారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇక్కడ డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రిలోని డాక్టర్ల పాత్ర ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వాసు, డాక్టర్ గంగాదేవి, డాక్టర్ పవన్కుమార్, డాక్టర్ రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ సుకన్య, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సుప్రజ, డాక్టర్ షబానా, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి సన్నిహితులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, శశికాంత్రెడ్డి, దశరథరామిరెడ్డి, రసూల్, సర్వోత్తమరెడ్డి, హాలు గంగాధరరెడ్డి, రజనీకాంత్రెడ్డి, కోడి రమణ తదితరులు పాల్గొన్నారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తాం : డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి పాల్గొన్న వైఎస్ మనోహర్రెడ్డి, వైద్యులు, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి సన్నిహితులు -
పిచ్చికుక్క స్వైర విహారం
బద్వేలు అర్బన్ : పట్టణంలో అబ్బరాతివీధిలో ఆదివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అబ్బరాతివీధికి చెందిన మోహన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా మీద పడి దాడి చేసింది. తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అలాగే పట్టణంలోని కోటవీధిలో కృతిక్ అనే బాలుడు, పప్పుల వీధిలో సన్విన్ అనే బాలిక పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి కుక్కను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బందిని పురమాయించారు. ఎట్టకేలకు అబ్బరాతివీధిలో మున్సిపల్ సిబ్బంది పిచ్చికుక్కను పట్టుకుని అంతమొందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. గుంటూరు కొట్టాలులో చోరీమైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గుంటూరు కొట్టాలు గ్రామంలో నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వసారాలో నిద్రిస్తున్నారు. ఇంటి వెనుక వైపున గోడకు కన్నం వేసిన దుండగులు ఇంటిలోకి ప్రవేశించి బీరువా పగలగొట్టారు. అందులోని 15 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి వస్తువులు, రూ.25 లక్షల నగదును దోచుకెళ్లారు. ఉదయం లేచి ఇంటిలోకి వెళ్లిన వెంకటసుబ్బారెడ్డి బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సంఘటనపై మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బాధితుని ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఇంటిలో వేలిముద్రలను సేకరించారు. అర్బన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు. తాము డబ్బులిచ్చిన రవి అలియాస్ రఫిని ప్రశ్నించగా తాను కూడా గుంటూరుకు చెందిన వలీ అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పాడు. దీంతో బాధితులు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు రవి అలియాస్ రఫీపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితులు ఏజెంట్ రవి ఇంటి వద్ద ఆందోళన చేస్తుండగా తాలూకా ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జమ్మలమడుగులో రవిపై కేసు నమోదైందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆందోళన విరమించాలని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఏజెంట్ రవిని వివరణ కోరగా తనకు రూ.80 లక్షలు డబ్బులు రావాలన్నారు. ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తే, తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారు పారిపోతారని తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.మోసగించిన వ్యక్తి ఇంటివద్ద బాధితుల ఆందోళన -
వచ్చేనెల 12 నుంచి జేవీవీ రాష్ట్ర మహాసభలు
కడప ఎడ్యుకేషన్: కడపలో జులై 12, 13 తేదీల్లో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. జన ఈ విషయాన్ని విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు బి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కడప ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి జేవీవీ పోరాడుతోందన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి తమ వేదిక ప్రధానంగా కృషి చేస్తోందన్నారు. జేవీవీ సమాచార కార్యదర్శి పి. సలావుల్లా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఆరోగ్యం, విద్యా కేంద్రీకృతంగా తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. కడపలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు కె. సురేష్ బాబు, సుధాకర్, ఇలియాస్బాషా,వెంకటరామిరెడ్డి, శేషారెడ్డి,భాస్కర్, నాగార్జునరెడ్డి, గౌరీ శంకర్, మహబూబ్ బాషా,వెంకటశివ,వలిరాజు,భాగ్యలక్ష్మి, ఎల్లేశ్వర రావు,హైదర్ అలీ, రమణారెడ్డి,సుబ్బారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. వీఆర్కు సీఐ నాగార్జున కడప అర్బన్: కడప నగరంలోని టూటౌన్ సీఐగా పనిచేస్తున్న బి.నాగార్జునను కడప వీఆర్కు తరలిస్తూ కర్నూలు– కడప రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులను జారీ చేశారు. సీఐపై వచ్చిన పలు రకాల ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీఆర్కు పంపినట్లు సమాచారం. ఈ మేరకు సీఐ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ వద్ద హాజరై ఉత్తర్వులను ఆందుకున్నారు. -
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరుకు వెళ్లే రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆటో ఢీకొని రోడ్డుపై కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులకు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చెందిన బాలాజి పాల డెయిరీ ఆటో పులివెందులకు ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా ముద్దనూరు రోడ్డు సమీపంలోని హనుమాన్ గోల్డెన్ సిటీ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి (57) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న షబానా, శంషాద్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
ఒక భూమి అమ్మితే మరో భూమి ఆక్రమించారు
కడప రూరల్ : అధికార పార్టీ నేతల అండతో భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చింతకొమ్మదిన్నె మండలం, లింగారెడ్డిపల్లెకు చెందిన బి.ఈశ్వర్రెడ్డి కోరారు. మండల పరిధిలోని బుగ్గలేటిపల్లె గ్రామ పంచాయతీలో చిత్తూరు ప్రధాన రహదారికి ఆనుకొని తనకు మొత్తం 3.70 ఎకరాల భూమి ఉందన్నారు. ఇరవై ఏళ్ల కిందట రోడ్డుకు ఆనుకొని ఉన్న తన మొత్తం భూమిలో వెనుకవైపున ఉన్న 70 సెంట్లను కడప నగరం ఐటీఐ సర్కిల్లో నివాసముంటున్న ఒక వ్యక్తికి విక్రయించానని పేర్కొన్నారు. తరువాత తాను ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లానని తెలిపారు. కాగా ఇటీవల నాలుగు నెలల క్రితం తన భూమిని పరిశీలించగా, తన నుంచి 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అక్రమంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ఫినిషింగ్ వేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆక్రమించిన వ్యక్తిని ప్రశ్నించగా ఇది తన స్ధలం, ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకోపో నువ్వు వెనక ఉన్న స్థలం తీసుకోపో అని బెదించారన్నారు. సర్వేయర్ వచ్చి కొలతలు వేసి చెప్పినా కూడా ఆక్రమించిన వ్యక్తి వినుకోవడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్కు రెఫర్ చేశారని తెలిపారు. అక్కడికి వెళితే పోలీసులు ఏ మాత్రం స్పందించలేదని వాపోయారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఆక్రమించిన వ్యక్తికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ విషయమై మరోమారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాగమునెమ్మ, ఈశ్వర్రెడ్డి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.న్యాయం కోసం బాధితుడి వేడుకోలు -
నిబంధనలు గాలికి..
కడప అగ్రికల్చర్: కడప కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యాన, వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండోరోజు ఉమ్మడి కడపజిల్లా సచివాలయ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు బదిలీ కౌన్సెలింగ్ కొనసాగింది. రెండోరోజు కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. కూటమి నేతలు ఇచ్చిన లెటర్లతోపాటు వారి ఫోన్లకే ప్రాధాన్యత కల్పించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే మంచి స్థానాలను కేటాయించారని చర్చించుకున్నారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి 269 మందికిగాను మొదటి రోజు 175 మందికి కౌన్సెలింగ్ను పూర్తి చేశారు. మిగతా 94 మందికి ఆదివారం నిర్వహించారు. ఇందులో కూడా స్పౌజ్, మెడికల్ కేసులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను కూడా పరిగణలోకి తీసుకోకుండా తమకు అన్యాయం చేశారని పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక డిజేబుల్ అమ్మాయిని లక్కిరెడ్డిపల్లె నుంచి రాజుపాలెం మండలానికి బదిలీ చేసినట్లు, మరో మెడికల్ గ్రౌండ్ ఉన్న అబ్బాయిని పెద్దముడియం నుంచి వీఎన్పల్లెకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మెరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని తెలిసింది. అలా ఒకరిద్దరికి కాకుండా చాలా మందికి అన్యాయం జరిగినట్లు తెలిసింది. కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిపించి వారికి వచ్చిన స్థానాలను కేటాయించారు. అయితే ఈ స్థానాలను తరువాత ఇచ్చే అర్డర్లో కనపరుస్తారా లేక అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు కట్టుబెడతారా అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బదిలీల్లో అన్యాయం జరిగిన వ్యవసాయ సహాయకులంతా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెండవ రోజు కూడా సరైన వసతులు లేక వ్యవసాయ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమన్నారాయణ, డీఏఓ కార్యాలయ ఏడీ మాధవి, ఏవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉద్యానశాఖ సహాయకులకు సంబంధించి 177 మందికి మొదటి రోజు, మిగిలిపోయిన వారికి రెండోరోజు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఉద్యాన, వ్యవసాయ సహాయలకు బదిలీలకు సంబంధించి డీఏఓ చంద్రనాయక్ డీహెచ్ఓ రవిచంద్రబాబులు మాట్లాడుతూ రెండో రోజు బదిలీల కౌన్సిలింగ్ను కూడా సిఫారస్సులకు తావు లేకుండా పారదర్శకంగానే నిర్వహించామని తెలిపారు. ● రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులును విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా గతంలో కొందరు వ్యవసాయ సహాయకులు సొంతానికి వాడుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో డబ్బులు వాడుకున్న వారికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. బకాయి డబ్బులను చెల్లిస్తేనే బదిలీకి అనుమతి ఇస్తామని, లేకుంటే లేదని ముందుస్తుగానే అధికారులు వారికి సూచించినట్లు తెలిసింది. దీంతో బకాయిలు ఉన్న కొంతమంది డబ్బులు చెల్లించగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారు మాత్రం చెల్లించలేకపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు వారితో ఒప్పందం తీసుకుని బదిలీల్లో చోటు కల్పించినట్లు సమాచారం. రెండోరోజు మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ కేసులకు అన్యాయం అధికారి పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట అన్యాయం జరిగిందని ఆందోళన -
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
వేంపల్లె: గ్రామీణ పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనలకు రూపమే ట్రిపుల్ ఐటీలు. వీటిని ఆర్జేయూకేటీ నిర్వహిస్తోంది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 23న రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈనెల 30 వ తేదీ, జులై 1వ తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ పక్రియ ఉంటుంది. ఈ పక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమార స్వామిగుప్తా తెలిపారు. రెండు రోజుల్లో 1,060 మందికి కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో భాగంగా రెండు రోజుల్లో ప్రత్యేక కేటగిరీ మినహా 1060మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30వ తేదీ (సోమవారం) 530 మంది అభ్యర్థులకు, జూలై 1వ తేదీన 530 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైల్స్కు సందేశాలు పంపించారు. కౌన్సెలింగ్కు అవసరమైనవి పదోతరగతి హాల్ టికెట్, పదోతరగతి మార్కుల జాబితా, 10వ తరగతి టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసు పోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అందజేయాలి. విద్యార్థులు ఎలా రావాలంటే .. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర జిల్లాల వైపు నుంచి వచ్చేవారు వేంపల్లె బస్టాండుకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రతి నిమిషానికి ఇడుపులపాయకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. వేంపల్లె నుంచి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 15 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా వేంపల్లె బస్టాండు, నాలుగు రోడ్ల కూడలిలో దిగిన తర్వాత అక్కడనుండి వీరన్నగట్టుపల్లి మీదుగా ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. విద్యాభ్యాసం గురించి ‘అన్ని సబ్జెక్టులకు ప్రతినెల పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. వేసవి సెలవులు 3 వారాలు మాత్రమే ఉంటాయి. జూలై 15వ తేదీ తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఆరు సబ్జెక్టులుంటాయి. ఆంగ్లం (రెండు పేపర్లు), గణితం (రెండు పేపర్లు), భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులుంటాయి. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో 530 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు భోజనం వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు. జూలై 15 తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. క్రమశిక్షణ..ఉత్తమ విద్యాబోధన ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. ఉదయం 7గంటలకు అల్పాహారం, అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, ఒంటిగంట వరకు భోజన విరామం, మళ్లీ ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఇవి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్ కు సమానమైన పీయూసీ కోర్సును, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ‘ట్రిపుల్ ఐటీలో చేరిన తర్వాత విద్యార్థులు మొదటి, రెండు సంవత్సరాలు (పీయూసీ) ఏడాదికి రూ.45 వేలు, తర్వాత నాలుగేళ్లు (ఇంజనీరింగ్) ఏడాదికి రూ.50వేల చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదుపోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
వేమన పద్యం ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది
కడప ఎడ్యుకేషన్ : వేమన నిజమైన ప్రజాకవి అని, అందువల్లనే ఆయన పద్యం కులాలను దాటి, మతాలను దాటి, ప్రాంతాలను దాటి, భాషలను దాటి విస్తరించిందని తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్ అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో 144వ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సజీవ సంప్రదాయంగా వేమన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వేమన పద్యం ఏ భాషకూ లేనంత గొప్పతనాన్ని తెలుగు భాషకు కలిగించిందన్నారు. తమిళకవి తిరువళ్ళువర్తోనూ, కన్నడకవి సర్వజ్ఞునితోనూ వేమనను పోలుస్తుంటారని, సమాజంలో మంచిని పెంచి, చెడును తుంచే విషయంలో ఆ ముగ్గురికీ పోలిక ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ వీళ్లకన్నా వేమనే గొప్పవాడని అన్నారు. తెలుగువాళ్లు బతుకు పోరాటంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు వాళ్ల నోళ్లల్లో నానుతున్న వేమన పద్యాలు కూడా వాళ్లతోపాటు వెళ్లిపోయి తరాలు మారినప్పటికీ కాలానుగుణంగా వాళ్ల సంప్రదాయాల్లో కూడా నిలిచిపోయాయన్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని అంబలత్తాడియర్లు అనే ఆశ్రిత కులం వాళ్లు తమిళులైనప్పటికీ ధనుర్మాసంలో ఊరంతా తిరుగుతూ ‘వేమనానంద పదిగం’ అనే పేరుతో తెలుగులో వేమన పద్యాలను చెప్పడమే కాక, వేమనానందస్వామి తమ కులగురువని చెప్పుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు జి.శివారెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, విజయానందరెడ్డి, డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.తెలుగు భాషా సేవకులు స.వెం.రమేశ్ -
ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రా కువైట్గా ప్రసిద్ధికెక్కిన రాజంపేటలో ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) కార్యాలయం ఎత్తివేశారు. దీంతో గల్ఫ్ వాసులను ఆదుకునే పరిస్ధితులు లేకుండా పోయాయి. కువైట్ దేశం వలన రాజంపేటలోని ఎస్బీఐ రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్ఆర్ఐ ఖాతాలను బట్టి రాజంపేట ఆంధ్రా కువైట్గా పేరు గడించింది. ఈ నేపథ్యంలో రాజంపేటను గుర్తించి, గల్ఫ్ దేశాలలో ఉండే వారి కోసం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో న్యూ బోయనపల్లె(కడప–రేణిగుంట జాతీయరహదారి)లో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఖాళీ చేశారు. రాయలసీమ జిల్లాల కోసం రాజంపేటలో ఏర్పాటు.. రాయలసీమ జిల్లాలలోని గల్ఫ్వాసుల కోసం రాజంపేటలోనే ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పుడు భవన యజమాని టూ లెట్ బోర్డు పెట్టేశారు. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయం ఎత్తివేసినట్లుగా గల్ఫ్వాసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు.. రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి అధికంగా ఎడారి దేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధి కోసం నాలుగు దశాబ్దాలుగా ఎడారి దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారి కోసం.. మోసానికి గురై జైలుపాలై అనేక సమస్యలలో ఇరుక్కున్నవారు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్ను బలోపేతం చేశారు. సీమలో గల్ఫ్వాసులు అధికంగా ఉన్న కారణంగా రాజంపేటలో సొసైటీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది మంది గల్ఫ్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపారు. గల్ఫ్దేశాలలో జీవించేందుకు, వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేవారు, నివసిస్తున్న వారి కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత వలసలపై వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను సొసైటీ నిర్వహించింది. సొసైటీ ద్వారా దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మందిని కో–ఆర్టినేటర్లను నియమించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఏమేమి చేసిందంటే.. ప్రవాసాంధ్రులకు సహాయనిధి, భరోసా బీమా, ఆన్లైన్ ఐటీ శిక్షణ, ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్, ఫ్రీ–డిపార్టుమెంట్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కనెక్టు టు ఆంధ్రా, పెట్టుబడులు సలహాలు, పవిత్ర నాణేలు, ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కేంద్రం, పాస్పోర్టులో సలహాలు, మరణించిన ఎన్ఆర్టీఎస్ బంధువులకు ఎక్స్గ్రేషియా, అధునాతన ఐటీ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ , అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ కంపెనీలలో నియామకాల సౌకర్యం వంటి ఉచిత సేవలను అందజేశారు. జగన్న పాలనలో గల్ఫ్ బాధితులకు భరోసా ఏపీఎన్ఆర్టీఎస్తో ఎందరికో ఆపన్నహస్తం కూటమి పాలనలో సేవలకు మంగళంఏపీఎన్ఆర్టీఎస్తో విదేశాలలో ఉన్నవారికి భరోసా ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా విదేశాలలో ఉన్నవారికి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీ ద్వారా విస్తతృంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ దిశగా అనేక మంది విదేశీ బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ముందుకు నడిచేలా జగనన్న ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ను తీర్చిదిద్దింది. చిల్లా కిరణ్, యూఎస్ఏ, వెంకటరెడ్డిపల్లె, రైల్వేకోడూరుజగనన్న పాలనలో ఏపీఎన్ఆర్టీఎస్ బలోపేతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలనలో ఏపీఎన్ఆరీటీఎస్ బలోపేతం చేశారు. అప్పటి వరకు ఇలాంటి సొసైటీ ఒకటి ఉందనేది చాలా వరకు తెలియదు. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీ ద్వారా ఎందరో గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు. కోవిడ్–19లో తనదైన రీతిలో సేవలందించారు. రాయలసీమలో గల్ఫ్ వాసుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆ దృష్ట్యా రాజంపేటలో సొసైటీ ఏర్పాటు చేశారు. –గోవిందు నాగరాజు, వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్, కువైట్ -
● శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ రాష్ట్రాల్లో మే, జూన్ నెలల్లోనే వర్షాలు బాగా కురవడంతో కృష్ణా, తుంగభద్ర ద్వారా వరద ప్రభావం శ్రీశైలం జలాశయానికి భారీగానే వస్తోంది. శ్రీశైల జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను ఆదివారం నాటికి 869.8 అడుగులకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుత స్టోరేజీ 140.65 టీఎంసీ (65.17 శాతం)లకు చేరింది. ఫ్లడ్ కుషన్ 75.16 టీఎంసీలుగా నమోదైంది. ఇక డ్యాంలోకి 1,35,100 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గత 20 ఏళ్ల నుంచి ఇంత సానుకూల పరిస్థితి ఎన్నడూ లేదని అంటున్నారు. ప్రభుత్వం కూడా నీటిని దిగువకు విడుదల చేయకుండా నిల్వ ఉంచడం వల్ల నీటిమట్టం పెరుగుతోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే వారం లేదా పది రోజుల్లోనే డ్యాం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నీటిని కేసీ కెనాల్కు విడుదల చేయాలని ఆయకట్టు రైతాంగం కోరుతోంది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మొత్తం కేసీ కింద 2.65 లక్షల ఎకరాలు ఉంది. ఇందులో వైఎస్సార్ కడపజిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది ఆగస్టులో సాగునీరు విడుదల చేసేవారు. ఇప్పుడు ముందుగానే శ్రీశైలంలో ఎండీడీఎల్కు మించి నీటిమట్టం చేరుకుంది. కాబట్టి జులై ప్రథమార్థంలోనే నీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీటి ప్రకటన చేస్తే నారు నారుమడులు సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఖరీఫ్ ప్రారంభంలోనే పంటల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుందని, దిగుబడి బాగా ఉంటుందని రైతులు అంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, సాగునీటి సంఘాల నేతలు చెరువుల్లో మట్టిని అమ్ముకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప కేసీ నీటి విడుదల విషయం ఆలోచించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
దేవుని కడప ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తిరుమల–తిరుపతి దేవస్థానం జేఈఓ వల్లూరు వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దేవుని కడప ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గర్భాలయం, పోటుగదిలో వర్షపు నీరు లీకేజీలు లేకుండా చూడాలన్నారు. పుష్కరిణి వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి, విద్యుత్శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓలు నటేష్బాబు, ప్రశాంతి, ఈఈలు నాగరాజు, సుమతి, ఆలయ అర్చకులు, ఆలయ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం -
రేపు కౌన్సిల్ సమావేశం
ప్రొద్దుటూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో ఈనెల 30న సోమవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, మన్సిపల్ అధికారులు పాల్గొనాలని ఆమె కోరారు.రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా జనార్దన్కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా జనార్దన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న బి.సురేంద్రారెడ్డి తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. ఎర్రగుంట్లలో పనిచేస్తున్న జనార్దన్ను కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా నియమించారు.11 నుంచి పీజీ పరీక్షలుకడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈఎడీ, ఎం.సి.ఎ రెండో సెమిస్టర్ విద్యార్థులకు జులై నెల 11 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.పక్కాగా బదిలీ ప్రక్రియకడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ జీవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శనివారం తమ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. 377 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, రాజంపేట ఈఈ రామచంద్ర నాయక్, రాయచోటి ఈఈ దయాకర్రెడ్డి, బద్వేలు ఈఈ లక్ష్మిపతిరెడ్డి పాల్గొన్నారు.కొనసాగిన కౌన్సెలింగ్కడప కార్పొరేషన్: వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ రెండో రోజు కొనసాగింది. శనివారం ఉదయం 7.30 గంటల నుంచి వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. అత్యధిక శాతం మందికి ఏ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోనే బదిలీలు చేశారు. స్సౌజ్ కేసులు, మెడికల్ సంబంధిత కేసులు, ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఒక మున్సిపాలిటీ నుంచి మరొక మున్సిపాలిటీకి కూడా బదిలీలు నిర్వహించారు.కమిషనర్ మనోజ్రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదలకడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాల యం అనుబంధం కళాశాలల డిగ్రీ హానర్స్ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాసరావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు తో కలసి విశ్వవిద్యాలయంలోని తన చాంబర్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvu exam s.in/results.aspx అనే వెబ్సైట్ను సందర్శించాలని కృష్ణారావు సూచించారు. పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు సుభోస్ చంద్ర, గణేష్ పాల్గొన్నారు. -
విద్యార్థినికి టీసీ ఇవ్వడంపై ఆందోళన
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కె.లోకేశ్వరి అనే విద్యార్థినికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపడంపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన లోకేశ్వరి గురుకుల పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుంది. 7వ తరగతిలోకి ప్రవేశించాల్సి ఉన్న ఆ విద్యార్థిని పాఠశాల పునః ప్రారంభమై నెల రోజులు దాటినా పాఠశాలకు రాలేదు. శుక్రవారం లోకేశ్వరి పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ వి.నిర్మల టీసీ ఇచ్చి ఇంటికి పంపారు. ఆ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు వసంత, వీరయ్య పాఠశాల వద్దకు చేరుకుని తమ కుమార్తెను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని ప్రిన్సిపాల్ను కోరగా ఆమె ససేమిరా అన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో శనివారం పాఠశాల వద్దకు వెళ్లిన విలేకరులు లోకేశ్వరి విషయంపై ప్రిన్సిపాల్ను వివరణ కోరారు. లోకేశ్వరి సక్రమంగా చదవడం లేదని, పాఠ్యపుస్తకాలను చించడం, యూనిఫాం వేసుకోకుండా క్లాసులకు రావడం చేస్తూ ఉండేదని ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. తోటి విద్యార్థినులను కొట్టేదన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థినులు చాలా సార్లు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థిని విషయంపై కమిటీలో చర్చించి టీసీ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా గురుకుల పాఠశాల సంఘటనపై డీఈఓ ఆదేశాలతో శనివారం సాయంత్రం మైదుకూరు మండల విద్యాశాఖాధికారి పద్మలత పాఠశాలకు చేరుకుని విచారించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. ఆ మేరకు డీఈఓకు నివేదిక పంపుతామని ఎంఈఓ తెలిపారు. -
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కడప అర్బన్ : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్లు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో భాగంగా శనివారం మూడో రోజు కడప –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 97 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 134 బంతుల్లో 100 పరుగుల సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. సాయి గణేష్ 72 పరుగులు చేశాడు. కడప జట్టులోని శివశంకర్ 3 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో 765 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన నెల్లూరు–అనంతపురం మ్యాచ్లో ఆనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం మూడో రోజు 173 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 211 బంతుల్లో 135 పరుగులు, షాహుల్ హమీద్ 89 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 24.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి 37 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని షాహుల్ హమీద్ 2 వికెట్లు తీశాడు.కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం -
●కనీస వసతులు కరువు
కడప అగ్రికల్చర్: బదిలీల్లో నేతల సిఫారస్సులకే పెద్ద పీట వేస్తున్నారా..? పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నాయా? లెటర్ల పేరిట పచ్చ నేతలు దందా సాగిస్తున్నారా?... అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకుల కౌన్సెలింగ్ కేంద్రానికి ‘దేశం’ నేతల రాక దీనికి మరింత బలం చేకూరిస్తోంది. వెరసి కూటమి హయాంలో బదిలీలంటనే ఉద్యోగులు హడలెత్తిపోతున్న పరి స్థితి నెలకొంది. వివరాలల్లోకి వెళితే.. గ్రామ సచి వాలయాల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు శనివారం కలెక్టరేట్లోని ఉద్యాన, వ్యవసాయశాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఈ ప్రక్రియలో అధికార ఎమ్మెల్యేల సిఫారస్సు లేఖలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తమకు అనుకూల స్థానాలకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి లెటర్లతోఫాటు ఫోన్లలో కూడా సిఫారస్సు చేసినట్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చర్చ సాగింది. అధికారులు వాటికే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందుకు బలం చేకూరుస్తూ కడప నగరానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు హరిప్రసాద్ కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి అధికారులతో మాట్లాడి తనకు అనుకూలమైన వారికి వారు కోరుకున్న స్థానాలను ఇప్పించినట్లు చర్చసాగింది. ఉద్యోగుల్లో అసంతృప్తి ఈ బదిలీల్లో స్పౌజ్కు అసలు ప్రాధాన్యత కల్పించలేదని వ్యవసాయ, ఉద్యోగశాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లగా దూర ప్రాంతంలో పని చేసి ఇప్పుడు ‘స్పౌజ్’ కేటగిరీలో ఉన్నా మళ్లీ దూరప్రాంతాలకే వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంతమంది వికలాంగులకు కూడా అన్యాయం జరిగినట్లు తెలిసింది. అసలు మెడికల్ గ్రౌండ్స్ పరిగణలో లోకి తీసుకోలేదని పలువురు వాపోయారు. ఈ బదిలీల్లో ఎలాంటి నిబంధనలను పాటించకుండా కౌన్సెలింగ్ను నిర్వహించారని పలువురు ఉద్యాన, వ్యవసాయ సహాయకులు వాపోయారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి... జిల్లావ్యాప్తంగా పలు రైతు సేవా కేంద్రాలలో పనిచేసే 264 మంది వ్యవసాయ సహాయకులు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఈ బదిలీలకు అర్హత సాధించారు. ఇందులో తొలి రోజు 175 మందికి కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఇందులో సీనియా రిటీ ప్రకారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ర్యాంకులు కేటాయించారు. అ ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్కు పిలిపించి స్థానాలను కేటాయించారు. ఈ బదిలీల్లో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఎమ్మెల్యేల లెటర్స్కే ప్రాధాన్యత కల్పించారని పలువురు వ్యవసాయ సహాయకులు తెలిపారు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్తో మాట్లాడుతూ ఈ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని ఎలాంటి రెకమండేషన్లను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఏడీఏ మాధవి, అన్నమయ్య జిల్లా ఏడీ మజీద్ ఆహ్మద్, సూపరెండెంటెంట్ విజయశ్రీ, ఏవో శ్రీహరి పాల్గొన్నారు. ద్యాన సహాయకులకు సంబంధింది... ఉద్యాన సహాయకులకు సంబంధించి కూడా 177 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని బదిలీలకు అర్హత సాధించారు. వీరికి సంబంధించిన బదిలీలలో కూడా పలు ఆరోపణలు వినిపించాయి. ఈ బదిలీ కౌన్సిలింగ్ గురించి జిల్లా ఉద్యానశాఖ అదికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ బదిలీలను చాలా పారదర్శకంగా నిర్వహించామన్నారు. అన్నమయ్య డీహెచ్ఓ సుబాషిణి, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సెలింగ్ కేంద్రంలో ‘దేశం’ నేతలు వ్యవసాయశాఖ బదిలీల్లో సిఫారస్సులకే పెద్ద పీట! స్పౌజ్ కేసులకు, మెడికల్ గ్రౌండ్స్కు ప్రాధాన్యత కరువు కౌన్సెలింగ్ కోసం వచ్చిన వ్యవసాయ, ఉద్యోగ సహాయకులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలను కల్పించలేదు. కూర్చొనేందుకు కుర్చీలు లేక కొంత మంది నేలపై, , కార్యాలయ వసారాలలో కూర్చొని ఊసూరుమన్నారు. మరి కొంతమంది చిన్న బిడ్డల తల్లులు తమ పిల్లలకు పాలు తాపించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని ఉద్యోగులు వాపోయారు. -
అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతం చేయాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగే అడ్మిషన్ల ప్రక్రియను ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్యోగులు విజయవంతం చేయాలని ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా కోరారు. శనివారం మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ అడ్మిషన్ల ప్రక్రియపై ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని సెంట్రల్ లైబ్రరీలో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఈనెల 30, జూలై 1న రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్లకు ఎంపికై న విద్యార్థులకు ఇప్పటికే కాల్ లెటర్లు కూడా పంపామన్నారు. కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్లు జిరాక్స్ పత్రాలను, విద్యార్థి ఫొటోతోపాటు తల్లిదండ్రుల, సంరక్షకుల ఫొటోలను కూడా వెంట తీసుకుని రావాలన్నారు. సమావేశంలో అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, అసోసియేట్ డీన్స్, సెక్యూరిటీ అధికారులు, పీఆర్ఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పంజంకు కన్నీటి వీడ్కోలు!
సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64)కి పార్టీ నేతలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయం అంత్యక్రియుల నిర్వహించా రు. అంతకుముందు అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతితో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కన్నీటి నివాళి అర్పించారు. నేతల నివాళి రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లిలో పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, కడప పార్లమెంట్ పరిశీలకులు, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, ఆర్టీసీ మాజీ రాష్ట్ర చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ తదితరులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకుని శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పంజం సుకుమార్రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సుకుమార్రెడ్డి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. పంజం సందీప్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపాన్ని తెలియజేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఘనంగా అంతిమ వీడ్కోలు తూర్పుపల్లిలోని పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర సాగింది. పార్టీ శ్రేణులు, నేతలు, గ్రామస్తులు, కుటుంబీకులు పాల్గొన్నారు. పంజం సుకుమార్రెడ్డి వ్యవసాయ పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు సుకుమార్రెడ్డి పార్థివదేహం వద్దనివాళులర్పించిన పెద్దిరెడ్డి, అంజద్బాషా తదితరులు -
రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం
కడప సెవెన్రోడ్స్ : జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉద్యాన పంటలు, వృక్షాలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణలో ఉద్యాన పంటలు, చెట్లు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అంచనా ప్రక్రియపై శనివారం కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి సంబంధిత అధికారులు, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షకు ఎస్డీసీ, ఎన్హెచ్ పీడీ వెంకటపతి, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్నయ్య సంబంధిత రీజియన్ల ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ పీడీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బెంగళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేపడుతున్నామన్నారు. అందుకు సంబంధించి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ శాఖకు చెందిన పలు భూములను కొను గోలు చేసి భూములు కోల్పోయినవారికి పరిహా రం కూడా ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో జమ్మలమడుగు, వి.ఎన్. పల్లె మండలాల్లో ఉద్యాన పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా.. భూసేకరణ చట్టంలోని సంబంధిత ప్రామాణికాలను పక్కాగా పాటిస్తూ.. పరిహారం అంచనాలను నివేదించాలన్నారు. చెట్ల వయస్సు, చెట్ల పెంపకానికి ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇతర నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు రైతులు వెచ్చించిన వ్యయం తదితర అంశాలను ఉద్యాన వన శాఖ అధికారులు కచ్చితంగా, పారదర్శకంగా వ్యాల్యూయేషన్ చేయాలన్నారు. ఇం పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్, ఆర్–బి నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్హెచ్ ప్రాజెక్టుల ప్రతినిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక లక్ష్మీహాలు సమీపంలో నివాసముంటున్న రాజకుళ్లాయమ్మ అనే మహిళ ఈనెల 18న కడప రిమ్స్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం రాజకుళ్లాయమ్మ కడప రిమ్స్ నుంచి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పసికందును రాజకుళ్లాయమ్మ స్నేహితురాలు కుమారి అపహరించి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు కుమారి తమ బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో పులివెందుల పోలీసులు ఆమెను అరెస్టు చేసి పులివెందుల స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ రాజకుళ్లాయమ్మ, కుమారి ఇద్దరూ పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. కుమారి శుక్రవారం రాజకుళ్లాయమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందును అపహరించి తీసుకెళ్లిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే పసికందును కిడ్నాప్ చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.పసికందును అపహరించిన మహిళ అరెస్టు -
ఖైదీల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం
కడప అర్బన్ : ఖైదీలు తమ ఆరోగ్యంలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడప నగర శివార్లలోని కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాన్ని ఆమె జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాన్నారు. కారాగారం పరిసరాలను, వంటగదులను, వసతి గదులను, టాయిలెట్లను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఇన్చార్జి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ రాజేశ్వర్ రావు, ప్రత్యేక మహిళా కారాగారం సూపరింటెండెంట్ కృష్ణవేణి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన
జమ్మలమడుగు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూ కేటాయింపులు చేసిన ప్రాంతంలోనే స్టీల్ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ కంపెనీ ముందుకొచ్చింది. ఇటీవల కడప లో జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో స్టీల్ప్లాంట్ పనులను జిందాల్ కంపెనీ యాజమాన్యం మొదటి విడత పనులు రూ.4500 కోట్లతో చేపడుతుందని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం కడపకు చెందిన ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిందాల్ ప్రతినిధులు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద స్టీల్ప్లాంట్కు కేటాయించిన భూముల వివరాలను మ్యాప్ల ద్వార పరిశీలించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజులు ఇక్కడే ఉండి పరిశీలిస్తారని.. సోమ వారం నుంచి కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే అవకాశం ఉన్న ట్లు అధికారులు వివరించారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ పనులకు మోక్షం రాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సర్వేయర్ హరి ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో రెగ్యులర్గా పనులు ప్రారంభించే అవకాశం భూములు పరిశీలించినజిందాల్ ప్రతినిధులు -
నా కుమారుడు మఠాధిపతిగా అర్హుడు
బ్రహ్మంగారిమఠం: పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి తన పెద్ద కుమారుడు గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని పూర్వపు మఠాధిపతి ద్వితీయ భార్య మారుతీ మహాలక్షుమ్మ తెలిపారు. శనివారం బి.మఠంలో మహా నివేదిన మందిరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారులు నలుగురిలో ఏ ఒక్కరూ మఠం ఆచారాలు పాటించలేదని అందుకు వారికి అర్హత లేదనేది పూర్వపు మఠాధిపతి వాదన అన్నారు. తన పెద్దకుమారుడు గోవిందస్వామి మఠం ఆచారాలపై ఎక్కువ మక్కువగా ఉండడంతో 2018లో పూర్వపు మఠాధిపతి వీలునామా రాశారన్నారు. తన తరువాత మఠాధిపతిగా తన రెండవ భార్య మొదటి సంతానం గోవిందస్వామి నియామకం జరగాలనేది పూర్వపు మఠాధిపతి ఆదేశం అన్నారు. వీలునామా ప్రకారం మఠాధిపతి నియామకం జరగాలని తాను కోరుతున్న సమయంలో పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య కుమారులు అడ్డుతగలడంతో కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కోర్టు కూడా మఠాధిపతిని నిర్ణయించే బాధ్యత ధార్మిక పరిషత్కు అప్పజెప్పిందన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా తమకు న్యాయం జరగక పోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె వివరించారు.విలేకరుల సమావేశంలో మారుతీ మహాలక్షుమ్మ -
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి
కడప సెవెన్రోడ్స్ : తమపై విపరీతంగా మోపిన పనిభారాన్ని తక్షణమే తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ పంచాయతీరాజ్శాఖకు విధించడం ఏమిటంటూ నిలదీశారు. పెరిగిన పనిభారాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కడప అంబేడ్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పంచాయతీ కార్యదర్శులు తరలివచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అన్వర్బాషా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తాము విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి పారిశుద్ధ్య పనులు మొదలుకొని గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు, గూగుల్ మీటింగ్లు, వాట్సాప్ మెసేజ్లు, స్ప్రెడ్ షీట్, వివిధ యాప్స్లో ఫొటోలు, వీడియోలు అప్డేట్ చేయడం, ఇందుకోసం ప్రజల మొబైల్ ఫోన్ల నుంచి ఓటీపీలు సేకరించడం తదితర పనులు అప్పగిస్తున్నారని తెలిపారు. సత్వరమే ఐవీఆర్ఎస్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ అంబాసిడర్లు, క్లాప్ మిత్రలను పంచాయతీలకే అప్పగించి పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కేవలం రూ. 6 వేలు మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తుండడంతో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఈ గౌరవ వేతనాలను గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. చెక్పవర్ సర్పంచ్కు ఉన్నప్పటికీ వారి గౌరవ వేతనాలు చెల్లించడానికి పంచాయతీ కార్యదర్శులను ఒత్తిడికి గురిచేయడం తగదన్నారు. తమను గ్రామ పంచాయతీ విధుల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య నాయకుడు సాయిప్రతాప్రెడ్డి, సునీల్, లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు, మానవ వనరులను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల మూల వేతనం సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు జి.భాస్కర్, సీఎం గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి ఐవీఆర్ఎస్ రద్దు చేయాలి సచివాలయ విధులు మాకొద్దు ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా -
నకిలీ విలేకరిపై ఎస్పీకి ఫిర్యాదు
కడప అర్బన్ : సింహాద్రిపురం, బ్రహ్మంగారిమఠం, రాజంపేట, గువ్వలచెరువు ప్రాంతాలలో టీవీ9 విలేకరి అంటూ బెదిరింపులకు దిగుతున్న పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన ఓబులేష్ యాదవ్పై ఆ ఛానెల్ సిబ్బంది శుక్రవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్కు ఫిర్యాదు చేశారు. టీవీ9 పేరు చెప్పుకొని ఇతను చేసే వ్యవహారాలన్నీ ఉమ్మడి కడప జిల్లా సీనియర్ కరస్పాండెంట్ సుధీర్ కు సమాచారం అందడంతో ఈ విషయాన్ని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్పీ బ్రహ్మంగారిమఠం పిఎస్ లో అతనిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఓబులేష్ యాదవ్ అనే వ్యక్తి పై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో టీవీ9 కడప జిల్లా సిబ్బంది సురేష్ బాబు (ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు) సురేష్ (జిల్లా కార్యవర్గ సభ్యుడు), సుబ్బారెడ్డి, కార్తీక్లు వున్నారు.ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు రామసముద్రం : రామసముద్రం మండలం దాసర్లపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామసముద్రం బోయ వీధికి చెందిన అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం రామసముద్రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
త్రిశంకు స్వర్గంలో భాషా పండితులు
బద్వేలు: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ సాధారణ బదిలీలు జరిగినప్పుడల్లా.. భాషా పండితులకు స్థానచలనం కలుగుతోంది. రెండేళ్లకోసారి జరిగే బదిలీల్లో భాషా పండితులే సమిధలవుతున్నారు. ఏదో ఒక చోట నాలుగైదేళ్లు కూడా ఉంచడం లేదు. కనీసం సమీప ప్రాంతాలకు కూడా బదిలీ చేయడం లేదు. మహిళలను కూడా అడవి ప్రాంతాలు, రవాణా సౌకర్యం సరిగా లేని గ్రామాలకు బదిలీ చేస్తుండటంతో.. వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మండలం (వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం) నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దులోని (అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం) మారుమూల గ్రామానికి (దాదాపు 190 కిలోమీటర్ల దూరం) రవాణా సౌకర్యం బొత్తిగా లేని గ్రామానికి బదిలీ చేశారు. అలాగే అదే కలసపాడు మండలానికి చెందిన మరో ఉపాధ్యాయుడిని నెల్లూరు సరిహద్దు మండలమైన చిట్వేలి (160 కిలో మీటర్ల దూరం)కి బదిలీ చేశారు. పులివెందుల దగ్గర పని చేస్తున్న ఉపాధ్యాయుడిని (107 కిలోమీటర్ల దూరం) సంబేపల్లె మండలానికి బదిలీ చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు మండలానికి చెందిన మహిళా ఉపాధ్యాయురాలిని 123 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెనగలూరు మండలానికి బదిలీ చేశారు. పోరుమామిళ్ల మండల మహిళా ఉపాధ్యాయురాలిని 153 కిలో మీటర్ల దూరంలో నెల్లూరు సరిహద్దున ఉన్న చిట్వేలి మండలం పోలుపల్లికి బదిలీ చేశారు. ఇలా వందల కిలో మీటర్ల దూరానికి అధిక సంఖ్యలో మహిళలను బదిలీ చేయడంతో.. వారి బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. జీవో 77 తెచ్చిన తంటా 2008, 2012లలో మెగా డీఎస్సీ ద్వారా తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, సంస్కృతం భాషల ద్వారా ఎంపికై న భాషోపాధ్యాయుల్లో ఎక్కువ మందికి గ్రేడ్–1 పండిట్లుగా పదోన్నతి లభించింది. 2019లో ప్రభుత్వం జీవో ఎంఎస్: 91 ద్వారా భాషోపాధ్యాయులందరికీ గ్రేడ్ 1 ఉన్నతీకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు(ఎస్జీటీ)తమకు భాషో పాధ్యాయుల కేడర్ కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమీ లేక అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్ 77 ద్వారా గ్రేడ్ 2 కేడర్ను రద్దు చేసింది. ఫలితంగా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 113 మంది డీఈవో పూల్లోకి వెళ్లారు. అందులో 68 మంది తెలుగు భాషా పండితులు మిగిలిపోయారు. కేడర్ రద్దు చేసినప్పుడు ఆ పోస్టుల్లో ఉన్న వారందరికీ పదోన్నతి కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో గడిచిన ఆరేళ్లలో నాలుగు సార్లు బదిలీలకు గురయ్యారు. నిబంధనల మేరకు ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయిన పాఠశాలలో ఎనిమిదేళ్లు పని చేయవచ్చు. దానికి భిన్నంగా పండిట్లను ఎప్పుడు పడితే అప్పుడు బదిలీ చేయడం పరిపాటిగా మారింది. భాషోపాధ్యాయుల పోస్టులన్నీ మాయం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగు, ఉర్దూ, సంస్కృతం, కన్నడ, తమిళం తదితర భాషా పండితులు 113 మంది ఉన్నారు. అందులో తెలుగు పండితులు 68 మంది ఉండగా, తెలుగు పండిట్ పోస్టుల ఖాళీలు 79 చూపించారు. అందులో వైఎస్సార్ కడప జిల్లాలో 11 ఖాళీలు చూపించి.. మొత్తం ఖాళీలన్నీ (68 ఖాళీలు) అన్నమయ్య జిల్లాలో చూపించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాల్లో 11 ఖాళీలు మాత్రమే చూపించి.. అన్నమయ్య జిల్లాలో 4 మండలాల్లో (చిట్వేలి, ఓబులవారిపల్లె, గాలి వీడు, పెనగలూరు) 39 ఖాళీలు చూపించారు. మరో 4 మండలాల్లో (టి.సుండుపల్లె, వీరబల్లి, సంబేపల్లి, రైల్వేకోడూరు) మండలాల్లో 21 ఖాళీలు చూపించారు. ఇవ్వన్నీ కూడా వైఎస్సార్ కడప జిల్లా నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం పైమాటే. ఇలా అన్నమయ్య జిల్లాలో ఖాళీలన్నింటిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దాదాపు 50 మంది భాషా పండితులతో భర్తీ చేశారు. మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో భాషా పండితుల ఖాళీలు ఏమైనట్లో విద్యాశాఖాధికారులు చెప్పాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలిపోయిన పోస్టులు ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎక్కువ శాతం మంది పట్టణాలు, మండల కేంద్రాలు కోరుకోవడంతో.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు.. విద్యార్థులు రాక మూతపడే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులూ అమలు కాని వైనం వైఎస్సార్ కడప జిల్లాలోని 113 మందితో సహా రాష్ట్రంలోని 1199 మంది భాషా పండితులు హైకోర్టును ఆశ్రయించారు. భాషా పండితుల బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ గౌరవ జస్టిస్ మన్మధరావు 2024 డిసెంబర్ 20న భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా 2019 నుంచి భాషాపండితులకు ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులో పదోన్నతులు కల్పించాలని కూడా ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఆరు నెలలు కావస్తున్నా.. కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ ఖాళీలు లేవని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రభుత్వం తాత్సారం చేయడంతో తమకు కూడా భాషోపాధ్యాయులుగా పదోన్నతులు కావాలని సెకండ్ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తమకు న్యాయం చేయాలని భాషాపండితులు మరల కోర్టుకు విన్నవించుకోగా.. జూలై 15వ తేదీకి కేసు వాయిదా ఇచ్చినట్లు సమాచారం. గ్రేడ్ 2 కేడర్ రద్దుతో ఇబ్బందులు డీఈవో పూల్లో కొనసాగుతున్న వైనం ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ సెలవుల వైపు.. చూపు రెండేళ్లకోసారి డీఈవో పూల్ ఉపాధ్యాయులు బదిలీకి బలి అవుతున్నారు. దీంతో పిల్లల చదువులు సక్రమంగా ముందుకు సాగడం లేదు. సంసారం మొత్తం అక్కడికి మార్చడం కుదరక.. తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ హక్కుగా ఉన్న వివిధ రకాల సెలవులపై దృష్టి పెట్టారు. ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో తెలుగు భాషా పండితుల కొరత ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని సమాచారం. న్యాయం జరుగుతుంది జిల్లాలో డీఈవో పూల్లో ఉన్న భాషా పండితులకు న్యాయం జరుగుతుంది. విద్యా శాఖ కమిషనర్ కూడా వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్జీటీ ఉపాధ్యాయ ఖాళీలు 700 వరకు ఉన్నాయి. అందులో నూతనంగా జరిగిన డీఎస్సీకి 217 ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్ట ప్రకారం నడుచుకుంటాం. – షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి, కడప -
పేదలకు పౌష్టికాహారం అందించేందుకు కృషి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల పౌష్టికాహారం మెరుగు పరిచేందుకు ఐఎస్బీ, బిల్గేట్స్ ఫౌండేషన్స్ బాసటగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఎనాక్ట్స్ ప్రాజెక్ట్, ఎనేబుల్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ కన్వర్జేన్స్ త్రు టెక్నికల్ సపోర్ట్లో భాగంగా భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) భాగస్వామ్యంతో జిల్లాలో పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో గురువారం ఆన్లైన్ జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఐఎస్బీ వారి ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని పౌష్టికాహార లోపంతో ఉన్న మహిళలు, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు ఎనాక్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ఆకాంక్షిత జిల్లాలో భాగంగా మొదటగా చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాలలో అమలు చేసి తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పోషక అంశాలపై భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో జిల్లాలో అధ్యయనం చేయనున్నారని తెలిపారు. పౌష్టికాహార, ప్రోటీన్ ఆహార పదార్థాలను కొనలేని స్థితిలో చాలా మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో పౌష్టికాహారం బహుళ రంగ మార్కెట్ల ద్వారా అందించడానికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాసటగా ఐఎస్బీ, బిల్గేట్స్ ఫౌండేషన్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
గండి ఆలయ అధికారిపై విచారణ
చక్రాయపేట : ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యపై శుక్రవారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ) పట్టెం గురుప్రసాద్ విచారణ నిర్వహించారు. వెంకట సుబ్బయ్యపై ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేసినందున కమిషనర్ ఆదేశాల మేరకు తాను విచారణకు వచ్చినట్లు డీసీ తెలిపారు. విచారణ సందర్భంగా డిప్యూటీ కమిషనర్.. చైర్మన్, పాలక మండలి సభ్యులను, ఆలయ అధికారిని వేరు వేరుగా విచారించారు. తొలుత చైర్మన్ పాలకమండలికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఇంత వరకు ఎలాంటి పాలకమండలి సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు. పాలక మండలి తీర్మాణాలు లేకుండా ఆయన వెంకటస్వామి అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని ఇష్టారాజ్యంగా నిధులను డ్రా చేస్తూ ఖర్చు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా చైర్మన్కు, పాలక మండలికి ఆహ్వానం లేదని వెంకటస్వామి అనే వ్యక్తిచే జెండా ఆవిష్కరించారని ఫొటో చూపించి ఫిర్యాదు చేశారు. ఈనెల 26న జరిగిన షాపింగ్ గదులు, టోల్ గేట్ల టెండర్లలో ఏ అధికారం ఉందని వెంకటస్వామిని డయాస్పై తన పక్కనే ఏసీ ఎలా కూర్చోబెట్టుకుంటారని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వం మారింది కదా.. మీరు ఇంకా పదవుల్లో ఎందుకున్నారు. రాజీనామా చేసి వెళ్లి పోండి అంటూ పాలక మండలి సభ్యులను హేళన చేస్తూ మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ మాస ఉత్సవాలకు టెండర్లు పిలవకనే.. నిరుడు గండిలో జరిగిన శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రు.కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు. పాలక మండలి తీర్మాణం లేకుండా, ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా టెండర్లు నిర్వహించకనే చలువ పందిళ్లు, క్యూలైన్లు, డెకరేషన్లు తదితరాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. వాటి జమా ఖర్చులు పాలక మండలి అడిగితే మీకెందుకు ఇవ్వాలి అంటూ అవమానాలకు గురి చేస్తున్నాడని వారు డీసీకి ఫిర్యాదు చేశారు. నిరాహార దీక్ష చేస్తా.. గండి వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం శ్రావణ మాసం మొదటి వారం నాటికి భక్తులకు కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానని చక్రాయపేట జడ్పీటీసీ సభ్యడు శివప్రసాదరెడ్డి డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్కు స్పష్టం చేశారు. ఆలయ అధికారి వెంకట సుబ్బయ్య నిర్లక్ష్యం కారణంగానే ఆలయం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అనంతరం ఆయన ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యను కూడా పాలక మండలి చేసిన ఆరోపణలపై విచారించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చక్రపాణిరెడ్డి, మధు, బిందు సాగర్, జయమ్మ, మునీశ్వరి, సుగుణమ్మ, వెంకటరామిరెడ్డి, కుమారి, కళావతి, మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తా .. గండి ఆలయ అధికారి వెంకటసుబ్బయ్యపై విచారణ చేసిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని కర్నూలు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విని రాత పూర్వకంగా తీసుకున్నానని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. అక్రమాలను డీసీకి వివరించిన చైర్మన్, పాలకమండలి శ్రావణమాసంలో మూలవిరాట్ దర్శనం కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానన్న జడ్పీటీసీ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానన్న డిప్యూటీ కమిషనర్ -
పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి (64) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. అనారోగ్యంతో చైన్నెలో శుక్రవారం పంజం సుకుమార్రెడ్డి మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు అనంతరాజుపేటలో పంజం మృతదేహాన్ని సందర్శించారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పంజం సుకుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్గా, డీఆర్యూసీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అనంతరాజుపేట సర్పంచ్గా, ప్రైవేట్స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పలు పదవులు చేపట్టారు. తనదైన శైలిలో వాటికి వన్నె తెచ్చారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ప్రముఖుల నివాళి పంజం సుకుమార్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనుంజయరెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, భూమన అభినయ్రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, వత్తలూరు సాయికిశోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి తదితర నాయకులు పంజం స్వగ్రామానికి చేరుకున్నారు. సుకుమార్రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముస్తాక్, సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, రామనాథంలు పంజం సుకుమార్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు: వైఎస్సార్సీపీ నాయకులు పంజంసుకుమార్రెడ్డి భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం అనంతరాజుపేటకు రానున్నారు. పంజం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు
కడప సెవెన్రోడ్స్ : బద్వేలు నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆరోపించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులను ఉసిగొల్పి వలంటీర్ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో విచారించి న్యాయం చేయాలంటూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రాన్ని సమర్పించారు. ● ఈ సందర్భంగా డీసీ గోవిందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు నమోదు, ఇల్లు కూల్చివేత లాంటి సంఘటలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు. ఒక దళిత కౌన్సిలర్ బంకును ఇటీవల కూల్చివేశారన్నారు. బద్వేలు–కడప రహదారిలో చెరువు బఫర్జోన్లో నిర్మించుకున్న శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారన్నారు. అధికారులు చెబుతున్న విధంగా ఆ ఇల్లు చెరువు పోరంబోకులో నిర్మించుకుని ఉంటే డీ–మార్కేషన్ చేసి, నోటీసులు జారీ చేసిన అనంతరమే తొలగించాలన్నారు. చట్టబద్దంగా వ్యవహరించకుండా అధికారులు రాత్రివేళ వచ్చి శ్రీకాంత్రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్, ఏసీ, ఫ్రిజ్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఇటీవల తమ పార్టీ పిలుపు మేరకు కడపలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో యువతను శ్రీకాంత్రెడ్డి తరలించారన్న కక్షతోనే అధికార పార్టీ నేతలు ఇలాంటి అరాచకాలకు దిగారని విమర్శించారు. చెరువు పోరంబోకు స్థలంలో చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారని, తొలుత వారి ఇళ్లు తొలగించకుండా వైఎస్సార్ సీపీ నాయకుని ఇంటిని తొలగించే యత్నం ఎందుకు చేశారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే బద్వేలు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లోని భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సుమారు 300 మంది బద్వేలు చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్వగ్రామమైన చెన్నకేశంపల్లెలో వైఎస్సార్ సీపీ గణనీయంగా ఓట్లు నమోదయ్యాయన్నారు. దీంతో ఆయకట్టు బంజరు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు నోటీసులు జారీ చేయించడం అన్యాయమన్నారు. టీడీపీ అరాచకాలు ఎదుర్కొంటాం – ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పాల్పడుతున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. చెరువులో నిర్మించుకున్న ఇళ్లను తొలగించకుండా శ్రీకాంత్రెడ్డి ఇంటిని తొలగించేందుకు అధికారులు రావడం తగదన్నారు. కనీసం సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇంటిని తొలగిస్తామనడం దారుణమని విమర్శించారు. శ్రీకాంత్రెడ్డి వైఎస్సార్సీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారన్న కక్షతోనే ఇంటి కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు టీడీపీ వాళ్ల ఇళ్లు కూల్చడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడలేదన్నారు. బి.కోడూరు మండలంలో తమ పార్టీ సానుభూతి పరులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ● బాధితుడు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తాను ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. ఆ స్థలం సుమారు 70 సంవత్సరాలుగా తమ కుటుంబ ఆధీనంలో ఉందని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు శుక్రవారం తెల్లవారుజామున కూడా వచ్చారని తెలిపారు. ప్రజలు అఽధికారం ఇచ్చింది కక్ష సాధింపులు తీర్చుకోవడానికి కాదని, సుపరిపాలన అందించేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. ● ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్కుమార్, సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య, ఎస్సీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్రెడ్డి ఇల్లు కూల్చేయత్నం డీ–మార్కేషన్, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారుల వీరంగం ఫర్నీచర్, ఇతర సామాగ్రి ధ్వంసం బద్వేలులో పరాకాష్ఠకు అధికార పక్షం అరాచకాలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ -
పరుగుల సునామీ సృషించిన కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో రెండవ రోజు కడప జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 401 ఓవర్నైట్ స్కోర్తో శుక్రవారం రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 175.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 765 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆర్. ప్రణీల్రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 477 బంతుల్లో 39 ఫోర్లతో 353 భారీ పరుగులు చేశాడు. టి.సుదర్శన్ 161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు, ఎన్. విష్ణు సాయి 68 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 7 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 194 ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 77 ఓవర్లలో 524 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎ. జయంత్ కృష్ణ 37 ఫోర్లు, 3 సిక్సర్లతో 221 అత్యధిక పరుగులు చేశాడు. కెహెచ్ వీరారెడ్డి 175 బంతుల్లో 157 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ 4 వికెట్లు, లోకేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 72 పరుగులు చేశాడు. 353 పరుగులు చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్రెడ్డి 765 భారీ స్కోరు చేసిన కడప జట్టు -
నెత్తురోడ్లుతున్నాయ్!
రహదారులు నెత్తురోడుతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిద్ర లేమి.. వెరసి రోడ్డు ప్రమాదాలతో ఎరుపెక్కాయి. ఇటీవల జిల్లాలో జరిగి న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. 2025 మే 26న గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు లారీ ఢీ కొన్న ప్రమాదాలల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ● గత వారంలో రాయచోటి నుంచి హైదరా బాదుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.జాతీయ రహదారి వెంబడి ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. నిబంధనల మేరకు ముందు, వెనుక వాహనాలకు రిఫ్లైక్టింగ్ స్టిక్కర్లు అతికించాల్చిన అవసరం ఉంది. ఇవి రాత్రి వేళల్లో వాహనచోదకునికి ముందు వాహనం ఉందనే విషయాన్ని సృష్టంగా కనిపించేలా చేస్తుంది. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతి వేగంతో దూసుకెళుతున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. బ్లాక్ స్పాట్లలో సూచిక బోర్డులు, విద్యుద్దీపాలు, రహదారి మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలి. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో సమారు 307 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 172 మంది మృత్యువాత పడగా 364 మంది క్షతగాత్రులయ్యారు. వేగ నియంత్రణ అమలు చేయకపోవడం, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు ఈ విషయాల్లో పున: సమీక్షించాల్సిన అవసరం ఉంది. కారణాలెన్నో...... మితి మీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్ టేక్, అకస్మాత్తుగా వాహనం నిలపడం, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర విషయాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై లారీలను ఇష్టానుసారంగా నిలిపేస్తున్నారు. హోటళ్లు, డాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి అనుకొని ఆపుతున్నా రు. ఈ క్రమంలో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక వాటిని ఢీ కొంటున్నాయి. లారీలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా విశ్రాంతి స్థలాల్లో మాత్రమే నిలపాల్సి ఉన్న అక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లకు అనుకొని, చెట్ల కింద ఆపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు అధికంగా రాత్రి వేళ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అందులో క్లీనర్గా పని చేసే వారు అరకొర డ్రైవింగ్తో అప్పుడప్పుడు వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం, ముందు వెళుతున్న వాటిని వేగంగా అధిగమించే క్రమంలో పట్టుకోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తీర్మానం చేసినా.... ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 70 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్ సేప్టీ సమావేశాల్లో తీర్మానించారు. అది కార్యరూపం దాల్చినా కేవలం ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. అనంతరం అధికారులు అటు వైపు దృష్టి సారించిన దాఖల్లా లు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పదించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గతంలోనే గుర్తించారు. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు తొలగేలా వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టా యి. కాలక్రమంలో దీనికి బ్రేక్ పడింది. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు ఇలా చేస్తే... ఒకరి నిర్లక్ష్యం..మరొకరికి ప్రాణ సంకటం మితిమీరిన వేగంతోనేరోడ్డు ప్రమాదాలు ఐదు నెలల్లో172 మంది మృత్యువాత రోడ్డు నిబంధలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం రోడ్డు నియమ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాల వేగ నియంత్రణను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్లతో తనిఖీలు చేపడుతున్నాం. మద్యం మత్తుల్లో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. –నిరంజన్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా 2020 825 307 970 2021 861 368 949 2022 801 403 837 2023 631 372 730 2024 664 321 737 2025 307 172 364 మే వరకు -
అశ్రునయనాలతో హవల్దార్కు అంత్యక్రియలు
తొండూరు : మండల కేంద్రమైన తొండూరు గ్రామానికి చెందిన హవల్దార్ బూచుపల్లె శివప్రకాష్రెడ్డి బుధవారం సాయంత్రం గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం హవల్దార్ అధికారి శివప్రకాష్రెడ్డి మృతదేహం వద్ద సబ్ మేజర్ దిలీప్ పాల్ జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాష్రెడ్డి యూనిఫాం, జాతీయ జెండాను భార్య నాగేశ్వరి, కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం స్మశాన వాటిక వరకు శివప్రకాష్రెడ్డి అంతిమ యాత్ర జన సందోహం మధ్య జరిగింది. స్మశాన వాటిక వద్ద గాలిలోకి కాల్పులు జరిపి భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, ప్రకాష్రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మిలటరీ అధికారులు హవల్దార్లు సి.ఎల్.రెడ్డి, ఎన్.కె.ఎస్.హరీష్, మాజీ హవల్దార్లు రామమణిరెడ్డి, నరసింహారెడ్డి, ఎన్.కె.శ్రావణ్రెడ్డి, ఎస్ఐ ఘన మద్దిలేటి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బయనపల్లెలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని చింతపల్లె పంచాయతీ బయనపల్లె గ్రామంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి చెందిన ఇంటిని అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసేందుకు భారీగా పోలీసులను మోహరింపచేసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారుల తీరును తప్పుపట్టడంతో పాటు కూల్చివేతను అడ్డుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత నాయకులతో మాట్లాడారు. కూల్చివేతకు యత్నం.. బద్వేలు–కడప రహదారిలోని బయనపల్లె గ్రామంలో సర్వే నెం. 27ఎ, 27బిలలో కొంత గ్రామ నత్తం ఉంది. సదరు స్థలాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తాతల కాలం నుండి సుమారు 60 ఏళ్ల కిందటి నుండి 8 సెంట్ల స్థలాన్ని స్వాధీనానుభవంలో ఉంచుకున్నారు. సదరు స్థలం పక్కనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీసీరోడ్లు సైతం నిర్మించారు. అయితే గత పదేళ్ల క్రితం శ్రీకాంత్రెడ్డి అందులో ఒక ఇంటిని నిర్మించుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో పాటు రెండు రోజుల క్రితం జరిగిన యువతపోరు కార్యక్రమానికి బద్వేలు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువతను కడపకు తరలించారు. దీనిని జీర్ణించుకోలేని రూరల్ పరిధికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత వద్ద శ్రీకాంత్రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్న గ్రామస్థులు టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో శ్రీకాంత్రెడ్డి నివసిస్తున్న ఇంటిని కూల్చివేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు భారీగా పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల్లో చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ముందు వాటిని తొలగించి తర్వాత ఇక్కడికి రావాలని అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామస్థులు పెద్త ఎత్తున తరలిరావడంతో ఇంటిని కూల్చివేసే చర్యలు కొంతసేపు ఆపారు. ఇదే సమయంలో బద్వేలు రూరల్, బి.కోడూరు, అట్లూరు మండలాల నుండి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించడంతో పాటు అడ్డుకునే వారిపై నీళ్లు కొట్టేందుకు ఫైరింజన్ను సైతం పిలిపించారు. అయితే గ్రామస్థులు వారి చర్యలకు బెదరకుండా గట్టిగా నిలబడడంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే కాపుకాశారు. పరామర్శించిన ఎమ్మెల్సీ.. కక్షపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు యత్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్రెడ్డి, మాజీ కుడా ఛైర్మన్ గురుమోహన్, జడ్పీటీసీ పోలిరెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున బయనపల్లెకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ ఛైర్మన్ ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దారు ఉదయభాస్కర్ రాజు, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్లతో చర్చించి కొంత సమయం ఇచ్చి అక్రమ నిర్మాణమని తేలితే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని తెలిపారు. ఇంతలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపటికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ తహసీల్దారు, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీకి చెందిన శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులపై ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తుందని అన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిని కూల్చివేసేందుకు యత్నించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న గ్రామస్తులు పరామర్శించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి -
2 నుంచి తరగతులు
కడప సెవెన్రోడ్స్: పేద విద్యార్థులకు అధునాతన వసతులు, నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో జిల్లాలోని బి.మఠంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర మహా గురుకులంలో జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో బి.మఠం మండలంలో ఏర్పాటైన డా.బి.ఆర్.అంబేద్కర్ మహా గురుకులం (బాలుర) విద్యా లయంలో తరగతుల ప్రారంభానికి సంసిద్ధత, విద్యార్థుల అడ్మిషన్ అంశాలపై సమావేశం నిర్వహించారు.అత్యాధునిక సదుపాయాలు, వసతులతో రూపు దిద్దుకున్న ఈ గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి 800 మంది విద్యార్థులతో అడ్మిషన్లు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని శ్రీలక్ష్మీసాయి ఫర్నీచర్ దుకాణంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. పట్టణానికి చెందిన సి.హెచ్ గోపాలక్రిష్ణ నెల్లూరు రోడ్డులో కొన్నేళ్లుగా ఫర్నీచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరే గురువారం దుకాణం తెరిచి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి సమయంలో దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. కొద్ది సేపటికి దుకాణం నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల వారు గమనించి దుకాణ యజమానికి తెలిపారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్పటికే బయనపల్లె గ్రామంలో ఉన్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సోఫాసెట్లు, పరుపులు, కూలర్లు, డబుల్కాట్మంచాలు కాలిపోయాయి. మంటలను అదుపు చేయడంతో కొంత సామగ్రిని కాపాడుకోగలిగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
వేంపల్లె : స్థానిక శ్రీరాంనగర్లో నివాసముంటున్న వరలక్ష్మి అనే మహిళను ఆమె భర్త రవి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం దుగ్గన్నగారిపల్లెకు చెందిన గంగోజి, గీత దంపతుల కుమార్తె వరలక్ష్మికి వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు దేరంగులరవితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు మన్విక ఉన్నది. ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. గత కొన్ని నెలలుగా వరలక్ష్మి భర్త రవి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. అయితే ఈనెల 2వ తేదీన ఆమె తల్లిదండ్రులు వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బాధితురాలి భర్త రవికి స్థానిక టీడీపీ నేతల అండదండలు ఉండడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఆ తర్వాత కడప మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తన ఇంటి వద్దకు వచ్చిన వరలక్ష్మి భర్త డేరంగుల రవి, అతని చిన్నాన్న కొడుకు కృష్ణమూర్తి, తండ్రి వెంకటసుబ్బయ్య, చిన్నాన్న వెంకటరమణలు వరలక్ష్మిని విచక్షణ రహితంగా కాలితో కడుపుపైన కొట్టారన్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలిపులివెందుల టౌన్ : ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడిపల్లి కిశోర్ కోరారు. గురువారం పట్టణంలోని స్థానిక ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పునరాలోచించి రోస్టర్ విధానం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లలో అవకాశం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేవిధంగా అవకాశం ఇస్తే విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవనం మీద నుంచి కింద పడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతికడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేపు జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈనెల 28న కడప జిల్లా కోర్టులో గల కడప బార్ అసోసియేషన్ హాలులో భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష నిర్వహించనున్నట్లు భారత న్యాయవాదుల సంఘం కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఇ.సుబ్రహ్మణ్యం కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. ఈశ్వర్ తెలిపారు. గురువారం నగరంలోని బసవతారకం లా కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరు కానున్న యువ న్యాయవాదులకు ఈ మోడల్ టెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కడప బార్ అసోసియేషన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 99633 28876, 70137 40055, 94411 21181 నంబర్లకు ఫోన్ చేసి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.