breaking news
YSR District News
-
ఎమ్మెల్యే చెప్పారని..
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీ కార్యకర్తకు సిఫారస్సు చేయడంతో ఒకటో తేదీ వరకు రేషన్ షాప్నకు సరుకు ఇవ్వకపోవడంతోపాటు ఒకటో తేదీ డీలర్ను మార్చి వెంటనే సరుకులు పంపిణీ చేసిన సంఘటన సోమవారం ప్రొద్దుటూరులో జరిగింది. శ్రీనివాసనగర్లోని 33వ రేషన్ షాప్నకు సంబంధించిన డీలర్ తనను కూటమి నేతలు అన్యాయంగా తొలగించారని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి అదే డీలర్కు రేషన్ షాప్ను కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతినెల 26వ తేదీ నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసి ఒకటో తేదీ నుంచి యథావిధిగా పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. తమ పార్టీ కార్యకర్తకు రేషన్ షాప్ ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోర్టుకు వెళ్లిన డీలర్పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు ఆ డీలర్ను తొలగించి టీడీపీ కార్యకర్త గఫార్కు కేటాయించారు. వారం రోజుల ముందుగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా రెవెన్యూ అధికారులు ఒకటో తేదీన పాత డీలర్ను సస్పెండ్ చేయడం, టీడీపీ కార్యకర్తకు ఇవ్వడం, వెంట వెంటనే గోడౌన్ నుంచి సరుకులు అందించి పంపిణీని ప్రారంభించారు. -
‘అద్దె’గోలు వ్యవహారం!
సాక్షి, టాస్క్ఫోర్స్ : కడప కేంద్ర కారాగారం ఆవరణంలో అధికారులు, సిబ్బంది కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ‘క్వార్టర్స్’ను నిర్మించి ఇచ్చింది. వార్డర్స్, హెడ్వార్డర్స్ నివాసం ఉండేందుకు 30 క్వార్టర్స్, జైలర్లు, డిప్యూటీ జైలర్లు ఉండేందుకు 12 క్వార్టర్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వీటిల్లో ఎక్కువ భాగం క్వార్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. నిబంధనల మేరకు క్వార్టర్స్లో వుంటున్న వారికి వారి వేతనాలలో హెచ్ఆర్ఏ కింద ఇచ్చే డబ్బులను ఇవ్వరు. క్వార్టర్స్లో కాకుండా బయట అద్దెకున్న వారికి సాధారణంగా హెచ్ఆర్ఏ కింద ఇచ్చే 20 శాతం డబ్బులను వారికి వేతనాలతో పాటు ఇస్తారు. అయితే పూర్తిగా దెబ్బతిన్న క్వార్టర్స్గా తీర్మానించిన తరువాత కూడా కొందరు అధికారులకు, సిబ్బందికి అందులో నివాసం ఉండేలా అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్స్లో వుంటూనే హెచ్ఆర్ఏను పొందుతున్నవారి వివరాల్లోకి వెళితే.. కడప కేంద్ర కారాగారంలో విధులను నిర్వహిస్తున్న ముగ్గురు జైలర్లు, ప్రత్యేక మహిళాజైలు అధికారిణితో పాటు, ఓ జైలరు, ఇద్దరు కారాగార డిప్యూటీ జైలర్లు, మహిళా జైలు డిప్యూటీ జైలరుతో పాటు, 10 మంది హెడ్వార్డర్లు, వార్డర్లు వున్నారు. వీరు వారి వేతనంతో పాటు ఒక్కొక్కరు 15వేలు, 18 వేలు, 20 వేలు చొప్పున హెచ్ఆర్ఏను కూడా పొందుతున్నారు. ఏడాదిన్నర క్రిందటే క్వార్టర్స్ దెబ్బతిన్నాయని తీర్మానించిన వాటిల్లోనే ఎవరి అండదండలతో నివాసం ఉంటున్నారని కొందరు సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి, డీఐజీ, ఐజీకి ఈ వ్యవహారమంతా తెలిసే జరుగుతోందా? లేక తెలిసినా తమకు ఇష్టమైన వారే కావడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కడప కేంద్ర కారాగారానికి తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారులైన డీఐజీ, ఐజీ దృష్టికి వార్డర్లు ఈ వ్యవహారాన్ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినా తమను పట్టించుకోలేదని వారు పేర్కొంటున్నారు. ఓ అధికారికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ జైలరు ఒక్కో వార్డరు నుంచి అక్రమంగా డబ్బులను వసూలు చేసి తమకు అనుకూలంగా వున్నవారికే దెబ్బతిన్న క్వార్టర్స్ను ఇప్పించినట్లు బలమైన ఆరోపణలు వున్నాయి. ఏదిఏమైనా ఈ విధానం వలన ప్రతినెలా రూ.3 లక్షల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 36 లక్షల మేరకు నష్టం వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ బాగోతానికి అడ్డుకట్ట వేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. నివాససయోగ్యం కాని క్వార్టర్స్ను వినయోగించుకుంటున్న జైలు అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్న వైనం ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ.36 లక్షలు నష్టం ఉన్నతాధికారుల అండదండలతోనే ఇలా జరుగుతోందనే ప్రచారం తనిఖీల పేరుతో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్న అధికారులు -
నేడు గుడి తిరునాల
కలసపాడు : మండల కేంద్రమైన కలసపాడులోని సగిలేరు ఒడ్డున ఉన్న పరిపేతురు పరిపౌలు చర్చి 138వ వార్షికోత్సవం మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్నట్లు డీనరీ చైర్మన్ ఆనందకుమార్, ప్రెస్బేటర్ ఆశిస్గాబ్రియేల్ తెలిపారు. 2వ తేదీ మంగళవారం సాయంత్రం నంద్యాల బిషప్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు, ఆయన సతీమణి బ్యూలా సంతోష్ ఊరేగింపు ఉంటుందని, రాత్రి 6–30 గంటలకు క్రైస్తవ సంగీత విభావరి, 7 గంటలకు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, 8–30 గంటలకు దీపారాధన, 9–30 గంటలకు కానుకలు సమర్పించుట, రాత్రి 10 గంటలకు యువజనులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 10–30 గంటలకు రవికుమార్ బృందం వారిచే చెక్కభజన, 11–30 గంటలకు గుణదలమాత నాట్య మండలి విజయవాడ వారిచే వి.దత్తుబాబు సమర్పించు యేసుకృప క్రైస్తవ నాటకం ఉంటుందన్నారు. 3వ తేదీన ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధన ప్రభురాత్రి భోజన సంస్కారం, 7 గంటలకు గుడి ప్రదర్శన, 9 గంటలకు బాప్జిస్మములు, సాయంత్రం 4 గంటలకు ప్రతిష్ట పండుగ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేందప్రసాద్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సీఐ హేమసుందర్రావు, స్థానిక ఎస్ఐ తిమోతిలు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే వైద్యాధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సాయితేజ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఉంటుంది. -
మద్యం మత్తులో డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: మద్యం మత్తులో బడిమెల నరసింహులు (51) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజి కాలువలో పడి మృతి చెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నరసింహులు చీరెల వ్యాపారం చేసుకొని జీవనం సాగించేవాడు. ఆయన భార్య రమాదేవి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. నరసింహులు కొన్నేళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. చీరెల వ్యాపారానికి వెళ్లి 20–30 రోజులకు గానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో రామేశ్వరం రోడ్డులోని కల్యాణమండపం సమీపంలోని మురికి కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. దీంతో రమాదేవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడంతో నరసింహులు మృతదేహంగా నిర్ధారణ అయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కడప విమానాశ్రయానికి ఉడాన్ స్కీం నిధులు
● రూ.606 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిరాజంపేట : కడప విమానాశ్రయంలో 2024–2025 ఉడాన్ స్కీం కింద దాదాపు రూ.606 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్ తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశం సందర్భంగా రాజ్యసభలో కడప విమానాశ్రయం అభివృద్ధిపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకొచ్చారు. కడప విమానశ్రయానికి కనెక్టివిటీ పెంచాలని కోరామన్నారు. ర ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం లక్షలాది మంది వెళుతున్నారని, వారి సౌకర్యం కోసం గల్ఫ్ విమానాల రాకపోకలను తీసుకురావాలన్నా రు. కడప నుంచి చైన్నె, విజయవాడ, హైదరాబాదుకు ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా కనెక్టివిటీ కొనసాగుతోందని తెలిపారన్నారు. కొత్తగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. హైదరాబాదు, చైన్నె కనెక్టివిటీతో యుఏఈ, కువైట్ దేశాలకు రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపారన్నారు. -
వైర్ల చోరీపై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి వైర్లు చోరీ జరిగినట్లు గ్రామ రైతు మోపూరి పెద్దదస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ వైర్ల విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు. కారు దగ్ధంకడప అర్బన్ : కడప నగరంలోని శంకరాపురంలో ఓ కారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సోమవారం దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రూ. 2..50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు కడప అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి యోగీశ్వర్ రెడ్డి తెలిపారు. పీజీ వైద్య విద్యార్థినికి గోల్డ్ మెడల్కడప అర్బన్ : డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీజీ పరీక్షల్లో కడప ప్రభుత్వ వైద్యకళాశాల (రిమ్స్) అనస్థీషియా విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని డాక్టర్ ఎం. సంధ్యారాణి అత్యధిక మార్కులు(637/800) సాధించారు. దీంతో ఆమె యూనివర్సిటీ గోల్డ్ మెడల్కు ఎంపికై నట్లు కడప మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. డాక్టర్ ఎం.సంధ్యారాణిని ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ నాగశ్రీలత, అనస్తీషియా డాక్టర్ సునీల్ చిరువెళ్ల, వైద్యులు, వైద్య విద్యార్థులు అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల నిఘాకడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప వన్ టౌన్ సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పట్టారు. సోమవారం పాత బస్ స్టాండ్, బుగ్గవంక పరివాహక ప్రాంతం, గుర్రాల గడ్డ, రవీంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో అనుమానితులను గుర్తించారు. బాలిక అదృశ్యంఒంటిమిట్ట : మండల పరిధిలోని మారయ్యగారిపల్లికి ఓ వివాహ వేడుకకు వచ్చిన బాలిక(16) గత నెల 28 నుంచి కనిపించడం లేదని సోమవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన బాలిక ఒంటిమిట్టలో జరిగే ఓ వివాహానికి మారయ్యగారిపల్లెకు చెందిన తన మేనత్త ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. గత నెల 28 వ తేదీన ఆమె అదృశ్యమైంది. అన్నిచోట్ల గాలించినా ఫలితంలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మఠాధిపతి నియామకం జరిగేనా!
● పట్టు వీడని మారుతీ మహాలక్షుమ్మ ● అందరి సహకారంతో ముందుకు వెళుతున్నామంటున్న వెంకటాద్రి స్వామిబ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి త్వరలో నూతన మఠాధిపతి నియామకం జరిగే సూచనలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నాలుగేళ్లుగా మఠాధిపతి లేకపోవడం బ్రహ్మంగారిమఠం చరిత్రలో ఇదే మొదటిసారి. మఠాల వ్యవహారం స్వయం ప్రతిపత్తిపై కొనసాగుతుంది. అలాంటిది మఠాధిపతి నియామకం విషయంలో సమస్యలు తలెత్తడంతో దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. చివరికి పరిపాలనా వ్యవహారం కూడా దేవదాయ పరిధిలో ఉండిపోయింది. ఈ పరిస్థితికి ముఖ్య కారణం పూర్వపు మఠాధిపతి సరైన నిర్ణయం తీసుకోకపోవడమే అని భక్తులు ఆరోపిస్తున్నారు. మఠాల స్వయంప్రతిపత్తి నిలవాలంటే మఠాధిపతి అవసరం. అలాంటిది మఠాధిపతి లేకపోతే పరిపాలన సజావుగా సాగదనేది సత్యం. ఇక్కడ ప్రధానంగా పూర్వపు మఠాధిపతి ఇద్దరు భార్యల పిల్లల వ్యవహారం ముదరడంతో సమస్య పరిష్కారం కాలేదు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, రెండవ కుమారుడు భద్రయ్యస్వామి, రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు మధ్య పోటీ నెలకొనడంతో సమస్య ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. ప్రభుత్వం చొరవ చూపడంతో నియామకం కోసం దేవదాయ అధికారులు ధార్మిక పరిషత్ ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. ధార్మిక పరిషత్ పూర్తి వివరాలను దేవదాయ శాఖకు సమర్పించింది. మరో 10 రోజుల్లో బ్రహ్మంగారిమఠానికి నూతన మఠాధిపతిగా ఎవరిని ఎన్నుకోవాలో ఆదేశాలు వెలువడవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరిని కలుపుకొని పోవాలనే యోచనలో వెంకటాద్రిస్వామి ఉన్నారు. అయితే పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీమహాలక్షుమ్మ తన కుమారుడు గోవిందస్వామిని ఎలాగైనా మఠాధిపతిని చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ధార్మిక పరిషత్ చేపట్టిన విచారణ సరిగా లేదంటూ ఆమె తన బంధువు చేత హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయించి నియామక ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని కోరినట్లు వెంకటాద్రిస్వామి తెలిపారు. కానీ పిల్ వేసిన వ్యక్తి భక్తుడు కాక పోవడం, ఆమె సమీప బంధువు కావడంతో స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారని తెలిపారు. ఇప్పటికై నా అందరం కలసి ఉండాలనేది తన ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగించాలనుకుంటే బ్రహ్మంగారు చూసుకుంటారని చెప్పారు. -
ఆధ్యాత్మిక నిలయం .. జ్యోతిక్షేత్రం
● మహిమాన్వితుడు కాశినాయన ● ఈనెల 4న కాశినాయన ఆరాధన మహోత్సవాలు ● భక్తుల కోసం భారీగా ఏర్పాట్లుకాశినాయన : జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కాశినాయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. ఆయన గురువైన యతిరాజు గురవయ్య వద్ద ఆత్మ జ్ఞానాన్ని పొందారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ప్రవేశించి వరికుంట్ల, నాయునిపల్లె, గంగనపల్లె గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు చిన్న పిల్లలకు విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనను కొనసాగించారు. ఆ సమయంలో వరికుంట్ల సమీపంలోని నల్లమల్ల కొండల్లోని జ్యోతి క్షేత్రంలోని జ్యోతి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జ్యోతి నరసింహస్వామికి పూజలు చేస్తుండేవారు. అక్కడికి సమీపంలోని గరుడాద్రి కొండ మీద కఠోర దీక్షతో తపస్సు చేశారు. అనంతరం అన్నదాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వచ్చేవారు. ఆలయాల పునరుద్ధరణకు కృషి.. అవధూతగా మారిన కాశినాయన శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చుక్కనీరు దొరకని గరుడాద్రి కొండమీద నీటిబావులు తవ్వించారు. గరుడాద్రి, అనంతరాయుడు, జ్యోతి, సిద్దేశ్వరం, లింగమయ్యకొండ, యోగానందలోని ఆలయాలను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఉన్న అహోబిలం వద్ద యోగానంద ఆశ్రమం స్థాపించి పశుసంపద, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు కుటుంబంలో పుట్టడంతో పశుపాలన, ధాన్యోత్పత్తి, ఆకలితో ఉన్న వారికి పిడికెడు అన్నం పెట్టడం అనే గుణాలు ఆయనకు అలవడ్డాయి. జ్యోతినరసింహస్వామి పాదాల చెంత సమాధి.. వందేళ్లు జీవించిన కాశినాయన తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబర్ 5వ తేదీన సమాఽధి అయ్యారు. ఆయన సమాధి చెందిన ప్రాంతంలో ఒక పురాతన మర్రిచెట్టు తనంతట తానే నేలవాలింది. ఆయన సేవిస్తూ వస్తున్న గోమాత కాశినాయన మరణాన్ని జీర్ణించుకోలేక మూడవ రోజున తనువు చాలించింది. దేవాలయం ఏర్పాటు.. కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకగా 60 రాతిస్తంభాలతో ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లుగా దేవాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆవు సమాధిని కూడా అందంగా నిర్మించారు. వంట శాలలు, భోజన శాలలు, వసతి గృహాల నిర్మాణాలతో జ్యోతిక్షేత్రం కళకళలాడుతోంది. నిత్యాన్నదానం.. కాశినాయన ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు అక్కడ స్వామి దర్శనం ఎంత ఇష్టమో ఆశ్రమంలో భోజనం చేసి రావడం అంత పవిత్రం. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని భోజనం చేస్తుంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తజనం లక్షల్లో వస్తుంటారు. ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. రైతులు తాము పండించిన పంటలో కాశినాయన పేరున తీసి ఉంచిన ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆశ్రమానికి తమకు తాముగా చేరవేస్తుంటారు. దీంతో అన్నదానం సజావుగా సాగుతుంది. ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే కాశినాయన మహోత్సవాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, అన్నదాన కార్యక్రమం సజావుగా సాగేందుకు విస్తృతమైన భోజన కౌంటర్లు, వసతి ఏర్పాటు చేస్తున్నారు. మైదుకూరు ఆర్టీసీ డిపో వారు ఈనెల 4వ తేదీ నుండి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాశినాయన మాలను ధరించి కొంత మంది భక్తులు దీక్షలో కొనసాగుతున్నారు. వీరంతా ఈనెల 4వ తేదీ రాత్రికి జ్యోతిక్షేత్రానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోరుమామిళ్ల సీఐ హేమసుందర్రావు ఆధ్వర్యంలో కాశినాయన ఎస్ఐ యోగేంద్ర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వెంకటప్ప విద్యార్థి
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుందనశ్రీ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. గతనెల 22, 25 తేదీలలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన జిల్లా స్థాయి హాకీపోటీలలో కుందనశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
అండర్–14 జోనల్ మ్యాచ్లో సత్తా చాటిన బౌలర్లు
4 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బౌలర్ జత్విక్ 51 పరుగులు చేసిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ రక్షణ్ సాయి 89 పరుగులు చేసిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ ఎస్ఎండీ ఇజార్ 137 పరుగులు చేసిన నార్త్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ సీహెచ్ అక్షిత్రెడ్డి 4 వికెట్లు తీసిన సెంట్రల్ జోన్ విన్నర్స్ బౌలర్ రామ్ కిరణ్ విన్నీ 5 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ బౌలర్ దీక్షిత్ 88 పరుగులు చేసిన రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ బ్యాట్స్మన్ సాయి కృష్ణచైతన్యకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 మూడవ విడత జోనల్ మ్యాచ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్– సౌత్జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌత్జోన్ విన్నర్స్ జట్టు 72 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహ్మద్ ఇజార్ 89 పరుగులు, రక్షణ్ సాయి 51 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 3 వికెట్లు, నాగ వెంకట జత్విక్ 4 వికెట్లు తీశారు. దీంతో సక్రమంగా వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ఆపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదేలాగే కేఎస్ఆర్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నార్త్జోన్ విన్నర్స్–సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నార్త్జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టులోని యాసిల్ విఘ్నేష్ 49 పరుగులు, పిహెచ్ అక్షిత్ రెడ్డి చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 237 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని రామ్ కిరణ్ విన్నీ 4 వికెట్లు, యాసిన్ సిద్దిఖ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్– రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టు 69.5 ఓవర్లకు 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయికృష్ణ చైతన్య 88 పరుగులు, తాహీర్ 44 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టులోని నందన్ కృష్ణ సాయి 2 వికెట్లు, దీక్షిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, యోజిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 21 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రజ్ఞాన్ పండిత్ 36 పరుగులు చేశారు. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ను నిలిపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఉచితమే.. ప్రయాణం నరకమే !
● ప్రయాణికులకు తగిన సంఖ్యలో లేని బస్సులు ● ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ కడప కోటిరెడ్డిసర్కిల్ : చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన సీ్త్ర శక్తి ఉచిత బస్సు పథకం ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగించడంతోపాటు ప్రజలకు నరకప్రాయంగా మారింది. సరిపడా బస్సులు లేక మహిళలతోపాటు పురుషులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కష్టంగా మారిందని మహిళలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికులు కిక్కిరిసిన ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు పడలేక ప్రైవేటు బస్సులు, ఆటోలు, మరికొంతమంది కార్లలో రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం. జిల్లాలోని ఆరు డిపోలలో 309 బస్సులు పరుగులు పెడుతున్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. సీట్ల కోసం అగచాట్లు మహిళా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్న తరుణంలో బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో సీట్ల కోసం మహిళలు ఘర్షణ పడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక పండుగలు.. ఉత్సవాల సమయంలో ప్రయాణికుల పరిస్థితి వర్ణణాతీతం. ఉచిత ప్రయాణం పథకంపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణంగా బస్సుల్లో సగటున ఓఆర్ శాతం 50 వరకు మాత్రమే ఉండేది. ఉచిత ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి ఓఆర్ శాతం 70 వరకు పెరిగింది. 50 మందితో వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సుల్లో 100–150 మంది ప్రయాణిస్తున్నారు. మహిళలు పడుతున్న ఇబ్బందులపై అధికారులుగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కిక్కిరిసిన బస్సుల్లో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు తప్పని పాట్లు కడప నగరంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో సుమారు 6–8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అనేకమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు నెలవారి బస్సు పాసులు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీ్త్ర శక్తి పథకంలో విద్యార్థినిలకు ప్రయాణం ఉచితమే అయినా వారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పలు గ్రామాల నుంచి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు వేచివున్న విద్యార్థులను చూసి బస్సులు ఆపడం లేదు. బస్సుల్లో ఏమాత్రం ఖాళీ లేని పరిస్థితుల కారణంగా ఇలా చేయాల్సి వస్తోందని డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. -
చెన్నకేశవా..దర్శనమివ్వవా !
రాజంపేట : తాళ్లపాక గ్రామంలో పదకవితాపితామహుడు అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ తలుపులు సోమవారం తెరుచుకోలేదు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండి చేసేదేమిలేక వెనుదిరిగారు.ఆలయ తలుపులు తెరవని సంఘటనపై గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు స్పందించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీకి మెమో ఇచ్చారు. టీటీడీ విజిలెన్స్ ఏఎస్ఐని, టెంపుల్ ఇన్స్పెక్టర్ను హుటాహుటిన తాళ్లపాకలోని చెన్నకేశవస్వామి ఆలయానికి పంపించారు. మధ్యాహ్నం 12.30గంటలకు తాళాలు పగులగొట్టించి తలుపులు తెరిపించారు. అప్పటి వరకు స్వామివారికి పూజలు ఆగిపోయాయి. టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ, సూపరిండెంట్ హనుమంతయ్య సక్రమంగా విధులకు హాజరుకావడంలేదని టీటీడీ డిప్యూటీ ఈవోకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. ● ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం సమయంలో ఆలయానికి సీలు వేయాలంటే టెంపుల్ ఇన్స్పెక్టర్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. అవి ఇక్కడ అమలుకాలేదని గ్రామస్తులు ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న నాయీబ్రహ్మణులతో ఆలయానికి సీలు వేయించడం, మళ్లీ ఓపెన్ చేయడం జరుగుతోందని వాపోయారు. ● స్థానిక టెంపుల్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేరని తాళ్లపాక వాసులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్టలో ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో రెండుమార్లు ఆలయ తలుపలు తెరుచుకోలేదంటున్నారు. ఐదురోజుల కిందట టీటీడీ వారు అందజేసిన ఆవు కూడా కనిపించకుండా పోయిందన్నారు. భక్తులు తాగేందుకు మంచినీరు అందుబాటులో లేదని చెబుతున్నారు. -
కమ్మేసిన మేఘాలు
● భారీ వర్ష సూచనను తలపించిన మబ్బులు ● మోస్తరు వానలతో ఊరట ● జిల్లా వ్యాప్తంగా 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం ● కొనసాగుతున్న తుపాను ప్రభావం కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఆ మేరకు ఉదయం నుంచి కమ్మేసిన కారు మేఘాలతో వాతావరణం గంభీరంగా కనిపించింది. భారీ వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. మోస్తరు వానలతో ఊరట చెందారు. అత్యధికంగా రాజుపాలెంలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్టలో 6.2 మి.మీ, సిద్దవటం 5.8, వీఎన్పల్లె, కమలాపురం 5.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, తుఫాను ప్రభావం కొనసాగుతూనే ఉంది. రైతుల్లో గుబులు : వరుస తుపాన్ల కారణంగా జిల్లాలోని రైతాంగం నష్టాలను చవిచూసింది. ప్రధానంగా వరి, శనగ, కంది, పత్తి తదితర పంటలకు చెందిన రైతులు వర్షాల కారణంగా ఇప్పటికే నష్టాలను చవిచూశారు. తాజాగా దిత్వా తుపానుతో ప్రధానంగా వరి, పత్తి, శనగ తదితర పంటలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాను ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సూచనలు : జిల్లాలో వర్ష సూచనలు ఉన్నందున నారుమడి, నాట్లు దశ ఉన్న వరి పంటల్లో గట్లు, నీటి కాలువలను సరిచేసుకుని, అధిక నీటిని వెలుపలకు పంపాలి. శిలీంధ్రపు తెగుళ్లు ఆశించకుండా వర్షం లేని రోజున హెక్సా క్రోమోజోల్ 2 మి.లీ. లేక ప్రొపికనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. డిసెంబరు 2వ తేదిన అధిక వర్ష సూచన ఉన్న కారణంగా రబీ వేరుశనగ విత్తే రైతులు వర్షం ఆగిన తర్వాత వేరుశనగ విత్తుకోవాలి.ముఖ్యంగా నేలలో అధిక తేమ శాతం లేకుండా పంట విత్తుటకు తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. -
బడా నేతల భాయీ భాయీ.. కార్యకర్తల్లోనే లడాయి !
కాంట్రాక్టు పనులు, సహజ వనరుల పంపకాలు, కంపెనీల నుంచి కమీషన్లు..ఆర్థిక లావాదేవీలు.. లాభాలు.. ఇలా అన్నింట్లోనూ ఆ ఇద్దరి మధ్య దోస్తీ కుదిరింది. బాబాయ్.. అబ్బాయ్ ‘బంధం’ మరింత బలపడింది.. జెండాలు వేరైనా ‘ఆర్థిక ఎజెండా’ ఒక్కటే కావడంతో ఎంచక్కా ప్రయాణం సాగుతోంది. ఎటొచ్చి గ్రామాల్లో కార్యకర్తలే ఇరువర్గాలుగా విడిపోయారు. ‘మా నాయకుడు.. మీ నాయకుడంటూ’ గొడవలు చేసుకుంటూ శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. స్టేషన్లు...కోర్టుల చుట్టూ తిరుగుతూ పచ్చని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల స్వార్థ రాజకీయాలకు కార్యకర్తలు బలిపశువులుగా మారుతున్నారు. ● రంజుగా జమ్మలమడుగు రాజకీయం ● ఆదాయాల వద్ద బాబాయ్..అబ్బాయ్ దోస్తీ ● గ్రామాల్లో కార్యకర్తలేమో ఇరు వర్గాలుగా విడిపోయి కుస్తీ!సాక్షి టాస్క్ఫోర్సు : జమ్మలమడుగు రాజకీయాలు రంజుగా మారాయి. కూటమి పార్టీలైన బీజేపీకి ఆదినారాయణరెడ్డి, టీడీపీకి భూపేష్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసకు బాబాయ్.. అబ్బాయ్ అయిన వీరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇరువర్గాలుగా విడిపోయిన వీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో.. కమీషన్లలో ఎంచక్కా ఇద్దరి మధ్య మంచి సయోధ్యే ఉంది. ఎటొచ్చీ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు భూపేష్ వర్గం, ఆది వర్గంగా విడిపోయారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో గ్రామ, మండల స్థాయి నేతలు ఇప్పటికే రెండు గుంపులుగా బీజేపీ, టీడీపీ అని కాకుండా ఆదివర్గం, భూపేష్వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చిన్న చిన్న కాంట్రాక్టు పను ల విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ పంపకాలలో రెండు వర్గాల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ● ఇటీవల ఆదినారాయణ రెడ్డి వర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టింది. అంతే భూపేష్ వర్గీయులు ఆ పనులను ఆడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తామే పనులు చేసుకుంటామని మీరేవరు చేయటానికి అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయని పరిస్థితి. ● పది రోజుల క్రితం ముద్దనూరు పట్టణంలో స్మార్టు కిచెన్ షెడ్డు నిర్మాణ పనులను భూపేష్ వర్గీయులకు కేటాయించారు. అయితే ఆదివర్గంలో ఉన్న ఓ నాయకుడు సదరు పనులు చేయకుండా అడ్డు పడుతున్నాడు. ఆ పనులను తమకు అప్పగించాలంటూ సదరు నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివర్గానికి చెందిన వారిపై భూపేష్ వర్గీయులు కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పోలీసులు 307 కేసు నమోదు చేసి భూపేష్ వర్గీయులకు కోటింగ్ ఇచ్చారు. నిందితులు జరిగిన విషయాన్ని తమ నాయకుడిని వివరించారు. స్పందించిన సదరు నాయకుడు పోలీసు అధికారికి ఫోన్ చేసి ‘307 కేసు ఎలా నమోదు చేస్తావు. ఏవిధంగా చేస్తావంటూ’ ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు సమాచారం. అనంతరం బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. పోలీసులపై ఇరు వర్గాల ఒత్తిళ్లు.. జమ్మలమడుగు నియోజకవర్గంలో పని చేసే పోలీసు అధికారులపై నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు ఎక్కు వవుతున్నట్లు తెలుస్తోంది. ఆదివర్గం.. భూపేష్ వర్గంగా విడిపోయిన కార్యకర్తలు గ్రామాల్లో అధిపత్యం కోసం.. పనుల్లో వాటాల కోసం చీటికి మాటికి స్టేషన్లలో పంచాయితీలు పెడుతున్నారు. చిన్న మాటొచ్చి నా చాలు ఘర్షణలు పడుతూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టే స్థాయికి వెళుతున్నారు. తీరా ఇరు వర్గాల నాయకుల నుంచి పోలీసులపై ఒత్తిడి వస్తుండటంతో పోలీసులు ఏం చేయాలో ఆర్థం కాక తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. చివరికి రాజీ యత్నాలు చేసి చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. -
వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడమే మన జెండా..ఎజెండా
వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే మన జెండా, ఎజెండా కావాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష అన్నారు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే పార్టీ కేడర్ పటిష్టంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, కడపలో అధికార పార్టీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. డిజిటల్ బుక్లో పేర్లు ఉన్నవారిని ఆ దేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. అంతకుముందు వారు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి
కడప అగ్రికల్చర్ : దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి వారి తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సీఈ సూచించారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు.రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో, మాఢవీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయయోగీ స్వామి పాల్గొన్నారు. సీపీఐఎంఎల్ సభలు జయప్రదం చేయాలి బద్వేలు అర్బన్ : ఈ నెల 6, 7వ తేదీల్లో కడప నగరంలో జరగనున్న సీపీఐఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక భగత్సింగ్నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధితోపాటు సీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. అసలే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాలుగు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. 17 నెలల పాలనలో ప్రతిపక్ష పార్టీలపైన కక్షసాధింపు చర్యలు తీసుకోవడానికే సమయం కేటాయించారని అన్నారు. కడప నగరంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను కడప, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో అజెండా రూపొందించి భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. సమావేశంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు జకరయ్య, ఏరియా కమిటీ సభ్యులు బాబు, విజయరావు, నారాయణ, చంద్రపాల్, మహబూబ్బాష, శివరాం పాల్గొన్నారు. నష్టపోయినరైతులను ఆదుకోవాలి చాపాడు : గత నెల రెండు వారాల క్రితం నుంచి కురుస్తున్న తుపాన్ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ కోరారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ రమాకుమారికి ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 22, 23వ తేదీ నుంచి తుపాన్ వల్ల మండలంలో మడూరు, అన్నవరం, బుక్కాయపల్లె, అయ్యవారిపల్లె పంచాయతీల పరిధిలో వరి పంట నేలకొరిగి పెద్ద ఎత్తున దెబ్బతిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులను గుర్తించలేదన్నారు. ఇప్పటికై నా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించి, వారికి ప్రభుత్వ సాయం అందించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరెడ్డి, రామాంజనేయులు, మైదుకూరు పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్, సభ్యులు చంద్ర, లక్ష్మీనారాయణ, మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ 2.0 పాలన కార్యకర్తలదే
● కష్ట కాలంలో పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికే మేలు ● కడప నియోజకవర్గ అవగాహన సదస్సులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, చిత్రంలో పార్టీ నేతలు.... హాజరైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలుకడప కార్పొరేషన్ : రాబోయే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకే పెద్ద పీట ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నగర శివార్లలోని పద్మప్రియ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గ, జోన్, డివిజన్ల కమిటీల నియామక అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 2019 పాలనలో కార్యకర్తల అంచనాలను అందుకోలేకపోయామని, రాబోయే రోజుల్లో ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్నా రు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతిసారీ అధికారంలోకి వచ్చే పార్టీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి మన రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించి, అన్ని కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఈ కమిటీల్లో నిఖార్సైన కార్యకర్తలకే చోటు కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో పదవుల్లో, పనుల్లో వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 50కి 50 డివిజన్లు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించలేదని, పీఆర్సీ, డీఏలు ఇవ్వక ఉద్యోగులు, పింఛనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి కార్యకర్త సుశిక్షితులై సైనికులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను జగన్ గుండెల్లో పెట్టుకుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారని వైఎస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్రెడ్డి అన్నారు. డిసెంబర్ 21 లోపు పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కడపలో 47 డివిజన్లలో 109 యూనిట్లకు గాను 90వేలమందితో కమిటీలు నియమించాలన్నారు. కార్యకర్తల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా నియమించిన కమిటీలు ప్రతినెల మూడో వారంలో సమావేశం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మేయర్ ముంతాజ్ బేగం, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, సొహైల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాక సురేష్, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, క్లస్టర్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, రామ్మోహన్రెడ్డి, ఐస్క్రీం రవి, నాగమల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ జమల్వలీ, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి
అట్లూరు : అయ్యప్పస్వామి భక్తుడిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపాన అయ్యప్పస్వామి ఆలయం వెనుక వైపున ఉన్న స్థల విషయమై నవంబర్ 25న అయ్యప్ప మాలధారణలో ఉన్న నరసింహారెడ్డిపై రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఆయన కుమారుడు శివ దాడి చేశారు. ఈ ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేశారని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం అట్లూరు క్రాస్రోడ్డు కడప–బద్వేలు ప్రధాన రహదారిపై సుమారు 100 మంది అయ్యప్పస్వామి భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తుడు నరసింహారెడ్డిని చంపేందుకు ప్రయత్నించినా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని, నిందితులను ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో బద్వేలు రూరల్ సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శిరీష ఆర్ఐ రమణ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, అరెస్టు కూడా చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మిద్దె పైనుంచి పడి గర్భిణి మృతివేంపల్లె : వేంపల్లెలోని పుల్లయ్యతోటకు చెందిన వల్లెపు దేవి(22)అనే గర్భిణి మిద్దైపె నుంచి కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు భర్త పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక పుల్లయ్య తోటలోని రెండవ అంతస్తులో గర్భణి వల్లెపు దేవి, పవన్ కళ్యాణ్ నివాసముంటున్నారు. ఆదివారం దేవి కుమార్తె హేమదర్శిని మూడేళ్ల చిన్నారి మిద్దైపె నుంచి కిందికి దిగుతుండగా పైకి పాపను రావాలని పిలిచే సమయంలో దేవికి కళ్లు తిరిగి పైఅంతస్తు నుంచి కింద పడింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గర్భణి అయిన దేవి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి దేవికి 10 రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా.. ఈ ప్రమాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి
● అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి ● హిందూ సమ్మేళనం విజయవంతం బ్రహ్మంగారిమఠం : సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠం మండలం నుంచి దాదాపు 3 వేల మంది హిందూ సోదరీ, సోదరులు తరలి వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విరజానందస్వామి మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. ఇప్పటికే కొంత మంది వారి విధానాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అందులో యువత ముందుకు రావడంతో వారి విధానాలకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు మంచివి కావన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఉన్న పుణ్యస్థలంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి మాట్లాడుతూ భారత దేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సంప్రదాయం ఉంటుందన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యనిర్వాకులు యుగంధర్, రాష్ట్ర సేవాసమితి మండల కార్యనిర్వాకురాలు బయన బోయిన రమాదేవి మాట్లాడారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పిల్లలు, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్షం సైతం లెక్కచేయకుండా.. హిందూ సమ్మేళనానికి ఆదివారం వర్షం సైతం లెక్కచేయకుండా మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముందుగా మఠం నాలుగు రోడ్ల కూడలి నుంచి సభా స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ, రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పాత రిమ్స్లోని బీసీ భవన్లో భవన నిర్మాణ కార్మికుల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు చట్టం 1996ను పటిష్టంగా అమలు చేసి, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు కోటి రూపాయల విరాళం వెంటనే జమ చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన మాటను మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న 46 వేల క్లెయిమ్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి డిసెంబర్లో చలో మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె మద్దిలేటి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసీ బాదుల్లా, యూనియన్ నాయకులు లింగన్న, బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక ధామం.. పరిశుద్ధ మందిరం
కలసపాడు : సగిలేరు ఒడ్డున నూతనంగా నిర్మించిన తెలుగుగంగ అక్విడిక్ట్ కాలువ పక్కన.. ఠీవీగా నిలబడి ఉన్న ఆ నిర్మాణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడి ప్రశాంతత వారిని లోనికి రమ్మని పిలుస్తుంది. లోపలికి వెళితే గుడి అందం ఔరా అనిపిస్తుంది. అపురూపమైన నిర్మాణశైలి మనసుకు హత్తుకుంటుంది. ఆధ్యాత్మికతతో మరో లోకంలోకి తీసుకెళుతుంది. ఒకసారి సందర్శిస్తే మళ్లీ రావాలనిపిస్తుంది. ఆ నిలయమే కలసపాడులోని పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం. 138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధం కలసపాడు సగిలేరు ఒడ్డున పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం అందానికి, ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. చరిత్ర తెలుసుకుంటే ఔరా అనిపిస్తుంది. ఆలయంపై మరింత భక్తిని పెంచుతుంది. 137 ఏళ్లు పూర్తయిన ఆ అందం డిసెంబర్ 2వ తేదీ నాటికి 138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధమైంది. ఆధ్యాత్మిక నిలయం, చెక్కుచెదరని అందాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది తరలివస్తారనడం అతిశయం కాదు. కలసపాడు చుట్టుపక్కల ప్రార్థనలు చేసుకునేందుకు సరైన ఆలయం లేదని భావించిన ఇంగ్లాండ్కు చెందిన రెవ.అర్ధర్ఇన్మన్ ఆధ్వర్యంలో 1884లో నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్ల నిర్మాణ పనుల అనంతరం అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దారు. 1887 డిసెంబర్ 3 నాటికి పూర్తయింది. ఈ సందర్భంగా ఏటా డిసెంబర్ 2, 3వ తేదీల్లో ప్రతిష్టా మహోత్సవాన్ని గుడి తిరునాలగా జరుపుతున్నారు. ఈ ఏడాది 138వ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలి వస్తారు. ఆకట్టుకునే ఇటుకల నిర్మాణం ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్థానికంగా దొరికే బంకమట్టితో ఇటుకలను తయారు చేశారు. వీటిని ఇసుక, సున్నం, బెల్లం, నీటికి లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కలిపి గానుగ తిప్పి తయారు చేసిన గచ్చుతో నిర్మించారు. నునుపుదనం కోసం వేసే పైపూతలో కూడా గుడ్ల మిశ్రమాన్ని ఉపయోగించారు. ఆధునీకత ఉట్టిపడేలా టేకు, తాటి చెక్కలను వినియోగించారు. కేరళ పెంకులతో పైకప్పు నిర్మించారు. తలుపులు, కిటికీలు టేకుతో తయారు చేశారు. నిర్మాణదారుల పనితనంతో చూడగానే ఆకట్టుకునేలా పటిష్టంగా తయారైంది. లక్షల్లో తరలిరానున్న భక్తులు ఏటా గుడి తిరునాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాక కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రధాన కార్యక్రమమైన భోగి పండుగకు కనీసం లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతుంటారు. 3వ తేదీన ఉదయాన్నే భక్తులు తలనీలాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చర్చిలో భారీగా కానుకలు సమర్పించుకుంటారు. రూట్ మ్యాప్ ఇది గుడి తిరునాలకు వచ్చే భక్తులు రైలులో అయితే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుంచి రావచ్చు. గిద్దలూరు నుంచి కలసపాడుకు 33 కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఉంటుంది. కడప జిల్లా కేంద్రం వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలసపాడుకు బస్సులో రావచ్చు. బస్సులో ప్రయాణికులు కడప జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా బస్సులో కలసపాడుకు ప్రయాణించవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వారు ఉదయగిరి, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా కలసపాడుకు చేరుకోవచ్చు. కర్నూలు జిల్లా నుంచి వచ్చేవారు నంద్యాల, గిద్దలూరు నుంచి కలసపాడుకు చేరుకోవచ్చు. ప్రత్యేకతలు ఆలయంలో నిర్మించిన గంటగోపురం, బాప్టీజం తొట్టి ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. చర్చిలోపల ముఖద్వారం వద్ద బాప్టీజం తొట్టి ఉంది. ఆలయంలోకి వచ్చే భక్తులు తొట్టిలోని నీటిని చల్లుకుని బాప్టీజం పొందుతారు. సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలకు బాప్టీజం ఇప్పించేందుకు భక్తులు ప్రతిష్టా మహోత్సవాలకు తరలివస్తారు. గుడి వెలుపల ఏర్పాటు చేసిన గంటను మరో ప్రత్యేకతగా పేర్కొన్నవచ్చు. గడియారం లేని రోజుల్లో సమయాన్ని తెలిపేందుకు అక్కడి గంటను మోగించేవారు. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ గంట ఆ నాటి నుంచి భక్తులను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు భక్తులు ఇబ్బందులు పడేవారు. దానిని దృష్టిలో ఉంచుకుని చర్చి కమిటీ సభ్యులు ఈ సంవత్సరం తిరునాలకు వచ్చే భక్తులకు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు నిర్మించారు. ఆకట్టుకుంటున్న పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం 138 ఏళ్ల చరిత్ర సొంతం చెక్కు చెదరని అందం 2, 3వ తేదీల్లో గుడి తిరునాల -
ఎన్ఎంఎంస్ నమూనా పరీక్షకు విశేష స్పందన
పులివెందుల : పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా నమూనా పరీక్షకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.కె.వెంకటనాథరెడ్డి మార్గదర్శకత్వంలో పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రతిభా నమూనా పరీక్షలు విద్యార్థుల నైపుణ్యాలకు కొలమానాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి హాజరై మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్పతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ బ్రోచర్ను ఆవిష్కరించి ప్రతిభా నమూనా పరీక్ష ప్రశ్నా పత్రాన్ని విడుదల చేసి పరీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి జాతీయ ఉపకార ప్రతిభా నమూనా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షకు 564 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, సీనియర్ ఉపాధ్యాయుడు గుజ్జుల కృష్ణారెడ్డి విజేతలను ప్రకటించారు. పులివెందుల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.హిమశ్రీ మొదటి బహుమతి సాధించి రూ.5 వేలు, చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.వరుణ్ తేజ్, జి.మైథిలి ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచి రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు సాధించారు. మరో 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు పొందారు. అనంతరం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి రూ.15 వేలు, లింగాల ఎంఈఓ రూ.2,500, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.అమర్నాథరెడ్డి, రూ.2,500 నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్, ఎంఈఓలు చంద్రశేఖరరావు, రామానాయుడు, విశ్వనాథరెడ్డి, రామకృష్ణయ్య, రామచంద్రారెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్రెడ్డి, రఘునాథరెడ్డి, జగన్, వెంకటరెడ్డి, చలమారెడ్డి, మదార్, సుభాష్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన కొండ్రెడ్డి(65) ద్విచక్రవాహనంలో గ్రామంలో నుంచి రోడ్డుపైకి రాగా, గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండ్రెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బాలల పండుగ.. ఉత్సాహం నిండగా!
● అలరించిన బాలోత్సవ్ ప్రదర్శనలు ● 5 వేల మంది విద్యార్థుల హాజరుకొందరు నృత్యంలో అద్భుత అభినయం ప్రదర్శించారు.. మరికొందరు చిత్రలేఖనంలో చాతుర్యం చాటుకున్నారు.. ఇంకొందరు మట్టితో వ్యవసాయ పరికరాలు తయారు చేసి ఔరా అనిపించారు.. అంతేగాక ఫ్యాన్సీ డ్రస్సులతో చూడముచ్చటగా నడుస్తూ చూపరులను కట్టిపడేశారు.. వక్తృత్వ పోటీల్లో భాషా కౌశల్యాన్ని చాటి చెప్పారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో సృజనాత్మకతకు కాదేదీ అనర్హం అని చిన్నారులు నిరూపించారు. కడప సెవెన్రోడ్స్ : కడప నగరంలో రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవం 3.0 ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. మొదటి రోజు శనివారం మరియాపురం బాలికల హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. తుపాను ప్రభావంతో వర్షం కురవడంతో ఆదివారం బాలాజీ నగర్లోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల భావ వికాసానికి కృషి చేస్తున్న బాలోత్సవం నిర్వాహకులను అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు జి.గోపాల్ మాట్లాడుతూ నేటి విద్యావిధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయట పడాలంటే బాలోత్సవాలు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయని, అందుకే బాలోత్సవాలకు విశేష ప్రాచుర్యం వస్తోందని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఈడీ బ్రహ్మయ్య, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, వైవీయూ ప్రొఫెసర్ మృత్యుంజయరావు, బుద్దిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు పిల్లా కుమారస్వామిరెడ్డి, బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాహుల్, సమత కన్వీనర్ సునీత, యూటీఎఫ్ నాయకులు మహేష్ విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొత్తం 54 విభాగాల్లో.. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు మొత్తం 8 వేదికలను ఏర్పాటు చేయగా, వ్యాసరచన, వక్తృత్వం, వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాల తరగతి గదులు, ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరినీ అలరించాయి. విద్యార్థులు లఘునాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం ఇలా 54 విభాగాల్లో ప్రదర్శించారు. అదే విధంగా పద్యం చెప్పటం, కథ చెప్పటం, మట్టితో వ్యవసాయ పరికరాలను తయారు చేయటం వంటివి ప్రదర్శించారు. -
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
రాయచోటి : 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ డిమాండ్ చేశారు. రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏలు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక పరంగా బాకీ పడిందన్నారు. బకాయిలు చెల్లించాలని ఉద్యమాలు చేసిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకులు.. తాము అధికారంలోకి వస్తే అవన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. టెట్, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. డిసెంబర్ 9,10వ తేదీలలో డివిజన్ కేంద్రంలో నిరసన ర్యాలీ, డిసెంబర్ 18న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా, 2026 జనవరి 4న భీమవరంలో రాష్ట్రస్థాయి ర్యాలీ, జనవరి 29న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, జిల్లా సహాయ అధ్యక్షుడు శివారెడ్డి, మహిళా సహాధ్యక్షురాలు హేమలత, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు పి.వెంకట సుబ్బయ్య, వై.శ్రీధర్రెడ్డి, ఎ.అక్రంభాష, భాస్కర్రెడ్డి, ఆదినారాయణ, దావుద్దీన్, పురం వెంకటరమణ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సురేంద్ర రెడ్డి, ప్రచురణల విభాగం కన్వీనర్ కె.విజయ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ శివారెడ్డి, కిఫాయత్ పాల్గొన్నారు. డిమాండ్లు : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలి. జూన్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, అలాగే రెగ్యులర్ చేయాలి. వంద రోజుల ఎస్ఏస్సీ యాక్షన్ ప్లాన్లో సెలవు దినాలు మినహాయించాలి. సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలి. పీఎస్ హెచ్ఎం, క్లస్టర్ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలి. పరీక్షల విధానంలో మార్పులు చేయాలి. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్క్యాస్మెంట్ ఇతర బకాయిలు చెల్లించాలి. -
నేత్రదానంతో ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు
చింతకొమ్మదిన్నె : మండలంలోని నరసన్నగారిపల్లి గ్రామానికి చెందిన సందడి వీర ప్రతాప్రెడ్డి నేత్రదానం ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. వీరప్రతాప్రెడ్డి మృతితో ఆయన సతీమణి రత్నకుమారి, కుమారుడు జనార్దన్రెడ్డి, కోడలు రామసాయి అఖిల, కూతురు మీనాక్షి, అల్లుడు శివశంకర్ రెడ్డి, మనవరాలు వర్ణికలు నేత్రదానానికి అంగీకరించారు. ఈ మేరకు స్నేహా సేవాసమితి అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ ప్రశాంత్, ఎల్వీ ప్రసాద్ నేత్రాలయం మేనేజర్ రెడ్డిబాబు మృతుడి స్వగృహానికి వెళ్లి మృతుడి కార్నియాలను సేకరించి ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి పంపినట్లు రాజు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయదలచుకున్న వారు ఫోన్ నంబర్లు :9966509364 లేదా 9885339306లకు సమాచారం ఇచ్చి అంధత్వంతో బాధ పడుతున్న అంధులకు చూపు ఇచ్చే బృహత్కార్యానికి ప్రతి కుటుంబం ముందుకు రావాలన్నారు. -
నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1వతేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను ’సీఎండీ’ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. ’దిత్వా’ తుఫాను వేళ ఆప్రమత్తంగా ఉండండి ’దిత్వా’ తుఫాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలిపోవడం లాంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు. -
బాబు సర్కారు నిర్లక్ష్యం.. సీమకు శాపం
కడప రూరల్: పాలకుల నిర్లక్ష్యం రాయలసీమ అభివృద్ధికి శాపంగా మారిందని.. కూటమి పాలకులు ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం చారిత్రాత్మక తప్పిదమని వక్తలు మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆర్ఎస్ఎఫ్ (రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం) ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్ అధ్యక్షతన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, ఎన్.వెంకట శివ, బీసీ సంఘం నాయకులు అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై చర్యలు చేపట్టాలన్నా రు. ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు, ప్రాజెక్టుల ఏర్పాటుతోనే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. కూటమి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ఎంతమాత్రం తగదన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం చారిత్రాత్మక తప్పిదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత మెడికల్ విద్య మిథ్యగానే మిగిలిపోతుందన్నారు. తక్షణమే ఈ విధానాన్ని టీడీపీ కూటమి పాలకులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ హామీలకే పరిమితమైందన్నారు. అలాగే కడప–బెంగుళూరు రైల్వేలైన్ మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలకులు రాయలసీమ ప్రాంత అభివృద్దిపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా రాయలసీమ హక్కులను సాధించుకుంటామన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఓబయ్య, గ్రేటర్ రాయలసీమ అభివృద్ది వేదిక కన్వీనర్ కారు ఆంజనేయులు, సృజన సామాజిక వేదిక నాయకులు శ్రీనివాసులు, మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు జేవీ రమణ, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిఽధి లెక్కల జోగిరామిరెడ్డి, ఆర్ఎస్ఎఫ్ మాజీ కన్వీనర్ మల్లెల భాస్కర్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సీఆర్వీ ప్రసాద్, షేక్ దస్తగిరి, దేవర శ్రీకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం తగదు సీమ అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
పంటల బీమాపై అవగాహన పెంచాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమాపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖాధికారులు జిల్లా రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. భారత ప్రభుత్వం 2025 డిసెంబర్ 1 నుంచి 7 వరకు 10వ పంట బీమా వారో త్సవాన్ని 2025–26 రబీ కోసం నెలరోజుల పాటు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింద న్నారు. దీని ప్రకారం, మన జిల్లాలో పంటల బీమాపై విస్తృతమైన అవగాహన నిర్వహించను న్నట్లు తెలిపారు. రబీలో 2025–26 సీజన్లో నువ్వుల పంటకు రూ.180, వేరుశనగకు రూ. 480, పెసలకు రూ.270, జొన్నలకు రూ.315, మినుములకు రూ.285, వరికి రూ.630, ప్రొద్దుతిరుగుడుకు రూ. 300, బుడ్డ శనగకి రూ.480 ఒక ఎకరానికి ప్రీమియం రైతులు చెల్లించవలసి ఉంటుందన్నారు. రైతులు వెంటనే పంటల బీమా కోసం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కడప కోటిరెడ్డిసర్కిల్: మైన్స్ సేఫ్టీ వీక్ అండ్ ప్రొడక్టివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ గనుల భద్రతా వారోత్సవాలు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ రఘుపతి పెద్దిరెడ్డి, కిషోర్కుమార్ డోకుపర్తి, ఎన్ మారుమూత్తు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కృష్ణ అయ్యర్, గ్రూప్ హెచ్ఆర్ హెడ్ రమేష్ వీపీ, హెచ్ఆర్ ఎల్.సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో నిడిజీవి లైవ్ స్టోన్ మైన్స్, ది ఇండియా సిమెంట్ లిమిటెడ్ గనుల భద్రతా విషయంలో మొదటి బహుమతి గెలుచుకుంది. లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం ముగిసిన నేపథ్యంలో భక్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.చుట్టుపక్కల వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినట్లు డాక్టర్ బాలరాజు ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది, ఆసుపత్రుల రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆసుపత్రుల అనుమతులకు ఏకగవాక్ష విధానం ఉండాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు ఐఎంఏ సహకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అందిస్తున్న ఆసుపత్రుల బకాయి లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, ప్రెసి డెంట్ ఎలక్ట్ డాక్టర్ పీఎస్ శర్మ, ప్రధానకార్యదర్శి సుభాష్ చంద్రబోస్, ఆర్ధిక కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యా సంస్థల బస్సులపై కొరడా!
కడప వైఎస్ఆర్ సర్కిల్: విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో నిత్యం స్కూలు బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో విద్యా సంస్థల బస్సులను మరోమారు తనిఖీలు చేయాలని అధికారులు ఆదేశించడంతో రవాణా శాఖ అధికారులు నవంబర్ 28 నుంచి జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు ఈ నెల 4 వరకు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులు దాదాపు 1091 ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో 90 విద్యా సంస్దల బస్సులను తనిఖీలు చేయ గా 26 బస్సులకు సరైన పరికరాలు, పత్రా లు లేకపోవడంతో వాటిని మరమ్మత్తులు చేయించుకొని తిరిగి రవాణా శాఖ అధికారుల ద్వారా తనిఖీలు చేయించుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో బద్వేలులో 9,కడపలో 30, పులివెందుల 9, ప్రొద్దుటూరు 42 బస్సులను తనిఖీ చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న విద్యా సంస్థల బస్సులు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ బస్సులో సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు. బస్సులో ఇద్దరు విద్యార్థులు కూర్చొనే సీటులో ముగ్గురు లేక నలుగురు విద్యా ర్థులను కూర్చోపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టి ఉదయం, సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేస్తే బాగుంటుదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. డిసెంబర ్4 వరకు కొనసాగనున్న తనిఖీలు ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఉంటేనే రోడ్డుపైకి బస్సు ఇప్పటికే విద్యా సంస్థల బస్సులకు నోటీసుల ద్వారా సమాచారం ఇప్పటివరకు 90 బస్సుల తనిఖీలు ప్రతి విద్యా సంస్థ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం జిల్లాలో ఉన్న ప్రతి విద్యా సంస్థ బస్సును తాము కేటాయించిన తేదీకల్లా తనిఖీలు చేయించుకోవాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి. తనిఖీలు చేయించుకోవా లని ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చాం. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. –వీర్రాజు, జిల్లా ఉప రవాణా శాఖ ఇన్చార్జ్ కమిషనర్ ప్రతి విద్యా సంస్థ బస్సుకు స్పీడు గవర్నెన్స్ ఉండాలి 2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనానికి తప్పని పరిగా ఫైర్ అలారం ఉండాలి 2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన బస్సుకు డ్రైవర్ దగ్గర ఫైర్ పరికరాలు ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఉండాలి వాహనానికి సంబంధించిన ట్యాక్స్, పర్మిట్, ఇన్స్యూరెన్స్ ఉండాలి డ్రైవర్కు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి విద్యార్థులను సీటింగ్ కెపాసిటీ ప్రకారం మాత్రమే కూర్చొబెట్టాలి -
చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో సుమారు మూడు నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మార్కెట్వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా వెండి, బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 9వ తేదీన రోజూ మాదిరే వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే కాపు కాసిన కొందరు యువకులు దుకాణంలోకి వెళ్లి.. బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్లో పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజామ్ జిల్లా ఆస్కా తాలూకా కలసందాపూర్ గ్రామానికి చెందిన దాస్ శ్రీరామ్గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్ సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేలు– నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. దాస్ శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా నిందితుడు దాస్శ్రీరామ్ అతని స్నేహితుడైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రావులబినోద్ అలియాస్ బిన్ను గతంలో పలు చోరీ కేసులలో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన తొండపోతురాజు, అతని అన్న మౌలాలితో కలిసి బద్వేలులో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ రాంభూపాల్రెడ్డి, అర్బన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు శివ, వెంకటేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. విషపు ఇంజెక్షన్ వేసుకుని యువకుడి ఆత్మహత్య చాపాడు : మండల పరిధి చిన్నగురువలూరు గ్రామంలోని దళితవాడకు చెందిన కుచ్చుపాప వినోద్ కుమార్ (26) అనే యువకుడు పాయిజన్(విషపు) ఇంజెక్షన్ వేసుకుని శనివారం తెల్లవారుజామున కడపలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాపాడు పోలీసులు, చిన్న గురువలూరు గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనస్థీషియాగా కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న వినోద్కుమార్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతోపాటు ఆరు నెలల క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సంఘటన నేపథ్యంలో మనోవేదనకు గురైన వినోద్ కుమార్ మనస్తాపం చెంది శనివారం తెల్లవారుజామున తాను పని చేసే ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్న అద్దె గదిలో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మృతుడికి తండ్రితోపాటు అక్క, తమ్ముడు ఉన్నారు. ప్రేయసి ఒత్తిడి, వివాహేతర సంబంధమే కారణమా.. వినోద్ కుమార్ గత కొన్నేళ్లుగా తన కులానికి చెందిన ఓ మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇటీవల ఈ మహిళ గర్భవతి కావడంతో వివాహం చేసుకోవాలని వినోద్ కుమార్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వినోద్ కుమార్ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురు మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై మనోవేదనతో వినోద్ కుమార్ పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ప్రయోజకుడై చేతికి అందిన కుమారుడు అనూహ్యంగా మృతి చెందడంతో తండ్రి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.రూ.8.60 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనంప్రేమ విఫలం, మనోవేదన కారణమంటున్న గ్రామస్తులు -
● దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు
● గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో అనుమతి పొందిన ప్లాను నకలు కాపీ ● స్థల ధ్రువీకరణ పత్రం నకలు (డాక్యుమెంటు), ప్లాను కాపీలు ఆటోకిడ్ సాఫ్ట్ కాపీ, పీడీఎఫ్ కాపీలు, పీనలైజేషన్ వివరాలు తెలిపే వ్యక్తిగత అంచనా సమాచారం ● ప్రస్తుతం చెల్లించిన ఇంటిపన్ను రశీదు, ఇంటి ముందు భాగము కనిపించునట్లు ఫొటో, స్లాబ్ కనిపించునట్లు తీయించిన ఫొటో, నోటరీ చేయించిన ఇండెమ్మిటీ బాండ్ (100/– రూపాయలు స్టాంపు పేపరుపై). నోటరీ చేయించిన రోడ్డు వైస్టింగ్ అండర్ టేకింగ్ (వంద రూపాయల స్టాంపు పేపరుపై, అథరైజ్డ్ స్ట్రక్చరల్ ఇంజనీరు ధ్రువీకరించిన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్, అగ్నిమాపక శాక వారు జారిచేసిన నిరభ్యంతర ధ్రువపత్రం వంటివి అవసరమవుతాయి. వివరాలకు 9154892517 నంబరును సంప్రదించవచ్చు. -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 రెండో విడత జోనల్ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండో రోజు సెంట్రల్ జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 82 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని పీవీఎస్ఆర్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 187 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్సర్తో 193 పరుగులు చేశాడు. తులసిరామ్ 59 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని యాధేష్ 2, సీహెచ్ జైవర్దన్నాథ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 117 పరుగుల ఆధిక్యత సాధించింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్–నార్త్ జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో రోజు 12 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని కేపీ శ్రీరామ్ 105, సాయి అర్జున్ 53, రియాన్స్ సాయి 44 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టులోని శ్రీచరణ్ 2, రోహిత్ 2 వికెట్లు తీశారు. అంతకు ముందు రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో నార్త్ జోన్ విన్నర్స్ జట్టు 100 పరుగులు ఆధిక్యత సాధించింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో సౌత్జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 176 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 64.1 ఓవర్లకు 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నందన్ కృష్ణ సాయి 55, యోజిత్ 44 పరుగులు చేశారు. సౌత్జోన్ విన్నర్స్ జట్టులోని రక్షన్ సాయి అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. తరుణ్కుమార్రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్జోన్ విన్నర్స్ జట్టు 62 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణవ్ గోవర్దన్ 57, త్రివిక్రమ్రెడ్డి 38 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని దీక్షిత్ 3, యోజిత్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు 1 ఓవర్కు వికెట్లు కోల్పోకుండా 13 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది.పీవీఎస్ఆర్ వర్మ, 193 పరుగులు ప్రణవ్ శ్రీరామ్, 105 పరుగులు రక్షన్ సాయి, 6 వికెట్లు -
‘నువ్వుల’ సాగుకు ఇదే అదును
● డిసెంబర్ రెండో వారం వరకు అనుకూలం ● రైతులు త్వర పడాలంటున్న శాస్త్రవేత్తలు ● సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడికడప అగ్రికల్చర్ : జిల్లాలో నువ్వు పంటల సాగుకు ఇటీవల అదును ప్రారంభమైంది. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా 4,566 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా వరకు సాగైంది. నువ్వుల పంట సాగుకు ఇప్పుడు అనుకూలమని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతన్నలు త్వరపడి సాగు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ అదునులో సాగు చేస్తే సగటున ఎకరాకు 600 కిలోల దిగుబడి ఇస్తుందని తెలిపారు. నువ్వులో నూనె 49–55 శాతం, ప్రోటీన్ 20–25 శాతం, అధిక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల వివిధ రకాల వంటకాల్లో వాడుతున్నందున మార్కెట్లో మంచి ధర ఉంటుంది. కావున రైతులు డిసెంబర్ 2వ వారం వరకు సాగు చేసుకోవచ్చని వారు సూచించారు. సాగుకు అనువైన నేలలు నీరు నిలవని తేలిక, బరువు నేలలు శ్రేష్టం. ఆమ్ల, క్షార నేలలు కాకుండా ఉండాలి. సాగుకు నేల తయారీ.. నువ్వు పంటను సాగు చేసుకునే పొలాన్ని 2–4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతో చదును చేసుకుని సాగు చేసుకోవాలి. విత్తనం, విత్తే పద్ధతి.. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాళ్లలో ఇసుక లేదా నూకలు కలిపి గొర్రెతో వరుసలలో విత్తుకోవాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్/మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసి విత్తడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 21 రోజుల వరకు నివారించవచ్చు. పంట తొలిదశలో రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కోసం ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూఎస్, 5గ్రా./కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తే సమయం.. ప్రారంభ ఖరీఫ్లో మే రెండవ పక్షం, రబీ లేదా వేసవిలో నీటిపారుదల కింద డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. నువ్వు పంటను రబీ–వేసవికాలంలో సాగు చేసినపుడు అధిక దిగుబడి వస్తుంది. నువ్వు పంటలో అధిక దిగుబడులకు అవసరమైన ఉష్ణోగ్రత, సమానంగా విస్తరించిన వర్షపాతం అవసరం. ఉష్ణోగ్రత 25 డిగ్రీల –27 డిగ్రీల మధ్యలో ఉండే పక్షంలో మొలక శాతం, తొలిదశలో పెరుగుదల, పూత బాగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తగ్గితే పెరుగుదల తగ్గుతుంది. అలాగే పూతదశలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కట్టదు. ఎరువుల వాడక విధానం ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పాస్ఫేట్, 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం మొత్తం భాస్పరం, పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువులు విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేయాలి. భాస్వరం ఎరువులు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వాడినపుడు అధికంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం పద్ధతులు విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివద్ధి, గింజకట్టే దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35–40 రోజుల నుంచి 55–60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. నువ్వు పంటకు తేలికపాటి తడులు మాత్రమే ఇవ్వాలి. పంట నీటిముంపునకు గురి అయినట్టయితే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కలుపు నివారణ, అంతర కృషి పెండిమిథాలిన్ 30 శాతం 4–5 మి.లీ./లీటరు నీటికి చొప్పున విత్తిన 48 గంటల్లోపు తడినేలపై పిచికారీ చేయాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండి మిథాలిన్ను పిచికారీ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే నీటి తడి పెట్టకూడదు లేదా ప్రీటిలాఫ్లోర్ 50 శాతం ఇ.సి. 2 మి.లీ./లీటరు నీటికి చొప్పున ఎకరాకు 400 లీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన మూడవ రోజు లోపు వెనక్కి నడుస్తూ పిచికారీ చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసి వేయాలి.లాభదాయకమైన పంట నువ్వు పంట రైతులకు లాభదాయకమైన నూనె గింజల పంటగా నిలుస్తోంది. సమయానికి విత్తనం, నాణ్యమైన రకాలు, సరైన ఎరువుల వినియోగం, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, పురుగు–రోగ నియంత్రణ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం గణనీయంగా పెంచుకోవచ్చు. ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలను సమర్థంగా అమలు చేయడం వల్ల నువ్వు పంటలో దిగుబడి విప్లవం సాధ్యమవుతుంది. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఈ సాంకేతికతలను అనుసరించి సాగు చేస్తే, పంట నాణ్యత, దిగుబడి, మార్కెట్ లాభాలు మూడు కూడా పెరుగుతాయి. – డాక్టర్ ఎన్.కృష్ణప్రియ, కో ఆర్డినేటర్, ఏరువాక కేంద్రం, కడప -
సచివాలయం ఎదుట టీడీపీ సానుభూతిపరుల ధర్నా
● డిజిటల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంపై నిరసన ● హౌసింగ్ ఎంట్రీకి చివరి తేదీ కావడంతో ఆందోళనసింహాద్రిపురం : చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల టీడీపీ సానుభూతిపరులే పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థపై అశ్రద్ధ కనబరుస్తోంది. ఫలితంగా పథకాలు అర్హులకు సక్రమంగా అందడం లేదు. ఇందుకు నిదర్శనం సింహాద్రిపురం మండల పరిధిలోని కోవరంగుంటపల్లె సచివాలయాన్ని తీసుకోవచ్చు. ఆ సచివాలయం ఎదుట శనివారం కోవరంగుంటపల్లె, బొజ్జాయిపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ధర్నా చేపట్టారు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని వారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయ సర్టిఫికెట్లకు రెండు, మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకు మంజూరు చేయలేదన్నారు. ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. ఈ సచివాలయంలో సిబ్బంది పనితీరు సరిగా లేదని, ఒకరి మీద ఒకరు చెప్పుకొంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉండి ఇళ్ల మంజూరుకు దరఖాస్తు చేసుకోవడానికి కుల, ఆదాయ సర్టిఫికెట్లను అందించడంలో సిబ్బంది విఫలం కావడంతో ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ రెండు నెలలుగా విధులకు సరిగా హాజరు కాకపోవడమే కాకుండా ప్రజలకు అందుబాటులో కూడా ఉండటం లేదన్నారు. శనివారం సచివాలయానికి వెళితే డిజిటల్ అసిస్టెంట్ విధులకు హాజరు కాలేదన్నారు. డిజిటల్ అసిస్టెంట్ అధికారికంగా సెలవులో లేకున్నా.. సెలవులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని వారు ఆరోపించారు. ఎంపీడీఓను నిలదీసిన వైనం ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కోవరంగుంటపల్లె గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆందోళనకారులు నిలదీశారు. ఇళ్ల మంజూరులో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇళ్లుఉ కోల్పోయామని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అర్హులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ మాట్లాడుతూ ఆ పత్రాలు లేకున్నా ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. -
అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య పరీక్షలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం కడప రిమ్స్ వైద్యులు పరిశీలించారు. డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాల మేరకు జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్ డాక్టర్ వెంకటచంద్రారెడ్డి, రిమ్స్ వైద్యులు అనిల్కిరణ్, శివజ్యోతి అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. అనంతరం వంట గదిని తనిఖీ చేసి, వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల హెడ్మాస్టర్ గుర్రప్పను ఆదేశించారు. ప్రతి రోజు విద్యార్థులు భోజనం చేయడానికి ముందు వండిన ఆహార పదార్థాలను టేస్ట్ చేయాలని సూచించారు. కందిపప్పును పాఠశాలలో రెండు మూడు రోజులు నిల్వ ఉంచి ఆ తర్వాత వండటానికి ఉపయోగించాలని పేర్కొన్నారు. పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్పై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్కు నివేదికను పంపుతామని వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన పప్పును పారవేసి ఆధారాలు లేకుండా చేసిన వంట ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీఈఓ షంషుద్దీన్ తహసీల్దార్ గంగయ్యను కోరారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించడానికి తహసీల్దార్ గంగయ్య, కడప డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారితో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాగా శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్ నుంచి భోజనాన్ని సరఫరా చేశారు. కొద్ది రోజులలో పాఠశాలలో నూతన వంట ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు ఎంఈఓ శోభారాణి తెలిపారు. -
తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం
కడప అర్బన్: జిల్లాకు ’దిత్వా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమైంది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేక బలగాలతో బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో మూడు ప్రత్యేక బృందాలతో పాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ టీమ్ సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బాటన్ లతో సంసిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణించేందుకు అనువుకాని మార్గాల్లో, నీట మునిగిన రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి రహదారులను మూసివేయాలని, ఇతర మార్గాల ద్వారా వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
సిద్దవటం మట్లిరాజుల రాజచిహ్నమిదే!
కడప సెవెన్రోడ్స్: సిద్ధవటంకోటను పాలించిన మట్లిరాజుల అధికార రాజచిహ్నం గజారోహణ సింహం శిల్పాన్ని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి గుర్తించారు. ఇటీవల సిద్ధవటంకోటను సందర్శించిన ఓబుల్రెడ్డి కోట ప్రవేశద్వారం ఎడమవైపున పైభాగంలో సుమారు 20 అడుగుల ఎత్తులో పశ్చిమాభిముఖంగా మట్లిరాజుల అధికారచిహ్నం రాతిపై చెక్కబడి ఉన్నట్లు వెల్లడించారు. ఏనుగుపైకి లంఘించే సింహంతోపాటు ఖడ్గం, సూర్యచంద్రులు ఈ రాజచిహ్నంలో మట్లిరాజులు పొందుపరిచారని వివరించారు. ఇప్పటిదాకా విజయనగర సామ్రాజ్యానికి చెందిన వరాహం, ఖడ్గం, సూర్య, చంద్రుల రాజచిహ్నమే మట్లిరాజుల చిహ్నంగా భావించేవారని ఆయన వివరించారు. -
ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం
పులివెందుల రూరల్ : పులివెందులలోని ఇస్లాంపురంలో నివాసముంటున్న నూర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నూర్ అనే వ్యక్తికి మాబి అనే అమ్మాయితో వివాహం జరిగింది. నాలుగేళ్లకే వారు విడిపోయారు. అప్పటి నుంచి నూర్ పులివెందులలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో పని చేస్తున్నాడు. తల్లి దగ్గరే ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి బంధువుల ఊరు గుంతకల్లు వెళ్లడం, కుటుంబం దూరం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. మద్యం మత్తులో శనివారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 7న పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాజంపేట : రాజంపేట సమీపంలోని నారమరాజుపల్లె వద్ద ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో డిసెంబర్ 7న పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, వివిధ ఉద్యోగాలలో స్థిరపడిన వారు రావాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులతో వారి అనుభవాలు, విజయాలను తెలియజేసి, ప్రేరణ నింపాలని వివరించారు. -
గుడి తిరుణాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
కలసపాడు: మండల కేంద్రమైన కలసపాడులో డిసెంబర్ 2, 3 తేదీల్లో పరిశుద్ధ పేతురు పరిపౌలు చర్చి 138వ గుడి తిరుణాల సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ వెంకటమహేష్ తెలిపారు. శనివారం ఆయన తన సిబ్బందితో కలిసి చర్చిని సందర్శించారు. గుడి తిరుణాల పూర్తయ్యే వరకు విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అదనంగా 100 కేవీ విద్యుత్ నియంత్రికను సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీనరీ చైర్మన్ రెవ.ఆనంద్కుమార్, రెవ.ఆశిస్గాబ్రియేల్, కమిటీ సభ్యులు కిశోర్, సైమన్, రత్నరాజు, ప్రసన్నకుమార్, కె.జె.ప్రవీణ్కుమార్, శ్రీనివాసులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఈఈగా చెంగల్రాయులు
కడప సిటీ: జిల్లా నీటిపారుదల శాఖ ఈఈగా చెంగల్రాయులు నియమితులయ్యారు. ఈయన అన్నమయ్య జిల్లా డీఈగా పనిచేస్తుండగా, అదనపు బాధ్యతగా ఇరిగేషన్ రెగ్యులర్ డివిజన్ ఈఈగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బా ధ్యతలను చేపట్టారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తు న్న వెంకట్రామయ్యకు టీజీపీ ఎస్ఈగా పదో న్నతి లభించగా..బాధ్యతలు స్వీకరించారు. కడప రూరల్: డిసెంబరు 1వ తేదిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్పై అవగాహనకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్ మీదుగా ర్యాలీగా వెళ్లి ఐటీఐ వద్ద మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రొద్దుటూరు రూరల్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. మండలంలోని చెన్నమరాజుపల్లెలో శనివారం నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389, బీ గ్రేడ్ రకం క్వింటా రూ.2,369 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్ష సూచనతో రైతులు వరి ధాన్యం కోతలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిత, ఏఓ వరహరి కుమార్ పాల్గొన్నారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం మూలవిరాట్ లకు స్నపన శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణమూర్తులను సుందరంగా అలంకరించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సిద్దవటం: తరగతి గదుల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఏ రకమైన పుస్తకాలు ఇష్టపడతారో అడిగి తెలుసుకొని సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వాటిని మంజూరు చేయించి వారానికి రెండు రోజులు లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కడప జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం జెడ్పీ హైస్కూల్లో శనివారం డీఈఓ మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రావతి పాఠశాలకు రావడం లేదని విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు, ఉపాధ్యాయులు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. విచారించి చర్యలు తీసుకుంటామని, ఎవరినైనా డిప్యుటేషన్ వేస్తామని ఆయన తెలిపారు. అలాగే కెమిస్ట్రీ లెక్చరర్ కూడా ఇక్కడ లేరన్నారు. 10 రోజుల్లో లెక్చరర్ను అలాట్ చేస్తామన్నారు. -
ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు : స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సమావేశం ఎందుకు ఆలస్యంగా ప్రారంభించారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చైర్పర్సన్ను ప్రశ్నించారు. తాను మధ్యాహ్నం 3 గంటలకే వచ్చానని, ఇతర కౌన్సిలర్లు వచ్చే వరకు ఉన్నందున 20 నిమిషాల తర్వాత సమావేశాన్ని ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సీసీని ఎందుకు మార్చారని చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి.. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని గట్టిగా నిలదీశారు. సీసీని మార్చే అధికారం తనకు ఉందని, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. దీంతో వైస్ చైర్మన్లు మరింత గట్టిగా వాదించారు. వైస్ చైర్మన్లకు సమాధానం చెప్పలేని మున్సిపల్ కమిషనర్ సమావేశం నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతి సమావేశంలో ఇలానే చేస్తున్నారు, సమావేశాన్ని మధ్యలో వదిలేసి ఎలా వెళతారని వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిల ర్ల మధ్య మాటల యుద్ధం జరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇంతలోనే పోలీసులు సమావేశంలోకి వచ్చి ఏకపక్షంగా వ్యవరించారు. వైస్ చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, పాతకోట మునివంశీధర్రెడ్డి తదితర కౌన్సిలర్లు పోలీసులను ప్రశ్నించారు. సమావేశంలో నుంచి అర్ధాంతరంగా మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. తర్వా త మున్సిపల్ చైర్పర్పర్సన్ సమావేశాన్ని కొనసాగించి అజెండాలోని 22 అంశాల్లో మూడు అంశాలను వాయిదా వేసి మిగిలిన అంశాలను ఆమోదించారు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. సమావేశం అనంతరం తన చాంబర్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహించాల్సిన కమిషనర్ అర్ధాంతరంగా సమావేశాన్ని వదిలేసి బయటికి ఎలా వెళతారని ప్రశ్నించారు. అధికార పార్టీకి కమిషనర్ పూర్తి అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో ఇలా జరిగితే కోర్టును, ఉన్నతాధికారులను ఆశ్రయించామని తెలిపారు. కమిషనర్ సభలో తమకు సరైన సమాధానం చెప్పడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ● అనుమతి లేని అజెండా రావడంతోనే సమావేశాన్ని బాయ్కాట్ చేశానని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 29న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అజెండా విషయమై చైర్పర్సన్ సీసీని ప్రశ్నించగా తనకు తెలిసిన సమాచారం మేరకు అజెండాను అందరికీ పంపించామని తన దృష్టికి తెచ్చారన్నారు. తనకు తెలియకుండా, తన సంతకం లేకుండా అజెండాను సభ్యులకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించానన్నారు. అర్ధంతరంగా వెళ్లిన మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం -
విశేషంగా తరలివస్తున్న కార్యకర్తలు
వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ వివక్ష పూరితమైన పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన విశేషమైన ప్రేమాభిమానంతోనే కార్యకర్తలు.. అధికారంలో లేకపోయినా పార్టీ కార్యక్రమాలకు తరలివస్తున్నారని అన్నారు. నాడు రెండేళ్లు కరోనాతో సమయం వృథా అయిందని, మిగిలిన మూడేళ్ల పరిపాలనలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే గ్రామ, వార్డు కమిటీల సభ్యుల ఆమోదం మేరకే రాబోయే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, పరిపాలన అమలు చేయనున్నట్లు తెలిపారు. -
ఎంపీహెచ్ఎస్ నుంచి పీహెచ్ఎన్గా పదోన్నతులు
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో శుక్రవారం స్ధానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎంపీహెచ్ఎస్ (ఎఫ్) నుంచి పీహెచ్ఎన్ (ఎన్టీ)గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 90 మందికి 83 మంది ప్రమోషన్లు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతుల ప్రక్రియను చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనీష, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉపకార వేతన పరీక్ష డిసెంబరు 7వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోగానీ, పాఠశాల లాగిన్, వాట్సాప్ మనమిత్రలో ఉంచామన్నారు. -
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల ఆశయాల సాధనకే రాబోయే జగనన్న ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె సమీపంలోని రాజారాణి కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ వార్డులు, మండలాల గ్రామ కమిటీల ఏర్పాటుకు సన్నాహక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా అత్యంత పటిష్టంగా బలోపేతం చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీల ఏర్పాటు తర్వాత సంబంధిత సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ఐడీ కార్డులు పార్టీ మంజూరు చేస్తుందన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలు కమిటీలలో చేరి నాయకులుగా మారడం ద్వారా.. కమిటీలలోని సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాలా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల వారిని సంబంధిత కమిటీలలోకి చేర్చి పార్టీని పటిష్టంగా మార్చాలని నాయకులను కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాలపై పూర్తిగా అధ్యయనం చేసి, పార్టీ కార్యకర్తల ఆశయ సాధన కోసం అధికారంలోకి రావడానికి.. చురుకై న కార్యకర్తలే కారణమని భావించి, పార్టీని పటిష్టంగా నిర్మించడానికి మండల, గ్రామ వార్డుల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి రావడానికి దోహదం వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి గ్రామ, మండల వార్డు కమిటీల ఏర్పాటు దోహదం చేస్తుందని తెలిపారు. కమిటీలలో విశ్వాసపాత్రులైన కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులను మాత్రమే నియమించాలని నాయకులకు తెలియజేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీగా సంతకాలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం, బద్వేలు పరిశీలకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాా కమలాపురం నియోజకవర్గ శ్రేణులు 20 వేల సంతకాలు సేకరణ చేశారని, అభినందనలు తెలిపి నమస్కరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి ఎటువంటి తారతమ్యం లేకుండా అమలు పరిచి ప్రజాభిమానం పొందినందున, ఈరోజు ఎక్కడ పర్యటించినా లక్షలాది మంది ప్రజలు పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా తరలివస్తున్నారన్నారు. అనంతరం వీరపునాయునిపల్లి, వల్లూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి చెన్నూరు, కమలాపురం మండలాలు, కమలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకర్తలకు కమిటీల నియామకంపై నాయకులు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు వీరారెడ్డి, భాస్కర్రెడ్డి, రఘునాథరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉత్తమారెడ్డి, రమణారెడ్డి, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు -
సర్పై సమరానికి సన్నద్ధం!
కడప సెవెన్రోడ్స్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముందస్తు కార్యర్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. 2002 ఎస్ఐఆర్ జాబితాలోని ఓటర్ల వెరిఫికేషన్, మ్యాపింగ్ వంటి పనులు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముందస్తు కార్యక్రమం చేపట్టడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్ ఎన్నికల అనుభవం దృష్ట్యా ఇక్కడ కూడా భారీగా ఓట్ల తొలగింపు, బోగస్ ఎంట్రీలకు పాల్పడతారనే ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై వామపక్షాలు, పౌరసంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఎస్ఐఆర్ ప్రీ యాక్టివిటీ ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. ● 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాలోని ఓటర్లను ప్రస్తుత జాబితాలో గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2002 నాటి ఎస్ఐఆర్ జాబితా ప్రకారం 12,18,550 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 10,77,584 మంది అంటే 88.43 శాతం వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఈనెల 17వ తేది నాటికి జిల్లాలో పురుష ఓటర్లు 80,55,061 మంది, మహిళా ఓటర్లు 8,42,172 మంది, ఇతరులు 218 మంది వెరసి 16,47,951 మంది ఉన్నారు. వీరిలో 2002 ఎస్ఐఆర్ జాబితాలోని 25,12,031 మంది ఓటర్లను గుర్తించారు. ఇప్పటికి జిల్లాలో 3,34,154 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రస్తుతం జిల్లాలో 1963 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 19 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్చేందుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే 11 పోలింగ్ కేంద్రాల పేరు మార్పుతోపాటు 158 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2026 స్పెషల్ సమ్మరి రివిజన్ రేషనలైజేషన్ తర్వాత జిల్లాలో మొత్తం 2121 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. హేతుబద్ధీకరణకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. విపక్షాల్లో ఆందోళన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చిన 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లేకపోయినా ఇక్కడ ఎస్ఐఆర్ అమలుకు సిద్ధపడటం పట్ల విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ముందస్తు చర్యలపై ఆందోళన భారీగా ఓట్ల తొలగింపు, బోగస్ ఎంట్రీలకే అంటున్న విపక్షాలు తక్షణమే ఎస్ఐఆర్ ఆపాలని డిమాండ్ ఎస్ఐఆర్ తక్షణమే ఆపాలి విపక్షాలకు చెందిన ఓటర్లను భారీ స్థాయిలో తొలగించే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. బోగస్ ఓట్లను అదే స్థాయిలో ఓటర్ల జాబితాలో నమోదు చేసి అడ్డదారుల్లో గెలిచేందుకు కూటమి నేతలు పాల్పడుతున్నారు. వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఎస్ఐఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఇవేమి పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్ జేబు సంస్థగా మారింది. – గాలి చంద్ర, జిల్లా కార్యదర్శి, సీపీఐ అడ్డదారుల్లో గెలిచేందుకే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అడ్డదారుల్లో గెలిచేందుకే ఎస్ఐఆర్ చేపట్టింది. బీహార్ తరహాలో రాష్ట్రంలో కూడా విపక్షాలకు చెందిన ఓటర్లను భారీగా తొలగించడం, డూప్లికేట్ పేర్లు, బోగస్ ఎంట్రీలు చేపట్టేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశంపై పలు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం విచారకరం. పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌరచట్ట రిజిస్టర్ చట్టాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. – చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి, సీపీఎం -
వైఎస్సార్ జిల్లాలోనే సిద్దవటం, ఒంటిమిట్ట కొనసాగించాలి
● రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకోవాలి ● లేదంటే ప్రజా ఉద్యమం తప్పదు ● వైఎస్సార్సీపీ నేతల వెల్లడికడప రూరల్ : చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను పార్టీలకతీతంగా ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు తెలిపాయి. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలో కలపడం దారుణమన్నారు. ఈ రెండు మండలాలకు వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కూత వేటు దూరంలో ఉందన్నారు. అలాంటి ప్రాంతాలను అన్నమయ్య జిల్లాలో కలపడం అన్యాయమన్నారు. దశాబ్దాల తరబడి స్థానిక ప్రజలు తమ పనులు, వివిధ కార్యక్రమాల కోసం కడపకు వస్తున్నారన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అన్నమయ్య జిల్లాకు వెళ్లాలంటే అన్ని విధాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్ననీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రాణ త్యాగాల కై నా సిద్ధపడి సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు వైఎస్సార్ కడప జిల్లాలోనే ఉండేలా పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ సిద్దవటం మండలం కన్వీనర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా కలిసిపోయి ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడం ఎంత మాత్రం తగదన్నారు. పూర్వం నుంచి సిద్దవటం, కడపల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. టీడీపీ పాలకులు చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాంతాలను వైయస్సార్ కడప జిల్లాలోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీకాంత్రెడ్డి, వైయస్సార్ టీయూసీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు బత్తల బతుడు, ఆ పార్టీ నాయకులు ఆలం కృష్ణ చైతన్య, కె.సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, పల్లె సుబ్బరామిరెడ్డి, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత ప్రథమ సామాజిక తత్వవేత్త పూలే
కడప కార్పొరేషన్: భారత దేశ ప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. పూలే 135వ వర్థంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఇన్చార్జి మేయర్ ముంతాజ్ బేగంలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారని, మహిళోద్ధరణకు కృషి చేశారని కొనియాడారు. తన భార్య సావిత్రీబాయి పూలేను చదివించి, బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారని, వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. పూలే ఆశయాల సాధనకు దివంగత వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యానాదయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాక సురేష్, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, మాజీ కార్పొరేటర్ జమాల్వలీ, శ్రీరంజన్రెడ్డి, సీహెచ్ వినోద్, సింధే రవి, రామచంద్రయ్య, పస్తం అంజి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
రైతు ఉత్పాదక సంస్థలను బలోపేతం చేయాలి
డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: రైతు ఉత్పాదక సంస్థ (ఎఫ్పీఓ)లను బలోపేతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డీఎంసీ సభ్యులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం అయిన రైతు ఉత్పాదక సంస్థ(ఎఫ్పీఓ)ల ఏర్పాటు, యాజమాన్యం అనే అంశంపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎంసీ) సభ్యుల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్పత్తి అనుకూలతలను గుర్తించి, అనుబంధ విభాగాలు, ఇతర వాటాదారుల మద్దతుతో ఆయా ఎఫ్పీఓలను అభివృద్ధి చేసేందుకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో సేవాదృక్పథంతో నడిచే ఎఫ్పీఓల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. మినీ మార్కెట్గా ఎదిగే అవకాశాలు ఉన్న ఎఫ్పీఓలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ శాఖ దృష్టి సారించాలన్నారు. జిల్లాలో అధిక దిగుబడిని ఇస్తున్న నాణ్యమైన అరటి, చీనీ పంటను జిల్లా ప్రధాన ఉత్పాదకంగా గుర్తించి దిగుబడి, మార్కెటింగ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సేంద్రియ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, అందుకు అనుగుణంగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, ఎల్డీఎం జనార్దనం, నాబార్డు ప్రతినిధులు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వర రెడ్డి, ఉద్యానవన శాఖ డీడీ సతీష్ కుమార్, ప్రకృతి సాగు సీపీఎం ప్రవీణ్ కుమార్, పశుసంవర్థకశాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ నూతన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈిపీసీ) సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి.. మరింత విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి తోడ్పాటునివ్వాలని సూచించారు. తొలుత కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకంపై పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్దన, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డీడీఆర్ఎఫ్ అధికారులు, డీటీఓ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని విశ్వం థియేటర్లో వున్న ఆప్లిఫియర్స్, మోటార్లు, కరెంటు వైర్లు, బ్యాటరీలు, దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఒన్టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య అన్నారు. శుక్రవారం కడప ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు తెలియజేశారు. చోరీ కేసులో నిందితులుగా కడప నగరం కోటగడ్డ వీధికి చెందిన షేక్ తబ్రిష్, బిస్మిల్లానగర్కు చెందిన షేక్ ఉమర్, వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ సద్దాం హుసేన్, చిలకలబావి వీధికి చెందిన షేక్ ముర్ఫత్ఖాన్, రవీంద్రనగర్కు చెందిన షేక్ గౌస్పీర్లు వున్నారన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కడప నగరంలోని మూతపడిన విశ్వం థియేటర్లోకి అక్రమంగా ప్రవేశించి సామగ్రిని దొంగలించారన్నారు. వీరిని గుర్రాలగడ్డ వీధి జెండాచెట్టు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రికవరీ చేసిన వస్తువులలో కరెంట్ వైర్లు కరిగించి తీయగా వచ్చిన కాపర్ వైరు, రెండు బ్యాటరీలు వాటి విలువ సుమారు రూ.70,000 వుంటుందన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప ఒన్టౌన్ సీఐ వి. చిన్నపెద్దయ్య, ఎస్ఐ ప్రతాప్రెడ్డి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ, ఎస్ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, కానిస్టేబుళ్లు బాల చంద్ర, ఎన్.చిన్న నారాయణరెడ్డి, ఎల్వీ ప్రసాద్లను డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు అభినందించారు. -
రాష్ట్ర కార్యవర్గంలో చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ సోమసుందర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభతోపాటు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి కే టీవీ ఎడిటర్గా ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ను బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ సహకారంతో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వృత్తి నైపుణ్య తరగతుల నిర్వహణకు ప్రయత్నం చేస్తానని వివరించారు. తన నియామకానికి సహకరించిన పూర్వ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం మంజూరుకలసపాడు : మనిషి బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన పంచాయతీ అధికారుల నిర్వాకం బయట పడింది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం దూలంవారిపల్లె గ్రామానికి చెందిన పొన్నం ఆదిలక్ష్మికి ముద్దనూరుకు చెందిన పొన్నం మారుతీరావుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మారుతీరావు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన మారుతిరావు ఆదిలక్ష్మిని తరచూ వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక 15 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. ఆదిలక్ష్మి తండ్రి అయిన మీసాల అంకయ్యకు ఈ నెల 27వ తేదీన రిజిస్టర్ పోస్టులో ఒక కవర్ వచ్చింది. కవర్ తెరిచి చూడగా ఆదిలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రంను ఆమె భర్త మారుతిరావు పంపారు. ఈ నెల 12వ తేదీన ఆదిలక్ష్మి మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రంలో పొందుపరిచారు. అధికారులు విచారణ చేపట్టి మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాల్సి ఉంది. కానీ కాసులకు కక్కుర్తి పడ్డారో ఏమన్నా పైస్థాయి సిఫార్సులకు భయపడ్డారో తెలియదు గానీ సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా.. బతికి ఉన్న మనిషికి మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. ఈ విషయంపై ఆదిలక్ష్మి కలసపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్రెడ్డి -
మళ్లీ వైఎస్ జగన్ను సీఎంగా చేద్దాం
కమలాపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో హుందాగా పరిపాలన చేశారని, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడిపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. హామీల అమలులో వైఫల్యం చెంది ప్రజల చీదరింపులకు గురయ్యారన్నారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు. ఇందులో క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తల అందరి సహకారం ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని తనదిగా భావించి కష్టపడుతున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. మన అందరి లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడం, ప్రజలకు విశేషమైన సంక్షేమ పథకాలు అందించడం అన్నారు. -
ప్రారంభమైన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 రెండో విడత జోనల్ మ్యాచ్లు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజు కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సౌత్జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 48.2 ఓవర్లకు 123 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రణవ్ గోవర్దన్ 48, కేవీఎస్ మణిదీప్ 14 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టులోని పి.దీక్షిత్ 3, సాత్విక్ 3, యోజిత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు 41 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రజ్ఞాన్ పండిత్ 39, విఘ్నేష్ 34 పరుగులు చేశారు. సౌత్జోన్ విన్నర్స్ జట్టులోని రక్షన్ సాయి 2, తరుణ్కుమార్రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు 53 పరుగుల అధిక్యంలో ఉంది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో .. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్ విన్నర్స్, రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు 79.3 ఓవర్లకు 235 పరుగులకు ఆలౌట్ అయింది. యాసిన్ సిద్దిఖ్ 91, రితిష్ 49 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 4, సర్దార్ సమీర్ 2, తులసి రామ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 8 ఓవర్లకు 19 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్, రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 80.1 ఓవర్లకు 206 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి కృష్ణ చైతన్య 41, యశ్వంత్ సూర్యతేజ్ 37 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని చాణ్యి పాయి 3, షణ్మఖ గణేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 9 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.యాసిన్ సిద్దిఖ్, సెంట్రల్ జోన్ విన్నర్స్ (91 పరుగులు) యూనైస్, రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ (4 వికెట్లు) -
రేపు పీఎస్ హెచ్ఎంల సమావేశం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండు వద్ద గల సీఐటీయూ కార్యాలయంలో వైఎస్సార్ జిల్లాలోని పీఎస్ హెచ్ఎంల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్, కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. ఈ సమావేశంలో పీఎస్ హెచ్ఎంల సమస్యలపై చర్చిస్తామని, అనంతరం ఫోరం జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు. బి.మఠం నాలుగు రోడ్ల కూడలి నుంచి భారీగా నరసన్నపల్లె బీసీ కాలనీ సమీపంలోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సమితి సభ్యుల ప్రసంగాలు ఉంటాయి. స్థానిక ఆర్యవైశ్య అమ్మవారిశాల అధ్యక్షుడు అయ్యపు సురేష్ విరాళాల సేకరణ బాధ్యత తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా హిందువులు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కడప కోటిరెడ్డిసర్కిల్: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామేశ్వరం–ఓఖా రైలును ఉన్నతాధికారులు రద్దు చేశారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి వద్ద గాలుల తీవ్రత అధికంగా ఉందని, అందుకోసం ఈనెల 29వ తేదీన బయలుదేరాల్సిన రామేశ్వరం–ఓకా ఎక్స్ప్రెస్ను, డిసెంబరు 4న ఓకా–రామేశ్వరం రైలును రద్దు చేశారని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని మరో రెండు నెలల పాటు పొడిగించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 01, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రస్తుతం నవంబర్, 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగిన వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని ఆమె తెలిపారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని విద్యా సంస్థల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయ ఆవరణంలో ఎంవీఐ విజయ్ భాస్కర్, ఏఎంవీఐ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విద్యా సంస్థల బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా భద్రతా పరమైన అంశాలైన అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్లు వాటి పనితీరును పరిశీలించారు. లోటుపాట్లను గమనించి సూచనలను అందించారు. ఎర్రగుంట్ల: ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరూ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకూడదని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని తిప్పలూరు గ్రామంలో డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కాచ్చి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. దోమలు కుట్టకుండా దోమతేరలు వాడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ వెంకటరెడ్డి ఖాజమొహిద్దీన్ , డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. -
● సేవలకు విఘాతం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అనేక రకాల సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తే సేవలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా పౌష్టికాహార పంపిణీ, ప్రీ స్కూలు విద్య, ఆరోగ్య విద్య, రెఫరల్ సేవలు ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. అయితే వీటిని విలీనం చేస్తే ఆయా సేవలను అందే పరిస్థితి ఉండదు. ప్రాథమిక పాఠశాలలో కలిపి వేయడం ద్వారా క్షేత్రస్థాయిలో సెంటర్లు తగ్గిపోతాయి. దీని ద్వారా ఉపాధి, ఉద్యోగాలు సైతం కుదింపు జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లను సైతం కుదించే అవకాశం ఉంటుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మెయిన్ కేంద్రాల్లో ఒక వర్కర్, ఒక హెల్పర్ ఉంటే, మినీ సెంటర్లలో ఒక్కరే ఉంటారు. సీకే దిన్నె మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో సర్వే కొనసాగుతోంది. -
పోలేరమ్మ ఆలయ హుండీలో కానుకలు మాయం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి అనుసంధానంగా ఉన్న కనుమ పోలేరమ్మ దేవస్థానం హుండీలో కానుకలు మాయమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే.. ఈ విషయం వెల్లడవుతోంది. శుక్రవారం హుండీ కానుకలను లెక్కించడానికి మఠం మేనేజర్ ఆదేశాల మేరకు మఠం సిబ్బంది సీల్ వేసిన తాళానికి ఉన్న గుడ్డను తొలగించగా.. అప్పటికే తాళం తెరుచుకుని ఉంది. పైకి మాత్రం సీల్ వేసినట్లు ఉంది. భక్తులు సమర్పించుకున్న కానుకలు తరిగిపోయినట్లు ఈ విధానాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడైనా కొంత నగదు మాత్రం కనిపించింది. గతంలో అయితే హుండీలో ఎలాంటి కానుకలు లేవు. అప్పట్లో మఠం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్యలు లేవు. దీనిని అదునుగా చూసుకొని తాళం తీసి దోచుకుంటున్నట్లు అర్థమవుతోంది. మూడు నెలలకు ఒక సారి హుండీ ఆదాయం లెక్కిస్తారు. ప్రస్తుతం రూ.52 వేలు మాత్రమే ఉన్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జయంత్యుత్సవాలు, దసరా, కార్తీక మాసం తదితర కార్యక్రమాలు జరిగినా.. అతి తక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మఠాధిపతి లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం పతంగే ఫంక్షన్ హల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో.. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన పాముల బ్రహ్మానందరెడ్డిని స్టేజి పైకి పిలవకపోవడంతో ఆయన నాయకులపై అగ్రహించారు. తాను 3 సార్లు జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా బ్రహ్మానందరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నువ్వెంత నువ్వెంత అంటూ వాగ్వాదం చేసుకున్నారు. చివరికి పోలీస్లు వచ్చి బందోబస్తు నిర్వహించారు. బ్యాంక్లో చోరీకి యత్నంసంబేపల్లె : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చోరీకి చేసిన ప్రయత్నం విఫలమైంది. బ్యాంక్ వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి బ్యాంక్ ముందు భాగంలో ఇనుప రైలింగ్ గేటుకు వున్న తాళం వేసిన గొళ్లెం (పాలం)ను విరగ్గొట్టాడు. అయితే బ్యాంక్కు రెండవ డోర్గా సెటర్ ఉండటంతో లోపలికి వెళ్లలేక పోయాడు. చివరికి చోరీ ప్రయత్నం విఫలమైంది. ఉన్నతాధికారులకు విషయం తెలియజేశామని బ్యాంక్ అధికారులు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణ శివార్లలో మైదుకూరు–వనిపెంట రహదారిపై గురువారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మునగల వెంకటరమణ (63) అనే వృద్ధుడు మృతి చెందాడు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ పూసల దండలు, గిల్ట్ ఆభరణాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సైకిల్పై కాలనీ నుంచి వెళుతుండగా వనిపెంట రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య రమణమ్మ, కుమారుడు జమాల్ ఉన్నారు. అర్బన్ సీఐ రమణారెడ్డి ఆదేశంతో హెడ్ కానిస్టేబుల్ బాదుషా సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీజు దోపిడీ!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి ఫీజు వసూళ్లలో కొన్ని ప్రైవే టు, కార్పొరేట్ స్కూళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. నిబంధనల మేరకు పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 125లుగా నిర్ణయించారు. ఇది ఎక్కడ అమలు జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణయించిన పరీక్ష ఫీజు కంటే అదనంగా రూ.500 నుంచి రూ.1000 వరకు విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ● వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ పాఠ శాలల్లో మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లోనూ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా అదనంగా పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో దోచేస్తున్నారు. అదనపు వసూళ్లపై చర్యలేవీ? తాము నిర్ణీత పరీక్ష ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నా అదనపు ఖర్చులు ఉంటాయని ఆయా స్కూళ్ల హెచ్ఎంలు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్ల్లిదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది పేరెంట్స్, విద్యార్థి సంఘాలు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చూస్తాం...చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశించిన ఫీజుకంటే అదనంగా వసూళ్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలంటున్న విద్యార్థి సంఘాలు -
వేగవంతంగా ఎస్ఐఆర్–2025
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ (ఎస్ఐఆర్– 2025) కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నా యని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం ఆయా అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో జిల్లా వివరాలు తెలియజేశారు. జిల్లాలోని 16,48,315 మంది ఓటర్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 3,34,154 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశామని పేర్కొన్నారు. బీఎల్ఓ ఐడీ కార్డుల ప్రింటింగ్, పంపిణీకి సంబంధించి జిల్లాలో మొత్తం 1963 బీఎల్ఓల వివరాలను ఇప్పటికే అప్డేట్ చేశామన్నారు. ప్రొద్దుటూరు ఈఆర్ఓ మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను పంపించా మని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1963 పోలింగ్ స్టేషన్లు ఉండగా రేషనలైజేషన్ తర్వాత 2121 పోలింగ్ కేంద్రాల పెంపుదలకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ప్రాధాన్యత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి వరి ధాన్యం కొనుగోలు, మహిళలపై నేర నియంత్రణ, గంజాయి, మత్తు పదార్థాల నివారణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. జేసీ అదితిసింగ్ -
ధర్మాసుపత్రిలో కమీషన్ల దందా!
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్సుల దందా, దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది కక్కుర్తి మూలంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రెండు ప్రభుత్వ అంబులెన్సులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరిన రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి అంబులెన్సుల ద్వారా కడప రిమ్స్ లేదా కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు తీసుకెళ్తారు. అయితే అందుకయ్యే డీజిల్ ఖర్చును పేషెంట్లే భరించాల్సి ఉంటుంది. ప్రైవేట్ అంబులెన్సుల్లో కర్నూలుకు రూ. 7–8 వేలు, తిరుపతికి రూ. 8500, కడపకు అయితే రూ. 3500 వసూలు చేస్తారు. కేవలం డీజిల్కు అయ్యే ఖర్చే కాబట్టి ప్రైవేట్ వాహనాలకు ఇచ్చే బాడుగలో సగం ఖర్చుతో కడప, తిరుపతి, కర్నూలుకు ప్రభుత్వ అంబులెన్సుల్లో రోగులను తీసుకెళ్తున్నారు. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు జిల్లా ఆస్పత్రిలోని అంబులెన్సులను ఉపయోగించుకుంటున్నారు. ఇవి పెద్ద వాహనాలు కావడంతో పేషెంట్తో పాటు ఇందులో 5–6 మంది కుటుంబ సభ్యులు వెళ్లవచ్చు. సిబ్బంది కమీషన్ల కక్కుర్తి.. జిల్లా ఆస్పత్రిలో పని చేసే కొందరు సిబ్బంది కమీషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్సులకు సహకరిస్తున్నారు. యాక్సిడెంట్ కేసులు, లేదా అడ్మిషన్లో ఉన్న రోగులను అత్యవసరంగా రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు వీరు ప్రైవేట్ అంబులెన్స్లకు సమాచారం ఇస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రభుత్వ అంబులెన్స్లు ఉన్న సమయంలో ఆయా డ్రైవర్లకు సమాచారం అందించాలి. ఒక వేళ డ్రైవర్లు అందుబాటులో లేకుంటే ఫోన్లు చేసి వారిని పిలిపించాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ప్రభుత్వ అంబులెన్స్లు ఉన్నా ప్రైవేట్ అంబులెన్స్లకు ఫోన్లు చేసి కొందరు సిబ్బంది పిలిపిస్తున్నారు. వాళ్లిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి పేదల జేబులను గుల్ల చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు వచ్చినప్పుడు కూడా కడప రిమ్స్ లేదా కర్నూలుకు రెఫర్ చేయకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సలహా ఇస్తూ ఆయా ఆస్పత్రుల అంబులెన్స్లను జిల్లా ఆస్పత్రికి పిలిపిస్తున్నారు. తద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కూడా కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఆస్పత్రి అధికారులు ఇప్పటికై నా ప్రైవేట్ దందాపై నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు.ప్రైవేట్ అంబులెన్సుల్లో రోగుల తరలింపు -
ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : డాక్టర్ లేకుండానే తన భార్యకు డెలివరీ చేశారని ఆరోపిస్తూ అమృతానగర్కు చెందిన మనోహర్ కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ వద్ద గురువారం రాత్రి ఆందోళన చేశారు. మనోహర్ భార్య సుమలతకు నొప్పలు రావడంతో ఈ నెల 22న హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు సుఖ ప్రసవం జరిగి మగ బిడ్డను జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత చలనం లేకపోవడంతో వెంటనే చిన్న పిల్లల వైద్యుడి వద్దకు వెళ్లారు. అయితే శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో వెంటనే కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం శిశువు మృతి చెందాడు. తన భార్య ప్రసవ సమయంలో వైద్యురాలు రాలేదని నర్సులే కాన్పు చేశారని మనోహర్ ఆరోపించాడు. ఈ కారణం వల్లనే శిశువు ఏడ్వలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాడు. ఈ విషయమై డాక్టర్ సమిత మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లికి ఏదైనా జరిగితే అది గైనకాలజిస్టు బాధ్యత అని అన్నారు. కాన్పు సమయంలో అన్ని విధివిధానాలు పాటించామని ఇందులో తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ప్రసవం తర్వాత శిశువు ఏడ్వలేదనే కారణంతో చిన్న పిల్లల వైద్యుడి వద్దకు పంపించామన్నారు. -
రైలు ఢీకొని 28 గొర్రెలు మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో రైల్వే పట్టాలను దాటుతూ 28 గొర్రెలు రైలు ఢీకొని మృతి చెందాయి. కమలాపురం వైపు నుంచి కడప వైపు గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో తాడిగొట్ల గ్రామానికి చెందిన కె.సురేంద్ర అనే రైతుకు చెందిన దాదాపు 28 గొర్రెలు మృతి చెందాయి. కుక్కల దాడిలో.. వేంపల్లె : చక్రాయపేట మండలం ఎరగ్రుడి తండాకు చెందిన ఈదేశే గాంగే నాయక్ అనే వ్యక్తికి చెందిన ఆరు గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. మంగళవారం రాత్రి యధావిధిగా బాధితుడు గొర్రెల పిల్లలను గొర్రెల దొడ్డిలోకి వేశాడు. ఆ తర్వాత అర్థరాత్రి తర్వాత కుక్కలు దాడి చేశాయి. అందులో ఆరు గొర్రెల పిల్లలు గాయపడి చనిపోయాయి. గతంలో కూడా చాలాసార్లు దాడులు జరిగి గొర్రెలు మృతి చెంది నష్టపోయామని బాధితుడు వాపోతున్నాడు. అధికారులు స్పందించి కుక్కల దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. -
కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు రాబోవు రోజుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక బయనపల్లె సమీపంలోని బొజ్జిరెడ్డి ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీ, బద్వేలు రూరల్, గోపవరం, అట్లూరు మండలాల గ్రామ కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టంగా సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యులకు క్యూ ఆర్ కోడ్తో కూడిన ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్డుల ద్వారా భవిష్యత్తులో సభ్యులకు అన్నివిధాలా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల నియామకంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్రభాస్కర్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో గ్రామ కమిటీలు కీలకమనే విషయాన్ని ప్రతి నాయకుడు గుర్తించి కమిటీ సభ్యులను ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. నిబద్ధత, విశ్వాసంతో పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2029 ఎన్నికల వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లెక్క చేయకుండా ప్రతి కార్యకర్త చావో రేవో అనే విధంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బద్వేలు నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. యువతకు పెద్దపీట వేయాలి గ్రామ కమిటీల నిర్మాణంలో యువతకు పెద్దపీట వేసేలా నాయకులు కృషి చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి కోరారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై యువతలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో చురుకుగా పనిచేసే యువ కార్యకర్తలను ఎంపిక చేయడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రవిచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాఽథ్రెడ్డి -
ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు
విజేతలకు సర్టిఫికెట్లను అందజేస్తున్న డీఎస్డీఓ గౌస్ బాషా, కోచ్లుపరుగు పందెంలో విభిన్న ప్రతిభావంతులుకడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో 66వ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల)దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. డీఎస్డీఓ గౌస్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు దాదాపు 100 మంది విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. వీరికి బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు డిసెంబర్ 1, 2 తేదీల్లో గుంటూరులోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి విభిన్న టీజీ అండ్ సీనియర్ సిటిజన్ సంక్షేమాధికారి ఆర్వీ కృష్ణ కిషోర్, పారా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి దామోదర్రెడ్డి, ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ సూర్యప్రకాశ్ బహుమతులను అందజేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న బ్యాడ్మింటన్ జట్టు.. ఎం.మనోహర్ రాజ్, డి.తిరుమల్లేష్, కె.మల్లికార్జున, సాయిచరణ్, ప్రణీత్ రెడ్డి, పి.చెన్నకేశవ, బి.దివ్య ప్రసాద్, కె.సుబ్బరాయుడు, వై.వెంకట సుభాష్, పి.ఓబులేసు, ఎస్.షాకీర్ హుస్సేన్ -
తారుప్లాంటు ధ్వంసం
ముద్దనూరు : ముద్దనూరు–పులివెందుల రహదారిలో పెద్ద దుద్యాల గ్రామ సమీపంలో వున్న తారుప్లాంటు (హట్మిక్స్ ప్లాంట్)ను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ధ్వంసం చేశారు. తారు ప్లాంటులో వున్న సీసీ కెమరాలు, క్యాబిన్తో పాటు తారుప్లాంటుకు చెందిన ఇతర సామగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి పొద్దుపోయాక ప్లాంటులోని కొంత సామగ్రికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు రూ.70 లక్షల మేర నష్టం జరిగిందని ప్లాంటు యాజమాన్యం తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్లాంటు సూపర్వైజర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి పులివెందుల రూరల్ : ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక సబ్ జైలు, లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని రిజిస్టర్లను పరిశీలించి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను వివరించారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పులివెందుల సబ్జైలు సూపరింటెండెంట్, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు. -
రాయలసీమలో తగ్గిన నేరాల సంఖ్య
జమ్మలమడుగు రూరల్ : రాయలసీమలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాయలసీమ జైళ్లశాఖ డీఐజీ ఎంఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని సబ్జైలును ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గొడవల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఎస్పీ ఎం. గురుశేఖర్రెడ్డి, జైలర్ అమీర్ బాషా, జైలు సూపరింటెండెంట్ హర్షవర్దన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : కుటుంబ కలహాలతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. చంద్రాకాలనీలో కాపురం ఉంటున్న రూబియా(25) కుటుంబ సభ్యులతో గొడవపడి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. -
దేశాన్ని ఏకతాటిపై నడిపిన ఘనత రాజ్యాంగానిదే
కడప అర్బన్ : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒక తాటిపై నడిపే రాజ్యాంగం మనదని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం అనేది కేవలం గ్రంథం కాదని 125 కోట్ల భారతీయుల ఆత్మ అన్నారు. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం, మార్గమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఆర్.ఐ శ్రీశైల రెడ్డి, డీపీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.వి రమణ, సూపరింటెండెంట్ శ్రీనివాస నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
1,20, 932 కుటుంబాలను సందర్శించాం
కడప అగ్రికల్చర్ : రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బుధవారం వరకు గ్రామస్థాయి బృందాలు 1, 20,932 కుటుంబాలను సందర్శించాయని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కమలాపురం మండలం నల్లలింగాయపల్లె రైతు భరోసా కేంద్రంలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు మాతృ వియోగం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి చింతకుంట రత్నమ్మ(83) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గురువారం ఉదయం స్వగ్రామంలో చింతకుంట రత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోట్లదుర్తికి వచ్చి ఎంపీ రమేష్ నాయుడును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని అత్తవారి ఇంటికి వచ్చి రమణయ్య (22) అనే వ్యక్తి కనిపించకపోవడంతో అతని భార్య మునేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. వీరపునాయునిపల్లి మండలం సర్వారాజుపేటకు చెందిన రమణయ్య గొర్రెల కాపరిగా వృత్తి చేస్తున్నాడు. ఇతనికి ఎర్రగుంట్లకు చెందిన మునేశ్వరితో వివాహమైంది. ఈ నెల 22వ తేదీన అత్తవారింటికి ఎర్రగుంట్లకు వచ్చాడు. బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య మునేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కుక్క అడ్డువచ్చి.. వ్యక్తికి తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనానికి కుక్క అడ్డువచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. రాయచోటి రెడ్డీస్ కాలనీకి చెందిన వెంకటరమణ కుమారుడు రెడ్డిశేఖర్(22) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఇంటికి వచ్చేందుకు బెంగళూరు నుంచి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని మదనపల్లె మండలం చీకలబైలు వద్ద అకస్మాత్తుగా ద్విచక్రవాహనానికి అడ్డుగా కుక్క రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థల ఆక్రమణపై ఫిర్యాదు కలికిరి : కలికిరిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని కళాశాల అధికారులు బుధవారం తహసీల్దారు హరికుమార్కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు కేటాయించిన సర్వే నంబరుః589/1లోని 6 ఎకరాల విస్తీర్ణం కలికిరికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడానికి ప్రయత్నించగా అడ్డుకున్నామని వారు తెలిపారు. స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు. -
నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి
కడప కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు నిలయంగా చంద్రబాబు సర్కార్ ఉందన్నారు. ఎమ్మెల్యేలు కూడా కడప నుంచి శ్రీకాకుళం దాకా అందిన కాడికి దోచుకుంటున్నారన్నారు. ఎవరో చేసిన వాటిని తాను చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అధికారం మారితే మొదటి వేటు విశాఖ కార్మికులపైనే పడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, నేడు అదే జరుగుతోందన్నారు. 42 శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై ప్రైవేటు పరం చేస్తున్నా ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. 100 మంది ప్రాణత్యాగం, వేలమంది పోరాటం వల్ల తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంటులో గతంలో 3.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండేదని, ప్రస్తుతం 7.4 లక్షల టన్నుల ఉత్పత్తిని కార్మికులు పెంచారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 11500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అప్పులు తీర్చడానికే సరిపోయిందని, ఉత్పత్తి పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక పక్షపాతిగా కార్మికుల వేతనాలను రూ.18వేలకు, ఆ తర్వాత రూ.22వేలకు పెంచారని గుర్తు చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తీసేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు. ఈ నల్ల చట్టాల వల్ల ఉద్యోగ భద్రత ఉండదని, సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాలతో వైఎస్సార్టీయూసీ కలిసి పోరాడుతుందన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్, జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్రెడ్డి -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్–సెంట్రల్జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 96 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన సెంట్రల్జోన్ జట్టు 51.5 ఓవర్లకు 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. తమ్మన్ సాయి 52 పరుగులు, ప్రదీప్ 23 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టులోని ముని 3 వికెట్లు, హేమంత్ 2 వికెట్లు, రోహిత్ 2 వికెట్లు, యశ్వంత్ పూర్యతేజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టు 62 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ జట్టులోని కిన్ను కిషల్ 77 పరుగులు, సాయి కృష్ణ చైతన్య 53 పరుగులు చేశారు. సెంట్రల్ జోన్ జట్టులోని యాసిన్ సిద్దిఖీ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రామ్ కిరణ్ విన్నీ 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో .. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ విన్నర్స్– సౌత్జోన్ విన్నర్స్ జట్లు జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌత్జోన్ విన్నర్స్ 78.4 ఓవర్లకు 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మహ్మద్ ఇజార్ 50 పరుగులు, రక్షన్ సాయి 50 పరుగులు చేశారు. నార్త్జోన్ విన్నర్స్ జట్టులోని షణ్మఖ గణేష్ 3 వికెట్లు, లోహిత్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన నార్త్ జోన్ విన్నర్స్ జట్టు 9 ఓవర్లకు 29 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో నార్త్ జోన్ విన్నర్స్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ నార్త్జోన్–రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 66 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 90 ఓవర్లకు 337 పరుగులకు డిక్లేర్డ్ చేసింది, ఆ జట్టులోని పీవీఎస్ఆర్ వర్మ అద్భుతంగా చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 160 బంతులకు 110 పరుగులు చేశాడు. మక్కే లిఖిత్ 71 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని నంద కృష్ణ సాయి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 18 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధన్విన్ 67 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జట్టులోని ధోని 2 వికెట్లు, లోకేష్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. -
కమిషనర్ అండతో అక్రమాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సేవా కార్యక్రమాల పేరు చెప్పి నగరపాలక సంస్థకు 48 లక్షల 62 వేల 614 రూపాయలు ఎగ్గొట్టి వ్యాపార సముదాయాల నిర్మాణానికి పూనుకున్న యాదాళ్ల పిచ్చయ్య శెట్టి చారిటీస్పై ఫిర్యాదు చేసి, అడ్డుకొని ఆదాయాన్ని కాపాడాల్సిన కార్పొరేటర్లు టెండర్లలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టి, అనుమతి లేని నిర్మాణాలకు శ్రీకారం చుడితే టీడీపీ కార్పొరేటర్ బాలకృష్ణారెడ్డి వేలంలో పాల్గొని స్థలాన్ని దక్కించుకొని కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టడం దారుణమన్నారు. అనుమతులు లేని నిర్మాణాలు చేపడుతున్నారని కడప నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి సీపీఐ తీసుకెళ్లగా కమిషనర్ మనోజ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రమేయంతోనే జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, నగర సహాయ కార్యదర్శి జి.మద్దిలేటి, నాగేశ్వరరావు, పి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు చేసిన ఘనత వైఎస్ జగన్దే – వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్ కమలాపురం: రైతులకు మేలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిదేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్ అన్నారు. కమలాపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అరటి పంటలను పరిశీలించడంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. అరటి రైతుల మేలు కోసమే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పులివెందులలో 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సమగ్ర అరటి కోల్డ్ స్టోరేజ్ నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆ కోల్డ్ స్టోరేజ్ని నడపలేకపోతే, దానికి జగన్ది బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ను విమర్శించే ముందు ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ విజేతలు అనంతపురం, కృష్ణా
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి అండర్ 14 బాల,బాలికల బాస్కెట్ బాల్ పోటీల్లో బాలుర విభాగంలో అ నంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. బాలికల జట్టులో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించింది. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలు బుధవా రం ముగిశాయి. బాలుర విభాగంలో ఫైనల్స్లో అనంతపురం, తూర్పు గోదావరి జట్లు పోటీపడగా అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించింది. చిత్తూరు జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్లో పోటీపడగా కృష్ణా జట్టు 29–15 పాయింట్లతో మొద టి స్థానం దక్కించుకుంది. తృతీయ స్థానంలో చిత్తూ రు జట్టు నిలిచింది. విజయం సాధించిన జట్లకు ఉమ్మ డి చిత్తూరు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్బాబు, పీడీలు రమేష్, మొయినుద్దీన్, ఆసిఫ్, రియాజ్, రాజేశ్వరి, లత, భారతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అండర్ –14 బాలుర జట్టు: యోగేశ్వర్, నిఖిల్, సత్య( అనంతపురం), జశ్వంత్కుమార్, చరణ్(తూర్పు గోదావరి), దీపేష్, పుష్కర్( చిత్తూరు), డేనియల్ నాష్, రోహిత్(కృష్ణా) వేదాంతరెడ్డి(పశ్చిమ గోదావరి), నీల్జుబేను( (వైజాగ్), ధర్మేందర్(నెల్లూరు), మోక్షిత్( కర్నూలు), స్టాండ్బైలుగా పావన వెంకటదుర్గేష్( పశ్చిమ గోదావరి),షణ్ముఖ,(అనంతపురం), సింహాద్రి( తూర్పు గోదావరి), షణ్మఖ( గుంటూరు), మున్నా (కృష్ణా), భరత్ (చిత్తూరు) ఎంపికయ్యారు. అండర్–14 రాష్ట్ర స్థాయి బాలికల జట్టు: కావ్య,జెస్సీ(కృష్ణా), లాస్య, దివ్యశ్రీ (తూర్పు గోదావరి), నీలిషా, హరిత (చిత్తూరు), సాత్విక, సంజన (పశ్చిమ గోదావరి), కావ్య (గుంటూరు), హర్షిత( (కర్నూలు), నవ్య (వైజాగ్), లిఖిత( నెల్లూరు), స్టాండ్బైలుగా సిద్ర(అనంతపురం), రత్నదీపిక( తూర్పుగోదావరి),నీలిమ (కృష్ణా), కీర్తన శ్రీ (కర్నూలు), అక్షయ (గుంటూరు), లోహిత (వైజాగ్) ఎంపికయ్యారు. -
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దేశంలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు, మంచి పాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మంచి నాయకత్వం అవసరమని ఏఐసీసీ కో– ఆర్డినేటర్, కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించే విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు జిల్లాలో పది రోజులపాటు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురా లు విజయ జ్యోతి, కమిటీ సభ్యుడు, ఆర్.టి.ఐ లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పీర్, ధ్రువ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ఖాన్, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కదిలిన గ్రీన్ఫీల్డ్ హైవే!
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతంలోపచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం కల్పించే కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ నేషన్ హైవే నిర్మాణానికి కదిలిక ప్రారంభమైంది. ఈమేరకు బుధవారం రాజంపేట–రాయచోటి రహదారిలోని కూచివారిపల్లె వద్ద నిర్మాణసంస్ధ పనులకు శ్రీకారం చుట్టింది. నిర్వాహకులు భూమి పూజ చేశారు. ఈ హైవే నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ఉన్న పెద్దపల్లి, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వద్ద టోల్ప్లాజా నిర్మించనున్నారు. సోలాపూర్–కర్నూలు–చైన్నె జాతీయరహదారి(716)లో ఆంధ్రప్రదేశ్లో 329 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఇందులో కడప –రేణిగుంట వరకు 122 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసలుగా విస్తరించేలా ప్రాజెక్టు మంజూరైంది. అటవీశాఖ , పర్యావరణ అనుమతులు గత డిసెంబరులో వచ్చాయి. వైల్డ్లైఫ్(వన్యప్రాణి సంరక్షణ విభాగం) అనమతులు ఇస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. 82 కి.మీ గ్రీన్ఫీల్డ్.. కడప–రేణిగుంట నేషనల్హైవేలో 82 కిలోమీటర్ల దూరం గ్రీన్ఫీల్డ్రోడ్గా పరిగణనలోకి తీసుకున్నారు. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల పరిధిలో 122 కిలోమీటర్ల హైవే కొనసాగుతుంది. కడప నుంచి భాకరాపేట వరకు ఇప్పుడున్న రెండు వరసల దారిని నాలుగు వరసలుగా మార్చుతారు. భాకరాపేట నుంచి రైల్వేకోడూరు అవతల శెట్టిగుంట వరకు 82 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మితం చేయనున్నారు. శెట్టిగుంట నుంచి రేణిగుంట సమీపంలో ప్రస్తుతం ఉన్న హైవేను ఫోర్లైన్గా మార్చనున్నారు. రేణిగుంట వద్ద బైపాస్ 3,5 కిలోమీటర్లు నిర్మితం చేయనున్నారు. ఈ హైవే ప్రాజెక్టు రెండు ప్యాకేజీలుగా విభించారు. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు, తొలి ప్యాకేజిగాను విభించారు. చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 58 కిలోమీటర్ల దూరాన్ని రెండ ప్యాకేజీ కిందికి తీసుకొచ్చారు. హైవే రాకతో తగ్గనున్న ట్రాఫిక్.. ప్రస్తుత కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబై, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గి, సర్వీసురోడ్డుగా మారునున్న రహదారిలో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. గ్రీన్ఫీల్డ్ హైవే కొంత భాగం అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి ఉంది. అందువల్ల ఒక నుంచి ఒకటిన్నర ఎత్తులో హైవే నిర్మాణం చేపట్టనున్నారు. వన్యప్రాణుల సంచరించేందుకు వీలుగా ఈ హైవే 5.5 కిలోమీటర్ల మేరకు 11 చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. వంతెనలపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించేలా.. కింది భాగంలో వన్యప్రాణులు తిరిగేలా సౌకర్యం కల్పించనున్నారు. కడప–రేణిగుంట ఎన్హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకునే పరిస్ధితులు ఆవిష్కృతమవుతాయి. -
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస్తే.. ఉత్సాహం.. నాయకుడితో మాట కలిపితే.. ఉత్తేజం.. వైఎస్ జగన్ను కలిశాక కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహమిది.
జననేతకు గజమాలతో సత్కారంసాక్షి కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రెండో రోజు పర్యటన ఆద్యంతం జనసందోహం నడుమ సాగింది. పర్యటనలో భాగంగా అరటి తోటలను పరిశీలించారు. రైతుల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అలాగే పలువురు నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. వధూవరులను ఆశీర్వదించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. కోల్డ్ స్టోరేజ్ను అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని రైతులు ఇల్లూరు శ్రీనివాసులరెడ్డి, ఇల్లూరు రామతులశమ్మ అరటి తోటను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి ఉన్నారు. గిట్టుబాటు ధరల్లేక ..అడిగేనాథుడు కానరాక చెట్లమీదనే మాగిపోతున్న అరటి గెలలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్రెడ్డితోపాటు బ్రాహ్మణపల్లె కౌన్సిలర్ మహేశ్వరరెడ్డి, రైతు శ్రీనివాసులరెడ్డి రైతుల దుస్థితిని వివరించారు. అరటిలో దిగుబడి ఉన్నా.. ధరలేదని, కేవలం టన్ను రూ.2వేలకు అడుగుతున్నారని వివరించారు. అది కూడా ప్రస్తుతం కొను గోలు చేసేవారేలేరని.. వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో కాయలు చెట్ల మీదనే మాగిపోతున్నాయని తెలిపారు. రైతుల దుస్థితి విని వైఎస్ జగన్ చలించిపోయారు. గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధరతోపాటు ధరల స్థిరీకరణ నిధి, పెట్టుబడి సాయం, ఉచిత పంటల భీమా, పంట నష్టపోయిన సందర్భంగా ఇన్ఫుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగలా సాగిందని పేర్కొన్నారు. 2024 మార్చిలో బనానా కోల్డ్ స్టోరేజ్ను ప్రారంభించానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీలకు భయపడి వినియోగంలోకి తీసుకురావడంపై మండిపడ్డారు. వధూవరులకు ఆశీర్వాదం: పట్టణంలోని స్థానిక వాసవీ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నాయకులు, బలిజ సంఘం సభ్యులు కొంగనపల్లె మురళీ, సుభద్ర దంపతుల కుమారుడి వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయి కిరణ్, వినీతను ఆశీర్వదించారు. మహేశ్వరరెడ్డి కుటుంబానికి పరామర్శ లింగాల మండల మాజీ సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం గోపి విహార్ వీధిలోని వారి ఇంటికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తొలుత మహేశ్వర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న మహేశ్వరరెడ్డి భార్య నాగేశ్వరమ్మను ఓదార్చారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోనే ఉన్న లింగాల మండల మాజీ ఉపాధ్యక్షుడు లోపట్నూతల వెంగల్రెడ్డి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేల్పుల రామును పరామర్శించిన మాజీ సీఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం వేల్పులలో వేముల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి(వేల్పుల రాము)ని పరామర్శించారు. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు వేల్పుల రాముపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా... ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాముతోపాటు ఆయన తల్లి, వేల్పుల మాజీ సర్పంచ్ లింగాల పార్వతమ్మ, సతీమణి, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం.. వేల్పుల నుంచి వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బెస్తవారిపల్లె వద్ద పలువురు హాస్టల్ ఉద్యోగులు కలిశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. అనంతరం వైఎస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు. రోటరీపురానికి చెందిన బికారి అనే మహిళ తనకు పింఛన్ రాలేదని .. ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. క్యాంపు కార్యాలయం వద్ద జనసందోహం పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు బిజీబిజీగా గడిపారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్కు తమ సమస్యలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గోవిందరెడ్డి, ఎస్ఈసీ మెంబర్ సాయినాథ శర్మ, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు బలరామిరెడ్డి, వరప్రసాద్, చిన్నప్ప, వీర ప్రతాప్రెడ్డి, సాంబశివారెడ్డి, బయపురెడ్డి, అంబకపల్లె బాబురెడ్డి, మర కా శివకృష్ణారెడ్డి, సైదాపురం చంటి, సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, రఘునాథరెడ్డి, రిషికేశవ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ నాయకుడు వేల్పుల రాము నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, చిత్రంలో ఎంపీ అవినాష్ రెడ్డిపులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెస్తవారిపల్లెకు చేరుకోగానే జన ప్రభంజనం మొదలైంది. వైఎస్సార్సీపీ వేము ల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డిని పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్ జగన్కు బెస్తవారిపల్లె నుంచే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. పార్టీ శ్రేణులు, యువకులు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగనా పూల వర్షం కురిపిస్తూ.. బాణా సంచా పేల్చుతూ హారతులు పట్టారు. అడుగడుగునా వైఎస్ జగన్పై పూలవర్షం కురిపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ జననేత పర్యటనకుబ్రహ్మరథం పట్టిన జనం -
ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలి
కడప అగ్రికల్చర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అధునిక వ్యవసాయ పద్దతులను పాటించి అధిక దిగుబడులను సాధించాలని కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్యకుమార్ సూచించారు. కడప మండలంలోని పాలెంపల్లె, ఉక్కాయిపల్లె,నానాపల్లె గ్రామాలలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కడప అర్బన్: భారత రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. ‘రాజ్యాంగ దినోత్సవం, న్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం కడపలోని జిల్లా కోర్టులో న్యాయసేవాసదన్లో రాజ్యాంగదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగాన్ని గౌర విస్తామని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఇన్చార్జి ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కు మార్, కడప గౌరవ నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీనబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
పులివెందుల: భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ ను స్మరించుకోవడం గొప్పగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ ఎస్సీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పార్లపల్లి కిశోర్, కోళ్ల భాస్కర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. వధూవరులకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో దారి పొడవునా.. వివాహ వేదిక వద్ద ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారాయన. -
నాడు ధైర్యం.. నేడు దైన్యం!
ఈ రైతు పేరు రామచంద్రారెడ్డి. వేముల మండలం భూమయ్యగారిపల్లె. 14 ఎకరాలు అరటి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సరాసరిగా ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున ఆదాయం గడించాల్సి ఉంది. అరటి కోతకు వచ్చే సమయానికి మార్కెట్లో ధరలు పడిపోయాయి. టన్ను రూ.1500తో ఇస్తామన్నా వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో 8 ఎకరాల్లో అరటితోటను తొలగించాడు. దాదాపు అరటి రైతులందరిదీ ఇదే పరిస్థితి.పంటలు నాడు వైఎస్ జగన్ నేడు చంద్రబాబు హయాంలో సర్కార్లో అరటి టన్ను రూ.25వేలు రూ.7వేలు పత్తి క్వింటా రూ.13వేలు రూ.6వేలు ఉల్లి క్వింటా రూ.3వేలు రూ.5వందలు చీనీ టన్ను రూ.70 వేలు రూ.12వేలు మామిడి టన్ను రూ.50 వేలు రూ.10వేలు (బేనీషా) సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగుచేశారు. అందులో ప్రధానంగా పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశినాయన, మైదకూరు మండలాల్లోనే సుమారు 16వేల ఎకరాల్లో సాగుచేశారు. మొదట్లో లింగాల, పులివెందుల, వేముల మండలాల్లో అత్యధికంగా సాగుచేస్తున్న అరటి సాగు జిల్లాలో క్రమేపీ పెరిగింది. అందుకు కారణం లేకపోలేదు. పెట్టుబడి పెట్టినా, గ్యారెంటీగా ఆదాయం వస్తుండడంతో అరటి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. రెండు దశాబ్దాలుగా అరటి పంట వల్ల గణనీయమైన ఆదాయాన్ని రైతులు కళ్ల చూశారు. ఈమారు అరటి రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. దిగుబడులున్నప్పటికీ, పంటను విక్రయించుకోలేని దుస్థితి రైతులకు దాపురించింది. విదేశాలకు ఎగుమతి లేదు. ఆ దిశగా చంద్రబాబు సర్కార్ చర్యల్లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో అపారంగా దిగుబడులు ఉండడం..అటు వైపు విక్రయించే పరిస్థితి లేకపోవడంతో అరటి రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అరటి పంటను పరిశీలించనున్నారు. నిమ్మకు నీరెత్తినట్లుగా చంద్రబాబు సర్కార్... అరటి పంటపై నమ్మకం పెట్టుకున్న రైతుల పెట్టుబడులకు తగ్గ దిగుబడులు ఉన్నాయి. సరాసరిగా 20 నుంచి 25 టన్నుల దిగుబడి ఉంది. కాగా, మార్కెటింగ్ లేకపోవడంతోనే అసలు సమస్య ఏర్పడింది. వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అరటి రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సకాలంలో విక్రయించడం మినహా, నిల్వ చేసుకునేందుకు యోగ్యకరమైన పంట కాదు. పైగా అరటి ఆధారిత పరిశ్రమలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసాగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచనే చేయడం లేదు. నాటి ధీమా కరువు.. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచింది. ప్రతి పంటకు మద్దతు ధర లభించింది. అరటి టన్ను రూ.25వేలు తగ్గకుండా పలికింది. చీనీ టన్ను రూ.50 వేల నుంచి రూ.80 వేలు పలికిన సందర్భాలు లేకపోలేదు. మామిడి, ఉల్లి, ఇలా ఉద్యాన రైతులంతా ఠీవిగా ఉండేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే పరిహారం నెలరోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోగా రైతన్నా.. మీ కోసమంటూ మరో కొత్త ప్రచారానికి తెరతీశారనే విమర్శలున్నాయి. అరటి రైతులది అరణ్య రోదన రెండు దశాబ్దాలుగాఎన్నడూ లేని దుస్థితి నిలువునా తోటలు దున్నేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం నేడు మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి అరటి పంటల పరిశీలన -
మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన ఇలా..
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26వ తేదీ బుధవారం ఉదయం 8.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9 గంటలకు పట్టణంలోని వాసవీ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుంటారు. 9 గంటల నుంచి 9.20 గంటల వరకు వైఎస్సార్సీపీ నాయకుడు కొంగనపల్లె మురళి కుమారుడు సాయి కిరణ్, నిఖిత వివాహ వేడుకలో పాల్గొంటారు. 9.20 గంటలకు వాసవీ ఫంక్షన్ హాలు నుంచి రోడ్డు మార్గాన బ్రాహ్మణపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10 గంటలకు బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని 10.45 గంటల వరకు అరటి తోటలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. 10.45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఇటీవల మృతి చెందిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి ఇంటికి చేరుకుంటారు. 11.50 గంటల వరకు మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 12.30 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.30 నుంచి 2 గంటల వరకు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. 2 గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. 2 గంటల నుంచి 2.30 గంటల వరకు లింగాల రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. 2.50 గంటలకు లింగాల రామలింగారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. 7 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి స్వగృహానికి బయలుదేరుతారు. 7.05 గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. -
5 ఎకరాల్లో అరటి సాగు చేశా..
నాకున్న 5 ఎకరాల్లో అరటి సాగు చేశా. అరటి గెలల కొనుగోళ్లకు వ్యాపారులు మొగ్గు చూపడంలేదు. రూ.8లక్షల మేర పెట్టుబడి పెట్టా. ధరలు పడిపోవడంతోరూ.8లక్షలు నష్టపోతున్నా. – వెంకట నారాయణ, బచ్చయ్యగారిపల్లెరూ.5 లక్షలు నష్టపోయా.. నాకున్న 3 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. తోటలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు పడిపోయాయి. వ్యాపారులు తోటలవైపు కన్నెత్తి చూడలేదు. ధరల కోసం చూస్తే అరటి గెలలు మాగిపోతున్నాయి. ఎంతకో కొంతకు అరటి గెలలు కొట్టండి అంటే వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 3 ఎకరాల్లో అరటి తోటను తొలగించా. సాగులో రూ.5లక్షల మేర నష్టపోయా. అరటి ధరలు ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదు. – గంగాధర, అరటి రైతు, వేముల -
● వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు..
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాయచోటి, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, కదిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి మగ్బూల్ బాషా, వైఎస్సార్సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డిలతోపాటు వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. అలాగే విజయవాడ, నల్గొండ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నాయకులు కలిశారు. -
ప్రమాద రహిత సంస్థగా ఆర్టీసీ
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రమాద రహిత సంస్థగా ఆర్టీసీకి పేరుందని, ఆ పేరును నిలబెట్టేందుకు డ్రైవర్లు కృషి చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి సూచించారు. మంగళవారం కడప నగరంలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్య మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసి డ్రైవర్లచేత కొద్దిసేపు ధ్యానం చేయించారు. అనంతరం గోపాల్రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవర్ల తీరుపైనే సంస్థ పురోగతి ఆధారపడి ఉందన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలపై దిశా నిర్దేశం చేశారు. బద్వేలు డిపో మేనేజర్ నిరంజన్ ఇంధన పొదుపుపై పంచ సూత్రాలు, జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతోపాటు వివిధ డిపోలకు చెందిన 18 మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్రెడ్డి -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
● సుమారు రూ.1కోటి 86 లక్షల విలువైన 702 మొబైల్ ఫోన్ల రికవరీ ● బాధితులకు అందజేసిన Gïܵ ¯]l_-MóS™Œæ ÑÔèæÓ¯é£Šl òÙÌôæP ️ కడప అర్బన్ : ‘ఆపరేషన్ మొబైల్ షీల్డ్’ కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్లో సఫలమయ్యారు. మంగళవారం ఏడవ విడతలో భాగంగా సుమారు రూ.1కోటి 86 లక్షల విలువైన 702 మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేశారు. కార్యక్రమాన్ని విలేకరుల సమక్షంలో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలోని ‘పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్’లో నిర్వహించారు. సీఐఈఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. విజయవంతమైన ఈ ఆపరేషన్న్కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్స్,జీపిఎస్ ట్రాకింగ్, ఐఎంఈఐఐ ట్రేసింగ్, , సైబర్ నిఘా టూల్స్ కారణమని జిల్లా సైబర్ క్రైమ్ టీం తెలిపింది. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్కే ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ టీం ఉపయోగించిన ఎంఏటీఎస్ (మిస్సింగ్ మొబైల్ట్రాకింగ్ సిస్టం)మొబైల్ ట్రాక్చాట్బాట్ నెంబర్ 9392941541, సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో మంచి ఫలితాలను చూపిస్తోంది. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శ్రీమొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎంఏటీఎస్ ద్వారా లేదా సీఈఐఆర్పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఐఎంఈఐ ఆధారిత ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశామన్నారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్కే సైబర్ క్రైమ్ బృందాన్ని అభినందించారు. ఈ రికవరీ ఆపరేషన్లో ప్రధానంగా పనిచేసిన సీఐ మధుమల్లేశ్వర రెడ్డి, హెడ్కానిస్టేబుల్ బి.ఖాదర్ బాష , అమర్నాథ్ రెడ్డి హోంగార్డు , కె.శ్రీనివాసులు(హెచ్జీ)లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)కె. ప్రకాష్బాబు, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఈ.బాలస్వామిరెడ్డి, ఎస్బి డీఎస్పీ సుధాకర్, సైబర్ క్రైంటీం ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెల్ఫోన్ బాధితులకు ఎస్పీ సెల్ఫోన్లను అందజేశారు -
అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
తొండూరు : మండలంలోని గోటూరు పంచాయతీ పరిధిలోని యాదవ కుంట గ్రామానికి చెందిన వల్లపు చెన్నారెడ్డి (47) మంగళవారం అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొండూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదవకుంట గ్రామానికి చెందిన వల్లపు చెన్నారెడ్డి గతంలో నారేపల్లెకు చెందిన కొంతమంది వ్యక్తుల వద్ద వ్యవసాయ పనుల కోసం అప్పు చేశాడు. మంగళవారం అప్పులు ఇచ్చినవారు ఇంటి వద్దకు వెళ్లి చెన్నారెడ్డి భార్యను, పిల్లలను అప్పు తీర్చలేదన్న ఉద్దేశ్యంతో నోటికొచ్చినట్లు దుర్భాషలాడారని, అవమానం భరించలేక విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విషపు గుళికలు తిని ప్రాణాపాయస్థితిలో ఉన్న చెన్నారెడ్డిని108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు చనిపోయినట్లు తెలిపారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రామంద్ర తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీదేవితోపాటు కుమారుడు గోవర్థన్, కుమార్తె గౌతమి ఉన్నారు. -
శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయం మేలు
మైదుకూరు : శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయం ఎంతో మేలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.గోపికృష్ణ తెలిపారు. కడప ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా మండలంలోని అన్నలూరులో ఎల్ఆర్జీ 454 రకం కంది పంట చిరు సంచుల ప్రదర్శన పొలాలను పరిశీలించారు. కంది పంట పెరుగుదల, మొక్కల ఆరోగ్యం, పువ్వుల దశ, గింజల ఏర్పాటుతోపాటు వ్యాధి పురుగు శత్రువుల ప్రభావం తదితర అంశాలను గమనించారు. కొత్త రకమైన ఎల్ఆర్జీ 454 పంటలో మొక్కల సమానమైన పెరుగుదల, ఎక్కువ పళ్ల సంఖ్య, గింజల నింపుదల మంచి స్థాయిలో ఉండటం సానుకూల సంకేతమని శాస్త్రవేత్త గోపికృష్ణ అన్నారు. అనంతరం గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం కింద అన్నలూరులో శిక్షణ పొందుతున్న ఉదయగిరి ఎస్ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. విద్యార్థులు రైతులకు అందిస్తున్న విస్తరణ సేవలు, పంట పరిరక్షణ సలహాలు, సాంకేతిక మార్గదర్శకాలు, రికార్డు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణప్రియ పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న కంటైనర్ లారీ
– మహిళ మృతి చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు గ్రామ సమీపంలో ఆటోను కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో కరిమున్నీసా (39) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన సయ్యద్ కరీమున్నీసా తన భర్త, చిన్న పిల్లవాడినితో కలిసి ఆటోలో రాయచోటి వైపు వెళుతుండగా మద్దిమడుగు సమీపంలో మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో రాయచోటి వైపు నుంచి కడపకు వస్తుండిన కంటైనర్ లారీ ఢీకొంది. షేక్ కరీమున్నీసా అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, చిన్న పిల్లవాడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం కేసులో నలుగురికి జైలు శిక్ష ఎర్రగుంట్ల : పట్టణం పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డు చెక్ పోస్టు వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పట్టుబడిన కేసులో నలుగురు నిందితులకు కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు సీఐ విశ్వనాథరెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. 40 కిలోల బరువుగల 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండుగా సంపంగి రాఘురాం (ఆళ్లగడ్డ పట్టణం), భూపాలం నాగరాజు,(చంద్రగిరి మండలం), పోలిశెట్టి చంద్రశేఖర్ (తిరుపతి పట్టణం), కోర్లకుంట తారకరామి రెడ్డి(తిరుపతి)ని పట్టుకొని 2014 సెప్టెబర్లో 21 వ తేదీన అప్పటి ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారన్నారు. కమలాపురం కోర్టులో విచారణ చే సి అప్పటి జేఎఫ్సీఎం కోర్టు కమలాపురం వారు నాల్గురు నిందితులు నేరం చేశారని భావించి 2017 జనవరి 1వ ఒక్కోక్కరికి రూ.2 వేల నగ దు, 6 నెలలు జైలు శిక్షను ఖరారు చేసింది. దీనిపై ముద్దాయిలు నాల్గురు కలసి పైకోర్టుకు అపీల్కు వెళ్లగా పైకోర్టు అయిన తిరుపతి రెడ్ శాండల్ ప్ర త్యేక కోర్టులో పీపీ అమర్ నారాయణ కేసు వాదించగా తిరుపతి కోర్టు జడ్జి నరసింహమూర్తి నిందితులకు నాల్గురికి కింది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని ఆదేశించినట్లు తెలిపారు. – జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ మైదుకూరు : రైతులు ప్రధాన పంటలో అంతర పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ అన్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మైదుకూరు మండలం నంద్యాలంపేట, సుంకులుగారిపల్లె, ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలంపేటలో ఆయన మాట్లాడుతూ అంతర పంటలు ప్రధాన పంటలకు రక్షణగా నిలబడటమే కాక రైతుకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తాయని వివరించారు. వెదురు సాగు, బిందు సేద్యం గురించి రైతులకు తెలిపారు. సుంకులుగారిపల్లె గ్రామంలో రైతు సుబ్బారెడ్డి సాగు చేసిన అరటి పంటను పరిశీలించారు. అరటి ధర గురించి రైతులు ఆందోళన చెందవద్దని మరో 20 రోజుల్లో అరటి ధర పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఉద్యాన అధికారి సి.రామకృష్ణ, ఖాజీపేట వ్యవసాయాధికారి నాగార్జున, గ్రామ ఉద్యాన సహాయకులు మధుసూదన్ రెడ్డి, జ్యోత్స్న పాల్గొన్నారు. -
పెద్ద సార్ చెప్పారని..!
● 2021లో గొడవ జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటి ● పోలీసులు వ్యాపారి ఇంటికెళ్లి ఆస్తి పత్రాలు లాక్కోవడంపై రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్ ● తనికంటి సోదరుల కేసు విషయంలో పోలీసుల ఓవరాక్షన్ ● అప్రతిష్ట మూటగట్టుకున్న ప్రొద్దుటూరు పోలీసులు సాక్షి టాస్క్ఫోర్స్ : పై అధికారి చెప్పారని అత్యుత్సాహానికి పోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారుల కేసు ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. తనికంటి సోదరుల కేసు విషయంలో మితిమీరిన అత్యుత్సాహం, తమ పరిధులు దాటి వ్యవహరించిన ప్రొద్దుటూరు పోలీసులకు చివరకు భంగపాటు తప్పలేదు. ప్రొద్దుటూరులోని తనికంటి జ్యువెలర్స్ నిర్వాహకుడు శ్రీనివాసులు, వెంకటస్వామి కేసు వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వాణిజ్య కేంద్రంగా పేరు గాంచిన ప్రొద్దుటూరును పసడిపురి అని కూడా పిలుస్తారు. దేశంలోనే ముంబై తర్వాత ఇక్కడ అంతటి స్థాయిలో బంగారు విక్రయాలు జరుగుతాయి. ఎవరికై నా రూ.10 వేలు ఇస్తే ప్రామిసరి నోటు రాయించుకోవడం మనం నిత్యం చూసే వ్యవహారమే. అయితే ప్రొద్దుటూరులో మాత్రం కోట్ల విలువ చేసే బంగారం చేతులు మారినా చిన్న కాగితపు ముక్కపై వివరాలు నమోదు చేసుకొని సంతకం చేయించుకుంటారు. నమ్మకంతోనే ఇక్కడి గోల్డ్ మార్కెట్లో నిత్యం రూ.కోట్ల విలువైన కొన్ని కిలోల బంగారును విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే డబ్బు ఇవ్వడంలో తేడాలొచ్చి పోలీసుస్టేషన్లను ఆశ్రయించడం ప్రొద్దుటూరులో పరిపాటి అని చెప్పొచ్చు. తనికంటి జ్యూవెలర్స్ నిర్వాహకుల విషయంలో ఇలానే జరిగింది. తనికంటి శ్రీనివాసులు 2018లో హైదరాబాద్కు చెందిన హేమంత్శర్మ వద్ద 10 కిలోల బంగారు తీసుకొని డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. 2021లో డబ్బు ఇస్తామని హేమంత్శర్మను ప్రొద్దుటూరుకు పిలిపించి శ్రీనివాసులు అతనిపై దాడి చేసి, కిడ్నాప్ చేశారనేది కేసు సారాంశం. ఈ ఘటనపై ఈ నెల 20న త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య కళ్ల ముందే శ్రీనివాసులను తీసుకెళ్లారు ఈ నెల 21న తనికంటి శ్రీనివాసులు బంగారు షాప్ను మూసేసి రాత్రి 8.30 సమయంలో భార్యతో కలిసి స్కూటీలో ఇంటికి బయలుదేరాడు. శివాలయం సెంటర్లోకి వెళ్లగానే కొందరు వ్యక్తులు కారులో వచ్చి శ్రీనివాసులును తీసుకెళ్లారు. మీరెవరు ఎందుకు నా భర్తను తీసుకెళ్తున్నారని భార్య అడగ్గా త్రీ టౌన్ పోలీసులమని చెప్పారు. వెంటనే అతని భార్య శ్రీలక్ష్మి త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి భర్త గురించి అడిగితే తమకు తెలియదని చెప్పారు. ఇలా ఆమె రాత్రంతా పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్లు తిరిగింది. తన భర్త గురించిన సమాచారం ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఒకానొక దశలో తెలంగాణా పోలీసులు అతన్ని తీసుకెళ్లారేమోనని భావించారు. తన భర్త కిడ్నాప్నకు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరూ తీసుకోలేదు. మరుసటి రోజు కూడా ఆమె రోదిస్తూ స్టేషన్ల చుట్టూ తిరిగింది. శ్రీనివాసులుతోపాటు అతని తమ్ముడు వెంకటస్వామిని ఒక ఎస్టేట్లో ఉంచి రాత్రంతా పోలీసులు చితకబాదారు. చివరకు 22న సాయంత్రం 7.30 గంటల సమయంలో శ్రీనివాసులు, వెంకటస్వామిలు తమ వద్దనే ఉన్నారని పోలీసులు చెప్పడంతో శ్రీనివాసులుతోపాటు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే బంగారు వ్యాపారి కిడ్నాప్నకు గురయ్యాడనే వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీవీ చానళ్లు, సోషయల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ముందు రోజే ఆమెకు చెప్పి ఉంటే శ్రీనివాసులును పోలీసులు తీసుకెళ్లిన వ్యవహారం సీరియస్ అయ్యేది కాదు. పోలీసులు ఆస్తి పత్రాలను తీసుకెళ్లడం ఏంటి.. శ్రీనివాసులు, వెంకటస్వామిని బంధించి చితక బాదిన పోలీసులు 22న రాత్రి వదిలేశారు. అయితే శ్రీనివాసులు ఇంటికి వెళ్లగానే కొద్ది సేపటి తర్వాత సీఐలు తిమ్మారెడ్డి, వేణుగోపాల్, వసంత్ అనే మరో పోలీసు అధికారి అక్కడికి వెళ్లారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం హేమంత్శర్మ బాకీలోకి గాను ఆస్తి పత్రాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అతను ఇవ్వనని చెప్పినా ఆస్తి పత్రాలతోపాటు బంగారు దుకాణం తాళాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఇదంతా వారి ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వ్యవహారమంతా పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో రావడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మళ్లీ 22న తనికంటి శ్రీనివాసులు, వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న సాయంత్రం కోర్టులో హాజరు పరిచారు. తనను పోలీసులు కిడ్నాప్ చేసి కారులో అనేక ప్రాంతాలకు తిప్పారని కోర్టుకు తెలిపాడు. రాత్రంతా నిర్భందించి నడవలేని స్థితిలో కొట్టారని చెప్పాడు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో తనికంటి సోదరులకు ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. చివరకు సొంత పూచీకత్తుపై వారిరువురికీ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో పొందు పరిచిన సెక్షన్లకు సంబంధించి పోలీసులు సరైన ఆధారాలు చూపలేదని కోర్టు అభిప్రాయపడినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోర్టు తీర్పు ఒక విధంగా పోలీసులకు చెంపపెట్టు అని చెప్పొచ్చు. బలి పశువైన వన్టౌన్ సీఐ తిమ్మారెడ్డి పెద్ద సార్ చెప్పడంతోనే తనికంటి కేసు విషయంలో ప్రొద్దుటూరు పోలీసు అధికారులు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఆయన మెప్పు కోసమో లేక మరేదైనా ఆశించి కేసులో దూకుడుగా వ్యవహరించారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 2021లో ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. కాగా ఈ కేసులో వన్టౌన్ సీఐ తిమ్మారెడ్డిని బలి పశువును చేశారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఐ తిమ్మారెడ్డిని వీఆర్కు పంపిస్తున్నట్లు మంగళవారం కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరికొంందరి పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కడప వీఆర్కు సీఐ తిమ్మారెడ్డి – విచారణ అధికారిగా ప్రొద్దుటూరు డీఎస్పీ భావన కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వన్టౌన్ సీఐగా పని చేస్తున్న తిమ్మారెడ్డిని వీఆర్కు పంపినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొద్దుటూరు వన్టౌన్ పరిధిలో తీవ్రమైన ఆర్థిక నేరంపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత స్టేషన్ సీఐ ఎం.తిమ్మారెడ్డి కేసును సరైన రీతిలో విచారణ చేయక పోవడం వల్ల విచారణ తీరుపై అనేక వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల తీవ్రత దృష్ట్యా, పోలీసుల విచారణ లోపాలపై లోతైన విచారణ చేపట్టడం జరుగుతోంది. సరైన విచారణ నియమాలు పాటించని వన్టౌన్ సీఐని వీఆర్కు పంపించినట్టు ఎస్పీ తెలిపారు. కేసు సమగ్ర దర్యాప్తునకు ప్రొద్దుటూరు డీఎస్పీ భావనకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రొద్దుటూరు సీఐలతోపాటు వెళ్లిన వసంత్ అనే పోలీసు అధికారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వసంత్ అనే పేరు ఎక్కడా వినలేదని ఇక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి వచ్చాడని కొందరు, తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారి అని మరికొందరు చెబుతున్నారు. అసలు అతను పోలీసు శాఖకు చెందిన అధికారే కాదనే చర్చ కూడా జరుగుతోంది. అతని డైరెక్షన్లోనే ప్రొద్దుటూరు పోలీసులు వ్యాపారులను చితకబాదారని చెబుతున్నారు. వసంత్ వ్యవహారంపై జిల్లా పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పెద్ద సార్ పంపించడంతోనే అతను ప్రొద్దుటూరుకు వచ్చాడనేది పోలీసు వర్గాల సమాచారం. కాగా సివిల్ పంచాయతీలో పోలీసులు నేరుగా తలదూర్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్టేషన్కు వచ్చిన అన్ని కేసులను ఇలానే ట్రీట్ చేస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేజీల లెక్కన బంగారుకు సంబంధించిన అనేక చీటింగ్ కేసులు ప్రొద్దుటూరు పోలీస్స్టేషన్లలో నమోదు అయ్యాయి. అయితే గతంలో ఏ పోలీసు అధికారి ఇలా వ్యవహరించలేదు. -
అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం
పులివెందుల : రాష్ట్రంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. మంగళవారం పులివెందులలోని భాకరాపురంలో గల వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేయడం మొదటి నుంచి అలవాటేనన్నారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వైఎస్ జగనన్న హయాంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడం జరిగిందన్నారు. అన్నదాతలకు అండగా రై తు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి వి క్రయం వరకు అప్పటి ప్రభుత్వం అండగా ఉండేదన్నా రు. రైతులకు విత్తన సమయానికి పెట్టుబడి సాయం అందేదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాక ప్రకృతి వైఫరీత్యాలతో పంట నష్టపోతే నెల రోజుల్లోపు నష్టప రిహారం అందేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభు త్వం అన్నదాతలను నిట్టనిలువునా నట్టేట్లో ముంచిందన్నారు. ఈ–క్రాప్, పంటల బీమాలకు మంగళం పా డిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం తన ఎల్లోమీడియా ద్వారా ప్రచార ఆర్భాటాలు గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు పరిస్థితి ‘నో యాక్టివిటీ – ఓన్లీ పబ్లిసిటీ’ అన్న చందంగా మారిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. వైఎస్సార్సీపీలోకి మాజీ కౌన్సిలర్ : మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కొమెర నాగరాజు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జ్లు వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డిలు నాగరాజుకు వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలోకి రావడంతో సొంత ఇంటికి మరలా వచ్చినట్లుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు కిశోర్, వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎఫ్ సమావేశానికి ఆహ్వానం : ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని జిల్లా ఆర్ఎస్ఎఫ్ యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం ఈనెల 30వ తేదీన కడప ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, ఆ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మండల పూజకు ఆహ్వానం : వేంపల్లె పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి డిసెంబర్ 3న వేంపల్లెలో జరిగే మండల పూజకు ఆహ్వానించారు. అలాగే హిందు సమ్మేళన నిర్వాహక సమితి సభ్యులు డిసెంబర్ 13న వేంపల్లెలో జరిగే హిందు సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ కొమెర నాగరాజు, ప్రజాదర్బార్లో ఎంపీకి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు -
‘నేనున్నాను..’ పులివెందుల ప్రజాదర్బార్లో వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాకతో పులివెందుల జనసందోహంగా మారింది. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను’ అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్.. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా కల్పించారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.గోడు వెల్లబోసుకున్న రైతులువరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.మేం సీట్లు కోల్పోయాం: వైద్య విద్యార్థులుచంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పలువురు వైద్యవిద్యార్థులు వైఎస్జగన్ను కలిసి వాపోయారు. పులివెందుల, పాడేరుతో మరో వంద సీట్లు వచ్చేవని.. అయితే కూటమి సర్కార్ నిర్ణయంతో సీట్లు కోల్పోయామని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఒక్క మార్కుతో సీటు కోల్పోయానని చరణ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయ పలకరింపులు.. సెల్ఫీలువైఎస్ జగన్పై అభిమానంతో కొందరు భాకరాపురం క్యాంప్ కార్యాలయానికి తరలి వచ్చారు. దివ్యాంగులు, చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, యువకులను ఆయన అప్యాయంగా పలకరించారు. తిరిగి వెళ్లే క్రమంలో.. అక్కడే ఉన్న కొందరి యువకుల ఫోన్లలో స్వయంగా సెల్ఫీలు తీశారు. -
కిడ్నీరాకెట్.. రోజుకో మలుపు
● నిందితులుగా మరో 8 మంది ● వెలుగులోకి కాకినాడలో రాకెట్ మూలాలు మదనపల్లె : మదనపల్లెలో ఈనెల 9న వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు మూలాలు కాకినాడకు పాకినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి దళారులు, ఇప్పటికే అరెస్టయిన నిందితులతో వారికున్న సంబంధాలపై ఆరా తీస్తుండగా కేసులో మొదటి నిందితుడైన డీసీహెచ్ఎస్ కంప ఆంజనేయులు కుటుంబీకుల్లో ఒకరిపై తాజాగా కేసు నమోదైనట్లు తెలిసింది. దీంతో దర్యాప్తు సాగుతున్నకొద్ది ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో 8 మందిపై కేసు ఈనెల 9న స్థానిక గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్టు నిర్దారణ అయ్యింది. కిడ్నీలు ఇచ్చిన వైజాగ్కు చెందిన ఇద్దరు మహిళల్లో సాడి యమున (29) మృతి చెందడంతో తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు ఆంజనేయులు సహా ఏడుగురిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరో 8 మందిని నిందితులుగా చేర్చగా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. అయితే ఏ–1 నిందితుడు ఆంజనేయులు కుటుంబీకుల్లో ఒకరిపై కేసు నమోదైనట్లు తెలిసింది. మిగిలిన నిందితుల్లో కిడ్నీలు ఇచ్చేవారిని సేకరించడం, శస్త్రచికిత్సలు చేసిన యూరాలజీ డాక్టర్ పార్థసారధికి సహాయకులుగా పనిచేసిన ఇద్దరు, కేసులో సంబంధం ఉన్న వారు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు చేరింది. ఈ సంఖ్య ఇక్కడితో ఆగదని, ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాకినాడలో మూలాలు వైజాగ్కు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలు తీసి ఇద్దరికి అమర్చిన ఈ రాకెట్లో కాకినాడకు చెందిన ఓ మధ్యవర్తి వ్యవహారాన్ని విచారణ అధికారులు గుర్తించారని తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తులు పిల్లిపద్మ, కాకార్ల సత్యలతో ఇతనికి సంబంధాలు, ఎక్కడెక్కడ వీరు కలిశారు.. ఇంకా ఎన్ని కిడ్నీల మార్పిడిలో వీరి ప్రమేయం ఉంది అన్న వివరాలను ఆరా తీయడమేకాక కాకినాడకు చెందిన మధ్యవర్తి కోసం గాలిస్తున్నట్టు తెలిసింది. దీంతో కిడ్నీ రాకెట్ మూలాలు వైజాగ్లోనే కాకుండా కాకినాడలోనూ ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులకు ఇతన్ని అరెస్ట్ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి రావొచ్చని భావిస్తున్నారు. వారంతా కడప వాసులే కిడ్నీ రాకెట్ కేసులో ఏ–2గా ఉన్న బెంగళూరు డాక్టర్ వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఆ డాక్టర్ కడపకు చెందిన యూరాలజీ వైద్యుడు పార్థసారధిరెడ్డిగా గుర్తించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సమయంలో ఆ డాక్టర్కు సహాయకులుగా ఉన్న ఇద్దరు కూడా కడప వారని గుర్తించారు. కడప నుంచి బెంగళూరు వెళ్లిన డాక్టర్ ఎనిమిదేళ్లుగా ఉంటున్నట్టు నిర్ధారించారు. సహాయకుల వివరాలు సేకరించిన పోలీసులు పూర్తిస్థాయిలో వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. వీరు అరెస్ట్ అయితే ఆ డాక్టర్ ఎన్ని కిడ్నీ ఆపరేషన్ల చేశారు, ఎప్పటినుంచి మదనపల్లెలో ఈ రాకెట్ నడుస్తోందో వెలుగులోకి వస్తుంది. ఒక్కో ఆపరేషన్కు రూ.5 లక్షలు దర్యాప్తులో పోలీసులు సేకరించిన వివరాల మేరకు గ్లోబల్ హాస్పిటల్లో ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగితే యూరాలజీ డాక్టర్కు రూ.5 లక్షలు, డాక్టర్ ఆంజనేయులకు రూ.4 నుంచి రూ.5 లక్షల అద్దె చెల్లించేవారని తెలిసింది. ఈలెక్కను దాతలనుంచి తీసుకున్న కిడ్నీలకు తక్కువ మొత్తం చెల్లించి, మధ్యవర్తులు అధికసొమ్మును వాటాలు వేసుకునే వారని తెలుస్తోంది. గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీమార్పిడి ఆపరేషన్లు రెండే జరిగాయని, అదికూడా ఈనెల 9న చేసిందేనని నిందితులు చెబుతున్నట్టు తెలిసింది. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు దానికిముందు ఎన్ని ఆపరేషన్లు జరిగాయి, జరగలేదా అన్నది తేలాల్సి ఉంది. కాగా ఈనెల 9న ఇద్దరు మహిళల నుంచి తీసిన రెండు కిడ్నీలను గోవా, బెంగళూరుకు చెందిన వ్యక్తులకు అమర్చినట్టు గుర్తించిన పోలీసులు వారు ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడేందుకు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గుర్తించినట్లు తెలిసింది. -
వాటర్ గ్రిడ్ పథకం పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పులివెందుల రూరల్ : పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇన్చార్జి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్లు పేర్కొన్నారు. సోమవారం ఆర్డీఓ చిన్నయ్యను వారు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 2021 జూన్ నెలలో 299 గ్రామాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా వాటర్ గ్రిడ్ పనులు జరిగాయన్నారు. ఈ పథకానికి సంబంధించి లింగాల మండలం పార్నపల్లె వద్ద నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అలాగే విద్యుత్ ఉప కేంద్రం కోసం దాదాపు 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులు మొదటి దశలో పూర్తి చేశారన్నారు. రెండో దశలో ఓవర్ హెడ్ ట్యాంకర్లు తదితర పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు శరవేగంగా సాగిన పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా, మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేవలం రూ.8కోట్లు ఖర్చుపెడితే మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తయి పూర్తిస్థాయిలో పులివెందుల మున్సిపాలిటీకి ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు కోడి రమణ, కిశోర్, భార్గవి, రసూల్, కనక, వీరారెడ్డి, చంద్రమౌళి, ఖాదర్, కార్తీక్, సంపత్, మల్లికార్జున, పద్మనాభరెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
మదనపల్లె సిటీ : 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–14 బాల,బాలికల బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. సోమవారం మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర అబ్జర్వర్ వర్మ ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథుడు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ పోటీలు 24వతేదీ వరకు జరుగుతాయని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. మెట్టమొదటిసారిగా ప్లడ్లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ చిత్తూరు కార్యదర్శి డాక్టర్ బాబు, ఝాన్సీరాణి, పీడీలు అన్సర్, భద్రయ్య, రమేష్, శివశంకర్, నరేష్, భారతి, లత, వరలక్ష్మి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 71 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, మహిళా పి.ఎస్ డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
వల్లూరు(చెన్నూరు), కడప అర్బన్ : సరదాగా ఈత కోసం వెళ్లి కడప సమీపంలోని వాటర్ గండి ప్రాంతంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం బయట పడ్డాయి. చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామాంజనేయపురానికి చెందిన కసినేని నాగేశ్వర రావు కుమారుడు కసినేని నరేష్ (18), అశోక్ నగర్కు చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు గండం రోహిత్ (16) మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు ఆదివారం సెలవు దినం కావడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ గండి ప్రాంతంలో పెన్నా నది వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి సరదాగా ఈత కొట్టి సెల్ఫోన్లతో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నరేష్, రోహిత్లు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా స్నేహితు ల్లో ఒకరైన అరుణ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతడు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోసాగాడు. అదే సమయంలో అందుబాటులో వున్న అక్కడి దేవాలయ వాచ్మెన్ ఆంజి అరుణ్ను రక్షించారు. నరేష్, రోహిత్లు నీటిలో గల్లంతయ్యా రు. సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు రాత్రి వరకు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. సోమవారం ఉదయం చెన్నూ రు సీఐ క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను చూసిన తల్లి దండ్రులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నరేష్కు తల్లిదండ్రులతో బాటు ఒక అన్న, ఒక సోదరి వున్నారు. రోహిత్కు తల్లిదండ్రులతో బాటు ఒక చెల్లెలు వున్నారు. -
● మూడు సీజన్లు పూర్తయినా పైసా కూడా...
కడప అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. వ్యవసాయానికి కనీ సం కూడా సహకారం అందించకుండా వేధిస్తోంది. అన్నదాతలకు భరోసా కల్పించే ఫసల్ బీమాను నీరు కార్చేందుకు ప్రయత్నిస్తోంది. కష్టకాలంలో కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలకు తూట్లు పొడుస్తోంది. ఈ క్రమంలోనే రబీకి సంబంధించి ఇప్పటివరకు బీమా ప్రీమియం చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు ఈ క్రాపు నమోదు కూడా ప్రారంభించలేదు. మరోవైపు వరుస వర్షాలు.. తుపాన్లు రైతు కష్టాన్ని మింగేస్తున్నాయి. ఆరుకాలం కష్టించే అన్నదాతలకు..... కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అడుగడుగునా దగా పడుతున్నారు. ప్రభుత్వానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు కర్షకులను మరింత కుంగదీస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతోపాటు మొన్నొచ్చిన మోంథా తుపాన్ రైతులను నట్టేట ముంచింది. ఖరీఫ్ సీజన్కు రైతులు ప్రీమియం చెల్లించినా ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతుల ఆర్థికాభివృద్దికి అడుగడుగునా చేయూతనిచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన పంటల బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది. కనీసం రబీకి సంబంధించి ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టాలో కూడా ఇంతవరకు వెల్లడించలేదంటే రైతులపై బాబు సర్కారుకున్న ప్రేమ ఇట్టే అర్థమవుతోంది. రబీ సీజన్కు ముందే... సీజన్ ప్రారంభానికి ముందే బీమా ప్రీమియం లెక్కలు స్పష్టం చేయాలి. రబీ సీజన్ ప్రారంభమై నెలన్నర దాటినా ఇంతవరకు అతీగతి లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాతావరణ అధారిత, పంటల దిగుబడి బీమా ప్రీమియం మొత్తాన్ని రైతు లు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చెల్లించేది, దీంతో అన్నదాతలకు భారం పడకుండా ఉండేది. దీంతోపాటు పంటల ఈ క్రాపుతోపాటు ఈకేవైసీ కూడా సకాలంలో పకడ్బందీగా పూర్తి చేసేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ క్రాపు నమోదు ఇంకా ప్రారంభించలేదు. పైకేమో రైతన్నా నీకోసమంటూ మాయమాటలు చెబుతూ కాలం గడిపేస్తోంది.గత ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం వరిపంటకు సంబంధించి ఎకరాకు రూ. 630, వేరుశనగకు ఎకరాకు రూ.450, మామిడికి ఎకరాకు రూ. 1750 చొప్పున రైతుల నుంచి ప్రీమియం కట్టించింది. అయితే బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 2024 జూలై 12 నుంచి 2025 మే వరకు మూడు సీజన్లు పూర్తి అయ్యాయి. బీమా ప్రీమియం చెల్లించినా రైతులకు మాత్రం పంటలకు నష్ట పరిహారం కింద ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇటీవల వరుస తుపాన్లతోపాటు వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులేమో పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్య టించనున్నారు. ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు నుంచి హెలీకాప్టర్లో పులివెందులకు బయలుదేరుతారు. 3.50గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4గంటల నుంచి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం భాకరాపురంలోని తన స్వగృహానికి వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేస్తారు.రెండో రోజు ఇలా... 26వ తేదీ ఉదయం 8.45గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి పట్టణంలోని స్థానిక వాసవీ ఫంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. 9.20గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బ్రాహ్మణపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10గంటలకు బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని.. అరటి తోటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం 10.45కి అక్కడి నుంచి బయలుదేరి ఇటీవల చనిపోయిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి ఇంటికి చేరుకుంటారు. 11.50గంటల వరకు అక్కడే ఉండి మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. 2.50గంటలకు వేల్పుల లింగాల రామలింగారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.మూడో రోజు ఇలా..27వ తేదీ గురువారం ఉదయం 7.45గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్ వద్దకు బయలుదేరుతారు. 8గంటలకు హెలీకాప్టర్ ద్వారా తిరుగుపయనమవుతారు. -
‘తవ్వా‘కు వైఎస్సార్సీపీలో సముచిత స్థానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యుడు, రాయలసీమ కథా సాహిత్య పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య చేసిన సేవలను గుర్తించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం హర్షనీయమని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో తవ్వాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత తన పదవీ కాలం ముగియకుండానే పార్టీ కోసం నైతిక బాధ్యత వహించి అధికార భాషా సంఘం సభ్యుడి పదవికి రాజీనామా చేసి పార్టీ పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్య రంగంలో ముఖ్యంగా కథా సాహిత్యానికి చేసిన పరిశోధన చాలా విలువైందన్నారు. రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు మధుర కవి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ వెంకటయ్య తెలుగు సాహిత్య రంగంలోనే కాక, రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవడం అభినందనీయమన్నారు. సన్మాన గ్రహీత తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో ఆట, పాట, మాట ద్వారా పార్టీ ప్రతిష్టను ప్రజలలో పెంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో మూగల రాజేష్, మేడిగ ఆల్ ఫ్రైడ్, ఓబులేసు పలువురు సాహిత్య మిత్రులు పాల్గొన్నారు. -
ఉయ్యాలవాడ స్ఫూర్తిని కొనసాగించాలి
పులివెందుల : దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగ నిరతిని, స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో నరసింహారెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డి, ఆర్సీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఆర్సీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తమరెడ్డి తదితరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్రిటీష్వాళ్లను ఎదిరించిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. రైతుల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. ఆయన జీవించింది కేవలం 40 ఏళ్లు అయినా కూడా 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరును మనం స్మరించుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పగా జీవించారో అర్థం చేసుకోవాలన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాత కాలంలో అనేకమంది గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు ఆయన బాటలోనే స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగించారన్నారు. భారతదేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వజ్ర భాస్కర్రెడ్డి, సాంబశివారెడ్డి, లింగాల రామలింగారెడ్డి, భాస్కర్రెడ్డి, హాలు గంగాధరరెడ్డి, ఆర్సీడీఎస్ నేషనల్ కన్వీనర్ వల్లపురెడ్డి వెంగళరెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గట్టిరెడ్డి బయపు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘురాం రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసులు రెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాగేశ్వర్ రెడ్డి, ఎద్దుల అర్జున్ రెడ్డిలతో పాటు ఆర్సీడీఎస్ సంస్థ ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఘనంగా ఉయ్యాలవాడ జయంతి వేడుకలు పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు -
మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం
కడప కోటిరెడ్డిసర్కిల్ : మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, అశ్రద్ధ చేస్తే డయాబెటిక్ రెటినోపతి కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని కడప ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల, రాజశేఖర్ రెడ్డి ప్రాంగణం వైద్యులు, విట్రియో రెటినల్ సర్వీసెస్ అసోసియేట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మనోజ్ శెట్టిగర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం 17 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులను కలిగి ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలువబడుతోందన్నారు. 2045 నాటికి భారతదేశంలో 125 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఈ వ్యాధి నేత్ర సమస్యలను పెంచుతుందని ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతికి గురవుతారన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 191 మిలియన్ల ప్రజలు డయాబెటిక్ రెటినోపతితో బాధపడతారనే అంచనాలు ఉన్నాయని వివరించారు. డయాబెటిక్ రెటినోపతి ముందస్తు గుర్తింపు లక్షణాలు లేకుండా వృద్ధి చెందుతుందన్నారు. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయటం వలన ఈ వ్యాధిని గుర్తించి చికిత్సను అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. నాకు న్యాయం చేయండి పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక నారాయణ కళాశాల సమీపంలో నివాసముంటున్న అమరావతి అనే మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. సోమవారం పులివెందులలో ఆమె మాట్లాడుతూ తనకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారన్నారు. వీరపునాయునిపల్లె మండలం గోనుమాకుపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్రెడ్డితో 2007లో వివాహమైందన్నారు. తన భర్త, వారి కుటుంబ సభ్యులందరూ మానసికంగా, ఆరోగ్యంగా లేరన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా తన భర్త కుటుంబానికి ఉన్న 30 ఎకరాల ఆస్తి కాజేయాలని తన తమ్ముడు వివాహం జరిపించాడన్నారు. దీనికితోడు 2024 సంవత్సరంలో తనపైన, తన కుమార్తైపెన దాడి చేశాడన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు స్పందించలేదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 16వ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ అండర్–14 పోటీలు ముగిశాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో కడప బాలుర జట్టు, తూర్పు గోదావరి జట్లు తలపడగా కడప జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో కడప బాలికల జట్టు తూర్పు గోదావరి జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు డీఎస్డీఓ గౌస్ బాషా, ఎంఈఓలు రామానాయుడు, రామచంద్రారెడ్డిలు, టోర్నమెంట్ పరిశీలకుడు రామకృష్ణ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం జాతీయ స్థాయిలో జరిగే సాఫ్ట్బాల్ జిల్లా బాలుర, బాలికల జట్లను ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ గేమ్స్ సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి, రిటైర్డ్ సీనియర్ పీఈటీ విజయ ప్రసాద్ రెడ్డి, మానవతా సంస్థ చైర్మన్ కొండారెడ్డి, కడప జిల్లా కార్యదర్శి విక్టర్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ బాలుర జిల్లా జట్టు.. జాతీయస్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ బాలుర జిల్లా జట్టుకు కడపకు చెందిన ఎ.మనోజ్, యు.సుబ్రమణ్యం, ఓ.రాజకుళ్లాయప్ప, సి.శ్రీశాంత్కుమార్, విజయనగరానికి చెందిన వి.వసంత్, కె.నిఖిల్, తూర్పుగోదావరికి చెందిన బాల ఎంవీవీ బాల ఆదిత్య, జీఎస్ నిశాంత్, కె.కసువర్మ, జయకృష్ణ, శ్రీకాకుళంకు చెందిన కె.దిలిశ్వరరావు, అనంతపురానికి చెందిన చి.చేతన్, విశాఖపట్టణానికి చెందిన ప్రతీక్ కుమార్, గుంటూరుకు చెందిన ఎం.కార్తీక్, చిత్తూరుకు చెందిన కె.బాల స్వరూప్, పశ్చిమగోదావరికి చెందిన పూర్ణనంద, స్టాండ్ బైలుగా విశాఖపట్టణానికి చెందిన బి.లోకేష్, కడపకు చెందిన ఎస్.ఇషాన్, విజయనగరానికి చెందిన జి.దుర్గాప్రసాద్, గుంటూరుకు చెందిన పి.నరేంద్రలు ఎంపికయ్యారు. జాతీయస్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ బాలికల జిల్లా జట్టు.. జాతీయస్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ బాలికల జిల్లా జట్టుకు కడపకు చెందిన అనూష, ఉష, రెడ్డి గీత, హేమశ్రీ, తనూజ, తూర్పుగోదావరికి చెందిన పి.కృష్ణదీపిక, ఎం.ఝాన్సీ రాణి, సీహెచ్ రమ్యశ్రీ, ప్రకాశంకు చెందిన భాగ్యశ్రీ, హరిప్రియ, అనంతపురానికి చెందిన బి.మధులిక, ఈ.కీర్తన, గుంటూరుకు చెందిన ఎస్.కె.మస్తాని, విజయనగరానికి చెందిన యు.దీపిక, కృష్ణా జిల్లాకు చెందిన ఎస్.ఉస్మిత, కర్నూలుకు చెందిన అలేఖ్య, స్టాండ్ బైలుగా కడపకు చెందిన ఎన్.లిఖిత్శ్రీ, తూర్పుగోదావరికి చెందిన డి.సంగీత, అనంతపురానికి చెందిన వి.మైథిలీ ఎంపికయ్యారు.టోర్నీ విజేతలుగా కడప బాలుర, బాలికల జట్లు -
కిడ్నాప్ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : హైదరాబాద్కు చెందిన హేమంత్శర్మను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన తనికంటి జ్యూవెలర్స్ నిర్వాహకులు తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హేమంత్శర్మ 2018లో తనికంటి శ్రీనివాసులుకు 10 కేజీల బంగారం ఆభరణాలు ఇచ్చాడు. 2021లో డబ్బులు ఇస్తామని హేమంత్శర్మను ప్రొద్దుటూరుకు పిలిపించారు. కొర్రపాడు రోడ్డులోని పాలిటెక్నిక్ కాలేజి వద్ద హేమంత్శర్మ, అతని సోదరుడు నిఖిల్శర్మ ఉండగా తనికంటి శ్రీనివాసులు తన అనుచరులతో వచ్చి వారిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. ఓ గదిలో బంధించి దాడి చేయడంతో పాటు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకున్నాడు. ఈ ఘటనపై ఈ నెల 20న త్రీ టౌన్ పోలీసులు దాడి, కిడ్నాప్, దోపిడి, చంపుతామని బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వన్టౌన్ పోలీసులు సోమవారం శ్రీనివాసులు, వెంకటస్వామిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించిన వివరాలతో పాటు తనను పోలీసులు కొట్టినట్లు వెంకటస్వామి న్యాయమూర్తికి చెప్పినట్టు తెలిసింది. దీంతో న్యాయమూర్తి అతనికి తిరిగి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి అతన్ని తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జమ్మలమడుగు రూరల్ : ద్విచక్రవాహనదారుడిని ఇన్నోవా వాహనం ఢీ కొన్న సంఘటనలో ఆవుల బాలయ్య (56) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని దానవులపాడు గ్రామానికి చెందిన ఆవుల బాలయ్య సొంత పనుల నిమిత్తం గ్రామం నుంచి బైక్లో ప్రధాన రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆవుల బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాలంతోపాటు పంటలు మారాలి మైదుకూరు : మారుతున్న కాలంతోపాటు రైతులు సాగు చేసే పంటలు కూడా మారాలని జిల్లా వ్యవసాయాధికారి బి.చంద్రానాయక్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నలూరులో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. అందులో నీటి భద్రత కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు సాధ్యమైనంత వరకు సాగునీటిని అందించాలని యోచిస్తోందన్నారు. డిమాండ్ ఆధారిత పంటల కింద మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న చిరుధాన్యాలను సాగు చేసేలా చూస్తుందని పేర్కొన్నారు. అగ్రిటెక్ కింద ప్రతి రైతుకు సాంకేతికతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో భాగంగా యూనిక్ ఐడీలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ ఎం.కృష్ణమూర్తి, ఏఓ బాలగంగాధర్రెడ్డి, తహసీల్దార్ రాజసింహ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. బంగారు నగలు చోరీ సుండుపల్లె : మండల పరిధిలోని రెడ్డివారిపల్లెలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో చోరీ జరిగింది. బాధితుని వివరాల మేరకు.. రెడ్డివారిపల్లెలో నివాసం ఉండే సురేష్, సుధారాణి దంపతులు ఇంట్లో లేని సమయంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలోని 25 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పలు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. ఇందులో భాగంగా సీకేదిన్నెలో అత్యధికంగా 20 మి.మీ వర్షం కురిసింది. అలాగే అట్లూరులో 19.6, పులివెందుల్లో 19, ఒంటిమిట్టలో 16.8, కమలాపురంలో 14.2, చెన్నూరులో 13.6, సిద్దవటంలో 12.8, పెండ్లిమర్రిలో 11.8, లింగాలలో 11, వల్లూరులో 10.4, కలసపాడులో 10.2, ఖాజీపేటలో 9 , చక్రాయపేట, తొండూరులలో 7.2, వీఎన్పల్లిలో 5.8, మైదుకూరులో 5.2, చాపాడులో 4.6, బి.కోడూరులో 3.4, జమ్మలమడుగు, వేములలో 3, పోరుమామిళ్లలో 2, వేంపల్లి, కాశినాయనలలో 1.8 మి.మీ వర్షం కురిసింది. 27న క్రీడా పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవం(డిసెంబర్3) సందర్భంగా ఈ నెల 27న వివిధ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్బాషా పేర్కొన్నారు. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ (100 మీటర్ల పరుగు, షాట్పుట్, డిస్క్త్రో), వాలీబాల్, చెస్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. డీఎస్ఏ మైదానంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. 26 నుంచి శిక్షణ కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) ఉన్న ప్రిన్సిపల్స్కు, హెడ్మాస్టర్స్తోపాటు ఏటీఎఫ్ ఇన్చార్జు టీచర్స్కు ఈ నెల 26 నుంచి 28 వరకు జిల్లాస్థాయి శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినేజర్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కడప చిన్నచౌక్లోని అంబేడ్కర్ గురుకులంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణలో అటల్ ల్యాబ్ నిర్వహణ, రిజిస్టర్ల నిర్వహణ, లీప్ యాప్లో సమాచారం అప్లోడ్ చేయడం, ఏఐ ఎం పోర్టల్లో డాష్ బోర్డు నింపడం, ట్రెంచ్ అమౌంట్ కోసం అప్లై చేయడం, ఎలక్ట్రానిక్స్ మీద, కోడింగ్, మీద ప్రాథమిక విజ్ఞానాన్ని కలిగిస్తారని డీఈఓ, డీఎస్ఓలు తెలిపారు. ‘ఉపాధి’ ప్రణాళిక సిద్ధం కడప సిటీ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు. రూ. 245.60 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. 80 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. కాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల పనిదినాలు చేయాల్సి ఉండ గా...ఇప్పటివరకు రూ.61.39 లక్షలు పనిదినా లు నమోదయ్యాయి. ఇంకా 8.60 లక్షల పనిదినా లు మార్చి చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్ద పోలిరెడ్డి కడప కార్పొరేషన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో ని బద్వేలు నియోజకవర్గానికి చెందిన వంకెల పెద్ద పోలిరెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 3న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు కడప కోటిరెడ్డిసర్కిల్ : పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబరు 3వ తేది జిల్లాలోని వివిధ డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప డిపో నుంచి ఉదయం 5 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసు రాయచోటి, పీలేరు మీదుగా అరుణాచలం బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ.1044 ఛార్జీగా నిర్ణయించారన్నారు. బద్వే లు డిపో నుంచి ఉదయం 9 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అల్ట్రాడీలక్స్ సర్వీసు, మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్మీదుగా సూపర్ లగ్జరీ సర్వీసు, ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు మైదుకూరు, కడపమీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని వివరించారు. అలాగే జమ్మలమడుగు డిపో నుంచి ఉదయం 5.30 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా సూపర్ లగ్జరీ బస్సు, పులివెందల డిపో నుంచి ఉదయం 7 గంటలకు రాయచోటి, పీలేరు మీదుగా అల్ట్రా డీలక్స్ సర్వీసు నడుస్తుందని తెలిపారు. అలాగే శబరిమలకూ అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్నామన్నారు. నేటి నుంచి జోనల్ మ్యాచ్లు కడప వైఎస్ఆర్ సర్కిల్: నేటి నుంచి అండర్–14 మల్టీ డే జోనల్ రెండు రోజుల మ్యాచ్లను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్లు సౌత్జోన్ విన్నర్, నార్త్జోన్ విన్నర్స్,సెంట్రల్ జోన్ విన్నర్స్, రెస్ట్ ఆఫ్ సౌత్జోన్, రెస్ట్ ఆఫ్ నార్త్జోన్,రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు. మ్యాచ్లు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం, కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం మైదానాల్లో జరుగుతాయని వివరించారు. -
దాల్మియా బాధితులకు న్యాయం చేయాలి
కడప సెవెన్రోడ్స్ : దాల్మియా సిమెంటు కర్మాగార నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ జమ్మలమడుగు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎంవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల వద్ద నిర్మించిన దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. చుట్టుపక్కల ఉన్న దుగ్గనపల్లె, నవాబుపేట, చిన్నకొమ్మెర్ల, పెద్ద కొమ్మెర్ల, తలమంచిపట్నం ప్రజలు బ్లాస్టింగ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్లన్నీ నెర్రెలు చీలి నివాసయోగ్యానికి వీలు లేకుండా పోతున్నాయన్నారు. దుమ్ము ధూళి వల్ల పంట దిగుబడి తగ్గిపోతోందన్నారు. దుగ్గనపల్లె రైతు మోషే తన మిరప పంటను గుంటూరు మార్కెట్యార్డుకు తీసుకెళ్లగా, అక్కడ నాణ్యత లేదని కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 35 వేల ఎకరాలకు నీరు పారే వంకకు అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల వరద రైతుల పొలాలను ముంచెత్తుతోందన్నారు. ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. తొలుత రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే రెండవ ప్లాంటు విస్తరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జమ్మలమడుగు నియోజకవర్గ కార్యదర్శి ఎం.ప్రసాద్, జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి రాంప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా యానాదయ్య, రైతులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ఆందోళన -
ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: అర్జీదారులు, ఫిర్యాదుదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం సభా భవన్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఫిర్యాదుల పట్ల పరిష్కార నివేదిక అందివ్వడంలో గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు . కడప వీఆర్కు ప్రొద్దుటూరు వన్టౌన్ సీఐ? కడప అర్బన్:ప్రొద్దుటూరు వన్టౌన్ సీఐగా విధులను నిర్వహిస్తున్న తిమ్మారెడ్డిని కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు కడప వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను సోమవారం సాయంత్రం జారీ చేసినట్లు సమాచారం. ప్రొద్దుటూరులోని ఓ బంగారు వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో తిమ్మారెడ్డితో పాటు, మరో సీఐ, ఇంకా ఒకరిద్దరు ఎస్ఐలు, కొంతమంది సిబ్బంది పాత్ర ఉందని పోలీసు అధికార వ ర్గాల విచారణ, బాధితుల ఆవేదన ద్వారా తెలిసింది. దీనిపై ఎస్పీని వివరణ కోరగా న్యాయపరంగా విచారించి తగిన చర్యలను తీసుకుంటామని తెలిపారు. -
ఎస్సీ రిజర్వేషన్ల శాతం పెంచాలి
కడప సెవెన్రోడ్స్ : ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని వెంటనే పెంచాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలైనా ఎస్సీలకు రిజర్వేషన్లు 15 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచకపోవడం విచారకరమన్నారు. కుల గణాంకాల సేకరణ చేపట్టి జనాభా మేరకు షెడ్యూల్ కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మాదిగ డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.నాగభూషణం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు ఆత్మహత్యకొండాపురం : మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన సోమల రామమోహన్రెడ్డి(40)బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఎస్. రామమోహన్రెడ్డి 3.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని కూరగాయల పంట సాగు కోసం అప్పులు చేశాడు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపంతో ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. రాజుపాళెంలో కొండ చిలువ కలకలం రాజుపాళెం : రాజుపాళెం గ్రామ శివారులో కొర్రపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న ఓ డీజిల్ బంక్, ఓ రైస్మిల్ సమీపంలో సోమవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో వాహనదారులు భయాందోళన చెందారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రొద్దుటూరు–ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో అడ్డంగా ఉండిపోయింది. దీంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు భయంతో వెనక్కి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత కొండ చిలువ పక్కనే ఉన్న చాపాడు కాలువ గట్టుపై ఉన్న గడ్డి, ముళ్లపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఉపిరి పీల్చుకొని ముందుకు కదిలారు. గతంలో కూడా ఇక్కడే ఓ కొండ చిలువ కనిపించడంతో ఆ దారిలో తిరిగే రైతులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు కొండ చిలువను పట్టుకొని కొండల్లో వదిలేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
పులివెందుల: రైతన్నలపై చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన బ్రాహ్మణపల్లె గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి రైతులు తమ దీనస్థితిని ఎంపీతో మొర పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అరటి ధరలు పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేకపోవడంతోపాటు అరటి కాయలు కొనేందుకు వ్యాపారస్తులు కూడా ముందుకు రాకపోవడంతో తోటలో చెట్లపైన అరటి కాయలు మాగి కుళ్లిపోతున్నాయని వాపోయారు. ఒకవేళ వ్యాపారస్తులు కొనేందుకు వచ్చినా టన్ను అరటి కాయలను రూ.1500ల నుంచి రూ.2500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎకరా పంట అరటి సాగు చేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అనేక కష్టాలు పడి అప్పులు చేసి పండిస్తే పంట చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కరోనాలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు.. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా అరటి రైతులకు ఇలాంటి విపత్కర పరిస్థితి లేదన్నారు. కరోనా సమయంలో అరటి రైతులు ఇబ్బందులు పడకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగనన్న అరటి కాయలను టన్ను రూ.4వేల ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎరువులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు పంట పెట్టుబడి కూడా అధికంగా ఉందన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ ప్రభుత్వంలో అరటి పంటకేకాక పత్తి, ఉల్లి, శనగలతోపాటు రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడంలేదన్నారు. పులివెందుల ప్రాంతంలో పండించే అరటిని దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. అరటి రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివెందులలో రూ.25కోట్లతో కోల్డ్ స్టోరేజ్ నిర్మించామని.. ఎన్నికలముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోల్డ్ స్టోరేజ్ను ప్రారంభించారన్నారు. టెండర్లు పిలిచి వినియోగంలోకి తెచ్చే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి అడ్డంకిగా మారిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 18నెలలవుతున్నా అనేకసార్లు కోల్డ్ స్టోరేజీని వినియోగంలోకి తేవాలని ప్రస్తావించినా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కోల్డ్ స్టోరేజీ వినియోగంలో ఉంటే అరటి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజీని వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు భాస్కర్రెడ్డి, రామచంద్రారెడ్డి, రసూల్, శివశంకర్రెడ్డి, పార్నపల్లె కిశోర్, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజం అరటి పంటల పరిశీలన -
‘సాయి’ మార్గం అనుసరణీయం
కడప సెవెన్రోడ్స్: శ్రీ సత్యసాయి మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ అదితి సింగ్, డీ ఆర్ఓ విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ’ అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని అన్నారు. ఆయన అందించిన ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్ ’ నినాదాన్ని ఆధ్యాత్మిక భావాలను అనుసరించాలని కోరారు. జేసీ మాట్లాడారు. ఎస్డీసీ వెంకటపతి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్ , కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
● అన్ని గ్రామాల్లో కమిటీలు
ప్రొద్దుటూరు : కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను గుర్తించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ, వార్డు కమిటీల నియామకాన్ని చేపట్టిందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. జిల్లాకు సంబంధించి తొలిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ గ్రామ, వార్డు కమిటీల ప్రతినిధుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగనన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతోపాటు మీ అందరి రెక్కల కష్టంతోనే పార్టీ నిలబడిందని అన్నారు. పార్టీని మరింత పటిష్టంగా, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన, పని చేస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలనే కారణంతో కమిటీల ఏర్పాటు జరుగుతోందని అన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత క్యూఆర్ కోడ్తో కూడిన ఐడీ కార్డులను మంజూరు చేస్తారని, భవిష్యత్తులో కమిటీ సభ్యులకు అన్ని విధాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్న వారినే కమిటీలో సభ్యులుగా నియమించాలని కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 120 యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి వార్డుకు సంబంధించి దాదాపు వంద మందితో కమిటీ సభ్యులను నియమిస్తారన్నారు. ఇందులో ఏడు విభాగాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండె చప్పుడు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలిపారు. ఇది ఉద్యమ పార్టీ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని కోరారు. మూడు మార్లు ముఖ్యమంత్రి అయిన బాబు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాష్ట్రానికి ఏమి చేయలేదని చిరత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. హామీలు అమలు చేయని బాబు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అన్ని పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వంలో రూ.3.30 లక్షల కోట్లు అ ప్పులు ఉంటే, పథకాలను సక్రమంగా అమలు చేయ ని చంద్రబాబు ఇప్పుటికే రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. వరద అభివృద్ధిపై దృష్టి సారించలేదు వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సుధీర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్ సహకారంతో ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరును అభివృద్ధి చేశారన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఎల్లో మీడియా అబద్ధాలే అన్నారు. ప్రొద్దుటూరులో తొలి సమావేశం నిర్వహించడం అభినందనీయం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిమాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమ ల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ కామనూరుతో సహా అన్ని గ్రామాలు, వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత ఎన్నికల వరకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్వగ్రామంలో పోలింగ్ జరగలేదని, గత ఎన్నికల్లో తన భార్యను ఏజెంట్గా కూర్చోబెట్టి ఎన్నికలు జరిపించామన్నారు. దాంతోనే వరద కుటుంబ సభ్యు లు ఎన్నికల ప్రచారం చేసి డబ్బు పంచారన్నారు. అక్కడ కూడా ప్రస్తుతం కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు పి.శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మల్లేల రాజారాంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ శారద, మున్సిపల్ చైర్పర్సన్ బి.లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్యాదవ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు బి.వంశీధర్రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రఓబుళరెడ్డి, వాసంతి తదితరులు పాల్గొన్నారు. -
పెన్నాలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
కడప అర్బన్/వల్లూరు: కడప నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఆదివారం రాత్రి వరకు లభ్యం కాలేదు. చెన్నూరు పోలీస్స్టేషన్ పరిధిలో వున్న వాటర్గండి పెన్నానదిలో ఈత కొట్టేందుకు కడప రామాంజనేయపురానికి చెందిన నరేష్(16), అశోక్నగర్కు చెందిన రోహిత్బాబు (16)తోపాటు మరో ముగ్గురు కలిసి వెళ్లారు. సర దాగా ఈతకొట్టారు. అదే సమయంలో సెల్ఫోన్లతో ‘రీల్స్’ కూడా చేసుకున్నారు. ఒక్కసారిగా నరేష్, రోహిత్బాబుతోపాటు అరుణ్ అనే విద్యార్థి కూడా గల్లంతయ్యారు. ఈ క్రమంలో అరుణ్ను దేవాలయం సమీపంలో వాచ్మెన్గా వున్న ఆంజినేయులు రక్షించా డు. నరేష్, రోహిత్బాబు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వీరితోపాటు వచ్చిన అశోక్నగర్, భానుప్రకాష్లను పోలీసులు విచారణ చేస్తున్నారు. నరేష్ (ఫైల్) రోహిత్బాబు (ఫైల్) మరో విద్యార్థిని కాపాడిన వాచ్మ్యాన్ సరదాగా ఈత కొట్టేందుకు ఐదుగురు వెళ్లి.. వాటర్ గండిలో రీల్స్ చేసి.. -
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
లెక్కలంటే.. చిక్కులని విద్యార్థులు గుబులు పడతారు. లెక్కల క్లాస్ అంటేనే భయపడతారు. ఆ భయం వద్దని.. లెక్కలకూ చిట్కాలు ఉంటాయని ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రెండోరౌండ్ మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్కు విద్యార్థుల నుంచి చక్కటిస్పందన లభించింది. కడప ఎడ్యుకేషన్: లెక్కలంటే అన్నీ చిక్కులే.. కొందిరికిదో బ్రహ్మపదార్థం. అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆసక్తికరం. చిన్నవయసులో నేర్చుకునే చిట్కాలు జీవితాంతం గుర్తుండిపోతాయనేది నిపుణుల మాట. విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టి.. వారిలో గణితంపై ఆసక్తి పెంచేలా.. చిన్న చిన్న సమస్యలు మొదలు.. వారి స్థాయిని అనుసరించి నిర్వహించిన సాక్షి మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కడప నగరంలోని జీఎంఆర్ స్కూల్లో నిర్వహించిన మ్యాథ్ ‘బి’ రెండోరౌండ్ కాంపిటీషన్ ఆదివారం నాలుగు కేటగిరీలుగా నిర్వహించారు. కేటగిరీ– 1లో 1, 2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3,4 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–3లో 5, 6,7 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–4లో 8, 9,10 తరగతుల విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. కడపకు చెందిన నాగార్జున మోడల్స్కూల్, హైదరాబాద్ పబ్లిక్స్కూల్, జీఎంఆర్ హైస్కూల్, చైతన్య స్కూల్, వేంపల్లి, నేతాజీ స్కూల్, గురజాల, సింహాద్రిపురం విద్యార్థులు హాజరై కాంపిటీషన్లో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.ఈ కాంపిటీషన్ను ‘సాక్షి’ బ్రాంచి మేనేజర్ హరినాథరెడ్డి పర్యవేక్షించారు. పోటీతత్వం పెరుగుతుంది.. స్పెల్ ‘బి’, మ్యాథ్ ‘బి’ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు హాజరుకావడం ద్వారా పోటీ తెలుస్తుంది. మనం ఏస్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. మన ప్రతిభను అంచనా వేసుకునేందుకు ఇటువంటి కాంపిటీషన్స్ ఉపయోగపడతాయని భావిస్తున్నా. – చర్విత, శివశివాణి స్కూల్, కడప భయం పోయింది.. కాంపిటీషన్లో పాల్గొనేందుకు వందల్లో పదాలను నేర్చుకోగలిగా. దీంతో నాకు ఇంగ్లీషుపై భయం పోయి మక్కువ పెరిగింది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ స్పెల్లింగ్స్ నేర్చుకోవడం నాకు అకడమిక్గా కూడా ఉపయోగకరం. – జువైన్, జీఆర్టిజీవీకే స్కూల్, కడప మ్యాథ్స్ అంటే ఎంతో ఇష్టం.. నాకు గణితమంటే ఎంతో ఇష్టం. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్లో పా ల్గొనేందుకు వచ్చాను. ఈ కాంపిటీషన్ ఎంతో బాగుంది.– నిరంజన్రెడ్డి, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, కడప గణిత భావనలపై పట్టు సాధించేందుకు.. గణితంలో రాణిస్తే అన్నింటా రాణించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మ్యాథ్‘బీ’లో సత్తా తెలుసుకునేందుకు వచ్చాను. కాంపిటీషన్ చాలా బాగుంది. –భవశ్రీ, నేతాజీ స్కూల్, సింహాద్రిపురం మ్యాథ్స్ మేడ్ ఈజీ.. గణితం అంటే ఎంతో ఇష్టం. గణితాన్ని సులువుగా నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధమవుతుంటా. గణితంపై ఉన్న ఆసక్తే నన్ను కాంపిటీషన్లో పాల్గొనేలా చేసింది. – సాయి ప్రవీణ, జీఎంఆర్ స్కూల్, కడప -
స్పెల్బీకి చక్కటి స్పందన
కడప ఎడ్యుకేషన్: సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ ‘బి’ కాంపిటీషన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన స్పెల్ ‘బి’ కాంపిటీషన్ లెవల్–2కు అపూర్వ స్పందన లభించింది. ఈ కాంపిటీషన్కు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ కాంపిటీషన్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆంగ్లంపై ఉన్న భయాన్ని పోగొట్టేలా.. భాషపై పట్టుసాధించేలా కాంపిటీషన్ ఉందంటూ విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఏడాది సాక్షి మీడియా గ్రూప్ స్పెల్ ‘బి’ లెవల్–2 కాంపిటీషన్లో కేటగిరీ–1లో 1,2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4, కేటగిరీ–3లో 5,6,7, కేటగిరీ–4లో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్కు జిల్లాలోని కడపకు చెందిన నాగార్జున స్కూల్తోపాటు మోంట్ఫోర్టు, శివశివాణి, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, జీఆర్టీ, జీవీఆర్ స్కూల్, లిటిల్ప్లానెట్ స్కూల్, నేతాజీ స్కూల్, గురజాల, వేంపల్లి శ్రీ చైతన్య స్కూల్, వేంపల్లి నుంచి విద్యార్థులు హాజరయ్యారు. 2025 -
విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది భాషోపాధ్యాయులే
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది భాషోపాధ్యాయులేనని పంచసహసస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, సంస్కృతి సేవాసమితి ఆధ్వ ర్యంలో ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కడప మమతల గడప, నా ఉనికికి చిరునామా, నేను కడప వాసిని అని, ఇక్కడ రామకృష్ణ జూనియర్ కళాశాలలో అధ్యా పకుడిగా పని చేశానన్నారు. భాష ఉంటేనే మానవుని మనుగడ, సంస్కృతి ఉంటుందన్నారు. అటువంటి భాషలపై విద్యార్థులు పట్టు సాధించడం కోసం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ భాషాంశాలతో పాటుగా రామాయణంపై పోటీ పెట్టడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. అనంతరం ప్రతిభా పరీక్ష విజేతలలో మొదటి బహుమతి విజేత కలిసెట్టి పూర్ణచంద్ర జెడ్పీ హైస్కూల్ దొమ్మర నంద్యాల (మైలవరం మండలం) రూ.5000, ద్వితీయ బహుమతి కె.అభినయశ్రీ జెడ్పీ హైస్కూల్ (సింహాద్రిపురం) రూ.3500, తృతీయ బహుమతి టి.వెంకట హారిక జెడ్పీ హైస్కూల్ (పెద్దముడియం), సుధశ్రీ జెడ్పీ హైస్కూల్ (వీరబల్లి)రూ.1000తోపాటు పదిమంది విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డి.కె.చదువులబాబు, డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, అంకాల్ కొండయ్య, గంగాధర్, గుండ్లమడుగు నరసింహ సాయికుమార్, వెంకట ప్రసాద్, సాయి ప్రసాద్, ఇటీవల పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, డీఈఓ పూల్ నుంచి పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులు, జిల్లాలోని తెలుగు, హిందీ భాషోపాధ్యాయులు, మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ -
‘గండికోట’అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్రోడ్స్: సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయనున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు నాంది పలికిందన్నారు. జనవరి నెలలో గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందే పూర్తికావాల్సిన ఎంట్రన్స్, వెలివేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లను ఆదేశించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించి మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ పథకం ద్వారా రూ.79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. గ్రాండ్ కాన్యన్ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలీరైడ్స్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఏపీటీడీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెంచలయ్య, కన్సల్టెంట్లు సాజిత్ షేక్, సుమన్ దాస్, విజయ్ కుమార్ బండి, కాంట్రాక్ట్ ప్రతినిధి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
నేడు గ్రామ, వార్డు కమిటీల సమావేశం
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామ, వార్డు కమిటీల నియామకం పూర్తయింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం దొరసానిపల్లెలోని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 3వేల మందితో, మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 3వేల మందితో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా కమిటీల నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, పరిశీలకుడు పూల శ్రీనివాసులరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డితోపాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కర్నూలులో ఈ నెల 23న జరిగే ఎస్జీఎఫ్ అండర్–19 రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు అబ్జర్వర్గా పోలంకి గణేష్బాబును నియమించారు. ఈయన రామన్నపల్లి జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి 29 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 రగ్బీ పోటీలో పాల్గొనే ఏపీ జట్టును ఎంపిక చేయనున్నారు. గణేష్ బాబు -
మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే రెండు వేల మందితో వస్తా
కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే 200 మందితో కాదు 2వేల మందితోనైనా వస్తానని, అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడబోమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆమె భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలపై నిప్పులు చెరిగారు. కడప నగర అభివృద్ధిపై ఆ భార్యాభర్తలకు ధ్యాసలేదన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్లు చేసిన ఘనకార్యాలు ఏంటంటే... బుగ్గవంకను ఏటీఎంలా మార్చుకున్నారని, రూ.3.60 కోట్లు ఖర్చు చేసి బుగ్గవంకలో చెట్లు పీకారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అవి మళ్లీ యథావిధిగా పెరిగాయన్నారు. కడప నగర ప్రథమ పౌరుడైన సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించి కడపలో చెత్త రాజకీయాలు, చెత్త సంస్కృతిని తీసుకొచ్చారన్నారు. తమ చుట్టూ దండు పాళ్యం బ్యాచ్ను తయారు చేసుకున్నారని, ఆ బ్యాచ్ కడపను వాటాలుగా పంచుకొని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారు రేపు కార్పొరేటర్లు అయితే కడప పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేకు, ఆమె భర్తకు కడప అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే తమ ప్రభుత్వంలో కడపకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని బ్రహ్మం సాగర్ నుంచి 1.5 టీఎంసీలను కేటాయించి, రూ.570 కోట్లతో తీసుకొచ్చిన స్కీంను పూర్తి చేయించాలని సవాల్ విసిరారు. దావత్ అంటే తెలియని వారు దాని గూర్చి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. డాక్టర్లు, ఫార్మసిస్టులు, మైనింగ్, రియల్ వ్యాపారులు, వైన్షాపులు, బార్ల యజమానులు, చివరకు తోపుడు బండ్ల వారి దగ్గరి నుంచి కూడా శవాలపై చిల్లర ఏరుకునేది మీరేనని ఆరోపించారు. టీడీపీలోకి తనకు రెండు సార్లు ఆహ్వానం వచ్చినా నైతిక విలువలకు కట్టుబడి పార్టీ మారలేదని, కానీ శ్రీనివాసులరెడ్డి ఏ గాలికి ఆ చాప, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకమని ఎద్దేవా చేశారు. రాబోవు రోజుల్లో తమదనే రోజు వస్తుందని, ఎవరి నోటికి తాళం వేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. . మేం చేసిన అభివృద్ది ఇదీ... ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఏడు రహదారులను విస్తరణ చేసి 10 అందమైన సర్కిళ్లు నిర్మించామన్నారు. రిమ్స్ను మల్టీ స్పెషాలిటీ హాస్సిటల్గా అప్గ్రేడ్ చేసి, మానసిక వైద్యశాల, కేన్సర్ ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆసుపత్రులను తీసుకొచ్చామన్నారు. 12 పీహెచ్సీలు నిర్మించి, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేశామని, రూ.69 కోట్లతో 23 వరదనీటి కాలువలు నిర్మించామన్నారు. రూ.58 కోట్లతో బుగ్గవంక ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి, బుగ్గవంకపై నాగరాజుపేట, షహమీరియా మసీదు వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరు చేయించామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పి. జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, టీపీ వెంకట సుబ్బమ్మ, షఫీ, బాలస్వామిరెడ్డి, త్యాగరాజు, కిరణ్, బసవరాజు, రమేష్రెడ్డి, సింధేరవి, నాగేంద్ర(బుజ్జి), కంచుపాటి బాబు, ఎస్. బాదుల్లా పాల్గొన్నారు. కడప అభివృద్ధిపై మీకు ధ్యాస లేదు శవాలపై చిల్లర ఏరుకునేది మీరే బుగ్గవంకను ఏటీఎంగా మార్చుకున్నారు దండు పాళ్యం బ్యాచ్ను తయారు చేసి కడపను పంచుకున్నారు ఎవరి నోటికి తాళం వేయాలో ప్రజలే నిర్ణయిస్తారు కడప ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
అన్ని విధాలా నష్టమే..
ముందుగా సాగుచేసిన వరిపంట కోతకు సిద్ధంగా ఉంది. సిద్ధమైన వరిపంటను కోసేందుకు చాలామంది రైతులు వరిపంట భూములను ఆరబెట్టుకున్నారు. ఇప్పుడేమో వర్షం రాకతో నేల తడిగా మారింది. దీంతో పెద్దమిషన్ల(టైర్ల మిషన్)తో కోతలు కోసుకునేందుకు వీలుకాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. టైర్ల మిషనైతే గంటకు 18 వందల నుంచి 2 వేలు ధర ఉంది. ప్రస్తుతం బురద ఉండడంతో చైన్ మిషన్తో కోత కోసుకోవాలి. చైన్ మిషన్ గంటకు రూ. 3500 అవుతుందని దీంతో ఖర్చు పెరుగుతుందని పైగా పశువుల మేతకు చెత్త పనికిరాకుండా పోతుందని పలువురు రైతులు వాపోతున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రాజుపాళెం : మండల పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన ఎత్తపు శ్రీనివాసులరెడ్డి (50) అనే వ్యక్తి శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి తన ఇంటిలో అమర్చుకున్న ఇన్వర్టర్ బ్యాటరీకి ఉన్న విద్యుత్ వైర్లను తీస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ కొట్టి పడిపోయాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీనివాసులరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కూటమి వర్గీయుల మధ్య ఘర్షణ ముద్దనూరు : కూటమి వర్గీయుల మధ్య శనివారం సాయంత్రం ఘర్షణ జరిగింది. స్థానికంగా నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్డు విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగినట్లు, ఈ ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లోని గ్రామాల్లో రైతుల పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కేబుల్ వైర్లను దొంగలించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన సీఐ ఎన్వీ రమణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన జాఫర్ షరీఫ్. రషీద్లతోపాటు సురేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తూ నియోజకవర్గంలోని అరటి తోటల రైతుల వద్దకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లి బెంగుళూరులో విక్రయించేవారన్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని, ఈ నేపథ్యంలో రూరల్ సీఐ రమణ, లింగాల ఎస్ఐ అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో వీరిని అరెస్టు చేశామన్నారు. సుమారు రూ.3లక్షలు విలువ చేసే కాపర్ వైర్లతోపాటు మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
27 నుంచి సెమిస్టర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాలల మూడో సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27,29 డిసెంబర్ 1,3,5,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1గంట వరకూ పరీక్షలు జరుగుతాయని అందులో పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 25వ తేది ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రధా నాచార్యులు టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు పిహెచ్డి./ఎం.టెక్. (ఏదైనా కంప్యూటర్ స్ట్రీమ్) / ఎంసీఏ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థుల బయోడేటా, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు అలానే సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల సెట్తో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.జి.రవీంద్రనాథ్ తెలిపారు. బీఏ (స్పెషల్ తెలుగు, హిస్టరీ,ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఉర్దూ) , బీకాం జనరల్, బీబీఏ కంప్యూటరు అప్లికేషన్స్, బీఎస్సీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మాథమాటిక్స్, జియాలజీ, బయో టెక్నాలజీ, స్టాటి స్టిక్స్, కంప్యూటరు సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) and dairy science ఆనర్సు మొదటి సంవత్సరం కోర్సుల కోసం అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. అడ్మిషన్లకు నవంబర్ 24 చివరితేదీ అని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో నేరుగా సంప్రదించి అడ్మిషన్లు పొందాలని ప్రిన్సిపాల్ సూచించారు. ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మున్సిపల్ ఇన్చార్జి మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్ను ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ సొసైటీ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ నేతగా ఉన్న ముక్తియార్ ప్రస్తుతం అంజుమన్ అహలె కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు ముక్తియార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముక్తియార్ మాట్లాడుతూ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. -
బచావత్ ట్రిబ్యునల్పై సమీక్ష చట్టవిరుద్ధం
కడప కార్పొరేషన్: బచావత్ ట్రిబుల్ అవార్డుపై పునః సమీక్ష చేయడం అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్ట ప్రకారం విరుద్ధమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నా రు. కేడబ్ల్యూడిటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్టే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోందని, ట్రిబ్యునల్ విచారణ చేస్తుండగానే అదనంగా 372.54 టీఎంసీలు తరలించేలా, 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో.. ఒక్క టీఎంసీ తగ్గినా చంద్రబాబే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మా రుతుందని తెలిపారు. 1995–2004 మధ్య చంద్రబాబు నిర్వాకం వల్లే కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తును 524.25 మీటర్లకు పెంచేసిందని, ఇప్పుడు నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోంది.. దీని వల్ల ఆల్మట్టిలో అదనంగా వంద టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటుందని విమర్శించారు. మోంథా తుపాను వల్ల లక్షలాది పంట నష్టం జరిగిందన్నారు. ఆ పంట నష్టం కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందన్నారు. అరటి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, టన్ను రూ.30వేలు పలికే అరటి రూ.500లకు కూడా అమ్ముడుపోవడం లేదని, అంటే కేజీకి రూ.50పైసలు కూడా రావడం లేదన్నారు. ఇంత దారుణంగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం దారుణమన్నారు. ఇప్పటికై నా మేలుకొని రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా? అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుంది అరటి రైతులను వెంటనే ఆదుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ -
కనీస మద్దతు ధరతో వరి కొనుగోలు
– జాయింట్ కలెక్టర్ కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో జిల్లాలో పౌరసరఫరాలసంస్థ ద్వారా వరి కొనుగోలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రకం క్వింటాలుకు రూ. 2369, గ్రేడ్–ఏ రకం రూ. 2389 చొప్పున రైతుల నుంచి సేకరిస్తామన్నారు. మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 19వ తేదీ నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ–క్రాప్, ఈకేవైసీతోపాటు తమ పేర్లు నమోదు చేయించుకున్న రైతులు మాత్రమే వరి విక్రయించేందుకు అర్హులన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న వరి మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. రవాణా ఖర్చులు రైతులే భరించాలని, ప్రభుత్వం ఆ తర్వాత రైతు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తుందన్నారు. హమాలీ, గోనె సంచులను పౌరసరఫరాల సంస్థే సరఫరా చేస్తుందన్నారు. లేదా రైతులే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఆ ఖర్చులను రైతులకు చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలు.. బి.కోడూరు, బ్రహ్మంగారిమఠం, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, సీకే దిన్నె, దువ్వూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, బద్వేలు, కలసపాడు, ఖాజీపేట, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, సిద్దవటం, కాశినాయన, వల్లూరు, వేంపల్లె, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల, కొండాపురం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జేసీ వివరించారు. గుడి తిరునాల ఏర్పాట్ల పరిశీలన కలసపాడు : కలసపాడులో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరగనున్న గుడి తిరునాల ఏర్పాట్లను పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమసుందర్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ వారితో వాహనాల పార్కింగ్, జన సేకరణపై డీనరీ చైర్మన్ ఆనంద్కుమార్తో కలిసి చర్చి ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల, కాశినాయన ఎస్ఐలు కొండారెడ్డి, యోగేంద్ర, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ దువ్వూరు : దువ్వూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రోషిణి, హేమలత, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రాజుపాళెం : పుట్టు అంధుడైన సంజీవరాయశర్మ గణిత పరిజ్ఞానంలో అపర ప్రజ్ఞాశాలి అని మండల విద్యాశాఖాధికారి ప్రసాద్ తెలిపారు. రాజుపాళెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంజీవరాయ శర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ అన్ని తెలిసిన వారే లెక్కల్లో తప్పులు చేస్తూ తడబడుతూ ఉంటారన్నారు. అలాంటిది అంధుడైనా లెక్కలు అలవోకగా చెప్పగల సమర్థుడు సంజీవరాయ శర్మ అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వసుంధరదేవి, విజయమోహన్రెడ్డి తెలిపారు. క్రీడా స్ఫూర్తితో రాణించాలి పులివెందుల టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ఎస్జీఎఫ్ ఇంటర్ జిల్లా స్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీకాంత్రెడ్డి, విక్టర్ ఇమ్మానుయేల్, శివశంకర్రెడ్డి, ప్రవీణ్ కిరణ్, విజయ ప్రసాద్రెడ్డి, కొండారెడ్డి, రామాంజనేయులు, ఎంఈఓలు రామానాయుడు, రామచంద్రారెడ్డి, అంగడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో అనధికార లే అవుట్లు, నియమ నిబంధనలు ఉల్లంఘించిన భవన నిర్మాణాలు చేపడుతున్న వారు వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి జనవరి 23 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం బీపీఎస్ 2025 అనే పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ యేడు ఆగస్టు 31వ తేదికి ముందు నిర్మించిన భవనాలకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఈ పరిధిలోకి వస్తాయన్నారు. అక్టోబరు 23 నాటికి ముగిసిన అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీరణకు మరో మూడు నెలలు గడువు పొడిగించారన్నారు. ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరణ చేసుకోని ప్లాట్లకు బిల్డింగ్ అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావన్నారు. ఇతర వివరాలకు 98499 66639, 91779 93386 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిపాలన అధికారి ఖాదర్బాష, కుడా ఏపీఓ సీడీ కృష్ణసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజోలి ఉన్నట్టా...లేనట్లా ?
కడప సిటీ : కుందూనదిపై నిర్మించతలపెట్టిన రాజోలి రిజర్వాయర్ ఉన్నట్లా..లేనట్లా? అన్న అనుమానం రైతాంగంలో కలుగుతోంది. 2004లో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా అందులో ఉన్నారు. ప్రస్తుత పరిహారం రైతులకు ఎకరాకు రూ. 12.50 లక్షలు ఇస్తామని అధికారులు తేల్చారు. ఇదిలా ఉండగా, ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి రూ. 25 లక్షలకు పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆది హామీ నెరవేరలేదు. ప్రస్తుతం ఉన్న రూ. 12.50 లక్షలు కూడా ఏ రైతుకు అందకపోవడంతో అసలు రాజోలి ఆనకట్ట నిర్మిస్తారా? లేక ఎగనామం పెడతారా? అన్న అనుమానం కలిగి ఎవరికై నా ఇతరులకు అమ్ముకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో కనీసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయ్యాక, రేటు నిర్ణయించాక పరిహారం ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఈ ఆలోచన రైతుల్లో మొదలైంది. రాజోలి ఉన్నట్టా...లేనట్లా....? కుందూ నదిపై రాజోలి వద్ద రిజర్వాయర్ నిర్మించేందుకు 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యేటా వృథాగా పోయే సుమారు 60 టీఎంసీల నీటిని ఒడిసి పట్టి అదనంగా వేలాది ఎకరాలకు నీరందించడంతో పాటు ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించడమే కాకుండా జమ్మలమడుగు పరిధిలోని ఉక్కు పరిశ్రమకు నీటి కేటాయింపులు కూడా ఈ ప్రాజెక్టు నుంచే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీగానీ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్మాణానికి పూనుకోలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందుకు రూ. 1375.10 కోట్లు నిధులు అవసరమని తేల్చారు. టెండరులో ఈ పనులను ఎంఆర్కేఆర్, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలు కుందూనది ప్రాంతంలో కొంత పనులు చేపట్టారు. కానీ బిల్లులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. రాజోలికి పైన కర్నూలు జిల్లాలోని జొలదరాశి, కుందూ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యయాన్ని ఖర్చుపెట్టేందుకు నిర్ణయించారు. రైతులకు అందని పరిహారం రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపట్టేందుకు జమ్మలమడుగు పరిధిలోని నెమ్మళ్లదిన్నె, ఉప్పలూరు, బలపనగూడూరు, గరిశలూరు, చిన్నముడియం గ్రామాలను ముంపు గ్రామాలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇక్కడున్న ప్రజలంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఎకరాకు రూ. 12.50 లక్షలు పరిహారం ఇస్తామని అధికారులు, రైతుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఇందుకు అంగీకరించారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు అందలేదు. ‘ఆది’ హామీ ఏమైంది? అమ్మకు బువ్వ పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న సామెత ఉంది. రాజోలి పరిహారం విషయంలో కూడా ఈ సామెత వర్తించేలా కనిపిస్తోంది. ప్రకటించిన రూ. 12.50 లక్షలు పరిహారం ఇవ్వకపోగా, ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అంతకు రెడింతలు పెంచి రూ. 25 లక్షలు ఎకరాకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటింది. అసలు ఆది హామీ నెరవేరుస్తారా? లేదా? అన్న అనుమానం రైతాంగంలో వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు రాజోలి ఆనకట్ట నిర్మాణానికి అధికారులు భూ సేకరణ చేపట్టారేగానీ ఆనకట్ట కట్టింది లేదు.. రైతులకు పరిహారం ఇచ్చింది లేదు.. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1బీ, అడంగల్ మాత్రమే వస్తోందని, రిజిస్ట్రేషన్ కాకుండా అధికారులు హోల్డ్లో పెట్టడం వల్ల భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని ఆందోళనలో ఉన్నారు భూ సేకరణతో ఆగిన రాజోలి ఆనకట్ట పనులు ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందని పరిహారం ఎన్నికల్లో ఎకరాకు రూ. 25 లక్షలు పరిహారం ఇస్తామని ‘ఆది’ హామీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైనా రాజోలి ఊసే లేని వైనం నిరాశ నిస్పృహల్లో రైతాంగం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి -
● జిల్లా అంతటా వర్షం
కడప అగ్రికల్చర్: మొన్న ఖరీఫ్లో జరిగిన పంట నష్టం నుంచి అన్నదాత ఇంకా కోలుకునేలేదు.. నిన్న మోంథా తుపాన్ చేసిన గాయమా ఇంకా మానలేదు..ఇంతలోనే మరో ‘తుపాన్’ ముంచేకొస్తుందంటూ అధికారులు చేస్తున్న ప్రకటనతో రైతుల్లో గుబులు మొదలైంది. పంట చేతికొచ్చే చి‘వరి’ దశలో అన్నదాత ఆశలపై వర్షం గండికొట్టేలా ఉంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వరి కోత మొదలు పెట్టిన రైతుల్లో కలవరపరుస్తోంది. దీంతో పాటు శనగ, పత్తి, రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో వరి కోత పనులను నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ రైతులను సూచించారు. చినుకు.. కంటిపై కునుకు లేకుండా... సెన్యార్ తుపాన్ హెచ్చరికలు రైతులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో చాలా చోట్ల వరి పంట చిరుపొట్ట, కోత దశల్లో ఉంది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వాన చినుకులు.. ఈ తుపాన్ హెచ్చరికలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వరి కోతలను ప్రారంభించిన రైతన్నల్లో అలజడి మొదలైంది. కొంతమంది రైతులు కోసిన వరి ధాన్యాన్ని రోడ్లుపైన, మెట్టప్రాంతాల్లో ఆరుబెట్టుకుంటున్నారు. కానీ వర్షం దాగుడుమూతలు ఆడుతుండడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. పచ్చిధాన్యం కావడంతో పట్టల కింద రెండు మూడు రోజులు ఉంచితే ఉక్కతో దెబ్బతినే ప్రమాదం ఉంటుందని రైతులు దిగాలు పడుతున్నారు. అక్కడక్కడ నేలకొరుగుతున్న వరిపంట... ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట పలు చోట్ల నేలకొరుగుతోందని రైతులు తెలిపారు. వరిపంటలో అంతో ఇంతో నెమ్ము ఉంటుంది. పైగా ఈ వర్షం కారణంగా నేల మరింత నెమ్ము వచ్చే అవకాశం ఉండటంతో కిందపడిన వరి కంకులకు మొలకలు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చాపాడు, ప్రొద్దుటూరు, మైదుకూరు, సిద్దవటం, ఖాజీపేటలతోపాటు పలు మండలాల్లో అక్కడక్కడ వరికోతలను ప్రారంభించారు. శనగ, మినము, నువ్వు రైతల్లో గుబులు..... మోంథా తుపాన్కంటే ముందు కురిసిన పదును వర్షాలకు చాలా మంది రైతులు మినుము, శనగ, నువ్వు పంటలను సాగు చేసుకున్నారు. తరువాత మెంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురి సిన వర్షాలకు మినుము, శనగ, పత్తి చాలా చోట్ల తెబ్బతింది. ఆ తరువాత చాలా మంది రైతులు దెబ్బతిన్న ఆరుతడి పంటలను దున్నేసి మళ్లీ మినుము, శనగ, నువ్వు పంటలను సాగు చేసుకున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతోపాటు సెన్యార్ తుఫాన్ హెచ్చరికలతో ఆ రైతుల్లో గుబులు నెలకుంది. వరుస తుఫాన్లు రైతులను కకావికలం చేస్తున్నాయి. మోంథా గాయం మానకముందే ముంచుకొస్తున్న మరో తుపాన్ జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల్లో అందోళన.. కోతలను వాయిదా వేసుకోవాలంటున్న అధికారులు కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం జిల్లా అంతటా వర్షం కురిసింది. జిల్లాలోని ముద్దనూరు మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా పెండ్లిమర్రిలో 37.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్టలో 35.4 మి.మీ, వేములలో 35, కడపలో 27.4, వల్లూరులో 24.8, ఆట్లూరులో 24.2, సికెదిన్నెలో 23.4, జమ్మలమడుగులో 20.4 , సిద్దవటంలో 17.4 , చెన్నూరు, ఖాజీపేటలలో 16.4, పులివెందుల్లో 15, కలసపాడు, కమలా పురంలలో 14.2, చక్రాయపేటలో 12.2, గోప వరంలో 12, వేంపల్లి, వీఎన్పల్లిలలో 9.6, బి.మఠంలో 8.2, రాజుపాలెంలో 8, బద్వేల్లో 7.2 , మైలవరం, దువ్వూరులలో 6.4, వేంపల్లి, బి.కోడూరులలో 4.6, పోరుమామిళ్ల, చాపాడులలో 4.2, కాశినాయనలో 4 , సింహాద్రిపురం, కొండాపురంలలో 3.4, పెద్దముడియంలో 3.2, మైదుకూరులో 3, తొండూరులో 2.4, ముద్దనూరు, ఎర్రగుంట్లలో 1 మి.మీ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. -
రేపు జాబ్మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసి సోలార్లో అనుభవంగల యువతకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని ఇంజనీర్స్ భవన్లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 63027 02399, 70323 25252 నెంబరులో సంప్రదించాలని సూచించారు. -
మేం చెప్పిన పని చేయాల్సిందే..
రెండో రోజూ సెక్యూరిటీ గార్డులతో చాకిరి చేయించిన అధికారులు ప్రొద్దుటూరు క్రైం : బానిసత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుత్రికి వస్తే బానిసత్వం అనే పదానికి సరైన నిర్వచనం తెలుస్తుంది. ఇక్కడి కింది స్థాయి సిబ్బంది అయిన సెక్యూరిటీ గార్డులతో అధికారులు బలవంతంగా చాకిరి చేయిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పత్రిలోని వివిధ విభాగాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే ఆయా విభాగాల్లో ఉన్న పరికరాలను మరో చోటికి తరలించాలి. అన్ని విభాగాలను ఖాళీ చేస్తే పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ తెగేసి చెప్పేశాడు. ఆస్పత్రి అధికారులు మరోమాట మాట్లాడలేదు. ఒక గంటో, రెండు గంటల్లో అయిపోయే పని అయితే అందరూ తలో చెయ్యివేసి చేసుకోవచ్చు. అయితే నాలుగైదు రోజుల పాటు పని చేసినా పరికరాలు తరలించే ప్రక్రియ పూర్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బయటి నుంచి పని వారిని పిలిపించి ఆస్పత్రికి సంబంధించిన పనులను చేయించాల్సి ఉంది. ఎందుకో మరి ఆస్పత్రి అధికారులు ఆ దిశగా ఆలోచించలేదు. మేం చెప్పిన ఏ పనైనా చేయాల్సిందేనని చిరు ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు. దగ్గరుండి మరీ సెక్యూరిటీ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. ఇది తమ పని కాదని మొత్తుకున్నా వారు కనికరించలేదు. మన పనులు మనం చేసుకుంటే తప్పేంటని కొందరు అధికారులు నీతులు వల్లిస్తున్నారు. రెండు రోజులుగా గొడ్డు చాకిరి.. ఆస్పత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. ఆస్పత్రిలోని ఏ ఒక్క పరికరం బయటికి వెళ్లకుండా కాపలా కాయాల్సిన బాధ్యత సెక్యూరిటీ గార్డులదే. జిల్లా ఆస్పత్రిలో 55 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఉదయం షిఫ్ట్లో 28 మంది పని చేస్తారు. సెక్యూరిటీ విధులను పక్కన పెట్టించి వారితో అధికారులు పనులు చేయిస్తున్నారు. గురువారం, శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది ఓటీ మిషన్లు, మంచాలు, కుర్చీలు, ఏసీలు, బీరువాలు, ఇతర బరువైన పరికరాలను కంటి విభాగం నుంచి మరో చోటికి తరలించారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఎమ్మెల్యేకు చెబుతాం అంటూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. పాపం చిరు ఉద్యోగులు నోరు మెదపకుండా చాకిరి చేయాల్సి వచ్చింది. కార్మికులకు చట్టాలు ఉన్నా అవి ఎందుకు పనికి రావనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చట్టాలను కాపాడాల్సిన అధికారులే కాలరాస్తున్నారని పలువురు వాపోతున్నారు. -
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం
18 నెలల నుంచి కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం ● చంద్రబాబు అధికారంలోకి రాగానే కక్ష ● నిర్మాణ సంస్థ రాక్రీట్కు బిల్లులు నిలుపుదల ● ఎక్కడికక్కడే ఆగిన పనులు ● పూర్తి చేయాలని కోరుతున్న లబ్ధిదారులు ● ఆర్డీఓకు వైఎస్సార్సీపీ నాయకుల వినతిపులివెందుల : పులివెందులలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో అంతులేని జాప్యం జరుగుతోందని మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. స్థానిక మినీ సెక్రటేరియట్లోని ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న ఆర్డీఓ చిన్నయ్యకు వారు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో పులివెందుల పట్టణంలో అన్ని వసతులతో కూడిన దాదాపు 8 వేల గృహాల ఏర్పాటు కోసం జగనన్న మెగా హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే కుట్రపూరిత ఉద్దేశంతో కొంత మంది టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. గృహ నిర్మాణాలు ప్రారంభం కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చారని తెలిపారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కోర్టు తీర్పుతో 2021లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారన్నారు. త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో చదరపు అడుగుకు రూ.1800 చొప్పున అత్యంత తక్కువ ధరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని.. రాక్రీట్, డీఈసీ కంపెనీలకు పులివెందుల పట్టణంలోని గృహాల నిర్మాణ బాధ్యతలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో గృహ నిర్మాణ పనులు అప్పగించడం జరిగిందన్నారు. 2022 మార్చిలో ఊపందుకున్న గృహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ 2024 జనవరి వరకు దాదాపు 6795 గృహాలు వివిధ నిర్మాణ దశలలో పురోగతి సాధించడం జరిగిందన్నారు. నిర్మాణ సామగ్రిని చోరీ చేస్తున్న వైనం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాక్రీట్ సంస్థ గృహ నిర్మాణాల కోసం పులివెందుల మెగా హౌసింగ్ కాలనీలో పెద్ద ఎత్తున సిద్ధం చేసుకున్న సిమెంట్, ఇటుకలు, కంకర, భారీస్థాయి కాంక్రీట్ పరికరాలు, మోటార్లు వంటి వాటిని కొంత మంది టీడీపీ నాయకులు, అనుచరులు అక్రమంగా దొంగలించి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతటితో ఆగక పులివెందుల మినహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలకు రూ.38 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, రాక్రీట్ సంస్థకు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వకుండా కక్ష పూరితంగా వ్యవహరించడంతో నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయి అటకెక్కడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, లేదంటే బిల్లులు చెల్లిస్తామనే హామీ రాతపూర్వకంగా కోర్టు ద్వారా ఇస్తే పనులు పూర్తి చేస్తామని రాక్రీట్ సంస్థ 18 నెలల క్రితం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులను గందరగోళానికి గురి చేసే కుట్ర లబ్ధిదారుల(కాంట్రిబ్యూషన్)వంతుగా జమ రూ.35 వేల డబ్బుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, వారు జమ చేసిన డబ్బు మున్సిపల్ కమిషనర్ ఖాతాలో ఉన్నాయనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, మున్సిపల్ కమిషనర్తో ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేయించాలన్నారు. పులివెందుల పురపాలక పరిధిలో పేదల గృహ నిర్మాణాల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న మెగా హౌసింగ్ కాలనీపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత ధోరణి విరమించుకోవాలన్నారు. పేదల కోసం చేపట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్మించే గృహ నిర్మాణాలు పూర్తి కావాలని ఏ మాత్రం చిత్తశుద్ధిలేని ఈ స్థానిక టీడీపీ నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ రాక్రీట్ సంస్థ వేసిన అఫిడవిట్కు 18 నెలలు కావస్తున్నా కౌంటర్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే ఇంకో 9 నెలల్లో గృహ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రజలు పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక పులివెందుల ప్రజలపై టీడీపీ ప్రభుత్వ కపట ప్రేమ తేటతెల్లమవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క గృహ నిర్మాణం కూడా జరగకుండా నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. సీవేజ్ లాంటి సదుపాయాలు పూర్తి కాకపోవడం వలన జగన్ ప్రభుత్వంలో పూర్తయిన 800పై చిలుకు గృహాలలో కూడా లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయలేని పరిస్థితి ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు రూ.140 కోట్లతో ఈ కాలనీలో రోడ్లు, విద్యుత్ లైన్లు, బోర్లు, పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టి దాదాపు 75 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. ఆ కాంట్రాక్టర్కు కూడా చంద్రబాబు సర్కారు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. -
దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
సిద్దవటం: దోమలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కడప డీఎంహెచ్ఓ నాగరాజు పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పార్వతీపురం గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ రాత్రివేళల్లో దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు తప్పకుండా వాడాలన్నారు.దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇంటి పరసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు.శుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. కుష్టు వ్యాధి సర్వేలో భాగంగా వ్యాధిగ్రస్తులను పరామర్శించి తగు జాగ్రత్తలు తెలియజేశారు. మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శివకుమార్ మాట్లాడుతూ నవంబర్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్పర్శ లేని పొడలు ఉన్న పేషెంట్లను గుర్తించి జాగ్రత్తలు సలహాలు సూచించామని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, డీపీఎంఓ రాఘవ, హెల్త్ సూపర్వైజర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం
కడప అగ్రికల్చర్: జిల్లా మత్య్సశాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మత్స్య కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రాంప్రసాద్, మత్స్య అభివృద్ధి అధికారి కిరణ్కుమార్, పలువురు మత్య్సకారులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించనున్న ‘విద్యార్థి అసెంబ్లీ’కి జిల్లాలోని ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో నియోజవర్గానికి ఒక్క విద్యార్థి చొప్పున ఎంపిక చేశారు. వీరంతా జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజు అసెంబ్లీకి హాజరవుతారు. మైదుకూరు నియోజక వర్గం శెట్టివారిపల్లె జెడ్పీ హైస్కూల్ నుంచి వీర ఉదయశ్రీ, ప్రొద్దుటూ రు నియోజక వర్గం నుంచి ప్రొద్దుటూరు వైవీ ఎస్ బాలికల హైస్కూల్ నుంచి షేక్ యల్లాల ఆసిఫా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల బాలికల హైస్కూల్ నుంచి మేడిక సంగీత, కమలాపురం నియోజకవర్గం నుంచి కమలాపురం బాలుర హైస్కూల్ విద్యార్థి వడ్ల తేజ నరసింహాచారి, పులివెందుల నియోజక వర్గంలోని సింహాద్రిపురం మండలం హిమకుంట్ల జెడ్పీ హైస్కూల్కు చెందిన డి. నాగవైష్ణవి, కడప నియోజక వర్గంలోని కడప ఎంసీహెచ్ఎస్ ఉర్దూ మొయిన్ బాలుర హైస్కూల్కు చెందిన సయ్యద్ మహహ్మద్ ఆనస్, బద్వేల్ నియోజకవర్గంలోని బి.కోడూరు మండలంలోని కేజీబీవీకి చెందిన యోగ వర్షితరెడ్డి ఎంపికై న వారిలో ఉన్నారు. -
రైల్వేలైన్కు రక్షణ!
● పట్టాల వెంబడి ప్రహారీగోడలు ● రైలు ట్రాక్, పొలాలకు మధ్య నిర్మాణాలు ● ప్రమాదాల నివారణకు చర్యలు రాజంపేట: ముంబై –చైన్నె కారిడార్ రైలుమార్గంలోని రైలు పట్టాల వెంబడి అనేక పల్లెలు, అటవీ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పల్లె ప్రాంతాల్లో పశువులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు పట్టాలపైకి వచ్చేస్తున్నాయి. వేగంగా వచ్చే రైలింజన్ కింద పడటంతో ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా పోతోంది. దీంతో రైల్వేలైన్ రక్షణ చర్యల్లో భాగంగా ప్రహారీగోడలను నిర్మిస్తున్నారు. ఉభయ వైఎస్సార్జిల్లాలో పరిధిలోని రైల్వేట్రాక్కు ఇరువైపులా గోడల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అవుట్ ఆఫ్ స్టేషన్ స్టీల్ పెన్సింగ్ నిర్మించనున్నారు. జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రం నుంచి చెయ్యేరులోకి వెళ్లే గొల్లపల్లె రహదారిలో రూ.8కోట్లతో ప్రహారీ గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో ఎక్కడైతే అధికంగా పశువులు రైలుపట్టాలపైకి వస్తున్నాయో గుర్తించి అక్కడ ప్రహారీగోడలను నిర్మితం చేస్తున్నారు. అయితే ఈ రహదారి చెయ్యేరులో శ్మశానానికి దారి కావడంతో ప్రహరీ గోడ అడ్డుగా నిలుస్తోంది. శ్మశానంలో వెళ్లేందుకు వీలులేని పరిస్థితులున్నాయి. నాగిరెడ్డిపల్లె, అరవపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. చెయ్యేరులోకి ప్రవేశానికి గేటు పెట్టాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. కాటిల్రన్వర్తో...రైల్వేకు ఇబ్బందులు... కాటిల్ రన్వర్తో రైళ్ల రాకపోలకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. ఫలితంగా రైళ్లు ఆలస్యంగా నడవాల్సిన పరిస్థితి. ఇటీవల నందలూరు–మంటంపంపల్లె వద్ద ఆల్విన్ సమీపంలో ముంబయి–చైన్నె మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు కింద పశువులు పడటంతో ముందుకు కదలలేకపోయింది. స్టేషన్ బయట కూడా రూ.50కోట్ల స్టీల్ పెన్సింగ్ కూడా నిర్మించనున్నారు. పశువులు ట్రాక్పైకి రాకుండా ఒకరిని కాపాలగా ఏర్పాటుచేశారు. కడప, నందలూరు సెక్షన్లలో పల్లె సమీపంలో పశువులు పట్టాలెక్కి మృత్యువాతకు గురవుతున్నాయి. ఫలితంగా రైలు జర్నీకి బ్రేక్పడుతోంది. ఒకవేళ పశువు కొమ్ము లోకో వీల్ కింద పడితే పట్టాలు తప్పడం కూడా జరుగుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. -
స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి
బద్వేలు అర్బన్ : పట్టణానికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్హెచ్–67 బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి అదుపు తప్పి స్కార్పియో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి పెద్దలక్షుమ్మ (85) తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గ్రామంలో శనివారం రాత్రి తమ సమీప బంధువుల శుభకార్యం ఉండటంతో.. కుటుంబ సభ్యులంతా కారులో స్వగ్రామానికి బయలుదేరారు. గూడెం, గుంతపల్లె మార్గంమధ్యలోని ఎన్హెచ్–67 బైపాస్ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా.. కుక్క అడ్డురావడంతో సడన్గా బ్రేక్ వేశారు. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో పెద్దలక్షుమ్మ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాహనంలోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు జమ్మలమడుగు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలైన సంఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన చవ్వా ప్రసాద్రెడ్డి, నాగేష్ రోడ్డు పనులు ముగించుకుని ప్రొద్దుటూరు నుంచి బైక్లో జమ్మలమడుగుకు వస్తుండగా.. మార్గంమధ్యలోని ధర్మాపురం వద్దకు రాగానే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో చవ్వా ప్రసాద్రెడ్డి కుడిచేయి విరిగి తీవ్ర గాయాలు కాగా నాగేష్కు రెండు కాళ్లు విరిగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వెనుక వైపు నుంచి వస్తున్న టిప్పరు.. ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు నుంచి వస్తున్న నాన్స్టాప్ బస్సును టిప్పరు ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న జయరాముడు, సింగరయ్య, వీరయ్య, మణి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్ర గాయాల పాలైన చవ్వా ప్రసాద్రెడ్డి, నాగేష్, జయరాముడును ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ లిఖిత సూచించారు. జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్ఎస్ విచారణ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో గతంలో పని చేసిన సీనియర్ అసిస్టెంట్పై చిత్తూరు డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి విచారణ చేశారు. గతంలో ఇక్కడ నాగార్జున అనే సీనియర్ అసిస్టెంట్ పని చేస్తూ ధర్మవరం ఆస్పత్రికి బదిలీ అయ్యారు. కొన్నేళ్ల కిత్రం జరిగిన ఓ కేసు విషయమై ఆయన అనధికార సెలవులో వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు డీసీహెచ్ఎస్తోపాటు మరో ఇద్దరు అధికారులు శుక్రవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ శివరాంతో మాట్లాడారు. నాగార్జున సర్వీసు రికార్డును పరిశీలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎన్ని రోజులు పని చేశారు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేదనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. -
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనంతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలోని ఎనిమిది మండలా ల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోవపరం మండలంలో 7.6 మి.మీ, కమలాపురం మండలంలో 6.2, అట్లూరు మండలంలో 4, బి.మఠంలో 3.2, బద్వేల్ 2.8, పోరుమామిళ్లలో 2, కాశినాయన, వల్లూరు మండలాల్లో 1.8 మి.మీ వర్షం కురిసింది. కడప రూరల్: జిల్లాలో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ (ప్రిలిమినరీ, మెయిన్స్) పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎం.అంజల తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొ న్నారు. అభ్యర్థులు ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్, కడప అనే చిరునామాలో సమర్పించాలని తెలిపారు. వివరాలకు సెల్ నంబరు 97031 85382 ను సంప్రదించాలని సూచించారు. కడప కార్పొరేషన్: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఫార్మా ప్లస్ ప్రొప్రైటర్, ఫార్మసీ సంక్షేమ సంఘం స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ కోటపాటి రాధాక్రిష్ణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. ఫార్మస్టిస్టులకు సబ్సిడీతో కూడిన రుణాలివ్వాలని, ఫార్మసీ యాక్టు 1948ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఫార్మసీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పీహెచ్సీ, సీహెచ్సీలలో ఫార్మసిస్టు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్లతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. ఫార్మసిస్టులు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శుక్రవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయానికి రూ. 25,73,262 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో ఆలయంలో ఉన్న ఏడు శాశ్వత హుండీల ద్వారా రూ.25,07,015లు అన్నదాన హుండీ ద్వారా రూ.66,247లు వచ్చిందని చెప్పారు. అలాగే మిక్స్డు బంగారు వస్తువులు ,మిక్స్డు వెండి వస్తువులు వచ్చినట్లు ఆయన తెలిపారు. కడప దేవదాయశాఖ కార్యాలయ అధికారి రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్కే వ్యాలీ ఏఎస్సైలు నాగరాజు, చంద్ర శేఖరరెడ్డి పోలీసులు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నవంబర్ 23 నుంచి 29 వరకు జరుగుతున్న 19వ నేషనల్ జంబోరికి పెడ్లిమర్రి మండల కేజీబీవీ విద్యార్థులు ఎంపికయ్యారని గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) దార్ల రూత్ ఆరోగ్య మేరి తెలిపారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థులు, స్కౌట్స్ మాస్టర్స్, గైడ్స్ కెప్టెన్లు వేల సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మన జిల్లా నుంచి సుమారు 70 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి ప్రసంగిస్తారని తెలిపారు. నేషనల్ జంబోరి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని జీసీడీఓ మేరీ, మండల ఎంఈఓలు సుజాత, గంగాధర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సరస్వతి, పీడీ సంతోషకుమారి పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు
ప్రొద్దుటూరు క్రైం : ఇతరుల బ్యాంక్ అకౌంట్లతో బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు కీలక సభ్యులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.10.56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ప్రొద్దుటూరు డీఎస్పీ భావన శుక్రవారం వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి ఆర్ల చంద్రయాదవ్ బంధువులు. చంద్రయాదవ్ 2007లో బెంగళూరుకు వెళ్లి అక్కడి ఒక హోటల్లో పని చేసేవాడు. తర్వాత అంచెలంచెలుగా పీజీ హాస్టళ్లను సొంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగాడు. వీరశంకర్ కూల్డ్రింక్ షాపు, ఇతర వ్యాపారాలు చేస్తూ దివాళా తీశాడు. దీంతో అతను ఏదైనా పని చూపించాలని తన బంధువైన చంద్రయాదవ్ను అడగడంతో.. బెంగళూరుకు పిలిపించుకొని తన రెండు పీజీ హాస్టళ్లను లీజుకు నిర్వహించుకోవాలని అతనికి ఇచ్చాడు. కొంత కాలం తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించాలనే ఆలోచన చంద్రయాదవ్ మనసులో కలిగింది. ఇదే విషయాన్ని వీరశంకర్కు చెప్పగా అతను సరేనన్నాడు. ఇందుకోసం మనకు కొన్ని ఫేక్ బ్యాంక్ కరెంట్ అకౌంట్లు అవసరం అవుతాయని చంద్రయాదవ్ చెప్పడంతో వీరశంకర్ ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్బాద్లో ఉన్న తన బంధువు చెన్నకృష్ణను సంప్రదించాడు. ఆన్లైన్ ట్రేడింగ్ కోసం తమకు కరెంట్ అకౌంట్లు కావాలని చెన్నకృష్ణ తనకు పరిచయం ఉన్న వారిని నమ్మించాడు. వారి ద్వారా వివిధ బ్యాంక్లలో అకౌంట్లను ఓపెన్ చేయించాడు. ఈ విధంగా వాళ్ల బ్యాంక్ అకౌంట్ బుక్కులు తీసుకొని, ఫేక్ సిమ్ కార్డులతో నెట్బ్యాంకింగ్, ఆన్లైన్లో రాయల్బుక్ 365 కామ్ ఇన్ వెబ్సైట్ ద్వారా విస్తృతంగా బెట్టింగ్ నిర్వహించారు. బెట్టింగ్ బాగోతం వెలుగులోకి.. చాపాడు మండలంలోని చిన్నగురువలూరు గ్రామానికి చెందిన పెదమల్ల జగన్ అనే వ్యక్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు వివిధ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో మరిన్ని అకౌంట్లు కావాలని వీరశంకర్, చంద్రయాదవ్లు అడగడంతో అతను అందుకు అంగీకరించలేదు. దీంతో వారు అతనిపై దాడి చేశారు. దాడి ఘటనపై ఈ నెల 3న జగన్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫేక్ అకౌంట్లు, ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వెబ్సైట్ లావాదేవీల కోసం ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేయించిన చెన్నకృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్కుమార్రెడ్డి, కృష్ణారెడ్డి, రవితేజలను ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఐ సదాశివయ్య అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించి కీలక ముఠా సభ్యులు వీరశంకర్, చంద్రయాదవ్లు పోలీసులకు దొరకలేదు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. పక్కా సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ సదాశివయ్య సిబ్బందితో కలిసి శుక్రవారం వీరశంకర్, చంద్రయాదవ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.56 లక్షలు నగదు, 3 సెల్ఫోన్లు, ఒక బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు చెప్పారు. బెట్టింగ్ లావాదేవీలు నిర్వహించిన అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాల్సిందిగా ఆయా బ్యాంక్లకు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు. డబ్బు ఆశ చూపి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తామంటే యువకులు నమ్మి సమస్యల్లో చిక్కుకోరాదని డీఎస్పీ సూచించారు. ఇంకా ఈ కేసులో లోతైన విచారణ చేస్తున్నామని, బెట్టింగ్ ముఠాతో సంబంధాలున్న అందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామనితెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ సదాశియ్య, టూ టౌన్ పోలీస్స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ పీజీ హాస్టళ్ల ముసుగులో కార్యకలాపాలు ఇద్దరు కీలక సభ్యులు అరెస్ట్ రూ.10.56 లక్షలు స్వాధీనం డీఎస్పీ భావన వివరాలు వెల్లడి -
ఏబీఎన్ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏబీఎన్ ప్రత్యక్ష ప్రసార డిబెట్లో అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతా రాహిత్యమైన చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, వారిపై చట్టప్రకారం తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం చిన్నచౌకు పోలీసుస్టేషన్లో ఈ మేరకు ఎస్ఐ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పులి సునీల్కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్లో ప్రత్యక్ష ప్రసారంగా రాజకీయ చర్చ (డిబెట్) సమయంలో అడుసుమిల్లి శ్రీనివాసరావు అనే రాజకీయ విశ్లేషకుడు.. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాభిమానంతో ఎన్నుకోబడిన నాయకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతా రహితమైన, చట్టవ్యతిరేకమైన వ్యాఖ్య చేశారన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని నక్సలైట్తో పోలుస్తూ ఇలాంటి వారిని నక్సల్స్లా ఎన్కౌంటర్ చేయాలని తదితర బెదిరింపుతో కూడిన మాటలు చెప్పారన్నారు. ఇది కేవలం అవమానకర వ్యాఖ్య కాదని, ఒక వ్యక్తి ప్రాణం తీసేలా ప్రజల్లో ప్రేరణ కలిగించే అత్యంత తీవ్రమైన నేర పూరిత ప్రకటన అన్నారు. ఈ వ్యాఖ్యలు మాట్లాడిన వెంటనే కార్యక్రమాన్ని నడిపిన ఏబీఎన్ యాంకర్, అసోసియేషన్ ఎడిటర్ రుషిమర్ల మాటలను ఆపడం, నిలదీయడం, నిరసించడం, నియంత్రించడం చేయకుండా ప్రత్యక్షంగా ఆయన వాదనలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. యాంకర్ బాధ్యత విశ్లేషకులను సమతూకంగా ఉంచడం, చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలను అడ్డుకోవడం అయినప్పటికీ ఆయన అలా చేయకుండా ప్రసారాన్ని కొనసాగించారన్నారు. ఇది ఆ వ్యాఖ్యలకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా హింస, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీడియా వేదికగా ఉపయోగించుకునే అవకాశం కల్పించడమేనన్నారు. ఇందులో యాంకర్ మాత్రమే కాదని, పాల్గొన్న కనపర్తి శ్రీనివాసరావు, కృష్ణకాంత్, ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, ఏబీఎన్ చానల్ మేనేజ్మెంట్ స్పష్టంగా సహ నిందితులుగా వ్యవహరిస్తూ ఆ వ్యాఖ్యలను దేశ ప్రజలకు చేరేలా అనుమతించారన్నారు. ఈ విషయంగా పైన పేర్కొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బాబు, త్యాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బాబు, వైఎస్సార్ సీపీ టీయూసీ నగర అధ్యక్షులు నాగరాజు, మైనార్టీ కార్యదర్శి ఫయాజ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు యనమల రవి, జనరల్ సెక్రటరీ అజయ్, మాజీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుల ఫిర్యాదు -
సంతృప్త స్థాయిలో జిల్లా అభివృద్ధి జరగాలి
కడప సెవెన్రోడ్స్ : ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో కడప పురోగమనంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో సంతృప్త స్థాయిలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ (పీఏసీ) చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరవేయడంలో అధికారులదే బాధ్యత అన్నారు. జిల్లాలో చాలా మేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అధికారులు బాధ్యత తీసుకుని పూర్తి చేయాలన్నారు. విద్య, నైపుణాభివృద్ధి, సాంకేతిక, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యసాధనలో పీఏసీ తనవంతు సహకారం అందిస్తుందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, లలిత కళల అభివృద్ధిలో మరింత ప్రాచుర్యం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ కోర్సులు కూడా నిర్వహిస్తే చాలా మందికి సాంకేతిక నైపుణ్య సామర్థ్యం అందుతుందని సూచించారు. ఏపీ టూరిజం నిధులతో పాడా నిర్మించిన భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ స్వాధీనం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పార్నపల్లె రిజర్వాయర్ వద్ద కొత్తగా నిర్మించి ఇరిగేషన్ శాఖకు అప్పగించిన భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పర్యాటకశాఖకు అప్పగించాలన్నారు. ప్రపంచ పర్యాటక మ్యాప్లో గండికోటకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలన్నారు. పర్యాటక పరంగా అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార రాజా, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పీఏసీ చైర్మన్ కూన రవికుమార్ -
పెట్టుబడులకు జిల్లా అనుకూలం
కడప సెవెన్రోడ్స్: పెట్టుబడులకు జిల్లా అన్ని విధాల అనుకూలమని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శుక్రవారం తన చాంబర్లో మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా అనుబంధ సంస్థ హెవిహా ప్రతినిధి డాక్టర్ చేతన్ టమహంకర్తో ఏపీ కార్ల్ ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమికంగా రానున్న ఆరు మాసాలలో రూ.30 కోట్ల పెట్టుబడితో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా దాదాపు 50 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. దశల వారీగా మరో 4 సంవత్సరాలలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అపార వనరులు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయానికి పులివెందుల దగ్గరగా ఉందన్నారు. ఏపీ కార్ల్ సీఈఓ ప్రొఫెసర్ శ్రీనివాసప్రసాద్, శాస్త్రవేత్త డాక్టర్ శివ ప్రసాద్, అడ్మిన్ లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బాలరాజు
రాజంపేట: ఇండియన మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షునిగా నందలూరు మండలం టంగుటూరు పంచాయతీ వి.రాచపల్లెకు చెందిన డాక్టర సంగరాజు బాలరాజు ఎన్నికయ్యారు. ఈనెల 22, 23వ తేదీల్లో రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వెన్సన్ సెంటర్లో జరిగే వైద్యవిజ్ఞాన సదస్సులో బాలరాజు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ సదస్సుకు రాష్ట్రంలోని నలమూలల నుంచి 600 మందికి వైద్యనిపుణులు, వైద్యులు తరలివస్తున్నారు. రాజంపేటలో నేటి నుంచి రెండురోజుల పాటు వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించేందుకు ఐఎంఏ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. జయరామరాజు, జానకమ్మ దంపతులకు 1970లో బాలరాజు జన్మించారు.ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. చెస్ట్ స్పెషలిస్టుగా రాజంపేటలో పేరు గడించారు. 2004 లో రాజంపేట ఐఎంఏ బ్రాంచి సెక్రటరీగా పనిచేశారు. -
కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా..
మూగజీవాలు, వన్యప్రాణులు, పాడిపశువులు, నిరసనలు, ఆత్మహత్యలు, సంఘవిద్రోహ శక్తులు ట్రాక్పైకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలలో భాగ మే ఫెన్సింగ్ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం తెలుగురాష్ట్రాలలో నిర్మాణానికి రూ.3,200 కోట్లు కేటాయించింది. గుంతకల్– కడప–నందలూరు–రేణిగుంట మార్గాల్లో ఫెన్సింగ్ లేదా గోడల నిర్మాణం జరుగుతోంది. ఆయా రూట్ల ఆధారంగా నిధులు కూడా విడుదల చేసింది. రైలుమార్గాలు అటవీ, పట్టణ ప్రాంతాల గుండా పోతున్నాయి. ఈ క్రమంలో పలు అటవీ జంతువులు పట్టాలు దాటుకునే క్రమంలో రైళ్లకింద పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ట్రాక్మీదపడి మరణిస్తున్నాయి. ● వందేభారత్ లాంటి హైస్పీడ్ రైళ్ల కోసం రెండేళ్ల క్రితం ఎస్సీ రైల్వే తన పరిధిలోని అన్ని ప్రధానమార్గాల్లో 130కి.మీ పైగా వేగాన్ని తట్టుకునేలా సామార్థ్యాన్ని పెంచింది. దీంతో హైస్పీడ్ రైళ్లు తిరుగుతున్న పట్టాలపై ఎలాంటి జంతువులు,మనుషులు రాకుండా స్టీల్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయనున్నారు. నేషనల్ హైవేల సమీపంలో ఉన్న ట్రాక్లపై క్రియోసెట్ ఆయిల్తో ట్రీట్ చేసిన హెచ్డీపీ వెదురుబొంగులతో ఫెన్సింగ్ లేదా గోడలు నిర్మించనున్నారు. మరికొన్ని చోట్ల సబ్వేలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే రైల్వేగేట్ల స్ధానంలో ఆర్యూబీలు, ఆర్వోబీల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని చంద్రగిరి గ్రామానికి చెందిన నాగేష్(39) అనే వ్యక్తి శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలోని నరసప్పగారిపల్లెకు చెందిన నాగేష్కు ఆరేళ్ల క్రితం చంద్రగిరి గ్రామానికి చెందిన రమణమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అప్పులు ఎక్కువ కావడంతో జీవితం మీద విరక్తి చెంది చంద్రగిరి గ్రామ సమీపంలోని మైన్స్కు వెళ్లే రహదారిలో బొందుగుట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నాగేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కడుపు నొప్పి తాళలేక.. కొండాపురం : మండల పరిఽధిలోని ఓబన్నపేట గ్రామానికి చెందిన కల్లూరు ఓబుళరెడ్డి(71) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఓబన్నపేట పునరావాస కాలనీలో ఉండే కె.ఓబుళరెడ్డి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రైల్వే కేంద్రం ఆకస్మిక తనిఖీ
నందలూరు: నందలూరు రైల్వే కేంద్రాన్ని గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) చంద్రశేఖర్ గుప్తా గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వేస్టేషన్, పార్కులు, ఇన్స్టిట్యూట్, జిమ్, రీడింగ్రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నేతలు ఎంబలూరు నరసింహస్వామి, మేడా వెంకటకుమార్, గెలివి శివశంకర్, వల్లంకొండు శివకుమార్, సర్పంచ్ సూర్యనారాయణ, రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కమల్బాషా డీఆర్ఎంను కలిసి మాట్లాడారు. హైదరాబాద్, చైన్నె వెళ్లే రైళ్లకు నందలూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఆర్ఎం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఎన్ (సౌత్) సుదర్శన్రెడ్డి, స్టేషన్ మేనేజర్ కమలాకర్, ఆర్పీఎఫ్ ఎస్ఐ త్రివేణి, సీఎల్ఐ పెంచలయ్య, సిసిసి విశ్వనాథ్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. గురువారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. చీకటి దొంగ పర్యటనలా ఉందని ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారన్నారు. తన పర్యటనలో రైతులకు ఏమి చేయబోతున్నాడో చెప్పలేదన్నారు. మహానాడు కడపలో నిర్వహించినా జిల్లాకు ఒక్క పని చేసింది లేదని ధ్వజమెత్తారు. 15 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. చంద్రబాబు మాటలు తప్ప చేసింది శూన్యమేనని తెలిపారు. అర్హులైన ఏడు లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒట్టి మాటలు కట్టి పెట్టి చేసే మేలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. జిల్లాలో తుపాన్ కారణంగా నష్టపోతే రైతంగాన్ని ఆదుకున్న పాపాన పోలేదని తెలిపారు. వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం లో ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్లోనే రైతులను ఆదుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ‘అన్ని నేనే చేశానని నా వల్లే సాధ్యం అయింద’ని గొప్పలు తప్పా చంద్రబాబుతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మట్టి, ఇసుక మాఫియాను, కల్తీ మద్యాన్ని అరికట్టి గొప్పలు చెప్పినా ప్రజలు నమ్ముతారన్నారు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఈవీఎంల ద్వారా గెలవడం తప్ప... .డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందేమీ లేదని ఆరోపించారు. పూటకో మాట మాట్లాడే ఆదినారాయణ రెడ్డిని ప్రజలు పట్టించుకోరని తెలియజేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు యానాదయ్య, పులి సునీల్కుమార్, కార్పొరేటర్ పాకా సురేష్, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. కొద్ది మంది వ్యక్తులను సెలక్ట్ చేసుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ‘అన్నదాత సుఖీభవ’లో లక్షలాది మంది అర్హులకు కోత పెట్టారు మీడియాతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
● దరఖాస్తు చేసుకొనే విధానం
కడప కోటిరెడ్డిసర్కిల్: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్టరీత్యా నేరం కూడా అవుతుంది. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. అక్రమ మార్గాలను ఎంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజులపాటు సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడపలో శిశు గృహ కేంద్ర అధికారులు దత్తత ఏ విధంగా పొందాలి? దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతగల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. అర్హత కలిగిన వారికి చిన్నారులను దత్తత ఇస్తూ అందిస్తున్నారు. అర్హతలు ● దంపతుల వయస్సు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు. ● కనీసం రెండేళ్లపాటుఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న దంపతులు అర్హులు. ● రెండేళ్లలోపు పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతుల్లో మగవారి వయస్సు 45, ఆడవారి వయస్సు 40కి మించకూడదు. ● ఒంటరిమహిళల వయస్సు 40కి మించకూడదు. ● దత్తత కోరే తల్లిదండ్రులు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి, ఆర్థికంగా బాగుండాలి. ● ఒంటరి మగ వారు– మగ బిడ్డను మాత్రమే దత్తత పొందుటకు అర్హులు. ● దత్తత పొందాలనుకుంటున్న భార్యా భర్తలు ఇద్దరి అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. అనధికార దత్తత చెల్లదు కొందరు బంధువులకు చెందిన పిల్లలను, తెలిసిన వారి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారు. ఇలా అనధికార దత్తత చెల్లదు. పైగా అనధికార దత్తత తీసుకున్న వారికి జేజే యాక్టు సెక్షన్ 81 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. దత్తత కోరే తల్లిదండ్రులు తొలుత డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో అప్లికేషన్ నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లోడ్ చేయాల్సిన పత్రాలు భార్యాభర్తల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్ పాన్ కార్డు జనన ధ్రువీకరణ పత్రాలు నివాస ధ్రువపత్రం (ఆధార్ కార్డు / ఓటర్ కార్డు / పాస్ పోర్ట్ ) సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ పత్రం (సాలరి సర్టిఫికేట్/ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇన్ కమ్ సర్టిఫికేట్ / ఇన్ కమ్ టాక్స్ రిటర్న్, ప్లాయ్మెంట్ సర్టి ఫికేట్ / ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్స్) దీర్ఘకాలిక, అంటువ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడలేదని, దత్తత తీసుకోవడానికి అర్హులని ధ్రువీకరిస్తూ వైద్య ప్రాక్టీషనర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలి. అనధికార దత్తత చట్టరీత్యా నేరం అర్హతగల వారికి అండగా శిశుగృహ జిల్లాలో కొనసాగుతున్న జాతీయ దత్తత మాసోత్సవాలు -
పేర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు!
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం. మార్కులొక్కటే కాదు ..అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్తులో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకూ పదో తరగతి సర్టిఫికెట్లలోని వివరాలే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాలు ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవస రం ఇటు ఉపాధ్యాయులపై.. అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేప థ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పకడ్బందీగా సరి చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వివరాల సవరణకు ఆధార్ కేంద్రాలు విద్యార్థులకు సంబంధించి అపార్లో పుట్టిన తేదీ సవరణ, ఆధార్ అప్డేట్ వంటి కార్యక్రమాల కోసం పాఠశాలల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నామినల్ రోల్స్ను చేయించుకునేటప్పుడే ఆధార్కార్డులో, అపార్లో అన్ని వివరాలను అప్డేట్ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు జాగ్రత్తగా సరి చేసుకోవాల్సి ఉంది. లేకుండా భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరీక్ష ఫీజు చెల్లించకముందే... పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించకముందే వారి వివరాలను సరిచూసేలా అధికారులు ముందస్తు కార్యచరణ చేపట్టారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలపై జిల్లాలోని డిప్యూటీ ఈఓ , ఎంఈఓలను అప్రమత్తం చేసింది. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.విద్యార్థుల వివరాలను సరిగా లేని వారు జిల్లావ్యాప్తంగా ఐదు వేల వరకు ఉన్నారని తెలిసింది. జిల్లావ్యాప్తంగా 619 స్కూళ్లలో.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు 300, ప్రైవేటు యాజమాన్య ఉన్నత పాఠశాలలో 319 మొత్తం 619 దాకా ఉన్నాయి. ఇందులో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 29 వేలదాకా హాజరవుతారని అంచనా. పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీలో జాగ్రత్త అవసరం ఆధార్, అపార్లలో సవరణకు పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు -
మోసం చేయడం చంద్రబాబు నైజం
సిద్దవటం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసే నైజం చంద్రబాబునాయుడుదని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొ న్నారు. సిద్ధవటం మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి ఆధ్వర్యంలో కనుములోపల్లెలోని మూలపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తన హయాంలో ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబునాయుడు వీటిని ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులు, ప్రజలు నష్టపోతారని, అందువల్ల వైఎస్.జగన్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసించాలని ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారన్నారు. దీంతో పేద విద్యార్థులు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, అగ్రికల్చ ర్ విద్యను అభ్యసించారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ సూపర్సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఆకేపాటి అన్నారు. అంతకుముందు మూలపల్లి గ్రామంలో జెడ్పీటీసీ శ్రీకాంత్రెడ్డి ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండారెడ్డి, నాయబ్ పాల్గొన్నారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలి వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి -
రాజంపేటలో రాష్ట్ర వైద్యవిజ్ఞాన సదస్సు
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో రెండురోజుల పాటు రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియన్మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎలక్ట్ డాక్టర్ బాలరాజు వెల్లడించారు.రాజంపేటలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 22, 23న రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వన్షెన్ సెంటర్లో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలిరోజు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా.దిలీప్ బన్సులి, మాజీ జాతీయఅధ్యక్షుడు డా.వినయ్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.దగ్గుమాటి శ్రీహరిరావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ పాల్గొంటారన్నారు. వీరితోపాటు రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుందన్నారు. ప్రధానంగా తొలిరోజు16 అంశాలు, రెండోరోజు 16 అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. నేటి సమాజంలో విజృంభిస్తున్న వ్యాధులు, నివారణోపాయాలతోపాటు కొత్తరకమైన జబ్బులు తదితర అంశాల గురించి ఆయా రంగంలో నిష్ణాతులైన వైద్య నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, ఢిల్లీ,హైదరాబాద్కు చెందిన పలువురు ప్రముఖ వైద్యుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ నేతలు సుధాకర్, విజయకుమార్, చలమయ్య, వీరయ్య, సునీల్, శ్రీహరి, అనిల్, నవీన్, మధుసూదన్ పాల్గొన్నారు. -
మైదుకూరులో ఇక నిరంతర నిఘా
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన డీఐజీ కోయ ప్రవీణ్ మైదుకూరు: మైదుకూరు పట్టణంలో ఇక నుంచి నిరంతర నిఘా కొనసాగనుంది. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ (కమాండ్ కంట్రోల్)ను గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. కార్యాలయంలో రూ.25లక్షలతో ఏర్పాటైన 87 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ విభాగం, కాన్ఫరెన్స్ హాల్ను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఏఎస్పీ ప్రకాష్బాబు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రనాథ్లతో కలిసి డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ కమాండ్కంట్రోల్ విభాగం నుంచి మైదుకూరు పట్టణంలో నిరంతరం నిఘా ఉంచి నేరాలను అదుపు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దీని ఏర్పాటుకు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తన వంతుగా రూ.20లక్షలు అందజేశారని, మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.5లక్షలు అందించారని వివరించారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు కృషి చేసిన డీఎస్పీ రాజేంద్రనాథ్, అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్ఐలు చిరంజీవి, సుబ్బారావులను అభినందించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పరిమితిగా ఉంటారని, ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పోలీసు విధులకు వెన్నుదన్నుగా నిలుస్తాయని తెలిపారు. నేరాలను అదుపు చేయడం కోసం నేరగాళ్లను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. మైదుకూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్ జి.రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ఉత్పాదకతపై కేంద్ర అధికారుల పరిశీలన
మైదుకూరు : ఉల్లి ఉత్పాదకతపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం దువ్వూరు మండలంలో పర్యటించి పరిశీలించారు. మండలంలోని చిన్నసింగనపల్లెలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ బ్రహ్మ, ఇతర అధికారులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఉల్లి (పెద్ద బళ్లారి), కేపీ ఉల్లి (చిన్నబళ్లారి) హెక్టారుకు ఎంత దిగుబడి వస్తుందనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బ్రహ్మ మాట్లాడుతూ ఉల్లి ఉత్పాదకతను పెంచేందుకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మైదుకూరులో కేపీ ఉల్లి శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలని, కేపీ ఉల్లి ఎగుమతి కోసం రాష్ట్రానికి లైసెన్స్ మంజూరు చేయాలని రైతులు కోరారు. దానిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు మనోజ్, రాజీవ్కుమార్, భార్గవ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్, ఎన్హెచ్ఆర్డీఎఫ్ కర్నూలు అధికారి శరవణన్, మైదుకూరు ఉద్యాన అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. -
రాయలసీమ రైతులకు చంద్రబాబు మోసం
చాపాడు : రాయలసీమ రైతులను మోసం చేసిన నాయకుడు, వ్యవసాయ వ్యతిరేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం చంద్రబాబు పెండ్లిమర్రి మండలంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో.. రైతులను పూర్తిగా నిరాశకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. మొదటి ఏడాది పూర్తిగా పక్కన పెట్టారని, రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉల్లి నష్టపరిహారం మాట, పంటల బీమా రూ.173 కోట్లు అనుకున్నా కనీసం ఆ ఊసే లేదన్నారు. రాయలసీమకు సాగు నీరు తీసుకొచ్చాను అని చెప్పుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని, గత నెల రోజులుగా అరటి ధరలు పూర్తిగా పడిపోయినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రాంతాలు, భూములను బట్టి రైతులు పంటలు సాగు చేసుకుంటారని, కానీ చంద్రబాబు మాత్రం వరి వద్దు అంటూ ప్రతి చోట హేళనగా మాట్లాడటం తగదన్నారు.వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి -
కబ్జాదారులపై కేసు నమోదు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్థానిక రవీంద్ర నగర్లోని మురాదియా ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా ను అడ్డుకున్న స్థానికుడు సయ్యద్ అబూ తల్హాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ డిమాండ్ చేశారు. సయ్యద్ అబూ తల్హాను గురువారం సీపీఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ, వక్ఫ్ బోర్డు పరిధిలో గల మురాదియా ముస్లిం కమ్యూనిటీ శ్మశాన వాటిక స్థలాన్ని క్రమేణా కబ్జా చేయడానికి అక్కడ ఉన్న పెద్ద చెట్లను నరికేసి అమ్మేసి దురాక్రమణకు తెగబడటం దారుణమన్నారు. దీనిపై కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు అధికారులకు స్థానిక ప్రజలతో కలిసి వినతి పత్రాలు సమర్పించి, మీడియా సమావేశం నిర్వహించిన, శ్మశాన వాటిక స్థల పరిరక్షణలో క్రియాశీలకంగా ఉన్న స్థానికుడు సయ్యద్ అబూ తల్హాపై ఆక్రమణదారులు మారణాయుధాలతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. దాడి జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ రికార్డు చేయడంలోనూ కేసు నమోదు చేయడం లోనూ, హత్యాయత్నం కేసు నమోదు చేయడంలోనూ, నిందితులపై కఠిన చర్యలు చేపట్టడంలోనూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. మురాదియా శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకుడు గౌస్ పాల్గొన్నారు.


