breaking news
YSR District News
-
యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా
● ప్రతి రోజు వంద టన్నులకుపైగా ఇసుక తరలింపు ● మండల స్థాయి టీడీపీ నాయకుడి అండతో రవాణాసాక్షి టాస్క్ఫోర్స్ : మండలస్థాయి టీడీపీ నేత అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చక్రాయపేట మండలం మారెళ్ల మడక సమీపంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్లో భారీగా వర్షపునీరు చేరింది. ఈ పరిణామం చక్రాయపేట మండల టీడీపీ నాయకుడికి వరంగా మారింది. అద్దాలమర్రి చెక్ పోస్టు సమీపంలో అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులో ఉండడం గమనించి దానిపై ఆ నాయకుడు కన్నేశారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలో హిటాచీ ఏర్పాటుచేసి నిత్యం వంద టన్నులకు పైగా ఇసుక తరలించేస్తున్నారు. నిత్యం ఇది కనిపిస్తున్నా.. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుల వారీగా వచ్చే ఆదాయంలో వాటాల రూపంలో అందరికీ చేరుతోందనే ఆరోపణలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయం నిర్మించి అక్కడి వరకూ సీసీ రహదారి నిర్మించింది. ఈ ఆలయ సమీపంలోనే తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. -
ఆర్ఎంపీ క్లీనిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్, ల్యాబ్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం యశోద పాల్గొన్నారు.మహిళ మృతి కేసులో అధికారుల విచారణ -
మతోన్మాదుల కుట్రతోనే సీజేఐపై దాడి
కడప కార్పొరేషన్ : మతోన్మాదుల కుట్రతోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్పై దాడి జరిగిందని ప్రముఖ న్యాయవాది ఎ.సంపత్కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, డా.మల్లె భాస్కర్ ఆరోపించారు. జన విజ్జాన వేదిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 19న పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా పౌర సమాజం ఆధ్వర్యంలో ఈ సదస్సుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్, జన విజ్ఞాన వేదిక ఫౌండర్ డాక్టర్ బ్రహ్మారెడ్డి ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అత్యంత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖజురహో ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిందని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మార్పుచేర్పులు చేయడానికి సాధ్యపడదన్నారు. పరిపాలనా పరంగా తిరస్కరణకు గురైన అంశంపై న్యాయస్థానం పరిష్కారం చూపడం సాధ్యం కాదన్న గవాయ్ వ్యాఖ్యల్ని వక్రీకరించి పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్య పరిచి సమాయత్తం చేయాలనే ఆలోచనతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యావంతులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాతంత్ర శక్తులు సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ నగర అధ్యక్షుడు వెంకటశివ, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.19న దాడి ఘటనను ఖండిస్తూ సదస్సు -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. తీగలు తగిలి గేదెలు.. వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. విద్యుత్ తీగలు తగులుకుని మృతి చెందిన గేదెల విలువు సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలని బాధిత రైతు నాగేశ్వరరెడ్డి కోరారు. -
ఆర్డీఎస్ఎస్తో 24 గంటల విద్యుత్ సరఫరా
మైదుకూరు : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీఎస్ఎస్ (రివేంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)తో 24 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాయప్పగారిపల్లెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల, గ్రామీణాభివృద్ధి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏపీఎస్పీడీసీఎల్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దువ్వూరు : పీఎం–కుసుం ఫీడర్ సోలార్ విద్యుద్దీకరణ పనులనుఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ శుక్రవారం పరిశీలించారు. దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఐదు మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన స్థల సేకరణ, మట్టి పరీక్ష అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణ, ఈఈలు లక్ష్మీపతి, నాగరాజు, డీఈఈలు శ్రీకాంత్, శివభాస్కర్, ఏఈలు రాజ్కుమార్, రామభద్రయ్య, హరి పాల్గొన్నారు.ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ -
సర్పంచ్కు గాయాలు
వేంపల్లె : బొలెరో వాహనం ఢీకొని బక్కన్నగారిపల్లె సర్పంచ్ మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల వివరాల మేరకు.. సర్పంచ్ మల్లయ్య పులివెందులలో నుండి తన సొంత పనులను ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్నారు. వేంపల్లె నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో మల్లయ్యకు చేయి విరి గి గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. మల్లయ్యను వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి రూ.6.03 లక్షల ఆదాయంప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో టెంకాయలను విక్రయించేందుకు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 9 మంది పాల్గొనగా టి.సుమలత రూ.6,03,000లకు టెంకాయల అంగడిని దక్కించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి 2026 నవంబర్, 22వతేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు ఆమెకు హక్కు ఉంటుందని దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు. గత ఏడాది వచ్చిన ఆదాయంతో పోల్చితే అదనంగా రూ.1,30,000 వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కిరణ్కుమార్రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ఝరికోనలో మృతదేహంకలకడ : మండలంలోని బాలయ్యగారిపల్లె సమీపంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించవద్దు
మహిళపై దాడిమైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. ఉల్లి పంటను దున్నేసిన రైతుముద్దనూరు : ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఉల్లి పంటను దున్నేస్తున్నారు. మండలంలోని చింతకుంటకు చెందిన రైతు ఆదినారాయణరెడ్డి ఐదు ఎకరాల్లో తాను సాగు చేసిన ఉల్లి పంటను రోటోవేటర్తో ఇలా దున్నేసి మట్టిలో కలిపేశాడు. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక, రవాణా వ్యయం భరించలేక దున్నేశానని రైతు తెలిపారు. ఐదు ఎకరాల్లో పంట సాగుకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని, చిల్లిగవ్వ రాక ఆర్థికంగా నష్ట పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఆపలేదని మహిళల ఆగ్రహంరాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు. ఇద్దరికి జైలుశిక్ష ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, అనుమతి లేకుండా మెడికల్ షాపులు, క్లినిక్, ప్రైవేట్ క్లినిక్లు, ల్యాబ్లు నడిపితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేస్తాం. కడప రోడ్డులో ఆర్ఎంపీ ముందు వైపు మెడికల్ షాపు నిర్వహిస్తూ లోపల ఆర్ఎంపీ క్లినిక్ను నడుపుతున్నారు. మందుల కోసం వస్తే లోపల డాక్టర్ ఉన్నాడంటూ పంపుతున్నారు. ఆర్ఎంపీలు ఇంజెక్షన్ చేయవద్దని, సైలెన్లతో చికిత్స చేయొద్దని చాలాసార్లు హెచ్చరించాం. ఆస్పత్రి బోర్డులో ఒకరి పేరు కనబరిచి.. మరొకరు వైద్యం చేయాలంటే వైద్య సమయాలను సూచిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబందనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – భారతి, జిల్లా డెమో అధికారి కడప అర్బన్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వఉంచినా, విక్రయించినా పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు శుక్రవారం ఆయన దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టపాసుల విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సూచించిన బహిరంగ ప్రదేశాలు, వారికి కేటాయించిన ప్రాంతంలో నిర్ణీత కొలతల మేరకు దుకాణాలు ఏర్పాటుచేసుకుని , లైసెన్సులు కలిగిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయించాలన్నారు. లైసెన్సు పొందిన గోదాములు, దుకాణాలు, తాత్కాలిక దుకాణదారులు తూచాతప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని ఎస్పీ సూచించారు. షాపు, షాపుకు మధ్య నిర్దేశించిన దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రతి దుకాణంలోనూ నీరు, ఇసుక, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి రోజున జాగ్రత్త.. దీపావళి పర్వదినం జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా పండగ జరుపుకోవాలని కోరారు. కాటన్ దుస్తులు ధరించి చిన్నారుల తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణాసంచా కాల్చాలని సూచించారు. రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టపాసులు కాల్చుకోవాలని, బకెట్లో నీరు ఉంచుకొని జాగ్రత్త ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, గాయాలైతే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఇంటి లోపల బాణసంచా కాల్చకూడదని, సగం కాలిన వాటిని మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం, ముట్టుకోవడం ప్రమాదకరంమని అన్నారు. ఆస్పత్రుల వద్ద బాణాసంచా కాల్చరాదని ఎస్పీ సూచించారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, టపాసులు విక్రయిస్తున్నా సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
సీపీఆర్పై అవగాహన పెంచుకోవాలి
మైదుకూరు : విద్యార్థులు సీపీఆర్(కార్డియో పల్మనరి రిసిస్టేషన్)పై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. వనిపెంట జ్యోతిరావు పూలే గురుకులం, మైదుకూరు కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సీపీఆర్పై శుక్రవారం అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సగా ఉపయోగపడే సీపీఆర్పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీపీఆర్తో వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రతతో వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చని, సరైన పద్ధతిలో చేతులు కడుక్కోవడవ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆడ పిల్లలను రక్షించడం, చదివించడం ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వి.మల్లేష్, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డెమో డి.భారతి, మెడికల్ ఆఫీసర్ సుమధుర, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ విజయ పాల్గొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులతో స్వయం ఉపాధికడప అగ్రికల్చర్: చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందవచ్చునని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్. అంకయ్యకుమార్ పేర్కొన్నారు. ఊటకూరు కేవీకేలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, లేబులింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేయడమేగాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేరుస్తాయని తెలిపారు. ఇటీవల కాలంలో యువత చిరుధాన్యాల ఉత్పత్తి సంస్థలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మార్కెట్లో ఉత్పత్తులకు గుర్తింపు పొందేలా ఆకర్షణీయమైన లేబుల్స్, సరైన ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలు అత్యంత ముఖ్యమని వివరించారు. చెరువులో పడి ఒకరు మృతి రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. రఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేవీకే పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్యకుమార్ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు -
విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలు
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ సైన్సు సెమినార్ జిల్లా స్థాయి పోటీలలో దువ్వూరు కేజీబీవీకి చెందిన షఫియా, సికె.దిన్నె జెడ్పీ హైస్కూల్కు చెందిన జాస్మిన్ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపికయ్యారు. కడపలోని అంధుల ఉన్నత పాఠశాలలో జరిగిన నేషనల్ సైన్సు సెమినార్లో డీఈఓ షేక్ షంషుద్దీన్, డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినైజర్ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు క్వాంటమ్ ఏజ్ బిగిన్స్, ఫొటెన్షియల్ అండ్ చాలెంజెస్పై చాట్స్, స్లైడ్స్ ద్వారా పోటీలు జరిగాయన్నాఉ. ఎంపికై న విద్యార్థులు రెండు రోజుల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, మురళి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అసంవాద బ్యాంకు ఖాతాలను నిర్వహణలోకి తీసుకురావాలి
కడప సెవెన్రోడ్స్ : భారత ప్రభుత్వం అసంవాదనీయ(అన్ క్లెయిమ్డ్) బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, బీమా, పొదుపు పథకాల నిధులు నిజమైన హక్కుదారులకు చేరేలా బ్యాంకర్లు చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో నిరుపయోగంగా ఉన్న అసంవాద (అన్ క్లెయిమ్డ్) అకౌంట్లను తిరిగి నిర్వహణలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో చేపట్టిన అవగాహన కార్యక్రమ బ్రోచర్లను కలెక్టర్ శుక్రవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచారం ప్రారంభించి.. ఆ అకౌంట్లను యాక్టివేట్ చేసేలా బ్యాంకర్లు చురుకై నపాత్ర పోషించాలన్నారు. బ్యాంకు కంట్రోలర్లు, సమన్వయకర్తలు తమ శాఖలను చైతన్యపరచి, బధిర ఖాతాదారులకు లేఖలు/ ఎస్ఎంఎస్లు పంపించాలని సూచించారు. అన్ని బ్యాంకులు ఆయా శాఖలలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి నిజమైన హక్కుదారులకు తిరిగి చెల్లించాలన్నారు. బ్యాంకులు తమ కస్టమర్లు, లేదా డిపాజిటర్లను ప్రోత్సహించి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్(డీఈఏ)ఫండ్లో ఉన్న అసంవాదనీయ డిపాజిట్లను నిజమైన హక్కుదారులకు ఇవ్వడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దనం, సీపీవో హజరతయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం
వేంపల్లె: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ.. ప్రజల శ్రేయస్సు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం వేంపల్లెలోని కడప – పులివెందుల బైపాస్ రోడ్డులోని మధురెడ్డి కన్వెన్షన్ హాలులో మెడికల్ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించి, ఆ ప్రతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఎంతోమందికి ప్రాణాలు పోసిన ఆరోగ్య శ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తున్నారన్నారు. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన మంది మాగధులైన పెత్తందారులకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం సహకారంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 17 కళాశాలలు మంజూరు కాగా.. వీటిలో ఐదు కళాశాలలు పూర్తయ్యాయని, కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డి, రాష్ట్ర యాక్టివిటీ జనరల్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీలు రవికుమార్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, బయపురెడ్డి, మండల కన్వీనర్లు చంద్రఓబుల్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీపీలు గాయత్రి, మాధవి బాలకృష్ణ, చల్లా వెంకట నారాయణ, ఉపసర్పంచ్ ఆర్.శ్రీనివాసులు, రామలింగేశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదు పేదలకు విద్య, వైద్యం దూరం అనుచరులకు దోచి పెట్టేందుకే చంద్రబాబు పన్నాగం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నట్టేట ముంచిందని ఎద్దేవా చేశారు. చీనీ, అరటి, ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఒక్కో బస్సులో 150 మందిని కుక్కి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం కాలం అవుతున్నా.. అరకొరగా ఒక సిలిండర్ ఇచ్చి మహిళలను మోసం చేశారని విమర్శించారు. కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతోందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. కూటమి నేతల మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పేదలకు వైద్య, విద్య దూరమవుతుందని, భవిష్యత్తులో ప్రజారోగ్యానికి భరోసా ఉండదన్నారు. వైద్యపరంగా పేదలను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. -
● మైదుకూరులో..
మైదుకూరు: మైదుకూరులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అర్బన్ సీఐ కె.రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) నియోజకవర్గ అధ్యక్షుడు కారెడ్ల కృష్ణ, ప్రింట్ మీడియా యూనియన్ అధ్యక్షుడు జి.వాసు, శ్రీపతి సుబ్బయ్య, కశెట్టి చంద్ర, బొమ్మిశెట్టి మోహన్, శేగినేని మురళి, టి.రామమోహన్, ఎల్.సుధాకర్రెడ్డి, ఎం.ప్రసాద్, రియాజ్ హుస్సేన్, ఎస్.గౌస్పీర్, రంజిత్కుమార్, యాపరాల ప్రసాద్, డీవీ కుమార్, సంపత్, గోశెట్టి రవీంద్ర, అనిల్ కుమార్రెడ్డి, ఎ.శ్రీనివాసులరెడ్డి, సురేష్, సుబ్బరాయుడు, చొక్కం సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుగురు తహసీల్దార్లకు పదోన్నతి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో పని చేస్తున్న ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా అడ్హక్ పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్:383 జారీ చేసింది. కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, కమలాపురం తహసీల్దార్ శివరామిరెడ్డి, పోరుమామిళ్ల తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, పెండ్లిమర్రి తహసీల్దార్ అనూరాధ, కలెక్టరేట్ ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ మాధవకృష్ణారెడ్డి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన జాబితాలో ఉన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21వ తేదీన తిరుపతి–హైదరాబాదు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07499 నంబరు గల రైలు మంగళవారం తిరుపతిలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదిగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా హైదరాబాదుకు మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నవంబర్ 7న హాకీ ఇండియా 100వ వార్షికోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ సంఘం సెక్రటరీ శేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో కడప హాకీ సంఘం సీనియర్ క్రీడాకారులు, కోచ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో హాకీ ఇండియా అసోసియేషన్ స్థాపించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఏపీ రాష్ట్ర అసోసియేషన్ ఆదేశాలకు జిల్లాలో ఉత్సవాలు జరపాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఆ రోజున పురుషులకు, మహిళలకు హాకీ పోటీలు నిర్వహించి సీనియర్ క్రీడాకారులను, క్రీడాకారిణులను సన్మానిస్తామని పేర్కొన్నారు. -
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ముద్దనూరు, లింగాల, పులివెందుల మినహా మిగతా 33 మండలాల్లో వర్షం కురిసింది. ఈ వాన చిరుపొట్ట దశలో ఉన్న వరికి కొంత నష్టం కలిగించే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ, పెన్నానది, నీటి వసతి ఉన్న బోర్ల కింద ముందస్తుగా సాగు చేసుకున్న వారికి.. వరుసగా కురుస్తున్న వర్షాలతో గుండె గుబేల్మంటోంది. ఎందుకంటే వర్షపు నీరు చిరుపొట్టలోకి చేరితే వరి ఎన్ను తాళ పోయే అవకాశం ఉంది. వెన్ను బయటికి వచ్చిన వరికై తే కంకికి ఉన్న సుంకు రాలిపోయే ప్రమాదం ఉంది. పత్తి, వేరుశనగ రైతులు కూడా కలవర పడుతున్నారు. ఈ వర్షపు నీరు పత్తికాయల్లోకి వెళ్లితే పత్తి కుళ్లిపోయే అవకాశం ఉంది. వేరుశనగ పంటలో నీరు నిలిస్తే ఊడలు ఎర్రగా మారి, భూమిలోకి సరిగా దిగవని రైతులు పేర్కొంటున్నారు. శనగ పంట సాగు చేసుకునే రైతులకు మాత్రం ప్రస్తుతం వర్షం చాలా అవసరం. ఉద్యానపంటలైన మామిడి, సపోట, చీని, డ్రాగెన్ ప్రూట్ వంటి రైతులకు కూడా మేలే. మండలం కురిసిన వర్షం(మి.మీ ) మూడు మండలాలు మినహాజిల్లా అంతటా వాన అత్యధికంగా అట్లూరులో 69.4 మి.మీ : : : : : : : : : : : : : : : అట్లూరు 69.4 కడప 36.8 ఒంటిమిట్ట 33.6 సిద్దవటం 30.2 గోపవరం 29.2 బద్వేలు 23.4 సీకే దిన్నె 20.4 వేంపల్లి 20.0 పెండ్లిమర్రి 19.2 పోరుమామిళ్ల 16.2 బి.మఠం 15.6 మైలవరం 14.6 దువ్వూరు 14.6 బి.కోడూరు 14.2 వీఎన్పల్లి 14.2 చెన్నూరు 14.2 సింహాద్రిపురం 12.4 కలసపాడు 11.0 రాజుపాళెం 10.0 తొండూరు 9.4 ఖాజీపేట 8.2 వేముల 8.0 మైదుకూరు 7.8 వల్లూరు 6.8 జమ్మలమడుగు 6,2 చాపాడు 3.4 కమలాపురం 2.4 కొండాపురం 2.4 చక్రాయపేట 1.8 ప్రొద్దుటూరు 1.2 -
● జిల్లా వ్యాప్తంగా..
కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహ రిస్తోంది.. నిజాలు రాసే కలంపై కక్ష కట్టింది.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తోంది.. ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలు ప్రచురిస్తున్న ‘సాక్షి’ని వేధింపులకు గురి చేస్తోంది.. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది.. ఈ నేపథ్యంలో కలం నిరసన గళం విప్పింది.. ‘సాక్షి’కి మద్దతుగా జర్నలిస్టులు కదం తొక్కారు.. ‘సాక్షి’పై అక్రమ కేసులు, వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. ఇప్పటికై నా మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కడప కార్పొరేషన్: నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు.. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన కడపలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియాపై వేధింపులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నెల్లూరులో కల్తీ మద్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. రాసిన వార్తల్లో ఏవైనా తప్పులుంటే ఆధారాలు చూపి ఖండన కోరవచ్చు, అంతేగానీ అధికారముందని అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సాక్షి కార్యాలయాలకు వెళ్లి నోటీసుల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మనుగడకు ఇది చాలా ప్రమాదమన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ‘సాక్షి’ మీడియాపై అక్కసు ప్రదర్శిస్తోందన్నారు. చీటికీ, మాటికీ జర్నలిస్టులను బెదిరించేలా పోలీసులతో.. వారి ఇళ్లలో సోదాలు చేస్తూ, నోటీసులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం మీడియా సంస్థలను కూడా విభజించి తమకు అనుకూలంగా ఉన్న మీడియాపై ఒక విధంగా, వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాపై మరొక రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి సరికాదన్నారు. సాక్షి ఽఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన కడపలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు రామాంజనేయరెడ్డి, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, శివరామ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, కెమెరామెన్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేతలు పి. జయచంద్రారెడ్డి, పాకా సురేష్, పులి సునీల్కుమార్, సీహెచ్ వినోద్, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, బి.మరియలు, మల్లీశ్వరి, సుజిత, శివమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కడి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. పులివెందులలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి, ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. పత్రికా స్వేచ్ఛపై దాడితగదంటూ ఆందోళన ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యల పట్ల మండిపాటు అక్రమ కేసులు, వేధింపులపై ఆగ్రహం కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజం కదం తొక్కిన జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రాలు అందజేత -
● బద్వేలులో..
బద్వేలు అర్బన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట బద్వేలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ ఉదయభారతికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు భూమిరెడ్డి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు పి.సుదర్శన్రెడ్డి, జె.జానీసుందరం, జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు ఎ.వెంకటేష్, మోహన్క్రిష్ణ, రాజన్న, శేఖర్రెడ్డి, రఘురామిరెడ్డి, వి.వి.రమణ, అరుణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, సీపీఎం నాయకులు చిన్ని, సీపీఐఎంఎల్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన వైరం
సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఎమ్మెల్యే దంపతుల ఒంటెత్తు పోకడలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు క్రమం తప్పకుండా తిరుగుబావుటా ఎగురువేస్తున్నారు. ఇటీవల ‘సీనియర్లు లేరు...తొక్కా లేద’న్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. మొన్న దేవుని కడప వేదికగా ఎమ్మెల్యే దంపతులకు మంచి బుద్ధులు ప్రసాదించాలని నిరసన తెలిపిన తెలుగుతమ్ముళ్లు, తాజాగా పెద్ద దర్గా వేదికగా మరోమారు ఆరోపణలు గుప్పించారు. కడప అసమ్మతి నేతలకు కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్గా నిలుస్తుండడంతో అధికార పార్టీకి చెందిన కడప, కమలాపురం నేతల మధ్య విభేదాల మంటలు రగిలిపోతున్నాయి. ● కడపలో ఇరవై ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. ఈ గెలుపు వెనుక అనేక మంది కార్యకర్తల శ్రమ లేకపోలేదు. దీన్ని విస్మరించిన మాధవిరెడ్డి, వాసు దంపతులు తమ ఒక్కరిదే విజయమన్నట్లు.. ఒంటెద్దు పోకడలు పోతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో ఏడాది తిరక్కముందే వారి తీరుపై తీవ్రమైన అసంతృప్తులు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈక్రమంలో మొన్న దేవుని కడప వేదికగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులకు మంచి బుద్ధులు ప్రసాదించాలని పాతకడప సింగిల్విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చెన్నంశెట్టి మురళికృష్ణ, దేవుని కడప శంకర్ తదతరుల నాయకత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామికి విన్నవించారు. ఆపై కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి చెంతకు చేరి అండగా నిలవాలని కోరారు. అదే తరహాలో ముస్లిం మైనార్టీ నేతలు కూడా తెరపైకి వచ్చారు. సీనియర్లు లేరు...తోలు లేదు..తొక్కా లేదంటూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పెద్దదర్గాలో ప్రార్ధనలు అనంతరం పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారిని కాదనీ, వారికి నచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపై కమలాపురం టీడీపీ నేత పుత్తా ఇంటికి చేరుకొని అండగా నిలవాలంటూ అభ్యర్థించారు. త్వరలో మరి కొంతమంది క్రిస్టియన్ మైనార్టీలు సైతం మరియాపురం చర్చి నుంచి కూడా ఇలాగే బయలుదేరి వెళ్లి పుత్తాను కలవనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే దిశగా అడుగులు... టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పదవికి ఎసరు పెట్టే దిశగా జిల్లా టీడీపీ నేతల అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కడప గడపలో ఎమ్మెల్యే దంపతుల పట్ల వ్యతిరేకత బూచిగా చూపిస్తూనే, పొలిట్బ్యూరో మెంబర్గా, జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడికి రెండు పదవులు ఉండడం, ఇతర నియోజకవర్గాల నాయకులతో సన్నిహిత సంబంధాలు తెగిపోవడం కూడా కారణాలుగా చెబుతోన్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో జిల్లా అధ్యక్షడు మార్పు చేయాలంటూ తెరవెనుక మంత్రాంగం నడుస్తోన్నట్లు సమాచారం. ఆ మేరకు మధ్యేమార్గంగా జమ్మలమడుగు ఇన్ఛార్జీ భూపేష్రెడ్డికి కట్టబెట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న పుత్తా నరసింహారెడ్డికి అప్పగించాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు కడప నేతలతో వ్యూహాత్మక అడుగులు వేయిస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. సీనియర్లు లేదు... తొక్క లేదు... వాసు మాటలపై మండిపాటు మొన్న దేవుని కడప వేదికగా తెలుగుతమ్ముళ్లు ఆరోపణలు నేడు పెద్దదర్గాలో ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీత అసమ్మతి నేతల్ని చేరదీస్తున్న కమలాపురం నేత పుత్తా నరసింహ రెడ్డి కడప, కమలాపురం ఎమ్మెల్యేల మధ్య రగులుతున్న మంటలు కడప, కమలాపురం ఎమ్మెల్యే మధ్య తీవ్రమైన వైరం నడుస్తోంది. జిల్లా కేంద్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాం, మా ఆధిపత్యమే ఉండాలంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతోంది. బ్రౌన్ లైబ్రరీ శిలాఫలకంలో కమలాపురం ఎమ్మెల్యే పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్టప్ సమీపంలో పుత్తా వర్గీయులు మద్యంషాపు పెట్టుకోవడాన్ని కూడా వ్యతిరేకించారు. మౌర్య వైన్స్ మద్యం షాపుకు బాడుగకు ఇచ్చిన ఇంటికి కార్పొరేషన్ పర్మిషన్ లేదంటూ అధికారులను ఉసిగొల్పి చర్యలకు ఉపక్రమించారు. ఈపరిణామాన్ని టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కార్పోరేషన్ అధికారుల్ని నిర్భంధించి మిమ్మల్ని పంపించన నాయకునికి చెప్పుకొండంటూ పరుష పదజాలంతో హెచ్చరికలు చేశారు. మరోవైపు పుత్తా ఎస్టేట్ డ్రైనేజీ కాలువ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ కడప ఎమ్మెల్యే ఏకంగా ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే కడప అసంతృప్తి నేతలకు అండగా పుత్తా నరసింహారెడ్డి నిలుస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. కడప సీనియర్ నేత ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డితో పుత్తా పూర్తి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. నగర మాజీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి చేస్తే పుత్తా నరసింహారెడ్డి పరామర్శించారు. పాతకడప కృష్ణారెడ్డి అండ్ టీమ్కు అండగా నిలిచారు. తాజాగా ముస్లీం మైనార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఇటీవల కోటిరెడ్డి సర్కిల్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటే పుత్తా వర్గీయులు అండగా నిలిచారు. -
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి సుశాంత్ను పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదడంతో వాతలు పడ్డాయి. పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సుశాంత్ను తెలుగు ఉపాధ్యాయుడు నారాయణ స్వామి కొట్టడంతో వీపుపై చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఏఐఎస్బీ జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డిసర్కిల్:-õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* ç³Æý‡Þ¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯]l*ÞÆð‡¯ŒSÞ ´ëÌSïÜ õÜÐ]l-ÌS¯]l$ {糆 JMýSPÆý‡* Ѱ-Äñæ*-W…-^èl$-Mø-ÐéÌS° õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* f¯]l-Æý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ AÐ]l$-Æó‡…{§ýl MýS$Ð]l*ÆŠ‡ çÜ$Ð]l$¯ŒS í³Ë$ç³#-°^éaÆý‡$. MýSyýl-ç³ÌZ° IsîæI çÜÇPÌŒæ {»ê…^Œl, Ð]l°-ò³…r G‹Ü½I {»ê…^ŒlÌZ fÇ-W¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ »ê«¨-™èl$-ÌSMýS$ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯ŒS-{çÜ*-ె ¯ŒSÞ ´ëÌSïÜ Ððl¬™é¢ÌS¯]l$ A…§ýlgôæ-Ô>Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> iG… Ð]l*sêÏ-yýl$™èl* {ç³çÜ$¢™èl M>ÌS…ÌZ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïܰ ¡çÜ$-Mø-Ð]lyýl… AÐ]l-çÜ-Æý‡Ð]l$-¯é²Æý‡$. ´ëÌSïÜ §éÓÆ> BǦMýS…V> A°² Ñ«§éÌê ™øyéµr$ A…§ýl$-™èl$…-§ýl¯é²Æý‡$. A¯]l…™èlÆý‡… MýS–çÙ~-M>…™Œæ ÔèæÆý‡Ã, íܧéª-Æð‡-yìlzÌS MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïÜ ^ðlMýS$P¯]l$ A…§ýl-gôæ-Ô>Æý‡$. D M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ »êÅ…MýS$ yìlç³NÅsîæ f¯]lÆý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ õßæÐ]l$, Èh¯]lÌŒæ Ðól$¯ól-fÆŠ‡ MýS–çÙ~ MìSÚùÆŠæ, f¯]lÆý‡ÌŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ HÇĶæ* Ðól$¯ólfÆŠ‡ fĶæ$^èl…-{§ýl™ø-´ër$ C™èlÆý‡ »êÅ…MýS$ A«¨-M>-Æý‡$Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధికి కృషి చేయాలి కడప అగ్రికల్చర్: ఉద్యాన పంటల క్లస్టర్ల సమగ్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఉద్యానశాఖ కన్సల్టెంట్ విద్యాశంకర్ సూచించారు. గురువారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీ్ష్ ఆధ్వర్యంలో ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉద్యాన పంటల క్లస్టర్ సమగ్రాభివృద్ధి కార్యక్రమంపై అవగాహన, వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటలైన అరటి, బత్తాయి, ఉల్లి, పసుపు, చామంతి తదితర పంటల క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ద్వారా క్లస్టర్ సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టవలసిన ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ , ఎగుమతి, మొదలకు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్, సహాయ సంచాలకుడు రవిచంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, ప్రధాన శాస్త్రవేత్తలు ప్రభాకర్రెడ్డి, సునీల్, ఉద్యానశాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, రైతులు పాల్గొన్నారు. -
ప్రత్యక్ష రాజకీయాల్లోకి చవ్వా దుష్యంత్రెడ్డి
పులివెందుల: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా దుష్యంత్రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రకటించారు. దుష్యంత్రెడ్డి గతంలో కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశారు. గురువారం పులివెందులలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి గత 30ఏళ్లుగా వైఎస్ మనోహర్రెడ్డి సేవలు అందించారని, ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా దుష్యంత్రెడ్డి మనోహర్రెడ్డికి తోడుగా పులివెందుల మున్సిపాలిటీలో సేవలందిస్తారన్నారు. పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. -
డబ్బు ఇవ్వలేదని తిప్పుతున్నారు..
1250–4 సర్వే నంబర్లో నాకు 1.06 సెంట్ల స్థలం ఉంది. 1987లో నాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. అప్పటి నుంచి నేను సాగు చేసుకుంటున్నాను. 2017లో నా భూమిని వివాదాస్పద భూమిగా ఆన్లైన్లో అధికారులు నమోదు చేశారు. ఈ భూమిపై కోర్టుకు వెళితే నాకు అనుకూలంగా వచ్చింది. దీనికి సంబంధించి అన్ని పత్రాలను జాయింట్ కలెక్టర్కు చూపించాను. వెంటనే నా భూమి ఆన్లైన్లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల నుంచి ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ దగ్గరకు తిరుగుతున్నా ఎలాంటి రిపోర్టు రాయడం లేదు. పని కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వలేదని తిప్పుతున్నారు. నెల రోజులుగా తిరుగుతున్నా అధికారులు పలకడం లేదు. ఆన్లైన్ చేయడం లేదు. తవ్వా సుబ్బారెడ్డి, ఖాజీపేట -
తహసీల్దార్ కార్యాలయంలో కలెక్షన్ కింగ్!
● ఏ పని కావాలన్నా ఆయనే కీలకం ● చేతులు తడిపితే ఓకే.. లేదంటే కాళ్లరిగేలా తిరగాల్సిందే ● ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసిన అవినీతి ఖాజీపేట : ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలోకి నీతి రానంటోంది.. అవినీతి పోనంటోంది. ఎంత మంది అధికారులు, కింది స్థాయి సిబ్బంది సస్పెండ్ అయినా, ఏసీబీకి దొరికినా పనితీరులో మార్పు లేదు. వచ్చిన వారంతా పైసల కోసం కక్కుర్తి పడటం, అందరినీ వేధించడం పరిపాటిగా మారింది. ప్రజల సమస్యలను వారికి లాభంగా మార్చుకుని అందరి దగ్గర నుంచి ముక్కు పిండి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. ఎంత ఎక్కువగా తిప్పుకుంటే అంత డబ్బులు అన్నట్లుగా వ్యవహారం ఉండటంతో ప్రజలు ఎక్కువ సార్లు తిరగలేక వారు అడిగిన కాడికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఒక అధికారి కింగ్ మేకర్గా మారాడు. ఏ పని చేయాలన్నా ఆయనదే కీలక పాత్రగా మారింది. ఆయన అనుమతి లేనిదే అలాగే ఆయన సహకారం లేనిదే తహసీల్దార్ కార్యాలయంలో ఏ పనీ పూర్తి కాదు. ప్రతి పనికి ఆయన ఒక ధర నిర్ణయిస్తాడు. ఆ మొత్తం చేతికి వచ్చిందంటే చాలు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించుకుని మరీ పనులు పూర్తి చేస్తాడు. లేదంటే ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోడు. వారికి చుక్కలు చూపిస్తాడు. ఇలా నెల, రెండు నెలలైనా తిరుగుతూ ఉండాల్సిందే. అదే కాసులు అందితే చకచకా పనులు పూర్తి చేస్తాడు. దిగువ స్థాయి సిబ్బంది పనితీరూ అంతే.. భూ సమస్యలు, అన్నదమ్ముల భాగ పరిష్కారం పూర్తి చేసుకున్న భూముల నమోదు, ఆన్లైన్ నమోదు, పాసు పుస్తకాలు, ఇలా ఒక్కటేమిటి ఏ పని కావాలన్నా దిగువ స్థాయి సిబ్బంది పనితీరు చాలా దారుణంగా ఉంది. కొందరు కట్టుబడి స్థాయి సిబ్బంది కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే దిగువ స్థాయిలోని వారు సైతం సంతకాలు చేయడం లేదు. అందుకు వారు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బు ముట్టిందంటే సంతకాలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై ఉన్నతాధికారులు నిఘా ఉంచి ప్రత్యేక చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ నాయకులకే బేజారు.. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న తంతును చూసి టీడీపీ నాయకులే బేజారు పడుతున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా తమ పనులు జరగడం లేదని వాపోతున్నారు. అధికారుల దగ్గరకు పనులు చేయించుకునేందుకు వెళ్లలేక.. వారి డిమాండ్లు తీర్చలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుని నిజాయితీగా పనిచేసే వారిని నియమిస్తే బాగుంటుందని కోరుతున్నారు. తమ వద్దకు వచ్చే వారి పనులు కూడా చేయలేక చివరకు తమ పనులు కూడా చేసుకోలేక ఏకంగా తహసీల్దార్ కార్యాలయం వైపు వెళ్లడమే మానుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. -
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రొద్దుటూరు:స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ అర్హత కలిగి ఉర్దూ మీడియంలో జువాలజీ ఉర్దూ, సివిక్స్ ఉర్దూ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 25న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. సుబ్బరాయుడు సేవలు చిరస్మరణీయం కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాయలసీమకు కృష్ణా నదీ జలాల మళ్లింపు కోసం నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం మాజీ అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకుడు రూక అశోక్రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గాలి చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఎం అనుబంధ రైతు సంఘం నాయకుడు దస్తగిరి రెడ్డి తదితరులు కొనియాడారు. గురువారం నగరంలోని ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాల్లో ఇటీవల మరణించిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బరాయుడు నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న సందర్భంలో నీటి లభ్యత, నీటి అవసరాలు అనే అంశంపై నిరంతరం అధ్యయనం చేయడమే కాకుండా ఉద్యమకారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేవారన్నారు. సుబ్బరాయుడు ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు, కేసీ కెనాల్ చివరి అయకట్టు స్థిరీకరణకు రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి నోచుకోకపోవడం విచారకరమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ, సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, మునయ్య, యానాదయ్య, కృష్ణమూర్తి, నాగిరెడ్డి, భద్రయ్య, గురవయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను పట్టించుకోరా?
చాపాడు : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే నాథుడే లేరా అని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం చాపాడులో ఆయన మాట్లాడుతూ వరుణ దేవుడు కరుణించినప్పటికీ సబ్సిడీ బుడ్డ శనగ, వేరుశనగలతోపాటు డీఏపీ, యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పంటల బీమా గురించి పత్రికా ప్రకటనలు తప్ప.. ఇంత వరకు ఏ రైతుకు ఏ పంటకు ఎంత మొత్తం జమ చేశారో చెప్పాలన్నారు. ఉల్లి పంట మంచి దిగుబడి వచ్చినప్పటికీ 40 రోజుల నుంచి రైతులు కన్నీటిపాలవుతున్నారన్నారు. అరటి, వరి, టమాటా తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం
● కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణపులివెందుల : రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పులివెందులలో గురువారం ప్రారంభమైంది. స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో పులివెందుల మున్సిపాలిటీ, రూరల్, తొండూరు, లింగాల, సింహాద్రిపురం మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డిలు సమావేశం నిర్వహించారు. అంతకముందు ఆడిటోరియంలోని వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఎంపీ అవినాష్రెడ్డి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పప్పులు, బెల్లాలు మాదిరిగా ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తున్నారన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించిన 50 ఎకరాలకు చంద్రబాబు నిర్ణయించిన మేరకు ఏడాదికి అద్దె రూ.5వేలు అన్నారు. అక్కడ రూ.300 కోట్ల విలువ చేసే బిల్డింగ్లు ఉన్నాయని, దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే స్థలం, మొత్తం నాలుగైదు వందల కోట్ల ఆస్తిని ఈ మాదిరి సంవత్సరానికి రూ.5వేలకు అద్దెకు ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రైవేట్ యాజమాన్యానికి ఉచితంగా వైద్యం చేయాలన్న శ్రద్ధ ఎక్కడ నుంచి వస్తుందన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో కూడా కొంత కోటా సీట్లు ఉచితంగా ఇవ్వాలని చట్టంలో ఉందని, కానీ ఆ చట్టాన్ని ఎవరూ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు దాదాపు 96 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలల్లో 2200 మెడికల్ సీట్లు ఉండేవన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ కళాశాలల ద్వారా 2,500 మెడికల్ సీట్లు అదనంగా రాగా.. ప్రస్తుతం 4,700 మెడికల్ సీట్లు అయ్యాయన్నారు. జగనన్న ప్రభుత్వం విద్యపైన, వైద్యంపైన ఎంత శ్రద్ధ వహించిందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థంభించిన ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రంలో గత 5 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు స్థంభించాయని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఈ ప్రభుత్వం రూ.3,500 కోట్ల బకాయిలు పడిందన్నారు. దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలుపుదల చేశాయన్నారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు చెల్లించకపోతే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడంలేదన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చంద్రబాబుకు మ్యాటర్ వీక్.. ప్రచారం పీక్: ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు మ్యాటర్ వీక్ – ప్రచారం పీక్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇటీవల కర్నూలులో మాట్లాడుతూ సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన చెప్పినట్లు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అయితే గడిచిన 16 నెలల కాలంలో రూ.17వేల కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా హామీలన్ని అమలు చేశానని చెప్పుకునే దరిద్రమైన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆడవారికి ఏడాదికి రూ.18వేలు అన్నారని, కేవలం ఈ పథకానికే రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 50ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పింఛను పథకాన్ని కూడా అటకెక్కించారన్నారు. ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యంలో టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు ఏడాదికి రూ.5వేల కోట్లు వచ్చే మార్గం చెబుతానని చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నాకే ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించారన్నారు. ఆ ఒప్పందం మేరకే ప్రస్తుతం నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. వైఎస్ మనోహర్రెడ్డి, వజ్ర భాస్కర్రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలను తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబు గతంలో 14ఏళ్లు సీఎంగా ఉన్నారని, మళ్లీ ఇప్పుడు సీఎంగా ఉన్నారని, ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదన్నారు. -
విజేతలకు బహుమతులు పంపిణీ
ప్రొద్దుటూరు : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో గురువారం జిల్లా నెహ్రూ యువ కేంద్రం, వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు మహిళలు, పురుషులకు నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ సదాశివయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం వాలీబాల్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.10వేలు ప్రొద్దుటూరు టౌన్ వారికి, ద్వితీయ బహుమతి రూ.7వేలు ఆర్సీపీఈకి, కబడ్డీలో మొదటి బహుమతి రాయలసీమ వ్యాయామ విద్య కళాశాల జట్టుకు రూ.10వేలు, కమలాపురం ఎస్ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులకు ద్వితీయ బహుమతి రూ.7వేలు, ట్రోఫీతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి, హరిత రెడ్డి, వెంకట్ యాదవ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, వేములపాటి సూర్యనారాయణరెడ్డి, గల్ఫ్ మహిళా సేవా సమితి కువైట్ వారు పాల్గొన్నారు. -
కోత మిల్లులపై విజిలెన్స్ విచారణ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సామిల్లు (కోత మిల్లు)లపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లులను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ డీఎఫ్ఓ ధర్మరక్షిత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విచారణ చేపట్టారు. సా మిల్లులు రిజర్వ్ ఫారెస్ట్కు 5 కిలో మీటర్ల దూరంలో ఉండాలి. అయితే పట్టణంలోని మిల్లులు 5 కిలోమీటర్ల లోపలే ఉన్నాయనేది ప్రధాన ఫిర్యాదు. ప్రొద్దుటూరులో 17 సా మిల్లులు ఉండగా అందులో 6 మిల్లులకు లైసెన్స్ గడువు ముగిసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరులోని పలు కోత మిల్లులను పరిశీలించారు. మిల్లుల యజమానులను కార్యాలయాలకు పిలిపించి లైసెన్స్లు, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. కొందరు మిల్లుల యజమానులు అటవీశాఖ అనుమతి లేకుండా లైసెన్స్లో ఉన్న చోటు కాకుండా మరో చోటికి మార్చినట్లు అధికారులు గుర్తించారు. మిల్లుల యజమానులు కొందరు లైసెన్స్లు రెన్యువల్ చేసుకోకుండానే నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు విచారణ జరిగింది. స్థానిక అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తునట్లు తెలుస్తోంది. అనంతరం ఏకో పార్కులో జరుగుతున్న నగరవనం పనులను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ హేమాంజలి, డీఆర్ఓ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
సబ్సిడీ విత్తనం ఇంకెప్పుడు!
ఖరీఫ్ ముగిసింది.. రబీ వచ్చింది.. విత్తనం మాటే లేదు.. చినుకు రాలింది.. నేల తడిసింది.. సబ్సిడీ విత్తనం ఊసే లేదు.. కూటమి ప్రణాళిక లోపం అన్నదాతకు శాపమవుతోంది. పదునెక్కిన ఈ వానకు పొలమంతా నాగలిపట్టాల్సిన రైతు.. విత్తనం కోసమే ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకటా రెండా సీజన్ మొదలై పక్షం రోజులు దాటినా సబ్సిడీ విత్తన పంపిణీకి మోక్షం రావడం లేదు. రాజుపాళెంలో శనగసాగుకు ట్రాక్టర్తో పొలాన్ని సిద్దం చేస్తున్న రైతు, ఎర్రగుంట్ల మండలంలో శనగసాగుకు విత్త్తనాన్ని సిద్దం చేసుకుంటున్న రైతన్న కడప అగ్రికల్చర్: జిల్లాలో సబ్సిడీ శనగ విత్తన పంపిణీ అతిగతి లేకుండా పోయింది. రబీ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా ప్రభుత్వం ఇంతవరకు విత్తన పంపిణీ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విత్తనాల పంపిణీకి ముందు కనీసం రైతుభరోసా కేంద్రాలలో రైతుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించకపోవడంతో ఇక విత్తన పంపిణీ ఎప్పుడు చేస్తారని అన్నదాతలు మండిపడుతున్నారు. గతేడాది విత్తనాలను సరఫరా చేసిన టెండర్ దార్లకు ఇంతవరకు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ ఏడాది విత్తన పంపిణీ ఆలస్యమవుతోన్నట్లు సమాచారం. పదును ఆరిపోతుందనే... ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో చాలా ప్రాంతాలలో పదును అయ్యింది. ఈ పదునులోనే చాలా మంది రైతులు శనగ పంటను సాగు చేయనున్నారు. కాకపోతే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలలో శనగపంటను సాగుకానుంది. మండలాల్లో ఇబ్బందులకు గురవుతున్న ఏవోలు. జిల్లాలో శనగపంటను అధికంగా సాగు చేసే మండలాలైన పెద్దముడియం, రాజుపాలెం, తొండూరు, సింహాద్రిపురం, వేముల, వేంపల్లి, కొండాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైలవారంతోపాటు పలు మండాలల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శనగను సాగు చేసే రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. దీనికి తోడు రైతులు అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల నుంచి మౌనమే సమాధానంగా ఉంటుందని రైతులు తెలిపారు. రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు... ప్రభుత్వం సరఫరా చేస్తే సబ్సిడి విత్తనాల కోసం ఎదురు చూస్తే పదును ఆరిపోతుందని భావించిన పలువురు రైతులు ప్రైవేటు రైతుల నుంచి శనగలు కొనుగోలును చేస్తున్నారు. పైగా ప్రభుత్వం సరఫరా చేసే శనగ విత్తనాలు ఏవిధంగా ఉంటాయోననే ఆందోళన కూడా రైతులను వేధిస్తుంది. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట రైతులకు సరఫరా చేసే శనగ విత్తనాల పంపిణీలో ప్రభు త్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రైతుల సమ స్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే విత్తనాల సరఫరాను సకాలంలో సరఫరా చేయలేకపోయింది. దీంతో చాలా మంది రైతులు బయట మర్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ఆత్మహత్యలను ఆపి.. ప్రాణాలు నిలిపి..
● ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు ● శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో ఇద్దరి నిండు ప్రాణాలు నిలిచాయి. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి రాగా రైల్వే పోలీసులు గమనించి వారిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలిలా.. వేంపల్లికి చెందిన సుందరి సుమంజలి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు వచ్చింది. రైలు పట్టాలపై పడుకొని ఉండటాన్ని ఎర్రగుంట్ల రైల్వే కానిస్టేబుళ్లు డి.వీరనారాయణ, శ్రీనివాసరావులు గమనించారు. వెంటనే రైల్వే ట్రాక్పై ఉన్న సుందరి సుమంజలిని కాపాడారు. తర్వాత రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి వివరాలు సేకరించారు. ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలతో సంతోషంగా జీవించాలని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. మద్యం మత్తులో.. ప్రొద్దుటూరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలో గొడవ పడి అతిగా మద్యం తాగి ఎర్రగుంట్లకు వచ్చాడు. రైలు కింద పడి చనిపోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు డి. వీరనారాయణ, రామాంజనేయరెడ్డిలు వెంటనే స్పందించి పట్టాలపై ఉన్న రామాంజనేయులును కాపాడి పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లోనూ రైల్వే పోలీసులు చూపిన చొరవను చూసిన వారు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు. -
సేవ చేయడమే పరమ ధర్మం
కడప ఎడ్యుకేషన్ : ’పరుల సేవ చేయడమే పరమ ధర్మము.. పరుల బాధను అర్థం చేసుకున్న వాడే పరమ భక్తుడు’ అన్న వేమన మాటలు మనందరికీ స్ఫూర్తి మంత్రాలు. ఆయన ఆదర్శ భావజాలం యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న మనందరి మనసులలో ఇమిడిపోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఉద్ఘాటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజానికి విస్త్తృత సేవలు అందించిన కళాశాలలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వలంటీర్లకు యోగివేమన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం –2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అన్నమాచార్య సెనేట్ హాలులో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సేవ జీవితంలో భాగం కావాలన్నారు. గ్రామీణ ప్రజలను ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం, విద్య, మూఢనమ్మకాలు వంటి అంశాలపై నిత్యం చైతన్యం చేయాలని సూచించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఓలు, వలంటీర్లు పాల్గొన్నారు. అవార్డులు అందుకున్నది వీరే.. ఉత్తమ వలంటీర్లు డి.శ్రావణి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజంపేట), డి. సిద్ధయ్య, (ఎస్.బి.ఎస్వైఎం డిగ్రీ కళాశాల, మైదుకూరు), కేబీ ఈశ్వర్( వైవీయూ కాలేజ్), కె. శ్రీనివాసులు రెడ్డి (వైవీయూ పీజీ కళాశాల). ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా.. డాక్టర్ కె. గోవింద రెడ్డి, (ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కడప), డాక్టర్ యు.సునీత, (ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పులివెందుల), సి. మల్లేశ్వరమ్మ, (వైఎస్ఆర్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లి,), డాక్టర్ ఎ.నాగరాజు, (ప్రభుత్వ పురుషుల కళాశాల (ఎ), కడప), డాక్టర్ పత్తి వెంకట కృష్ణా రెడ్డి, (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), డాక్టర్ ఎస్.సునీత, (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప), డాక్టర్ ఎస్.పి. వెంకట రమణ, (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప). ఉత్తమ కళాశాలలుగా.. సి. సూర్యారావు, (ప్రిన్సిపల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కడప ), డాక్టర్ పి. నారాయణ రెడ్డి, (ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు,), ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, (ప్రిన్సిపల్ యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్,).వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ -
ఉల్లి రైతులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
ప్రొద్దుటూరు : గిట్టుబాటు ధర లేని కారణంగా ఉల్లి పంట సాగు చేసిన రైతులు ఉరి వేసుకునే పరిస్థితులు దాపురించాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లా ఉల్లి రైతులపై కూటమి ప్రభుత్వం వివక్షను ప్రదర్శించిందన్నారు. కనీసం కర్నూలు జిల్లా రైతుల వరకు అయినా న్యాయం చేయలేదన్నారు. ఎకరా ఉల్లి పంటను సాగు చేయాలంటే రూ.లక్ష పెట్టుబడి అవుతుందని, చాలా మంది రైతులు ఐదు ఎకరాల పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు 250 క్వింటాళ్ల పంట పండుతుందని, ధర ఉంటే మూడింతలు లాభాలు వస్తాయన్నారు. ఏ మాత్రం ధర లేని కారణంగా పండించిన పంటను రోడ్లపైనే పారేసే దుస్థితి ఏర్పడిందన్నారు. పంట సాగు చేసిన తర్వాత మూడు నెలల కాలంలో నిత్యం పంటకు కాపలా ఉంటూ సంరక్షించుకున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెక్టార్కు రూ.లక్ష పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలసి కలెక్టరేట్ ఎదుట 48 గంటలు నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వంలో స్పందన రాకపోతే జోలె పట్టి విరాళాలు సేకరించి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ద్వారా ఉల్లి రైతులకు అందజేస్తామన్నారు. ఉల్లి రైతుల సమస్యను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉల్లిని సాగు చేశారని అన్నారు. వ్యవసాయంపై సీఎం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అది ఏమాత్రం సరిపోదని, హెక్టారుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
పీఠాధిపతిని నియమించాలి
కడప రూరల్ : కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కొలువైన బ్రహ్మంగారిమఠానికి పీఠాధిపతిని నియమించి భక్తుల మనోభావాలను గౌరవించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ కోరారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి గతించి నాలుగేళ్లు అయిన్పపటికీ నేటికీ పీఠాధిపతి నియామకం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సాధారణంగా ఏ పీఠంలో అయినా పీఠాధిపతి గతిస్తే సత్వరమే తాత్కాలిక పీఠాధిపతిని నియమించి పీఠం కార్యకలాపాలు కొనసాగిస్తారన్నారు. తాజాగా కోర్టు కూడా సత్వరమే తాత్కాలిక పీఠాధిపతిని నియమించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బ్రహ్మంగారిమఠం పీఠానికి శాశ్వత పీఠాధిపతిని నియమించాలని, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు స్వామిజీలు, భక్తులు పాల్గొన్నారు. -
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
జమ్మలమడుగు రూరల్/మైలవరం : కుటుంబ సమస్యలతో తన ముగ్గురు పిల్లలు, తాను కలసి మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన మహిళను పోలీసులు కాపాడిన సంఘటన మైలవరం మండలంలో జరిగింది. ఏఎస్ఐ లక్ష్మీరెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన మహేశ్వరిని తల్లిదండ్రులు నొస్సం గ్రామానికి చెందిన వెంకట శివకు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వెంకట శివ పట్టణంలోని ప్రైవేట్ ఫైనాన్స్లో (డబ్బులు వసూలు చేయడం)లో విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి 8, 5, 2 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు నంద్యాల జిల్లా, సంజామల మండలం నొస్సం గ్రామంలో కాపురం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు రావడంతో జీవితంపై విరక్తి చెంది మైలవరం జలాశయంలో ముగ్గురు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె జలాశయం కట్టమీదకు చేరుకుంది. గమనించిన మైలవరం అటో డ్రైవర్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రియాజ్, రమేష్, హృదయ్ అనే సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని మహిళను పోలీస్ స్టేషన్కు పిలుచుకొని వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం భార్యాభర్తలకు ఏఎస్ఐ లక్ష్మీరెడ్డి, సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. మహిళ, ముగ్గురు పిల్లలను కాపాడిన పోలీసులు -
పరిశోధనా విశ్వవిద్యాలయంగా నిలవాలి
కడప ఎడ్యుకేషన్ : నాణ్యమైన పరిశోధనలతో యోగి వేమన విశ్వవిద్యాలయం రానున్న మూడేళ్లలో ‘పరిశోధన విశ్వవిద్యాలయం’గా నిలవాలని.. ఆ బాధ్యతను రీసెర్చ్ స్కాలర్లు తీసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయంలోని స్కాలర్లతో అన్నమాచార్య సెనేట్ హాలులో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనల సంఖ్య పెరగడంతోపాటు నాణ్యమైన పరిశోధనలు రావాలన్నారు. ప్రఖ్యాత పరిశోధన జర్నల్స్లో కథనాలు ప్రచరితమైతే తద్వారా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పక్షం రోజులకు ఒకసారి నిపుణులను మన విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వివిధ అంశాల్లో మెలకువలు నేర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్ర ఓబుళరెడ్డి, స్కాలర్లు పాల్గొన్నారు. ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ -
ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : ఒంటరి జీవితం గడపలేక షేక్ ఆబిదా (42) అనే మహిళ బుధవారం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుందరాచార్యుల వీధికి చెందిన ఆబిదాకు రాజుపాళెం మండలం గోపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి ఇమాంఖాసీం అనే కుమారుడు ఉన్నాడు. తరచు మనస్పర్థలు రావడంతో భార్యా భర్తలు ఏడేళ్ల క్రితం విడిపోయారు. కుమారుడు ఇమాంఖాసీం రెండేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ప్రొద్దుటూరులోని సుందరాచార్యుల వీధిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుండటంతో ఆ డబ్బుతోనే జీవనం సాగించేది. కుమారుడు మృతి చెందడం, భర్త దూరం కావడం.. ఈ రెండు ఘటనలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. దీంతో ఒంటరితనాన్ని భరించలేని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. తల్లి, బంధువులు వచ్చేలోపే శరీరం పూర్తిగా కాలిపోయి ఆబిదా మృతి చెందింది. ఆబిదా తల్లి మెహరున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
ప్రమాద బీమా.. తపాలా శాఖ ధీమా !
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఒక వ్యక్తి గుండె సమస్యతో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని... రూ.లక్ష వరకు ఖర్చవుతుందన్నారు. కొన్నాళ్ల తర్వాత మరో ఆసుపత్రికి వెళితే రూ.2 లక్షలు అవుతుందన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు పాక్షికంగా, లేనిపక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా తపాలా శాఖ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. అర్హతలు.. బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గలవారు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ దానితో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది. సాయుధ బలగాలకు ఇది వర్తించదు. ఎంతో భరోసా... ● రోజుకు రూ.1.50తో రూ.10 లక్షలు, రూ.2తో రూ.15 లక్షలు విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులో తెచ్చింది. ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ. 10 లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15 లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ● ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం లేదా పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. ● ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే రూ.60 వేల వరకు చెల్లిస్తారు. ● ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు. ● ప్రమాదం జరిగిన వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.లక్ష వరకు కవర్ చేస్తారు. ● ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం రూ.లక్ష వరకు చేకూరుతుంది ● తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పెడితే 4 కన్సల్టెంట్లు ఉచితం. ● ఒకరికి ప్రమాదం జరిగి వేరేచోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25 వేల వరకు చెల్లిస్తారు. ● ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.5వేల వరకు లభిస్తుంది. రోజుకు రూ.1.50తో రూ. 10 లక్షలు రూ. 2 తో రూ. 15 లక్షలు సామాన్యులకు అందుబాటులో తపాలా శాఖ బీమా పాలసీలు -
పోలీసులు న్యాయం చేయాలి
మదనపల్లె : తనకు జరిగిన అన్యాయంపై పోలీసులే న్యాయం చేయాలని లేని పక్షంలో అత్మహత్యే శరణ్యమని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానిక చీకలగుట్టలో ఉంటున్న దంపతులు దమరేశ్వర్, స్వర్ణలత తన దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయింది. తనను నమ్మించి రూ.45 లక్షల నగదు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించాలని కోరుతుంటే బెదిరిస్తున్నారని పేర్కొంది. సీటీఎం రోడ్డులో తనపై దాడికి ప్రయత్నించారని కన్నీటిపర్యంతమైంది. ఒంటరిగా ఉన్న తనను ఏమైనా చేస్తారని భయాందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, పైసాపైసా కూడబెట్టిన డబ్బును, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తిరిగి ఇప్పించకుంటే తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
పుష్పగిరి ఆలయాలకు రూ.13,41,000 ఆదాయం
వల్లూరు : ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఒక సంవత్సర కాలానికి తలనీలాల సేకరణకు, టెంకాయల విక్రయ హక్కుకు కొండపైన గల ఆలయంలో దేవదాయ శాఖ అధికారులు బుధవారం వేలం పాట నిర్వహించారు. మొత్తం రూ. 13, 41, 000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం ఇండియన్ బ్యాంకు కడప బ్రాంచ్లో జమ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప డివిజినల్ అధికారి శివయ్య, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఐజీ గార్ల్ను సందర్శించిన జర్మన్ అంబాసిడర్ పులివెందుల : పులివెందులలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ – లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ (ఐజీ గార్ల్)ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ బుధవారం సందర్శించారు. ఆయన వెంట బెంగళూరు కాన్సుల్ జనరల్ అమిత దేశాయ్, కేఎఫ్డబ్ల్యూబీ నాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు అకాడమీలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్కడ చేపడుతున్న జాతీయ, అంతర్జాతీయస్థాయి అధ్యయనాలు, అకాడమీ ద్వారా సాధిస్తున్న ఫలితాలను పరిశీలించారు. అలాగే ఫార్మర్ సైంటిస్ట్, మెంటార్ కోర్సులను అభ్యసిస్తున్న రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, యంగ్ రీసెర్చ్ ఫెలోస్, ఇంటర్న్లతో మాట్లాడారు. అనంతరం ఐజీ గార్ల్లో ప్రకృతి వ్యవసాయ చక్రం ద్వారా సాగు పద్ధతులు, రైతు సాధికార సంస్థ వారిచే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాల వాడకంవల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆటోను ఢీ కొన్న లారీ ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆటోలోని యువకుడి కాళ్లకు తీవ్ర గాయమైంది. పోలీసుల వివరాల మేరకు.. రాజంపేట నుంచి కడపకు వెళుతున్న అరటికాయల ఆటోను కొత్తమాధవరం బస్టాండు సమీపానికి రాగానే కడప నుంచి రాజంపేట వైపు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ ఢీ కొంది. దీంతో ఆటోలోని కడపకు చెందిన శివశంకర్(22) కాళ్లకు తీవ్ర గాయమైంది. గాయపడిన యువకుడిని కడప రిమ్స్కు తరలించారు గుర్తు తెలియని వ్యక్తి మృతి రాయచోటి టౌన్ : రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి (50)మృతి చెందాడు. ఆస్పత్రి అధికారి వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం గాలివీడు ప్రాంతం నుంచి 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న అతనికి చికిత్స చేసినప్పటికి పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన రోజు తన పేరు చంద్రయ్య అని, ఊరు తిరుపతి అని చెప్పాడు. ఇంటి జాగా కోసం అన్నదమ్ముల ఘర్షణ ములకలచెరువు : ఇంటిజాగా విషయంపై అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు... మండలంలోని సోంపల్లెకు చెందిన అన్నదమ్ములు ఖాదర్వలీ, నజీర్లు ఇంటిజాగా విష యంపై గొడవపడ్డారు. ఈ గొడవలో ఖాదర్వలీ తలపై నజీర్ ఇనుపరాడ్డుతో కొట్టాడు. నజీర్ బంధువులు బీబీ, హుస్సేన్, ఫకృద్దీన్ కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : లైసెన్సుదారులు తమ మద్యం దుకాణాలలో రీటైల్ పోర్టల్ ద్వారా స్కాన్ అయిన మద్యం సీసాలను మాత్రమే అమ్మాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. రాయచోటి పట్టణంలో బుధవారం పలు మద్యం షాపుల యజమానులకు, నౌకరనామదారులకు ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన మద్యం బాటిళ్లను అమ్మే ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించి సూచనలు -
ఎడిటర్ పట్ల వేధింపులు తగదు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు వేధించడం తగదు. నోటీసులు ఇవ్వాలి తప్ప కార్యాలయాల వద్దకు వెళ్లి హంగామా చేయడం మంచిది పద్ధతి కాదు. ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలు, ఇతర పరిస్థితులను వివరిస్తున్నసాక్షి జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. ఏదైనా ఉంటే న్యాయపరంగా తేల్చుకోవాలి. కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. తప్పు చేస్తే లీగల్గా నోటీసులు ఇచ్చి న్యాయస్థానంలో పోరాడాలే తప్ప ఇలా చేయడం కరెక్టు కాదు. – సి.వెంకటరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కడప -
జిల్లాలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ వివరాలు
ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు: 42 ఒక ఆసుపత్రికి ఒక రోజుకు వచ్చే ఓపీలు : 30కి పైగా అందులో ఇన్ పేషెంట్స్గా చేరేవారు : 5 మందికి పైగా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు: రూ 150 కోట్లు వర్తించే వ్యాధులు: 3,255 ఒక రోజుకు వచ్చే రోగులు: 2 వేలకు పైగా -
సూపర్ సిక్స్.. అట్టర్ ఫ్లాప్
పులివెందుల: కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ ఫ్లాప్ అయ్యాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోసమే కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టారన్నారు. వారికి ఎల్లో మీడియా వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలు తొందరగానే గ్రహించారన్నారు. కూటమి అమలు చేస్తున్న అరకొర పథకాల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని ప్రజలు అభిప్రాయానికి వచ్చారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉల్లి రైతులను ఆదుకోవాలి.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఉల్లి రైతులు ఎంపీని కలిశారు. ఉల్లి పంట ధరలు దారుణంగా పతనమయ్యాయని, లక్షలు ఖర్చు పెట్టి పంటను సాగు చేసి అప్పులపాలయ్యామని వాపోయారు. దీనికి స్పందించిన ఎంపీ ఇప్పటికే ఉల్లి రైతుల కష్టాలను వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కలెక్టర్కు నివేదించామన్నారు. దీంతో పాటు మరోసారి అక్కడి నుంచే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫోన్ చేసి మాట్లాడారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు రూ.50వేలు పరిహారం ప్రకటించిందని, అదేవిధంగా వైఎస్సార్ జిల్లా రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. దీనికి కలెక్టర్ రెండు, మూడు రోజుల్లో జిల్లా రైతులకు కూడా నష్టపరిహారం విషయమై జీఓ వస్తుందని ఎంపీకి వివరించారు. కూటమి ప్రభుత్వంవల్ల రాష్ట్రానికి అన్యాయం కూటమి ప్రభుత్వంవల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సాయినాఽథ్ శర్మ పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఎంపీ అవినాష్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనను ఆత్మీయంగా అభినందించి కొత్త బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. నివాళి: పట్టణంలోని జెండామానువీధిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త జాఫర్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ జాఫర్ మృతదేహానికి నివాళులర్పించారు.బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో రామసుబ్బారెడ్డి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ప్రజాస్వామ్యంపై పోలీసు పోటు
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదు. ఇది పత్రి కా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే పరిణించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. జిల్లాలో కూడా సాక్షి జర్నలిస్టులపై పదేపదే పోలీసులు కేసులు పెట్టి ఏదో ఒకరకంగా వేధించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. – పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సాక్షి కడప: ప్రజాసామ్యంలో కీలకమైన పత్రికాస్వేచ్ఛపై పోలీసుల జులుం కొనసాగుతోంది. వార్తలు రాస్తే అడుగడుగునా వేధింపులు....మరోవైపు నోటీసుల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారంపై వార్త రాశారన్న అక్కసుతో పోలీసులు ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డికి నోటీసుల నెపంతో హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్ చల్ చేశారు. అంతేకాకుండా విచారణ పేరుతో సాక్షి ఎడిటర్ను ఇబ్బందులకు గురిచేయాలని చేయడంతోపాటు ఏదో ఒక రకంగా వేధింపులే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశారు. మరోవైపు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోనూ సాక్షి జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా జర్నలిస్టులకు ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో కూడా సాక్షి ప్రతినిధులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ప్రధానంగా ఇటీవల సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో....ఎలాంటి విపత్కరపరిస్థితులు లేకపోయినా వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వేములలో జిల్లా సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్తోపాటు మిగతా సాక్షి జర్నలిస్టులపై కూడా దాడులకు పూనుకున్నారు. ఇవే కాకుండా సాక్షి జిల్లా బ్యూరో ఇన్చార్జి ఎం.బాలకృష్ణారెడ్డిపై కూడాజిల్లాలో పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వెల్లువెత్తుతున్న నిరసనలు నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో తెలియక కూటమి సర్కార్ అడ్డదిడ్డంగా ముందుకు పోతోంది. ఈ నేపథ్యంలోనే సాక్షిలో వార్తలు రాస్తున్న పత్రికా ప్రతినిధులు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి కూడా కేసులు నమోదు చేసి నోటీసుల నెపంతో హంగామా సృష్టిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై అటు అన్నమయ్య, ఇటు వైఎస్సార్ జిల్లాలో సీనియర్ జర్నలిస్టులు, పలు సంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు మంచివి కాదని, వార్తలు రాస్తే న్యాయపరంగా ముందుకు వెళ్లాలే తప్ప కేసులు పెట్టడం, అరెస్టులు, వేధించడం లాంటివి మంచి పద్ధతి కాదని పలువురు సూచిస్తున్నారు. కూటమి సర్కార్ ఇలాంటి ధోరణి అవలంభిస్తే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రజాస్వామ్య వాదులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షికార్యాలయంలో పోలీసుల హల్చల్ ఎడిటర్కు నోటీసుల పేరుతో హంగామా జిల్లాలోనూ పలు సందర్భాల్లో సాక్షి కరస్పాండెంట్,ఇతర జర్నలిస్టులపై దాడులు -
కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’(ఆరోగ్య శ్రీ) పథకం గాడి తప్పింది. ఐదు రోజులుగా కీలక మైన ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్యం గాలిలో దీపంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం
● ఐదు రోజులుగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’లు పూర్తిగా నిలుపుదల ● వైద్యం కోసం పేదల అవస్థలు ● గాడితప్పిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకం కడప రూరల్: ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకం అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు లభించేడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఆ ఉద్దేశమే నీరుగారుతోంది. ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ. కోట్లల్లో పేరుకు పోయాయి. ఫలితంగా వైద్యం పడకేసింది. రోజుల తరబడి ఇదే ప్రథమం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కోట్లల్లో బిల్లులను మంజూరు చేయాలి. ఏడాది దాటినా ఇంతవరకు బిల్లులను మంజూరు చేయలేదు. ఫలితంగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఔట్ పేషెంట్తో పాటు అత్యవసర సేవలను పూర్తిగా నిలిపివేశారు. ప్రధానమైన గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు లభిస్తాయి. ఇప్పుడు ఈ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలుపుదల చేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లండి... యథావిధిగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేదలు వైద్య సేవలు లేవని తెలిసి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండే వైద్య మిత్రలు వచ్చిన వారితో ‘వైద్య సేవలు నిలుపుదల చేశారు. ఉచిత వైద్యం కావాలంటే కడప రిమ్స్ లేదా ఇతర ప్రభుత్వ ఆసుత్రులకు వెళ్లాలి’అని సూచిస్తున్నారు. దీంతో సాధారణంగానే వ్యాధిగ్రస్తులతో కడప రిమ్స్తో పాటు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పడు ఆ అసుపత్రుల్లో రోగుల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయడంతో.. ఆయాసంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఈ వృద్ధుడి పేరు లక్ష్మిరెడ్డి. కడప నగర శివార్లలోని పుట్లంపల్లె నివాసి. మనవడు హర్షవర్దన్రెడ్డి ఆయనకు సహాయంగా ఉన్నాడు. తీవ్ర ఆయాసంతో మూడు రోజుల నుంచి కడప రిమ్స్లోని ఐసీయూలో వైద్య చికిత్సలు పొందుతున్నాడు. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపి వేయడంతో చేసేదిలేక తాత లక్ష్మిరెడ్డిని తీసుకుని చికిత్స కోసం రిమ్స్కు వచ్చానని మనవడు హర్షవర్దన్రెడ్డి తెలిపారు. పేదలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బంద్ ప్రభావం పేదలపై పడింది. ఉచిత వైద్యం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేనివారు ప్రైవేట్ వైద్యుడిని లేదా ఆర్ఎంపీలను సంప్రదిస్తున్నారు. ఫలితంగా ఒక పేద రోగి డాక్టర్ ఫీజును రూ.300కు పైగా చెల్లిస్తున్నారు. వైద్య పరీక్షలకు ఎంత లేదన్నా రూ.350 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. స్కానింగ్కు రూ.7 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జిల్లాలో ఎవరికై నా పెద్ద సమస్య వచ్చిందంటే కడపకు రావాలి. ఇక్కడ ఆ వ్యాధికి చికిత్స లభించకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇది సీజనల్ వ్యాధుల కాలం. డెంగ్యూ, టైఫాయిడ్ తదితర జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైద్య సేవలు బంద్ కావడంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు
కడప సెవెన్రోడ్స్: కడప నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రాం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాయు కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు దేశంలోని వాయుకాలుష్యం కలిగిన 132 నగరాలలో కాలుష్య నియంత్రణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. వాటిలో కడప నగరం ఒకటని, ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం వ్యాపించడంపై మూలకారణాలు తెలుసుకుని, వాటిని నియంత్రించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు నగరంలో పెద్దఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, వాహనాల ద్వారా కాలుష్యం వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వాయు కాలుష్యం వ్యాప్తి చెందే ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా (ఎన్ఏఏపీ)కడపకు నగరానికి నిధులు కేటాయించామన్నారు. ఈ నిధులతో కడప మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్లోని సీసీ రోడ్లు, ప్లాంటేషన్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన దివాలి ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ పోస్టర్స్ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కడప నగర కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, పర్యావరణ ఇంజనీరింగ్ అధికారి సుధా కురుభ, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ చెన్నకేశవరెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఒప్పందంలో ఏ తప్పు దాగుందో!
సాక్షి,టాస్క్ ఫోర్స్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో రోగుల వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తోచిన రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన వారాశి సంస్థకు 2015 నుంచి 2020 వరకు రిమ్స్కు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. అనంతరం మూడేళ్లు, ఆపై ఒక్కో ఏడాది పొడిగిస్తూ 2025 వరకు ఒప్పందం కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై 22న వారాశి సంస్థకే మరో ఏడాది రెన్యూవల్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం 2026 వరకు సదరు సంస్థకు ఒప్పందం ఉంది. తెరవెనుక ఏ మతలబు జరిగిందో.. ఏ రాజకీయ ఒత్తిడి ఎక్కువైందో గానీ రెన్యూవల్ ఉత్తర్వులు జారీ చేసిన 4 రోజులకే అంటే జూలై 26నే వారాశి సంస్థతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ను రద్దు చేశారు. అదే నెల 30న కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా సంస్థతో ఆక్సిజన్ సరఫరా కోసం కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నిజానికి శ్రీ భారత్ ఫార్మా కంపెనీకి 2018లోనే పదేళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలవకుండానే అగ్రిమెంట్ చేశారు. అందులో భాగంగానే 2021లోనే రిమ్స్కూ ఆక్సిజన్ సరఫరా చేయాలని శ్రీ భారత్ సంస్థను అధికారులు కోరారు. అప్పట్లో సిలిండర్ల సరఫరా చేయలేయమని శ్రీ భారత్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో వారాశికే ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ను పొడిగించింది. తాజాగా రిమ్స్కు ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్ట్ను శ్రీ భారత్ ఫార్మా వారికి కట్టబెట్టారు. కాగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారని తిరుపతిలో రుయా హాస్పిటల్ అధికారులు శ్రీ భారత్ ఫార్మాపై ఫిర్యాదు చేశారు. 2021 జూలై 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అలిపిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అలాంటి సంస్థకే కడప రిమ్స్ అధికారులు ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్ట్ను కట్టబెట్టడాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. కాంట్రాక్ట్ మధ్యలో 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు సరఫరా చేయలేని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పైగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ రేటుతో ఆక్సిజన్ను సరఫరా చేసే ఏకై క సంస్థ శ్రీ భారత్ ఫార్మా కంపెనీ కావడం గమనార్హం. మరోవైపు శ్రీ భారత్ ఫార్మా కంపెనీ ఏజెన్సీ విధానాలపై, కర్నూలు అనంతపురం జీజీహెచ్లలో జరుగుతున్న అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కమిటీతో విచారణ చేయాలని మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేయడం గమనార్హం. అవినీతి ఆరోపణలు, కేసులు నమోదైన సంస్థకు, ఎక్కువ ధరకు మరోసారి రెన్యువల్ చేయడం వెనక మతలబు దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ‘ఒప్పందం’లో ఏ తప్పు దాగుందో సదరు అధికారులకే ఎరుక. కడప రిమ్స్ లో’ ఆక్సిజన్ సరఫరా’కాంట్రాక్ట్ వ్యవహారంలో ’గోల్ మాల్ ’! అధికార దర్పంతో అగ్రిమెంట్ రద్దుచేసి.. ఆపై మరో సంస్థకు కట్టబెట్టిన వైనం అగ్రిమెంట్ దక్కించుకున్న ఏజెన్సీపై పలు ఆరోపణలు, కేసులు నమోదు -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పులివెందుల: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భాకారపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ ఫ్లాప్గా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతన్నలను ఆదుకున్నామని గుర్తు చేశారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. సబ్సిడీ శనగలు ఇవ్వడం లేదు.. ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీపై శనగలు అందించడంలేదని, విత్తనం వేసే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం పులివెందుల, వేముల మండలాలకు చెందిన పలువురు రైతులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో వాపోయారు. అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదని, గత్యంతరంలేక ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక ధరలకు శనగలు కొనుగోలు చేస్తున్నామని మొర పెట్టుకున్నారు. స్పందించిన ఎంపీ వ్యవసాయ శాఖ జేడీతో మాట్లాడారు. వెంటనే శనగలు సరఫరా చేయాలని సూచించారు. దీనికి జేడీ రెండు రోజుల్లో శనగల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని ఎంపీకి వివరించారు. ఉపాధి పథకం అనుసంధానానికి వినతి రైతుల వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆర్సీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రరెడ్డి రైతుల తరఫున వినతిపత్రం ఇచ్చారు. ఆర్సీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘురామిరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎద్దుల అర్జున్ రెడ్డి, వైఎస్సార్సీపీ వేముల మండల అధ్యక్షులు నాగేళ్ల సాంబశివారెడ్డిలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక, రైతులు కూలీలకు వేతనాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని రైతుల వ్యవసాయ పనులకు నేరుగా అనుసంధానం చేయడంవల్ల రైతులకు కూలీల పెట్టుబడి భారం గణనీయంగా తగ్గి రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
16న ఎన్ఎస్ఎస్ ఉత్తమ పురస్కారాల ప్రదానం
కడప ఎడ్యుకేషన్ : జాతీయ సేవా పథకం ద్వారా విస్త్తృత సేవలందించిన కళాశాలలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లకు ఉత్తమ పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రకటించారు. తన చాంబర్లో పురస్కారాలకు ఎంపికై న వారి జాబితాను ఆయన మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 16వతేదీన వైవీయూలో అవార్డులు అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ , ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.ఎన్.వెంకట్రామిరెడ్డి, డాక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రొఫెసర్ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరంలో అవార్డులకు ఎంపికై న వారి వివరాలిలా ఉన్నాయి. ఉత్తమ వాలంటీర్లు : డి శ్రావణి(ప్రభుత్వ డిగ్రీ కళాశా ల రాజంపేట), డి.సిద్ధయ్య (ఎస్బిఎస్వైఎం డిగ్రీ కళాశాల, మైదుకూరు), కేబీ.ఈశ్వర్(వైవియూ కాలేజ్), కె.శ్రీనివాసులురెడ్డి (వైవీయూ పీజీ కళాశాల). ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్లు : డాక్టర్ కె.గోవింద రెడ్డి(ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, కడప), డాక్టర్ యు.సునీత(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పులివెందుల), సి.మల్లేశ్వరమ్మ, (వైఎస్ఆర్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లి), డాక్టర్ ఎ.నాగరాజు(గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్(ఎ), కడప), డాక్టర్ పత్తి వెంకటకృష్ణారెడ్డి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), డాక్టర్ ఎస్.సునీత (వైవీయూ కళాశాల, కడప), డాక్టర్ ఎస్పి.వెంకటరమణ(వైవీయూ కళాశాల, కడప). ఉత్తమ కళాశాలలు : సి.సూర్యారావు(ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, కడప), డాక్టర్ పి.నారాయణ రెడ్డి(ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ (ప్రిన్సిపల్, వైవీయూ కాలేజ్). -
దళితుల శ్మశాన వాటికకు దారేది?
అతికష్టంపై మృతదేహాన్ని తరలించిన కుటుంబీకులు చాపాడు : దాతలు ముందుకు వచ్చి శ్మశాన వాటికకు స్థలం కేటాయించినా.. కొందరి నిర్వాకంతో ఆప్రాంతానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. మంగళవారం అతికష్టంపై ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాల్సి రావడంపై దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని పడమర అనంతపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున దళితవాడకు చెందిన బుస్సా కనకమ్మ(58) మృతిచెందింది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం దళితవాడ నుంచి కిలోమీటరు దూరంలో ఉండే శ్మశాన వాటికికు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దారి లేకపోవడంతో వరి పైరు పొలాల్లో అతి కష్టంపై వెళ్లాల్సి వచ్చింది. తమ పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని స్థానిక రైతులు కొందరు అడ్డు చెప్పడంతో ఎలా తీసుకెళ్లాలో తెలియక తరచూ ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా దారి ఏర్పాటుచేయలేదని, అగ్రవర్ణాల వారు తమకు సహకరించడం లేదని దళితులు తెలిపారు. ఇప్పటికై నా స్పందించి దారి ఏర్పాటుచేయాలని వారు వేడుకొంటున్నారు. -
వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వరకట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఇరు కుటుంబాల సభ్యులు ఘర్షణకు దిగిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని మోతీనగర్కు చెందిన వసీంకు రామసముద్రానికి చెందిన హీనా కౌసర్923)ను ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లి అయిన నెల రోజుల నుంచే అత్తింటివారు అదనపు కట్నం కోసం తరచూ వేధించడం, కొట్టడం, తిట్టడం చేసే వారు. ఈ క్రమంలో మంగళవారం అదనపు కట్నం విషయమై మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన హీనాకౌసర్ ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్, మదనపల్లెకు చేరుకుని హీనా కౌసర్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. భర్త వసీం అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. మహమ్మద్ ఇర్ఫాన్పై వసీం కుటుంబసభ్యులు దాడికి దిగారు. అనంతరం హీనా కౌసర్ను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఆమెను 108 అంబులెన్స్ వాహనంలో ఎక్కిస్తుండగా, హీనా కౌసర్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వసీం కుటుంబ సభ్యులతో గొడవపడి కొట్టుకున్నారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని తిరుపతికి పంపించి, కుటుంబ సభ్యులను పంపేశారు. ఆస్పత్రిలో కుటుంబసభ్యుల ఘర్షణ -
అంగన్వాడీ టీచర్కు గాయాలు
ముద్దనూరు : మండలంలోని కొత్తపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం అంగన్వాడీ టీచర్ ప్రమీలను కారు ఽఢీకొంది. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమీల కొత్తపల్లెలోని ప్రధాన రహదారిని దాటుతుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. మద్యం తాగి ఒకరు మృతి జమ్మలమడుగు : పట్టణంలోని ఎత్తపువారి కాలనీలో నరసింహులు(35) అనే వ్యక్తి మద్యం తాగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంలో మద్యానికి బానిసై అతిగా తాగుతుండటంతో శరీరంలోని భాగాలు దెబ్బతిన్నాయని, దీంతో నరసింహులు చనిపోయారని తెలిపారు. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న యజమాని మృతి చెందడంతో భార్య, అతడి పిల్లలు విషాదంలో మునిగిపోయారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కడపఅర్బన్ : కడప నగరం శంకరాపురంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. శంకరాపురానికి చెందిన విజయకుమార్ సమీపంలో నివాసమున్న అక్కిశెట్టి వెంకట్ మంగళవారం చిన్న విషయమై గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో విజయ్ కుమార్ను కులం పేరుతో దూషిస్తూ వెంకట్ దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసి విచారిస్తున్నామని సీఐ తెలిపారు. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరం చిన్న చౌక్ పోలీస్ స్టే షన్ పరిధిలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు సుబ్బరాయుడు అనే వృద్ధుడు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 8 సంవత్సరాల బాలికను ఇంట్లోకి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఎల్బీ పరీక్ష కేంద్రాల తనిఖీ కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలోలా సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను నూతన ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి పరీక్షల ఏర్పాట్ల గురించి చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య జి.కాత్యాయనిని ఆరా తీశారు. ప్రస్తుత పరీక్షకు 503 మంది హాజరయ్యారని తెలిపారు. అతి పెద్ద పరీక్షల హాల్ను వీసీ పరిశీలించారు. ఆయన వెంట కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కెఎస్వీ.కృష్ణారావు ఉన్నారు. పరీక్షల విధుల్లో పరీక్షల అబ్జర్వర్ డా.గణేష్నాయక్, సహాయ పరీక్షల అధికారులు డా .టి. లక్ష్మి ప్రసాద్, డా.మునికుమారి, సిబ్బంది పి.చంద్రమౌళి పాల్గొన్నారు. -
మాటలకే పరిమితం...
ఉల్లి రైతుల కష్టాలను రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నా, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కనికరం చూపిన దాఖలాలు లేవు. వాస్తవంగా కర్నూలులో ఉల్లి రైతుల సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం రూ.1200 కనీస మద్దతు ధర ఇస్తామని, ఆ తర్వాత హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని మాటలు చెప్పింది. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సైతం క్వింటాల్ రూ.12వందలతో కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరించకున్నుట్లు ప్రకటించారు. మాటలకు పరిమితం మినహా ఆచరణలో చూపెట్టకపోయా రు. కర్నూలులో ఇచ్చిన హామీ మేరకు రైతుల ఎన్రోల్మెంట్ కూడా చేపట్టలేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడంతో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రెండు నెలలుగా రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నా ఇప్పటికీ కూటమి నేతలు ఉల్లి రైతుల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయడం, లేదా మద్దతు ధర అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించడం కానీ చేయడం లేదు. -
ప్రైవేట్పరం చేసిన మెడికల్ కాలేజీలను మళ్లీ వెనక్కి తీసుకుంటాం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో మంగళవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చి మంజూరుచేశారన్నారు. వీటిలో ఐదు కళాశాలలను పూర్తి చేశారన్నారు. చేతకాని కూటమి ప్రభుత్వం అన్ని మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తోందన్నారు. ప్రతి మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పటిల్ ఉంటుందని, దీనివలన ఆయా ప్రాంతాల్లో పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయన్నారు. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాలలో మెడికల్ సీట్లను కూటమి ప్రభుత్వం తమకు వద్దని కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మళ్లీ వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టామన్నారు. గవర్నర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ శారద, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఎంవీ రాజారాంరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దావూద్, మున్సిపల్ కౌన్సిలర్లు, రాజపాళెం మండల అధ్యక్షుడు బాణా కొండారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఒంటరి వృద్ధురాలికి చేయూత
కడప అర్బన్ : నలుగురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి చేయూత అందించేలా కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబాఫక్రుద్దీన్ చొరవ చూపారు. ఆమె కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆసరా కల్పించాలే చేశారు. కడప తారకరామా నగర్లో నివాసముంటున్న బుసల లక్ష్మమ్మకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బుసల రమణ కడపలో బేల్దారి పని చేస్తుండగా, ద్వితీయ, తృతీయ కుమారులు బుసల చిన్నప్ప, బుసల చంద్ర ఆటో నడుపుతున్నారు. నాలుగో కుమారుడు బుసల శ్రీనివాసులు కలకడలో టైల్స్ పని చేసుకుంటున్నారు. కుమార్తె బుసల రమణమ్మ కడపలో నివాసం ఉంటోంది. నలుగురు కుమారులు ఉన్నా.. ఆమె ఒంటరిగా జీవిస్తోందనే విషయం జడ్జి బాబాఫక్రుద్దీన్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులను ఇంటికి పంపారు. అక్కడికి వెళ్లిన న్యాయవాదులు ఆమెకు సాయం చేస్తామని తెలిపారు. అనంతరం జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ లక్ష్మమ్మ కుమారులు, కుమార్తెలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వయో వృద్ధుల చట్టంపై వారికి అవగాహన కల్పించారు. పెద్ద కుమారుడు బుసల రమణ రూ.1500, ద్వితీయ, తృతీయ కుమారులు చిన్నప్ప, చంద్రలు ఒక్కొక్కరూ రూ.1500 ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఆమె కుమారుల వద్దే ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించాలని వృద్ధురాలికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు మనోహర్, రవితేజ సీనియర్ సిటిజన్ అయిన బుసల లక్ష్మమ్మ కుమారులు, కుమార్తె పాల్గొన్నారు. జడ్జి బాబా ఫక్రుద్దీన్ చొరవతో కదిలిన కుమారులు -
గుండెపోటుతో వృద్ధుడు మృతి
బద్వేలు అర్బన్ : తన సోదరుడి కుమార్తె సమస్యను పరిష్కరించేందుకు పెద్ద మనిషిగా స్టేషన్కు వచ్చిన ఓ వృద్ధుడు స్టేషన్ ఆవరణలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. స్థానిక మిద్దెలవారిపాలెంకు చెందిన రాంచానిబాలగురయ్య (60) బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తన సోదరుడైన గురవయ్య కుమార్తె దేవి కొంత కాలంగా భర్త వేధింపులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దేవి తన భర్త సాయిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇరువురి తరపున పెద్ద మనుషులు స్టేషన్ ఆవరణలో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో దేవి పెద్దనాన్న అయిన బాలగురయ్య ఒక్కసారిగా స్టేషన్ ఆవరణలోనే కుప్పకూలి పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలగురయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ లింగప్ప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. చీటింగ్ కేసు నమోదు కడప అర్బన్: కడప నగరం పూసల వీధికి చెందిన హరేరామ్కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. కడప పూసల వీధికి చెందిన హరి రామ్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేవాడు. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి దాదాపు రూ.1.30 లక్షలు వసూలు చేసి నకిలీ ఉద్యోగ నియామకపత్రం ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపిక
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపికై నట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోణం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సివిల్ పర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కోణం ఫౌండేషన్, గేట్ ప్రవేశ పరీక్షలకు హైదరాబాద్ ఎఎస్ ఇంజినీరింగ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తున్నారన్నారు. గత నెలలో డా.డి.కోనప్ప ఇందుకోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ పరీక్షలలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి యూపీఎస్సీ శిక్షణకు తొమ్మిది మంది, గేట్ శిక్షణకు 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరికి కోణం స్వచ్ఛంద సంస్థ ఉచిత శిక్షణ, ఫెలోషిప్ అందిస్తుందని, గేట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎఎస్ ఇంజినీరింగ్ సంస్థ ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంకులు సాధించాలని కోరారు. ఇందుకోసం ట్రిపుల్ ఐటీలో ఒక తరగతి గది ఏర్పాటుచేసి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని డీన్ ఆఫ్ అకడమిక్ రమేష్ కై లాష్ తెలిపారు. -
ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట హిజ్రా నిరసన
లక్షల్లో నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపణ మదనపల్లె రూరల్ : ఆర్థిక లావాదేవీల్లో భాగంగా లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు నగలు, విలువైన ఆస్తి పత్రాలు తీసుకుని ఓ ప్రైవేట్ ఉద్యోగి, అతడి భార్య తనను నిలువునా మోసం చేశారని, అడిగితే ఇవ్వకపోగా..తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని ముజీబ్ నగర్లోని ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట మంగళవారం సాయంత్రం హిజ్రా బైఠాయించి నిరసనకు దిగింది. బాధితురాలి వివరాల మేరకు...పట్టణంలోని చీకలిగుట్ట గౌతమీ నగర్లో భర్త దుర్గాప్రసాద్తో కలిసి చీటీలు వేసుకుని హిజ్రా స్వాతి జీవనం సాగిస్తోంది. ఐదేళ్ల క్రితం తన స్నేహితురాలు చంద్రకళ..ముజీబ్ నగర్కు చెందిన ప్రైవేట్ కాలేజీ క్యాషియర్, వడ్డీ వ్యాపారి ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత వద్ద రూ.30 లక్షలు అప్పు తీసుకోగా హిజ్రా స్వాతి పూచీ పడింది. అనంతరం చంద్రకళ వడ్డీ, అసలు కట్టలేక ఐపీ పెట్టి వెళ్లిపోయింది. స్నేహితురాలు చంద్రకళకు పూచీ పడిన స్వాతిని అప్పు చెల్లించాల్సిందిగా ఢమరేశ్వర్ దంపతులు ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో తన కష్టార్జితంతో పాటు, ఇతరుల నుంచి పెద్ద మొత్తంలో అప్పుచేసి, విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.34లక్షలు, అకౌంట్ ద్వారా రూ.8లక్షలు, నగదు రూపేణా రూ.23లక్షల90వేలు, 600 గ్రాముల బంగారు ఇచ్చినట్లు స్వాతి తెలిపారు. వ్వడం జరిగిందన్నారు. స్నేహితురాలు చేసిన అప్పును వడ్డీతో సహా చెల్లించినప్పటికీ, తాను వారికి ఇచ్చిన నగదు, బంగారు, ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఇవ్వకపోగా, వేధింపులకు గురిచేశారన్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయిస్తే,..పోలీసుల ఎదుట ఇచ్చేస్తామని అంగీకరించి అనంతరం మొండికేశారన్నారు. అంగబలం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకుండా చేశారని, నగదు, డబ్బులు అడిగితే...రెండు రోజుల క్రితం ఎస్టేట్ సమీపంలో తనపై ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత దాడికి పాల్పడ్డారన్నారు. దాడి విషయం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసి, సీసీ ఫుటేజీ ఆధారాలను అందించినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో తనకు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవడంతో ఢమరేశ్వర్ ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది. -
అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అరుణ అనే పేరుతో ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. హోమియోపతి డాక్టర్ (బీహెచ్ఎంఎస్) విజయ్ కుమార్ అల్లోపతి వైద్యం చేయడంతోపాటు స్కానింగ్, కాన్పులు చేస్తున్నట్లు చెప్పారు. గతనెల 11వ తేదీన పులివెందుల డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజా మొయినుద్దీన్ ఈ ఆసుపత్రిని తనిఖీ చేయగా కాన్పులతోపాటు అల్లోపతి వైద్యం చేస్తుండటంతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ రూంలను సీజ్ చేశారు. మళ్లీ రెండు రోజుల కితం డిప్యూటీ డీఎంహెచ్ఓ తన సిబ్బందితో ఆసుపత్రిని తనిఖీ చేయగా ఇద్దరు గర్భిణులు కాన్పులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా విజయ్ కుమార్ తో పాటు ఆయన సతీమణి ఇరువురు ఆసుపత్రిని గత 8 సంవత్సరాలుగా వేంపల్లెలో నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే రేడియాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో విజయ్ కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్కు పంపినట్లు సీఐ చెప్పారు. -
పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు
ప్రొద్దుటూరు : స్థానిక మైదుకూరు రోడ్డులోని అమూల్య ఫంక్షన్ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు (ప్రొద్దుటూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేని రాంబాబు (జగ్గయ్యపేట), రాష్ట్ర కోశాఽధికారిగా పొదిలి సూర్య చిరంజీవి (జంగారెడ్డి గూడెం), మహిళా అధ్యక్షురాలుగా జడిమేని కనకదుర్గమ్మ (గుడివాడ), ఉపాధ్యక్షులుగా పసుపులేటి మనోజ్ కుమార్ (కడప), పసుపులేటి విజయకుమారి (మాజీ డైరెక్టర్) (కడప), చేనికుమారి (మాజీ డైరెక్టర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు నాయుని పెద్దన్న, గోవిందరాజులు, నాగరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ డైరెక్టర్ తుపాకుల వెంకటరమణ, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, పొదిలి రాము, బత్తిని పెద్ద స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కడప అగ్రికల్చర్ : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. వి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. కడపలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 15 వేల ఎకరాలలో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ఉల్లి పంట కోతకు వచ్చిన దశలో ఉల్లిగడ్డల ధరలు అమాంతం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో ఉల్లి సాగుచేసిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి జి. నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తణంగా కారణంగా జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరం మండలంలో అత్యధికంగా 20 మి.మీ వర్షంకురిసింది. అలాగే జమ్మలమడుగులో 15.2 , మైలవరంలో 10.2, కమలాపురంలో 4.6, బద్వేల్లో 1 మి.మీ వర్షం కురిసింది. 16న జాబ్మేళా కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో జవహర్ నాలెద్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జి.రవీంద్రనాథ్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో హెటేరో లాబ్స్ లిమిటెడ్, నెక్స్టెల్ మెటా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ పాల్గొంటుందని జేకేసీ కోఆర్డినేటర్ సీహెచ్. రాము తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.టెక్, మాస్టర్ డిగ్రీలతోపాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలోని జేకేసీ మెంటార్లు సారధి (9347256400) రవీంద్రారెడ్డి (9390052901) లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : కడప రిమ్స్ వద్ద ఉన్న మైనార్టీ ఐటీఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్ఞానకుమార్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్య ర్థులు, పది, ఇంటర్ మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడీతోపాటు మైబెల్ నెంబర్ iti.ap.gov.in అనే పోర్టల్లో దరఖాస్తును సమర్పించాలని తెలి పారు. రిజిస్టర్ చేసిన దరఖాస్తును తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. కంప్యూటర్ కోర్సు(కోపా)కు 10వ తరగతి పాస్, వెల్డర్ కోర్సుకు పదవ తరగతి ఫెయిన్ వారు అర్హులని తెలిపారు. 17వ తేదీ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. 15న కౌన్సెలింగ్ కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 15వ తేదీన కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్, టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కడప.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్ సైట్ లో చూడవచ్చని పేర్కొన్నారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి – జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జేసీ అదితి సింగ్తోపాటు డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమ యం కేటాయించి రివ్యూ చేయాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. భూరీసర్వేపై అవగాహన కల్పించాలి సిద్దవటం : భూ రీసర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.సోమవారం సిద్దవటం మండలంలోని కనుములోపల్లిలోని సర్వే నంబర్ 29, 30, 31లోని 12.05 ఎకరాల భూమిలో సర్వేయర్లు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సంబంధిత రైతులు ప్రసాద్రెడ్డి, గౌస్బాషాలతో మాట్లాడారు. సర్వే సిబ్బంది రైతులకు నోటీసులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ల్యాండ్ అధికారి ఎ.మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీలత, పోరభాకర్, సర్వేయర్ సోమశేఖర్ పాల్గొన్నారు. -
వైవీయూ అభివృద్ధికి కృషి
నూతన వీసీ బెల్లంకొండ రాజశేఖర్కడప ఎడ్యుకేషన్: వైవీయూ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని.. న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడు సొంతం చేసుకోవాలని.. ఆ దిశగా మనమంతా శ్రమిద్దామని యోగి వేమన విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. విశ్వవిద్యాలయ వీసీగా సోమవారం ఆయన వైవీయూ పరిపాలన భవనంలోని తన ఛాంబరులో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు, విద్యార్థులు నూతన ఉపకులవతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది విశ్వవిద్యాలయాన్ని మాతృమూర్తిలా భావించి విశ్వవిద్యాలయం నాది అనే భావనతో పనిచేయాలని కోరారు. పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరగాలని ఆదిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యూజీసీ నెట్ పేపర్ –1 కోసం శిక్షణ ఇస్తామన్నారు. అలానే పరిశోధక విద్యార్థులు పీహెచ్డీలు నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానాచార్యులు టి.శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు ఆచార్య చంద్రమతి శంకర్. ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, డా. మాదక్క, ముఖీనా బేగం, అధ్యాపకులు. బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందితో సమావేశం.. వైవీయూను ప్రగతి పథంలో నడిపించడం కోసం సమిష్టిగా కృషి చేద్దామని వీసీ బెల్లకొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం బోధనా, బోధనేతర సిబ్బందితోక్యాంపస్లోని అన్నమాచార్య సెనెట్ హాల్లో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలన్నారు. -
● నిరసన హోరు!
బద్వేలు పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులు ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి సిద్దవటం రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నకిలీ మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ సీతారామిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ నేతలు రమణారెడ్డి, రాజగోపాల్రెడ్డి, సుందరరామిరెడ్డి, పెద్దారెడ్డి పాల్గొన్నారు. -
రాజోలి ముంపు వాసులకు న్యాయం చేయాలి
కడప సెవెన్రోడ్స్ : రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్.జనార్దన్రెడ్డి, కార్యదర్శి ఎన్.సుబ్బారెడ్డి, నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం బీకేఎస్ ఆధ్వర్యంలో పెద్దముడియం మండలంలోని రాజోలి ముంపు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజోలి నిర్మాణానికి ఇప్పటికి రెండుమార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. ఎకరాకు రూ. 12.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతుల భూ హక్కులను బ్లాక్ చేసిందన్నారు. తర్వాత రూ. 1350 కోట్ల అంచనా వ్యయంతో టెండరు ప్రక్రియ సైతం పూర్తి చేసి రెండేళ్లు దాటినా ఇప్పటికి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. దీంతో భూమి తాకట్టుపై బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదన్నారు. భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా ఉందన్నారు. ఎకరాకు నష్టపరిహారాన్ని రూ. 20 లక్షలకు పెంచి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దముడియం మండలంలోని నెమ్మళ్లదిన్నె, బలపనగూడూరు, ఉప్పలూరు, చిన్నముడియం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.పెద్దముడియం మండల రైతుల ధర్నా -
మున్సిపల్ కార్మికుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని వెటర్నరీ కాలేజీ మీపంలో ఉన్న డంప్యార్డులో కాసిపోయిన గంగయ్య (45) అనే మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి చెందిన గంగయ్య చెవిటి, మూగ. ఇతను దివ్యాంగుల కోటాలో రెండేళ్ల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా ఉద్యోగం పొందాడు. పొట్టిపాడు రోడ్డులోని వెటర్నరీ కాలేజీ వద్ద ఉన్న డంప్ యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం 6 గంటలకు నీలాపురం నుంచి విధులకు వచ్చాడు. రాత్రి అయినా ఇంటికి వెళ్లలేదు. గంగయ్య ఇంటికి రాని విషయం ఆదివారం అతని అన్న పుల్లయ్యకు తెలిసింది. దీంతో అతను పని చేస్తున్న చోటికి వెళ్లి విచారించగా శనివారమే గంగయ్య ఇంటికి వెళ్లినట్లు అక్కడి వారు చెప్పారు. ఈ క్రమంలో గంగయ్య మృతదేహం డంపింగ్ యార్డు సమీపంలో ఉండగా సోమవారం గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన తమ్ముడి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. -
దుంపలగట్టు కాలనీలో చోరీ
ఖాజీపేట : ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని కాలనీలో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 20 వేల నగదుతోపాటు రూ.30 వేల విలువగల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దుంపలగట్టు కాలనీలో చోరీ జరిగిన ఇంటి యజమాని వెంకటేశ్వర్లు కర్నూలులో ఉండగా, సోమవారం ఉదయం ఇంటి తలుపు పగులగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు అతనికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మనవడు వచ్చి ఇంటిని పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి లోపల చుట్టూ కారంపొడి చల్లి ఉండడం, ఇంటిలోని సామగ్రి చిందరవందరగా ఉండటాన్ని గమనించారు. గత రెండు నెలలుగా తమ తాత వెంకటేశ్వర్లు అనారోగ్య కారణంగా కర్నూలులో ఉండడంతో ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి చోరీకి పాల్పడినట్లు అతను తెలిపాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు. -
‘మాకు పరిహారం ఇప్పించండి’
జమ్మలమడుగు : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం రాజోలి ఆనకట్ట నిర్మాణానికి కట్టుబడ్డారు. అందుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టి అవార్డును పాసు చేయించారు. డబ్బులు పంపిణీ చేస్తారన్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం ఇవ్వలేదు. నాడు టీడీపీ నాయకులు రాజోలిఆనకట్ట నిర్మాణం చేసి బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. ఇంత వరకు ఇవ్వలేదు. రాబోయే కాలంలో వైఎస్సార్సీపీ నాయకులు తమకు మద్దతుగా నిలిచి పరిహారం అందేలా చూడాలి’.. అని రాజోళి బాధిత రైతులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కోరారు. ఈ సందర్భంగా సోమవారం బాధిత రైతులు వీరితో మాట్లాడుతూ రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయలు ఇస్తామని యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పెద్దముడియం మండల పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయినా ఇప్పటి వరకు అవార్డు పాసైన రైతులకు పరిహారం గాని, రాజోలి ఆనకట్ట నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న విషయంపై గానీ స్పష్టత ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వచ్చిన సమయంలో తమ భూములు ముగినిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజోలి నిర్మాణం చేపడతారా లేదా, భూసేకరణ చేసిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై శాసన మండలిలో ప్రశ్నించానిని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజోలి బాధిత రైతులకు పరిహారం ఇప్పించే విషయంలో వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీని రైతులకు ఇప్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డిని కోరారు. దీనిపై పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ బాధిత రైతులకు ఎప్పటికి అన్యాయం జరగనివ్వమని కచ్చితంగా ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.రాజోలి బాధిత రైతుల వినతి -
రైతుల భూములకు రీసర్వే నిర్వహించాలి
తొండూరు : మండల పరిధిలో ఉన్న రైతుల భూములకు సంబంధించి ఫేజ్–3 రీసర్వేను రైతుల సమక్షంలో నిర్వహించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్’ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల డివిజన్ గుండ్లమడుగు పంచాయతీ పరిధిలోని ఫేజ్–3 కింద జరిగే ఫ్రీ హోల్డ్ భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములను రీసర్వే నిర్వహించేటప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు పర్యాయాలు తెలియజేసి, వారిని పిలిపించి అప్పటికి అందుబాటులోకి లేకపోతే వీడియో కాల్ ద్వారా భూ రీసర్వే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మురళీ కుమార్, డిప్యూటీ సర్వేయర్లు హేమలత, రియాజుద్దీన్, తొండూరు సర్వేయర్ రాఘవేంద్ర, లింగాల, పులివెందుల, వేంపల్లె సర్వేయర్లు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి విద్యుదాఘాఽతంతో కొమెర సురేష్ (30) అనే రైతు మృతి చెందాడు. ఎస్ఐ అనిల్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమెర సురేష్ తన పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పనులు నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఐదేళ్ల కుమార్తె వరలక్ష్మి ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా యి. యువ రైతు మృతి చెందడంతో ఆయనకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వడ్ల లారీ దగ్ధం వీరపునాయునిపల్లె : మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున వడ్లతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన ఏపీ 39 యూబీ 6567 నంబరు గల లారీ కమలాపురం నుంచి బంగారుపాలెంకు వడ్ల లోడుతో వెళుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి కిందకు దిగేసరికే మంటలు తీవ్రమయ్యాయి. వెంటనే వేంపల్లె ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు వడ్లతో పాటు లారీ కాలిపోయింది. మంటలు పూర్తి అదుపులోకి వచ్చినంత వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని ఏఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పెన్నానది బ్రిడ్జి వద్ద నంద్యాల–రేణిగుంట డెమో రైలు కింద పడి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 50–55 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి తల గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. 105 మద్యం బాటిళ్లు స్వాధీనంరాజుపాళెం : మండలంలోని రెండు గ్రామాల్లో 105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పీఎస్ఐ నాగకీర్తన తెలిపారు. గోపాయపల్లె గ్రామంలో ఇద్దరి నుంచి 52 మద్యం బాటిళ్లను, కుమ్మరపల్లె గ్రామంలో ఒక వ్యక్తి నుంచి 53 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
హంద్రీ నీవా కాలువలో విద్యార్థి మృతదేహం లభ్యం
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ● మృతదేహాన్ని పరిశీలించిన డీవైఈఓ లోకేశ్వరరెడ్డిమదనపల్లె రూరల్ : హంద్రీ నీవా కాలువలో గల్లంతైన పదోతరగతి విద్యార్థి రెబ్బాన సాయికిరణ్(15) మృతదేహం సోమవారం ఉదయం బసినికొండ సమీపంలో లభ్యమైంది. ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో మునిగిపోయిన సాయికిరణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన సురేష్, సరళ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సాయికిరణ్(16), బసినికొండలోని అభ్యుదయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం స్కూల్లో పదోతరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉండటంతో, సాయికిరణ్ సాయంత్రం 4.30 వరకు క్లాసులు ఉన్నాయని తల్లిదండ్రులకు చెప్పి స్కూటీలో వచ్చాడు. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసుకు హాజరయ్యాడు. స్కూల్ వదిలాక నేరుగా ఇంటికి వెళ్లకుండా మెయిన్రోడ్డు వరకు వచ్చి, తర్వాత స్నేహితులైన భానుతేజ, శేషుబాబు, సాత్విక్రెడ్డితో కలిసి ఈత కొడదామని స్కూటీలో పాఠశాల వెనుక వైపు ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువలో అప్పటికే కొందరు యువకులు ఈత కొడుతుండటం చూసి సాయికిరణ్ కాలువలోకి దిగాడు. అప్పటికే కాలువలో నీటిప్రవాహ ఉధృతి అధికంగా ఉంది. గమనించని సాయికిరణ్ కాలువలో ముందుకు వెళ్లడంతో పట్టుతప్పి పడిపోయాడు. కొట్టుకుపోతుండగా, శేషుబాబు, ఈత కొడుతున్న యువకులను కాపాడాల్సిందిగా కోరాడు. వారు వెంటనే అక్కడకు వచ్చి సాయికిరణ్ను పట్టుకునే ప్రయత్నం చేయగా, చేతికి చిక్కి జారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కోసం సాయంత్రం వరకు గాలించారు. చీకటికావడంతో గాలింపు చర్యలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. సోమవారం ఉదయం ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో గాలిస్తుండగా, బసినికొండ నగరవనం సమీపంలో సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. కుమారుడిని కాలువలో విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా సెలవు దినాల్లో తరగతుల నిర్వహణ సరికాదని పలువురు పేర్కొన్నారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
చాపాడు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామికి భక్తులు సమర్పించిన హుండీల ద్వారా రూ.11.48 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ పర్యవేక్షణలో ఈ ఏడాది మార్చి 6 నుంచి సోమవారం భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.11,48,720 నగదు, 118 గ్రాముల బంగారు, 1.800 కిలోల వెండి వీరభద్ర స్వామికి కానుకగా లభించిందని వెల్లడించారు. వీటిని మైదుకూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆలయ ఈఓ తెలిపారు. -
న్యాయం చేయండి
ప్రొద్దుటూరు : ఓ వ్యక్తి తన నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రిటైర్డు అసిస్టెంట్ పోస్టుమాస్టర్ ఎ.శరత్బాబు కోరారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో బాధితుల తరఫున గత గురువారం ‘ఖాళీ చెక్కుతో కాసుల బేరం’ అనే శీర్షికతో వార్త ప్రచురితం కావడం తనకు సంతోషాన్ని, భరోసాను కలిగించిందని పేర్కొన్నారు. ఇంత కాలానికి జింకా రవి అనే వ్యక్తి గురించి వార్త వచ్చిందన్నారు. తాను కూడా గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవి బాధితుడినని తెలిపారు. ప్రొద్దుటూరులో అసిస్టెంట్ పోస్టు మాస్టర్గా పని చేస్తూ 2019 ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ పొందానన్నారు. జింకా రవి అవసరం ఉన్న వారికి అప్పులు ఇప్పిస్తుంటాడని తెలుసుకుని 2015లో ఆశ్రయించానన్నారు. జె.సుబ్బరాయుడు, వద్ది ఓబయ్య అనే వ్యక్తులతో ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష డబ్బు ఇప్పించి తన కమీషన్ తీసుకున్నాడన్నారు. తనకు డబ్బు ఇచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు రాయించానని తెలిపారు. నెలనెలా డబ్బుకు వడ్డీ ఇప్పించుకోవడం శ్రమతో కూడిన పని అని జింకా రవి తనతో సంతకాలు చేసిన ఆరు చెక్కులు తీసుకున్నాడన్నారు. చెక్కులు వాడలేదని, తాను డైరెక్ట్గా వడ్డీ చెల్లించి డబ్బు ఇచ్చిన వారితో షెటిల్ చేసుకున్నానన్నారు. ఖాళీ చెక్కులు ఇవ్వాలని రవిని అడిగితే కనిపించడం లేదని తెలిపాడన్నారు. గుడ్ విల్ కారణంగా అతనిని తాను ఖాళీ చెక్కుల కోసం ఒత్తిడి చేయలేదన్నారు. ఆయన 2017, 2018లో ఒక్కొక్క చెక్కుపై రూ.8 లక్షలు, రూ.10 లక్షలు తాను ఇవ్వాలని చెక్ బౌన్స్ కేసు తనపై వేశాడన్నారు. మరో చెక్కు ఉలసాల చలపతి అనే పేరుతో కేసు వేశాడన్నారు. ఓ చెక్కుకు సంబంధించిన కేసులో తాను ఓడిపోయి రూ.లక్షా 80 వేలు చెల్లించానన్నారు. ఇంకా కోర్టులో మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. జింకా రవి పెద్ద సంఖ్యలో అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగులపై ప్రొద్దుటూరు కోర్టులో కేసులు ఫైల్ చేశారన్నారు. దువ్వూరులో పని చేస్తున్న యనమల సుబ్బరాయుడు అనే ఉపాధ్యాయుడు ఇలా వేధింపులకు గురై చివరకు గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమతి లేకుండా సిజేరియన్ ఆపరేషన్లు
వేంపల్లె : స్థానిక కడప రోడ్డులో ఉన్న అరుణ హాస్పిటల్లో అనుమతులు లేకుండా అక్కడున్న(డీహెచ్ఎంహెచ్) వైద్యుడు విజయ్కుమార్ గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా పట్టుబడినట్లు సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం డిప్యూటీ డీఎంహెచ్ ఖాజా మొహినిద్దీన్ ఫిర్యాదు మేరకు వైద్యులు విజయ్కుమార్పై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెలలో ఎటువంటి అనుమతులు లేకుండా గర్భిణులకు ఆపరేషన్లు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో.. ఆ హాస్పిటల్ డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారన్నారు. అయినా కూడా హాస్పిటల్ వైద్యులు, వైద్య ఉన్నతాధికారులను లెక్క చేయకుండా సీజ్ చేసిన ల్యాబ్ను ఓపెన్ చేసి.. మరలా యథావిధిగా శనివారం రాత్రి ఇద్దరు గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజా మోహినిద్దీన్ తనిఖీ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ నరసింహులు విచారణ చేసి వైద్యునిపై కేసు నమోదు చేశామని వివరించారు.వైద్యుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి?
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఎంతో చారిత్రకత కలిగి, విశిష్టత ఉన్న దేవాలయం. త్రేతా యుగంలో మృకుండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముడిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం.. సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొంది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, ఆ తరువాత జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశారని ప్రజల విశ్వాసం. ఇక్కడ శ్రీరాముడు కొలువై ఉన్నారని ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది. అలాంటిదే ఇమాంబేగ్ బావి కూడా. ఒంటిమిట్ట : కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా క్రీ.శ 1640లో ఇమాంబేగ్ పని చేశారు. ఈయన సిద్దవటం కోటకు వెళ్తూ, ఎండ తీవ్రంగా ఉండటంతో ఒంటిమిట్ట చెరువు సమీపానికి రాగానే.. తన గుర్రానికి చెరువు నీళ్లు తాగించి, తాను కూడా ఒంటిమిట్ట రామాలయం వసారాలలో సేదతీరాడు. ఆ సమయంలో అక్కడున్న వారు దేవుడు ఉన్నాడు, లేడని వాదోపవాదాలు చేసుకుంటున్నా రు. అది విన్న ఇమాంబేగ్ దేవస్థానం వాకిలి మూసిన తరువాత బయట నుంచి శ్రీరామచంద్రుని మహిమను స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అక్కడ వాదోపవాదాలు చేస్తున్న వారితో ఇలా అన్నాడు. మీ దేవుడు పిలిచినా పలుకునా? అని ప్రశ్నించారు. దీనికి త్రికరణ శుద్ధిగా పిలిస్తే.. తప్పక పలుకునని వారు సమాధానమిచ్చారు. అప్పడు ఇమాంబేగ్ ఏకాంతంగా తలుపుల దగ్గరకు పోయి ఓ రామ! అని ఇస్లాంలో.. ● పరిత్యకుడైన సైతాన్ ప్రలోభముల నుంచి నన్ను రక్షించుము. ● పరమానుగ్రహ శోభితుడును ● ప్రభూ! వరమానుగ్రహ శోభితుడును, సర్వదయాయుడనై భగవంతుని నామంతో జగత్ ప్రభువును కరుణానుగ్రహ మూర్తియు న్యాయ నిర్ణయ దినస్వామియు అగు భగవంతుని స్తుతింతును. నిన్నే మేము పూజింతుము. నిన్నే మేము సాయం కొరకు అర్థింతుము, మాకు రుజు మార్గమును చూపుము అని ఓ రామా! ఓ రఘురామా! ఏకశిలానగరదామా! కోదండ రామా! అని మూడు సార్లు పిలిచాడు. మూడవ సారి అతనికి దివ్య మధురముగా ‘‘ఓఓఓ’’ అనే సమాధానం వినిపించింది. అది విన్న ఇమాంబేగ్ సంతోషంతో మోకరిల్లి అనంద భరితుడై వినయంగా శ్రీస్వామి వారి రూపాన్ని దర్శించి, ఆలయానికి ఆగ్నేయ దిశన బావిని తవ్వించారు. అభిషేకానికి నీరు సరఫరా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం ముస్లింలు స్వామిని దర్శిస్తూ వారి కోరికలు సఫలీకృతం చేసుకుంటున్నారు. అంతే కాదు ఏకశిలపై వెలసిన సీతారామలక్ష్మణులకు ఆ బావి నుంచి అభిషేకానికి నీళ్లు కూడా సరఫరా అయ్యేవి. కులమతాలకు అతీతంగా, స్వామి సాక్షాత్కారానికి గుర్తుగా నిర్మించిన అంతటి చరిత్ర కలిగిన ఇమాంబేగ్ బావిని మరుగునపడేశారు. క్రమేణ ఆ బావి పూర్తిగా పూడిపోతోంది. లభించని పురావస్తుశాఖ అనుమతి ఇమాంబేగ్ బావి ఒంటిమిట్ట రామాలయ చరిత్రలో ఉంది కానీ, భక్తుల సందర్శనానికి నోచుకోలేదు. ఇమాంబేగ్ బావి పునరుద్ధరణ చేయడానికి పురావస్తుశాఖ అనుమతులు లేక పోవడమే కారణమని ఒకపక్క టీటీడీ వారు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తలచుకుంటే పురావస్తు శాఖ వారితో కలిసి ఎన్నో చారిత్రక దేవాలయాలను పునరుద్ధరణ చేసిన ఘనత ఉంది. కానీ ఒంటిమిట్టలో భక్తులు సందర్శించి, తెలుసుకోవాల్సిన ఇమాంబేగ్ బావిని, దాని చరిత్రను ఎందుకు కల్పించలేదో అర్థం కావడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒంటిమిట్ట రామాలయానికి భక్తుల తాకిడి పెంచి, అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ద్వారానైనా రామాలయ చారిత్రక గుర్తులకు పూర్వ వైభవం వస్తుందో లేదో వేచి చూడాలి. ఒంటిమిట్టలో మరుగునపడ్డ ఇమాంబేగ్ బావి స్వామి సాక్షాత్కారానికి గుర్తు ముస్లింలు సైతం పూజించేందుకు ఇదే కారణం పునరుద్ధరించాలని కోరుతున్న భక్తులు -
ఆరోగ్యం కోసం రోజూ నడుద్దాం
మదనపల్లె రూరల్ : ‘ఆరోగ్యమే మహాభాగ్యం. మెరుగైన ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో నడకను అలవాటు చేసుకోవాలి. అప్పుడే అద్భుతమైన ప్రయోజనాలు పొందగలం’ అంటూ డీఎస్పీ కె.మహేంద్ర తెలిపారు. ప్రతిరోజు కేసులు, ఇన్వెస్టిగేషన్, డ్యూటీల పేరుతో క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కొత్తగా ఏదైనా చేద్దామని తలచారు. తలచిందే తడవు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అనుమతితో, డీఎస్పీ మహేంద్ర సారథ్యంలో.. మదనపల్లె మండలం వేంపల్లె మల్లయ్యకొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం వేకువజామున ఒక్కొక్కరుగా పోలీసు సిబ్బంది మల్లయ్యకొండ కిందకు చేరుకున్నారు. అందరూ కలిసికట్టుగా కొండ ఎక్కేందుకు బయలుదేరారు. కొండ ఎక్కే క్రమంలో చుట్టూ ప్రకృతి అందాలను చూడటంతోపాటు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేలేత కిరణాలను చూస్తూ, పిల్లగాలుల శబ్దాలను ఆలకిస్తూ మైమరచిపోయారు. కొండ ఎక్కడంలో అలసిన ఖాకీలు ఓ చోట సేద తీరేందుకు నిలిస్తే... డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులు కఠినమైనవని, ఆరోగ్యం కాపాడుకోవడం అంటే, కుటుంబం, సమాజం కోసం బలంగా నిలవడం, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటమని ఉత్సాహాన్ని నింపారు. దీంతో రెట్టింపైన ఉత్సాహంతో సిబ్బంది ముందుకు సాగి మల్లయ్యకొండకు చేరుకున్నారు. కొండపై నుంచి మదనపల్లె పట్టణ దృశ్యాలను తమ సెల్పోన్లలో బంధించి, సెల్ఫీలు తీసుకుని కాసేపు సరదాగా గడిపారు. ట్రెక్కింగ్లోని అనుభవాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లికి తెలిపితే.. ఆయన పోలీస్ సిబ్బంది ప్రయత్నాన్ని హర్షించడమే కాకుండా, ఆదివారం ఆరోగ్యం కోసం పోలీసులు వేసిన అడుగు.. ఐక్యతకు సంకేతం కావాలని, పోలీసు కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలంటూ సందేశం పంపారు. మల్లయ్యకొండకు ట్రెక్కింగ్ చేసిన వారిలో సీఐలు కళావెంకటరమణ, రమేష్, ఎస్ఐలు అన్సర్బాషా, చంద్రమోహన్, తిప్పేస్వామి ఉన్నారు.డీఎస్పీ కె.మహేంద్ర -
పునరుద్ధరిస్తాం
ఇమాంబేగ్ బావిని ఎప్పటి నుంచో పునరుద్ధరించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి అనుమతుల కోసం పురావస్తు శాఖ వారి దృష్టికి ఎన్నో సార్లు తీసుకువెళ్లడం జరిగింది. కానీ పురావస్తు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో భక్తులకు తెలియాల్సిన ఇమాంబేగ్ బావి చరిత్ర మరుగునపడింది. పురావస్తు శాఖ అనుమతిస్తే కొన్ని రోజుల్లోనే ఇమాంబేగ్ బావిని పునరుద్ధరిస్తాం. – అమర్నాథ్రెడ్డి, టీటీడీ సివిల్ విభాగం ఏఈ, ఒంటిమిట్టచరిత్ర అనవాళ్లు కాపాడండి ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముడు ఉన్నారనే సత్యాన్ని చూసిన ఇమాంబేగ్ దానికి గుర్తుగా నిర్మించిన బావినే ఇమాంబేగ్ బావి అని పిలుచుకుంటున్నాం. స్వామి ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నాడనే సత్యానికి నిదర్శనంగా ఈ బావిని చూపిస్తారు. అలాంటి ఆలయ చారిత్రక అనవాళ్లను కలిగిన ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు దాని చరిత్ర తెలిసే విధంగా టీటీడీ చర్యలు చేపట్టాలి. – నారాయణరెడ్డి, శ్రీకోదండ రామాలయం, మాజీ చైర్మన్, ఒంటిమిట్ట -
సీనియర్ సిటిజెన్స్కు మంత్రిత్వ శాఖ అవసరం
మదనపల్లె సిటీ : సీనియర్ సిటిజెన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వీరారావ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరారావ్ మాట్లాడుతూ వృద్ధులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాసే సమయంలో తమను సక్రమంగా చూసుకుంటేనే ఆస్తి చెందేలా వీలునామా రాయాలన్నారు. దీంతో తల్లిదండ్రులను పిల్లలు సక్రమంగా చూసుకుంటారన్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులపై జరిగే దాడులు, హత్యలు నివారించాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. 2007 చట్టం సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ, ధనలక్ష్మి, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఆనంద వృద్ధాశ్రమం ఆనంద్, రిటైర్డ్ ఎయిర్ఫోర్సు ఆఫీసర్ పరాంధామగౌడ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎన్.వి.నాయుడు, గౌరవ అధ్యక్షులు వై.ఎస్.మునిరత్నమయ్య, ఉపాధ్యక్షులు జగన్మోహన్, కోశాధికారి ఉస్మాన్సాహెబ్, తిరుపతిరావు నాగరాజు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, మహిళా ప్రతినిధి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలుమదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి ఇద్దరు కర్ణాటక వాసులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. కర్ణాటక హవేరి ప్రాంతానికి చెందిన మల్లికార్జున(33), కనకపురకు చెందిన ముత్తురాజ్(32) ఎలక్ట్రానిక్ సిటిలో డీమార్ట్లో పని చేస్తుంటారు. ఇద్దరూ కలిసి శనివారం ద్విచక్రవాహనంలో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి బెంగళూరుకు బైక్లో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో తిరుపతి–మదనపల్లె హైవేలోని పాలెంకొండ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ముత్తురాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఆళ్లగడ్డ(నంద్యాల జిల్లా) : అతి వేగం, అపై నిద్రమత్తు ఒకరిని బలితీసుకుంది. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని గూబగుండం మెట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన పిచ్చిరెడ్డి తిరుపతిలోని ఓ కారు షో రూంలో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేయడంతో పిచ్చిరెడ్డి ఆ కారును డెలివరీ ఇచ్చేందుకు శనివారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరాడు. మార్గంమధ్యలో కడప దగ్గర నంద్యాలకు వెళ్లేందుకు నజీర్ హుస్సేన్, శ్రీను అనే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గూబగుండం మెట్ట సమీపంలోకి వచ్చే సరికి.. కారు నడుపుతున్న పిచ్చిరెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న నజీర్హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా పిచ్చిరెడ్డి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన నజీర్ హుస్సేన్ కడప వాసిగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం -
కడప నగరంలో తీవ్ర విషాదం, కుటుంబ కలహాలతో..!!
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు.అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
మొదటి నుంచి వివక్షే ...
కూటమి ప్రభుత్వానికి రైతులంటే మొదటి నుంచి వివక్షే. రైతుల సమస్యలను ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాలకు దెబ్బతిన్న ఉల్లి రైతులకు కర్నూల్ జిల్లాకు హెక్టారుకు రూ. 50 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాని పక్కనే ఉన్న వైఎస్సార్జిల్లా రైతులను విస్మరించారు. దీనిని వివక్షకాక మరేమంటారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
నకిలీ మద్యంపై యుద్ధం
సాక్షి రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో నకిలీ మద్యం వ్యవహారం రచ్చ రేపుతోంది. ప్రధానంగా అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో ఇటీవల బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపింది. వివిధ రకాల బ్రాండ్లను స్వయంగా తయారు చేస్తూ మద్యం షాపుల ద్వారా బెల్ట్ షాపులకు పంపించిన వ్యవహారం బట్టబయలు కావడం, ప్రత్యేకంగా మిషనరీ పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు పట్టుబడటం అందరికీ తెలిసిందే. జిల్లాలో పలు ప్రాంతాలకు బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన కొంతమంది టీడీపీ నేతలు అరెస్టు అయినా...కీలక నేతలు ఇంతవరకు అరెస్టు కాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై ఆందోళనలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం వ్యవహారంపై సోమవారం ఎక్కడికక్కడ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టడంతోపాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనా అధికారంలో ఉండడంతో టీడీపీ నేతలు ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులను ఏర్పాటు చేశారు. గుడి, బడుల పక్కన పెట్టకూడదన్న విషయాన్ని విస్మరించి సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఎవరూ అడిగే వారు లేరన్న ధైర్యమో...అధికారం ఉందికదా ఎవరు ఏమి చేయరన్న ధీమాతో ఎక్కడపడితే అక్కడ షాపులు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం...అందులో సంబంధీకులకే షాపులు రావడంతో ఎకై ్సజ్ అధికారులు కూడా ఎందుకొచ్చిన తంటా అని ప్రశ్నించడం కూడా మానేశారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలక నేతల అరెస్టులు ఎప్పుడో? అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో కలకలం రేపిన నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో చోటా మోటా వారిని అరెస్టు చేసినా కీలక నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జిగా కొనసాగిన జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది, పీఏలను ఇంకా అరెస్టు చేయలేదు. వారి కోసం అన్వేషిస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొంటున్నా జాడ కనిపెట్టలేకపోతున్నారు. కీలక నేత జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉండగా, మిగిలిన వారు ఎక్కడున్నారన్నది అంతుచిక్కడం లేదు. కీలక నేతలు అరెస్టుల తర్వాత కస్టడీకి తీసుకుంటే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు తెలియజేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు ప్రాంతంలో వెలుగుచూసిన నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాయడంతోపాటు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలో ఉండడం, మరోవైపు టీడీపీ కీలక నేతలే నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఎకై ్సజ్శాఖ ద్వారా న్యాయం జరగదని....సీబీఐ అయితే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పార్టీ నేతలు కోరుతున్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టడంతోపాటు వినతిపత్రాలను సమర్పించనున్నారు. ప్రధానంగా గుడులు, బడుల పక్కన వైన్షాపులు ఉండకూడదని, వైన్షాప్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించాలని, నకిలీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా అరెస్టుచేయాలని, అలాగే సీబీఐ దర్యాప్తు కోరాలని తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ ఆందోళన బాట పట్టింది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదులుతున్నాయి. గుడులు, బడుల పక్కన ఉండకూడదని వినతులు దోషులను కఠినంగా శిక్షించాలి వైన్షాప్ల కేటాయింపులోజరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలి నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన -
సిట్తో సరిపెట్టేస్తారా?
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై, అందులో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలపై సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని వైఎఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సరి పెట్టేసింది. ఈ దర్యాప్తు రైట్ అవుతుందా లేదా అన్నది మున్ముందు చూడాలి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీపై సిట్ దర్యాప్తు చేస్తుందని సీఎం చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. ఇప్పటిదాకా ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు. రిమాండ్ రిపోర్టులను కూడా నివేదించారు. ప్రధానంగా టీడీపీ నేతల ప్రమేయంపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో సురేంద్ర నాయుడు పై తొలుత కేసు నమోదు చేయగా, తర్వాత అరెస్టు అయిన వారి వాంగ్మూలం ఆధారంగా జయచంద్రారెడ్డి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. అంతటితో చర్యలు ఆగిపోయాయి. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కీలక నేతలు, ముఖ్య నాయకులు ఎవరో ఇంతవరకు ఎకై ్సజ్ అధికారులు కూడా ప్రకటించలేదు. ఒకరి వెనుక ఒకరుగా అరెస్టు అవుతున్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చుతూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్టు ప్రక్రియనే పూర్తి కాలేదు. నకిలీ మద్యం తయారీ, వాటి సరఫరా గురించి మాత్రమే దర్యాప్తులో గుర్తించారు. నిజానికి ఈ నకిలీ మద్యం ఎవరెవరికి చేర్చారు.. ఏయే మద్యం దుకాణాలకు వెళ్లింది..ఎంత పరిమాణంలో తయారైంది అన్న వివరాలపై దర్యాప్తు అడుగు కూడా ముందుకు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేయడంతో స్పష్టత వస్తుందా లేదా అన్నది చూడాలి. ● నకిలీమద్యం తయారీ ప్లాంట్ వ్యవహారం, తరలింపు, విక్రయాల్లో విజయవాడకు చెందిన అద్దేపల్లె జనార్దనరావుతో స్థానిక టీటీపీ నేతలంతా జత కట్టినట్టు స్పష్టం అవుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఏ–1 జనార్దనరావు రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలు..టీడీపీ నేతలతో ఎంత గట్టి అనుబంధం ఉందో స్పష్టం చేసింది. మిత్రుడు జయచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయనకు మద్దతుగా వెళ్లినట్టు పేర్కొన్నాడు. అక్కడ టీడీపీ నేతలతో పరిచయాలు, మద్యం వ్యాపారంలో నష్టాలు, లాభాల కోసం నకిలీ మద్యం తయారు..ఇలా అన్నింటికి టీడీపీ నేతలు కలసికట్టుగా జట్టుకట్టినట్టు నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. కేసులో ఏ–1 జనార్దనరావు ఏ–2 కట్టా రాజుకు ఫోన్ చేసి నకిలీమద్యం తయారీకి సంబంధించి చర్చించి, ప్లాంట్ ఏర్పాటులో ఎవరెవరి పాత్ర ఉందో రిమాండ్ రిపోర్ట్లో కట్టారాజు చెప్పినట్టు ఎకై ్సజ్ పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. కొడాలి శ్రీనివాసరావు పేరిట మూతపడిన డాబాను లీజుకు తీసుకున్నాక కాంపౌండ్ గోడను 10 అడుగులకు పెంచారు. త్వరలోనే నకిలీ మద్యం అమ్మకాలు ప్రారంభించాలని జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్కు చెందిన నకిరేకంటి రవి, ఆంధ్రావైన్స్ లైసెన్స్దారు కట్టా సురేంద్రనాయుడు, రాక్స్టార్ లైసెన్స్దారు టి.రాజేష్ ప్రణాళిక వేశారు. బాలాజీ వాటర్ప్లాంట్, ఎస్ఎస్ ట్యాంకు, ఎలక్ట్రికల్ మోటారు, స్పిరిట్ డబ్బాలను షెడ్డుకు తీసుకొచ్చాడు. జనార్దనరావు, రవిలు లేబుళ్లు, పెట్ బాటిళ్లు, క్యాప్లు, హీల్స్ను తీసుకొచ్చారు. మూడు సీలింగ్ మిషన్లలో రెండింటిని జనార్దనరావు తన వాహనంలో రెండుసార్లు తీసుకొచ్చారు. తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో డాబాల్లో పనిచేస్తున్న నలుగురిని బాలాజీ సహయంతో జనార్దనరావు తీసుకొచ్చారు. జనార్దన రావు బార్లో పనిచేస్తున్న సయ్యద్ హాజీ ద్వారా ఒడిశా నుంచి ఇద్దరిని రప్పించి నకిలీమద్యం తయారీని ప్రారంభించి ప్రజలకు తాపించి వారి ఆరోగ్యంతో చెలగాటం అడారు. నకిలీ మద్యం కేసులోవెలుగులోకి వస్తున్న ఒక్కొక్కరు ములకలచెరువు నకిలీమద్యం కేసులో ఇప్పటికి నిందితుల సంఖ్య 23. ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. మిగిలి వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.కాగా ఆరెస్ట్ అయిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎకై ్సజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించగా సోమవారం నిర్ణయం వెలువడనుంది. -
గంగమ్మకు బోనాలు
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పూజారులు చెల్లు గంగయ్య సురేంద్ర కుటుంబ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపారు. భక్తులు బోనాలు సమర్పించారు. గంగమ్మా.చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు.కొందరు తలనీలాలు అర్పించారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు వారి సిబ్బందితో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి అమ్మవారి విశిష్టతను పూజారులు వివరించారు. అలాగే మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీశ్రీ మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డెమ్మా..కరుణించమ్మా గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అమ్మా..చల్లంగా చూడమ్మా అని భక్తులు వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించు కొన్నారు. పలువురు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆల యానికి హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం. -
కూటమి ప్రభుత్వ వైఖరి దుర్మార్గం
జిల్లాలో ఉల్లి పంట పండించిన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గం. ఉల్లిని క్వింటాల్ 1200 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చేతులెత్తేసింది. దీంతో రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీ లు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే హెక్టారుకు 50,000 రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు ఉల్లి రైతులకు కొంత వరకై నా తమ నష్టాలు తగ్గుతాయని భావించాం. కానీ వైయస్సార్ జిల్లాలో పండించిన ఉల్లి పంట వైరెటీ రకం అనే సాకుతో పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పడం దారుణం. – పోతిరెడి బాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి(సీపీఐ రైతు విభాగం) -
బిగుస్తున్న ఉచ్చు!
మదనపల్లె: ములకలచెరువు నకిలీమద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో ముఖ్య నిందితుల చుట్టూ కేసు తిరుగుతోంది. ఇందులో టీడీపీ మాజీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి వద్ద పనిచేసిన వారు కేసులో ముగ్గురు నిందితులుగా ఉండటం గమనార్హం. నకిలీమద్యం తరలించే వాహనానికి డ్రైవర్గా పనిచేసిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్చేసిన ఎకై ్సజ్పోలీసులు తంబళ్లపల్లె కోర్టుసెలవు కారణంగా శనివారం మదనపల్లెలోని తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హజరుపరిచారు. కేసు, రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన ఆయన.. నిందితునికి ఏడురోజుల రిమాండ్ విధించగా మదనపల్లె సబ్జైలుకు తరలించారు. జనార్దనరావే చేయించాడు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అష్రఫ్ టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి (ఏ–17 నిందితుడు) వద్ద ఆరునెలలు పనిచేశాడు. నల్లరంగు స్కార్పియో వాహనానికి డ్రైవర్గా పని చేశాడు. ఈ సమయంలోనే కేసులో ఏ–1 జనార్దనరావుతో పరిచయం ఏర్పడింది. తర్వాత డ్రైవర్గా తీసివేయడంతో ములకలచెరువు మార్కెట్ యార్డులో కూలీ పనులు చేసుకొంటూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం మంత్రి గిరిధర్రెడ్డి (ఏ–18 నిందితుడు, జయచంద్రారెడ్డి బావమరిది)ని ఏదైనా పని చూపించమని కోరగా మద్యం దుకాణం లేదా క్వారీలో పని ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత జనార్దనరావును కలిసి పని కావాలని చెప్పగా రెండు–మూడురోజులకు ఒకసారి నల్లరంగు స్కార్పియో వాహనంలో బెల్టుషాపులకు నకిలీమద్యం సరఫరా చేయాలని, దీనికి రోజుకు రూ.800 కట్టారాజు (ఏ–2 నిందితుడు) ఇస్తాడని జనార్దనరావు తెలిపాడు. అంగీకరించిన అష్రఫ్ జనార్దనరావు చెప్పినట్టు తన బైక్ను జయచంద్రారెడ్డి ఇంటివద్ద ఉంచాక ఆయన ఇంటిలో పనిచేస్తున్న అన్బురాసు అలియాస్ బాబు (ఏ–19 నిందితుడు) వాహనం తాళాలు తెచ్చి ఇచ్చేవాడు. వాహనంలో రాక్స్టార్ మద్యం దుకాణం వద్దకు వెళ్లి నకిలీమద్యం తీసుకుని బెల్టుషాపులకు తరలించేవాడినని. ఈ విషయం జయచంద్రారెడ్డి,అన్బురాసుకు తెలుసని, నకిలీమద్యం సరఫరా మొత్తం తనతో జనార్దనరావు చేయించినట్టు వాంగ్మూలంలో అష్రఫ్ పేర్కొన్నాడు. ఈ కేసులో జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ను కీలకమైన నిందితునిగా ఎకై ్సజ్ పోలీసులు భావిస్తున్నారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన రాజేష్ పేరిట ఒక మద్యం దుకాణం, నకిలీమద్యం తరలించిన వాహనం ఉన్నాయి. ఇవికాక కురబలకోట మండలంలో కోట్ల విలువైన భూములు ఇతని పేరిట రిజిస్ట్రేషన్ జరిగి ఉండటం వెలుగుచూసింది. ఇవికాక ఇతర విషయాలు వెలుగులోకి రావాలంటే రాజేష్ అరెస్ట్ కీలకమని చెబుతున్నారు. విచారణలో మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు. ఈ కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఎకై ్సజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన అష్రఫ్తో కలిపి ఇప్పటిదాకా 14 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డి, అన్బురాసు, బాలాజీ, సుదర్శన్, రవి, శ్రీనివాసులురెడ్డి, చైతన్యబాబు అరెస్ట్ కావాల్సి ఉంది. -
సెగ్మెంట్.. సంపద!
నియోజకవర్గం సంపద (రూలలో)● ప్రథమస్ధానంలో పులివెందుల ● పదో స్ధానంలో బద్వేలు.. ● జగనన్న పాలనలోనియోజకవర్గాల అభివృద్ధి పులివెందుల 5573 జమ్మలమడుగు 4906 రాయచోటి 4145 కడప 3718 రాజంపేట 3629 మైదుకూరు 3430 కమలాపురం 3358 రైల్వేకోడూరు 3292 ప్రొద్దుటూరు 2778 బద్వేలు 2746 రాజంపేట: ఉమ్మడి కడపలో జిల్లాలో ధనిక నియోజకవర్గాలను గుర్తించారు. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వెలువరించిన సమాచారం మేరకు పులివెందుల ప్రథమ, బద్వేలు పదోస్థానంలో ఉంది. నియోజకవర్గాల అభివృద్ధి, పాడిపంటలు, పరిశ్రమలు లాంటి వాటిని భేరీజు చేసుకొని ఏ నియో జకవర్గం ధనికమో తేల్చారు. బద్వేలు.. 10వ స్ధానంలో ఉన్న బద్వేలు నియోజకవర్గం సంపద రూ. 2746 కోట్లు. పాడిపరిశ్రమంలో జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఫిషింగ్ సెక్టారులో జిల్లాలో మొదటి స్థానంలోఉంది. మిగిలిన అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ప్రొద్దుటూరు.. తొమ్మిదో స్థానంలో ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గం సంపద రూ.2778 కోట్లుగా ఉంది. వ్యవసాయ, పరిశ్రమల సెక్టారులో వెనుకబడి ఉంది. బంగారు, టెక్స్టైల్స్ వ్యాపారంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. కమలాపురం.. 7వ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద 3358 కోట్లు ఉంది. చిన్నపాటి ఆటోమొబైల్, ఇండ్రస్టీగా అభివృద్ధి చెందింది. మైదుకూరు. 6 వస్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద రూ, 3430 కోట్లుగా ఉంది. వ్యవసాయరంగంలో రెండోస్ధానంలో ఉంది, వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. కడప.. 4వ స్థానంలో ఉన్న కడప నియోజకవర్గ సంపద రూ. 3718 కోట్లు. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. జమ్మలమడుగు.. 2 స్థానంలో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం సంపద రూ.4906 కోట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమల రంగంలో బాగా ఉంది. జగన్నపాలనలో నియోజకవర్గాల అభివృద్ది.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో నడిచాయి. ఇప్పుడు కూటమి పాలనలో నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనే అపవాదు ను మూటకట్టుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. కడప నగర వ్యూపులివెందుల నియోజకవర్గ సంపద రూ. 5573 కోట్లు. వ్యవసాయరంగంలో ప్రథమ స్థానంలో ఉంది. తుమ్మలపల్లె యురేనియం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద యురేనియం మైన్స్లో ఒకటిగా -
రైలు కింద పడి మహిళ మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కనుమలోపల్లె మార్గంలో కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని శనివారం మహిళ మృతిచెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.... మృతురాలికి 50 సంవత్సరాల వయస్సు ఉందన్నారు. మృతురాలి ఆచూకీ లభించకపోవడంతో మహిళ మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. ఆమె వద్ద ప్లాస్టిక్ సంచిలో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని, బాటిల్స్ ఏరుకుని జీవనం సాగించేదని తెలియవచ్చిందన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్పై దాడి కడప అర్బన్ : కడప నగరంలోని మాసాపేట వద్ద బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్పై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేశారు. కడప టూటౌన్ లో పనిచేస్తున్న బ్లూ కోర్టు కానిస్టేబుల్ నాలుగు రోజుల కిందట రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మాసాపేట వద్ద ఓ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతోంది. ఈ సమయంలో డీజే వేస్తుండడంతో అడ్డుకున్నారు. ఈ సంఘటనలో జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి, మరో వ్యక్తి కలిసి బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్పై దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేశారు. విద్యార్థికి సత్కారం పులివెందుల టౌన్ : మానవ శాస్త్రం విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థిని స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, తదితరులు ఘనంగా సత్కరించారు. పట్టణంలోని గోపీ విహార్ స్ట్రీట్లో నివాసముంటున్న దివంగత బొంపెమ్ హరినాథ్, టీచర్ గోటూరు ఉషారాణిల కుమారుడు బొంపెమ్ ప్రణీత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో ఎంఏ మానవశాస్త్రం చదువుతున్నారు. ఈ విభాగంలో బొంపెమ్ ప్రణీత్ మూడు గోల్డ్ మెడల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా రాజు, సేవా సమితి సభ్యులు ప్రణీత్కు సత్కరించారు. రాజు మాట్లాడుతూ ప్రణీత్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ, సురేష్, రాజు, రాజా, తదితరులు పాల్గొన్నారు. స్కార్పియో దొంగల అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అలంకాన్ పల్లి సమీపంలో ఫ్రెండ్స్ కార్ గ్యారేజ్లో ఉంచిన స్కార్పియో వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సెప్టెంబర్ 5న దొంగలించుకుని వెళ్లారు. తగిన ఆధారాలతో కడప తాలూకా సీఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్సై తాహిర్ హుస్సేన్ తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితులను ఇద్దరిని శనివారం రామరాజు పల్లి వై–జంక్షన్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్కార్పియో స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో అమలాపురం పరిధిలో ఆత్రేయపురానికి చెందిన కారుటూరు సూర్య తేజ, విజయవాడకు చెందిన జోసెఫ్ ఉన్నారు. సూర్య తేజ పై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో 41 కేసులు నమోదయి ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో బయటపడినట్లు తెలిపారు. ఒకరికి గాయాలు సుండుపల్లె : మండలంలోని మిట్టబిడికి కాలనీలో శనివారం మధ్యా హ్నం జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. నాగేశ్వర నాయ క్ గొర్రెలు మేపుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ అతన్ని ఢీకొంది. నాగేశ్వరనాయక్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రెండోశనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. -
బరిలో దిగితే.. పతకమే
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆ చిన్నారి వయసు పదేళ్లు... పట్టుదల ఏకాగ్రత, అలుపెరుగని సాధనతో లక్ష్యంపై గురిపెట్టి పతకాలు సాధించారు. చిన్న వయసులోనే అద్భుత సాధనతో రాణించి భళా అనిపించారు. కడప నగరంలోని ఎడిఫై ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. పొద్దుటూరుకు చెందిన పదేళ్ల చిన్నారి సారా ఇర్ఫాన్ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. అండర్–14 ఇన్లైన్ విభాగంలో రింగ్–3, రింగ్–4, రోడ్డు–1 కేటగిరీలలో రాణించి భళా అనిపించారు. దీంతో ఆయా విభాగాల్లో బాలుడికి మూడు రజత పతకాలు దక్కాయి. ఈ విజయాలతో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సారా ఇర్ఫాన్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సారా తండ్రి ఇర్ఫాన్బాషా, కోచ్ నాగేశ్వరరావులను నిర్వాహకులు అభినందించారు. రజిత పతకాలతో సారా ఇర్ఫాన్ సత్తా -
డిసెంబరు 23న అంతర్జాతీయ సదస్సు
రాజంపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిసెంబరు 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి తెలిపారు. ఏయూ వీసీ చాంబర్లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో ఏయూ మరింత ముందంజలో నిలుస్తుందని, నేటి యుగం డేటా ఆధారంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి మాట్లాడుతూ డేటాసైన్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి నడిపించే శక్తులుగా మారాయన్నారు. ఆధునిక సాంకేతిక రంగాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులు తమ పరిశోధనాపత్రాలను సమర్పించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటీఎస్ వైస్ ఛ:ర్మన్ చొప్పాఎల్లారెడ్డి, ప్రిన్సిపల్ డా.నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఆడ్మిషన్స్ డా.జయరామిరెడ్డి, ప్రోగ్రాం చైర్ డా.చిన్నబాబు, కన్వీనర్ నాగరాజు, పబ్లికేషన్ చైర్స్ డా.పహీముద్దీన్, డా.వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.షేక్ కరీముల్లా పాల్గొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి -
టాలెంట్ హంట్ సెలక్షన్స్ వాయిదా
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈనెల 13 నుంచి 16 వరకు జరగబోయే అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19, టాలెంట్ హంట్ సెలక్షన్లు అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది.ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ శనివారం రెండోరోజుకు చేరింది. ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఓపీతోపాటు సర్జరీలను పూర్తిగా నిలుపుదల చేశాయి. జిల్లావ్యాప్తంగా 119 నెట్ వర్క్ ఆసుపత్రులు ఉండగా అందులో 42 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలుపుదల చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత వైద్య సేవలు యధావిధిగా ఎప్పుడు కొనసాగుతాయోనని చర్చించుకుంటున్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 13వ తేదీ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షులు జనార్థన్రెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని జెడ్పీ ప్రాగణం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలు దేరి 11 గంటల నుంచి 12 గంటల వరకు నిరసన తెలియచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికారత సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్(ఎన్ఎంఎన్ఎఫ్) పోగ్రాం ద్వారా బయో రీసోర్సు సెంటర్పై ఈ నెల 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వననున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రకృతి సేద్యం ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణా కేంద్రంలో శిక్షణకు ఆసక్తి గలిగిన రైతులు 9849900965 నెంబర్కు కాల్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వర్షాలు కురిశాయి. సీకేదిన్నెలో అత్యధికంగా 60.4 మిల్లీమీటర్ల వర్షం కురిసంది. ఆట్లూరులో 44.8 , గోవపరంలో 40.2, కడపలో 38.6 , చాపాడులో 35.4, పెండ్లిమర్రి, ఖాజీపేటలలో 33.2, సిద్దవటంలో 28.8, బద్వేల్లో 28.4 , పొద్దుటూరులో 18.8, లింగాలలో 18.2, చక్రాయపేటలో 17.2, బిమఠంలో 16.2 , కమలాపురంలో 12.4, చెన్నూరలో 11.2, తొండూరులో 10.2, వీఎన్పల్లిలో 9.6, వేంపల్లెలో 8 , మైదుకూరులో 7.4, పులివెందులలో 6, వేములలో 5, ఎర్రగుంట్లలో 4.4 , జమ్మలమడుగులో 3.4, ఒంటిమిట్టలో 3.2, వల్లూరులో 2.4, దువ్వూరులో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలివీడు: వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 108.4 మిల్లీ మీటర్లుగా నమోదైందని ఏఎస్ఓ శ్రీదుర్గ తెలిపారు. ఈ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహించాయి. వెలిగల్లు జలాశయానికి వదర ప్రవాహం పెరగడంతో 3.027 నీటిమట్టం టీఎంసీలకు చేరుకుందని డీఈ శిరీష్కుమార్ తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.11 టీఎంసీలకు చేరింది. మండలంలోని గోరాన్ చెరువు నుండి వడిశలంకపల్లి వరకూ వరద నీరు పెరగడంతో పెద్ద చెరువుకు నీరు చేరింది. ఎల్లంపల్లి కుషావతి రిజర్వాయర్ నుంచి నడింపల్లి మీదుగా వచ్చే ప్రవాహంతో చిన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
● ప్రజల సమక్షంలో కోటి సంతకాల సేకరణ ● జిల్లా వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ సురేష్బాబు కడప కార్పొరేషన్ : వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ కె.సురేష్బాబు పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో శనివారం సంబంధిత కార్యక్రమ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ అనుచరులు, బినామీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సంతకాలు సేకరిస్తామన్నారు. అక్టోబర్ 23న నియోజవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్కు అందజేస్తామని వారు వివరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తే మెరుగైన వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అతివృష్టి లేక అనావృష్టి వచ్చి రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధర లేక పండించిన పంట నీటిపాలైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీదని అంజద్బాషా అన్నారు. పర్మిట్ రూంలో తాగిన కొన్ని క్షణాల్లోనే వ్యక్తి మృతి చెందడానికి కారణం కల్తీ మద్యమేనన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, ఎస్ఈసీ సభ్యులు ఎస్.యానాదయ్య, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కార్పొరేటర్లు కె.బాబు, షఫీ, బాలస్వామిరెడ్డి, పార్టీ నాయకులు శ్రీరంజన్రెడ్డి, సీహెచ్.వినోద్, గౌస్, అక్బర్, బండి ప్రసాద్, రామ్మోహన్రెడ్డి, డిష్జిలాన్, రెడ్డి ప్రసాద్, రహీం, టీపీ వెంకట సుబ్బమ్మ,బండి దీప్తి, మరియలు తదితరులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి వ్యవసాయ విద్యార్థి మృతి
మహానంది : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పాలేరు వాగులో నీట మునిగి మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం జిల్లెలమంద సమీపంలోని పెద్దతాండకు చెందిన బి.జనార్ధన్నాయక్ (21) మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాలలో మూడో సంవత్సవరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాల సమీపంలోని పాలేరువాగు వద్దకు తోటి విద్యార్ధులతో కలిసి వెళ్లాడు. అక్కడ కొంత మంది దుస్తులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఈతకు దిగారు. ఈ క్రమంలో ఐదారుగురు ఈతకు దిగగా సరిగా ఈత రాని జనార్ధన్ నాయక్ వాగులోకి దిగాడు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న అతను కనిపించకపోవడంతో మిగిలిన విద్యార్థులు అన్వేషించగా అక్కడే లోతు ఉన్న గుంతలో అపస్మారక స్థితిలో కనిపించాడు. బయటికి తీసి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం
కడప అర్బన్ : కడప నగరం రాజంపేట బైపాస్లోని రామాంజనేయ పురం వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ లోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్లు కడప అగ్నిమాపక శాఖ అధికారి యోగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కడప నెహ్రు నగర్ కు చెందిన మాలే శివకు చెందిన 14 టైర్ల లారీని రామాంజనేయపురం పెట్రోల్ బంక్ సమీపంలో పార్కింగ్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి లారీ బ్యాటరీ వద్ద వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. బాధితుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దాదాపు రూ.20 లక్షల మేర నష్టం జరిగినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన నారాయణ(50) శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న తన కుమార్తె భావన(20)ను బైక్లో ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా, చిప్పిలి సమీపంలో బెంగళూరు నుంచి రాయచోటికి వెళుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మల్లిక (28) వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బావిలో దూకి ఆత్మహత్యాయత్నం
● బాధితుడిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ ● సకాలంలో స్పందించినందుకు ఎస్పీ ప్రశంస మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి ఓ వ్యక్తి చేతి నరాలు కోసుకుని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన ఏఆర్ కానిస్టేబుల్ బాధితుడిని కాపాడి ఆస్పత్రికి తరలించాడు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా...కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కృష్ణమాచారి కుమారుడు చెంగాచారి(33) తన భార్య శశి, కుమారుడితో కలిసి గురువారం మదనపల్లె పట్టణం ఎస్టేట్లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఆలయానికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సమస్యల కారణంగా చెంగాచారి భార్య శశితో గొడవపడ్డాడు. ఆమె దూషించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వచ్చి పట్టణంలోని బెంగళూరు రోడ్డు మడికయ్యల శివాలయం వద్దకు చేరుకుని అక్కడే చేతి నరాలు కోసుకున్నాడు. కబరస్థాన్ పక్కన ఉన్న కోడిగుడ్డు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బావిలోకి దూకే క్రమంలో లోపల ఉన్న చెట్టు కొమ్మలకు తగులుకుని వేలాడుతూ, ప్రాణభయంతో కేకలు వేశాడు. అయితే అదే సమయానికి మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎస్.అమరనాథ్, పిల్లలను స్కూల్కు తీసుకువెళ్లేందుకు అటువైపు వచ్చాడు. చెంగాచారి పెడుతున్న కేకలు విని అటువైపు వెళ్లి బావిలో వ్యక్తి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఓ తాడు తీసుకువచ్చి మరొకరి సాయంతో బావిలోకి దిగి చెంగాచారిని బయటకు తీసుకువచ్చాడు. తన వాహనంలో జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించాడు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. విషయం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ అమరనాథ్ను అభినందించారు. విధి నిర్వహణలో నిబద్ధత చూపినందుకు ప్రశంసించారు. పోలీసు రివార్డుకు సిఫారసు చేశారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతో కలిసి కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేయనున్నామన్నారు. అక్టోబర్ 23న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు తరలింపు చేసి, నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారన్నారు. ఆ తర్వాత గవర్నర్కు కోటి సంతకాల సేకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్, పి. ప్రసాద్రెడ్డి, నిత్యానందరెడ్డి, రఘునాథరెడ్డి, షఫీవుల్లా, సీహెచ్ వినోద్, చీర్ల సురేష్ యాదవ్, రమేష్రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ శ్రీకారం పోస్టర్లు ఆవిష్కరించినవైఎస్సార్సీపీ నేతలు -
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి
విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై యాజమాన్యాలకు అనేక సార్లు నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో 34వేలమంది కాంట్రాక్టు కార్మికులు, 7వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను భేషరతుగా క్రమబద్దీకరించాలి. విద్యుత్ ప్రమాదాల వల్ల 450 మంది మరణించారు, 250 మంది కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు. యాజమాన్యం వైద్యపరంగా వారికి ఎలాంటి సాయంగానీ, పరిహారం గానీ అందించలేదు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ వర్తింపజేయాలి. – బి. రామలింగారెడ్డి, విద్యుత్ జేఏసీ, రాష్ట్ర వైస్ చైర్మన్ -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట
కడప కార్పొరేషన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతోంది. శుక్రవారం కడప డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగులతో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, తమ కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని, 2022 పీఆర్సీకి సంబంధించిన బకాయిలను చెల్లించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 13న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి మహా ధర్నా చేయనున్నామని, 15 నుంచి నిరధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. కడప డివిజన్ కార్యాలయం ఎదుట ఆందోళన 13న విజయవాడలో మహాధర్నా 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిక -
జిల్లా వ్యాప్తంగా వర్షం
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తన కారణంగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా పులివెందుల్లో అత్యధికంగా 69 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే కమలాపురంలో 39.2 , అట్లూరులో 38, జమ్మలమడుగులో 32 , పోరుమామిళ్లలో 31.2, ఎర్రగుంట్లలో 29.4, కాశినాయనలో 29.6 , లింగాల, ముద్దనూరులలో 25.2, దువ్వూరులో 24.2, పెండ్లిమర్రిలో 23.4 , పొద్దుటూరులో 22.4, ఖాజీపేటలో 22 , సికెదిన్నెలో 20.8 , సింహాద్రిపురంలో 18.6, మైదుకూరులో 15.2, పెద్దముడియంలో 13.8 , కలసపాడులో 12.4, వల్లూరులో 11.8 , బిమఠంలో 10.2, వేములలో 10 , రాజుపాలెంలో 7.8, తొండూరులో 6.8 , చక్రాయపేటలో 6.2, కడపలో 5.8, వీఎన్పల్లిలో 5.6, చాపాడులో 4.2, గోపవరంలో 4 , బద్వేల్లో 3.8, వేంపల్లిలో 2.8, బికోడూరు, చెన్నూరులలో 2.6, ఒంటిమిట్టలో 1.2, సిద్దవటంలో 1 మిల్లీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్టు
● ఆరుగురు అరెస్టు ● రూ.2లక్షలు విలువైన రాగి, 4 వాహనాలు స్వాధీనం ● డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మైదుకూరు : ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగేలా పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్ను ఎత్తుకెళ్లే ఆరుగురు అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2లక్షలు విలువ చేసే రాగి, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మైదుకూరు పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విలేకరులకు ఆ వివరాలను వెల్లడించారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా అక్కమాంబాపురం గ్రామానికి చెందిన అయితా వెంకటేశ్వర్లు, పొదలకూరు గ్రామానికి చెందిన కుడుముల రాజేష్, పులగల చిన్న మస్తానయ్య, ఉయ్యాల పోతురాజు, కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన పంది శ్రీనివాసులు, చెర్లోపల్లె గ్రామానికి చెందిన గంగోడి దేవకుమార్ అనే వారు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్ను ఎత్తుకెళ్లి విక్రయించుకునేవారు. వీరిపైన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సోమశిల, మర్రిపాడు పోలీస్స్టేషన్లలో 8 కేసులు, వైఎస్సార్ కడప జిల్లాలోని ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, కలసపాడు, బి.కోడూరు పోలీస్స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే వీరు 40 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్ను దొంగలించారు. రాగి వైర్ చోరీపై నమోదైన కేసుల మేరకు మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ చిరంజీవి, బ్రహ్మంగారిమఠం ఎస్ఐ బి.శివప్రసాద్ నిందితులను బ్రహ్మంగారిమఠం – మిట్టమానుపల్లె రహదారిలోని ఈశ్వరదేవీ గుహ సమీపంలో పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షలు విలువ చేసే 150 కిలోల రాగి ముద్దలు, 150 కిలోల రాగి వైర్తోపాటు దొంగతనాలు చేసేందుకు ఉపయోగించే మూడు మోటార్ బైక్లను, ఒక గూడ్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్, సిబ్బంది పి.వెంకటన్న, కేవీ రమణ, బీవీ రమణారెడ్డి, ఓబులయ్య, దాదావలి, రాజేష్, తిరుమలయ్య, గణేష్, నవీన్ కృషి చేశారని ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వారిని అభినందించారు. సమావేశంలో సీఐ రమణారెడ్డి, ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్, ఎస్.సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. కల్లు విక్రయం నుంచి ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం వైపుగా.. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్ను ఎత్తుకెళ్లే అంతర్ జిల్లాల ముఠా సభ్యులు దొంగతనాలపై ఎలా ఆకర్షితులయ్యారే విషయాన్ని పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరిశీలిస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. నిందితుల్లో ఏ1గా ఉన్న అయితా వెంకటేశ్వర్లు, ఏ2గా ఉన్న కుడుముల రాజేష్లు రాజంపేట మండలంలోని మందపల్లె గ్రామం వద్ద కల్లు గీసి అమ్ముకొని బతుకుతుండేవారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో నీటి ప్రవాహానికి పలు చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. వెంకటేశ్వర్లు, రాజేష్ ఒక ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులోని రాగి వైర్ను ఎత్తుకెళ్లి అమ్ముకోవడం ప్రారంభించారు. పగటిపూట గూడ్స్ వాహనంలో పొలాల వెంట తిరిగి రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో దొంగతనాలు చేసేవారు. దొంగలించిన రాగి వైర్ను కొంత కరిగించి ముద్దలుగా, మరికొంత వైర్ రూపంలోనే నిందితుల్లో ఒకరైన గంగోడి దేవకుమార్కు చెందిన గూడ్స్ వాహనంలో తీసుకెళ్లి విక్రయించేవారు. రెండు జిల్లాల్లో ఎంతో మంది రైతులకు తీవ్ర నష్టం కలిగించిన వీరు ఆ క్రమంలోనే మైదుకూరు పోలీసులకు దొరికిపోయారు. -
ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి
కడప కార్పొరేషన్: ఉల్లి పంటను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజదబాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతో కలిసి ఆయన కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉల్లి రైతులు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నారన్నారు. మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డిలు ఉల్లి పంటలను పరిశీలించి వారి సమస్యలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామన్నారు. క్వింటా ఉల్లిని రూ.1200తో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కమలాపురం, మైదుకూరులో కొనుగోలు కేంద్రాల ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారన్నారు. ఆ ఫోన్లకు కాల్ చేస్తే ఏ ఒక్కరూ ఫోన్ తీయడం లేదన్నారు. మిట్టమానుపల్లెకు చెందిన ఓబన్న కుమారుడు ఓబులేసు అనే రైతు కూలీ ఖర్చులు కూడా రావనే బాధతో ఉల్లి పంటను వంకలో వేసి నీటి పాలు చేస్తున్న దృశ్యాలను మీడియాకు చూపారు. ఉల్లిని క్వింటా రూ.300లకు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉందన్నారు. కర్నూలులో హెక్టారుకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇంతవరకూ జీవో ఇవ్వలేదన్నారు. దాన్ని వైఎస్సార్ కడప జిల్లాకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.1.20లక్షలు సాగు ఖర్చు అయ్యిందని, ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి, హెక్టారుకు రూ.50వేల పరిహారం ఇస్తే కనీసం 60 శాతం రికవరీ అవుతుందన్నారు. లేనిపక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్రంలో ఇన్ని తీవ్రమైన సమస్యలుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఎంపీ అన్నారు. అధికారయంత్రాంగం, పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను వేధించడంపైనే వారి సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. పులివెందులలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో పరామర్శకు వెళ్లిన వారిపై కూడా 307 సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారని ఉదహరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో విమానాల్లో చక్కర్లు కొట్టే పవన్ కళ్యాణ్కు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం సరఫరా అవుతోందని ఆరునెలల క్రితమే చెప్పానని టీడీపీ కార్యకర్త ఒకరు ఫేస్బుక్లో పెట్టారన్నారు. 111కోట్ల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసి, అందులో రూ.48కోట్ల క్వార్టర్ బాటిళ్లు అమ్మారన్నారు. ఝార్ఖండ్లో జరిగిన కల్తీ మద్యం కేసులో ఈడీ ఎంటరై సత్వర చర్యలు చేపట్టిందని, ఏపీలో ఇంత జరుగుతున్నా సీబీఐ, ఈడీ నిద్రపోతున్నాయని విమర్శించారు. నకిలీ మద్యం స్కాంను వెలికి తీసిన ఎకై ్సజ్ సీఐ హిమబిందుకు సస్పెన్షన్ను బహుమతిగా ఇవ్వడం దారుణమన్నారు. వైద్య సేవలు బంద్.. ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. ఫీజురీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ● ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెక్టారుకు రూ.50వేలుపరిహారం ఇవ్వాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనేనకిలీ మద్యం సరఫరా ఆరునెలల క్రితమే చెప్పినట్లు టీడీపీ కార్యకర్తే ఫేస్బుక్లో పెట్టారు ఝార్ఖండ్ తరహాలో కల్తీ మద్యంపైసీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. జిల్లాకు రూ.173 కోట్లు ఇన్యూరెన్స్న్స్ వచ్చిందని ప్రకటనలు ఇస్తున్నారని, ఏ ఊర్లో, ఏ పంటకు ఎంత బీమా వచ్చిందనే వివరాలు తెలపడం లేదన్నారు. క్వింటా రూ.2500లకు కొనాల్సిన ఉల్లిని ప్రభుత్వం రూ.1200లకు కొంటామని చెప్పి ఇప్పటికీ ఒక కేజీ కూడా కొనలేదన్నారు. జిల్లాలో ఉల్లి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. నిన్న కొమ్మద్దిలో 16 ఎకరాల్లో ఉల్లి పంట వేసి నష్టపోయి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గత ప్రభుత్వంలో 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఈనెల 15వ తేదీ లోపు కూటమి ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. -
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెనూ ప్రమాదం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామం ముద్దనూరు రోడ్డు ఐసీఎల్ వద్ద ఉన్న వంతెన వద్ద ఏఆర్ ట్రావెల్ ప్రైవేటు బస్సుకు పెద్ద పెనుప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలబడింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ విశ్వనాథ్రెడ్డి పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నుంచి నంద్యాలకు ఏఆర్ ట్రావెల్ బస్సు బయలు దేరింది. ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామం ఐసీఎల్ వద్దకు రాగనే ఎదురుగా చైన్నె నుంచి తాడిపత్రికి బొగ్గును తీసుకెళ్లే లారీ ్డ వచ్చింది. డ్రైవర్ బ్రేక్ వేయాలని ప్రయత్నించాడు. బ్రేక్ ఫైయిలూర్ కావడంతో హ్యాండ్ బ్రేక్ వేశారు. దీంతో లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా బస్సు ఆగిపోయింది. బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారిజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని ట్రాఫిక్ అంతరాయం కాకుండా చూశారు. -
పెద్దదర్గా ఉరుసు విజయవంతం చేయాలి
కడప సెవెన్రోడ్స్: మత సామరస్యానికి ప్రతీక అయిన కడప పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషిచేసేందుకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం దర్గా ముషాయిరా హాలులో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మత సామరస్యానికి ప్రత్యేక కూడలిగా ఉన్న దర్గా ఉరుసు కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయన్నారు. ఉరుసు జరిగే అన్ని రోజుల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు నిరంతర పారిశుద్ద్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు విధులు పక్కాగా ప్రణాళికయుతంగా నిర్వర్తించాలన్నారు. నవంబరు 5, 6, 9 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు గనుక ఆరోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ, పోలీసు, ఉరుసు ఉత్సవ కమిటీ సమన్వయంతో క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భక్తుల రాక అధిక సంఖ్యలో ఉంటుంది గనుక ప్రజా రవాణా సర్వీసులసంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టులలో సమాచార సలహా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో దర్గా ఉత్సవ కమిటీకి సంబంధించిన వలంటీర్లు ఉంటూ ఉరుసుకు వచ్చే భక్తులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పురుషులు, మహిళలకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సురక్షితమైన తాగునీరు, హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 108 అంబులెన్స్లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఎమ్మెల్యే మాధవీరెడ్డి, నగర మేయర్ ముంతాజ్బేగం, ఇతర అధికారులు, వివిధ వర్గాల ప్రతినిధులు, దర్గా భక్తులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పీఠాధిపతితో కలిసి ఉత్సవాలపోస్టర్ ఆవిష్కరణ నవంబర్ 4 నుంచి ఉరుసుఉత్సవాల నిర్వహణ -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పార్నపల్లె విద్యార్థులు
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల హెడ్మాస్టర్ అర్జున్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్లలో ఇటీవల జరిగిన సాఫ్ట్బాల్ ఎస్జీఎఫ్ అండర్–19 విభాగంలో తమ పాఠశాలకు చెందిన నాగ చైతన్య అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే 9వ తరగతి చదువుతున్న ప్రేమ్, హరిహరన్ జిల్లాస్థాయి ఎస్టీఎఫ్ అండర్–17 బీచ్ వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరి ఎంపికపట్ల హెడ్మాస్టర్తోపాటు పీడీ విక్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
వృద్ధుల కోసం ప్రత్యేక నేత్ర సంరక్షణ కార్యక్రమాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలో వయో వృద్ధుల నేత్ర సంరక్షణలో భాగంగా అత్యాధునిక నేత్ర వైద్య సేవలు అందిస్తున్నట్టు వృద్ధుల నేత్ర సంరక్షణ విభాగాధిపతి డాక్టర్ అవినాష్ పతేంగే తెలిపారు.అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ప్రాంగణంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాల ముగింపు సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాంపస్తో పాటు తమ ఎల్వీపీఈఐ ఇతర క్యాంపస్లలో కూడా ఎల్డర్లీ ఐ కేర్ సెంటర్స్ ( ప్రత్యేక వృద్ధుల నేత్ర సంరక్షణ కేంద్రాలు) అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవి వృద్ధాప్యంలో వచ్చే నేత్ర సమస్యల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు. వృద్ధాప్యంలో కలిగే జ్ఞాపక శక్తి లోపాలు, పోషకాహార లోపం, వినికిడి లోపం, దృష్టి లోపం సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స సూచిస్తాయని చెప్పారు. -
డిమాండ్లు అంగీకరించకుంటే 15 నుంచి సమ్మె
ఎర్రగుంట్ల : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను అంగీకరించకుంటే ఈ నెల 15వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి తెలిపారు. గురువారం ఆర్టీపీపీలోని యూనియన్ కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కాంట్రాక్టు కార్మికులు చాలా తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు డీఏలు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నెల 14వ తేదీన వర్క్ టూ రూల్ పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. -
శభాష్ పోలీస్!
రాజుపాళెం : ఏం కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి జీవితంపై విరక్తి కలిగింది. కుందూనదిలో దూకేందుకు వెళుతుండగా ఆ దారిలో వెళుతున్న కొంతమంది యవకులు, ఖాకీలు గమనించి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓ కళాశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్న శివుడు భార్య ఈడిగ రమణమ్మ రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో గురువారం దూకాలని వెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది యువకులు ఆ దారిలో వెళుతూ ఇదేంటి వృద్ధురాలు కుందూనది వద్ద ఉంది అని వెంటనే వారు రాజుపాళెం ఎస్ఐ కె.వెంకటరమణకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ పోలీసులు కిరణ్ బాబు (సీపీ 894), ఎం. రవిబాబు (పీసీ 671)లను వెల్లాల కుందూనది వద్దకు పంపారు. జీవితంపై విరక్తి చెంది కుందూనదిలోకి దూకాలనుకున్న రమణమ్మతో పోలీసులు మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకొని రాజుపాళెం పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. అక్కడ ఎస్ఐ వెంకటరమణ, పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె భర్త ఈడిగ శివుడుకు రమణమ్మను అప్పగించారు. వృద్ధ మహిళను కాపాడిన పోలీసులు కిరణ్ బాబు, రవి బాబులతో పాటు ఎస్ఐ ఏఎస్ఐలను గ్రామస్తులు శభాష్.. పోలీస్ అంటూ ప్రశంశించారు. రమణమ్మ భర్త శివుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. -
టీడీపీలో ఇరువర్గాల ఘర్షణ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లె గ్రామంలో గురువారం డబ్బులు బాకీ విషయమై టీడీపీకి చెందిన నాగయ్య, రామాంజనేయరెడ్డి వర్గీయులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆర్.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన నాగయ్య అనే వ్యక్తి రామాంజనేయరెడ్డి నుంచి రూ.90లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులు మూడేళ్లలోపు తిరిగి చెల్లించాలని, ప్రతి ఏడాది వడ్డీ డబ్బులు కట్టాలని ప్రామిసరీ నోటు రాయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో రూ.6లక్షల వడ్డీ డబ్బులు కట్టలేదని, డబ్బుల విషయమై రామాంజనేయరెడ్డి, నాగయ్య వర్గాల వారు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నాగయ్యతోపాటు ఆయన కుమారుడు అనిల్ కుమార్, రామాంజనేయ రెడ్డి వర్గానికి చెందిన గంగాధర్ రెడ్డి, మల్లారెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం వారిని 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.డబ్బులు బాకీ విషయమై కత్తులతో దాడి -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదు
ప్రొద్దుటూరు : మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేదలకు ఫీజు లేకుండా అన్ని సేవలు అందుతాయని, ప్రైవేట్ ఆధ్వర్యంలో పేదలకు ఎంత వరకు సౌకర్యాలు అందుతాయని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పీపీపీ విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరిగుట్టలో పట్టపగలే చోరీ పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసముంటున్న రాజ కుల్లాయప్ప ఇంట్లో గురువారం పట్టపగలే దొంగలు పడ్డారు. రాజకుళ్లాయప్ప కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం యథావిధిగా రాజకుళ్లాయప్ప కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 6 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.20వేల నగదుతో పాటు ఒక కోడిని అపహరించుకెళ్లారని బాధితులు తెలిపారు. పులివెందుల పట్టణంలో పట్టపగలే దొంగతనాలు జరుగుతుండటంతో పులివెందుల ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మందులపై జీఎస్టీ రేట్లు తగ్గింపుకడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని ఐ.ఎం.ఏ కార్యాలయంలో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టాల్ ను ఏర్పాటు చేసి జీఎస్టి రేట్ల తగ్గింపు పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. తొలుత కర్నూల్ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ నాగ కిరణ్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ రవిబాబు స్టాల్ ను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత నెల 22వ తేదీ నుంచి వినియోగదారునికి మేలు జరిగేలా జీఎిస్ట్టీలో భారీ మార్పులు చేసిందన్నారు. జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ కె. వెంకటేశ్వర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
కడపలో విస్తృతంగా తనిఖీలు
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడప ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను విచారించి ఆరా తీశారు. అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, అప్సర సర్కిల్ ప్రాంతాల్లో వాహనాలను, బస్సులను తనిఖీ చేశారు. బస్ స్టాండ్ ఆవరణలోని పార్సిల్ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని నిశితంగా తనిఖీ చేసి, లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలోని రిజిస్టర్ను పరిశీలించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో చిన్నచౌకు సీఐ ఓబులేసు, ఎస్ఐ లు రాజరాజేశ్వర రెడ్డి, రవి కుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
తొండూరు : తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన నరేష్ (40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం రాత్రి మల్లేల గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. మృతుడు నరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఘన మద్దిలేటి తెలిపారు. వ్యవసాయ మోటార్లు చోరీ రాజుపాళెం : మండలంలోని వెలవలి గ్రామంలో రెండు వ్యవసాయ మోటార్లు చోరీ అయ్యాయి. గ్రామానికి చెందిన రిటైర్డు పోలీసు బసవయ్య, న్యాయవాది రావుల సురేంద్రనాథ్రెడ్డి పొలాలకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం మోటార్లను ఆన్ చేసేందుకు కాపలాదారుడు చిన్న కొండయ్య వెళ్లగా అక్కడ రెండు మోటార్లు లేవు. ఈ విషయాన్ని యజమానులకు తెలిపారు. ఈ సంఘటనపై రాజుపాళెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెలవలి గ్రామంలో గతంలో ఏడు మోటార్లు చోరీ అయినట్లు బాధిత రైతులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులోని స్థానిక పాల్రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద బొలేరో వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొంది. బీహార్కు చెందిన శివకుమార్ పాండే దువ్వూరు మండలం లిల్లాపురం గ్రామానికి చెందిన కోట రామేశ్వరరెడ్డిలు కూలి పనుల నిమిత్తం అరటి కాయలు కోసేందుకు ప్రతిరోజు ద్విచక్ర వాహనంలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డిపల్లె గ్రామం రోడ్డు వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని 108 వాహనంలో సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
కడప అర్బన్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఇప్పటినుండే తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సమస్యలు సృష్టించే వారు, ఎన్నికల నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భద్రత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాలో నేరాల నిరోధానికి అన్ని సబ్–డివిజన్లలో క్రైం పార్టీలను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై ఎం.వి యాక్ట్ మేరకు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా రోడ్లపై అడ్డంగా వాహనాలు నిలిపి ఉంచితే సీజ్ చేసి స్టేషన్ కు తరలించాలని, జరిమానా విధించాలని ఆదేశించారు. సోషల్ మీడియా లో మహిళలపై, బాలికలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా, చట్ట పరిధిలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా దుకాణాలు, గోడౌన్ లలో తనిఖీ లు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో హత్య కేసును త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ పి.భావన, ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ ఎం.నాగభూషణ్, సిబ్బందిని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన, పులివెందుల డీఎస్పీ బి.మురళి నాయక్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, జిల్లాలోని సి.ఐలు, ఎస్.ఐలు, ప్రత్యేక విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశా నిర్దేశం -
పంటల బీమా వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి
కడప కార్పొరేషన్ : పంటల బీమా ఎంతమంది రైతులకు మంజూరైందో తెలిపే వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 నుంచి 2024 ఖరీఫ్ వరకు ప్రధాన మంత్రి పసల్ బీమ్ యోజన కింద రూ.137 .75 కోట్లు, వాతావరణ ఆధారిత బీమా కింద సుమారు రూ.35.25 కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. దీంతో పాటు 2022–23 రబీ కాలానికి శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలు సాగుచేసి నష్ట పోయిన 77,995 మంది రైతులకు రూ.14.46 కోట్లు విడుదలైందన్నారు. 2023 ఖరీఫ్లో వరి పంట సాగు చేసిన 87,143 మంది రైతులకు రూ. 15.44 కోట్లు వచ్చిందని, 2023–24 రబీలో శనగ, నువ్వులు సాగు చేసిన 90, 126 మంది రైతులకు రూ.77.74 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. 2024 ఖరీఫ్లో వరి, మినుము, జొన్న పంటలను సాగు చేసి నష్ట పోయిన 97,361 మంది రైతులకు రూ. 28.11 కోట్లు వచ్చింది. ఇవి కాకుండా వాతావరణ ఆధారిత బీమ కింద దాదాపు 35.25 కోట్లు వచ్చాయన్నారు. పంటల బీమాకు సంబంధించి రూ.173 కోట్లు జిల్లా కు విడుదల చేశామని 50 రోజులుగా కేవలం పత్రికా ప్రకటనలతోనే రైతులను అయోమయంలో పడేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ఆయా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రఘునాథరెడ్డి, చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు
కడప రూరల్ : వైద్య రంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐఎంఏ హాల్ నుంచి ఏడు రోడ్ల కోడలి వరకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ వైద్య సేవలు, వ్యక్తిగత ఆరోగ్య భీమా పాలసీ ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్స్పై కూడా పన్ను మినహాయింపు ఉందన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఆఫీసర్ పద్మావతి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అవార్ అర్జున్, డాక్టర్ శశి భూషణ్ రెడ్డి, డాక్టర్ ఉమా మహేశ్వర కుమార్, డాక్టర్ రవిబాబు, డెమో భారతి, జిల్లా మలేరియా అధికారి మనోరమ, పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోటనీ పాఠ్యాంశాలు బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ త్రివిక్రమ్రెడ్డి తెలిపారు. బోధనలో పూర్వ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు పనిచేసిన గంటల పరిమితిలో గరిష్టం రూ. 27 వేలు గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. అర్హత ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ నాటికి కళాశాల కార్యాలయానికి చేరాలని ప్రిన్సిపాల్ సూచించారు. 23 మందికి షోకాజ్ నోటీసులు ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 23 మంది మహిళా పోలీసులకు మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత శని, ఆదివారాల్లో జీఎస్టీతోపాటు ఇన్సూరెన్ప్పై కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కాలేదని 23 మందికి నోటీసులు జారీ చేశారు. బాధ్యతల స్వీకరణ కడప అగ్రికల్చర్ : జిల్లా పశుసంవర్థశాఖ అధికారి( పశుసంవర్థశాఖ జాయింట్ డైరెక్టర్)డాక్టర్. శ్రీనివాసులు గురువారం కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్థశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన పులివెందులలోని పశుసంవర్థశాఖ సూపర్స్పెషాలిటి ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఇటీవలే బదిలీపై జిల్లా పశుసంవర్ధశాఖ అధికారిగా వచ్చారు. ఈ మేరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు జిల్లా పశుసంవర్దశాఖ అధికారిగా పనిచేస్తున్న శారదమ్మ పులివెందులలోని పశుసంవర్థశాఖ సూపర్స్పెషాలిటి ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్గా వెళ్లారు. 11న రాష్ట్రస్థాయి ఖోఖో ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : కృష్ణాజిల్లా లోని గన్నవరం హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 11న రాష్ట్రస్థాయి డైరెక్ట్ నేషనల్ సెలక్షన్స్ జరుగుతాయని అన్నమయ్య, వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లాల ఖో ఖో సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి ,కార్యదర్శి జె. నరేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న వారు ఈ నెల 24 నుంచి 26 వరకు కర్ణాటకలో సీనియర్స్ సౌత్ జోన్ ఖో ఖో జాతీయ టోర్నమెంట్లో పాల్గొనవలసి ఉంటుందన్నారు. సౌత్ జోన్ ఎంపికలకు ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు 9849713690 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రారంభమైన కౌన్సెలింగ్ కడప ఎడ్యుకేషన్ : నూతనంగా ఎంపికై న గురువులకు పోస్టింగ్ కేటాయింపుల కోసం గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైయింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లకు మదనపల్లి ట్రెనింగ్ కేంద్రంలో కాగా ఎస్జీటీలకు కడప గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రారంభమైయింది. ఈ కౌన్సెలింగ్ శుక్రవారం కూడా కొనసాగనుంది. 13 నుంచి టాలెంట్ హంట్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : అండర్ 12, 14, 16,19 క్రికెట్ క్రీడాకారులకు టాలెంట్ హంట్ జరుగుతుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే ఈ టాలెంట్ హంట్కు ఏసీఏ నుంచి కే. రవిశంకర్ టాలెంట్ కమిటీ మెంబర్ విచ్చేసి సెలెక్షన్స్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మంచి ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 13న అండర్– 12 క్రీడాకారులు,14న అండర్– 14 క్రీడాకారులు, 15న అండర్ –16 క్రీడాకారులు 16న అండర్ –19 క్రీడాకారులు హాజరుకావాలన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ కిట్లతో పాటు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్ , ఒక పాసుపోర్టు సైజు ఫొటోతో వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియానికి ఉదయం 8 గంటలకు రావాలని కోరారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి కడప ఎడ్యుకేషన్ : విద్యార్థులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నప్పుడే మంచి ప్రతిభను సాధించగలరని దీంతో మంచి విజయాలను సాధించగలరని సమగ్రశిక్ష జీసీడీఓ దార్ల ఆరోగ్య మేరీ అన్నారు. కడప నగరం చిన్నచౌకులోని ప్రభుత్వ అంబేద్కర్ గురుకుల కళాశాలలో గురువారం ప్ర పంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమబద్ధమైన జీవనశైలి , ప్రశాంతమైన దినచర్య ఉంటే శారీరకంగా మానసికంగా బలిష్టంగా ఉంటారని తెలిపారు. -
పార్టీని బలోపేతం చేద్దాం
మద్యంలో 25 శాతం నకిలీదే● రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ● లక్షల కోట్లు దోచుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ● ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారి ప్రవర్తించలేదు ● వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప కార్పొరేషన్ : గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రామాంజనేయపురంలోని నూతన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు పండించిన ఏ పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. లక్షకోట్లు విలువజేసే మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సహజ వనరులను దోచుకుంటున్నారని, రోజూ లక్షల కోట్లు దోచు కోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కూటమి తీరుపై దుయ్యబట్టారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారి ప్రవర్తించలేదన్నా రు. పెదబాబుకు, చినబాబుకు తెలియకుండానే నకిలీ మద్యం స్కాం జరిగిందా అని సూటిగా ప్రశ్నించారు. ● పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిల్ ఉందన్నారు. పేదలకు విద్య, వైద్యం దూరం చేసేందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. ● రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీని పటిష్టం చేసుకోవాలన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే ప్రభుత్వ పాలన జరుగుతుందని తెలిపారు. ● బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, ఒకట్రెండు వచ్చినా అవి ప్రైవేటు కాలేజీలేనని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రమంతా నకిలీ మద్యం సరఫరా అవుతోందన్నారు. నకిలీ మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ● మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. యూరియా బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఉందన్నారు. ● వైఎస్సార్సీపీ జోనల్ కో ఆర్డినేటర్ చల్లా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ఉద్యమం చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని, దాన్ని పార్టీ కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు. నవంబర్ 22 వరకూ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ క్రమంలోనే గ్రా మ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేయాలన్నారు. ఈనెల 28న నియోజకవర్గాల స్థాయిలో ర్యాలీలు చేపట్టాలని, నవంబర్ 12న జిల్లా స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, పార్టీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ మేయర్ కె. సురేష్ బాబు, సీఈసీ సభ్యులు మల్లికార్జునరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఆర్. వీరారెడ్డి, ఇ. తిరుపాల్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి పాల్గొన్నారు. నకిలీ మద్యం స్కాంలో ఉన్నవారంతా చినబాబు సన్నిహితులే వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో 25 శాతం నకిలీదేనని, ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి నకిలీదని వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ప్రతిరోజూ ఏదో ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన పాపానికి ఎరువులు, విత్తనాలు లేక రైతులు బాధపడుతున్నారన్నారు. తంబళ్లపల్లెలో లక్షలాది నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయని, ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో 25 శాతం నకిలీదేనన్నారు. ఇంత జరుగుతున్నా డీఫ్యాక్ట్ సీఎం లోకేష్కు, ఇంటెలిజెన్స్, పోలీసు, ఎక్సైజ్ వారికి తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని, తనిఖీల్లో దొరికిన బాటిళ్ల లేబుళ్లన్నీ ఇతర రాష్ట్రాల కు చెందినవని, ఇతర రాష్ట్రాల వారే దీన్ని బయటపెట్టారన్నారు. నెల్లూరు, ఒంగోలు, క్రిష్ణా, ఇబ్రహీం పట్న, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడ్డాయన్నారు. వాటికి సారథ్యం వహించేవారంతా చినబాబు సన్నిహితులేనని ఆరోపించారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి తన కోవర్టయితే రూ.50కోట్లు తీసుకొని టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన మరో రూ.50 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేశారని, తన కోవర్టు అయితే ఇంతకాలం వారు ఎందుకు పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చీఫ్ లిక్కర్ తాగి అనేకమంది చనిపోతున్నారని, తమ ఆదాయం కోసం ఇంత నీచానికి దిగజారడం దారుణమన్నారు. పచ్చ మీడియా సిగ్గుశరం లేకుండా, మానవత్వం మరిచి ఈ తప్పులను దాచిపెట్టి, మూసిపెట్టడం అన్యాయమన్నారు. ఏదో ఒకరోజు వారు దీనికి పశ్చాత్తాప పడక తప్పదని హెచ్చరించారు. నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు అద్భుత స్పందన వచ్చిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా లక్ష మంది జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. -
అభివృద్ధిలో లక్ష్యసాధనకు కృషి
కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్డబ్ల్యూఎస్ సేవలు, వైద్య ఆరోగ్య సదుపాయాలు, పౌరసరఫరాల, రైతు సేవా కేంద్రాల్లో సేవలు, పీఎంఏజీవై, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్.తోపాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, డ్రగ్స్ పంపిణీ, ఆసుపత్రులలో పారిశుధ్యం, ఆసుపత్రులలో రోగ నిర్ధారణ సేవలపై దృష్టి సారించాలన్నారు. దీంతో పాటు పలు సూచనలు చేశారు. సీపీఓ హాజరతయ్యా,జెడ్పీ సీఈవో ఓబులమ్మ,మెప్మా పిడి కిరణ్ కుమార్,సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్,వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న దాదాపు 9 ఆర్ఎస్కే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. తొలి ఖరీఫ్ సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.2389 లుగా, సాధారణ రకానికి రూ.2369 లుగా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వేంపల్లి–1, కమలాపురం–2, సిద్దవటం–1, చెన్నూరు–2, ఖాజీపేట–1,నంది మండలం– 1,పెన్నా పేరూరు– 1లలో తొమ్మిది ఆర్ఎస్కేలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పొగాకు రహిత సమాజాన్ని నిర్మించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జాతీయ పొగాకు నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీవాణి కోరారు. గురువారం రాయచోటిలోని డైట్ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ సిగరెట్టు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని, పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారిచేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఎం.నర్సింహారెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుమతి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి, అధ్యాపకులు శివభాస్కర్, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రయోగాలు, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను బహిష్కరిస్తున్నాం. పిల్లలకు హాజరు, ఉపాధ్యాయులకు హాజరు, పిల్లలకు బోధన తప్ప ఎలాంటి బోధనేతర కార్యక్రమాలను నిర్వహించం. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వారకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. – ఇలియాస్బాషా, ఫ్యాప్టో చైర్మన్. వైఎస్సార్జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించాలి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మా ఆర్థిక పరమైన విషయాల పరిష్కరణలో ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం కానీ, చర్యలు తీసుకుంటామని చెప్పడం లేదు. ఇవన్నీ తేలే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి. – రాళ్లపల్లి అబ్దుల్లా, ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ, వైఎస్సార్జిల్లా. -
కూటమిపై గురువుల తిరుగుబావుటా !
● ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలన్నీ నిలుపుదల ● నేటి నుంచి అన్ని పాఠశాలల్లో అమలుకు గురువుల అడుగులు కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖలు విద్యారంగంలో అవలంబిస్తున్న ప్రయోగాలను, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ గురువులు తిరుగుబావుటా ఎగురవేశారు. పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఫ్యాప్టో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ విజయవాడలో జరిగిన ఫ్యాప్టో రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం నుంచి అమలుకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తప్ప మరే ఇతర కార్యక్రమాలను నిర్వహించకూడదని ఫ్యాప్టో నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఫ్యాప్టో నాయకులు కలెక్టర్తోపాటు డీఈఓ, ఆయా మండలాల ఎంఈఓలకు వినతిపత్రాలను అందజేయనున్నారు. లెక్కలేనన్ని బోధనేతర కార్యక్రమాలు జూన్ నెల నుంచి యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, జీఎస్టీ 2.0 పేరుతోనే మొక్కల పెంపకం, విద్యార్థుల వివరాలు, విద్యా కానుకలను విద్యార్థులకు అందజే యడం వాటి వివరాలను కూడా ఆన్లైన్ చేస్తున్నారు. దీంతోపాటు రోజుకు ఒక నివేదికను ఎంఈఓ ఆఫీస్ కు పంపాల్సిన పరిస్థితి ఉంది. అలాగే విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ ఆన్లైన్.. ఇవన్నీ ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కల్గించే విషయాలని.. వీటన్నింటిని నిలిపి వేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతోపాటు అసెస్మెంట్ పుస్తకాలు, టీచర్ హ్యాండ్ బుక్ ఉపాధ్యాయులకు పరిధికి మించి భారంగా మారింది. ఈ పరిస్థితులన్నీ ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నాయని వాపోయారు. ఆర్థిక పరమైన సమస్యలను... రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించిన పలు రకాల ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారించాల్సి ఉంది. వాటన్నింటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకుంటుంది. దీంతో విసిగిపోయిన గురువులు పలుమార్లు తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలే పట్టలేదు. దీంతో విసుగు చెందిన ఉపాధ్యాయులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
నకిలీ మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకడప కార్పొరేషన్ : రాష్ట్రంలో జరిగిన నకిలీ మద్యం స్కాంపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా డిమాండ్ చేశారు. గురువారం కడపలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం పేరు చెబితే చంద్రబాబు గుర్తుకు వస్తారని, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన ఘనత బాబుదేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిందని ఎద్దేవా చేశారు. తంబళ్లపల్లెలోని మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం గుట్టు రట్టయ్యిందన్నారు. కుటీర పరిశ్రమలుగా తయారీ కేంద్రాలను నడుపుతున్నారని, వీటిలో వందల కోట్ల నకిలీ మద్యం పట్టుబడిందన్నారు. స్పిరిట్తో వాటిని తయారు చేస్తున్నారని, నకిలీ మద్యం సరఫరా ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పెదబాబుకు, చినబాబుకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నకిలీ మద్యం స్కాంను వెలుగులోకి తెచ్చిన ఎకై ్సజ్ సీఐ హిమబిందుకు సస్పెన్షన్ను బహుమతిగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. నకిలీ మద్యంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో అన్ని అరాచకాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని, తన ప్యాకేజీ పోతుందనే నోరు మెదపడం లేదా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య, నాయకులు బసవరాజు, మునిశేఖర్రెడ్డి, గౌస్, కార్పొరేటర్లు షఫీ, అజ్మతుల్లా, కె. బాబు పాల్గొన్నారు. -
దాడులు చేస్తే.. విధులు నిర్వర్తించేదెలా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : దాడులు చేస్తే విధులు ఎలా నిర్వర్తిస్తామంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కడప ఆర్ఎం కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. దువ్వూరు వద్ద ఆళ్లగడ్డకు చెందిన ఓ అద్దె బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడడం తగదని నిరసన ప్రదర్శించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కెపాసిటీకి మించి బస్సులో ప్రయాణికులున్నా.. ఆపాలంటూ దాడులు చేయడం దారుణమన్నారు. స్టేజితో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ బస్సు ఆపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాక అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి బస్సు డ్రైవర్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఆర్ఎం పొలిమేర గోపాల్రెడ్డి కల్పించుకుని డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు.విధులు బహిష్కరించి అద్దె బస్సు డ్రైవర్ల నిరసన బాట -
హత్య కేసు నిందితుడికి జీవితఖైదు
కడప అర్బన్: హత్య కేసులో ఓ నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తీర్పునిచ్చారు. సంఘటన వివారాలిలా ఉన్నాయి.. చెట్టేవేలి భవాని శంకర్ కలెక్టరేట్కు వెళ్లే దారిలో, మహావీర్ సర్కిల్ సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయం, ఈఎండీ స్కానింగ్ సెంటర్లో కాంట్రాక్టర్ మల్లికార్జున వద్ద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. అయితే తన భార్యతో మృతుడికి వివాహేతర సంబంధం ఉందని మల్లికార్జున అనుమానించాడు. కోపంతో మృతుడిని తరచూ వేధించేవాడు. 2023 నవంబర్, 12న ఉదయం 9 గంటల సమయంలో మల్లికార్జున ఎల్ఐసీ ఆఫీసుకు రమ్మని భవానీ శంకర్ను పిలిచాడు. మృతుడు ఆఫీస్ వద్దకు వెళ్ళగానే ఆగ్రహావేశంతో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు’’ అంటూ వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో విచక్షణా రహితంగా భవానీశంకర్ను నరికి చంపాడు. మృతుడి భార్య చిట్టివేలి బాబాబీ కడప వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ నాగరాజు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు, రూ.100 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కేనచికేత్విశ్వనాథ్ అభినందించారని సీఐ బి.రామక్రిష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైఎస్.జగన్కు పేరొస్తుందనే కళాశాలల పైవేటీకరణ
కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్.సుధాకర్బాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణతో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం వ్యతిరేకించారని గుర్తుచేశారు. వైద్య రంగాన్ని చంద్రబాబు బినామీల చేతుల్లో పెట్టకుండా మాజీ సీఎం వైఎస్.జగన్ అడ్డుపడుతూ మహా యజ్ఞం సాగిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో తాను కట్టిన మెడికల్ కాలేజీని ప్రజలకు చూపించడానికి వైఎస్.జగన్ వెళ్తుంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 30రకాల సంక్షేమ పథకాలతో దళితులకు రూ.70 వేల కోట్లు లబ్ధి కలిగిందన్నారు. ప్రతి సంవత్సరం రూ.13వేల కోట్లు వారి ఖాతాల్లో పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలను సర్వనాశనం చేసిందన్నారు. సూపర్ సిక్స్తో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మాల, మాదిగ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కుడి చేత్తో వడ్డించడం, ఎడం చేత్తో లాక్కోవడం చంద్రబాబు నైజమన్నారు. మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్.జగన్ చుట్టూ ఉన్నవారందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందన్నారు. నకిలీ మద్యంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, సరసమైన ధరలకు స్వచ్ఛమైన మద్యం ఇస్తామని ఇదివరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదన్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నేతలు పులి సునీల్, ఎస్. వెంకటేశ్వర్లు, త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, సీహెచ్ వినోద్, భాస్కర్, కె. శరత్ బాబు, శ్రీనివాసులు, కంచుపాటి బాబు పాల్గొన్నారు. లక్షమందితో జగనన్న దళిత ఫోర్స్ కడప కార్పొరేషన్: లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్ తయారు చేయాలన్నదే తన లక్ష్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగానికి సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16వేల గ్రామాలున్నాయని, ప్రతి గ్రామం నుంచి ఐదుమంది దళితులను ఎంపికచేయాలన్నారు. కమిటీలన్నీ పూర్తయిన తర్వాత జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం, జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సమన్వయకర్త తప్పక హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కమిటీలు పూర్తి చేసేందుకు తాత్కాలిక పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. కడప నియోజకవర్గానికి త్యాగరాజు, బద్వేల్కు కె.బాబు, ప్రొద్దుటూరుకు సీహెచ్.వినోద్కుమార్, కమలాపురానికి సుబ్బరాయుడు, జమ్మలమడుగుకు యోబు, మైదుకూరుకు కె.శరత్ బాబు, పులివెందులకు భాస్కర్లను నియమించారు. పులి సునీల్ కుమార్, సింగమాల వెంకటేశ్వర్లు, కంచుపాటిబాబు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న టీజేఆర్ సుధాకర్ బాబు, పాల్గొన్న నాయకులు -
ట్రంప్ టారిఫ్ టెర్రరిజంపై మోదీ మౌనం వీడాలి
ప్రొద్దుటూరు : ట్రంప్ టారిఫ్ టెర్రరిజంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక మహిళా శక్తి భవనంలో బుధవారం సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హెచ్1బీ వీసా వేధింపులు, యూనివర్సిటీ యువత, మధ్యతరగతి విద్యావంతులు, ఐటీ కుటుంబాలు, టెక్స్టైల్స్ గార్మెంట్స్, రైతులపై పన్నుల భారం మోపి ట్రంప్ టారిఫ్ టెర్రరిజం సృష్టిస్తున్నారన్నారు. అమెరికా సామ్రాజ్య వాద వాణిజ్య వ్యతిరేక పోరాటం చేయాల్సిన ఎన్డీఏ ప్రభుత్వం మౌనం వహించడం దేశానికి ప్రమాద కరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన నాన్యమూర్తి గవాయిపై దాడి రాజ్యాంగంపై దాడిగా పరిగణించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక దోపిడీ కుల వ్యవస్థ రూపంలో ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అధికార, ప్రతిపక్షాలు జిల్లా సమగ్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించారయని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, పులివెందుల మెడికల్ కళాశాల ప్రారంభం, మేజర్, మైనర్, స్మాల్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, అసంపూర్తిగా ఉన్న కడప–బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలలో ఉపాధి అవకాశాలను పెంచాలన్నారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై అదనపు భారం మోపడం తగదన్నారు. యూరియా కొరత పరిష్కరించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలన్నారు. ఎ.రామ్మోహన్, సత్యనారాయణ, సర్వేశ్వరి, ముంతాజ్ బేగం, సాల్మన్, విజయ్కుమార్, మహబూబ్ బాషా, రమేష్, పాల్గొన్నారు. -
ఘనంగా బిషప్ జన్మదిన వేడుక
కడప రూరల్ : సీఎస్ఐ రెవరెండ్ బిషప్ ఐజాక్ వర ప్రసాద్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాయలసీమ డయాసిస్ మండల అధికారులు, గురువుల ఆధ్వర్యంలో స్థానిక చర్చిలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను బిషప్ ఐజాక్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చర్చి యూత్ బోర్డు సెక్రటరీ మోజెస్ మాట్లాడుతూ బిషప్ ఐజాక్ వరప్రసాద్ జన్మదిన వేడుక సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. చర్చి అసిస్టెంట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ పీఎస్.వినయ్కుమార్క, రెవరెండ్ సంపత్, సరోజ్కుమార్, డేనియల్, తదితరులు పాల్గొన్నారు -
మరణంలోనూ వీడని స్నేహం
ముద్దనూరు : ఇద్దరూ మంచి స్నేహితులు.. కలిసి భోజనం చేశారు.. మరణంలోనూ వారు స్నేహం వీడలేదు. ముద్దనూరు–కడప ప్రధాన రహదారిలో సున్నపురాళ్లపల్లె క్రాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. చిలంకూరుకు చెందిన హాజీవలి, సీకే.సుగాలిబిడికి గ్రామంలో నివాసముంటున్న రామ్మోహన్ ఇరువురూ మంచి స్నేహితులు. బుధవారం ఇద్దరూ కలిసి భోజనం చేయాలనుకున్నారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న రామ్మోహన్ చిలంకూరు వద్ద లారీ నిలిపి హాజీవలితో కలిసి మోటార్ బైక్పై ముద్దనూరులో భోజనం చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి చిలంకూరుకు బయలుదేరారు. సున్నపురాళ్ళపల్లె క్రాస్ వద్ద వెనుకనుంచి వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో హాజీవల్లి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రామ్మోహన్ను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఖాళీ చెక్కుతో కాసుల బేరం
సాక్షి టాస్క్ఫోర్స్ : సమాజంలో పరువుగా బతికే ఉద్యోగులు భయపడిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో చిక్కి లబోదిబోమంటున్నారు. ఏమి చేయాలో తోచక తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితి. 2016 నుంచి కొంత మంది అనుచరులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి దాష్టీకం ఇది. లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చి ఖాళీ చెక్కులు తీసుకోవడం.. మొత్తం చెల్లించినా.. తర్వాత ఎక్కువ మొత్తం చెక్కులో రాసి కోర్టు ద్వారా అధికంగా సొమ్ము లాక్కోవడం అతడికి ఆనవాయితీగా మారింది. బయటికి చెప్పుకోలేకపోతున్నామన్న ఉపాధ్యాయులు సాక్షితో స్వయంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి గతంలో శిల్క్ వ్యాపారం చేసే వారు. నష్టాలు వచ్చాయని రూ.40 లక్షలకు 99/2003లో ఐపీ కేసు నమోదైంది. కోర్టు ద్వారా వేలంలో జింకా రవి ఇంటిని కూడా వేరొకరు కొన్నారు. ఈయనే 2016లో గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. పేరుకు మాత్రమే సంస్థ ఏర్పాటుచేశారు కానీ ఎలాంటి రికార్డులు మెయింటెనెన్స్ చేయడం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్గా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. తీసుకున్న అప్పు కంతుల ప్రకారం చెల్లించినా తన వద్ద ఉన్న ఖాళీ చెక్కులను కోర్టులో వేసి రూ.లక్షకు రూ.10 లక్షలు బాకీ ఉన్నట్లు తన ఇష్టం వచ్చినట్లు ఖాళీ చెక్లో రాసుకుని బాకీదారులపై ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నాడు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చెందిన దంపతులు గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్లో అప్పు తీసుకున్నారు. రూ.లక్షల్లో బాకీ ఉన్నారని వారిపై 15 తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. ప్రొద్దుటూరు ఒకటో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, రెండో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో జింకా రవి, ఆయన అనుచరులు వేసిన కేసులు 300కు పైగానే ఉన్నాయనే ఆరోపణలున్నాయి.రూ.1.50 లక్షలు తీసుకుంటే రూ.36 లక్షలంటూ కోర్టుకుప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీలో నివసిస్తున్న వితంతురాలైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రూ.50 వేలు ఒక మారు, రూ.లక్ష మరో మారు వడ్డీకి తీసుకున్నారు. ఆమె రూ.3 లక్షలు చెల్లించారు. డబ్బు తీసుకున్న సమయంలో ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఖాళీ చెక్కులను ఆధారంగా చేసుకుని రూ.36 లక్షలు బాకీ ఉన్నట్లు కోర్టులో వేశాడు. తన కుమారుడు తిరుపతిలో ట్యాక్సీ నడుపుతుండటంతో అవసరాల కోసం ఆమె అప్పు తీసుకోవడం జరిగింది. గుర్రప్ప ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేయగా 4 కేసులు కొట్టేశారు. మిగతా కేసులు విచారణలో ఉండగానే ఆమె చనిపోవడం జరిగింది.రూ.5 లక్షలకు.. రూ.20లక్షలట..ప్రొద్దుటూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు రూ.లక్ష అప్పు తీసుకుని రూ.5 లక్షలు చెల్లించాడు. ఇంకా బాకీ ఉందని ఒత్తిడి చేయడంతో ఆ ఉపాధ్యాయుడు పక్కనున్న మండలానికి బదిలీ చేయించుకున్నారు. ఆయనపై రూ.20 లక్షలకు కోర్టులో కేసు వేశారు. 2019లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే తనకు వచ్చిన మెడికల్ బెన్ఫిట్ రూ.5 లక్షలు తనకంటే ముందుగానే బ్యాంక్ ద్వారా డ్రా చేసుకున్నాడు. ఈయనపై పెట్టిన రెండు కేసులను కోర్టులో కొట్టివేయడం జరిగింది.ఖాళీ చెక్కులపై అదనంగా రాసుకుని..మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు యనమల సుబ్బరాయుడు గుర్రప్ప ఆటో ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని చెల్లించినా.. ఖాళీ చెక్కులను కోర్టులో వేసి తనకు ఇంకా బాకీ ఉందని కేసులు వేశారు. జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేశారు. ఇందులో రెండు కేసులు కొట్టివేయగా, ఐదు కేసులు విచారణలో ఉండగానే గుండెపోటుతో ఉపాధ్యాయుడు మరణించాడు. మరో ఉపాధ్యాయుడిపై కూడా నాలుగు కేసులు వేయడం జరిగింది. మరో ఉపాధ్యాయుడు తాను తీసుకున్న డబ్బు చెల్లించినా కోర్టులో కేసు వేయడంతో విధిలేని పరిస్థితిలో ఆయన పక్క నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన జింకా రవిని పిలిపించి హెచ్చరించడంతో కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు మానసిక వేదన అనుభించాడు.కోర్టులో కొట్టేసినా..కె.చంద్రశేఖర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఖాళీ చెక్కుతో రూ.9 లక్షలు చెల్లించాలని 2017 జనవరి 7వ తేదీన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ తరపున కేసు వేయగా 2019 మే 16న కొట్టేశారు. ఇదిలా ఉండగా తన వద్ద ఉన్న సదరు ఉపాధ్యాయుడి ఖాళీ చెక్కులను ఆసరాగా చేసుకుని రూ.4 లక్షలు చెల్లించాలని 2019 జూన్ 7న, జూలై 17న రూ.2.50 లక్షలకు మొదటి అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో తప్పుడు కేసులు వేయడం జరిగింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలికి సంబంధించి 2019 మే 16న ఖాళీ చెక్తో దాఖలు చేసిన కేసును కొట్టివేయగా, 2019 మే 31న రూ.4.25 లక్షలకు మళ్లీ కేసు వేశారు. ఈ ప్రకారం గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవి తరపున 2017లో 35 కేసులు, 2018లో 7 కేసులు, 2019లో 17 కేసులు, 2020లో 11 కేసులు వేశారు. జింకా వెంకటసుబ్బయ్య 42 కేసులు, జింకా బ్రహ్మయ్య 26 కేసులు, గుర్రం వెంకటలక్షమయ్య 9 కేసులు, పుల్లగూర చౌడయ్య 30 కేసులు, వద్ది ఓబయ్య 22 కేసులు వేశారు.ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్వడ్డీ వ్యాపారి జింకా రవి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. 2016 నుంచి తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఉద్యోగులచే ఖాళీ చెక్కులను ఇప్పించుకుని తమ ఇష్టం వచ్చిన రీతిలో డబ్బు మొత్తాన్ని రాసుకుని కోర్టులో కేసు వేశారు. కోట్ల రూపాయలను అక్రమంగా పొందాలనే ప్లాన్తో ఇలా చేశారు. విచారణ జరిగిన కేసుల్లో 20కిపైగా కొట్టివేయడం జరిగింది. జింకా రవి వేసిన కేసుల్లో ఒకటి యదార్థంగా బాకీ ఉన్నట్లు అనిపించడం లేదు. అన్ని కేసులూ తప్పుడు కేసులే. ఒక కేసు కొట్టేశాక అదే వ్యక్తిపై మళ్లీ ఇంకొక కేసు వేశారు.– ఎన్సీ సుమంత్ కుమార్, న్యాయవాది,ప్రొద్దుటూరు -
టెట్.. టెన్షన్ !
కడప ఎడ్యుకేషన్ : పిల్లలకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందేనని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైగా రెండేళ్లలోపు పాస్ కావాల్సిందేనని నిబంధనతో గురువులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ టీచర్స్లో కలవరం మరింత ఎక్కువైంది. సంస్కరణల పేరుతో.... అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుంచి 10వ తరగతి వరకు 9 రకాల బడులను తీసుకొచ్చింది. ఇప్పటికే పలు రకాల యాప్లతో టీచర్లకు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు టీచర్ ఎలిజిబులిటి టెస్టు(టెట్) పాస్ కావాల్సిందేనని ఉపాధ్యాయులపై సుప్రీంకోర్టు గుదిబండ పెట్టింది. 2010కి ముందు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ తప్పని సరిగా రాసి అర్హత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఏళ్లుగా విద్యార్థులకు బోధిస్తున్నా తమకు ఇప్పుడు టీచర్ ఎలిటిబులిటి టెస్టు నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు వాపోతున్నారు. పదోన్నతులతో లింక్.... సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణత కావాలి. కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అయ్యవార్లను టెన్షన్ వెంటాడుతోంది. దీనికితోడు టెట్ పాస్ కాని వారికి పదోన్నతులతోపాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికి వారికి పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 2010 విద్యాహక్కుచట్టం అమలులోకి వచ్చిన తర్వాత టెట్ తప్పనిసరిగా పాస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 2010 తర్వాత వచ్చిన వారంతా టెట్ పాసైన వారే. కఠిన పరీక్షే... టెట్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీ కేటగిరి వారు 60 శాతం, బీసీ కేటగిరి 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరి వారు 40 శాతం మార్కులు సాధించాలి. టెట్ పాస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష గణితం, చైల్డ్ డెవెలప్మెంట్, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది, బయలాజికల్ సైన్సు ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్ ఇలా సంబంధం లేని సబ్జెక్టులు టెట్లో పెట్టి పాస్ కావాలంటే ఎలా అని టీచర్లు వాపోతున్నారు. టీచర్లకు కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే పదోన్నతులు కరువే ! సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన తీర్పుపై పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ఒక ప్రకటన చేయాలి. విద్యాహక్కు 2010 నుంచి అమలైన దృష్ట్యా అంతకుముందు నియామకం పొందిన ఉపాధ్యాయులందరికీ మినహాయింపునివ్వాలి.– మల్లు రఘునాథ రెడ్డి ఎస్టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చేతికొచ్చిన పంటను కోత కోయలేరు.. కోసి మార్కెట్కు తరలిస్తే కొనేవారే లేరు.. ‘మద్దతు’ పలకాల్సిన పాలకులకా కర్షకుడి కష్టమే పట్టడం లేదు. నోటి మాటలు.. వట్టి ‘కోత’లు తప్ప! ఇంకేముంది.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటంతా కళ్లముందే కుళ్లిపోతోంది. ఇంటిల్లిపాది పడ్డ కష
మైదుకూరు : జిల్లాలో ఉల్లి (పెద్ద బళ్లారి) పంటను సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. అసలే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులను గోరు చుట్టుపై రోకటి పోటులా వర్షాలు చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో పడేశాయి. జిల్లాలో మైదుకూరు, దువ్వూరు, వీరపునాయునిపల్లె, బ్రహ్మంగారిమఠం,ఖాజీపేట, చాపాడు, పులివెందుల తదితర మండలాల్లో 16,668 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో రైతుల ఆశలు నేలపాలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ. 400 – 500 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టిన రైతులు క్వింటాల్ ధర పాతాళానికి పడిపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. ఆఖరికి పంట కోత కోసి విక్రయించడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వీరపునాయనిపల్లె మండలంలో వర్షాలకు పంట మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైదుకూరు, దువ్వూరు మండలాల్లో పొలాల్లోనే వదిలేసిన ఉల్లి పంటను గొర్రెలు మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతుల కష్టాలపై స్పందించని కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర లేక కుదేలైన ఉల్లి రైతుల కష్టాలపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. రైతుల నుంచి క్వింటాల్ రూ.1200 తో కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అధికారులు ఆచరణలోకొచ్చేసరికి చేతులెత్తేశారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసే లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలతో పంట దెబ్బ తినడంతో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందని తెలియడంతో జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక ఇటు వర్షాలతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఉల్లి రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతు కుదేలు క్వింటాల్ రూ. 400 – 500కు పడిపోయిన ధర పంటను పొలాల్లోనే వదిలేస్తున్న కర్షకులు -
ఉల్లి రైతులను ఆదుకోవాలి
వీరపునాయునిపల్లె : ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వీఎన్ పల్లె మండలంలోని ఉల్లి పంట సాగు చేసిన రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం బాధాకరమన్నారు. పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడంతో భారీగా నష్టపోతున్నారని అటువంటి సమయంలో మద్దతు ధర ప్రకటించడంతో పాటు సొంతంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వానిదేనన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఊరు కోవడం దారుణమని ధ్వజమెత్తారు. మార్క్పెడ్ ద్వారా క్వింటాల్ రూ.12వందలతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు కొనుగోలు ప్రారంభించకపోవడంపై మండిపడ్డా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరటి, చీని, బొప్పాయి, ఉల్లి లాంటి అన్ని పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్షాలు అధికంగా కురిసి ఉల్లి పంట దెబ్బతిన్న విషయం తెలుసుకొని కేవలం 20రోజుల్లోనే పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరతో కొనుగోలు చేయడమా లేక హెక్టారుకు 50వేల రూపాయలు అందించాలని డిమాండు చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గురువారం 10గంటలకు రైతులతో వెళ్లి కలెక్టర్ను కలుస్తామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తామని వివరించారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ వీరప్రతాప్రెడ్డి, జిల్లా రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ రైతు నాయకుడు భాస్కర్ రెడ్డి, కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రాజు పాలెం జగన్మోహన్రెడ్డి, సర్పంచులు వెంకటరెడ్డి, నరేష్రెడ్డి, సౌజన్యరెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసుల్రెడ్డి, రవి, సుధాకర్రెడ్డి, శివాంజనేయరెడ్డి, వీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల పోలీసా.. మజాకా !
సాక్షి టాస్క్ఫోర్స్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పులివెందుల ఖాకీల తీరు రోజురోజుకు తీవ్ర వివాదాస్పదమవుతూనే ఉంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు బనాయించిన పులివెందుల పోలీసులు.. మరికొంతమంది నేతలపై రౌడీ షీట్లు కూడా నమోదు చేశారు. తాజాగా జరిగిన ఓ ఘటనలోనూ వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసుల ఏకపక్షవైఖరికి అద్దం పడుతోంది. గత ఆదివారం రాత్రి పట్టణంలోని నగరిగుట్టలో వ్యక్తిగత కక్షల కారణంగా రాజేష్, అంజనప్పల వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. గొడవ అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ కిశోర్ అంజనప్పతో పాటు మరికొందరిని పరామర్శించారు. గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందరు టీడీపీ నాయకులు కూడా ఆ ఘటనలో గాయాలపాలైన కొందరిని పరామర్శించారు. ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్నట్లు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకపక్షధోరణిలో అంజనప్పతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. అంతేనా.. పరామర్శకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై సైతం గొడవకు కుట్రదారులుగా పేర్కొంటూ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ కిశోర్లపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అటువైపు పరామర్శకు వెళ్లిన టీడీపీ నాయకులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. పులివెందుల పోలీసుల వైఖరి చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
కడప ‘దేశం’లో కల్లోలం !
● ఇటీవల నియమించిన నగర కమిటీపై తమ్ముళ్ల ఆగ్రహం ● కార్యకర్తల అసంతృప్తిపై అధిష్ఠానం ఆరా ● మరోమారు అభిప్రాయ సేకరణ కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకెత్తయితే.. కడప నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు అంతకుమించి ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడపలో జరిగే పార్టీ వ్యవహారాలు.. ఆధిపత్య గొడవలు ఆ పార్టీ అధిష్ఠానాన్నే కలవరపెట్టే స్థాయికి చేరాయి. తాజాగా కడప నగర కమిటీ నియామకం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఇటీవల కడప నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్తోపాటు ఇతర సభ్యుల నియామకానికి చర్యలు చేపట్టారు. ఆ మేరకు అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అప్రూవ్, రిజెక్ట్ అనే ఆప్షన్స్ ద్వారా కార్యకర్తల నిర్ణయాలను సేకరించారు. ఈ సందర్భంగా దాదాపు 70 శాతానికి పైగా కార్యకర్తలు రిజెక్ట్ ఆప్షన్ను ఎంచుకున్నట్లుగా ప్రచారం సాగింది. ఈ అంశాన్ని ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు బహిరంగంగానే అధికార పార్టీకి చెందిన గ్రూపుల ద్వారా తెలియపరిచారు. తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి, కడప నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్తోపాటు ఇతర కార్యవర్గాన్ని నియమిస్తూ నూతన కమిటీని ప్రకటించారు. ఈ జాబితాపై పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము రిజెక్ట్ చేసిన అభ్యర్థులనే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆమోదింపజేశారని మండిపడ్డారు. ఈ నగర కమిటీకి పార్టీ అధిష్ఠానం అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ కమిటీపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలో సీనియర్ కార్యకర్తలు ఎవరూ లేరంటూ ఆరోపించారు. మళ్లీ అభిప్రాయ సేకరణపై ‘రిజెక్ట్’ ఎఫెక్ట్..? ఈ తరుణంలో బుధవారం ఆ కమిటీని రద్దు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ అంశాన్ని టీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పంచుకున్నారు. అదే సందర్భంలో పార్టీ అధిష్ఠానం రద్దు చేసిన కమిటీలో ఉన్న వ్యక్తుల పేర్లనే సూచిస్తూ మరోమారు అభిప్రాయ సేకరణ కోరింది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, జాబితాలోని సభ్యులను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం తాజాగా కడప తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆటలు అధిష్ఠానం వద్ద సాగడం లేదు. అందువల్లే కమిటీని రద్దుచేసి మళ్లీ అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లుగా తమ్ముళ్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అంశాలు పార్టీలో సంచలనంగా మారాయి. -
అనుభవమే అర్హత
విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత. సీనియర్ టీచర్ల బోధనా నైపుణ్యాలను టెట్ పరీక్షతో కొలవలేం. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లను దాఖలు చేయాలి. – సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సమీక్షించాలి. టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణత కాకుంటే ఉద్యోగం నుండి రిటైర్ కావాలని, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ కావా లంటే టెట్ పాస్ కావాల్సిందేనంటూ సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ, ఏపీ ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రివ్యూ పిటిషన్లు వేయాలి. – బి. లక్ష్మి రాజా, యూటీఎఫ్, రాష్ట్ర కార్యదర్శి -
వృద్ధురాలిని కట్టేసి నగల దోపిడీ
చింతకొమ్మదిన్నె : ఒంటరి వృద్దురాలి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఆమెను కట్టేసి నగలు దోచుకెళ్లారు. మండల పరిధిలోని కొప్పర్తి గ్రామంలోని రహదారి ప్రక్కనే నివాసముంటున్న కోగటం సరస్వతమ్మ భర్త వెంకట సుబ్బారెడ్డి వీఆర్వోగా పని చేస్తూ ఇటీవల మృతిచెందారు. ఈమె ఇద్దరు కుమారులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు, కుమార్తెకు వివాహమై కడపలో నివాసం ఉంటోంది. దీంతో సరస్వతమ్మ ఒంటరిగా నివాసమయుంటోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు బైక్లో ఆమె ఇంటికి వచ్చారు. పక్కా రెక్కీ నిర్వహించిన దొంగలు ఆమె ఇంటిపై బాడుగకు ఉంటున్న వ్యక్తికి వివాహ పత్రిక ఇవ్వడానికి వచ్చినట్లు నమ్మించారు. పెన్ను ఇస్తే అడ్రస్ రాసి ఇస్తామని అడగ్గా.. సరస్వతమ్మ పెన్ను కోసం వెళ్లింది. ఇంతలో దొంగలు ఆమె వెనుకే వెళ్లి నోరు నొక్కి, చేతులు, కాళ్ళు కట్టేసి బెడ్ రూములోకి లాక్కెళ్లారు. అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. ఆమె మెడలోని బంగారు చైన్, చేతి గాజులు, ఉంగరాలు, చెవి కమ్మలు బలవంతంగా లాక్కుని, బీరువా, అల్మారా తెరిచి అందులోని, బంగారు నగలు, నగదు దోచుకున్నారు. మొత్తం పది తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లినట్లు వృద్ధురాలు తెలిపారు. కొంతసేపటికి కట్లు విప్పుకొని గట్టిగా అరవడంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి సపర్యలు చేశారు. బంధువులతో వచ్చి పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ స్పందించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వచ్చి పరిశీలించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ శ్రీనివాసులరెడ్డిని సంప్రదించగా ముగ్గురు వ్యక్తులు కలిసి దోపిడీ చేసినట్లు ఫిర్యాదు అందించని, నేరం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.పట్టపగలే ముగ్గురు దొంగల నిర్వాకం -
దుబాయి కరెన్సీ అంటూ దగా
● చిత్తు కలర్ పేపర్ల చుట్ట చేతిలో పెట్టారు ● రూ.4.5 లక్షలు దోచుకున్న దుండగులురాయచోటి టౌన్ : గతంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసిన మాయగాళ్ల గురించి విన్నాం.. వాటిపై నిఘా పెరిగిందనుకున్నారో.. ఏమో ఇక విదేశీ కరెన్సీ అంటూ ఎరవేసి దగా చేస్తున్నారు. రాయచోటిలో చోటు చేసుకున్న ఈ సంఘటనే ఇందుకు అద్దం పడుతోంది. రాయచోటి అర్బన్పోలీస్ స్టేషన్లో డీఎస్సీ కృష్ణ మోహన్ విలేకరులకు మంగళవారం వివరాలు వెళ్లడించారు. ఢిల్లీకి(వాయువ్య ఢిల్లీ) చెందిన హారూన్, తూర్పు ఢిల్లీకి చెందిన మిరాజ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన నూర్ మహమ్మద్ ఖాన్లు రాయచోటిలో మకాం వేశారు. పట్టణంలోని షాపుల వద్దకు వెళ్లి వారితో( హిందీ మాట్లాడే వారితోనే) మాటా మాటా కలుపుతారు. పరిచయం పెంచుకొని తాము వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చామని.. తమ వద్ద దుబాయ్ దేశానికి చెందిన కరెన్సీ( దిర్హం) నోట్లు ఎక్కువ ఉన్నాయని చెబుతారు. నమ్మించడానికి ఒకటి.. రెండు చూపిస్తారు. 100 దిర్హం నోటు ధర ఇండియన్ కరెన్సీ నోట ధర ప్రకారం రూ.2400 పలుకుతున్నట్లు నమ్మిస్తారు. వీరు కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ విచారణ సాగించి నమ్ముతారు. శాంపిల్గా ఇచ్చిన నోట్లు ఒరిజనల్వే కావడంతో దుకాణదారులు నమ్మారు. అంతేగాక తమ వద్ద ఎక్కువ నోట్లు చూస్తే సమస్య వస్తుందని, నోటు తీసుకుంటే దిర్హం రూ.1000కే దుండగులు దుకాణదారులను నమ్మించారు. దీనిని నమ్మిని ఒక వ్యక్తి రూ.4.5 లక్షలు నగదు ఇచ్చాడు. రాయచోటి రింగ్ రోడ్డు వద్దకు రమ్మని చెప్పి స్థానికుడి నుంచి రూ.4.5లక్షలు నగదు తీసుకొని ఆ వ్యక్తికి దుబాయ్ నోట్ బయటికి కనిపించే విధంగా టవల్ మధ్యలో కలర్ పేపర్లు ఉంచి ఒక చుట్ట చుట్టి వారికిచ్చి అక్కడ నుంచి పారిపోయారు. మూట తెరిచి చూడగా అందులో పూర్తిగా రంగు రంగుల పేపర్లు చుట్టి ఉండడంతో దుకాణదారు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడని డీఎస్పీ చెప్పారు. అర్బన్ సీఐ బివి చలపతి, ఎస్సై బాలకృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది శ్రీను, మల్లిఖార్జున వేగవంతంగా విచారణ సాగించి రాయచోటి–కడప రోడ్డు సమీపాన అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ వేగంగా చేసి నిందితులను పట్టుకున్న అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారని, రివార్డు కోసం వారి పేర్లు పంపామని తెలిపారు. -
మానసిక వైద్యశాల రాయలసీమ వాసులకు వరం
కడప అర్బన్ : రాయలసీమ వాసులకు కడప మానసిక వైద్యశాల వరంగా భావించాలని కడప ఐఎంహెచ్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్) హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్.వెంకట రాముడు అన్నారు. రిమ్స్ ఆవరణంలోని వంద పడకల మానసిక వైద్యశాల ఏడాదిన్నర కిందట ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఈ నెల 4వ తేదీ నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటరాముడు మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట మానసిక వైద్యశాల ఏర్పాటుచేశారని, దాదాపు 10వేల మందికి దివ్యాంగుల సర్టిఫికెట్లు అందిచామని తెలిపారు. కేవలం సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్ల కోసం జిజిహెచ్కు రోగులను పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.కడప ఐఎంహెచ్ సూపరింటెండెంట్ ఆర్.వెంకటరాముడు -
ఆస్తి రాసిస్తే.. ఆదుకోనంటోంది..
జమ్మలమడుగు రూరల్ : వృద్దాప్యంలో తమను ఆదుకుంటుందనే ధీమాతో ఆస్థి రాసిచ్చాం.. ఇపుడు ఆదుకోము.. ఆస్తి వెనక్కు ఇవ్వమని చెప్పడం న్యాయం కాదని ఓ వృద్ధురాలు ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు అర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గూడురు నాగయ్య, భార్య వెంకటలక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. అందరినీ ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు. ఆస్తి అంతా వారికే ధారపోసి ఓ ఇంటిని తమకోసం ఉంచుకున్నారు. ఇపుడు వారు వృద్ధాప్యంలోకి అడుగిడడంతో తమకు అసరా కావాలని, తమను పోషిస్తే మోడంపల్లెలోని సొంత ఇంటిని వారి పేరిట రాసిస్తామని చెప్పారు. ఈ ఒప్పందానికి ముందుకు వచ్చిన రెండో కూదురికి ఇంటిని రాసి ఇచ్చారు ఆ వృద్ద దంపతులు. కొన్ని నెలల తర్వాత వీరిని ఆదుకోకుంటూ ఆ కూతరు చేతులెత్తేసింది. కుమార్తె పట్టించుకోకపోవడం... ఇల్లు లేకపోవడంతో ఆ వృద్ధులు జమ్మలమడుగు ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులంతా ఆర్డీఓ ఎదుట హజరయ్యారు. ఇక్కటే అసలు కథ మొదలైంది. ఆ ఇంటికి తగిన ధర చెల్లించి కోనుగోలు చేశానంటూ కుమార్తె చెప్పడంతో ఆర్డీఓ తల పట్టుకోవాల్సి వచ్చింది. తమను పోషించాలి.. లేకపోతే ఇంటిని వెనక్కు ఇస్తే అక్కడే ఉంటామని వృద్ధులు ఆర్డీఓకు చెప్పారు. ఇరువురూ వాదించుకుంటుండడంతో ఏమి చేయాలో తోచక తదుపరి వారానికి వాయిదా వేశారు. నలుగురు కుమార్తెలున్నా.. ఆ వృద్ధ దంపతులకు చట్టం ఏ మేరకు సహాయం అందుతుందో మరి.ఆర్డీఓ ఎదుట వృద్ధ దంపతుల ఆవేదన -
ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థికి గోల్డ్ మెడల్
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయం ప్రతిపత్తి)లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ విద్యార్థిని అంకాల శైలజ (ఎం.కామ్ 2022–24 బ్యాచ్) గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ బయ్యపురెడ్డి విద్యార్థిని ప్రతిభను అభినందించారు. బస్సు డ్రైవర్పై దాడిదువ్వూరు : ఆళ్లగడ్డ–మైదుకూరు మధ్య తిరుగుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డ – మైదుకూరు మధ్య నడుస్తున్న ఆర్టీసీ హయర్ బస్సులో దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులు ఎక్కారు. అందులో ఒకాయనకు కంటిచూపు లేదు.. బస్సు ఎక్కేలోపే బస్సును కదిలించావు. బస్సు ఎలా నడపాలో తెలియదా..అంటూ వంటూ హేమవర్ధన్ అనే ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో డ్రైవర్ మహ్మద్ బస్సునిండా ప్రయాణికులున్నారని, ఎక్కవద్దని చెప్పాను కదా అంటూ వాదించాడు. గుడిపాడు దగ్గరకు రాగానే బస్సు దిగి డ్రైవర్పై రాయితో హేమవర్ధన్ దాడిచేశాడు. డ్రైవర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. ఏడుగురు జూదరుల అరెస్ట్ ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని ఎర్రగుంట్ల రోడ్డులోని ఏకో పార్కు సమీపంలో పేకాడుతున్న ఏడుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేపీ రాజు సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.81వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. చిట్టీ డబ్బు చెల్లించలేనంటూ..బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహిస్తూ సకాలంలో డబ్బులు చెల్లించేవాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు స్థానికుల్లో నమ్మకం కుదిరింది. భారీ సంఖ్యలో ఇతడి వద్ద చిట్టీలు వేశారు. రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. మూడు రోజులు క్రితం తాను డబ్బు చెల్లించాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి చిట్టీ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకున్నాడు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈపీఎఫ్ 95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 12న ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలపై నిర్వహిస్తున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం పెన్షన్ భిక్ష కాదు, ఒక హక్కు అని గతంలో తేల్చి చెప్పినా పెన్షన్ రూపు మార్చి మోసాలకు పాల్పడుతున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో కనీసం పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. 12వ పిఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఈ సదస్సుకు పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత కో ఆర్డినేషన్ నాయకులు ఎం.జనార్దన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు హాజరవుతున్నట్లు తెలిపారు. అన్ని రంగాల పెన్షనర్లు పాల్గొని సదస్సు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రామ్మూర్తినాయుడు, కళ్యాణ్ సుధాకర్, సాంబశివారెడ్డి, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు. -
ధర తగ్గించి.. దళారులు దోచేస్తున్నారు
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రభుత్వం క్వింటాకు రూ.2369 ప్రకటించినప్పటికీ, దళారులు కేవలం రూ.1340 లతో కొనుగోలు చేస్తున్నారని వేంపల్లె మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె, కుమ్మరాంపల్లె, ఇడుపులపాయ, వీరన్నగట్టుపల్లె గ్రామా లరైతులు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తారని, అయితే గిట్టుబాటు ధర లేక వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లోనే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, పోతిరెడ్డి శంకరయ్య, వెంకట నారాయణరెడ్డి, బత్తల గంగాధర, తదితరులు పాల్గొన్నారు. పంట మద్దతు ధరపై కలెక్టర్తో చర్చించిన ఎంపీపంట మద్దతు ధరపై పలువురు రైతులు మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో మాట్లాడారు. గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను సావధానంగా ఆలకించిన ఎంపీ ఈ విషయమై కలెక్టర్ శ్రీధర్, జేడీఏ చంద్రానాయక్తో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదని.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కలెక్టర్, జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వేంపల్లె రైతులు -
విపత్తుల నివారణపై మాక్ డ్రిల్
సిద్దవటం : విపత్తుల నివారణపై మండలంలోని భాకరాపేట హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు ఆధ్వర్యంలో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ముందుగా హెచ్పీసీఎల్లోని ఎమర్జెన్సీ–1లోని ట్యాంకు వద్ద డీజిల్ లీక్ అవడంతో దాన్ని కంట్రోల్ చేసేందుకు సిబ్బంది పనిచేస్తుండగా స్కానర్ కిట్టు కింద పడి మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న వర్కర్లు ఫైర్ అని అరవడంతో హెచ్పీసీఎల్ సిబ్బంది సైరన్ మోగించారు. సిబ్బంది అప్రమత్తమై ఆటోమేటిక్ పరికరాలతో ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పెట్రోల్ డిపో సిబ్బంది సహకారంతో పోమ్, వాటర్తో మంటలను అదుపు చేశారు. అక్కడ ఇద్దరు వర్కర్లకు ప్రమాదం జరగడంతో వారిని మెడికల్ క్యాంపుకు సిబ్బంది తీసుకొచ్చే సన్నివేశాన్ని మాక్ డ్రిల్ చేసి చూపించారు. అలాగే ఫిల్టర్–ఎ వద్ద డీజిల్ ఓవర్ లీక్ అవుతుండటంతో ఇలాగే చేశారు. ఇదంతా మాక్ డ్రిల్ అని తెలిసింది. చిన్నారావు మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేట్ వాటర్ ప్లాంట్కు పంచాయతీ నిధుల చెల్లింపు
ఎర్రగుంట్ల : మండలంలోని చిలంకూరు జెడ్పీ పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి నిర్వహించే వాటర్ ప్లాంట్కు పంచాయతీ నిధులతో రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లించారని, వెంటనే రికవరీ చేయించాలని వైఎస్సార్సీపీ నాయకుడు అరిగాళ్ల మురళి తెలిపారు. సర్పంచ్ శరత్కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీలతలకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న ప్రైవేటు వ్యక్తి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 26న రూ.28553, గత ఏడాది డిసెంబర్ 11న రూ.588994లు విద్యుత్తు బిల్లుల రూపంలో పంచాయతీ నిధులు చెల్లించారన్నారు. సర్పంచ్ శరత్కుమార్ వివరణ కోరగా.. ఈ విషయంపై విచారిస్తామన్నారు. ఆ ప్లాంట్ కరెంట్ మీటర్ వివరాలు సేకరించి తెలియజేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలత మాట్లాడుతూసర్పంచ్ ఆదేశాల మేరకు విచారణ చేపబడుతామని, 15వ ఆర్థిక సంఘం నిధులు నుంచి కొంత శాతం కరెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులున్నాయని తెలిపారు. -
విద్యా రంగ సేవకుడికి విశిష్ట గౌరవం
కురబలకోట : విద్యారంగంలో విశేష కృషి చేసిన బి.ఈశ్వరయ్యకు న్యూడిల్లీలో భారత్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి గుర్తింపు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈశ్వరయ్యకు ఈ పురస్కారం దక్కింది. మండలంలోని ఎనుములవారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య రిషి వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. మదనపల్లె బీటీ కళాశాలలో డిగ్రీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు. ఎంఏ బీఈడీ చేసి విద్యారంగం వైపు మక్కువ చూపారు. రిషి వ్యాలీ రివర్ స్కూల్లో టీచర్గా, ఆ తర్వాత హెడ్మాస్టర్గా ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నాంది పౌండేషన్లో ఎడ్యుకేషనల్ రీసోర్సు పర్సన్గా నాలుగేళ్లు, న్యూఢిళ్లీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రిన్సిపల్, డైరెక్టర్గా మూడేళ్లపాటు సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు 200 మంది ఈశ్వరయ్య వద్దకు విమానంలో వచ్చి సలహాలు, తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆపై న్యూడిల్లీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ హెడ్గా పదేళ్లపాటు పనిచేశారు. ఎన్సీఈఆర్టీలో రీసోర్సు పర్సన్గా గత ఏడేళ్లుగా కొనసాగుతున్నారు. విద్యా సంస్కరణల్లో కీలక పాత్ర విద్యా రంగంలో ఇతడి సేవలను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ కమిటీలో రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ కమిటీ సభ్యుడిగా సమున్నత స్థానం కల్పించింది. ఐదేళ్ల పాటు ఇతడు ఇన్పోసిస్ సుధానారాయణమూర్తి, మరో తొమ్మిది మందిసభ్యులలో ఒకడిగా క్రియాశీలకంగా పనిచేశారు. అప్పట్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకూ చదువులు ఎలా ఉండాలనే అంశంపై నివేదిక సమర్పణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలు తిరిగి.. ఆయన అందించిన సేవలకు ఇపుడు గుర్తింపు లభించింది. నీతి అయోగ్ పర్యవేక్షణలో నడిచే న్యూఢిల్లీ భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లు 2025 సంవత్సరానికి ఇతనికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఇతనికి ఒక్కడికే ఈ డాక్టరేట్ లభించడం మరో విశేషం. సమాజ నిర్మాణంలో విద్య కీలకం సమాజ నిర్మాణంలో విద్యకు ప్రాధాన్యం ఉంది. విద్యార్థులకు చదువు నేర్పడం కన్నా ముందు వారిలో ఆత్మ విశ్వాసం నింపాలి. చదువు పట్ల భయం పోగొట్టాలి. బడి పట్ల ఇష్టం కలిగేలా చూస్తూ పుస్తకాలను చదివించేలా చూడాలి. ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు విద్యా వ్యవస్థ గొప్పతనంగా నేను భావిస్తున్నాను. పేదరికాన్ని జయించడానికి చదువే గొప్ప అస్త్రం. ఎవ్వరైనా ఉన్నతంగా ఎదగడానికి చదువుకు మించిన ఆయుధం లేదు. – ఈశ్వరయ్యభార త్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం -
జిల్లాలో కొత్త రైల్వే లైన్
● మూడో ట్రాక్ నిర్మాణానికి సన్నద్ధం ● గుంతకల్ నుంచి ఓబులవారిపల్లె దాకా.. ● బొగ్గు గూడ్స్ రైళ్లకే పరిమితం ● జిందాల్ సహకారంతో ఏర్పాటు రాజంపేట : ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో కొత్తగా మూడో ట్రాక్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. ముంబయి–చైన్నె కారిడార్ మార్గంలో గుంతకల్లు నుంచి ఓబులవారిపల్లె వరకు ఈ లైను నిర్మించనున్నారు. ఇప్పటికే గుత్తి–రేణిగుంట మధ్య డబ్లింగ్(డబుల్ లైను ట్రాక్) ఉన్న సంగతి విదితమే. సిమెంటు, బొగ్గు, ఐరన్తోపాటు ఇతర సరుకుల రవాణా అధికంగా ఉంటుంది. దీంతో జిందాల్ సంస్థ సహకారంతో మూడో లైన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది. గూడ్స్ రైళ్ల రాకపోకల కోసమే.. మూడో లైను ట్రాక్ నిర్మితం కేవలం గూడ్స్రైళ్ల నిర్వహణకు కేటాయించే విధంగా కొనసాగించనున్నారు. అది కూడా జిందాల్ సంస్థకు బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకొని.. ఈ లైను నిర్మాణానికి దారి తీసింది. జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్లే గూడ్స్ రైళ్లకు ఈ ట్రాక్ను వినియోగించుకుంటారనే సమాచారం రైల్వే వర్గాల నుంచి వినిపిస్తోంది. 90 శాతం మేరకు జిందాల్ సంస్థకు రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్లే నడవనున్నాయి. జిందాల్ సంస్థ, రైల్వే 50ః50 శాతం భాగస్వామ్యంతో ఈ లైను నిర్మాణం చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత థర్డ్లైను రైల్వేకి ఇచ్చే విధంగా విధానం కొనసాగుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో థర్డ్లైను నిర్మాణం పూర్తి చేసేందుకు అటు జిందాల్, ఇటు రైల్వే యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకుంటున్నాయి. ఓబులవారిపల్లె జంక్షన్ వరకే... కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లె జంక్షన్ వరకు ఉన్న రైలుమార్గం దాకా థర్డ్లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. గుత్తి–రేణిగుంట మధ్య ఫోర్లైన్ ట్రాక్స్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమైంది. మొదటి విడత ప్రాధాన్యతగా గుంతకల్లు–ఓబులవారిపల్లె జంక్షన్ వరకు థర్డ్లైను ట్రాక్ వేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూసేకరణ.. సరిహద్దులపై దృష్టి థర్డ్లైన్ నిర్మితానికి అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 3, 4 లైనుకు సంబంధించిన అవసరమైన భూసేకరణ, రైల్వే స్థల సరిహద్దులపై దృష్టి సారించారు. నందలూరు రైల్వేకేంద్రం మినహాయించి అన్ని స్టేషన్లలో.. అదనంగా 3, 4 రైల్వేట్రాక్ వేయాల్సి ఉంటుంది. చెయ్యేరు నదిపై బ్రిడ్జి నందలూరు చెయ్యేరు నదిపై థర్డ్ లైను నిర్మాణానికి అవసరమయ్యే బ్రిడ్జి నిర్మితం చేయడానికి సర్వే పూర్తయింది. బ్రిటీషర్ల హయాంలో ఏర్పాటైన బ్రిడ్జి స్థానంలో మూడవ బ్రిడ్జి నిర్మితం చేయనున్నారు. అయితే 3, 4 లైనుకు సరిపడే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. రేణిగుంట–ఓబులవారిపల్లె.. రేణిగుంట–ఓబులవారిపల్లె (56 కి.మీ) మధ్య కూడా మూడవ, నాల్గవ లైను నిర్మితం చేయాల్సి వుంటుంది. అయితే ఓబులవారిపల్లె వరకు థర్డ్లైను నిర్మాణం పూర్తి చేయనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్ల రాకపోకలను సకాలంలో నిర్వహించేందుకే.. ముందుగా ఽథర్డ్లైను నిర్మితంపై దృష్టి సారించారు. గూడ్స్రైళ్ల రద్దీ అధికంగా కొనసాగుతోంది. గుంతకల్ టు వయా ఓబులవారిపల్లె మీదుగా కృష్ణపట్నం పోర్టుకు లోడింగ్, అన్లోడింగ్తో కలుపుకొని 40 గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఉన్న డబ్లింగ్లో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతోపాటు ఇతర గూడ్స్ రైళ్ల ట్రాఫిక్తో.. కృష్టపట్నం పోర్టు గూడ్స్ రైళ్లు గమ్యాలకు చేరడంలో ఆలస్యం అవుతోంది. నందలూరు రన్నింగ్స్టాప్ క్రూసెంటర్ కేంద్రంగా ఈ గూడ్స్రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైల్వేబోర్డు నందలూరు క్రూసెంటర్ను బలోపేతం చేసే దిశగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవింద రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బద్వేలు, గోపవరం, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం మండలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. వేంపల్లె షాపింగ్ కాంప్లెక్స్కు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు. చక్రాయపేటలోని సీపీడబ్ల్యూ స్కీమ్ మోటారు కాలిపోవడంపై ఆయన ఆరా తీశారు. ఎర్రగుడి సీపీ డబ్ల్యూ స్కీమ్కు కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చేవరకు అద్దె ట్రాన్స్ఫార్మర్ వినియోగించాలని సూచించారు. గండిక్షేత్రంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి తొలుత రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలవాలన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, చక్రాయపేట మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటాయన్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా అవసరమైన చోట్ల కొత్త బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెండర్లు నామినేషన్లపై ఇస్తున్నారంటూ ఆడిట్ అధికారి తెలిపారు. ● వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి మాట్లాడుతూ బిల్లులే రాకపోతే టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు వస్తారంటూ ప్రశ్నించారు. ఏవైనా పనులకు టెండర్లు పిలవాలంటే ముందుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ● అర్హత లేని వారికి పెన్షన్లు ఇచ్చారని, ఇప్పుడు వాటిని తొలగిస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని పులివెందుల జెడ్పీటీసీ అన్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ అనర్హులకు ఇవ్వడాన్ని తాము కూడా వ్యతిరేకమేనన్నారు. ఒకరికి అర్హత లేదని ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత అతను అప్పీలుకు వెళితే మరో డాక్టర్ అర్హత ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు ఏ డాక్టర్ది తప్పంటూ చైర్మన్ ప్రశ్నించారు. తొలుత పెన్షన్కు అర్హులంటూ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ను సస్పెండ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ● కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ డెంగీ జ్వరాలు వస్తుంటే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారని తెలిపారు. రిమ్స్లో ప్లేట్లెట్స్ కౌంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రిమ్స్లో ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియదని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. దోమల బెడద అధికంగా ఉందని, ఫాగింగ్ యంత్రాలు మూలన పడేశారని విమర్శించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఆ యంత్రాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. ● పార్నపల్లె రిజర్వాయర్ నుంచి వేముల మండలంలోని నాయని చెరువుకు గ్రావిటీపై సాగునీరు వస్తోందని వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి అన్నారు. ట్రాన్స్ఫార్మర్ లేని కారణంగా భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, బక్కన్నగారిపల్లెకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో షెడ్యూల్ కులాల్లోని మూడవ కేటగిరీకి చెందిన వారికి అన్యాయం జరిగిందన్నారు. అర్హత సాధించి వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ హారిజెంటల్ పద్ధతిలో నియామకాలు చేపట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. జీఓ నెం. 77 ప్రకారం నియామకాలు చేపట్టకుండా హారిజెంటల్ పద్ధతిని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరిగిందని, దీనిపై పునః పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీపీడబ్ల్యూ స్కీమ్లకు విద్యుత్ సౌకర్యం తాగునీటి కోసం కొత్త బోర్ల ఏర్పాటు జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవింద రెడ్డి -
భద్రతా నిబంధనలు తప్పనిసరి
కడప సెవెన్రోడ్స్ : బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ రూమ్ హాలులో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు తదితర అంశాలపై ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ డివిజన్లలో బాణసంచా దుకాణదారులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, అన్ని రకాల భద్రత చర్యలను పాటిస్తూ.. సంప్రదాయ పండుగను సంతోషంగా నిర్వహించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను తప్పకుండా పాటించాలన్నారు. కమ్యూనిటీ ఓపెన్ ఏరియాలలో క్రాకర్స్ వినియోగించేలా చూడాలన్నారు. అలాగే పాఠశాలల్లో పిల్లల కు టపాసుల వినియోగం, భద్రతపై అవగాహన పెంచాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలన్నా రు. అలాగే కమర్షియల్ టాక్స్ అధికారులు అన్ని డివిజన్లోని ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. ఎక్కడైనా ఇల్లీగల్ స్టోరేజ్ పాయింట్లు కనపడితే వెంటనే వాటిని సీజ్ చేసి చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో.. బాణసంచా విక్రయ కేంద్రాలకు పరి మిత సంఖ్యలో అనుమతులు ఇవ్వాలని సంబందిత అధికారులకు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా బాణసంచా దుకాణాలు నిర్వహిస్తే.. విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చంద్ర మోహన్,సాయి శ్రీ,చెన్నయ్య జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్ సాయి ధర్మా రావు,అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ ,మున్సిపల్ కమిషనర్లు, ఫైర్, రెవెన్యూ, పోలీసు, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ‘సూపర్ జీఎస్టీ’పై మరింత అవగాహన ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందు కెళ్లాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. జిల్లాలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్పై చేస్తున్న అవగాహన కార్యక్రమాల అమలు తీరు పై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ మంగళవారం రాత్రి వీసీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితి సింగ్, జీఎస్టీ జాయింట్ కమిషనర్,జిల్లా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి జి. సుమతి,జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి రోజు చేసిన కార్యక్రమాలపై డేటా ఎంట్రీ ఖచ్చితంగా చేయాలన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో కడప కళా క్షేత్ర ప్రాంగణంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ప్రదర్శన, సేల్స్ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా వైద్య శాఖ అధికారి నాగరాజు,డ్వామా, డీఆర్డిఏ పీడీలు ఆదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, డీఈఓ శంషుద్దీన్,జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, తదితర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాయచోటి డిపోలో అసిస్టెంట్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఐటీఐలో డీజల్, మోటారు మెకానిక్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికై న వారు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు రాయచోటిలోని డీఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీకి షోకాజ్ నోటీసుప్రొద్దుటూరు : రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2021–24 సంవత్సరాలకు సంబంధించి ఆడిట్ చేయించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న విజయవాడలోని స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.నవోదయలో ప్రవేశ దరఖాస్తులకు గడువు పెంపుతిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఏఐఏఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్తార్ ఫైజీ ఎంపికకడప ఎడ్యుకేషన్ : ఆలిండియా అదబ్ ఎ అత్ఫాల్ సొసైటీ(ఏఐఏఏఎస్) రాష్ట్ర బాల సాహితీ సొసైటీ అధ్యక్షుడిగా ప్రముఖ ఉర్దూ బాల సాహితీవేత్త సత్తార్ ఫైజీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సి. కె. దిన్నె మండలం మూలవంక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తన ఎంపికపై ఫైజీ సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరం లో జష్నే రంగే బచ్చన్ పేరుతో అంతర్జాతీయ ఉర్దూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెమినారు, ముషాయిరా, బాల సాహితి ఉర్దూ పుస్తకాల ఆవిష్కరణ, నాటికలు, పుస్తకాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.జీఎస్టీ తగ్గింపుతో ఆరోగ్య రంగానికి ప్రయోజనంకడప రూరల్ : జీఎస్టీ తగ్గింపు వల్ల ఆరోగ్య రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భవిత భీమా పాలసీ ప్రీమియంపై 18 శాతం జీఎస్టీని పూర్తిగా తగ్గించారన్నారు. ఈ సందర్భంగా సంధ్యా సర్కిల్ కూడలిలో ప్రతిజ్ఞ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఆఫీసర్ పద్మావతి డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వర కుమార్, డాక్టర్ రవిబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ భారతి, మలేరియా అధికారి మనోరమ పాల్గొన్నారు.వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణంఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు ఉత్సవమూర్తులను వేర్వేరుగా ఉంచారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతోపాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తరువాత సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
నారావారి సారాపై కేంద్రం దృష్టి సారించాలి
● జిల్లా ఎస్పీ ని కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ● పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఎస్పీకి వివరించిన ఎంపీ కడప అర్బన్ : రాష్ట్రంలో నారా వారి సారా (ఎన్ బ్రాండ్) పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని.. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం పెద్దలను సమగ్రంగా విచారణ జరిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ను కలిశారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులపై ఎస్పీకి వివరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడా రు. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం కుంభకోణంతో నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో బహిర్గతమైందన్నారు. 111 కోట్ల క్వార్టర్ బాటిళ్లు అమ్ముడు పోతే వీటిల్లో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు నకిలీ మద్యానికి సంబంధించినవేననీ, సుమారు రూ. 5280 కోట్ల విలువైన అమ్మకాలు నకిలీ మద్యం రూపంలో జరిగాయని ఆరోపించా రు. ఏడాది కాలంలోనే ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ లేకుండా నకిలీ మద్యం అమ్మకాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 5280 కోట్ల కుంభకోణానికి తెర లేపారన్నారు. అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, కృష్ణా జిల్లా సాక్షిగా అవినీతి బట్టబయలైందన్నారు. మొలకలచెరువు నుంచి రాయలసీమకు, కృష్ణా జిల్లా నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని ఆరోపించారు. బాటిళ్లకు వేసే సీళ్లు మాత్రమే ఒరిజినల్ అనీ, సీసాలోని మద్యం మాత్రం నకిలీదనీ తేలి పోయిందన్నారు. ఆధారాలతో అడ్డంగా దొరికినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఇంత అవినీతి జరిగినా కూటమి ప్రభు త్వ నేతలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వానికి నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధంలేదని తయారీదారుని చేత వీడియోలను విడుదల చేయడంలోనే ప్రభుత్వానికి సంబంధం ఉందనీ ఇట్టే తేలిపోయిందన్నారు. అధికార అగ్రనాయ కులు సంప్రదించాకే ఆ వీడియో బయటకు వచ్చిందన్నారు. అగ్ర నాయకులు తనను కాపాడతారనే హామీతో అమాయకంగా ఆ వీడియోను విడుదల చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా కేసులను స్థానిక పోలీసులు నమోదు చేశారని, వాటిని వివరించేందుకు ఎస్పీని కలిశామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరను చెల్లించాల్సిందే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా పనిచేసినంతకాలం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రయోజనం చేకూర్చామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదనీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. చక్రాయపేట, వేంపల్లి, మైదుకూరు తదితర ప్రాంతాలలో వరి పండించే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. 81 కిలోలకుగాను రూ. 1000 నుంచి 1300 మాత్రమే అమ్ముడుపోతున్నాయన్నారు. ప్రభుత్వం చొరవతీసుకుని సివిల్ సప్లయిస్ డీఎం ద్వారా వరికి రూ. 2369 లమేరకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. చీనీ, వరి పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. కలెక్టర్ను కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. వైఎస్సీపీ మాజీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్కుమార్, మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీవుల్లా, యువజన విభాగం ప్రశాంత్రెడ్డి, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షడు రిక్షిత్ రెడ్డి పాల్గొన్నారు. -
మహర్షి వాల్మీకి.. అందరికీ ఆదర్శనీయులు
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కడప సెవెన్రోడ్స్ : భారతీయ ఇతిహాసాన్ని, మానవ సంబంధాలు, కుటుంబ విలువల సారాంశాన్ని అపురూపమైన రామాయణ గ్రంథంగా సమాజానికి అందించిన ‘వాల్మీకి మహర్షి’ భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు తోపాటు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ యాదవ్, ఎస్డీసీ వెంకటపతి, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు రామాయణ ప్రాశస్త్యం, వాల్మీకి పురాణం, సమాజంలో వాల్మీకి వర్గాల పరిస్థితులు, రిజర్వేషన్ మొదలైన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులసంఘాల నాయకులు, ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మానవతా విలువలు పెంపొందించుకోవాలికడప అర్బన్: రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆకాంక్షించారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు, ఎ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డీఎస్పీ నాగేశ్వరావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటాస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘కూలి’న బతుకులు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. దొరికిన పనులతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చారు. ఊరిలో జాతర చూసి తిరుగుపయన మయ్యారు. మార్గంమధ్యలో మృత్యువు వారిని కబళించింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.రామసముద్రం : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎర్రబోయినపల్లికి చెందిన దంపతులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రబోయినపల్లికి చెందిన రామాంజులు(33), కళావతి(28) దంపతులు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం వెళ్లారు. అక్కడ కేఆర్ పురం వద్ద కూలీ పనులు చేసుకుంటుండే వారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం గ్రామంలో అమ్మవారి జాతర ఉండటంతో ఇద్దరు పిల్లలను అక్కడే ఇంటి యజమాని వద్ద వదిలి.. సొంత గ్రామానికి వచ్చారు. జాతర ముగించుకుని సోమవారం ద్విచక్ర వాహనంలో కర్ణాటకకు వెళ్లే నేపథ్యంలో.. కళావతికి ఆరోగ్యం బాగలేకపోవడంతో మదనపల్లికి చేరుకుని చికిత్స చేయించుకుని కర్ణాటకకు బయలుదేరారు. మార్గంమధ్యలోని రాయల్పాడు వద్ద టిటి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వారి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం శ్రీనివాసపురం ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతుకుదెరువు కోసం వెళ్లి కర్ణాటకలో మృత్యువాత రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు దుర్మరణం శోకసంద్రంలో కుటుంబం -
విద్యుత్ షాక్తో రైతు మృతి
బి.కోడూరు : మండలంలోని మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దువెంకటరమణారెడ్డి (51) అనే రైతు తన పొలంలో విద్యుత్ మోటారు వద్ద విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వర్షం కురవడంతో తన వరి పొలానికి సంబంధించిన వ్యవసాయ మోటారును ఆఫ్ చేసేందుకు వెళ్లి.. మోటారు, స్టాటర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై గట్టిగా కేక వేశాడు. ఆ కేక విని పక్క పొలం వారు అక్కడికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉండటంతో అతని భార్య, బంధువులకు తెలియజేశారు. వారు వెళ్లి వెంకటరమణారెడ్డిని ఆటోలో బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటసురేష్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఈ–నామ్ పద్ధతి మాకొద్దు
● వ్యాపారులతో యార్డు సెక్రటరీ కుమ్మక్కు ● నష్టపోతున్నామని చీనీ రైతుల ఆందోళనపులివెందుల రూరల్ : ఈ–నామ్ పద్ధతి మాకొద్దంటూ చీనీ రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్రటరీ శ్రీధర్రెడ్డి ఈ–నామ్ పద్ధతిలో చీనీ కాయల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో చీనీ కాయల ధర తక్కువగా పలుకుతుండటంతో.. ఇలాగైతే తాము నష్టపోతామని రైతులు వ్యాపారస్తులను, మార్కెట్ యార్డు సిబ్బందిని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ–నామ్ పద్ధతి ద్వారా ఎలా వేలం పాట నిర్వహిస్తారని రైతులు ప్రశ్నించారు. దీంతో మార్కెట్ యార్డ్ సెక్రటరీ, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీధర్రెడ్డి వ్యాపారస్తులతో కుమ్మకై ్క తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు ముందు పద్ధతిలోనే వేలం పాట నిర్వహించాలన్నారు. వ్యాపారస్తులతో ఇప్పటికే చాలా వరకు నష్టపోయామని, ఇలా నష్టపరిచే బదులు కాస్త విషమిస్తే తాగి చచ్చిపోయేది మేలు అన్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ ‘అంతా మా ఇష్టం మేము చెప్పినట్లే వినాలి మీరు చెప్పినట్లు వినమంటూ’ చీనీ రైతులను బెదిరించారు. దీంతో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు సెక్రటరీ కార్యాలయానికి తాళాలు వేశారు. సీఐ సీతారామిరెడ్డి చీనీ కాయల మార్కెట్కు చేరుకుని రైతులను శాంతింపచేసి సంప్రదింపులు జరిపారు. ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహిస్తామని, తమకు ముందే సమాచారం ఇస్తే మార్కెట్కు చీనీ కాయలను తీసుకొచ్చేవారం కాదని, వ్యాపారస్తులతో సెక్రటరీ మాట్లాడుకుని తమకు నష్టం వచ్చే విధంగా చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ సీతారామిరెడ్డి జోక్యం చేసుకోవడం వల్ల వ్యాపారస్తులు, రైతులు సమస్యల సర్దుమణగడంతో యథావిధిగా చీనీ కాయల వేలం పాట నిర్వహించారు.