breaking news
YSR District News
-
మహిళలంటే కనీస గౌరవం లేదు
తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలలంటే కనీస గౌరవం లేదు. ఇందుకు నిదర్శనం మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలే. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకం అసహ్యించుకునేలా ట్రోల్ చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నందుకే రోజాను టార్గెట్ చేశారనిపిస్తోంది. – టీపీ వెంకట సుబ్బమ్మ, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం -
అవినీతికి కేంద్రం.. కారాగారం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం అవినీతికి చిరునామాగా మారింది. ఇక్కడ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వివిధ అంశాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది కొందరు అధికారులు, సిబ్బందికి కాసుల పంటగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్గా అనేక కేసుల్లో నిందితుడిగా వున్న జాకీర్ పీడీ యాక్ట్ కింద రిమాండ్లో వున్నాడు. అతని వద్దనే ఆకస్మిక తనిఖీల్లో దశల వారీగా 12 సెల్ఫోన్లు, ఛార్జర్ లభించినట్లు విచారణ అధికారిగా వచ్చిన డీఐజీ ఎంఆర్ రవికిరణ్ నిర్ధారణకు వచ్చారు. బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు సిద్ధం చేసి పంపనున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు బయటి నుంచి విసిరేస్తే లోపలికి వచ్చి పడుతున్నాయని, కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది సహకారంతో రిమాండ్ ఖైదీల చేతికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బయటి నుంచి వచ్చిన సెల్ఫోన్లను కొన్ని సమయాల్లో ఖైదీలే తీసుకుని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫోన్ల వ్యవహారం తెలిసినా, తాము విధుల్లో వున్నపుడు రిమాండ్ ఖైదీ మాట్లాడుకుంటున్నా తమకేమీ పట్టనట్లు వుండే వారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెల్ఫోన్ల వ్యవహారంపై ప్రాథమిక విచారణకు వచ్చిన డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమికంగా విచారణకు వచ్చామని, నివేదికను తయారు చేసి డీజీకి సమర్పిస్తామన్నారు. ఈ రిపోర్టు అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డెయిరీ పాలు ఏమవుతున్నాయో? కడప కేంద్ర కారాగారంలోని కీలక అధికారికి సంబంధించిన పెంపుడు కుక్క టామీకి రెండు లేదా మూడు లీటర్ల పాలు పంపించాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఓ హెడ్ వార్డర్ తన పెంపుడు పిల్లికి కూడా పాలు ఇవ్వాలని పట్టుపట్టి మాట్లాడినట్లు సమాచారం. డెయిరీలో వచ్చిన 16 లీటర్ల పాలల్లో 14 లీటర్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం రెండు లీటర్ల పాలల్లో నీళ్లను కలిపి, రిజిస్టర్లో మాత్రం 16 లీటర్ల పాలు లోపలికి పంపిస్తున్నట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్యాకెట్ పాలను నేరుగా వ్యాన్ ద్వారానే లోపలికి పంపిస్తున్నట్లు.. లోపల లెక్క చూసుకుంటున్నారని సమాచారం. ఖైదీలను ఆస్పత్రులకు తీసుకెళ్తూ.. కొంత మంది జీవిత ఖైదీలు కొందరు అవినీతి అధికారులను ఆశ్రయించి వైద్య పరీక్షలు, చికిత్సలు అంటూ కడప రిమ్స్కు, అక్కడి నుంచి కర్నూలు, విజయవాడ, హైదరాబాద్లకు రెఫర్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతిసారి వేలాది రూపాయలను ముట్టజెపుతున్నట్లు తెలిసింది. డాక్టర్ల రిపోర్ట్ మేరకు కడపకు చెందిన ఓ ప్రముఖ జీవిత ఖైదీకి ప్రతి నెలలో కనీసం రెండు లేదా మూడు సార్లు రిమ్స్కు పంపించి ‘సకల మర్యాదలు’ చేస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ బంకులో చేతివాటం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన ఖైదీ వద్ద సెల్ఫోన్ అభ్యం నజరానాను బట్టి కొందరికి సౌకర్యాలు అక్రమాలపై డీఐజీ నివేదిక సిద్ధం కడప కేంద్రగారం ఆధ్వర్యంలో ఓ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న జీవిత ఖెదీల్లో కొందరు అక్రమార్జనకు సహకరించి కొందరు కారాగార అధికారులకు రూ.వేల నుంచి లక్షలాది రూపాయలను ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఇక్కడ పని చేస్తున్న కారాగార సిబ్బంది, ఔట్గ్యాంగ్ ఖైదీలను ఎప్పటికప్పుడు విధులను మారుస్తూ, తప్పు జరిగినపుడు సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెట్రోల్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంది. -
పాత పింఛన్ అమలు చేయాలని నిరసన
కడప ఎడ్యుకేషన్ : తమకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం నాయకులు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటజనార్దనరెడ్డి, ఎన్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు జనార్దన్రాజు, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఎస్ఎల్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ప్రకారం అర్హులైన వారందరికీ పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కన్వీనర్లు సుధాకర్, చాంద్బాషా, రాచమల్లు ప్రసాద్రెడ్డి, సునీత, రవీంద్రనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
కడప ఎడ్యుకేషన్: గండికోటలో జరిగిన బాలిక హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక సీమ కన్వీనర్ ఆంజనేయులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు. బాలిక మృతికి సంతాపంగా ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురైందన్నారు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా వాస్తవాలను ప్రకటించక పోవడంలో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. హోంమంత్రి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ ఉమెన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ, సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య, ఎంఆర్పీ జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యస్.రామాంజనేయులు, యస్.సుబ్బరాజు, హేతువాద సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్, పీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.నాగరాజు, ఐసా జిల్లా కార్యదర్శి ప్రసన్న, ఎస్సీ యాదవ్, లోకసత్తా పార్టీ అధ్యక్షులు దేవర కృష్ణ, రసూల్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ నాగరాజు పాల్గొన్నారు. -
ఆటోమొబైల్ దుకాణం తనిఖీ
రాయచోటి జగదాంబసెంటర్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాయచోటి–చిత్తూరు రోడ్డులోని రాందేవ్ ఆటోమొబైల్స్ షాపును విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో కొనుగోలు చేసే వస్తువులపై ఎంఆర్పీ ధరలు లేవని, జీఎస్టీ లైసెన్సు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. రాజధాని ఆటో మొబైల్స్, రాందేవ్ ఆటోమొబైల్స్ పేర్లతో వేర్వేరుగా యజమాని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ షాపులో సేల్ బిల్స్ ఇవ్వడంలేదని గుర్తించి దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనికీల్లో ఎం.శివన్న, గీతావాణి, బాబుమోజెస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ వంక వడ్డిపల్లెకు చెందిన ఈశ్వరయ్య(65), అతడి భార్య సుందరమ్మ(60) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చారు. గ్రామంలో గొడవ విషయమై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొత్తవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా పీలేరుకు చెందిన తరుణ్(20), అష్రఫ్(22), నిఖిల్(21), బాలాజీ(23), ప్రేమ్కుమార్(22) వ్యక్తిగత పనులపై గురువారం కారులో మదనపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరిగి పీలేరుకు బయలుదేరారు. బైపాస్ దారిలో వెళుతుండగా కొత్తవారిపల్లె సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు గాయపడగా స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బి.కొత్తకోటకు చెందిన హేమకుమార్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తున్నారు. గౌనిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండో రోజున ఉత్సాహంగా సాగాయి. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు– అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 93 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 60.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని టి.కిరణ్కుమార్ 66, సాత్విక్ 23 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద నాలుగు, విక్రాంత్రెడ్డి 2, రిత్విక్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు మోహన్ 66 పరుగులు, రిషికుమార్రెడ్డి 57 పరుగులు, చేశారు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 246 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో...... వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప– కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. రెండో రోజు శుక్రవారం 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 51.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ పైజాన్ 40, కశ్వప్రెడ్డి 23 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వై.రిత్విక్ కల్యాణ్ ఐదు, సాయి విఘ్నేష్ 2, వివేక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 57.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రోహిత్ గౌడ్ 51 పరుగులు, హరిహరన్ 22 పరుగులు చేశారు. కడప జట్టులోని జయ ప్రణవ్ శ్రాస్తి 3 వికెట్లు, చెన్న కేశవ 2 వికెట్లు, గైబు 2 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
బద్వేలులో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం బద్వేలు అర్బన్ : బద్వేలులో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరింది. పట్టణంలోని మైదుకూరు రోడ్డు, మెయిన్బజార్, ఆంజనేయనగర్, రామాంజనేయనగర్, శాస్త్రినగర్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో రహదారుల పైకి మురుగునీరు చేరింది. మైదుకూరు రోడ్డులో భారీగా వర్షపునీరు నిలిచి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ గ్యారేజీలోకి మోకాలిలోతు నీరు చేరడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యారేజీలోకి చేరిన నీటిని ఫైరింజన్ సహాయంతో బయటికి పంపించారు. మహబూబ్నగర్, మెయిన్బజార్, త్యాగరాజకాలనీ చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీల్లో చెత్త నిల్వలు పేరుకుపోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరింది. మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో పూడికతీత పనులు చేపట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. -
11 మంది గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగర శివారులో గంజాయి విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు చేసి చింతకొమ్మదిన్నెకు చెందిన కవ్వాజి పవన్కుమార్, మద్దెల వెంకట రమణ, ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన రాజోలు చంద్రశేఖర్రెడ్డి, కడప నగరం అక్కాయపల్లెకు చెందిన షేక్ ఇంతియాజ్, చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన కె.వెంకటసాయి, చప్పిడి దేవేంద్ర కలిసి బద్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద కిలో గంజాయి రూ.15 వేలుకు కొనుగోలు చేశారన్నారు. వాటిని చిన్న 10 గ్రాముల ప్యాకెట్గా చేసి రూ.500కు కళాశాలలు, సర్కిల్ల్లో అమ్మేవారన్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నరసింహ, సిబ్బంది దాడి చేసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారన్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందిరానగర్లో..... ఇందిరానగర్లో కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ ఎస్ఐ మహేంద్ర సిబ్బంది దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన తొండూరి అపెనుకొండ అలియాస్ బాబీ, కడప నగరం రాజీవ్ నగర్కు చెందిన గొడుగు అజీజ్ నుంచి కొని అక్కాయపల్లెకు చెందిన దేరంగుల పవన్ కళ్యాణ్, చెమ్ముమియ్యాపేటకు చెందిన ఓర్సు నరసింహ, పుట్లంపల్లెకు చెందిన పొడుతూరు గౌస్ మోహిద్దీన్ అమ్మకాలు సాగించేవారన్నారు. గంజాయి అమ్మకాలపై నిరంతరం తమ సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలు ప్రాంతానికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. విద్యార్థులు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. నాలుగు కిలోల గంజాయి, ఏడు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం -
ఉపాధ్యాయుల వేతన సమస్యలను పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి కోరారు. జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లును శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్లో టీచర్ల బదిలీలు జరగ్గా.. రీఅపోర్షన్లో భాగంగా నూతన పాఠశాలలలో చేరిన ఉపాధ్యాయులకు వెంటనే పొజిషన్ ఐడీలను కేటాయించాలన్నారు. జూన్ నెల నుంచి వేతనం చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 24 ఏళ్లు పూర్తయిన టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చూడాలని, పదవీవిరమణ చెందిన టీచర్లకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపడంలో జాప్యం చేయవద్దని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఖాదర్బాషా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు హరిబాబు, జిల్లా కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, రామసుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
బ్రహ్మంగారిమఠం : జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాస కళ్యాణోత్సవానికి బి.మఠం సిద్ధమైంది. ఇప్పటివరకూ స్వామికి ఏటా మహాశివరాత్రి, జయంతి రోజున కల్యాణ వేడుక నిర్వహించేవారు. భక్తులు, ఉభయదాతల విన్నపం మేరకు ప్రతినెలా స్వామి కల్యాణం నిర్వహించేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో ప్రత్యేక కళ్యాణ మండపం నిర్మించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారి పేరుతో ఉన్న ఈ మండపంలో ప్రథమ మాస కళ్యాణోత్సవాన్ని శుద్ధ ద్వాదశి రోజున నిర్వహించనున్నారు. ప్రతినెలా శుద్ద ద్వాదశి నాడు మాస కళ్యాణం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. శాశ్వత ఉభయదాతలుగా చేరుటకు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మఠం పిట్పర్సన్ శంకర్బాలాజీ తెలిపారు. క్రీడల అభివృద్ధే లక్ష్యం కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘం పటిష్టత, క్రీడల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏ పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్కిరణ్, ఎస్ఏపిఈ ఆసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్రెడ్డి తెలిపారు. కడప శంకరాపురంలోని స్కౌట్ హాల్లో విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాలోని ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏ పీఈటీ ఆసోసియేషన్, ఎస్ఏ పిఈటీ అసోసియేషన్లను విలీనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబయ్య, శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎరువుల విక్రయం నిలిపివేత కడప అగ్రికల్చర్ : కడప నగరంలోని మార్కెఫెడ్ ఎరువుల గోదామును జిల్లా వ్యవసాయ అధికారి(జేడీఏ) బి.చంద్రానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. నిల్వలు పరిశీలించి జిల్లా వ్యాప్తంగా డీర్లు, ఆర్బీకే, పీఎసీఎస్ కేంద్రాలకు ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయశాఖ కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో గోవర్ధన్, వ్యవసాయాధికారి సురేష్కుమార్రెడ్డి సంయుక్తంగా కడప పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. అనుమతి పొందిన పురుగుమందులు అమ్మాలని, రైతులకు రసీదు ఇవ్వాలని సూచించారు. రికార్డులు సరిగా నిర్వహించని 26.94 లక్షల విలువ గల వాటర్ సాలిబుల్ ఎరువుల విక్రయం నిలిపివేసినట్లు వారు తెలిపారు. -
ఈ కందిపప్పు మాకొద్దు
వెనక్కు పంపించేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బద్వేలు అర్బన్ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని కందిపప్పు సరఫరా అవుతోంది. నాసిరకంగా ఉన్న ఈ కందిపప్పు మాకొద్దు అని అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి పంపేయడం ఇందుకు అద్దం పడుతోంది. బద్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేల్ రూరల్, గోపవరం, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో 180 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో కొన్నింటికి ఇటీవల సరఫరా చేసిన కందిపప్పు పురుగులతో బూజుపట్టి ఉంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు తీసుకునేందుకు నిరాకరించారు. చేసేది లేక అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎల్ఎస్ పాయింట్లో తిరిగి ఇచ్చేస్తున్నారు. నాసిరకం కందిపప్పు పంపిణీ చేయడంతో సమస్యలు ఎదురైతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. 36 క్వింటాళ్ల నాసిరకం కందిపప్పు వచ్చింది ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చిన 36 క్వింటాళ్ళ కందిపప్పు నాసిరకంగా ఉంది. ఆగస్టు వరకు గడువు ఉన్నా.. కొంతమేర బూజు పట్టి ఉండడం చూసి జిల్లా ఉన్నతాధికారులకు విషయం విన్నవించాను. తక్షణమే కందిపప్పును వెనక్కి పంపించాలని ఆదేశాలిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తెస్తున్న కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు అందిస్తున్నాం. – అలీఖాన్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని గంగాదేవిపల్లె సమీపంలో శుక్రవారం వేగంగా వస్తున్న లారీ రహదారి ప్రక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కమల్ సాహెబ్(64), క్లీనరు ఫకృద్దీన్(45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. బళ్లారి నుంచి ఇనుప పైపుల లోడుతో లారీ చైన్నెకు వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున గంగాదేవిపల్లె సమీపంలోకి రాగానే వేగం అదుపుతప్పి లారీ రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరుపై ఇనున పైపులు పడిపోయాయి. దీంతో ఇరువురు క్యాబిన్లో ఇరుక్కపోయి చనిపోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారు బళ్లా రి వాసులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్వేను అడ్డుకున్నారు
కడప రూరల్ : తన భూమి సర్వే చేయించుకునేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని హైదరాబాద్కు చెందిన క్రిష్ణయ్య ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కడప మండలంలోని సర్వే నెంబరు 78–బీలో తన తండ్రి నరసరామయ్యకు 2.52 ఎకరాల స్థలం ఉందన్నారు. అందులో 2006లో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీకి 1.25 ఎకరాలను విక్రయించామని, మిగిలిన స్థలం సర్వే చేయించుకోవాలని కోర్టును ఆశ్రయించామని అన్నారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో స్ధానిక రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లగా ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ వారు అడ్డగించారని ఆరోపించారు. మహమ్మదీయ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు జవాబ్ ఎక్యు మాట్లాడుతూ శుక్రవారం దీప, విజయ, మరికొందరు స్దలం వద్దకు వచ్చి దౌర్జన్యం చేయగా తాము ప్రశ్నించామని పేర్కొన్నారు. ఆ స్థలం నరసయ్య, నరసింహమూర్తిది కావడంతో తాము చట్ట ప్రకారం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాము కూడా న్యాయ స్ధానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దారు నారాయణరెడ్డి మాట్లాడుతూ పోలీసుల పర్యవేక్షణలో వచ్చే వారంలో సర్వే చేస్తామన్నారు. బీసీ వసతి గృహంలో విచారణకు ఆదేశం సుండుపల్లె : మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ భవనంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక అప్పన్నకుంటలో సర్వే నెంబర్–2169లోని ప్రభుత్వ స్థలంలో చెరువుకిందపల్లెకు చెందిన తిరుమలరెడ్డి శివారెడ్డి భవనం నిర్మించి బీసీ బాలల వసతి గృహానికి అద్దెకు ఇచ్చారని బీజేపీ నాయకుడు వెంకటరామరాజు మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పటివరకూ తీసుకున్న అద్దె రికవరీ చేయాలని ఆయన కోరారు. వెంటనే విచారించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. కాన్వకేషన్కు రావాలంటూ గవర్నర్కు ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్కు అనుమతి ఇవ్వాలని, కులపతి హోదాలో కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్నజీర్ను వైవీయూ ఇన్చార్జి వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. విజయవాడ రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ను శుక్రవారం ఆయన కలిసి మొక్క అందజేసి దశ్శాలువాతో సత్కరించారు. యోగి వేమన విశ్వ విద్యాలయం గురించి గవర్నర్కు వివరించారు. గవర్నర్ స్పందిస్తూ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కాన్వకేషన్ నిర్వహించుకోవాలని, ఆయా తేదీల వివరాలు తమ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఉపకులపతి వెంట విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ.కృష్ణారావు ఉన్నారు. -
స్వచ్ఛందంగా యువకుల రక్తదానం
కడప ఎడ్యుకేషన్ : కడప బాలాజీ నగర్లోని నెహ్రూ కేంద్ర యూత్ హాస్టల్ నందు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని స్టెప్ సీఈవో సాయి గ్రేస్, పైడి కాల్వ విజయ్కుమార్, ఖూన్కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు , ఖూన్ కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ మాట్లాడుతూ జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఐక్యమతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ నందు రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి మూడు నెలలకోకసారి రక్తదానం చేయుటకు ముందుకు రావాలన్నారు. దీంతో పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు.. ఖూన్ కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల్లో ఇప్పటివరకు 315 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటురు విజయ్ కుమార్, వి.శివశంకర్, పట్టుపోగుల సుబ్బారావు, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. స్టెప్ సీఈఓ సాయి గ్రేస్ -
వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి భక్తులు కిలో వెండిని వితరణగా అందజేశారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన గురుమూర్తయ్య, చతురాచారి మట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి కిలో వెండిని సమర్పించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. . దీనికి సంబంధించి ఆలయ అధికారులు రశీదును అందజేశారు. వీరి పేరున అర్చకులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రాసాదాలు అందజేశారు. విరబూసిన బ్రహ్మకమలాలు రామసముద్రం: రామసముద్రం మండల కేంద్రంలోని బయన్న ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు గురువారం రాత్రి విరబూశాయి. వారి ఇంటి పెరట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టుకు సుమారు 15 పుష్పాలు పూశాయి. చుట్టుపక్కల ప్రాంతాలల ప్రజలు వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా పుష్పాలు పూస్తాయని కుటుంబీకులు తెలిపారు. అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలి కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించేలా సంఘ నాయకులు బాధ్యతలు తీసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ కోరారు. శుక్రవారం కడప డీఈఓ కార్యాలయ సమావేశం మందిరంలో ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యం పెంపొందించే విషయమై ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడితే విద్యలో నాణ్యత పెరిగి విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ వంతుగా ఉపాధ్యాయులకు అవగాహన పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. డెయిరీ స్థలంలో బోర్డుల ఏర్పాటుపై సర్వే మదనపల్లె రూరల్: అమూల్ డెయిరీ స్థలంలో ప్రైవేట్ వెంచర్కు చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రచార బోర్డులు ఏర్పాటుచేశారని ‘సాక్షి’ శుక్రవారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఆదేశాలతో ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం తదితరులు సంబంధిత స్థలంలో జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో నేషనల్ హైవే ఎంతవరకు ఉందో, అంతవరకు కొలతలు వేసి హద్దులను మార్కింగ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఆర్అండ్బీ స్థలంలో ఉన్నట్లు నిర్ధారించారు. బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి, పంచాయతీకి పన్ను కట్టించుకోవాల్సిందిగా కార్యదర్శికి సూచించారు. అయితే..రియల్టర్లు డెయిరీకి, బెంగళూరు ప్రధాన రహదారికి మధ్య తమకు చెందిన 7 సెంట్ల స్థలం ఉందని, అందులోనే బోర్డులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. -
●డీఐజీ అత్యుత్సాహం
డాగ్ స్క్వాడ్తో శోధనగండికోటలో పరిశీలిస్తున్న ఎస్పీ, పోలీస్ అధికారులుసాక్షి ప్రతినిధి, కడప: గండికోటలో బాలిక హత్య సంఘటన మిస్టరీగా మారింది. క్లూస్ టీమ్ పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ పర్యటించింది. టవర్ లోకేషన్ తీశారు. ఫోన్ కాల్స్ టెక్నికల్ విశ్లేషణ చేస్తున్నారు. ఐదు రోజులుగా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు దృష్టి పెట్టారు. అవసరమైన మేరకు పోలీసులు ఉన్నారు. అయిన్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటన పర్యాటక ప్రాంతమైన గండికోటలో మైనర్ బాలిక హత్య. ఒక్కమారుగా యావత్తు సమాజం ఉల్కిపాటుకు గురైంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్నేహితుడు లోకేష్తోపాటు బైక్లో గండికోటకు వెళ్లిన బాలిక.. తిరుగు ప్రయాణంలో లేదు. లోకేష్ ఒక్కరే మోటారు బైక్పై వస్తున్న ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాంతో ఒక్కమారుగా లోకేష్ హత్య చేశారని అందరూ భావించారు. కాగా సాయంత్రానికి లోకేష్ వ్యవహారం తారుమారైంది. హత్యలో లోకేష్ ప్రమేయం లేదని ప్రకటన వెలువడింది. మరోవైపు అన్ని వ్రేళ్లు బంధువుల వైపు చూపాయి. స్నేహితుడు హత్య చేయలేదంటే.. పరువు హత్య చోటుచేసుకుందా? అనే కోణంలో విశ్లేషణలు, వ్యాఖ్యానం నడించింది. మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకున్నారు. అటు వైపు కూడా ఆధారాలు లభ్యం కాలేదు. ఆపై మరోమారు దర్యాప్తు మొదటికి వచ్చింది. ఈమారు జిల్లాలోని అధికారులు బృందాలుగా విడిపోయి హత్య కేసు విచారణ చేపట్టుతున్నారు. తల పట్టుకుంటున్న పోలీసు అధికారులు మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తులో పోలీసు అధికారులు తలమునకలై ఉన్నారు. ఎస్పీ అశోక్కుమార్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో.. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ట్రైనీ డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు బృందాలు విడిపోయి పలు రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు ఆధారంగా అనుమానిత వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్కాల్స్ విశ్లేషణ చేస్తున్నారు. ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నా వివరాలు బహిర్గతం అవుతుండటం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తును కొనసాగిస్తోంది. సంక్లిష్టత మొత్తానికి ఉన్నతాధికారి తొందరపాటు చర్యలేనని పలువురు దెప్పి పొడుస్తుండటం గమనార్హం. ‘తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది’ అన్నట్లుగా మైనర్ బాలిక హత్య కేసులో.. కర్నూలు రేంజ్ డీఐజీ తొందరపాటు చర్య స్పష్టంగా కన్పిస్తోంది. ఇలాంటి ఘటనల్లో ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం సహేతుకం. ఎస్పీ ఆశోక్కుమార్తోపాటు ఘటన స్థలానికి చేరకున్న డీఐజీ కోయ ప్రవీణ్ తొందరగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నిందితుల్ని అదుపులోకి తీసుకొని.. ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని తెలిపారు. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే.. డీఐజీ స్థాయి అధికారి అలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. అనుమానితుడిగా భావిస్తున్న లోకేష్కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో.. ఒక్కమారుగా దృష్టి మళ్లింది. బాలిక సమీప బంధువుల వైపు అందరి దృష్టి మళ్లింది. పోనీ అటువైపు ఆధారాలు ఉన్నాయా? అంటే ఇప్పటికీ ఎలాంటి క్లూస్ లభించలేదు? బంధువులంతా దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినా వెళ్లేందుకు అందుబాటులో ఉన్నారు. -
మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దేశాన్ని ప్రగతి పథాన నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. కడప నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ భవన్లో సీపీఐ కడప నగర సమితి ఏడో మహా సభలు శుక్రవారం నిర్వహించారు. ముందుగా కడప నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ మీదుగా విశ్వేశ్వరయ్య మందిరం వరకూ ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేయడం, మనుస్మతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, బాబు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాయని, చంద్రబాబు 21 సార్లు దిల్లీకి వెళ్లి రూ.3600 కోట్లు అప్పు తెచ్చారన్నారు. పెండింగ్లో ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి బసకచర్ల నిర్మాణం అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో 40 వేల ఎకరాల భూ సేకరణ, మెట్రో రైలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నాయని, మద్యం అమ్మగా వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎన్.వెంకటశివ, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, నాగార్జునరెడ్డి, చెంచయ్య మల్లికార్జున, మనోహర్రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య -
రోజాపై వ్యాఖ్యలపై.. ఆగ్రహం
● టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై ధ్వజం ● క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ కడప కార్పొరేషన్/బద్వేలు అర్బన్: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్కే రోజాపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన రోజాను దుర్భాషలాడటాన్ని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించడం, కించపరడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని, భాను ప్రకాష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
ఏడుగురు నిందితుల అరెస్ట్పీలేరు : రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీ నం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్వో గురుప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన మారుతి సుజుకీ వాహనాన్ని తనిఖీ చేయగా 13 ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంతోపాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏలుమలై, సెంథిల్, అన్బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పుస్వామి, మణి ఉన్నట్లు డీఎఫ్వో వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్, నందీశ్వరయ్య పాల్గొన్నారు. -
● ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి..
నాపేరు వేమిరెడ్డి చంద్ర ఓబుల్రెడ్డి. మాది దువ్వూరు మండలం క్రిష్ణంపల్లి గ్రామం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ప్రస్తు తం 4 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశాను. పంటల సాగుకు సంబంధించిన ఎరువులను గతంలో మేము మా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. దువ్వూరులోని ప్రైవేటు డీలర్ల వద్ద అతి కష్టం మీద తెచ్చుకున్నాను. యూరియా కావాలని ప్రత్యేకంగా అడికితే కాంప్లెక్స్ ఎరువులను తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేకపోయినా యూ రియా కోసం కొనక తప్పడం లేదు. పైగా గతంలో గ్రామంలోని ఆర్బీకే సిబ్బంది విత్తనాలు, ఎరువులను పరీక్షించి నకిలీవా, నాణ్యమైనవా పరిశీలించి ఇచ్చేవారు. ఇప్పుడు అ పరిస్థితి లేదు. విత్తనాలు, ఎరువులను బయట నుంచి తెచ్చుకుని సాగు చేసుకోవాల్సి వస్తుంది. అవి మంచివో లేక నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య వ్యవసాయ సాగు భారంగా ఉంది. కడప అగ్రికల్చర్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఊర్లలోనే రైతన్నలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో లభించేవి. నేడు ఆ పరిస్థితి కరువైంది. ఎరువులు, విత్తనాల కోసం మండల కేంద్రాలకు పరుగు తీయాల్సి వస్తోంది. దీంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్లో 77475 హెక్టార్ల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షం లేకపోవడంతో.. సాగు పనులు అంతగా ఊపు లేవు. రెండు రోజుల క్రితం కేసీ కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద రైతన్నలు పంటల సాగుకు సమాయత్తం అయ్యారు. అయితే ఎరువులు, విత్తనాలు అవసరం మేరకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులపైన ఆధార పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలకు ఎరువులు, విత్తనాలను అరకొరగా కేటాయించడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఎరువులు సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రైవేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రతిపాదనలు పంపినా.. తక్కువగా కేటాయింపు ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు 69,653 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 40,390 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇందులో 7146.30 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే మంజూరు చేశారు. గతేడాదివి 27073.08 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా.. ఇందులో రీటైలర్, హోల్సెల్ డీలర్లు వద్ద 26,466.74 మెట్రిక్ టన్నుల ఉంచగా.. రైతు సేవా కేంద్రాల్లో కేవలం 606.38 మెట్రిక్ టన్నులు ఉంచారు. ఈ విషయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలలో అధిక ఎరువులను ఉంచితే రైతులకు సమస్య లేకుండా పోయేదని పేర్కొంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. పంట పేరు సాధారణ సాగు సాగైన పంట (హెక్టార్లలో) (హెక్టార్లలో) వరి 30804 1571.43 జొన్న 517 6 సజ్జ 1089 358 మొక్కజొన్న 932 717.44 కంది 5761 42 మినుము 3806 827.7 వేరుశనగ 5976 870.93 సన్ఫ్లవర్ 1142 65.7 సోయాబీన్ 1030 21 పత్తి 24036 2429.07 ప్రభుత్వం అరకొరగా మంజూరు విత్తనాల కేటాయింపు అంతంత మాత్రమే అధిక ధరకు విక్రయిస్తున్న డీలర్లు అన్నదాతకు తప్పని అవస్థలు ఖరీఫ్ సీజన్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు 20538 మెట్రిక్ టన్నుల యూరియా అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలను పంపగా.. ఇందులో 12025 టన్నులు కేటాయించారు. ప్రస్తుతం 3062.3 టన్నులను మాత్రమే మంజూరు చేశారు. డీఏపీకి సంబంధించి 9862 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 4860 మెట్రిక్ టన్నులను కేటాయించారు. ప్రస్తుతం 1826 టన్నులు మంజూరు చేశారు. కాంప్లెక్స్ ఎరువులు 32704 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 20195 టన్నులు కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 2258 టన్నులు మంజూరు చేశారు. ఎంఓపీకి సంబంధించి 2791 టన్నుల కోసం ప్రతిపాదనలు పంపగా, 1620 టన్నులు కేటాయించారు.. కానీ ఏమీ మంజూరు చేయలేదు. ఎస్ఎస్పీకి సంబంధించి 3758 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 1690 టన్నులు కేటాయించారు. కానీ ఏమీ మంజూరు చేయలేదు. ఇలా మొత్తంగా ఖరీఫ్ సీజన్కు 69,653 మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 7146.3 మెట్రిక్ టన్నులు మాత్రమే మంజూరు చేశారు. రీటైల్స్, హోల్సెల్, ఆర్ఎస్కేలలో కలిపి.. గతేడాది రీటైలర్స్, హోల్సెల్, ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేయగా.. మిగిలిన ఎరువులను రీటైలర్స్, హోల్సెల్, ఆర్ఎస్కేలలో అందుబాటులో ఉంచారు. ఇందులో యూరియా రీటైలర్ వద్ద 3546.52 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 2630.57 మెట్రిక్ టన్నులు ఉండగా.. రైతు సేవా కేంద్రాలలో కేవలం 321.03 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీకి సంబంధించి రీటైలర్ వద్ద 1121.65 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 1544 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రంలో 136.4 టన్నులు అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్లు రీటైలర్ వద్ద 7236.76 టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 5204.92 టన్నులు, రైతు సేవా కేంద్రంలో 101.45 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎంఓపీ రీటైలర్ వద్ద 1648.60 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ వద్ద 1241.35 మెట్రిక్ టన్నులు, ఆర్ఎస్కే కేంద్రాల్లో 47.75 టన్నులు ఉంచారు. ఎస్ఎస్పీకి సంబంధించి 2074.04 మెట్రిక్ టన్ను లు రీటైర్స్ వద్ద, 218.35 మెట్రిక్ టన్నులు హోల్ సెట్ వద్ద ఉండగా.. ఆర్ఎస్కేలో మాత్రం లేవు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో కేఎంసీకి మూడో ర్యాంకు
కడప కార్పొరేషన్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు వచ్చింది. 2019 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఇచ్చిన ర్యాంకుల్లో ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. 2019లో జాతీయ స్థాయిలో 62వ ర్యాంకు రాగా, 202లో 54, 2021లో 56, 2022లో 56, 2023లో 58వ ర్యాంకులు లభించాయి. 2024 సంవత్సరంలో నిర్వహించిన సర్వేల్లో కడపకు అతి తక్కువగా 31వ ర్యాంకు లభించింది. చెత్తను తడి, పొడి చెత్తలుగా విడదీయడంలో 48 శాతం, ఆ చెత్తలు ప్రాసెసింగ్ చేయడంలో 98 శాతం మార్కులు లభించాయి. గత ఏడాది జీఎఫ్సీ స్టేటస్లో త్రీస్టార్ రాగా, ఈ ఏడాది సింగిల్ స్టార్ వచ్చింది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ఓడీఎఫ్(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్, ప్లస్ స్టేటస్ వచ్చింది. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ్లో అన్ని విభాగాల్లో కడపకే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు -
ఆశ్రమ స్థలంపై కన్ను
అధికారమే దన్ను.. సాక్షి టాస్క్ఫోర్స్: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్న చందంగా అధికార పార్టీ నేతలు అనుకుంటే.. ఏమైనా చేయగలరు అనడానికి చక్కటి ఉదాహరణ.. ప్రొద్దుటూరులోని మహర్షి ఆశ్రమం కొనుగోలు వ్యవహారం. నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. కేవలం ఆశ్రమ నిర్వహణతోపాటు పేదలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు మాత్రమే పూర్వం మహర్షి విద్యామందిరాన్ని ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అండతో స్థానిక ప్రజాప్రతినిధి తనయుడు చక్రం తిప్పి.. ఈ స్థలాన్ని కొనుగోలు చేయించారు. త్వరలో ఈ స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేయనున్నారు. దానంగా ఇచ్చిన స్థలం ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరంలో పూర్వం ఢిల్లీకి చెందిన మహర్షి విద్యామందిరం నిర్వాహకులు ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆశ్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో గురుదేవ్ రామిరెడ్డి ఈ ఆశ్రమానికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ ఆశ్రమ నిర్వహణ తీరును మెచ్చి బొల్లవరానికి చెందిన కందుల బాలనారాయణరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి ఎకరా 15 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు. సర్వే నంబర్ 592లోని ఈ స్థలాన్ని 1978 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. తర్వాత కాలంలో నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు ఉన్న మరో 50 సెంట్ల స్థలాన్ని మహర్షి ఆశ్రమానికి అమ్మడం జరిగింది. మొత్తం ఎకరా 65 సెంట్లలో ఆశ్రమాన్ని, పాఠశాలను నడిపేవారు. గత కొన్నేళ్లుగా ఆశ్రమ నిర్వహణ గురించి నిర్వాహకులు పట్టించుకోవడం వదిలేశారు. ఈ కారణంగా ఈ సంస్థలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. విలువైన ఈ స్థలాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. చుట్టూ జనావాసాల మధ్య ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం పెరిగింది. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేయాలని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఈ స్థలాన్ని కారుచౌకగా కొనుగోలు చేశారు. ఇందులో ప్రజాపతి తనయుడు స్లీపింగ్ పార్టనర్గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాదం కూడా చోటు చేసుకుంది. ఆశ్రమ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని మొత్తం స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భవనాలు జేసీబీతో నేలమట్టం గత పది రోజులుగా ఆశ్రమంలోని జ్ఞాన మందిరం, పాఠశాల భవనాలతోపాటు ఇతర నిర్మాణాలను జేసీబీతో తొలగించి నేలమట్టం చేశారు. దానంగా ఇచ్చిన ఈ స్థలంలో పాఠశాలను నిర్వహించాలని, ఆశ్రమాన్ని నెలకొల్పాలని ఈ స్థలంపై తనకు, తన వారసులకు ఎలాంటి హక్కు లేదని ఆనాడే నరసింహారెడ్డి రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ప్రకారంగా దానంగా ఇచ్చిన భూములు, స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. నాడు సమాజ హితం కోసం.. ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలకు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తండ్రి నాగిరెడ్డి పూర్వం పది ఎకరాలకుపైగా స్థలాన్ని దానంగా ఇచ్చారు. అలాగే ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు పూర్వం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి తండ్రి పేర్ల నాగిరెడ్డి 10 ఎకరాలకుపైగా స్థలం ఇచ్చారు. నాడు సమాజ శ్రేయస్సు కోసం ధనవంతులు భూములను విరాళంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. నేడు అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాజ హితం కోసం ఇచ్చే స్థలాలను ఆక్రమిస్తున్నారు. మహర్షి ఆశ్రమం భూమి హాంఫట్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు భారీ విలువ ఉండగా.. కారు చౌకగా.. రియల్ ఎస్టేట్వ్యాపారం కోసం పన్నాగం -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు సర్వీసులో ఉన్న ఒప్పంద అధ్యాపకులు 2025–26 విద్యా సంవత్సరానికి రెన్యూవల్స్ చేసుకోవాలని కడప జిల్లా ఐడి కళాశాల(ఆర్ట్స్ కళాశాల) ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. వారు పని చేస్తున్న కళాశాలల్లోని ప్రిన్సిపాల్లకు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కడప ఎడ్యుకేషన్: కడప శివారులోని కేఎస్ఆర్ఎం కళాశాలలో 1996–2000 సంవత్సరాల మధ్య ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నట్లు పూర్య విద్యార్థులు తెలిపారు. కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ అల్యుమినీ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాలేజ్ అభివృద్ధిపై చర్చ, సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పూర్వ విద్యార్థులు 8123417684కు వివరాల కోసం ఫోన్ చేయవచ్చునని తెలిపారు. నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మార్కెట్ యార్డ్ కమిటీలకు సర్కార్ చైర్మన్ లను నియమించింది.. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు.. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పి.విజయలక్ష్మి( బీజేపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బోడిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ), లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎస్ ఎండి షఫీ, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్గా జంగాల శ్రీనివాస్(జనసేన)ను నియమించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పేర్లు ప్రకటించింది. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. బాలిక హత్యపై స్పందించిన కమిషన్ కడప కోటిరెడ్డి సర్కిల్: గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వైష్ణవి ఇంటి నుంచి బయలుదేరి, ఆ తర్వాతకు హత్యకు గురైందని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇంటర్ విద్యార్థిని చనిపోవడం బాధాకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ఎన్ని గంటలకు వెళ్లింది, ఎక్కడి నుంచి వెళ్లింది, సంఘటన జరగడానికి కారణాలు తదితరాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లాలోని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. తిరుపతి– చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: ఆగస్టులో తిరుపతి– చర్లపల్లి మధ్య మరో ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతి ఆదివారం, సోమవారం ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. తిరుపతిలో ఆగస్టు 3, 10, 17, 24వ తేదీల్లో (ఆదివారం) 07481 రైలు 9.10 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్ నగర్, జడ్చర్ల, కాచిగూడ, మల్కాజ్గిరి మీదుగా చర్లపల్లికి వెళ్తుందన్నారు. ప్రతి సోమవారం చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. కేసీ కెనాల్కు నీటి విడుదల వల్లూరు: మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద పెన్నానది నుంచి కేసీ కెనాల్కు గురువారం నీటిని విడుదల చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పూజలు జరిపి అనంతరం గేట్లు తెరిచి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ చిన్న పుల్లయ్య, ఏఈ గంగిరెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మెన్ వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విత్తనం.. గగనం
● జీలుగలు 3308.7 టన్నులు కేటాయించగా.. ఇందులో 1967.8 టన్నులు మంజూరు చేయగా.. 1222 టన్నులు రైతులు తీసుకెళ్లారు. ● జనుములు 982.1 కేటాయించగా, ఇందులో 862.4 మంజూరు చేయగా 487.9 టన్నులను రైతులు తీసుకెళ్లారు. ● వేరుశనగ 3577 టన్నులు కేటాయించగా, 2718.6 మంజూరు చేయగా.. ఇందులో 2673.9 టన్నులు రైతులు తీసుకుని వెళ్లినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. యూరియా దొరకడం లేదు నేను ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ప్రస్తుతం యూరియా అవసరం ఉంది. యూరియా కొందామంటే దొరకడమే లేదు. ఒక వేళ దొరికితే.. యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు కొనాలని డీలర్లు సూచిస్తున్నారు. – వెంకటసుబ్బయ్య, తుడమలదిన్నె, ఖాజీపేట ఎరువుల రేట్లను పెంచడం అన్యాయం రసాయనిక ఎరువుల రేట్లను పెంచడం చాలా అన్యాయం. ఎరువుల పెరుగుదల ప్రభావం వ్యవసాయంపైన తీవ్రంగా పడుతుంది. సాగుకు కౌలు రైతులు ముందుకు రాక, సొంత భూమి ఉండే రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. – సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు 40,390 మెట్రిక్ టన్నుల కేటాయింపు 2025 ఖరీఫ్ సీజన్లో ఏప్రి ల్ నుంచి జూలై వరకు 40930 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించారు. ఇందులో ఇప్పటికి 7146.3 మెట్రిక్ టన్నుల వివిధ రకాల కంపెనీల ఎరువులను జిల్లాకు సరఫరా చేశారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్
ప్రభుత్వ సేవలపై సంతృప్త స్థాయి పెంచాలి కడప సెవెన్ రోడ్స్: ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయి పెంచేలా పనిచేయాల్సి ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు స్టోన్ ఫౌండేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జీరో పావర్టీ, పీ–4పాలసీ, బంగారు కుటుంబాలు, మార్గదర్శులు గ్రామ సభలు, జనాభా నిర్వహణ అంశాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా జిల్లాలో మిగిలిన వున్న గ్రామాలను కవర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీవో హజరతయ్య, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం పీ.గోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్.బాబు, అధికారులు పాల్గొన్నారు. -
రైతుకు సోలార్ ముప్పు
జమ్మలమడుగు/మైలవరం : సోలార్ ప్యానెల్ ముప్పు రైతులకు సంకటంగా మారుతోంది. భూముల యజమానుల అనుమతి లేకుండానే పొలాల్లో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రత్యేక బృందాలతో బెదిరింపులకు దిగుతున్నారు. ఏదో ఒక లింకు పెట్టి భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సెల్(ఎస్ఏఈఎల్) కంపెనీ సోలార్ ప్రాజెక్టు చేపడుతోంది. తమ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలకు పాతర వేస్తోంది. రైతులు తమ పొలాలు ఇవ్వకున్నా.. ఏదో లింకు పెట్టి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక రైతులపై రోజు రోజుకూ బెదిరింపుల పర్వం పెరిగిపోతోంది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పొలాల యజమానులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. విచిత్రమేమిటంటే గతంలో చాలామంది రైతులను తప్పుదోవపట్టించి భూములను లీజుల రూపంలోనూ, కొనుగోలు రూపంలో తీసుకున్న సంస్ధ వ్యక్తులు ఇపుడు కొత్త కోణాన్ని తీసుకువస్తున్నారు. భార్య పేరు మీద భూములుంటే భర్తలను మభ్యపెట్టి ఇంట్లో వారికి సమాచారం లేకుండానే ఒప్పంద పత్రం రాయించుకుంటున్నారు. భార్యపేరిట భూములున్నా భర్త పేరుతో ఒప్పందం ఇచ్చి తీరాలంటూ సోలార్ యాజమాన్యం బెదిరింపులు -
పల్లెల్లో విద్యుత్తు అధికారుల తనిఖీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్తు అధికారులు గురువారం విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. మైదుకూరు డివిజన్ పరిధిలోని 40 మంది విద్యుత్తు సిబ్బంది 24 బ్యాచ్లుగా ఏర్పడి తనిఖీల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై 55 కేసులు నమోదు చేసి రూ.2 లక్షల అపరాద రుసుము వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బి.మఠం సబ్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశంలో మైదుకూరు డివిజన్ ఈఈ ఎన్.భరణీకృష్ణ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వ్యవసాయ మోటార్లకు సంబంధించి రూ.3.59 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రూ.4 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బిల్లులు వసూలు చేస్తామన్నారు. వినియోగ దారులు సకాలంలో బిల్లు చెల్లిస్తే అపరాధ రుసుము పడదన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రవిచంద్ర, డీఈఈలు కుళ్లాయప్ప, శ్రీకాంత్, ఏఏఓ శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.55 విద్యుత్తు చౌర్యం కేసులు నమోదు -
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభమయ్యాయి. కడప వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి రోజున కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలుచుకున్న కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రుత్విక్ కల్యాణ్ 40 పరుగులు, రోహిత్ గౌడ్ 35 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నకేశవ అద్భుతంగా చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా జయప్రణవ శాస్త్రి 2, క్యాశప్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 59.5 ఓవర్లకు 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అలెన్ లియో 61 పరుగులు, సుశాంత్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టి.కిరణ్కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశారు. సంజయ్ 2, దేవాన్ష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాత్విక్ 23 పరుగులు చేశాడు దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఎమ్మెల్యే చెప్పారని పట్టా భూమిలో రోడ్డేశారు
కడప రూరల్ : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అనుచరులమంటూ కొంతమంది వచ్చారు. వారితోపాటే స్థానిక తహసీల్దారు తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే చెప్పారంటూ తమకు చెందిన 2.25 సెంట్ల స్థలంలో అక్రమంగా రోడ్డు వేశారు. న్యాయం చేయాలంటూ బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లెకు చెందిన మన్యం సుబ్బలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కుమారుడు రామచంద్రారెడ్డితో కలిసి గురువారం కడపకు వచ్చారు. అక్కడ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఉండడంతో ఆయను తన సమస్య విన్ననించారు. తమ గ్రామంలోని సర్వేనెంబర్ 82లో 2.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ నెల 5న సర్వేయర్ వచ్చి తమ భూమికి బౌండరీ లైన్ ఫిక్స్ చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటుచేశారని తెలిపారు. 16న తహసీల్దారు, కొందరు వ్యక్తులు వచ్చారని, తాము ఎమ్మెల్యే అనుచరులం అంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దౌర్జన్యంగా తమ భూమి చుట్టూ వేసిన ఇనుప కంచె తొలగించారని ఆరోపించారు. అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా దారిని ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. స్పందించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ఱెడ్డి న్యాయం చేయాలని బద్వేల్ ఆర్డీఓకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే చెప్పారని నోటీసులు ఇవ్వకుండా పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తక్షణం బాధితురాలి సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటికే బద్వేల్ ఆర్డీఓ, జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాఽథ్రెడ్డి -
ఆర్బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి
కడప సెవెన్ రోడ్స్ : ఖరీఫ్ రైతులకు అవసరమైన ఎరువులను ఆర్బీకేల ద్వారా బస్తా రూ.267కే సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడును గురువారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కెసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయడంతో వరి, ఉల్లి, పత్తి, ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు ఎరువులు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బయట మార్కెట్లో బస్తా రూ.350 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఆర్బీకేలో సమాధానం చెప్పే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నప్పటికీ రైతులకు ఏ ఒక్క సాయం చేయలేదని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో రైతు భరోసా కింద రూ.13500 ఇచ్చారన్నాఉ. తాము అధికారంలోకి వస్తే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చేసిన వాగ్ధానం ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వరి, మినుము తదితర పంటలకు కనీస మద్దతు ధర లేక రైతు అవస్థపడుతున్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి హయాంలో ఖరీఫ్ పంటలకు నష్టం జరిగితే పరిహారం అందించి అదుకున్నామని చెప్పారు. జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. ఇన్చార్జి కలెక్టర్ తీరుపై ఆగ్రహం రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించాలని ముందస్తుగా ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ను అపాయింట్మెంట్ కోరగా.. సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవాలని ఆమె క్యాంప్ క్లర్క్ ద్వారా చెప్పారని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. తాము కలెక్టరేట్కు వస్తే ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఆమె వెళ్లిపోవడం భాద్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే ఎవరూ పట్టించుకోవద్దని ప్రభుత్వం మౌఖిక అదేశాలు జారీ చేసిందా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులు తమ వైఖరి మార్చుకొని అందరికీ అందుబాటులో ఉండాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరుప్రసాద్రెడ్డి, నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్కుమార్, శ్రీరంజన్రెడ్డి, చెన్నూరు ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్, సీహెచ్ వినోద్కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంధ్రనాథ్రెడ్డి -
అధిక వడ్డీల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
సింహాద్రిపురం : అధిక వడ్డీల వేధింపులతో సింహాద్రిపురం మండలం అగ్రహారానికి చెందిన రైతు సాకే అమర్నాథ్(35) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి భార్య గంగాదేవి కథనం మేరకు.. తన భర్త అమర్నాథ్కు 2 ఎకరాల భూమి ఉండడంతోపాటు ఫైనాన్స్లో జేసీబీ తీసుకుని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులకు గానూ గ్రామంలో రూ.10 చొప్పున వారం వడ్డీ చెల్లిసూ్త్ గ్రామానికి చెందిన శంకర్రెడ్డి, మరింతమంది వద్ద అప్పు డబ్బు తీసుకున్నారు. ఆ వడ్డీ పెరిగి ఐదింతలు కాగా, ఒత్తిడి తట్టుకోలేక అప్పు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఎనిమిది తులాల బంగారు వారికి ఇవ్వగా.. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని అడగడంతో అమర్నాథ్ ఇబ్బందిపడ్డారు. ఇది చెల్లించలేని పరిస్థితిలో తన రెండెకరాల భూమి అగ్రిమెంట్ లేకుండా దౌర్జన్యంగా తీసుకుని శంకర్రెడ్డి సాగు చేసేందుకు పొలం సిద్ధం చేశారన్నారు. అంతేగాక తన భర్తను ఫోన్ద్వారా వడ్డీ డబ్బు ఇవ్వాలని వేధించేవాడన్నారు. ఈ విషయం అమర్నాథ్ ఫోన్లో రికార్డు అయ్యింది. వేధింపులు తాళలేక అమర్నాథ్ మనస్థాపానికి గురై ఈ నెల 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. భర్త హత్య కేసులో భార్య, బావమరిది అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎర్రముక్కపల్లి బాల వికాస్ స్కూల్ వెనుక నివాసముంటున్న దేరంగుల సుబ్బరాయుడు (32) హత్య కేసులో మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. మద్యం తాగి రావడంతో భార్య హరిత, బావమరిది హరి కృష్ణ గొడవపడ్డారు. ఈ క్రమంలో సుబ్బరాయుడును గోడకేసి తోయడంతో పదునైన మోటు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ బి.రామకృష్ణ దర్యాప్తు చేశారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
కడప అర్బన్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు చైన్ స్నాచింగ్కు పాలం్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 52 గ్రాముల బంగారు చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో విలేకరులకు గురువారం వివరాలు తెలిపారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన పట్టనేతి నవీన్(26) గత కొద్ది నెలలుగా చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు. కడప రూరల్ సీఐ చల్లనిదొర, పెండ్లిమర్రి ఎస్ఐ జి.మధుసూదన్రెడ్డి, సిబ్బంది ఈ నెల 2వతేదీన నవీన్ను అరెస్ట్ చేశారని తెలిపారు. విచారించి అతడి నుంచి 1,150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపినట్లు తెలిపారు. అనంతరం జూలై 16న పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించగా నిందితుడు నవీన్ ఆరుచోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు రుజువైందని తెలిపారు, తొండూరు, చెన్నూరు, పులివెందుల, గంగిరెడ్డిపల్లి పోలీస్స్టేషన్, కమలాపురం, పెండ్లి మర్రి పోలీస్ స్టేషన్లలోని పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అక్కడ చోరీ చేసిన బంగారు చైన్లు అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దుకాణదారులు నిందితుడిని తగిన రసీదు చూపించమని అడిగారన్నారు. భయంతో తిరిగి తన ఇంటిలోనే బంగారు గొలుసు దాచి పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిని విచారించి బంగారు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు, రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐలతోపాటు క్రైమ్ స్టేషన్ ఏఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది బాషా, బి.రవి కుమార్, సుభాన్బాషా, కిరణ్కుమార్, సూర్యప్రకాశ్రెడ్డిలను ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన దొంగ అరెస్ట్ రూ.15.32 లక్షల విలువైన చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు -
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
కాశినాయన : ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని నాయునిపల్లె రెవెన్యూ పొలంలో ఆక్రమించిన ప్రభుత్వ, అటవీ భూములను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నాయునిపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 129/1, 130, 217లో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ స్ట్రెంచ్ తీయాలని తహసీల్దార్ను ఆదేశించారు. వెంటనే ఆక్రమిత పొలాల్లో నోటీసు బోర్డు ఏర్పాటుచేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, డీటీ రవిశంకర్, ఆర్ఐ అమరనాథ్రెడ్డి, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
పెండ్లిమర్రి : మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన పి.కాళీప్రసాద్(54) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... బుధవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో ప్రసాద్ కడపకు బయలుదేరాడు. యోగి వేమన యూనివర్శిటీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్షాక్తో ఎద్దు, దూడ మృతిమైలవరం : మండలంలోని తొర్రివేముల గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకట సుబ్బమ్మకు చెందిన ఎద్దు, అవు దూడ విద్యుత్ షాక్తో గురువారం మృతిచెందాయి. బాధితురాలి వివరాల మేరకు.. పొలం వద్ద గడ్డి మేపుకోవడానికి సుబ్బమ్మ ఎద్దులు, ఆవుదూడలను విడిచిపెట్టింది. బోరుబావి వద్ద ఉన్న స్టార్టర్ వద్దకు వెళ్లిన ఎద్దు పొరపాటున స్టార్టర్కు తగలడంతో అక్కడ ఉన్న తీగలు పశువులపై పడ్డాయి. విద్యుత్తు షాక్ తగలడంతో రెండు పశువులు మృతి చెందినట్లు బాధితురాలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. బోగాధమ్మ ఆలయంలో చోరీకమలాపురం : మండలంలోని పందిళ్లపల్లె శివారులో ఇటీవల పునర్నిర్మించిన బోగాధమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళం పగులగొట్టి హుండీని రంపంతో కోసి అందులో నగదు చోరీ చేశారు. ఆలయం బయట పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు. రైల్వే స్టేషన్ గోదాములో తనిఖీలుకడప అగ్రికల్చర్ : కడప రైల్వేస్టేషన్లోని రేక్ పాయింట్, ట్రాన్స్పోర్టు గోదాముల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ మల్లికార్జునరావు, కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, కడప ఏవోలు గోవర్ధన్, సురేష్కుమార్రెడ్డి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎరువు నిల్వలు, పంపిణీకి సంబంధించిన పత్రాలు, రికార్డులు పరిశీలించారు. జిల్లాకు 991 మెట్రిక్ టన్నుల ఎరువు వచ్చినట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపితేనే జిల్లాలోని డీలర్లు, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సిబ్బందికి వారు సూచించారు. గోదాముల్లో నిషేధిత పురుగు మందులు ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు పంపేవారు, తీసుకునేవారి చిరునామాలు నమోదు చేయాలని సూచించారు. -
సాగర్ పనుల్లో జాప్యమేల !
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ ఆనకట్ట ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ఆనకట్ట లీక్లను అరికట్టేందుకు 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.70కోట్లు నిధులు విడదల చేసింది. ఈ నిధులద్వారా కట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు కట్టపైన బీటీ రోడ్డు, సేఫ్టీ గ్రిల్స్ , లైటింగ్స్, పార్కుల ఆధునికీకరణ, గెస్ట్హౌస్ మరమ్మతులు తదితర పనులకు టెండర్లు పిలవగా మెగా కంపెనీ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. లీకులు సరిచేసి.. టెండర్లు దక్కించుకున్న సదరు కంపెనీ ఆనకట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు చేసింది. 12 టీఎంసీ వరకు నీరు నిల్వ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇంతలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతే పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం సదరు కంపెనీపై ఒత్తిడి తెచ్చి మిగిలిన పనులు చేయాలని ఆదేశించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. పనులు పూర్తి చేస్తేనే బిల్లులు కూడా పూర్తి స్థాయిలో వస్తాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా సాగర్ కట్టపైన మిగిలిన పనులు పూర్తిచేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాలో రూ.70 కోట్ల నిధులు విడుదల కూటమి ప్రభుత్వంలోముందుకు సాగని పనులు -
● కేసీ నీటితో కాస్త ఊరట
కడప అగ్రికల్చర్: ఆకాశమంతా మబ్బులు...నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. ఇలా చల్లగా ఉండాల్సిన జూలై నెలలో ఎండలు మండుతున్నాయి. అసలిది వానాకాలమా.. ఎండా కాలమో అనే అనుమానం కలుగుతోంది. దీనికితోడు ఉక్కపోత. ఇది చాలదన్నట్లు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఇక వర్షాలకు కొదవ ఉండదనుకున్న అన్నదాతల ఆశలు ఆదిలోనే అడియాసలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వానదేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు కాస్తా వాడుముఖం పడుతున్నట్లు పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రుతుపవనాలు ఎప్పుడొస్తాయో వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని అన్నదాతలు నింగికేసి చూస్తున్నారు. జిల్లాలో 6.52 శాతం పంటలు సాగు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి 77,475 హెక్టార్లలో సాధారణ సాగుగా అధికారులు ఖరారు చేశారు. సీజన్ ప్రారంభమై 45 రోజులు అయింది. ఇప్పటికి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్లార్లలో వివిధ పంటలు సాగై 6.52 శాతంగా పంటలసాగు నమోదయింది. ప్రస్తుతం జిల్లాలో 1571.43 హెక్టార్లలో వరిపంట, 358 హెక్టార్లలో సజ్జలు, 717.44 హెక్టార్లలో మొక్కజొన్న, 6 హెక్టార్లలో జొన్న, 42 హెక్టార్లలో కంది, 827.6 హెక్టార్లలో మినుము, 7 హెక్టార్లలో పెసర, 870.6 హెక్టార్లలో వేరుశనగ, 65.7 సన్ప్లవర్, 9.2 హెక్టార్లలో ఆముదం, 21 హెక్టార్లలో సోయాబీన్, 2429.07 హెక్టార్లలో పత్తి, 16 హెక్టార్లలో చెరకు మొత్తం కలిసి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్టార్లలో పంటలు సాగులో ఉన్నాయి. లోటు వర్షపాతమే... ఖరీప్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సంవృద్ధిగా వర్షాలు కురవలేదు. దీంతో పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం సాగు చేయాల్సిన వేరుశనగ, పసుపు, మినుము, జొన్న, సజ్జ, వరి వంటి పంటలసాగు అనుకున్న మేర సాగు కాలేదు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు కూడా వాడుముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్ నెలలో 68.2 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 22.8 మి.మీ మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 66.6 శాతం తక్కువ వర్షం కురిసింది, అలాగే జులై నెలకు సంబంధించి ఇప్పటి వరకు 43.67 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటికి 7.1 మి.మీ మాత్రమే కురిసి లోటు వర్షపాతంగా మిగిలింది. ముఖం చాటేసిన వరుణుడు వర్షం కోసం రైతుల ఎదురు చూపులు విపరీతంగా వీస్తున్న ఈదురుగాలులు ఎగువన కురిసిన వర్షాలకు ఈ ఏడాది శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో ఈ ఏడాది సకాలంలోనే కేసీ కెనాల్కు నీరు విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఇక సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న పంటలకు నీరు అందనుంది. దీంతోపాటు కేసీ రైతులు ఇక నారుమడులను సాగు చేయనున్నారు. కాకపోతే విపరీతమైన గాలులు వీస్తుంటంతో నారుముడులు సరిగా మొలకెత్తవని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాటు వేసినా ఈ గాలికి సాగు చేసిన వరిపంట ఎండుముఖం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు రైతులు తెలిపారు. -
రైతులపై ఇంత నిర్లక్ష్యమా!
పులివెందుల: శ్రీశైలం, పీబీసీ, సీబీఆర్, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అంబకపల్లె రోడ్డులోని ఇరిగేషన్ డీఈ కార్యాలయానికొచ్చి అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా రైతులకు సాగునీరు ఎందుకందించలేదని ప్రశ్నించారు. గత ఐదారేళ్లలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదని అధికారులపై మండిపడ్డారు. దీనికి అధికారులు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదని సమాధానమిచ్చారు. దీనికి ఎంపీ స్పందిస్తూ గతంలో మోటార్లు పనిచేయలేదన్నారు.., ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడంలేదని కుంటి సాకులు చెబుతున్నారా అంటూ మండిపడ్డారు. రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు విలువ చేసే మరమ్మతులు కూడా చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీనివల్ల రైతులకు కోట్లాది రూపాయలు నష్టపోతారన్నారు. ఇలాంటి చిన్నపాటి రిపేర్లకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేయించి ఎర్రబల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ● అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గండికోట, సీబీఆర్, పైడిపాలెం ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు చెరువులకు నీరు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. లింగాల చెరువు, ఎరబ్రల్లె చెరువుకు సత్వరమే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరామన్నారు. ఎరబ్రల్లి చెరువును నీటితో నింపితే పది గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయం గురించి రెండు నెలల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మోటర్లు కాలిపోయాయని చెబుతున్నారని, తాము మోటార్లు రిపేరు చేయిస్తామని చెబితే ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వమే చేయాలి, కూటమి నాయకులే చేయాలంటున్నారు.. వారు చేయరు చేసేవారిని చేయనివ్వరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పులివెందులను హార్టికల్చర్ హబ్గా చేస్తానని గొప్పగా చెబుతుంటారని, కానీ పులివెందుల రైతులకు నీరు ఇవ్వడానికి మీనమేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యాన పంటల సాగుపైనే ఆధారపడిన నియోజకవర్గానికి నీరు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రతిరోజు కొత్తపల్లె, నల్లపు రెడ్డి పల్లె గ్రామాల్లో కొత్త బోర్లు వేయడం మొదలుపెట్టారని, రోజుకు 15 నుంచి 20 కొత్త బోర్లు వేస్తున్నారని, ప్రతిరోజు రైతులకు రూ.40లక్షల దాకా ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటికై నా నిద్ర మేల్కొని సత్వరమే వాటర్ మేనేజ్మెంట్ పై శ్రద్ధ పెట్టాలని, సత్వరమే ఎరబ్రల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులను నీటితో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, మండల నాయకులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, బాబురెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులలో నీరు ఉన్నా రైతులకు ఎందుకివ్వడం లేదు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజం -
డిగ్రీ ప్రవేశాలు డీలా!
● నేటికీ జారీకాని ప్రవేశాల నోటిఫికేషన్ ● ఆన్లైన్, ఆఫ్లైన్పై స్పష్టత కరువు ● సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టులపై సందిగ్ధం ● ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూపు కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటింది. జూలై మాసం కూడా ముగుస్తోంది. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలతోపాటు గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12878 మందికిగాను 9698 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారు ఉన్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి నిర్లక్ష్యం.... ఉన్నత విద్యపై కూటి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 40 నుంచి 50 శాతం సీట్లు మిగిలిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అలస్యంగా అడ్మిషన్ల పక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలోనే పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు ప్రారభమయ్యాయి, మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమే పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో పలు ప్రెవేటు డిగ్రీ కళాశాలలు మాత్రం గుట్టుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి చప్పు డు కాకుండా తరగతులను నిర్వహిస్తున్నట్లు సమా చారం. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం చేయడం ద్వారా పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనకబడి పోతున్నాయి. 21న ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అలసత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ 21వ తేదీ ప్రైవేటు డిగ్రీ కళాశాల బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు ప్రారంభమైనా ఏపీ ప్రభుత్వం విద్యా ప్రణాళిక కూడా తీసుకరాలేకపోతోందని ఆరోపించింది. ఇందుకు నిరసనగానే 21వ కళాశాల బంద్ను నిర్వహించి నిరసనను తెలియ చేయనున్నారు. డిగ్రీ విద్యపై కుట్ర డిగ్రీ విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సింగల్ మేజర్, డబుల్ మేజర్ అంటూ డిగ్రీ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోంది. ఇంజనీరింగ్ విద్యను ప్రొత్సహించి డిగ్రీ చదువును నిర్లక్ష్యం చేస్తుంది. డిగ్రీ విద్యను పాత పద్దతిలో కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. డిగ్రీ కోర్సులలో విద్యార్థులకు అభద్రతా భావం కల్పిస్తూ డిగ్రీ అడ్మిషన్లు తగ్గించే నిర్ణయాలు చేయడం తగదు. –ఎస్. వెంకటరమణ, యోగివేమన ప్రైవేటు డిగ్రీ కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ డిగ్రీ ప్రవేశాలను వెంటనే చేపట్టాలి విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రవేశాలను ప్రారంభించపోవడం సరికాదు. తెలంగాణాతోపాటు పొరుగు రాష్ట్రాలలో సైతం నెల రోజుల క్రితమే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కానీ మన దగ్గర అడ్మిషన్ల పక్రియ ఆలస్యమయింది. దీంతో డిగ్రీ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించాలి. – వీరనాల శివకుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నత విద్య నిర్వీర్యం కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేలా ఉంది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పెద్దల తీరుతో జిల్లావ్యాప్తంగా వేల మంది పేద, మద్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావాలి. – సాయిదత్త, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
వాటర్షెడ్ పనుల్లో నాణ్యత పాటించండి
బి.కోడూరు: మండలంలో జరుగుతున్న వాటర్షెడ్ పనులను నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలని వాటర్షెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పెద్దుళ్లపల్లె వాటర్షెడ్ పరిధిలో జరిగిన పనులను స్టేట్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపినాఽథ్, జిల్లా క్వాలిటీ ఆఫీసర్ విజయభాస్కర్, ఏపీఓ వేణుగోపాల్రెడ్డితో కలిసి విడిరాళ్ల కట్టలు, కుంటలు, డకౌట్ గుంతలు, పారంఫండ్స్ వంటి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాటర్షెడ్ సిబ్బంది, పెద్దుళ్ళపల్లె వాటర్షెడ్ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారాగారంలో సెల్ఫోన్.. రచ్చ
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్ఫోన్ లభ్యం కావడంపై రచ్చ రేగుతోంది. తాను డబ్బులు ఎరవేశానంటూ రిమాండ్ ఖైదీ ఒకరు తెలియజేసినట్లు సమాచారం బయటకు రావడం చర్చనీయాంశమవుతోంది. పలువురు బాధ్యులైన సిబ్బందిపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల సెల్ ఫోన్లు పదే పదే తనిఖీలలో లభ్యం కావడం, పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 15న ‘కడప కేంద్ర కారాగారంలో మరోసారి సెల్ఫోన్, ఛార్జర్ లభ్యం’ వార్త ప్రచురితమైంది. దీంతో జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు.. రాజమండ్రి రీజియన్ (నార్త్జోన్) డీఐజీ ఎంఆర్ రవికిరణ్ కడప కేంద్ర కారాగారంలో విచారణకు బుధవారం విచ్చేశారు. నేరుగా కారాగారంలోని బ్యారక్ల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పీడియాక్ట్లో రిమాండ్లో వున్న జాకీర్ను పిలిపించి స్టేట్మెంట్ను రికార్డ్ చేయించారు. రిమాండ్ ఖైదీ ఏమాత్రం తడబడకుండా శ్రీతాను సెల్ఫోన్ బయటనుంచి తెప్పించుకోవడానికి జైలర్ నుంచి ఆపై అధికారుల వరకూ డబ్బు ఎర వేశాననీ తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ కుమార్తె వివాహానికి వెళ్లేటపుడు అక్షరాలా రూ. 80వేలు నజరానాగా తీసుకువెళ్లాడని, తనకు సహకరించిన జైలర్ నుంచి అధికారి స్థాయి వరకు తాను రూ.7లక్షలు లంచంగా ఇచ్చాననీ తెలియజేసినట్లు తెలిసింది. జాకీర్ నుంచి దశల వారీగా ఇప్పటివరకూ 12 సెల్ఫోన్లు, ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు. మొదట దొరికిన సెల్ఫోన్ నుంచి లభించినరిపోర్ట్ను డిఐజీ క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. విచారణలో బాధ్యులైన 12 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని, కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావుపై బదిలీ వేటు వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కారాగారం నుంచి బయటకు వెళుతున్న ‘ఔట్ గ్యాంగ్’ ఖైదీల వద్ద యథేచ్చగా మద్యం లభ్యమవుతుందని తాజా సమాచారం. పెట్రోల్ బంకులో ఎలాంటి లాభాలను అక్రమంగా పొందవచ్చో అక్కడ విధులను నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు గ్యాంగ్లో అరెస్టయి శి అనుభవిస్తున్న ఓ ఖైదీ మీద ఆధారపడి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. విచారణకు వచ్చిన డిఐజీ ఎం.ఆర్ రవికిరణ్ శ్రీసాక్షిశ్రీతో మాట్లాడుతూ డీజీ ఆదేశాల మేరకు కడప కేంద్ర కారాగారానికి విచారణకు వచ్చామన్నారు. విచారణ ఇంకా జరుగుతోందనీ, పూర్తి సమాచారం రానున్న రోజుల్లో వివరిస్తామని తెలియజేశారు. పదే పదే లభ్యం కావడంపై డీఐజీ విచారణ స్టేట్మెంట్ ఇచ్చిన రిమాండ్ ఖైదీ జాకీర్ 12 మంది బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ బదిలీకి అవకాశం? -
విద్యార్థుల సమస్యలను డీన్లకు విన్నవించాలి
వేంపల్లె : విద్యార్థులకు సమస్య ఎదురైనప్పుడు అకడమిక్ అసోసియేట్ డీన్, నాన్ అకడమిక్కు అయితే వార్డెన్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ను సంప్రదించాలని డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి రవికుమార్ అన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కొత్తగా చేరిన విద్యార్థులకు బుధవారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది పీయూసీ–1లో సెమిస్టర్ విద్యా విధానానికి బదులుగా వార్షిక పరీక్షలు, మధ్యలో ఆరు మాసాంత(మిడ్) పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థుల సంరక్షితార్థం ఓల్డ్ క్యాంపస్ మొత్తం పీయూసీ1–2 బాలికలకు కేటాయించామని, అక్కడే తరగతులు, వసతులు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బాలురకు ఏబీ–1లో తరగతులు, బీహెచ్–1లో వసతి కేటాయించారన్నారు. పోస్టాఫీస్, బ్యాంకింగ్, 24/7 అంబులెన్స్, హాస్పిటల్ డాక్టర్స్ గురించి వివరించారు. రెండో విడతలో ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 17న సెంట్రల్ లైబ్రరీలో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ డాక్టర్ రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ వెంకటేష్ , ఆసోసియేట్ డీన్స్ రాఘవరెడ్డి, రఫి, పీఆర్ఓ తిరుపతిరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శంషాద్ బేగం, ఓబయ్య, డాక్టర్ కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల కోర్సుకు సంబంధించి పదవ తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈనెల 17వ తేదీలోపు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9392348430 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో పొలిటికల్ సైన్సు, హిస్టరీ, ఎకనామిక్స్, జియాలజి,కంప్యూటర్ సైన్సు/అప్లికేషన్ సబ్జెక్టులకు అతిథి అధ్యాపక ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 18 వ తేదీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపాల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని వివరించారు. నెట్, స్లెట్ , పీహెచ్డీ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్టు జిరాక్సు కాపీలతో హాజరు కావాలని ఆయన సూచించారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 07009 నంబరుగల రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్లో ఈనెల 31, ఆగస్ట్ 7, 14, 21, 28వ తేదీల్లో, 07010 నంబరు గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రతి శుక్రవారం ఆగస్ట్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుందన్నారు. సికింద్రాబాద్లో ప్రతి గురువారం రాత్రి 10గంటలకు బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా కడపకు ఉదయం 7.05గంటలకు చేరుకుని, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.30గంటలకు చేరుకుంటుందన్నా రు. అలాగే ప్రతి శుక్రవారం తిరుపతిలో సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో సికింద్రాబాద్కు ఉదయం 6.45గంటలకు చేరుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు. -
రీసర్వే పక్కాగా నిర్వహించాలి
కడప సెవెన్ రోడ్స్: జిల్లాలో భూ రీసర్వేను పక్కాగా నిర్వహించాలని మండల, గ్రామస్థాయిలో తహసిల్దార్లు సర్వేయర్లు, వీఆర్వోలను ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. బుధవారం భూముల రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అదనపు సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నక్కల ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇంచార్జి కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలు ఎక్కడా పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఫేజ్ 1 లో ఉన్న భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా ఈ నెలాఖరు లోపల పూర్తి చేయాలన్నారు. భూముల రీసర్వే లో రెవెన్యూ, సర్వే ల్యాండ్ శాఖల అధికారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు ఆధార్ అప్డేషన్ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి మురళీకష్ణ,జిల్లా వ్యవసాయ శాఖ జేడి చంద్రా నాయక్,రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవల్లో వేగం పెరగాలి ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరచుకొని జవాబుదారీతనంతో పనిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వీఆర్వోలు, సచివాలయ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీలు,మండల గ్రామ సర్వేయర్ల తో ఐవీఆర్ఎస్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నివేదికల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అందజేత, అర్జీలు పరిష్కారం చూపడంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ నివేదికలలో పనితీరు మెరుగ్గా లేని అధికారులపై తహసీల్దార్లు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ -
ఉప ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీ కై వసం
చాపాడు : మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్ష పదవి వైఎస్సార్సీపీ కై వసమైంది. ఎంపీటీసీ సభ్యులు బాలనరసింహారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్లవోలు ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షురాలు నగర్తి సుందరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఉప ఎంపీపీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. చియ్యపాడు ఎంపీటీసీ ఎస్ఆర్.బాలనరసింహారెడ్డిని ఉప ఎంపీపీగా మండల అధ్యక్షుడు తెలిదేల లక్షుమయ్య ప్రతిపాదించగా, చియ్యపాడు–2 ఎంపీటీసీ సుబ్బరామిరెడ్డి బలపరిచారు. వారితోపాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడంతో బాలనరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరకిషోర్, ఎంపీటీసీలు చాపాడుఆస్మ, పార్వతమ్మ, ఈశ్వరమ్మ, శివ, సీమోన్, రమాదేవి, అజ్మతుల్లా పాల్గొన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికై న ఎస్సార్ బాలనరసింహారెడ్డిని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్రెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, జయసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేష్యాదవ్, మనోహర్, రమేష్ తదితరులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సీతారామాపురం ఉప సర్పంచ్గా లక్ష్మీదేవి.. మండలంలోని సీతారామాపురం పంచాయతీ ఉప సర్పంచ్గా భూమిరెడ్డి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అనారోగ్యం కారణంగా ఉప సర్పంచ్ గుర్రప్ప తన పదవికి రాజీనామా చేయగా ఎన్నిక కమిషన్ బుధవారం ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించింది. ఎన్నికల అధికారి హరికృష్ణ పర్యవేక్షలో జరిగిన ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు మార్తల నరసింహారెడ్డి వర్గీయురాలు భూమిరెడ్డి లక్ష్మీదేవిని ఉప సర్పంచ్గా వార్డు మెంబర్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి, పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. బాలనరసింహారెడ్డిని ఎన్నుకున్న ఎంపీటీసీలు -
వృద్ధుడు అదృశ్యం
కడప అర్బన్ : కడప గౌస్ నగర్కు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్(65)గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు వృద్ధాప్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేదని అందులో పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 8555903070కు సమాచారం ఇవ్వాలని వారు విన్నవించారు. మైనర్ బాలికకు అంత్యక్రియలు జమ్మలమడుగు : గండికోటలో హత్య కాబడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్టవి అంత్య క్రియలు బుధవారం స్వగ్రామం హనుమనగుత్తిలో నిర్వహించారు. మంగళవారం రాత్రి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బుధవారం హనుమనగుత్తిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. బాలికను హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన ప్రొద్దుటూరు : బాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా నాయకులు గురమ్మ, రమాదేవి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో మహిళల హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, అభం, శుభం తెలియని చిన్నపిల్లలను చిదివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికను యువకుడు లోకేష్ గండికోటకు తీసుకుపోయాడని, అక్కడ ఆమె హత్యకు గురైందని తెలిపారు. ఆమెను ఎవరు హత్య చేశారనేది స్పష్టంగా ఇంతవరకూ బయటికి రాలేదని, రాజకీయాలకు లొంగకుండా ఆమెను చంపిన వారిని పోలీసులు త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు లక్ష్మీదేవి, ఝాన్సీరాణి, విజయకుమారి, కళావతి, మేరి, నీతమ్మ, అన్నమ్మపూర్ణ, సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయ్కుమార్, సాల్మన్, రాఘవ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ములకలచెరువు రాజా నగర్కు చెందిన గంగన్న కుమారుడు నరసింహులు(60) గత కొంతకాలంగా షు గర్, బీపీతోపాటు, కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంటి వద్దే సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
ఎస్ఈ రమణ కడప కార్పొరేషన్ : విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రమణ ఆదేశించారు. కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కడప డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలో సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఉత్పత్తి అనుకున్నంత మేర జరగదన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తు భద్రతా నియమాలు పాటించాలని, నిర్లక్ష్య ధోరణి వీడాలని సూచించారు. ఇండక్షన్ టెస్టర్ను ప్రతి ఒక్కరూ జేబులో ఉంచుకుంటే విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ పరిష్కరించాలని సూచించారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, రీ కనెక్షన్ వంటివి వినియోగదారులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ హరిసేవ్యానాయక్, సుబ్రహ్మణ్యం, రామచంద్రారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పొడిగింపు
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించిందని ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారీ రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుతాయన్నారు. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. ఎంప్లాయీస్ హె ల్త్ స్కీమ్ తరహాలో వైద్య సేవలు పొందవచ్చని, ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని పేర్కొన్నారు. నిర్దేశిత చికిత్సకు ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని వివరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియో గించుకోవాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్సైట్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ 8342–00–120–01–03–001–001డీడీవో కోడ్ 2703–0802–003 అనే పద్దుకు రూ.1250 చెల్లించి వచ్చే ఏడాది మార్చి 31 వరకు హెల్త్ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ జిరాక్సు, హెల్త్ స్కీమ్ దరఖాస్తు, కుటుంబ సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డు కాపీ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు కడప వైఎస్ఆర్ సర్కిల్ : క్రీడాకారులు ప్రతిభ చూపితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్ జిల్లా సెలెక్షన్స్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సుధీర్కుమార్, ఎన్.అనిల్ కుమార్, హరి, ఎం.గంగయ్య, తదితరులు పాల్గొన్నారు -
భార్య చేతిలో భర్త హతం
కడప అర్బన్ : రోజూ మద్యం తాగి అనుమానంతో గొడవపడడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య గోడకేసి తోసింది.. బలమైన దెబ్బ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కడపలో బుధవారం చోటుచేసుకుంది. కడప వన్టౌన్ పోలీసుల కథనం మేరకు..కడప నగరంలోని ఎర్రముక్కపల్లి బాల వికాస్ హైస్కూల్ వెనుక వీధిలో దేరంగుల సుబ్బరాయుడు(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య హరిత, కుమార్తె, కుమారుడు వున్నారు. ఈ క్రమంలో సుబ్బరాయుడు ప్రతి రోజూ మద్యం తాగివస్తుండడంతె భార్య హరిత గొడవపడేది. హరిత ఇంటి ప్రక్కనే ఆమె తల్లి, సోదరుడు హరికృష్ణ నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో దేరంగుల సుబ్బరాయుడు మద్యం తాగి భార్య హరితతో గొడవపడ్డాడు. అదే సమయంలో హరిత అన్న హరికృష్ణ వచ్చి ఎందుకు రోజూ మద్యం తాగి గొడవపడతావని నిలదీశాడు. వాగ్వాదం పెరగడంతో తన భర్తను హరిత గోడకేసి తోసింది. గోడ మోటు బలంగా తగలడంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప వన్టౌన్ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ ప్రతాప్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రోజూ మద్యం సేవించి వస్తున్నాడని వాగ్వాదం ఈ ఘటనలో భార్యతో పాటు, బావమరిది నిందితుడే -
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభు త్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాసులు, మున్సిపల్ వర్క ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.నాగేంంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజినీరింగ్ కార్మికుల నైపుణ్యం ఆధారంగా వేతనాలు చెల్లించలేదన్నారు. గతంలో సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం సరికాదన్నారు. ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం దారుణమన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం మంచిది కాదన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, మట్టి ఖర్చు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని హె చ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు నాగార్జున, వెంకటరమణ, డి.హరి, డి.నాగేంద్రబాబు, దేవమ్మ, చంద్రశేఖర్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
గండి ఉత్సవాలకు పక్కా ప్రణాళిక
చక్రాయపేట : గండిలో శ్రావణ మాసోత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పాలకమండలి సభ్యులు సహకరించాలని ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య విజ్ఙప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణపై చైర్మన్ కావలి కృష్ణతేజ అధ్యక్షతన గండి క్షేత్రంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాజగోపురం నిర్మాణం నేపథ్యంలో ఇరుకుగా ఉన్న రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యను ఆయన కోరారు. ప్రతి శనివారం భక్తుల రద్దీని బట్టి అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్ వద్దే వాహనాలు ఆపేయాలని, ట్రాఫిక్ ఆంక్షలు విధించడమేగాక, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటుచేస్తామని సీఐ వివరించారు. ఉత్సవ సమయంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటామని చక్రాయపేట వైద్యాధికారిణి వాణి చెప్పారు. విద్యుత్తు, నీటి సమస్య, బారికేడ్లు, క్యూలైన్లు, దుకాణాల నిర్వహణ, అలంకరణ, రవాణా సౌకర్యాలు, అగ్నిమాపక శాఖ పాత్రలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కేసరి, రాజా రమేష్, పాలకమండలి సభ్యులు రాశినేని మధు, పబ్బతి బిందుసాగర్, కొండారెడ్డి, మాజీ చైర్మన్ వెంకట స్వామి, అధికారులు పాల్గొన్నారు. టెండర్లు మళ్లీ వాయిదా గండి ఆలయ పరిధిలో టోల్గేట్ వసూలుకు నిర్వహించిన టెండర్లు మూడో సారీ వాయిదాపడ్డాయి. ధరావత్తు చెల్లించిన వారు వేలం పాడకపోవడంతో నిలిపివేసినట్లు ఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పుష్పాలంకరణ నిమిత్తం పూలు సరఫరా చేసే హక్కు పొందే టెండర్కు హెచ్చు పాట పాడిన మల్లికార్జునకు టెండరు ఖరారు చేశామని ఆయన తెలిపారు. -
సమస్య పరిష్కరించుకునే ప్రక్రియే మధ్యవర్తిత్వం
కడప అర్బన్ : కక్షి దారుల సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియనే మధ్యవర్తిత్వం అంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కడపలో నిర్వహించిన వన్ కే వాక్ఙ్ ర్యాలీని బుధవారం పచ్చజెండా ఊపి ఆమె ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ కూడలి నుంచి న్యాయ సేవా సదన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంతుకు ముందు ర్యాలీని ప్రారంభించిన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని మాట్లాడుతూ మధ్యవర్తి అంగీకార పత్రంలో షరతులను కక్షిదారులకు వివరించి స్పష్టంగా ఒప్పంద పత్రాన్ని తయారుచేస్తారని, ఇది ఆంతరంగికమైన ప్రక్రియ అని వివరించారు. ఈ స్వచ్ఛంద ప్రక్రియకు నిర్దిష్టమైన ఆదేశిక నియమాలు లేవని, ఏడాది పొడవునా చేసుకునే ప్రక్రియ అని వివరించారు. ఈ కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీనబాబు, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాఫకృద్దీన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జి.సి.ఆసిఫా సుల్తానా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.ఈశ్వర్ వెంకటప్రసాద్, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రెటరీ చంద్ర వదన, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ హరిబాబు, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్యానల్ న్యాయవాదులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. వన్కే వాక్ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
ఇందిరానగర్లో ఇంటి స్థలాల కబ్జా
చింతకొమ్మదిన్నె : కడప సమీపంలోని ఇందిరానగర్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జాకు తెగబడుతున్నారు. అధికారపార్టీ పెద్దల పేర్లు చెప్పి పార్కు, హౌసింగ్, ప్రజావసరాలకు రిజర్వు చేసిన స్థలాలను చదును చేసేస్తున్నారు. తమ సొంత భూముల్లా ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కబ్జాదారులు, అధికార నేతల పేర్లు చెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇందిరానగర్ వాసులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 732లో హౌసింగ్కు రిజర్వు చేసిన స్థలానికి అధికార పార్టీ నాయకులు బోగస్ డి.పట్టా సృష్టించి ప్లాట్లు వేశారు. ఒక్కో రూ.4 లక్షల ధర చెప్పి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం సాయంత్రం చింతకొమ్మదిన్నె రెవెన్యూ అధికారుల వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని, సిబ్బందిని పంపి ప్రభుత్వ స్థలంలో వేసిన ప్లాట్ల రాళ్లను తొలగించడం జరిగిందన్నారు. -
కరుణ చూపని కూటమి
● అంత పెద్ద ప్రమాదం జరిగికూలీలు చనిపోయినా ప్రకటించని పరిహారం ● రెక్కాడితే కానీ డొక్కాడని యానాదుల కుటుంబాలను ఆదుకోని ప్రభుత్వం సాక్షి, రాయచోటి: రెడ్డిపల్లి చెరువుకట్టపై సోమవారం రాత్రి లారీ బోల్తా పడి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శెట్టిగుంట గిరిజన కాలనీకి చెందిన 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు మామిడి కాయల కోతకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారిని కూటమి ప్రభుత్వం ఆదుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రి బిసి జనార్ధనరెడ్డి వచ్చి పరామర్శతో సరిపుచ్చారే తప్ప ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించలేదు. రైల్వేకోడూరు కూటమి నాయకులు రూపానందరెడ్డి అరకొరగా ఖర్చుల నిమిత్తం ఇచ్చారే తప్ప ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఎవరూ ప్రకటించలేదు. ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? ఒకేసారి ప్రమాద ఘటనలో 9 మంది కూలీలు చనిపోగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ ప్రమాదం జరిగిన ఒకరోజో, రెండ్రోజుల్లోపు బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేస్తాయి. అయితే ఘటన జరిగినా మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు కూటమి సర్కార్ నుంచి పరిహారపు మాటేలేదు. అడవిలో దొరికే పదార్థాలతో పాటు కూ లి పనులకు వెళితే తప్ప జీవితం గడవని పేద కూలీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, రేణిగుంటకు చెందిన వారు పనుల కోసం వలస వచ్చి మృత్యువాతపడటం అందరినీ కలిచివేసింది. గాయపడిన వారు కూడా రాజంపేట ఆసుపత్రి నుంచి అలాగే గాయాలకు కట్లుతోనే సోమవారమే వెళ్లిపోయారు. ప్రభుత్వం అత్యుత్తమ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోకపోగా పరిహారపు మాట ఎత్తకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.ఎదురుచూపులుశెట్టిగుంట గిరిజన కాలనీ ఇంకా ప్రమాద సంఘటన నుంచి కోలుకోలేదు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చనిపోయిన వారందరూ కాలనీలోని వారికి అంతా బంధువులే కావడంతో వారి బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చనిపోయి న కుటుంబాలతో పాటు గాయపడ్డ వారికి కూటమి సర్కార్ వెంటనే ఆర్థికసాయం అందించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కడప అర్బన్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పలు దొంగతనాలు చేసిన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగ గజ్జల శ్రీనివాస్ (47)ను అరెస్టు చేయడంతోపాటు మరో బాల నేరస్తున్ని అదుపులోకి తీసుకున్నట్లు కడప డీఎస్పి ఏ. వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను తెలియజేశారు. గజ్జల శ్రీనివాస్పై ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 15 కేసులు ఉన్నాయన్నారు. చలమారెడ్డి పల్లి ఎమ్మెస్సార్ హిల్స్లోని ఒక ఇంటిలో, కడప పాత బైపాస్ రోడ్డులోని వెంకట సాయినగర్లోని 2 ఇళ్లలో, సాయి నగర్లో ఒక ఇంటిలో చోరీ చేశాడన్నారు. కొన్ని రోజులుగా జరిగిన దొంగతనాలకు సంబంధించిన చోరీ సొమ్మును అతని వద్ద నుంచి పూర్తిగా రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో ఒక జత బంగారు బుట్ట కమ్మలు, ఒక బంగారు ఉంగరం, ఒక కేజీ 500 గ్రాముల వెండి వస్తువులు, మోటార్ సైకిల్, ఆరు చేతి గడియారాలు, రెండు కెమెరాలు ఉన్నాయని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడ ప ఆర్చి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి ఇంకొక బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకొని ఈ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయ డంలో కృషి చేసిన కడప చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ జి.ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర్రెడ్డి, రవికుమార్, సీసీఎ స్ సిబ్బందిని, ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ చంద్రమోహన్, సుదర్శన్రెడ్డి, ఏఎస్ఐ సుబ్బరాజు, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుల్ ఖాదర్ హుస్సేన్, శ్రీనివాసులు, మాధవరెడ్డి, సుధాకర్ యాదవ్ నాగరాజులను కడప డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం సిఫార్సు చేసినట్లు వివరించారు. ఈ కేసు ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. 1.5 కేజీల వెండి, బంగారు స్వాధీనం -
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి
జమ్మలమడుగు : ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల గ్రామంలోని కృష్ణానగర్కు చెందిన సువార్తమ్మ(35) డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టాలని, డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడిని కోరింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టలేక.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు చీరెతో ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. అయితే చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని కల్లమల్ల పోలీసులు పేర్కొన్నారు. కందుల నాని అలియాస్ ఓబుల్రెడ్డి దౌర్జన్యం – కందుల రాజమోహన్రెడ్డి తనయుడు కందుల మురళీమోహన్రెడ్డిపై దాడి కడప అర్బన్ : కందుల రాజమోహన్రెడ్డి తనయుడు బీజేపీ నేత కందుల మురళి మోహన్రెడ్డి (42)పై కేఎస్ఆర్ఎం గ్రూప్ అఫ్ కాలేజెస్ చైర్మన్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనలో బీజేపీ నేత కందు మురళీమోహన్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ముక్కు, ఎడమ కంటికి గాయాలయ్యాయి. ఇంకా శరీరమంతా దెబ్బలు తగిలాయి. గాయపడిన కందుల మురళీమోహన్రెడ్డిని వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మురళీమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరం రాజారెడ్డి వీధిలోని కందుల రెసిడెన్సీలో 105 ప్లాట్లో తాను వుంటున్నానని, అదే అపార్ట్మెంట్లో 6వ అంతస్తులో కందుల చంద్రఓబుళరెడ్డి అలియాస్ నాని నివాసం వుంటున్నాడన్నారు. అదే ఇంటిలో తన పెద్దమ్మ వుంటున్నారని మంగళవారం ఉదయం వాళ్లింటికి తాను కాఫీ తాగేందుకు, టిఫిన్ తినడానికి వెళ్లి మంచిచెడ్డలు పలుకరింపుగా వెళ్లానన్నారు. అదే సమయంలో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. కందుల చంద్ర ఓబుళరెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ సంఘటనపై అతనిపై, బాధ్యులైన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ఒన్టౌన్ సీఐ బి.రామకృష్ణ తెలియజేశారు. తీవ్రంగా గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న మురళీమోహన్రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బా రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, ఇతర బీజేపీ నాయకులు, బంధువులు, స్నేహితులు వచ్చి పరామర్శించారు. -
సొమ్మొకరిది.. సోకొకరిదన్నట్లు ఎమ్మెల్యే వ్యవహారం
● 13 నెలల్లో నగరపాలక సంస్థకు నయాపైసా నిధులు తేలేదు ● మేం ప్రతిపాదించి, ఆమోదించిన పనులకు శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటు ● తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మేయర్ సురేష్బాబు ● 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్ల పనులకు శంకుస్థాపన కడప కార్పొరేషన్ : ‘సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి వ్యవహారం ఉంది’ అని మేయర్ సురేష్ బాబు విమర్శించారు. మంగళవారం 5,9,10, 11,12,13, 14, 20, 21,23, 24 డివిజన్లలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్లతో చేపడుతున్న పనులను ఆయన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలతో కలిసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2014–19 వరకూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అప్పుడు కూడా జిల్లా అభివృద్ధికి గానీ, కడప నగరాభివృద్ధికి గానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలవున్నా నగరపాలక సంస్థకు నయాపైసా నిధులు ఇవ్వలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం కింద నిధులు మంజూరైతే డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించగా, తాము సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు. డిసెంబర్ 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేసి 15వ ఆర్థిక సంఘ పనులు ప్రతిపాదించిన అజెండా పేపర్లను చించి వేశారని, ఇప్పుడేమో ఆ పనుల ప్రారంభోత్సవాలకు పాలవర్గ సభ్యులను గానీ, మేయర్గా తనను గానీ పిలవకుండా ఏకపక్షంగా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందిందంటే అది వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిల వల్లేనన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధికి రూ.2400 కోట్లు విడుదల చేశారన్నారు. నగరంలో ఏడు రహదారులను విస్తరించి సుందరీకరణ చేశామని, రూ.57 కోట్లతో బుగ్గవంక వాల్ను పూర్తి చేసి, 40 అడుగులతో అప్రోచ్ రోడ్లు మంజూరు చేశామన్నారు. రూ.78 కోట్లతో వరదనీటి కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్మెల్యే మాధవి బంధువు కావడం వల్ల .. అంతా ఆమె చెప్పినట్లు జరుగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కడప నగరానికి రూ.10 కూడా మంజూరు చేయలేదని, ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులను జీవోలు, తేదీలు మార్చి తమ ఘనతగా చెప్పుకోవడం దారుణమన్నారు. బుగ్గవంకపై నాగరాజుపేట, షామీరియా మసీదుల వద్ద బ్రిడ్జిలకు గత ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తే.. గెలిచిన వెంటనే ఆ బ్రిడ్జిల వద్దకు పోయి ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇంతవరకూ చేయలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని ఎమ్మెల్యే బెదిరించారని, ఆ టెండర్లన్నీ నలుగురికే కట్టబెట్టారన్నారు. కార్పొరేషన్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు మేయర్ను, కార్పొరేటర్లను పిలవకుండా.. వార్డు మెంబర్గా గెలవలేని వారితో టెంకాయలు కొట్టించడం అన్యాయమన్నారు. శిలాఫలకాల కోసం, అందులో తన పేరు కోసం ఎమ్మెల్యే పాకులాడుతున్నారే తప్ప, ప్రజా సమస్యలపై కాదన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, మల్లికార్జున, గంగాదేవి, వై.మాధవి, కె.బాబు, మేసా ప్రమీలరాణి, రామలక్ష్మణ్రెడ్డి, షఫీ, డివిజన్ ఇన్చార్జులు బండి ప్రసాద్, మేసా ప్రసాద్, ఐస్క్రీం రవి, వైఎస్సార్సీపీ నాయకులు పి.జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, యానాదయ్య, గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గ్రామస్థాయికి జన్ సురక్ష పథకాలు
కడప సెవెన్రోడ్స్: జన సురక్ష పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని బోర్డు రూమ్ కాన్ఫరెన్స్ హాల్లో జన్ సురక్ష పథకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఈ నెల నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కు సంబంధించి సంబంధిత అధికారులతో తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లి నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి, వారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆదేశించారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాల ఈ కేవైసీ చేయనివారిని గుర్తించి ఈ కేవైసీ అప్డేషన్ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు. డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు,లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, నాబార్డ్ ఏజిఎం విజయ విహారి, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జెడ్పి డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకే పీ4 రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే ద్వారా గుర్తించామన్నారు. తుది జాబితాను తయారు చేసేందుకు గ్రామ వార్డు సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణకు 17వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ నెల 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీవోలు , రాష్ట్ర సమగ్ర టీమ్ ప్రతినిధి సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ● జులై నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ క్యాంపెయిన్ ● ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు క్రిష్ణవేణి, మూలే సరస్వతితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన నాయకులు రాళ్లు, కట్టెలు, బండరాళ్లతో దాడులు చేయడం హేయమన్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. కాకినాడ జీజీహెచ్లో ఓ వైద్యుడు 32 మంది విద్యార్థినుల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదన్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గానీ, డిప్యూటీ సీఎం గానీ, హోంమంత్రి గానీ స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని, మహిళలపై దాడులు జరక్కుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గవర్నర్ జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, బి.మరియలు, సుశీలమ్మ, తులశమ్మ, నారాయణమ్మ, మల్లీశ్వరి, సుజిత, పద్మ, శివమ్మ పాల్గొన్నారు. -
వైవీయూలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2025– 26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం వైవీయూలోని ప్రిన్సిపల్ చాంబర్లో పలువురు డీన్లతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)– 2020ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో భాగంగా బీఎస్సీ(హానర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్, ఎర్త్ సైన్స్ కోర్సులలో త్వరలో ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఎస్సీ(ఆనర్స్) ఫిజిక్స్ సబ్జెక్టుతోపాటు కంప్యూటర్ సైన్స్, నానో–సైన్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, టెక్నాలజీలను విద్యార్థులు ఎంపిక చేసుకొని చదివే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ (ఆనర్స్) రసాయన శాస్త్రం మేజర్ సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు అప్లికేషన్ కెమికల్ సైన్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ చదవచ్చన్నారు. బీకాం (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ ప్రధాన అంశంగా కలిగి ఉందన్నారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, డీన్ ఫర్ అకడమిక్ అఫైర్స్ చంద్ర ఓబులరెడ్డి, డీవోయే డైరెక్టర్ టి లక్ష్మి ప్రసాద్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య విజయభారతి తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..
శవమై వచ్చావా తల్లీ! ● బాలిక కుటుంబంలో తీరని విషాదం ● ఇలాంటి వాళ్లతో ఆడపిల్లలకు రక్షణ ఉండదు ● వీళ్లను ఎన్కౌంటర్ చేయాలి : బాలిక తండ్రి కొండయ్య ఆవేదన ● ముందు రోజు సాయంత్రంప్రొద్దుటూరులో మిస్సింగ్ కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం: ‘అమ్మా కాలేజీకి వెళ్లాలి త్వరగా టిఫిన్ పెట్టు.. వస్తున్నా... ఇదిగో పట్టు నేనే తినిపిస్తా.. ఇక చాలమ్మా.. కాలేజీకి టైం అయింది. నేను వెళ్లాలి..’ఇది కూతురు.. ఆమె తల్లి మధ్య జరిగిన చివరి సంభాషణ. బ్యాగ్ తీసుకొని కుమార్తె కాలేజీకి బయలుదేరింది. వీధి చివర వరకు తల్లి అలానే చూస్తూ ఉండిపోయింది. అలా కళాశాలకని వెళ్లిన బాలిక కొన్ని గంటల్లోనే శవమై కనిపించింది. ● ఎర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆతనికి భార్య దస్తగిరమ్మతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె స్థానికంగా ఉన్న ప్రైవేట్ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మరో కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. వీళ్లకు ప్రొద్దుటూరులోని సార్వకట్టవీధిలో సొంత ఇళ్లు ఒకటి ఉంది. గ్రామం నుంచి కాలేజీకి వెళ్లిరావడానికి కూతురికి ఇబ్బందిగా ఉందని భావించి ఆర్నెళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. కుమార్తె కాలేజీకి రాలేదని ఫోన్ రావడంతో.. సదరు బాలిక సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి కళాశాలకు వెళ్లింది. ప్రతి రోజు ఆమెను సోదరుడు కాలేజీకి తీసుకెళ్లేవాడు. అతను ముందురోజే చైన్నెకి వెళ్లడంతో..బాలిక ఒంటరిగా కాలేజికి వెళ్లింది. డ్వాక్రా సంఘానికి సంబంధించిన సమావేశం ఉండటంతో తల్లి దస్తగిరమ్మ కొద్దిసేపటి తర్వాత స్వగ్రామమైన హనుమనగుత్తికి వెళ్లిపోయింది. తండ్రి కొండయ్య కూడా బేల్దారి పని కోసం ఉదయాన్నే ఎర్రగుంట్లకు వెళ్లాడు. ఈ క్రమంలో వారి కుమార్తె కాలేజీకి రాలేదని సుమారు 9.30 గంటల సమయంలో కొండయ్యకు ఫోన్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులందరూ వెంటనే కళాశాల వద్దకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. అయితే హనుమనగుత్తికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం ఉండటంతో అతని గురించి ఆరా తీశారు. తమ సొంత బంధువుల ద్వారా అతని కదలికల గురించి తెలుసుకున్నారు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు తమ కుమార్తె కనిపించకపోవడానికి హనుమనగుత్తికి చెందిన లోకేష్ అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని భావించిన కొండయ్య కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రికి రాత్రే లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాలికను గండికోటకు తీసుకెళ్లిన మాట నిజమేనని అతను పోలీసుల వద్ద అంగీకరించాడు. రాత్రంతా గండికోటలో గాలింపు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు లోకేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం రాత్రి పోలీసులు అతన్ని గండికోటకు తీసుకెళ్లారు. అక్కడి రెస్టారెంట్ రూములతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించారు. గ్రామస్తుల సహాయం తీసుకొని రాత్రంతా గాలించినా బాలిక ఆచూకి లభించలేదు. దీంతో పొద్దుపోయిన తర్వాత పోలీసులు గండికోట నుంచి వచ్చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం బాలిక మృతదేహం గండికోటలోని ముళ్లపొదల్లో ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తమ కుమార్తె శవమై పడి ఉందని తెలియడంతో కుటుంబ సభ్యులు విలపించసాగారు. బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున వారి ఇంటి వద్దకు వచ్చి ఓదారుస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఎన్కౌంటర్ చేయాలి ‘ఇలాంటి వాళ్లతో ఆడపిల్లలకు రక్షణ ఉండదు. వీళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా ఎన్కౌంటర్ చేసి పడెయ్యాలి.. జైళ్లలో పెట్టి ఏళ్ల తరబడి ఈ మృగాలను మేపడం వృధా.. వెంటనే మరణ దండన విధించాలి.. మీ చేత కాకుంటే చెప్పండి నేనే చంపేస్తా’అంటూ బాలిక తండ్రి కొండయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తాం కడప కార్పొరేషన్: కడప జిల్లా గండికోటలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురికావడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మహిళలు, బాలికలపై హత్యలకు, హత్యాచారాలకు పాల్పడితే సహించేది లేదని, ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టంచేశారు. -
వివాదాస్పద ఫ్లెక్సీ కేసులో ఇద్దరు అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కేసులో డాక్టర్తోపాటు ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమానిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ రాత్రి దాదాపు 7 గంటల సమయంలో కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ వద్ద ‘ఎంత పని సేచ్చివయ్య జగనూ’ అని హెడ్డింగ్ పెట్టి 12 పాయింట్స్ కలిగిన ఒక బ్యానర్ను చైన్నె చిల్డ్రెన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నారపురెడ్డి నాగార్జునరెడ్డి, గ్లేస్ ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమాని అమృతరాజు ఏర్పాటు చేశారన్నారు. ఈ బ్యానర్ను పరిశీలించగా అందులో రెండు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి, ఘర్షణ వాతావరణం సృష్టించి ప్రజా శాంతికి, లా అండ్ ఆర్డర్కు భంగం కలిగించే విధంగా ఉండటంతో.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై వచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు క్రైం నంబరు 148/2025, యు/ఎస్ 61(2) 325 ఆర్–డబ్ల్యు 3(5) బి.ఎన్.ఎస్ కింద వన్టౌన్ పోలీసు స్టేషన్లో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి వారిని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఎవరైనా కానీ తమకు గల వాక్ స్వాతంత్రపు హక్కును దుర్వినియోగం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్లను తయారు చేయకూడదని ఫ్లెక్సీ ప్రింటింగ్ తయారీ యజమానులకు డీఎస్పీ సూచించారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్లు తయారు చేయాలని మీ వద్దకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్కు తెలియజేయాలన్నారు. బ్యానర్ కింద ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఫోన్ నంబరును తప్పకుండా ముద్రించాలన్నారు. -
ఓపెన్ ఇంటర్కు దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్– 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ సూర్యారావు తెలిపారు. ఓపెన్ ఇంటర్ ద్వారా రెండేళ్ల కోర్సును ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఒక వేళ ఆన్లైన్లో నమోదు చేయలేకపోతే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 21న ఇంటర్వ్యూలు ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో గెస్ట్ అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ అర్హత కలిగి ఉర్దూ మాధ్యమంలో బోటనీ, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థు లు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులు ఈనెల 19లోపు దరఖాస్తులను కళాశాల ఆఫీసులో అందజేయాలని తెలిపారు. ఈనెల 21న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. నేడు దర్గా స్వామి జయంతి రామాపురం (రాయ చోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట సమీపంలోని దర్బార్ సాయినగర్లోని సాయి విద్యామందిర్లో ఈ నెల 16న సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ దర్గా స్వామీజీ 95వ జయంతి వేడుకలు చేపడు తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయంతి ఉత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. వెబ్సైట్లో పీఎఫ్ వివరాలు కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రజా పరిషత్తు యాజమాన్య పరిధిలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది 2023–24వ సంవత్సరానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు జిల్లా పరిషత్తు డిప్యూటి సీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. వివరాలకు https://www.zppysrkadapa.com/ portal/pf-slips సందర్శించాలని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఒక నెలలోపు రాత పూర్వకంగా కార్యాలయంలో అందజేస్తే పరిష్కరిస్తామని వివరించారు. చెన్నేపల్లి పాఠశాల సందర్శన అట్లూరు: అట్లూరు మండల పరిధిలోని చెన్నేపల్లి ప్రాధమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ ఆకస్మిక తనికీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈఓ పాఠశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న చెన్నేపల్లి కాలనీ వాసులు అక్కడకు చేరుకున్నారు. ‘అయ్యా మా పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు తరలించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. అలా జరిగితే మాపిల్లలను మేం పంపియ్యం.. 5వ తరగతి వరకూ మా కాలనీలోనే చదువు చెప్పాలి’ అని విన్నవించారు. స్పందించిన డీఈఓ ఈ విషయం ఇదివరకే తన దృష్టికి వచ్చిందని.. ఈ సమస్య గురించి విద్యాశాఖ జాయింట్ డైరెక్టరుకు పంపించామని.. అక్కడ నుంచి ఉత్తర్వులు అందే వరకూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగుతుందని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి –1,2 విలియంరాజు, ఖాదర్వల్లి, సీఆర్పీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. 20న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లెలో ఉన్న బీవీఎన్ పాఠశాలలో ఈనెల 20వ తేదీ ఉమ్మడి వైఎస్సార్జిల్లా స్థాయిలో ప్రేమ్చంద్ హిందీ భవన్ సొసైటీ ఆధ్వర్యంలో హిందీ వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్చంద్ 146వ జయంతిని పురస్కరించుకొని ‘ప్రేమ్చంద్కి జీవని’ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రేమ్చంద్ జయంతి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు 6303701314 నంబర్కు ఫోన్ చేసి తమపేర్లను నమోదు చేసుకోవాలన్నారు. -
ముగిసిన హుసేని పీర్ దర్గా ఉరుసు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గా వీధిలో వెలసిన హుసేనిపీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు మంగళవారం నిర్వహించిన తహలిల్ ఫాతిహతో ముగిసాయి. ఇందులో భాగంగా సాయంత్రం స్వామి వారసులు స్వామి సమాధికి పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారసులతోపాటు శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్గా ఆవరణలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో స్వామి నాల్గవ, ఐదవ తరం వారసులు మున్వర్బాష, సలీం, దర్గారహమతుల్లా, దర్గాషఫివుల్లా, దర్గాకరీముల్లా, ఆర్గనైజర్లు షరీఫ్, అంజాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏసీఏ పోటీల్లో చిత్తూరు జట్టు విజయం కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లో మూడవ రోజైన మంగళవారం కడప జట్టుపై చిత్తూరు జట్టు 5 పరుగులతో విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 193 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 85 ఓవర్లకు 239 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని క్యాశప్రెడ్డి 37 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని జయప్రకాశ్ 3, దినేష్ 3, తేజేష్ 2 వికెట్లు తీశారు. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 139 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 239 పరుగులు మాత్రమే చేసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులు చేసిన విషయం తెలిసిందే. -
కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా?
కడప కార్పొరేషన్ : ప్రభుత్వ విప్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చిపోయారు. సచివాలయ ఉద్యోగి అయిన వీఆర్ఓపై నోరుపారేసుకున్నారు. పది మంది చూస్తుండగానే ‘నీవు కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా’ అని వీఆర్వోపై మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు– ఇంటింటికీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 30వ డివిజన్లో ప్రభుత్వ విప్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఇటీవల తన రేషన్ కార్డులో ఉన్న అమ్మానాన్నలను తొలగించి.. తమ భర్త, పిల్లలతో రేషన్ కార్డు చేయించాలని వీఆర్ఓ మహేందర్ను ఆశ్రయించింది. ఆయన డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని కలవాలని సూచించారు. కాగా సదరు సెక్రటరీ ఆ ఫ్యామిలీకి హెడ్ అయిన భర్త వేలిముద్రలు కావాలని చెప్పడంతో.. ఆమె మళ్లీ వీఆర్ఓ వద్దకు వచ్చి చెప్పింది. ఈ విషయం 30వ డివిజన్లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవికి తెలియడంతో ఆమె చిర్రెత్తిపోయారు. ‘రేషన్ కార్డులో ఏం సమస్య ఉందో చెప్పి పరిష్కరించడమే నీ పని.. నీలాంటి బ్రోకర్లను పెట్టుకొని నడుపుతున్నారు. కార్పొరేటర్ పేరు రాసి ఆయన్ను కలువు.. పో అంటావా.. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా? నగర ప్రజలు కార్పొరేటర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలా.. వాళ్లింటి దగ్గర కూర్చొని వారు రేషన్ కార్డులిస్తే తీసుకోవాలి’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో నివ్వెరపోయిన వీఆర్ఓ తాను అలా అనలేదని చెబుతున్నా వినకుండా నోర్మూయ్ అంటూ ఎమ్మెల్యే మాధవి గదమాయించారు. సాక్షాత్తు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర సమక్షంలో పది మంది ముందూ ఇలా ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అంటూ పరుష పదజాలం ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి. వీఆర్ఓపై టీడీపీ ఎమ్మెల్యే మాధవి దుర్భాషలు తాను అలా అనలేదని వీఆర్ఓ చెబుతున్నా.. నోర్మూసుకో అంటూ గదమాయింపు -
గండికోటలో దారుణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం అడ్డగింత
చింతకొమ్మదిన్నె : పవర్ గ్రిడ్ సంస్థ చేపట్టిన అనంతపురం– కడప 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణపు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని అభ్యంతరం తెలుపుతూ రైతులు పనులు అడ్డుకున్నారు. చింతకొమ్మదిన్నె చెరువులో పవర్ గ్రిడ్ సంస్థ చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ టవర్ నిర్మాణ ప్రాంతానికి వారు సోమవారం చేరుకుని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి నిర్మాణాన్ని నిలుపుదల చేయించారు. విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం తయారు చేసిన డిజైన్ కడప– రాయచోటి జాతీయ రహదారి వెంట ఉన్న పొలాల్లో 3 కిలోమీటర్లకుపైగా వెళ్తోందని వారు తెలిపారు. జాతీయ రహదారికి సమాంతరంగా పొలాల మీదుగా విద్యుత్ లైన్ల టవర్ల నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ లోపభూయిష్టమైన డిజైన్ల తయారీ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఏడాది క్రితమే పవర్ గ్రిడ్ సంస్థ అధికారులను అనంతపురం, గుత్తి, కడప కార్యాలయాలలో సంప్రదించి అర్జీలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అప్పుడే కడప జిల్లా కలెక్టర్కు కూడా గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన పక్కా వ్యాపార సంస్థ అయిన పవర్ గ్రిడ్ సంస్థ అత్యంత విలువైన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొలాల మీదుగా నిర్మాణానికి లోపభూయిష్టమైన డిజైన్లు తయారు చేయడంతో కోట్లాది రూపాయల విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు, చదువులు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొలుములపల్లె పంచాయతీ పాలకవర్గం, అధికారులు కూడా ఇదివరలోనే తమ గ్రామ పొలాల మీదుగా హై టెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ రెజూల్యూషన్ కూడా పాస్ చేసి పవర్ గ్రిడ్ అధికారులకు అందజేశారని తెలిపారు. నెల క్రితం కూడా కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, చింతకొమ్మదిన్నె మండల తహసీల్దార్ నాగేశ్వరరావు సమక్షంలో క్షేత్రస్థాయి పర్యటనకు పవర్ గ్రిడ్ అధికారులు వచ్చినప్పుడు కూడా అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి తమ బాధను అర్థం చేసుకుని కడప నగర అభివృద్ధికి కూడా ఆటంకంగా ఈ విద్యుత్ లైన్ల నిర్మాణపు డిజైన్ ఉందని భావించి.. వారు సమీపంలోనే ఉన్న చింతకొమ్మదిన్నె చెరువు నుంచి గుట్టపై నుంచి పవర్ గ్రిడ్ కార్యాలయం వరకు విద్యుత్ లైన్ల నిర్మాణానికి రీడిజైన్ చేసుకోవాల్సిందిగా పవర్ గ్రిడ్ అధికారులకు సూచించారని తెలిపారు. అనుమతి లేకుండా.. అయినా పవర్ గ్రిడ్ అధికారులు తీరు మార్చుకోక ఇటీవల తిరిగి రెవెన్యూ అధికారులకే పాత డిజైన్ మేరకు నిర్మాణం చేపట్టేందుకు పోలీసు భద్రత కల్పించాల్సిందిగా చింతకొమ్మదిన్నె తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొలుములపల్లి గ్రామ పొలంలో నష్టపోతున్న రైతులు, చింతకొమ్మదిన్నె రైతులు సోమవారం చింతకొమ్మదిన్నె చెరువులో అక్రమంగా ఎటువంటి పర్మిషన్ ఇరిగేషన్ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్న హైటెన్షన్ విద్యుత్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుని అధికారులతోనే నిలిపి వేయించారు. ఇప్పటికై నా పవర్ గ్రిడ్ అధికారులు, వారి ఉన్నతాధికారులు స్పందించి హై టెన్షన్ విద్యుత్ లైన్ల లోపభూయిష్టమైన డిజైన్లు మార్పు చేసుకుని సమీపంలోని గుట్టలపై నుంచి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. అలా జరగకపోతే తాము ప్రాణాలు సైతం త్యాగం చేసైనా సరే.. విద్యుత్ లైన్ల నిర్మాణాలను తమ భూముల నుంచి వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. డిజైన్ లోపభూయిష్టంగా ఉందని రైతులు అభ్యంతరం డిజైన్ మార్చే వరకు అనుమతించబోమని అల్టిమేటం -
క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి
మృతులు చెంచమ్మ(54), చిట్టమ్మ(30), వి. శ్రీను(28), గజ్జలగంగమ్మ(33), గజ్జలదుర్గయ్య(37), ముని చంద్ర(26), రాధమ్మ (31), జానీ (15), సుబ్బరత్నమ్మ (31) (ఫైల్) సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్ : అమాయక గిరిజనులు...పొట్టకూటి కోసం.. రోజువారి కూలీ కోసం ఊరుగాని ఊరొచ్చారు. ఎంతోకొంత సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు. ఆ ఆశలపై విధి చిన్నచూపు చూసింది. ప్రమాదమై దూసుకొచ్చి విషాదగీతిక రాసింది. రాజంపేట–రైల్వేకోడూరు మధ్యలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లె చెరువుకట్టపై జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. వారి వేదన...అరణ్య రోదన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట యానాదుల కాలనీలో బాధిత కూలీల కుటుంబాల రోదన అరణ్య వేదనగా మారింది. ఓ వైపు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే...తెల్లవారిన అనంతరం మృతదేహాల వద్దకు వారు వచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా బంధువులే. ఒకరునొకరు వరుసకు సోదరుడు, బావమరిది, చిన్నమ్మ, భర్త ఇలా... ఒకరినొకరితో బంధుత్వాలు కలిగి ఉన్నారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద వివరాల కోసం సమాచారం అడుగుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కాలనీలో కన్నీటి ఘోష రైల్వేకోడూరు పరిధిలోని యానాదుల కాలనీలో కన్నీటి ఘోష కనిపిస్తోంది. కాలనీకి చెందిన 9 మంది మృతి చెందడం, మరో 13 మందికి గాయాలు కావడంతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోయింది. కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటారని అనుకుంటున్న తరుణంలోనే ఇలా ఒక్కసారిగా ఉపద్రవం ముంచుకొచ్చిందంటూ తలుచుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. పొట్టకూటికోసం వచ్చి.... అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట ఎస్టీ కాలనీలోకి కొంతమంది యానాదులు పనుల కోసం వలస వచ్చారు. ప్రధానంగా వెంకటగిరి, రేణిగుంట పరిధిలోని రెండు గ్రామాలకు చెందిన సుమారు 20–30 కుటుంబాలు పనుల కోసం వచ్చాయి. పొట్టకూటికోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పనుల కోసం వలసవచ్చి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతరవైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఇంత పెద్ద ఘటన జరగడం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంపై మండిపడ్డారు. వెంటనే ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అతివేగమే ప్రాణం తీసిందా రెడ్డిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ప్రాణం తీసిందని తెలుస్తోంది. దీనికి తోడు కూలీలను తీసుకెళ్లే మేసీ్త్ర, వ్యాపారులు పని చేయించుకొని వారిని వదిలేశారు. వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయకుండా రాత్రి వేలలో నిబంధనలకు విరుద్ధంగా అంత మందిని లోడ్ పైన ఎక్కించి ప్రయాణం చేయించడంపై బాధితుల బంధువులు మండిపడుతున్నారు. అనాథలైన పిల్లలు గజ్జల గంగమ్మ, దుర్గయ్యలు ప్రమాదంలో మృతి చెందడంతో వారిపిల్లలు సునీతమ్మ, రాజీ, గంగయ్యలు అనాథలయ్యారు. మృతదేహాలవద్ద వారి తాత పిల్లలను ఓదార్చలేక పోయాడు. ఒకే చోట అంత్యక్రియలు ఆఊరికి ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది. ఒకేమారు నలుగురు మృతి చెందడం మృతదేహాలను ఖననం చేయడానికి గుంతలు తీయడానికి సమయం సరిపోలేదు. దీంతో జేసీబీతో గుంతలు తవ్వి ఖననం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి రాజంపేట : పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలకు ఇలా జరగడం చాలా బాధకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తునన్నారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న త్వరగా కోలుకోనే విధంగా వైద్య సేవలందించాల న్నారు. కన్నీటిలో శెట్టిగుంట ఎస్టీ కాలనీ ఎవరిని కదిపినా కన్నీరే రాజంపేట హాస్పిటల్లో పూర్తయిన పోస్టుమార్టం రాజంపేట : రెడ్డిపల్లె చెరువుపై ఆదివారం లారీబోల్తా సంఘటనలో క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్ధన్రెడ్డి అన్నారు. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో ఉన్న క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరిగిన ప్రమాదసంఘటనపై సీఎంతో మాట్లాడనన్నారు. సీఎం సూచన మేరకు క్షతగాత్రులను పరామర్శించామన్నారు. బాధితు కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టరు శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జి ముక్కారూపానందరెడ్డి, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమరి జగన్మోహన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అదృశ్యం
ముద్దనూరు : మండలంలోని ఆకుతోటపల్లె గ్రామానికి చెందిన దేనేపల్లె అంకాలమ్మ (32)కనిపించకపోవడంతో సోమవారం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంకాలమ్మకు ఆంజనేయులు అనే వ్యక్తితో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. గత కొద్ది కాలం నుంచి ఆమె పులివెందులలోని కుట్టు శిక్షణకు వెళ్తోంది. రోజూ మాదిరిగానే ఈనెల 9వ తేదీన ఉదయం కుట్టు శిక్షణకు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. సోమవారం అంకాలమ్మ సోదరుడు నల్లబల్లె వీరాంజినేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యమైలవరం : మండల పరిధిలోని ధన్నవాడ గ్రామానికి చెందిన పెద్ద పాపిరెడ్డి అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధన్నవాడ గ్రామానికి చెందిన పాపిరెడ్డి 10 ఎకరాల భూమిని సాగు చేస్తుండగా.. అందులో మిరప పంట వేసి నష్టాలు వచ్చాయి. అదే విధంగా ఆయనకు అనారోగ్య రీత్యా కూడా హాస్పిటల్లకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. దీంతో పంటలకు సరియైన గిట్టుబాటు ధరలు లేక అప్పులు ఎక్కువ కావడంతో మండల పరిధిలోని దొమ్మరనంద్యాల రెవెన్యూ పరిధిలో ఉన్న ప్లాట్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఎంత సేపటికి ఫోన్ చేస్తున్నా తీయక పోవడంతో.. ఉదయం వాకింగ్ వెళ్లిన ప్రదేశాల్లో బంధువులు గాలించడముతో మృతి చెందిన పాపిరెడ్డి కనిపించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దుర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో ని మార్చురీలో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచారు. మృతుడికి 38 ఏళ్లు ఉంటాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. అతను ఈ నెల 7న అనా రోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది ఎంఎం–3 వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆస్పత్రిలోని ఔట్పోస్టు అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. 20న బ్యాడ్మింటన్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలను ఈ నెల 20వ తేదీన పులివెందులలోని వైయస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ సింగం భాస్కర్రెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 19 బాల బాలికలకు, అలాగే సీనియర్స్ విభాగంలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. సింగిల్స్, డబుల్ విభాగంలో విడివిడిగా పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేస్తామన్నారు. అండర్ 19 విభాగంలో పాల్గొనదలచు క్రీడాకారులు 2007 జనవరి 1న తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్స్ విభాగంలో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారులు తమ ఎంట్రీలను ఈనెల 18వ తేదీ సాయంత్రం లోపు చేసుకోవాలన్నారు. డబుల్ విభాగంలో పార్ట్నర్ పేరు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలచు క్రీడాకారులు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల లోపు హాజరు కావలసి ఉంటుందన్నారు. వివరాలకు 9440107080, 9440223908 నంబర్లకు సంప్రదించాలని వివరించారు. -
బౌలర్ల ధాటికి బ్యాటర్ల విలవిల
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీడే మ్యాచ్లు రెండవ రోజు కొనసాగాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కర్నూలు–నెల్లూరు జట్లు ఆడుతుండగా.. నెల్లూరు జట్టుపై కర్నూలు జట్టు 26 పరుగులతో విజయం సాధించింది. సోమవారం 81 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు కర్నూలు బౌలర్ల ధాటికి 50.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. కర్నూలు జట్టులోని పి.వివేక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. యూహాస్ 4 వికెట్లు తీసి చక్కగా బౌలింగ్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు నెల్లూరు బౌలర్ల ధాటికి కేవలం 29.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. నెల్లూరు జట్టులోని నేత్ర నంద తన చక్కటి బౌలింగ్తో 5 వికెట్లు తీశాడు. సుదాంత్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 43 ఓవర్లకు 94 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కర్నూలు జట్టులోని రుత్విక్ కళ్యాణ్ 5 వికెట్లు, యూహాస్ 3 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజే కర్నూలు జట్టు 26 పరుగులతో విజయం సాధించింది, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన కడప–చిత్తూరు జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్లో 299 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో సోమవారం రెండవ రోజు మ్యాచ్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 71.4 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎండి షారుఖ్ అక్తర్ 183 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లతో 222 పరుగులు చేశాడు. కడప జట్టులోని గైబు 3 వికెట్లు, హితేష్ 4 వికెట్లు, తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 67 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ జట్టులోని సియండి పైజాన్ 58, పర్హాజ్ ఖాన్ లోడి 48 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని జయప్రకాశ్ 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.నెల్లూరు జట్టుపై కర్నూలు విజయం -
వైభవంగా హుసేనిపీర్ దర్గా ఉరుసు
వేలాదిగా తరలివచ్చిన భక్తులుబద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గావీధిలో వెలసిన హుసేని పీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు స్వామి ఐదవ తరం వారసులు మున్వర్బాషా, సలీం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉరుసు సందర్భంగా బద్వేలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలిరావడంతో దర్గా ఆవరణమంతా భక్తులతో కిక్కిరిసింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామి వారసులు గంధం ఎత్తుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా వెళ్లి స్వామి సమాధికి ఎక్కించి అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ఆవరణలో మొక్కుబడి ఉన్న భక్తులు అన్నదానం నిర్వహించారు. చివరిరోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉరుసు సందర్భంగా రాత్రి ఏర్పాటు చేసిన ఖవ్వాలి కార్యక్రమం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే పకీరుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వామి వారసులు దర్గారహమతుల్లా, దర్గాషఫివుల్లా, దర్గాకరీముల్లా, ఆర్గనైజర్లు షరీఫ్, అంజాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా పుష్పయాగం
– ముగిసిన సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలిరేకులు వంటి వివిధ రకాల పుష్పాలు, తులసి, మరువం, ధవనం వంటి ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం పాల్గొన్నారు. -
ఎర్రచందనం కేసుల్లో నిందితుడిపై అటవీ అధికారుల దాడి
మైదుకూరు : ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఇడగొట్టు నాంద్రపై సోమవారం అటవీ అధికారులు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తనపై అటవీ అధికారులు దాడి చేశారంటూ బాధితుడు రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం జీవీ సత్రంలో సోమవారం నాగేంద్ర మరొక వ్యక్తితో కలిసి కారులో వెళుతుండగా అటవీ అధికారులు వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. నాగేంద్ర పక్కనున్న వ్యక్తి పారిపోగా అటవీ అధికారులు నాగేంద్రపై దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితున్ని అటవీ అధికారులే తమ వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్య పరీక్షల్లో నాగేంద్ర కుడికాలు ఎముక విరిగినట్టు గుర్తించిన ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు పంపారు. అటవీ అధికారులు తనపై దాడి చేసినట్టు రిమ్స్ ఔట్ పోస్టులో నాగేంద్ర ఫిర్యాదు చేశాడు. నాగేంద్రపై దాడి చేయలేదు : ప్రొద్దుటూరు డీఆర్ఓ ఎర్రచందనం కేసుల్లో నిందితుడుగా ఉన్న నాగేంద్రపై దాడి చేయలేదని ప్రొద్దుటూరు డీఆర్ఓ లక్ష్మీకుమారి పేర్కొన్నారు. జీవీ సత్రంలో జరిగిన సంఘటన అనంతర ఆమె వివరణతో కూడిన వీడియోను విడుదల చేశారు. అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించగా కారులోని వ్యక్తులు దిగి పారిపోబోయారని తెలిపారు. అందులో ఒకరు పారిపోగా కాలు మడతపడి గాయంతో నాగేంద్ర పట్టుబడ్డాడని పేర్కొన్నారు. వనిపెంటకు చెందిన నాగేంద్ర పలు రేంజ్లలో ఐదారు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడని తెలిపారు. మల్లేపల్లె వద్ద ఎర్రందనం దుంగల స్టాక్ ఉందని దుంగలను తరలించేందుకు తాము తాడిపత్రి నుంచి వాహనాన్ని తీసుకుని వచ్చినట్టు విచారణలో నాగేంద్ర తమకు వెల్లడించాడని డీఆర్ఓ తెలిపారు. పారిపోయిన వ్యక్తి పేరు పవన్కుమార్రెడ్డిగా పేర్కొన్నట్టు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగేంద్ర ఇప్పుడు కూడా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు వచ్చి పట్టుపడ్డాడని వివరించారు.రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసిన బాధితుడు -
చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం!
కడప కోటిరెడ్డిసర్కిల్ : చిన్నారుల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్ఠికాహారాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది పోయి.. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నాసిరకం కందిపప్పును సరఫరా చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే దుస్థితి నెలకొంది. పురుగులతో బూజు పట్టిన కందిపప్పును సరఫరా చేయడంపై చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైఎస్సార్ జిల్లాలో 2389 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 1,02,235 మంది చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. అలాగే 13,256 మంది గర్భిణులు, 13,719 మంది బాలింతలు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం పౌష్ఠికాహారం అందజేసేందుకు బాల సంజీవిని పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పది రకాల నిత్యావసర సరుకులను అందజేస్తారు. అందులో బియ్యం మూడు కేజీలు, కందిపప్పు ఒక కిలో, నూనె 500 ఎంఎల్, 25 కోడిగుడ్లు, ఐదు లీటర్ల పాలు, 2 కిలోల రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల బెల్లం, ఎండు ఖర్జూరాలు 250 గ్రాములు, వేరుశనగ చిక్కీలు 250 గ్రాములు అర్హులైన ప్రతి లబ్ధిదారు ఇంటికి సరఫరా చేస్తారు. ఈ పంపిణీలో భాగంగా ఇటీవల కూటమి ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు కందిపప్పును సరఫరా చేసింది. ఇలా సరఫరా చేసిన కందిపప్పు పురుగు పట్టి నాసిరకంగా ఉండడం అనేక విమర్శలకు తావిస్తోంది. కమీషన్ల కోసం కక్కుర్తి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది. పౌష్ఠికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిపోయి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం కక్కుర్తిపడి పురుగు పట్టిన నాసిరకం కందిపప్పును కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలనలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 13 అంగన్వాడీ కేంద్రాలు 2389 చిన్నారులు 1,02,234 గర్భిణులు 13256 బాలింతలు 13,719 అంగన్వాడీలకు పురుగుల కందిపప్పు పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులునాణ్యమైన సరుకులు ఇవ్వాలి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసే పౌష్ఠికాహారం నాణ్యతగా ఉండాలి. కూటమి ఫ్రభుత్వంలో కందిపప్పు నాసిరకం ఉంది. నిత్యావసర సరుకులను సకాలంలో అందించడంతోపాటు నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తే మాకు తిప్పలు తప్పుతాయి. ఈ విషయంగా ప్రభుత్వం సత్వరమే స్పందించాలి. – మంజుల, రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్, కడప -
అమ్మా... ఎందుకు ఏడుస్తున్నావు!
ఈ ఫొటోలో వీల్చైర్లో కూర్చొన్న మహిళ పేరు విజయలక్ష్మి . మామిడి పండ్లు లోడింగ్ చేసేందుకు భార్య,భర్త వెళుతూ చిన్నపిల్లలైన గంగోత్రి, చెంచితలను కూడా తీసుకెళ్లారు. అనుకోని ప్రమాదం ఎదురు కావడంతో విజయలక్ష్మి తన పిల్లలు ఇద్దరినీ గట్టిగా పట్టుకుని పడిపోయింది. దీంతో పిల్లలకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదంలో భర్త శ్రీనివాసులు మృతి చెందాడన్న వార్త జీర్ణించుకోలేకపోతోంది. విజయలక్ష్మికి గాయాలు కావడంతో నడవలేని స్థితిలో ఉంది. మరోవైపు విజయలక్ష్మి తండ్రి వెంకటయ్యకు కూడా చేయి విరగడంతో ఎదురుగా కూర్చొని విలపిస్తున్నాడు. ఏమీ తెలియన చిన్నారులు మాత్రం నాన్న లేరన్న విషయం తెలియక అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వారు కూడా ఏడుస్తున్నారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సోమవారం కనిపించిన ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. -
అంజన్న మూలవిరాట్ దర్శనమే లక్ష్యం
చక్రాయపేట : శిలాఫలకాల్లో పేర్లు వేయుంచు కోవాలన్నది మా ఉద్దేశం కాదని, భక్తులకు వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం కల్పించాలన్నదే ముఖ్యమని గండి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ టీడీపీ నేతలకు సూచించారు. గండిలో ఆలయ పాలకమండలి సభ్యులతో కలిసి సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేంపల్లె మండల టీడీపీ ఇన్చార్జి రఘునాథరెడ్డి గండి ఆలయాన్ని శనివారం పరిశీలించి విలేకరుల సమావేశంలో తమపై పలు ఆరోపణలు చేశాడన్నారు. ఆలయం పనులు సుమారు 95 శాతం పూర్తయ్యాయని, పునఃప్రతిష్ట చేసి భక్తులకు శ్రావణ మాసం నాటికి మూల విరాట్ దర్శనం కల్పించాలని గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవ దాయ శాఖమంత్రి, కమిషనర్, బీజేపీ, కాంగ్రెస్, నేతలతోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమ విన్నపాలకు స్పందించి విచారణ నిమిత్తం ఆర్జేసీ, కలెక్టర్, డిప్యూటీ కమిషనర్లు గండికి వచ్చి శ్రావణ మాసం నాటికి పునఃప్రతిష్ట జరిపించాలని ఆదేశించారని చెప్పారు. ఆగిన పనులు తమ విన్నపాలతోనే ఊపందుకున్నాయని చెప్పారు. తాము కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. పునః ప్రతిష్టకు సంబంధించి కనీసం 6 అడుగుల ప్రాకారం, దీప స్తంభం ఉండాలని, బలిపీఠం కావాలని అధికారులు చెప్పారని తెలిపారు. వారు చెప్పినట్లు ప్రాకారం 6 అడుగులు, దీపస్తంభం ఉందని, బలిపీఠం ఒక్కటే లేదని చెప్పారు. నాలుగేళ్లుగా భక్తులకు మూల విరాట్ దర్శనం లేదని ఇప్పుడైనా ఆ అవకాశం కల్పించాలని తాపత్రయ పడుతున్నామని చెప్పారు. రాజీనామా చేయాలనడం భావ్యం కాదు గతంలో టీడీపీకి చెందిన వెంకటస్వామి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేశారని టీడీపీ వారు పేర్కొంటున్నారని తెలిపారు. అది వెంకట స్వామి వ్యక్తిగత విషయం అన్నారు. ఆయన రాజీనామా చేశారని ఈ రోజు తాము రాజీనామా చేయాలనడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమకు ఉన్న పదవీ కాలం వరకు కొనసాగుతామని, రాజీనామా కోరడం భావ్యం కాదని ఆయన టీడీపీ నేతలకు హితవు చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు బోరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు బ్రహ్మానందరెడ్డి, వేముల మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసంలో కల్పించేందుకు ఏర్పాట్లు ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ -
బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
– జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కడప అర్బన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక( పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం ) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి 180 పిటీషన్లు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా ిపీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆచూకీ తెలపరూ..
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎన్జీఓ కాలనీలో వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా నివాసం వుంటున్న పోకూరు యమున (28)తన ఇద్దరు కుమార్తెలు పోకూరి సింధూరి (9), పోకూరి కుసుమాంజలి (6)లు జూన్ 24వ తేదీ నుంచి కనిపించడం లేదని భర్త పోకూరు సురేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్రెడ్డి తెలియజేశారు. జూన్ 23వ తేదీన యమున, తన కుమార్తెలతో కలిసి రాత్రి 11:30 గంటల సమయంలో తనతోపాటు ఇంటిలో నిద్రించారని, 24వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో తాను లేచి చూస్తే కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత అన్ని చోట్ల వెతికామని, కనిపించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పై వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా కింది సెల్నెంబర్లు: సీఐ 9121100520, ఎస్ఐలు 9121100521, 9121100522 లకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఎరువు దుకాణాల తనిఖీప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మైదుకూరు రోడ్డులోని మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణ యజమాని హోల్సేల్కు సంబంధించిన ఎరువులను రీటైల్ దుకాణంలో ఉంచి అమ్మకాలు జరుపుతున్నట్లు వారు గుర్తించారు. సుమారు రూ.13 లక్షల విలువ చేసే హోల్సేల్ ఎరువుల అమ్మకాలను అధికారులు నిలుపుదల చేశారు. అలాగే ఎరువుల దుకాణాల లైసెన్స్లను, రికార్డులను, నిల్వలను పరిశీలించారు. ఈ దాడులలో కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ ఏడీఏ ఎస్.వెంకటేశ్వర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ పి.మల్లికార్జున రావు, కడప జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ టెక్నికల్ ఏఓ గోవర్ధన్, ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి వరిహరికుమార్ పాల్గొన్నారు. -
● రాజోలికి జలకళ
కృష్ణా జలాలతో రాజోలి ఆనకట్ట జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు రాజుపాళెం మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఆనకట్ట నుంచి కుందూనదిలోకి 4479 క్యూసెక్కులు నీరు పోతోందని కేసీ కెనాల్ అధికారులు వెల్లడించారు. కేసీ ప్రధాన, చాపాడు కాలువలకు నీరు అధికారికంగా విడుదల చేయలేదని తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీటితడులు అందించగా పత్తి, వరి పంటలను సాగు చేసుకునేందుకు రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. – రాజుపాళెం -
తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం బయటపడింది. అదే విధంగా పురాతనమైన రోలు వెలుగుచూసింది. దీంతో గ్రామస్తులు, రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతడాలుగా తాళ్లపాక చెరువు వద్దకు చేరుకున్నారు. శివలింగానికి అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం స్వామి పూజలు నిర్వహించారు. తాళ్లపాక చెరువులో వెలుగులోకి వచ్చిన పురానత శివలింగంపై బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్నాయుడు, రిటైర్డ్ పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇక్కడతవ్వకాలు చేపడితే చరిత్ర బయపడుతుందన్నారు. తాళ్లపాక చెరువు అభివృద్ధిలో భాగంగా శివాలయం కూడా నిర్మితం చేసే విధంగా టీటీడీ యోచించాలన్నారు. -
‘మధ్యవర్తిత్వం’ ప్రచారంపై శ్రద్ధ వహించాలి
కడప అర్బన్ : దేశం కోసం మధ్యవర్తిత్వంపై ప్రచారం, అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని అన్నారు. సోమవారం రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారంగా జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్ ద్వారా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి దిశానిర్దేశం చేశారు. కూడళ్లు, దిశా పోలీస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేయించాలన్నారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయించాలన్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వారాంతపు రోజున 16వ తేదీన మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ర్యాలీలు, వన్కే వాక్తోపాటు, బహిరంగ సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
చక్రస్నానం..సర్వపాపహరణం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో చివరిఘ్టమైన చక్రస్నానం ఆదివారం వైభవంగా నిర్వహిచారు. ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథడికి గ్రామోత్సవం.. వసంతోత్సవాల నడుమ జరిగింది. ఆలయంలో ఉత్సవమూర్తులకు గంధం, పాలు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫలాలతో అభిషేకం భక్తిశ్రద్ధలతో జరిపారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు ఉత్సవమూర్తులకు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానం అనేది బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనది. కోనేటిలో స్వామి స్నానం ఆచరించిన తర్వాత ముగినిన వారి పాపాలు తొలగుతాయని, మోక్షం లభిస్తుందని పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
కార్మికుల సమ్మె బాట
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ కార్మికులు శనివారం అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సుమారు నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కార్మికులు చివరి అస్త్రంగా సమ్మెబాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి సేవలు బంద్ అయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. కొళాయిల్లో నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల కోసం పరుగులు పెడుతున్నారు. కడప నగర పరిధిలో సుమారు 400 మంది ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో కడప నగరానికి ప్రధానంగా తాగునీటిని సరఫరా చేసే గండి, లింగంపల్లి పంపింగ్ స్కీంల వద్ద ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాగునీరు, వీధి దీపాల నిర్వహణ కోసం నగరపాలక అధికారులు సచివాలయ ఉద్యోగుల ద్వారా తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. పంపిణీ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి: ఎస్ఈ తాగునీటి పంపింగ్ వ్యవస్థ సక్రమంగా ఉందని, ఫిట్టర్లు అంతా సమ్మెలోకి వెళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో సమస్యలు వస్తున్నాయని నగరపాలక ఎస్ఈ చెన్నకేశవరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బందితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. లింగంపల్లి పంపింగ్ స్కీమ్ వద్ద పోలీసు బందోబసు సిద్దవటం : మండలంలోని లింగంపల్లి పెన్నానది నుంచి కడప నగరానికి పంపింగ్ స్కీమ్ ద్వారా వెళ్లే మంచి నీటి ట్యాంకు వద్ద ఎస్ఐ మహమ్మద్రఫీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంటు ఏఈ అంజనీకుమార్, స్థానిక పోలీసులు రాఘవ, కిరణ్, కుమార్ పాల్గొన్నారు. డిమాండ్లపై స్పందించని ప్రభుత్వం మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనాలు పెంచాలని, కార్మికుల రిటైర్మెంట్ను 62 ఏళ్లకు పెంచి, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నా రు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 12వ తేది అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామని ముందే తెలియజేసినప్పటికీ తమతో చర్చించి సమ్మె నివారణ యత్నాలు చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చించి సమ్మె నివారణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 12 నుంచి ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ బంద్ ప్రజా సమస్యలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
సెయింట్ లూయిస్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
రాజంపేట : యూఎస్ఏలోని సెయింట్ లూయిస్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శనివారం రాత్రి వైఎస్సార్సీపీ యువనేత చిల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ఆయన మానవతాస్ఫూర్తి గురించి కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు మాట్లాడారు. గతంలో 2007లో వైఎస్సార్ సెయింట్ లూయిస్ పర్యటనలో ఇదే కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారని ప్రవాసాంధ్రులు గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, కడప మోహన్రెడ్డి తమ మధుర జ్ఞాపకాలను, వైఎస్సార్ జీవితంలో చిరస్మరణీయ ఘట్టాలను పంచుకున్నారు. వైఎస్సార్ జయంతి సభ వీక్ ఎండ్స్లో చేయాల్సి వచ్చిందన్నారు. చికాగో, మెంఫిస్, కాన్సాస్ వంటి నగరాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారన్నారు. సభలో కన్వీనర్ సుబ్బారెడ్డి, పమ్మి, సందీప్, రాఘవరెడ్డి, నవీన్, గూడువల్లి, మహేష్, గోపాల్, తాటిపర్తి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హుసేనిపీర్ దర్గా ఉరుసు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గా వీధిలో వెలసిన హుసేనిపీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు స్వామి ఐదవ తరం వారసులు మున్వర్బాషా, సలీం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కుల, మతాలకు అతీతంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ ఉరుసు మహోత్సవంలో.. బద్వేలు నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిందూ, ముస్లిలు అఽధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు దర్గా ఆవరణలో అన్నదానం నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారికి గంధం ఎక్కించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్వామి వారసులు దర్గా రహమతుల్లా, దర్గా షఫివుల్లా, దర్గా కరీముల్లా, ఆర్గనైజర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇల్లు ఖాళీ చేయించారని..
ప్రొద్దుటూరు క్రైం : పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడి మనుషులమంటూ కొందరు వ్యక్తులు.. ఓ ఇంట్లోకి ప్రవేశించి భార్యా భర్తలపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. అలాగే ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో దంపతులిద్దరూ ప్రాణభయంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. తిరిగి భర్తపై దాడి చేయడంతో తీవ్ర మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాధితుడు మల్లికార్జునుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రమాదేవి మిట్టమడివీధిలో నివాసం ఉంటున్నారు. తమకు తెలిసిన సందీప్కుమార్రెడ్డి అనే వ్యక్తికి డబ్బు అవసరం కావడంతో.. తమ ఇంటిని 2014లో ఇద్దరు వ్యక్తులకు కుదవ పెట్టి రూ. 23 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సందీప్కుమార్రెడ్డికి ఇచ్చారు. ఆరు నెలల్లో డబ్బు ఇస్తానని చెప్పిన అతను.. తర్వాత పత్తా లేకుండా పోయాడు. తాము మోసపోయామని, తీసుకున్న మొత్తం ఇస్తామని చెప్పినా ఇంటిని తనఖా పెట్టుకున్న వ్యక్తులు అంగీకరించలేదు. అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన పంచాయితీ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ నెలలో సింహాద్రిపురం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ప్రమీలాదేవి దంపతులను బెదిరించి వారిపై దాడి చేశారు. ఇంటి నుంచి బయటికి పంపించారు. ఈ ఘటనపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులపై దాడి చేయడంతో.. ఇదిలా ఉండగా సింహాద్రిపురం మండలానికి చెందిన ఒక వ్యక్తి చొరవతో ప్రమీలాదేవి దంపతులు తిరిగి వారి ఇంట్లోకి వెళ్లారు. అయితే రెండు రోజులు కూడా గడవక ముందే.. గతంలో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వచ్చి తిరిగి వారిపై దాడి చేశారు. ఇంటికి తాళం వేసి వాళ్లను బయటకు గెంటేశారు. దీంతో ప్రమీలాదేవి దంపతులు ప్రాణభయంతో పోట్లదుర్తిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మల్లికార్జునుడు మరో వ్యక్తితో కలిసి ప్రొద్దుటూరులోని మున్సిపల్ పార్కు వద్దకు వెళ్లాడు. సింహాద్రిపురం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి రావడంతో మల్లికార్జునుడు వారిని చూసి భయంతో పరుగులు తీశాడు. ఈ విషయాన్ని అతను భార్య ప్రమీలాదేవికి చెప్పగా భయం, మనస్తాపంతో అదే రోజు రాత్రి ఆమె వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమీలాదేవి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై బాధితులు ఔట్పోస్టులో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంలకు వేడుకోలు రెండు రోజుల క్రితమే ప్రమీలాదేవి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లను వేడుకున్నారు. డబ్బులు కడతామని చెప్పినా సింహాద్రిపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మూడంతస్తుల ఇంటిని స్వాధీనం చేసుకొని దౌర్జన్యంగా బయటికి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఏడాది నుంచి ఎన్నో సార్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె రోదించసాగారు. ఎవరూ తనకు న్యాయం చేయలేదని, తాను చివరి స్టేజీలో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ విలపించారు. నిజానిజాలు తెలుసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత రెండు రోజులకే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. నేనెప్పుడు వాళ్లను స్టేషన్కు పిలిపించలేదు ఈ విషయమై వన్టౌన్ సీఐ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా.. ప్రమీలాదేవి దంపతులను తానెప్పుడు స్టేషన్కు పిలిపించలేదన్నారు. తాను రాకముందు నుంచి వారి ఇంటికి సంబంధించిన సమస్య నడుస్తోందని తెలిపారు. తాను ఎవ్వరినీ కొట్టలేదని సీఐ వివరణ ఇచ్చారు.మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం -
కన్నీటి వీడ్కోలు
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి..త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైస్కూల్లో చదివి పుల్లంపేటలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు. కబళించిన రోడ్డు ప్రమాదం ఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైల్వేకోడూరు రోడ్డు ప్రమాద మృతులకు ఘన నివాళి రెండు నెలల్లో వివాహం.. అంతలోనే మృత్యు ఒడికి మరణంలోనూ ఒక్కటై.. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు -
కడప పాఠశాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పాలక సంస్థ పరిధిలోని సాయిపేట 8వ వార్డు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ (మెగా పీటీఎం 2.0) సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఫొటో ఫ్రేమ్ రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన చిత్రానికి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం లభించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పోర్టల్లో ముఖచిత్రంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల ఫొటో చిత్రాన్ని తన స్టేటస్తోపాటు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాది నాగరాజుతోపాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. -
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీడే మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఆదివారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కర్నూలు జట్టు 74 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ జట్టులోని దైవిక్ 58, రోహిత్ గౌడ్ 34 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుశాంత్ 4, రిత్విక్ రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 26 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 38.4 ఓవర్లకు 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 56 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని తేజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5, దినేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 51 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. ఎండి షారుఖ్ అక్తర్ 167 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేశాడు. తనీశ్వర్ టెండూల్కర్ 46 పరుగులు చేశాడు. దీంతో చిత్తూరు జట్టు 160 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికల్లో కడప జిల్లాకు చెందిన పూర్వజ రెడ్డి అండర్–15, 17 విభాగాలలో సింగిల్స్ విజేతగా నిలిచి సత్తాను చాటినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు జిలానీబాషా తెలిపారు. ఆదివారం నగరంలోని డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్–15 బాలుర విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన క్రీడాకారులు రాణించి మొత్తం జిల్లా జట్టులోని స్థానాలను కై వసం చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారన్నారు. అండర్–15, 17 విభాగాలలో జరిగిన ఈ ఎంపికలో బాలబాలికలకు విడివిడిగా సింగిల్స్, డబుల్స్లో పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ సభ్యులు గంగాధర్, నాగరాజు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, విశ్వనాథరెడ్డి జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు వీరే.. అండర్ 15 బాలురు జట్టు – డి.ఈశ్వర్ ప్రసాద్రెడ్డి, చంద్రకిషోర్, ిపీబీజీ వర్షిత్ (ప్రొద్దుటూరు) అండర్ 15 బాలికల జట్టు – ఎల్.పూర్వజరెడ్డి, బి.హరిణి, రితిక, కావ్య (కడప) అండర్ 17 బాలుర జట్టు – వేద వ్యాస్ వర్మ, ఎల్ సుప్రీత్రెడ్డి (కడప) సి.విశ్వతేజ (ప్రొద్దుటూరు) అండర్ 17 బాలికల జట్టు – రమ్యశ్రీ (ప్రొద్దుటూరు) ఎల్.పూర్వజ, కావ్య, రితిక (కడప) -
మూఢనమ్మకాలు వీడాలి.. శాసీ్త్రయంతో ముందుకెళ్లాలి
కడప ఎడ్యుకేషన్ : మూఢ నమ్మకాలు వీడి, శాసీ్త్రయ ఆలోచనలతో ముందుకెళ్లాలని జేవీవీ జాతీయ ఉపాధ్యక్షుడు బి.విశ్వనాథ్ పేర్కొన్నారు. కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ సురేష్కుమార్ అధ్యక్షతన జేవీవీ రాష్ట్ర మహాసభలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సమావేశంలో బి.విశ్వనాథ్ మాట్లాడుతూ నేటి స్పీడు యుగంలో కూడా చేతబడుల వంటి మూఢాచారాలతో ప్రాణాలను తీయడం వంటి సంఘటనలు బాధాకరమని అన్నారు. ముఖ్యంగా మేధావులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు మూఢాచారాల నిర్మూలనలో ప్రధాన భూమిక పోషించాలని అన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక పోరాడుతోందన్నారు. ముఖ్యంగా బాలబాలికల సంపూర్ణ ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ తదితరాల కోసం జేవీవీ ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర కోశాధికారి పి.సనావుల్లా మాట్లాడుతూ భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక అవసరం సమాజానికి మరింతగా ఉందన్నారు. నేటి యువతరం ముందుకు వచ్చి జేవీవీ ఆశయాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. జేవీవీ సలహా మండలి సభ్యులు కె.సురేష్బాబు, ప్రముఖ వైద్యులు ఫారుఖ్, రామగోపాల్, రాజా వెంగళరెడ్డి, ఓబులరెడ్డి, రమణయ్య, అశోక్ కుమార్, అవ్వారు అర్జున్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమని, అనారోగ్యం వస్తే తక్షణమే సరియైన చికిత్స తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, సుధాకర్రెడ్డి, రామారావు, మురళీధర్, సుదర్శన్, వరలక్ష్మి, మీన, సుజాత, స్వరాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. మహాసభల్లో జేవీవీ రాష్ట్ర నాయకులు పి.సుబ్బరాజు నరసింహారెడ్డి, సుబ్బారావు, బాలాజీ, జిల్లా నాయకులు రాంబాబు, భాస్కర్, శ్రీరాములు, నాగార్జునరెడ్డి, సుధాకర్, గౌరీశంకర్, ఎల్లేశ్వరరావు, మహబూబ్బాషాతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జేవీవీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు : మండల పరిధిలోని టీచర్స్ కాలనీ వెనుక ఉన్న వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వక్ఫ్బోర్డుకు సంబంధించి మూడు ఎకరాల స్థలం ఉండగా అధికార పార్టీకి చెందిన కొంత మంది స్థలాన్ని లీజుకు తీసుకుని ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కొంత స్థలాన్ని లీజుకు తీసుకోగా మరికొంత స్థలాన్ని అనధికారికంగా వినియోగిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ స్థలంలో ఉన్న టైర్లతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు ఉవ్వెత్తున లేచాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలను తీసుకొచ్చి సాయంత్రం వరకు మంటలను అదుపు చేశారు. వక్ఫ్బోర్డు అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి
బద్వేలు అర్బన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న హెడ్కానిస్టేబుల్ ఎం.లక్ష్మినారాయణ శనివారం మృతి చెందారు. 1990 బ్యాచ్కు చెందిన లక్ష్మినారాయణ (హెచ్సి 1180) బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో పనిచేస్తూ బదిలీల్లో భాగంగా బద్వేలు అర్బన్ స్టేషన్కు నియమితులయ్యారు. గత నెల 11వ తేదీన విధుల్లో చేరేందుకు తాను నివాసమున్న కమలాపురం నుండి ఖాజీపేట మీదుగా బద్వేలుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాజీపేట సమీపంలోని ఆంజనేయకొట్టాలు వద్ద చెట్టుకొమ్మ విరిగి లక్ష్మినారాయణపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కొద్దిరోజుల పాటు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఇటీవలే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ కూడా కోలుకోలేక శనివారం మృతి చెందారు. మోపెడ్పై నుంచి పడి భర్త మృతిబ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లి పంచాయతీ శ్రీరామ్ నగర్ వద్ద శనివారం సాయంత్రం టీవీఎస్ మోపెడ్పై వెళుతున్న భార్యాభర్తలు ప్రమాదవశాత్తు కింద పడడంతో భర్త సుబ్బరాయుడు (65) మృతి చెందాడు. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలో సుబ్బారాయుడు కుమారుడు నాగార్జునాచారి వెల్డింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, ఆయన భార్య వచ్చారు. శనివారం సాయంత్రం తిరిగి టీవీఎస్ మోపెడ్పై వారి గ్రామానికి వెళ్తుండగా టీవీఎస్ మోపెడ్కు సుబ్బరాయుడు భార్య చీర చుట్టుకోవడంతో ఒక్కసారిగా ఇద్దరు కింద పడ్డారు. అప్పటికే సుబ్బరాయుడు తలకు పెద్ద గాయం కావడంతో రక్తనాళాలు చిట్లాయి. 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తీసుకెళ్తుండగా మృత్యువాతపడ్డాడు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు మైదుకూరు : మైదుకూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని శనివారం నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జీవీ సత్రంలో నివాసం ఉంటున్న ఈ టీడీపీ నాయకుడికి, నంద్యాలకు చెందిన ఓ పోలీసు అధికారి కుమారునికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి కాంట్రాక్టు పనులు చేయగా డబ్బు విషయమై గతంలో పంచాయితీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ విషయంలోనే టీడీపీ నాయకుడిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీ సత్రానికి సమీపంలోని టీ స్టాల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తొలుత కుటుంబ సభ్యులు కిడ్నాప్గా భావించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైదుకూరు ప్రాంతంలో కలకలం రేగింది. పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలుసిద్దవటం : ఎగువపేటలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ముగ్గురికి కాటు వేసింది. ఎగువపేట మఠంవీధిలో శనివారం సాయంత్రం తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కరిచింది. అలాగే పోలీసు లైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడిని, మెయిన్ బజారులో తేజా అనే యువకుడిని కూడా కరిచింది. భార్యకు స్వల్ప గాయాలు -
ప్రమాదవశాత్తు మంటలు..
మోటార్ బైకు, ఇతర సామగ్రి దగ్ధం వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో మోటార్ బైకు, వాకిళ్లు, మోటార్తోపాటు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. శనివారం మధ్యాహ్నం వేంపల్లెలోని రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో నుండి పొగ వ్యాపిస్తుండటంతో అ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ఇంటి ఆవరణంలో ఉన్న మోటార్ బైకు, మరుగుదొడ్లకు చెందిన వాకిళ్లు, కిటికీలు, తాగునీటికి చెందిన మోటార్ పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితుడు గోవర్దన్ మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ఇంటి లోపల ఉన్న వడ్ల బస్తాలు అగ్ని ప్రమాదంలో కాలిపోలేదన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేక ఇంటి సమీపంలో ఉన్న టైర్లకు ఎవరైనా అగ్గి పెట్టడంవల్ల ఈ ప్రమాదం జరిగిందా అని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
బంగారు భవితకు బాటలు వేసుకోవాలి
కడప అర్బన్ : విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుని కష్టపడితే విజయం మీ సొంతమవుతుందని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సంక్షేమంలో భాగంగా టెన్త్, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 63 మంది పోలీసు, హోమ్గార్డులు, డీపీఓ సిబ్బంది కుటుంబాల పిల్లలకు నగదు ప్రోత్సాహక మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదివి బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకుని అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుల పిల్లలు చక్కగా చదివి మంచి మార్కులు సాధించి మెరిట్ స్కాలర్ షిప్ అందుకోవడం ప్రశంసనీయమన్నారు. ఈ స్ఫూర్తితో మున్ముందు రెట్టింపు కృషితో, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో రాణించేందుకు, ఉన్నత లక్ష్యాలను అధిరోహించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పని సరిగా ఉండాలన్నారు. అప్పుడే వారు లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలరన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.ఐ. శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, కార్యవర్గ సభ్యుడు ఏఫ్రిన్, పోలీస్, హోమ్ గార్డు, డీపీఓ సిబ్బంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు కుటుంబాల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలు అందజేత -
బాలిక అదృశ్యం కేసులో నిందితుడి అరెస్టు
వేంపల్లె : బాలిక అదృశ్యం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన వేంపల్లి పంచాయతీ పక్కీరుపల్లెకు చెందిన బాలిక గొర్రెలను మేపుకునేందుకు అడవిలోకి వెళ్లి అదృశ్యమైన ఘటనపై వేంపల్లె పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ నరసింహులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిపారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకా బాబు చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడని, పక్కనే ఉన్న పక్కీరుపల్లెకు చెందిన బాలికతో ఇన్స్ట్రాగామ్లో పరిచయమయ్యాడన్నారు. బాలికకు మాయమాటలు చెప్పి తరచూ వీడియో కాల్స్ మాట్లాడేవాడన్నారు. ఈనెల 5వ తేదీన చైన్నె నుంచి మడకా బాబు సొంత గ్రామానికి వచ్చాడన్నారు. 7వ తేదీ ఉదయం బాలిక చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాలకోట వద్దకు గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిందన్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన బాబు బాలికతో మాట్లాడుతున్న సమయంలో గొర్రె పిల్లలు పక్కనే ఉన్న రాఘవరెడ్డి అనే వ్యక్తి పొలంలోకి వెళ్లాయన్నారు. అక్కడ గొర్రె పిల్లలు మాత్రమే ఉండటంతో బాలిక తండ్రికి రాఘవరెడ్డి భార్య ఫోన్ చేసిందన్నారు. అతను అక్కడికి వెళ్లేసరికి కూతురు కనిపించకపోవడంతో మడకా బాబుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో మడకా బాబుతోపాటు అతని స్నేహితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించే సమయంలో పోలీస్ స్టేషన్పై బాలిక బంధువులు, గ్రామస్తులు దాడి చేశారని తెలిపారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఆచూకీ తెలిసిందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కడప రిమ్స్కు తరలించామన్నారు. బాలికను విచారించి మైనర్ కావడంతో మడకా బాబుపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుడిని జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ నరసింహులు, ఎస్ఐ రంగారావు, పోలీసులు పాల్గొన్నారు.పోక్సో కేసు నమోదు -
బైకును ఢీకొన్న టిప్పర్
దువ్వూరు : కడప–కర్నూలు జాతీయ రహదారిపై పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్ద బైకును టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాళెం మండలం వెలవలి గ్రామానికి చెందిన నల్లమ్మగారి బాలనాగయ్య, ఆయన వియ్యంకుడు మద్దూరు హుస్సేనయ్య కలిసి తన మేకపోతును మైదుకూరు సంతలో విక్రయించడానికి బైకుపై వెళుతున్నారు. వారు మండలంలోని పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్దకు రాగానే గ్రావెల్ కోసం రాంగ్ రూట్లో వెళుతున్న టిప్పర్ బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బాలనాగయ్య, హుస్సేనయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుతున్న బాలనాగయ్య(43) మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. -
అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో.. కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. జూరాల, ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ ఏ
● నిండిన శ్రీశైలం ప్రాజెక్టు ● త్వరలో కేసీ కాలువకు నీటి విడుదల ● జిల్లాలో 92,937 ఎకరాల కేసీ ఆయకట్టు ● ఊపందుకోనున్న సాగు ● అన్నదాతల్లో ఆనందం కడప అగ్రికల్చర్ : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా పరవళ్లు తొక్కుతోంది. కేసీ అధికారులు త్వరలో కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా కేసీ కెనాల్ కింద 92,937.01 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట విత్తనాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో కేసీ కెనాల్కు నీరు విడుదల కానున్న నేపథ్యంలో.. నారుమడుల సాగు జోరందుకోనుంది. రైతన్నలు ఇప్పటికే మండల కేంద్రాలకు వెళ్లి విత్తనవడ్లు తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. నది పరీవాహక ప్రాంతాల్లోని రైతులు తెచ్చకున్న విత్తనపు వడ్లను నానబెట్టి మండెకట్టి నారుమడులు సాగు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. నారుమడుల సాగుకు సంబంధించి చిన్ని చిన్న కయ్యలను ఏర్పాటు చేసుకుని, అందులో దమ్ము చేసుకుంటూ హడావిడిగా ఉన్నారు. నీటి ఆధారం ఉన్న కొందరు రైతులు ఇప్పటికే నారుమడులను సాగు చేసుకున్నారు. నీటి ఆధారం లేని వారు కేసీకి నీరు విడుదల కాగానే నారుమడులను సిద్ధం చేసుకుంటారు. ముందుగా నారుమడులు సిద్ధం చేసుకున్న రైతన్నలు కేసీ కాలువకు నీరు రాగానే వరినాట్లు ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,93,722 ఎకరాల్లో సాధారణ పంటల సాగు లక్ష్యం కాగా.. ఇందులో 80 వేల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. సత్తువ పంటలుగా జనుము, జీలుగల సాగు నీటి ఆధారం ఉన్న రైతాంగం వరి సాగుకు ముందుగా.. భూమికి సత్తువ కోసం జీలుగలు, జనుములను చల్లుకుని దమ్ముకు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి సిద్ధమై వరినాట్లు వేసుకునేందుకు నెల రోజులకు పైగా గడువు ఉండటంతో.. ఆలోపు జీలుగలు, జనుము బాగా పెరిగి భూమికి సత్తువగా పనికొస్తుంది. నీటి ఆధారం లేని రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు సాగు చేసుకున్నారు. మరి కొంత మందికేసీకి నీరు రాగానే జీలుగలు, జనుములు సాగు చేస్తారు. వీరు నారుమడులు సాగు చేసి.. అది సాగుకు సిద్ధమయ్యే సమయానికి ఈ జీలుగ, జనుము పంట కూడా దమ్ముకు సిద్ధమవుతుంది. దీంతో ఈ జీలుగ, జనుము పంట భూమికి సత్తువగా పనికొస్తుంది. జిల్లాలో వరినాట్లు ప్రారంభం నది పరీవాహక, నీటి ఆధారం ఉన్న రైతులు ముందుగా నారుమడులు ఏర్పాటు చేసుకుని వరిసాగు పనులు ఆరంభించారు. ఇప్పటికే జిల్లాలో నది పరీవాహక ప్రాంతాలైన చెన్నూరు, కడప, కమలాపురం, సిద్దవటం, వల్లూరు, చెన్నూరు, చక్రాయపేట, జమ్మలమడుగు తదితర మండలాల పరిధిలో వెయ్యి ఎకరాల వరకు వరి పంట సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రతి రైతు పాటించాలి నారుమడులు సాగు చేసుకునే రైతులు పైన తెలిపిన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సాగు తరువాత వరి పంటలకు చీడపీడలను ఆశించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వరిపంట సాగు తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ వీరయ్య, కో ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వైఎస్సార్ జిల్లా. -
రమణీయం..రథోత్సవం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామిని రథంపై కొలువుదీర్చి ముందుకు కదిలించారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. గోవింద నామస్మరణలతో మాడవీధులు మార్మోగాయి. శనివారం రాత్రి అశ్వవాహనంపై సౌమ్యనాథ స్వామి పురవీధుల్లో విహరించారు. భక్తులు కాయ, కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు రీజెన్సీ నలంద విద్యాసంస్థల అధినేత జీఎన్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథ సేవ ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, ఎద్దుల విజయసాగర్, ఆలయ సూపరిండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, రీజెన్సీ నలంద స్కూల్ వైస్ ప్రిన్సిపల్ దశరథరామయ్య, ప్రిన్సిపల్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. నేడు చక్రస్నానం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. వైభవంగా సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు -
కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న ఆయకట్టు వివరాలు
మండలం ఆయకట్టు (ఎకరాల్లో) దువ్వూరు 10,419.28 చాపాడు 20,894.48 మైదుకూరు 3,553.23 ఖాజీపేట 20,804.82 రాజుపాళెం 6,894.24 ప్రొద్దుటూరు 5,427.50 కడప 5,371.83 చెన్నూరు 8,200.34 వల్లూరు 406.88 చింతకొమ్మదిన్నె 121.12 పెద్దముడియం 9,063.0 చాగలమర్రి 643.29 మొత్తం కేసీ ఆయకట్టు 92,937.01 -
నేడు మాజీ సైనిక సంక్షేమ సంఘం సమావేశం
కడప అర్బన్ : కడప నగరంలోని సీఎస్ఐ హైస్కూల్లో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల మాజీ సైనిక సంక్షేమ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ ఎస్.ఎస్ రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల సైనిక సంక్షేమ సంఘం నేతలు, మాజీ సైనిక ఉద్యోగులు తమ సంక్షేమం, ఇళ్ల స్థలాల కోసం పత్రాలు తీసుకుని రావాలని వారు పేర్కొన్నారు. భూ, స్థలాల సమస్యలపై చర్చించడం జరుగుతుందని వివరించారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్లో నియామకాలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులుగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులకు చెందిన వడ్డెరపు గంగాధర్ యాదవ్, రాయచోటికి చెందిన రమేష్ అంపాబత్తినలను నియమించారు. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా అంబవరం మల్లికార్జునరెడ్డిని నియమించారు. నేటి నుంచి ఏసీఏ మల్టీ డే మ్యాచ్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో ఆదివారం నుంచి ఈ నెల 31 వరకు ఏసీఏ సౌత్జోన్ అండర్–16 మెన్ మల్టీ డే మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జట్లు పాల్గొంటున్నాయి. కేఎఆర్ఎం, కేవోఆర్ఎం క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. మూఢ నమ్మకాల తొలగింపే ధ్యేయం కడప ఎడ్యుకేషన్ : సమాజంలో మూఢ నమ్మకాలను తొలగించడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జేవీవీ వ్యవస్థాపకుడు బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని యస్.వి.ఇంజినీరింగ్ కాలేజీలో జెవీవీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్కుమార్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకాల ఆవిష్కరణతోపాటు గీతాలాపనతో ప్రారంభించారు. అనంతరం బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జేవీవీ ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి ప్రధానంగా కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడం, అన్ని రంగాల్లో సంతులిత అభివృద్ధిని సాధించే విధంగా ఉత్సాహపరచడంలో జేవీవీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జి భూపేశ్ రెడ్డియోగి వేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పుత్తా పద్మజ కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.రాకేష్ చంద్ర, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, జాతీయ నాయకులు బి.విశ్వనాథ, కృష్ణాజీ, శ్రీనివాసులు, సనావుల్లా, మహమ్మద్ మియా, యస్.స్వరాజ్యలక్ష్మి, వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జేవీవీ ప్రతినిధులు హాజరయ్యారు. -
దిగజారి ప్రవర్తిస్తున్నారు..
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన పార్టలు దిగజారి ప్రవర్తిస్తున్నాయి. జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి వస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది. పోలీసుల సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. చేతగాని మనుషుల్లా పోలీసులు ఎందుకు నిలబడ్డారో అర్థం కావడం లేదు. మానవ ప్రపంచం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ, జిల్లా అధ్యక్షులు -
పక్కీర్పల్లె.. ఖాళీ
● పోలీసుల కేసుకు భయపడి ఊరు వదిలి వెళ్లిన గ్రామస్తులు ● ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే ● నిర్మానుష్యంగా మారిన గ్రామం వేంపల్లె : వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న పక్కీర్పల్లె ఖాళీ అయింది. పోలీస్స్టేషన్ ముట్టడి సంఘటనలో పోలీసులు పెట్టే కేసులకు భయపడి.. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామంలో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్న మగ, ఆడ, పిల్లలు ఇలా అందరూ వెళ్లిపోయారు. కొందరు ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు వీధుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప, జనాలు ఎక్కువ మంది లేరు. వివరాలలోకి వెళితే.. పక్కీర్పల్లెలో ఈ నెల 7వ తేదీన గొర్రెలు మేపేందుకు సమీపంలోని కొండల్లోకి 17 ఏళ్ల అమ్మాయి వెళ్లింది. ఆమె అదృశ్యం కావడంతో బంధువులు గ్రామస్తులను పిలుచుకుని వేంపల్లె పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకబాబు అనే యువకుని సెల్ఫోన్లో అమ్మాయి బట్టలు చిరిగిపోయి, దండం పెట్టే వీడియో ఉండటంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. అమ్మాయిని రేప్ చేసి చంపేశారేమోనన్న అనుమానంతో పోలీస్స్టేషన్ వద్ద రచ్చ చేశారు. దీంతో అమ్మాయి బంధువులు, గ్రామస్తులపై పోలీసులు హత్యాయత్న కేసు నమోదు చేశారు. పోలీస్స్టేషన్పై దాడికి దిగారని కేసు నమోదు అయితే అదే రోజు రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో అమ్మాయి.. పోలీస్ స్టేషన్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. దీంతో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ నేతృత్వంలో పోలీస్ బృందాలు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మాయిని సురక్షితంగా కడప రిమ్స్కు తరలించారు. అమ్మాయి దొరికింది అనే విషయం చెప్పినా కూడా కొంత మంది ఆందోళనకారులు వారి ఆందోళన విరమించలేదు. అప్పటికే పోలీస్ స్టేషన్లో ఉన్న కిటికీ అద్దాలు కుర్చీలు, వాకిళ్లను పగులగొట్టారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీలో ఉన్న రామాంజనేయులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేశారని కేసు నమోదు చేశారు. కొంత మందిని ఇప్పటికే అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కీర్ పల్లెకు చెందిన బాలికకు, చింతలమడుగుపల్లెకు చెందిన మడక బాబుకు చనువైన పరిచయం ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ మధ్యాహ్న సమయంలో వజ్రాలకోన దగ్గర ఉన్నట్లు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడంతో.. అమ్మాయి తల్లిదండ్రులు మరి కొంత మందితో కలిసి గుట్టలో వెతకగా మడక బాబు కనిపించాడు. అమ్మాయి బంధువులు మడక బాబుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 7వ తేదీ సాయంత్రం పోలీస్స్టేషన్ వద్దకు పిలుచుకుని వచ్చినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 60 మందిని అదుపులోకి.. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. మడక బాబును విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా.. వినకుండా పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దాడి చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. దీంతో కేసుకు సంబంధించి ఇప్పటికి 60 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని పోలీసులు వీధి, వీధి గాలింపు చర్యలు చేపట్టడంతో.. పక్కీర్ పల్లెలోని అందరినీ అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామస్తులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. మాకేం తెలియదని మహిళల ఆందోళన గ్రామంలోని మహిళలు మాత్రం తమకు గానీ, తమ గ్రామానికి చెందిన ప్రజలకు ఏమీ తెలియదని, బాలికను రేప్ చేసి చంపేశారని గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతోనే వేంపల్లె పోలీస్స్టేషన్కు వెళ్లామని చెప్పుకొచ్చారు. తామంతా కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారిమని, ఇప్పుడు ఈ కేసు వల్ల తమకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. -
రైలు గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి–చర్లపల్లి–తిరుపతి మధ్య నడుస్తున్న రైలును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించినట్లు రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. (07011) చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రతి శుక్ర, ఆదివారాల్లో.. (07018) తిరుపతి–చర్లపల్లి మధ్య ప్రతి సోమ, శనివారాల్లో నడుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం కడప రూరల్ : ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఖాతాలకు తల్లికి వందనం నిధులు మంజూరవుతాయని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె.సరస్వతి తెలిపారు. జిల్లాలో 1,896 మంది ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు వెంటనే సమీపంలోని పోస్టాఫీసులో ఖాతానుతెరిచి మీ ఆధార్ నెంబరుకు, ఎన్పీసీఐ పోర్టల్కు లింక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ విద్యార్థికి ఇదివరకే బ్యాంకు అకౌంటు ఉన్నట్లయితే ఆ అకౌంటుకు ఎన్పీసీఐ లింక్ చేయించాలని తెలిపారు. మీ ఖాతాకు ఎన్పీసీఐ లింకు అవడం వల్ల తల్లికి వందనం పథకం డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ అవుతాయని తెలిపారు. ఫ్రైడే డ్రైడేతో ఆరోగ్యకర వాతావరణం కడప రూరల్ : ఫ్రైడే డ్రైడే కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని జిల్లా మలేరియా అధికారి మనోరమ తెలిపారు. శుక్రవారం స్థానిక బుడ్డాయల్లెలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగీ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. వారానికి ఒకసారి ఇళ్లల్లోని తొట్లు, కుండలు, బానలు, కూలర్లు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. డెంగీ, మలేరియా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు రిమ్స్, మీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రైడే డ్రైడే కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడంతో మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, సబ్ యూనిట్ అధికారి నాగలక్ష్మిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జాతీయస్ధాయి క్రీడలకు ఎంపిక రాజంపేట : జాతీయస్ధాయి క్రీడలకు కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు ఎంపికయ్యారని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ మురగేశన్ శుక్రవారం తెలిపారు. కోచ్ రాహుల్ కుమార్, సహాయకోచ్ కుమారజరపాలా వీరికి శిక్షణ ఇచ్చారన్నారు.ఎంపికై న వారిలో మోక్షిత్(చెస్), హర్ష(టేక్వాండో), కార్తీక్, మహేశ్ (కబడ్డీ), ఉదయశంకర్ (డిస్కస్త్రో) ఉన్నారని చెప్పారు. జిల్లాస్థాయి క్రీడలకు అండర్–14 విభాగంలో నాగలక్షీప్రియ, హరిత, అండర్–17లో హర్షిత, రిషి, గాయత్రి, అండర్ –19లో మోహనావైష్ణవి, యశస్విని ఎంపికయ్యారన్నారు. విద్యార్ధులను ప్రిన్సిపాల్ మురగేశన్ అభినందించారు. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు రాజంపేట : జిల్లాలో నడిచే పలు రైళ్లలో శుక్రవారం పోలీసులు, రైల్వేపోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమరవాణా అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్పై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు, 112కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లి గ్రామం, రాజంపేట మండలం నరమరాజుపల్లి గ్రామాల్లో ఉన్న శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన 2025–26 విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బి–జోన్ స్థాయి సీఐఎస్సీఈ జోనల్ బ్యాడ్మింటన్ పోటీలను శుక్రవారం స్థానిక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జగన్నాథ్రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్–14, అండర్–17, అండర్–19 వయోపరిమితి గల బాల, బాలికలు పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. అండర్–17 బాలుర డబుల్స్లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–17లో బాలుర సింగిల్స్లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్, చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్లు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్–17 బాలికల డబుల్స్లో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అండర్–14 బాలుర విభాగంలో గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా, శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
వాటా కోసం.. తమ్ముళ్ల కుమ్ములాట
ఓబులవారిపల్లె : టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థకు ఖనిజం సరఫరా చేసే విషయంలో వాటా కోసం తమ్ముళ్ల మధ్య కుమ్ములాట మొదలైంది. 25 శాతం వాటా తమకే ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ నాయకులు భీష్మించడంతో వాదోపవాదాలు జరిగాయి. బేరసారాలు బెడిసికొట్టడంతో టెండర్ దక్కించుకున్న కంపెనీ చివరికి సరఫరా నిలిపివేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఏపీ ఎండీసీ నుంచి ఖనిజాన్ని కొనేందుకు బల్క్ టెండర్ ద్వారా ఎంప్రదా కంపెనీ దక్కించుకుంది. ఎపీఎండీసీ కంపెనీ ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. దీనిపై కూటమి నాయకుల కన్ను పడింది. పెద్ద ఎత్తున తామే ఖనిజం తీయిస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు. రోజూ దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు 25 శాతం ఖనిజం తీసేందుకు తమ యంత్రాలకు అవకాశం ఇవ్వాలని పటుబట్టారు. అంతకుముందు తరలిస్తున్న కూటమి నాయకులు దీనికి ఒప్పుకోకపోగా.. వాగ్వాదాం జరగడంతో వివాదం ముదిరింది. దీంతో దీనిపై శుక్రవారం ఉదయం నుంచి కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. బేరసారాలు కుదరక పోవడంతో చివరకు ఏపీఎండీసీ నుంచి ఎమ్ప్రదా కంపెనీకి బైరెటీస్ ఖనిజం సరఫరా నిలిపివేశారు. ఏపీఎండీసీ గనుల నుంచి స్థానిక నిర్వాసిత కుటుంబీకులు, ఇల్లు కోల్పోయిన వారంతా లక్షల రూపాయలు అప్పుచేసి యంత్రాలు కొనుగోలు చేశారు. 51 ఇటాచీలు పెట్టి ఖనిజం తీస్తూ జీవనం సాగిస్తున్నారు. కూటమి నాయకులు తమకే వాటా కావాలనడంతో వీరి మధ్య వివాదం వారి జీవన స్థితిగతులకు అంటకంగా మారింది. కంపెనీకి ఖనిజం రవాణా చేసేలా చూడాలని యంత్రాల యజమానులు కోరుతున్నారు. సీఎండీ గ్రేడ్ ఖనిజం సరఫరాలో బెడిసిన ఒప్పందం తమకే 25 శాతం ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతల పట్టు -
చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్
కడప ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువు అర్ధంతరంగా మానేసిన వారికి ఓపెన్ స్కూల్ మళ్లీ చదువుకొనే చక్కటి అవకాశం కల్పిస్తోందని డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోర్డినేటర్ సాంబశివారెడ్డి అన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్కు సంబంధించిన కరపత్రాలను కడప డీఈఓ కార్యాలయంలో డీసీ సాంబశివారెడ్డి, ఏపీసీ నిత్యానందరాజు, ప్రభుత్వ పరీక్షల అిసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్తో కలిసి శుక్రవారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ ప్రక్రియలో ఎటువంటి సందేహాలున్నా అభ్యాసకులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలు పూర్తి బాధ్యతతో నిర్ణీత గడువులోపు అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ నిత్యానందరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అట్లూరు : మండలంలోని కడప–బద్వేల్ రహదారిపై రెడ్డిపల్లె సమీపాన ద్విచక్ర వాహనం అదుపుతప్పి శుక్రవారం ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. బద్వేల్ మండలం గుంతపల్లెకు చెందిన పడిగె క్రిస్టఫర్ తన ద్విచక్ర వాహనంపై సిద్దవటం మండలం మాచుపల్లెకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపాన కడప–బద్వేల్ రహదారిపై వేప చెట్టును ఢీకొని కింద పడ్డారు. తీవ్ర గాయాలైన క్రిస్టఫర్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.రస్తా స్థలం ఆక్రమణయత్నంచింతకొమ్మదిన్నె : కడప నగరంలోకి విలీనమైన చిన్నముసలిరెడ్డిపల్లె దారిలో కొందరు రస్తా స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా కార్పొరేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలంలో ఉన్న చెట్ల వద్ద స్థానిక ప్రజలు పదుల సంఖ్యలో నిత్యం సేద తీరుతుంటారు. విలువైన స్థలంగా మారడంతో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన అధికారపార్టీ నాయకుడి కన్ను పడింది. తన అనుచరులను రంగంలోకి దింపి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆక్రమిత స్థలంలో కట్టడాల నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నట్లు తెలిసింది. విసుగు చెందిన స్థానికులు పదే పదే ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ సిబ్బంది స్పందించి శుక్రవారం ఆక్రమిత స్థలంలో నిర్మిస్తున్న కట్టడాలను తొలగించారు. నేడు తెలుగు భాషా పరిరక్షణ సదస్సుగోపవరం : కర్నూలులో ఈ నెల 12, 13వ తేదీల్లో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ తెలుగు భాషా వికాస ఉద్యమ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు పిలుపునిచ్చారు. మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కర్నూలు సీ.క్యాంపు టీజీవీ కళా క్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి తెలుగుభాషా పరిరక్షణ సదస్సుకు తెలుగువారంతా హాజరు కావాలని కోరారు. సదస్సులో తెలుగుభాషపై చర్చాగోష్టి జరిపి పలు తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హనుమంతరావు తెలిపారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో శుక్రవారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కళ్యాణోత్సవాలను వేర్వేరుగా వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య ధాన్య మందిరం ఆవరణలోని కళ్యాణ వేదికపై ముందుగా సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువుదీర్చారు. ఒకే వేదికపై శివ, కేశవుల కళ్యాణం జరుగుతుండడంతో రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి హాజరైన వారికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది. సర్పంచి గౌరీ శంకర్, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్టదీపుడు, టీటీడీ అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు రథోత్సవం : బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతిరాయచోటి : రామాపురం మండలం పాలనగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతిచెందింది. శుక్రవారం ఉదయం రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో కొంద రు కడపకు వెళ్తున్నారు. పాలన్నగారిపల్లి సమీపంలో చెట్లపొందల నుంచి జింక రోడ్డుమీదకు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గాయాలపాల య్యారు. గాయపడిన జింక కూడా మృతి చెందినట్లు అటవీబీట్ అధికారి భరణీధర్ తెలిపారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, వెండి చోరీ
ఖాజీపేట : ఖాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలోనే శుక్రవారం చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. ఖాజీపేట మహిళా మార్టు ప్రక్కన నివాసముంటున్న వీఎన్.అమితాబ్ గురువారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం అమితాబ్ ఇంటి ముందు తన ఫొటో స్టూడియో తెరిచేందుకు వచ్చిన సిద్ధిక్ వెనుకభాగం వాకిలి పగిలి ఉడడం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించి చోరీ జరిగిన విషయం యజమాని అమితాబ్కు సమాచారం ఇచ్చారు. నాలుగు బీరువాలు పగుల కొట్టి దుస్తులు చెల్లా చెదురుగా పడేసినట్లు గమనించిన అమితాబ్ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 వేల నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. బంగారు ఆభరణాలు తమ వెంట తీసుకుని పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఎదురుగా మహిళా మార్టు సీసీ కెమేరాలు పరిశీలిస్తున్నారు. -
పీజీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల అనుబంధ పీజీ కళాశాలల రెండో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వైవీయూపీజీ కళాశాల కేంద్రాన్ని వారు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 653 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 21 మంది గైర్హాజరైనట్లు వారు తెలిపారు. కడప ఎస్వీ పీజీ కళాశాలలో, ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ పీజీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. -
18న చలో ఢిల్లీ
బద్వేలు అర్బన్ : కడపలో ఉక్కు పరిశ్రమ హామీ అమలు కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్ని పేర్కొన్నారు. స్థానిక డీవైఎఫ్ఐ కార్యాలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పది రోజుల్లో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని మహానాడులో చంద్రబాబు చెప్పినా, నేటికీ పనులు ప్రారంభం కాలేదనిన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్షరీఫ్, ఆదిల్, ఓబుల్రెడ్డి, సుధాకర్, నరసింహ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కర్నాటక మద్యం స్వాధీనంమదనపల్లె రూరల్ : ఎకై ్సజ్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 12.96 లీటర్ల ఎన్డీపీఎల్ కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి టూవీలర్ సీజ్ చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కర్నాటక సరిహద్దు చీకలబైలు చెక్పోస్ట్కు సమీపంలో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కురబలకోట మండలం తుంగావారిపల్లెకు చెందిన మూలి రమేష్(27), కర్నాటకకు చెందిన బెంగళూరు మాల్ట్ విస్కీ(90ఎం.ఎల్) 96 టెట్రా ప్యాకెట్లు, సుజుకీ ఆక్సెస్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి నుంచి రూ.3,840 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని, టూవీలర్ను సీజ్ చేశామన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన పెద్దిగాని సోమశేఖర్(28), కర్నాటకకు చెందిన హైవార్డ్స్ ఛీర్స్ విస్కీ(90ఎం.ఎల్) 48 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లోనూ ఇద్దరిని అరెస్ట్చేసి ఎకై ్సజ్ ఎస్హెచ్ఓకు అప్పగించామన్నారు. పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్షమదనపల్లె రూరల్ : పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎం.శంకరరావు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు వన్టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన టి.చంద్రశేఖర్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల హైస్కూల్ వద్ద 2017 మార్చి, 3న స్కూల్కు వెళ్లే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పటి హెచ్ఎం పద్మజ ఫిర్యాదు మేరకు, ఎస్ఐ మనోహర్ పోక్సో కేసు నమోదు చేశారన్నారు. కోర్టు విచారణ అనంతరం శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో నిందితుడు చంద్రశేఖర్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ..5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారన్నారు. -
రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురుపౌర్ణమి నాడు సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం చంద్రబాబు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలో ఈ సమావేశం నిర్వహించే నైతిక అర్హత వారికి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల పాఠశాలల్లో 2.20కోట్లమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని ఘనంగా చెప్పుకుంటున్నారన్నారు.ఇటీవల వైజాగ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా రికార్డుల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. జూన్ 12న ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు, కొద్ది రోజులకే మాటమార్చి నిన్న సత్యసాయి జిల్లా కొత్త చెరువు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ అలోచనల నుంచి ‘తల్లికి వందనం’ పథకం ఆవిర్భవించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దివంగత ఎన్టీఆర్ పేరు చెబితే రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలు గుర్తుకు వస్తాయని, వైఎస్సార్ పేరు చెబితే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108,104, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు,వైఎస్ జగన్ పేరు చెబితే అమ్మ ఒడి, నాడు–నేడు వంటివి గుర్తుకు వస్తాయన్నారు. అయితే చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4.50లక్షల అడ్మిషన్లు తగ్గాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిఫారం, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, షూ, టై, బెల్ట్ వంటివి కిట్గా అందించారని, కూటమి ప్ర భుత్వంలో మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రదర్శించిన స్కూల్ బ్యాగ్లు నెల తిరక్కుండానే చిరిగిపోతున్నా యని వీడియోలు చూపించారు.రేషనలైజేషన్ పే రుతో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూ యించిన ఘనత బాబుదేనన్నారు.కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వర కువైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. వైఎస్ జగన్ను అంతం చేసే కుట్ర: రెడ్యం కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. జెడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ఆయనకు భద్రత కల్పించకుండా ప్రజలను అడ్డుకునేందుకు వేలమంది పోలీసులను ఉపయోగించారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని...జిల్లాలో మహానాడు నిర్వహించినప్పటి నుంచి వర్షాలు లేక రైతులు విలవిల్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, షఫీ, డిష్ జిలాన్, అక్బర్, అజ్మతుల్లా, అహ్మద్ పాల్గొన్నారు. వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యం మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా -
కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం
నందలూరు : సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యా వేదికను అలంకరించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్పవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కల్యాణ వేదికపై కొలువుదీర్చారు.అనంతరం కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువులను నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. కల్యాణోత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామిని ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం రాత్రి గజవాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నదానం : కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు సోమలరాజు చంద్రశేఖర్రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర సంస్థ అధ్యక్షుడు వేపగుంట శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో స్కౌట్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. మారుమోగిన హరినామస్మరణ -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
కడప అర్బన్ : జిల్లాలో గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ ఆదేశించారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని, శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టేషన్ కు వచ్చే మహిళలు, ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. వైన్ షాపుల వద్ద నిబంధలకు విరుద్ధంగా మద్యం తాగితే చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దష్టి పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నక్షుంచి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.సైబర్ నేరాలు, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. రాత్రి గస్తీ పెంచాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల కోర్టులో జీవిత ఖైదు శిక్ష పడేలా కృషిచేసిన సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఇ.బాలస్వామిరెడ్డి, అబ్దుల్కరీం, ఎ.వెంకటేశ్వర్లు, పి.భావన, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరావు, మురళినాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాలు కడప అర్బన్ : ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లెట్, 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ శుక్రవాం ప్రారంభించారు. మంగళగిరి నుండి వచ్చిన ఈ వాహనంలో సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీ ఉన్నాయన్నారు. కడపకు ఏడు, ప్రొద్దుటూరుకు నాలుగు, పులివెందులకు రెండు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరుకు ఒక వాహనం కేటాయించారు. ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ ఉపయోగిస్తారని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తారని ఎస్పీ తెలిపారు. న్నానేర సమీక్షా సమావేశంలో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ -
వెనుకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం వద్దు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో అభివృద్ధి అంటూ... వెనుక బడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం తగదని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం కడప ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. మహానాడు వేదికగా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. నెల రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ పనులు జరుగుతాయని చెప్పిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సంపాదనంతా రాజధాని పేరుతో ఖర్చుపెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, ఎన్వీ.రమణ, మాలకొండయ్య, శివయ్య, సీఆర్వీ ప్రసాద్, గుర్రప్ప, అంజి, రవిశంకర్రెడ్డి, జయవర్ధన్, ప్రభాకర్రెడ్డి, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ -
రిమ్స్లో అరుదైన శస్త్ర చికిత్సలు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గైనకాలజీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్ వెంకటేశ్వరరావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ● 13 ఏళ్ల బాలిక ముట్టు సమస్యతో గైనకాలజీ విభాగంలో చేరారు. పరీక్షించగా తనకు అరుదైన జన్యువ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ఎడమవైపు హెర్నియాలో ఉన్న అండాశయాన్ని, ఎడమ వైపు ఉన్న గర్భసంచి సగభాగాన్ని తొలగించారు. ప్రపంచంలో ఇటువంటి కేసులు ఇప్పటి వరకు ఐదు మాత్రమే నమోదు అయ్యాయని సూపరింటెండెంట్ తెలిపారు. ● 46 ఏళ్ల మహిళ కడుపు ఉబ్బరంతో బాధ పడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు చేశాక అండాశయంలో పెద్ద కణితిని గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి 8 కేజీల కణితిని తొలగించారు. ● 55 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు జరిపాక అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి 6 కేజీల క్యాన్సర్ గడ్డతోపాటు స్టేజింగ్ లాపారోటమీ అనే చికిత్స చేసి క్యాన్సర్ భాగాలను తొలగించారు. ● శస్త్ర చికిత్స చేశాక ముగ్గురు పేషెంట్స్ బాగా కోలుకున్నారని, అందరినీ డిశ్చార్జ్ త్వరలో చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. అన్నీ శస్త్ర చికిత్సలు గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మీసుశీల ఆధ్వర్యంలో డాక్టర్ అమానుల్లా, క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుల నేతృత్వంలో చేసినట్లు పేర్కొన్నారు. గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ పద్మావతి, డాక్టర్ రబ్బాని బేగం, డాక్టర్ రేఖారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీ వైద్యులు, స్టాఫ్ నర్స్లు పాల్గొన్నట్లు తెలిపారు. అనస్థీసియా విభాగాధిపతి డాక్టర్ సునీల్ చిరువెళ్ల, అసోసియేట్ ప్రొఫెసర్స్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ మంజు శృతి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. -
‘దేశం కోసం మధ్యవర్తిత్వం’ ప్రచారం ప్రారంభం
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశానుసారంగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికారసంస్థ ఇన్చార్జి చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సూచనల మేరకు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఇన్చార్జి సెక్రటరీ కె. ప్రత్యూషకుమారి ఆధ్వర్యంలో.. ‘దేశం కోసం మధ్యవర్తిత్వంపై గురువారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఒక వారం అవగాహన ప్రచారం‘ సందర్భంగా కడప కోర్టు ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో మధ్యవర్తిత్వం సంబంధించి కరపత్రాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రజలకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కడప నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్, రైల్వే స్టేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్, సంధ్యా సర్కిల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ సర్కిల్, సెవెన్రోడ్ సర్కిల్, దిశా పోలీస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం, హసీనా, పారా లీగల్ వాలంటరీలు దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త మూడో పెళ్లికి యత్నం.. మొదటి భార్య ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : ఆ వ్యక్తికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. అయినా ఆయన మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన మొదటి భార్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి బద్వేలులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుమిత్రానగర్ (ఎరుకలవీధి)కు చెందిన జగన్నాధం రవి సుమారు 25 సంవత్సరాల క్రితం కడప నగరంలోని తిలక్నగర్ ఎస్టీ కాలనీకి చెందిన రామలక్షుమ్మ (42)ను వివాహం చేసుకున్నాడు. మరికొన్నేళ్లకు రామలక్షుమ్మ సమీప బంధువును కూడా వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రవి రాయచోటికి చెందిన తన సమీప బంధువుల అమ్మాయిని మూడవ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై తరచూ రామలక్షుమ్మ, రవిల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల రవి కొద్ది రోజులు ఇంటి పట్టున లేకుండా రాయచోటికి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య రవిని ప్రశ్నించింది. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో తాను తప్పనిసరిగా నా బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుంటానని రవి తేల్చి చెప్పాడు. ‘నీవు మరో వివాహం చేసుకుంటే నేను చనిపోతాను’ అని రామలక్షుమ్మ తెలిపింది. ‘నీవు ఏమైనా నాకు ఫర్వాలేదు. నేను పెళ్లి చేసుకునే తీరుతాన’ని రవి తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన రామలక్షుమ్మ ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని కత్తితో కడుపులో, ఎడమ చేతిపైన పొడుచుకుంది. చుట్టుపక్కల వారు గమనించి రామలక్షుమ్మను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. తమ అక్క మృతికి కారణమైన రవిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కింద పడి..జమ్మలమడుగు : ఎర్రగుంట్ల పట్టణంలోని ఆవుల క్రిష్ణయ్య(64) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు వస్తుండటంతో దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. క్రిష్ణయ్య ముద్దనూరు రోడ్డులో టీఎంఆర్ మాల్ వెనుక వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అయితే గత కొద్దికాలం నుంచి అనారోగ్యంతో మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45) అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. గత రెండు రోజులుగా మద్యం సేవించి అక్కడే పడి వున్నాడు. గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. అతని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా సీఐ: 9121100510కు గానీ, ఎస్ఐ సెల్ నెంబర్: 9121100511లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలియజేశారు. -
డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో మూడవ రోజు గురువారం కడప–అనంతపురం జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 74 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 107 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ వర్మ 204 బంతుల్లో 133 పరుగులు, ఆర్దిత్ రెడ్డి 156 బంతుల్లో 111 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం సాధించింది. కేఓఆర్ఎం మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడవ రోజు గురువారం 143 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 71.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని హృదయ్ 85 పరుగులు, విఖ్యాత్ 85 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ఘని చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 42.2 ఓవర్లలలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 113 బంతుల్లో 138 పరుగులు చేశాడు. -
అరుణాచలం.. రైలులోనూ వెళ్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పంచభూతాత్మక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక భక్తులు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే సౌకర్యంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. కడప నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గాన వెళ్లేందుకు దాదాపు 300 కి.మీ. దూరం ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో సూపర్ లగ్జరీల్లో అయితే దూరాన్ని బట్టి రానుపోను రూ.1050 నుంచి 1300 వరకు చార్జీగా ఉంది. ఒకవేళ కారులో వెళితే దాదాపు రూ. 8–10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటన్నింటితో పోలిస్తే రైలులో ప్రయాణిస్తే చార్జి తక్కువగా ఉన్నా.. రిజర్వేషన్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో రైల్వేస్టేషన్లు వైఎస్సార్ జిల్లా నుంచి పలు రైళ్లు అరుణాచలం సమీపానికి వెళుతున్నాయి. కడప నుంచి విల్లుపురం 360 కి.మీ. దూరంలో ఉంది. అయితే విల్లుపురం నుంచి అరుణాచలం 60 కి.మీ. దూరంలో ఉంది. ఎవరైనా అరుణాచలం వెళ్లాలంటే విల్లుపురం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రైలులో గానీ, బస్సులో గానీ, ఇతర వాహనాల్లో కూడా వెళ్లవచ్చు. కడప మీదుగా వెళుతున్న రైళ్ల వివరాలు అహ్మదాబాద్ నుంచి తిరుచానపల్లికి వెళ్లే వారాంతపు రైలు (09419) ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుని అదే రోజు సాయంత్రం 7.15 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (09420)మధ్యాహ్నం 12.10 గంటలకు విల్లుపురంలో బయలుదేరి కడపకు రాత్రి 8.25 గంటలకు చేరుతుంది. ఈ రైలు కడప స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ● లోకమాన్య తిలక్–మధురై (22101) రైలు ప్రతి గురువారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (22102) రైలు విల్లుపురంలో శుక్రవారం రాత్రి 8.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో రానుపోను రూ.550 చార్జిగా నిర్ణయించారు. ● ముంబయి–కరైకాల్ ఎక్స్ప్రెస్ (11017) వారాంతపు రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని మధ్యాహ్నం 1.55 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరిగి ఇదే రైలు (11018) విల్లుపురంలో సాయంత్రం 7.25 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది. ● ముంబయి–నాగర్కోయిల్ (16351) ఎక్స్ప్రెస్ రైలు వారానికి రెండు సార్లు నడుస్తుంది. ఈ రైలు ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 1.20 గంటలకు కడపకు చేరుకుని, అదే రోజు రాత్రి 9.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. ● కడప నుంచి అరుణాచలానికి ఓకా–మధురై (09520) ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం సాయంత్రం 6.05 గంటలకు కడపకు చేరుకుని మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు అరుణాచలానికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (09519) అరుణాచలంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో జనరల్ క్లాస్లో రూ.140, స్లీపర్లో రానుపోను రూ. 790, ఏసీ త్రీ టైర్లో రూ.2370లుగా చార్జీ నిర్ణయించారు. ● కాచిగూడ–పాండిచ్చేరి వెళ్లే రైలు (17653) ప్రతి సోమ, గురు, శనివారాల్లో కాచిగూడలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 1.30 గంటలకు కడపకు చేరుకుని ఉదయం 9.00 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 3 గంటలకు విల్లుపురంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు కడపకు చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి వైఎస్సార్ జిల్లా నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. నేరుగా వెళ్లేందుకు ఓకా–మధురై ఎక్స్ప్రెస్, కడప నుంచి అరుణాచలంకు సమీపంలోగల విల్లుపురం వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి కాట్పాడికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా అరుణాచలానికి వెళ్లవచ్చు. రైల్వేశాఖ అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – జనార్దన్, కమర్షియల్ ఇన్స్పెక్టర్, కడప అతి తక్కువ చార్జీతో ప్రయాణం అన్ని వర్గాలకు అనుకూలం -
● పేరెంట్స్ మీటింగు నిర్వహించేదే లే!
అట్లూరు : ‘మా ఊరు పాఠశాల మా ఊరులోనే ఉంచే వరకూ మా పాఠశాలలో మెగాపేరెంట్ టీచర్ మీట్(పీటీఎం)ను నిర్వహించవద్దని’మండల పరిధిలోని చెన్నేపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల పేరంట్స్ స్పష్టం చేశారు. మీటింగును పూర్తిగా అడ్డుకున్నారు. ఎస్.వెంకటాపురం పాఠశాలను మోడల్ పాఠశాలగా మార్చి చెన్నేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివే 3,4,5 తరగతుల విద్యార్థులను తరలించాలని ఉపాధ్యాయులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇక్కడే చదవాలి.. అక్కడకు పంపించం అంటూ చెన్నేపల్లి కాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అధికారుల ఆలోచన విరమించే వరకూ మీటింగు నిర్వహించవద్దు అంటూ ప్లెక్సీలు చేతపట్టుకుని పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విలియంరాజు అక్కడకు చేరుకుని సమావేశం నిర్వహణకు తల్లిదండ్రులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానని ఆయన వెనుదిరిగారు. -
వైభవం..సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, యజ్ఞోపవీతధారణ, మాంగల్యపూజ, కర్పూర హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం సతీసమేతుడైన కోదండరామస్వామికి అర్చకులు పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఆలయ టీటీడీ సూపరిటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఉక్కు కర్మాగార నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి జమ్మలమడుగు రూరల్ : ఉక్కు కర్మాగారం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు మండలపరిధిలోని సున్నపురాళ్ల పల్లె వద్ద జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని ఎమ్యెల్యే సి.ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇంచార్జ్ భూపెష్రెడ్డి, కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కర్మాగారానికి కావలసిన స్థలం, మౌళిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారని పేర్కొన్నారు. ఎమ్యెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మమడుగు ప్రాంతంలో కర్మాగారం నిర్మాణం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జెఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ బేఢీ, జీఎం వికాస్ కన్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పూరి, ప్రాజెక్ట్ హెడ్ నూరుల్, ఆర్డీఓ సాయిశ్రీ పాల్గొన్నారు. 15 నుంచి క్రీడా పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి 17 వరకు ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా మహిళలకు పలు క్రీడలను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె, జగన్నాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు అఽథ్లెటిక్స్, అర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. 22 ఏళ్లలోపు ఉన్న మహిళా క్రీడాకారిణులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎరువుల వాడకంపై అవగాహన అవసరం కడప ఎడ్యుకేషన్: నేటి ఆధునిక వ్యవసాయసాగులో పంటలకు ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన అవసరమని ఊటకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు సమగ్ర పోషక యాజమాన్యం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయే పంటలకు ఎంత శాతం ఎరువులు అవసరమో ఈ శిక్షణ ద్వారా అందరు తెలుసుకోవాలని వివరించారు. ఏరువాక కేంద్రం అధిపతి బి. పద్మోదయ మాట్లాడారు. కే వి కే శాస్త్రవేత్తలు సాయిమహేశ్వరి, సురేష్ కుమార్రెడ్డి, మానస, గిరీష్ కుమార్ పాల్గొన్నారు జిల్లా పోలీసుశాఖలో బదిలీలు కడప అర్బన్: జిల్లా పోలీసుశాఖలో గురువారం భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిల్లో విధులను నిర్వహిస్తున్న 24 మంది ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 109 మంది కానిస్టేబుళ్లను నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 169 మందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. -
విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు తల్లిదండ్రులే : జేసీ
విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులే పునాదులని.. తమ పిల్లల చదువులపై ఉపాధ్యాయులను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, కడప నగరపాలక కమిషనర్ మనోజ్రెడ్డి సూచించారు. మెగా పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో భాగంగా కడప నగరపాలక మొయిన్ స్కూల్లో నిర్వహించిన సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువులు, భద్రతపై పాఠశాల ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్నారు. మున్సిపల్ హైస్కూల్లో గతంలోనే అధునాతన వసతులను కల్పించామన్నారు. అనంతరం పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయి లో ఉన్న పలువురు పూర్వ విద్యార్థుల అనుభవాలను పిల్లలతో పంచుకున్నారు. ముందుగా పాఠశాలకు వచ్చిన జేసీ తరగతి గదులు, మెడల్ సెంట్రల్ కిచెన్ను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లుల పేరుతో మొక్కలు నాటా రు. ఆర్డీవో జాన్ ఇర్వీన్, కార్పొరేటర్ సూర్యనారాయణ, ఎంఈఓలు గంగిరెడ్డి, ఇర్షాద్, కార్పొరేషన్ స్కూల్స్ సూపర్వైజర్ ఫరూక్, హెచ్ఎం ముబీనా రెహ్మాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అద్దె బడి మాకొద్దు
పీటీఎం ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రుల ఆందోళన బద్వేలు అర్బన్ : శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ అద్దె బడి తమకొద్దని, తమ పిల్లలకు తక్షణమే సొంత పాఠశాల భవనం నిర్మించాలని చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో 1958లో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద పాఠశాల భవనం నిర్మించారు. ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా ఐదు మంది ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. బద్వేలు పట్టణంలో జరుగుతున్న ఎన్హెచ్–67 రోడ్డు విస్తరణ పనులు, బైపాస్ రోడ్డు పనులు చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాలకు శాపంగా మారాయి. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా పాఠశాల గదులను కూల్చివేయాల్సి వచ్చింది. దీంతో గ్రామంలోని ఓ అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. పాఠశాలను తొలగించినందుకు గాను నష్టపరిహారం కింద రూ.25 లక్షలు ఎంపీడీఓ అకౌంట్కు జమ చేశారు. శిథిలావస్థకు చేరి అద్దె ఇంట్లో కొనసాగుతున్న పాఠశాలకు తమ పిల్లలను భయంభయంగా పంపలేమని, కరెంటు పోయినా, వర్షం వచ్చినా గదుల కొరతతో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షామీర్బాష సమావేశంలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని హామీ ఇచ్చారు. -
ఊర్లో ఉండాల్సిన బడిని మూసేస్తే పిల్లల చదువులెలా? పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి పట్టదా? కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? తల్లిదండ్రుల నుంచి బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలకు.. విద్యాశాఖ అధికారుల వద్ద జవాబు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగ
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశాల్లో అధికారులు.. ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. బడుల్లో సౌకర్యా ల లేమిపై.. పాఠశాలల తరలింపుపై తల్లిదండ్రుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. కాగా చాలా చోట్ల సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరయ్యారు. ● అట్లూరు మండలం చెన్నుపల్లెలో తల్లిదండ్రులు ప్ల కార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఊర్లోనే బడి పెట్టాలని.. కిలోమీటర్ల దూరంగా ఉన్న బడికి పంపేది లేదని స్పష్టం చేశారు ● కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో పిల్లల పర్యవేక్షణపై ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని జేసీ అదితిసింగ్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గతంలో పనిచేసిన హెచ్ఎంతోపాటు పీఈటీలను మళ్లీ ఇదే పాఠశాలకు వేయాలని డిమాండ్ చేశారు. ‘తల్లికి వందనం’ డబ్బులు పడలేదని కొంతమంది జేసీకి ఫిర్యాదు చేశారు. ● జిల్లాలోని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమా వేశాలకు గైర్హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో సమస్యలున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసేందుకు భయపడి ముందుకురానట్లు చర్చ సాగింది. మెగా పేరెంట్ మీటింగులో ప్రశ్నలు లేవనెత్తిన తల్లిదండ్రులు పాఠశాలల్లో వసతుల లేమిపై నిలదీత జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లో పేరెంట్ సమావేశాలు పలుచోట్ల ఎమ్మెల్యేలు డుమ్మా -
చంద్రప్రభ వాహనంపై సౌమ్యనాథస్వామి
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు గు రువారం రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం సౌమ్యనాథస్వామి కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు.భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీ సౌమ్యనాథసేవా ట్రస్ట్ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ తెలిపారు. నేడు ట్రాఫిక్ డైవర్షన్ శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం నందలూరు టౌన్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్లు ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ పొత్తపి, చెన్నయ్యగారిపల్లి, లేబాక గ్రామాల వైపు నుంచి నందలూరు టౌన్కు వచ్చే ప్రజలు ఆలయం వైపు దారిలో రాకుండా ఈదరపల్లి, దుర్గాపురం మీదుగా వెళ్లాలని తెలిపారు. స్వామివారం కల్యాణానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన రావాలన్నారు.మండల ప్రజలు, నాయకులు, పోలీసు వారికి సహకరించాలని కోరారు. -
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట
వల్లూరు : పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఉందని అదే లక్ష్యంతో పేరెంట్, టీచర్ల సమావేశాలను ప్రభుత్వం ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. వల్లూరు మండల పరిధిలోని గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఈఓ షంషుద్దీన్, ఎంపీడీఓ రఘురాం, తహసీల్దార్ శ్రీవాణి, ప్రిన్సిపల్ సురేష్ బాబు పాల్గొన్నారు. -
బ్రిటీష్ పాలన కంటే ఘోరం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో బ్రిటీషు పాలన కంటే దారుణమైన పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రూ.1.75 లక్షల కోట్లు అప్పులు చేసినా ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ప్రస్తుతం రాష్ట్రం కరువుతో అల్లాడుతోందన్నారు. పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయని, ఆ పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. పంటలు కొని రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క కేజీ కూడా కొనలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మొదటి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతులు తెచ్చిన అప్పులకు సున్నావడ్డీ అసలే ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి దశలోనూ రైతులకు సాయమందించారని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.7450 కోట్లు వారి కోసమే వినియోగించారన్నారు. కూటమి ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి, దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళితే రైతులు లక్షలాది మంది తరలి వచ్చారని, నిన్న చిత్తూరులో 25 చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నా మామిడి రైతులు వేలాది మంది హాజరయ్యారన్నారు. చిత్తూరు జిల్లాలో 90 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారని, 7 లక్షల టన్నుల మామిడి పంట వచ్చిందన్నారు. మామిడిని రూ.2లకు కొనేవారు లేరని, అందుకే మామిడి రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు వైఎస్ జగన్ వద్దకు వచ్చారన్నారు. హెలీప్యాడ్ వద్ద 30 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, మార్కెట్ యార్డులో 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదని వేలాది మంది పోలీసులను మోహరించి అన్ని విధాలుగా నియంత్రించారన్నారు. మాజీ మంత్రులకు సైతం నోటీసులిచ్చి రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించారన్నారు. ఇది ప్రజాస్వామ్యమో, నియంతృత్వమో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాధల్లో ఉన్నారని వారిని పరామర్శించేందుకు ఎవరు వచ్చినా స్పందన ఇలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు రైతులను పరామర్శించరని, ఎవరైనా పరామర్శిస్తే ఓర్వలేరని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకొని ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి కనబరచాలని, లేనిపక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, జిలా ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, వి.నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం 25 చెక్పోస్టులు పెట్టి రైతులను అడ్డుకున్నా.. తరలివచ్చారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయానికి సమీపంలో గల కొండపైనున్న రోడ్డులో గురువారం పెద్ద ప్రమాదం తప్పింది. వేంపల్లె వైపు నుంచి చక్రాయపేట వైపు పశువుల మేత కోసం వేరుశనగ గడ్డి వేసుకొని వస్తున్న ట్రాక్టర్.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగి పోయింది. విద్యుత్ వైర్ల సాయంతో అది కింద పడకుండా అలాగే ఉండి పోయింది. ఈ సమయంలో విద్యుత్ ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తు, దేవుడి దయ వల్ల మంటలు చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గండిలో విధులు నిర్వహిస్తున్న ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ విషయం తెలుసుకొని.. హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపి వేయించారు. అనంతరం ట్రాక్టర్ను పక్కకు తొలగించారు. చెత్త ట్రాక్టర్ అడ్డుగా నిలబడి పోవడంతో రాయచోటి వేంపల్లె మార్గంలో కొద్ది సేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మైదుకూరులో విషాదంమైదుకూరు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంతో మైదుకూరులో విషాదం నెలకొంది. స్థానిక నంద్యాల రోడ్డులోని మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన కమాల్ బాషా కుటుంబ సభ్యులు హైదరాబాద్కు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. సంఘటనలో కమాల్ బాషాతోపాటు ఆయన మరదలు మున్ని, మనుమరాలు నదియా మృతి చెందడం.. వాహనంలో ఉన్న మిగిలిన వారు గాయపడటంతో కమాల్ బాషా బంధువులు కన్నీరు అవుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్కు వెళ్లడానికి ముందు కమాల్ బాషా కుటుంబం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం నెల్లూరుకు వెళ్లిన వారు మంగళవారం ఇంటికి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్కు వెళ్లినట్టు కమాల్ బాషా ఇరుగుపొరుగు వారు చెప్పారు. విహార యాత్రలో సంతోషంగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో అతని కుటుంబం ప్రమాదానికి గురికావడం పట్ల వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంతప్పిన పెను ప్రమాదం -
వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు
వేంపల్లె : వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. కానిస్టేబుల్ బి.రామాంజనేయులు ఫిర్యాదు మేరకు.. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వేంపల్లెలోని పక్కీర్పల్లెకు చెందిన మైనర్ బాలిక అదృశ్యంపై పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో సెంట్రీగా రామాంజనేయులరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కిర్పల్లెకు చెందిన సయ్యద్ సుమియా, చింతలమడుగుపల్లెకు చెందిన మడకబాబులు ప్రేమించుకున్నారని, వారిని మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గర ఉన్న వజ్రాల గుట్టలో ఉండగా.. సుమియా తల్లిదండ్రులు చూసి మడక బాబుపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మడక బాబుతోపాటు వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగా ముస్లిం వర్గానికి చెందిన పక్కీర్ పల్లెకు చెందిన సయ్యద్ మహమ్మద్ మూసా, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మస్తాన్, వేంపల్లెకు చెందిన మాజీ జెడ్పీటీసీ షబ్బీర్, బిడ్డాలమిట్టకు చెందిన అబ్దుల్, ఇబ్రహీం, హైదర్ వలి (లాడెన్), మదీనాపురానికి చెందిన గుజిరి దర్బార్, అక్బర్, ఇబ్రహీం, సమీర్, ఈసుబ్, కోహీనూర్ నజీర్లతోపాటు దాదాపు 150 మందికి పైగా మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ అవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. పోలీసులనే హత మార్చాలనే ఉద్దేశంతో రాళ్లు విసరగా హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, మహమ్మద్ ఆలీ, నజీర్ అహమ్మద్ తప్పించుకున్నారు. పోలీస్స్టేషన్ ముట్టడిదారులు అంతటితో ఆగకుండా రాళ్లు తీసుకుని పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు, వరండాలోని ఇనుప కుర్చీ, వెనుక వైపు ఉన్న డోరును ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తి నష్ట పరిచారు. అంతే కాకుండా పోలీసు యూనిఫాంలో ఉన్న వారికి విధులకు ఆటంకం పరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు’ డీఎస్పీ వివరించారు. పోలీసుల అదుపులో 40 మంది? వేంపల్లె : వేంపల్లె పోలీస్స్టేషన్ ముట్టడి కేసులో 200 నుంచి 300 మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసిన కేసులో 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి వేంపల్లెలో జల్లెడ పట్టడం జరుగుతోంది. గురువారం వేంపల్లెలో ఉన్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాల పోలీస్స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వేంపల్లెలోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు తీసుకోవడంతో.. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన చాలా మంది వేంపల్లెను విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారితోపాటు సంఘటనను చూసేందుకు వచ్చిన వారు కూడా తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. డీఎస్పీ వేంపల్లెలో మకాం వేసి ముట్టడిదారుల అరెస్టుపై ఆరా తీస్తున్నారు. బాలిక తండ్రి మాబువలి ఫిర్యాదు మేరకు మడక బాబుపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీస్స్టేషన్పై దాడి చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదు ఎస్పీ ఆదేశాల మేరకు నమోదు -
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పులివెందుల : చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన మోసాలను ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ పార్టీలోని స్టూడెంట్ వింగ్, మహిళా వింగ్, వలంటీర్ వింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వింగ్ వీటితోపాటు మన నాయకులు, కార్యకర్తలకు ఈ కాన్సెప్ట్ తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ఏడాది పాలనలో ఆయన ఏమి అమలు చేశారు, ఏమి అమలు చేయలేదనేదే ప్రధాన అంశమన్నారు. చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోను గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను తెలుగుదేశం పార్టీ ఏవిధంగా మభ్యపెట్టిందో మనకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జగనన్న ప్రొజెక్టర్లోని స్పీచ్ను చూసిన తర్వాత దాన్ని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతేకాక ప్రొజెక్టర్ ద్వారా మనం చూసిన అంశాన్ని కరపత్రంగా ముద్రించామని.. ఈ కరపత్రాన్ని ప్రతి ఇంటికి తీసుకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రొజెక్టర్ ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు వీక్షించారు. వైఎస్ జగన్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, ఉచిత బస్సు, 50ఏళ్లకే పింఛన్ వంటి చంద్రబాబు హామీల ద్వారా ప్రజలు ఏ మేరకు నష్టపోయారో వైఎస్ జగన్ వివరించారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కరపత్రం ద్వారా రాష్ట్రంలోని నాయకులందరూ చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండు పత్రాలను కూడా అందజేశారని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు తన ఏడాది పాలనలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, నూర్బాషా, దూదేకుల సంఘం నాయకులు రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏడాది పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలోని మోసాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఫుడ్ కార్పొరేషన్ అఽధికారుల పర్యటన
కడప కోటిరెడ్డిసర్కిల్ : న్యూఢిల్లీకి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. గొరిగెనూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం, రైతు సేవ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్యార్డును సందర్శించి రైతులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఓ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఒకే దేశం ఒకే కార్డు పథకం కింద దేశంలోని ఏ రేషన్ షాపు నుంచి అయినా కార్డుదారులు బియ్యం పొందవచ్చని తెలియజేశారు. అనంతరం కడపలోని బఫర్ గోడౌన్కు చేరుకుని బియ్యం నాణ్యత, పోర్టిఫైడ్ బియ్యం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీకే దిన్నె మండలం బోడెద్దులపల్లి చౌక దుకాణం పరిధిలోని కార్డుదారులతో మాట్లాడారు. వారు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శిరీష, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
కడపకు వచ్చారో..!
సాక్షి ప్రతినిధి, కడప : ‘రిమ్స్లో ఏం చేసినా మేమే చేయాలి.. మా మనుషుల ద్వారానే చేపట్టాలి. తిరుపతి నుంచి వచ్చి మీరు ఇక్కడ కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా. ఇక్కడ మేం లేమా? టెండర్ వేసేటప్పుడు కనీసం సంప్రదించేది లేదా? ఇష్టానుసారం టెండర్లు వేస్తే మీకు స్వాగతం చెప్పాలా? గౌరవంగా చెబుతున్నాం, మీరు కడపకు రావొద్దు..’ జిల్లా టీడీపీ ముఖ్యనేత చేసిన హెచ్చరికలు ఇవి. అధికారం అండతో ఈగల్ హంట్ ప్రతినిఽధిపై రెచ్చిపోయిన వైనమిది. కడప రిమ్స్లో ఇప్పటివరకూ ఎక్స్ఫర్ట్ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సర్వీసు అందుతోంది. కాలపరిమితి పూర్తి కావడంతో టెండర్లు ప్రక్రియ చేపట్టారు. ఈ మేరకు రిమ్స్లో సెక్యూరిటీ సర్వీసు అందించేందుకు న్యూడిల్లీకి చెందిన ఈగల్ హంట్ ఏజెన్సీ కొత్తగా టెండర్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ హంట్ ఏజెన్సీ ప్రతినిధి తిరుపతికి చెందిన వ్యక్తికి టీడీపీ ముఖ్యనేత నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. తమకు తెలియకుండా సెక్యూరిటీ సర్వీసు నిర్వహణకు వచ్చావో..నీకుంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపుల పర్వం నడుస్తుండగానే టెండర్లు పూర్తి అయ్యాయి. ఆ సెక్యూరిటీ సర్వీసులు తమ వర్గీయుడు ద్వారానే కొనసాగించాలంటూ ప్రజాప్రతినిధి కూడ ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ‘మీరు టీటీడీ ఉద్యోగి, మాతో పెట్టుకొవద్దు అనవసర కాంప్లీగేషన్స్ లేకుండా సెక్యూరిటీ సర్వీసు అప్పగించా..’ లంటూ ఫోన్లలో టీడీపీ ముఖ్యనేత, ప్రజాప్రతినిధి ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో వాడెలా నిర్వహిస్తాడో చూద్దామంటూ భీష్మించుకున్నట్లు సమాచారం. శానిటేషన్ ప్రక్రియపై కూడా... రిమ్స్లో ఇదివరకూ ఏ–1 ఏజెన్సీ శానిటేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈమారు టెండర్లలో ఎవరు పాల్గొనకుండా జిల్లా టీడీపీ ముఖ్యనేత మంతనాలతోపాటు, వర్గీయుల బెదిరింపులు తెరపైకి వచ్చాయి. ఇక ఎవరూ టెండర్లల్లో పాల్గొనరనే క్రమంలో తిరుపతికి చెందిన పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ పాల్గొని టెండర్ దక్కించుకంది. టెండర్ బిడ్ ఓపెన్లో ఎల్–1గా నిలిచింది. ఫైనాన్స్ బిడ్ అనుమతి దక్కాల్సి ఉంది. ఈదశలో ‘కడపకు వచ్చి మీరు ఎలా కొనసాగిస్తా’రంటూ జిల్లా టీడీపీ ముఖ్యనేత నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పెట్టింది, అధికారికంగా పాల్గొన్నాం, టెండర్ దక్కుతోంది. కచ్చితంగా కొనసాగించి తీరుతామంటూ సదరు ప్రతినిధి నుంచి జవాబు రావడంతో సదరు టీడీపీ నేత అవాక్కయినట్లు తెలుస్తోంది. సత్తా లేని వాడైతే అలా మాట్లాడరు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, వారికి తెరవెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటూ అనుచరులను పురమాయించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడడం వెనుక అటు సెక్యూరిటీ, ఇటు శానిటేషన్ టెండర్లు ద్వారా ప్రతి నెలా రూ.59లక్షలు బిల్లింగ్ ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్ నుంచి అప్పనంగా నెలనెలా కప్పం లభిస్తుండడంతో టీడీపీ ముఖ్యనేత రంకెలు వేస్తున్నట్లు సమాచారం. కాగా పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఫైనాన్స్ బిడ్ అప్రూవల్ రాగానే, సీఎంఓ ద్వారా రిమ్స్ అధికారులకు సిఫార్సులు చేయించుకొని కడపకు రానున్నట్లు తెలుస్తోంది. ఈగల్ హంట్ ప్రతినిధులకు టీడీపీ ముఖ్యనేత బెదిరింపులు రిమ్స్లో మేము చెప్పినట్లే నడుచుకోవాలి మావాడితోనే సెక్యూరిటీ టెండర్ కొనసాగించాలి అధికారం అండతో బెదిరింపులకు పాల్పడుతున్న వైనం -
క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 2025–26 సంవత్సరంలో నాలుగో తరగతి ప్రవేశాలకు బుధవారం ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎత్తు, జరువు, మెడికల్ టెస్ట్ , స్టాడింగ్ బ్రాడ్ జంప్, షాట్పుట్, 30 మీటర్ల ప్లైయింగ్ స్టార్ట్, రన్నింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 27 మంది హాజరుకాగా, మెడికల్ టెస్ట్ పరీక్షలో నలుగురిని తిరస్కరించారు. క్రీడా మైదానంలో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో హాజరుకాని తొమ్మిది మంది బాల, బాలికలు ఈ నెల 11న నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. 11న ఐదో తరగతి ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందని, ఆన్లైన్లో అర్హులైన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. -
మా ఇంటి తాళాలు తెరిపించండి సారూ..
కమలాపురం : గత నెల 29న మా ఇంటికి కొందరు తాళాలు వేశారు.. వాటిని తెరిపించాలని కోగటం గ్రామానికి చెందిన రామిశెట్టి సతీష్ భార్య రాజేశ్వరి కోరారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన భర్త సతీష్ శనగల వ్యాపారం చేసి కొంతమందికి కోటి రూపాయల వరకు డబ్బు ఇవ్వాల్సి ఉందని, తమకు గ్రామంలో రూ.40 లక్షలు రావాల్సి ఉందన్నారు. నగదు అందగానే కడతామని చెప్పినా రైతులు వినకపోవడంతో ఒత్తిడి భరించలేక తన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడన్నారు. దీంతో రైతులు గత నెల 29న తమ ఇంటికి తాళం వేశారని, అప్పటి నుంచి తాను, తన పిల్లలు బంధువుల ఇంట్లో తలదాచుకున్నామని తెలిపారు. ఎస్పీకి ఫిర్యాదు చేసి.. కమలాపురం ఎస్ఐ వద్దకు వచ్చామని, ఇంటికి తాళం వేసిన వారి వివరాలతో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని ఎస్ఐ తెలిపారన్నారు. ఇదిలా ఉంటే ఆరేళ్ల క్రితం రైతుల వద్ద శనగలు కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకుండా తిప్పుతున్నాడని బాధితులు బషీర్, సుబ్బారెడ్డి, సాంబ శివారెడ్డి తదితరులు గతంలో కమలాపురం పోలీస్ స్టేషన్, తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగలేదని బాధిత రైతులు సతీష్ ఇంటికి తాళం వేసినట్లు తెలిసింది. -
కళ్లు తెరిచిన కూటమి పెద్దలు
సాక్షి ప్రతినిధి, కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం వీడింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన విద్యార్థుల ఉద్యమానికి తోడు ..వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్కు ప్రభుత్వంలో చలనం వచ్చింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయంపై సవతి తల్లి ప్రేమ కారణంగా 2025– 26 ఏడాదికి అడ్మిషన్లు నోచుకోలేదు. మరోవైపు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు దక్కలేదు. ఈ నేపధ్యంలో వారం రోజులుగా విద్యార్థులు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అదే విషయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ట్వీట్ చేస్తే ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచారు. బుధవారం అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన కడప నగరంలో 2020లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్యూ)కి సమాంతరంగా 14 రకాల స్పెషలైజ్డ్ కోర్సులతో విశ్వవిద్యాలయాన్ని కడప నగరంలో ఏర్పాటు చేసింది. యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో శాశ్వత భవనాల కోసం అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 110 ఎకరాల భూమి సైతం కేటాయించింది. రూ.350 కోట్లతో విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల కోసం ఆకృతులు సైతం సిద్ధం చేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శాశ్వత భవనాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా పురోగతి లేదు. ఏఎఫ్యూ వ్యవహారాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. సీఓఏ (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్)అధికారులు అనుకూలంగా ఉన్నా ప్రభు త్వం పట్టించుకోలేదు. వెరసి గుర్తింపునకు నోచు కోలేదు. రెగ్యులర్ నియామకాలు లేకపోవడం మరో కారణంగా నిలిచింది. ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఏడీసెట్ నిర్వహణ చేపట్టి నూతన అడ్మిషన్లకు శ్రీకారం చుట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు నిరవధిక ఆందోళనకు దిగారు. మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి నేపధ్యంలో అన్యాయానికి గురయ్యామని వాపోయారు. ఈ అంశాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఫలితంగా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మేల్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఏడీసెట్తో నిమిత్తం లేకుండా మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సీఓఏ అనుమతులు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్యూ అడ్మిషన్లు చేపట్టేందుకు ఉత్తర్వులు మెరిట్ ప్రాతిపదిక అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్కు స్పందన సీఓఏ అనుమతులకు కృషి చేయాల్సిందిగా విద్యార్థుల విన్నపం -
ఢిల్లీ వర్క్షాప్లో కలెక్టర్
కడప సెవెన్రోడ్స్ : న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్కు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన కలిశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు కార్యకలాపాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి కలెక్టర్ వివరించారు. గండికోటలో జరుగుతున్న పర్యాటక మౌలిక సదుపాయాల గురించి తెలియజేశారు. 11 చీనీ మొక్కల నరికివేతకొండాపురం : మండలంలోని తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డికి చెందిన 3.5 ఎకరాల చీనీ తోటలో 11 చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి బుధవారం తెలిపారు. గోవర్శన్రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలానికి ఒక కిసాన్ డ్రోన్సిద్దవటం : ప్రతి మండలానికి 80 శాతం రాయితీపై ఒక కిసాన్ డ్రోన్ ఇస్తామని రైతు బృందాలు అధికారులను సంప్రదించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్ తెలిపారు. సిద్దవటం మండలం శాఖరాజుపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్చింగ్ షీట్ పద్ధతిలో సాగు చేసిన దోస పంట పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఈకేవైసీ ఫింగ్ ద్వారా చేయించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిద్దవటం వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల పంపిణీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శివకుమార్, మురళి, రైతులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
– డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ దరఖాస్తులను జులై 13వ తేదీ వరకు ఆన్లై న్ పోర్టల్ htt pr://nationalawardstotea chers.education.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ తెలిపారు. అర్హతలు, ఇత ర సమాచారం కోసం పై వెబ్సెట్నే సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. ఢిల్లీ వర్క్షాప్లో కలెక్టర్ కడప సెవెన్రోడ్స్ : కేంద్ర ప్రభుత్వ బొగ్గు, ఖనిజ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణపై బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భారత ప్రభుత్వ ఖనిజ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డీఎల్ కాంతారావు, వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, గనులు, భూగర్భ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణ ప్రణాళిక, అమలు అనే అంశంపై నియమించిన కమిటిలో జిల్లా కలెక్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత బొగ్గు , గనుల మంత్రిత్వశాఖ తరుపున కలెక్టర్కు జ్ఞాపిక అందించి సత్కరించారు. 11న జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 11న కడప నగర శివార్లలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులోని టిరోవిజన్ కంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి అర్హతనుబట్టి రూ. 10–50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. నేడు జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 4 నుంచి 10వ తరగతి విద్యార్థుల చేత మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ. 7.85 కేటాయించి నిధులను విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి తమ తల్లి పేరుతో మొక్కనాటేలా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే విద్యార్థి ప్రొగ్రెస్, హాలిస్టిక్ రిపోర్టు పేరుతో విద్యార్థి అభ్యసన, ఆరోగ్య తదితర వివరాలు అందులో పొందుపరిచి చర్చించడంతోపాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమలను తెలియచేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 2818 ప్రభుత్వ, ప్రైవేటు బడులతోపాటు 155 ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో కూడా నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్స్ నమోదుకు 12 వరకు అవకాశం రాయచోటి జగదాంబసెంటర్ : రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సుకు జరిగిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డైట్లో సీటు పొందడానికి ఆన్లైన్ వెబ్ ఆధారంగా ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు ఈ నెల 9 నుంచి 12 వరకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ ఎంఆర్ఎస్ అజయ్కుమార్బాబు తెలిపారు. బుధవారం రాయచోటిలోని డైట్ విద్యా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వారికి సీట్లు కేటాయించి ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 25 నుంచి డైట్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రాయచోటి డైట్ తెలుగు మీడియంలో 50, ఆంగ్ల మాధ్యమంలో 50, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లు ఉన్నాయన్నారు. డీఈఈసెట్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు డైట్ సీనియర్ లెక్చరర్ మడితాడి నరసింహారెడ్డిని (9440246825 నంబర్లో) సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ లెక్చరర్స్ వైసీ రెడ్డప్పరెడ్డి, తిరుపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్లో 461 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 93.2 ఓవర్లలో 495 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆర్దిత్ రెడ్డి 76 బంతుల్లో సెంచురీ చేశాడు. అనంతపురం జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 4 వికెట్లు, నవదీప్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 67 ఓవర్లకు 250 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 177 బంతుల్లో 133 పరుగులు, సాత్విక్ 41 పరుగులు చేశాడు. కడప జట్టులోని ధీరజ్ కుమార్ రెడ్డి 4 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కడప జట్టు 319 పరుగుల అధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్లో 11 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు మ్యాచ్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 63.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 63 పరుగులు, బాలాజీ 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులో మహిత్ 4 వికెట్లు, మల్లి ఖార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 28 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఆ జట్టులోని మురళీ హృదయ్ 60 పరుగులు, కెవి ఓంకార్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టు 174 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు,కు వంద మీటర్ల విద్యా సంస్ధలకు వంద మీటర్ల దూరంలో బుధవారం ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఇజి.అశోక్కుమార్ ఆదేశాలతో పోలీస్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాల, విద్యా సంస్ధలను సందర్శించి వంద మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణం షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల తనిఖీలు చేసి వాటి అమ్మకాలు నిషేధమని దుకాణదారులకు తెలిపారు. విద్యా సంస్ధల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణ యజమానులకు కోప్టా యాక్టు ప్రకారం జరిమానా విధించారు. -
పోలీసుల విచారణకు వస్తూ.. అస్వస్థతకు గురై
బద్వేలు అర్బన్ : బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన నకిలీ పట్టాల కేసులో విచారణకు హాజరు అయ్యేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన నకిలీ ఇంటి పట్టాల కేసులో గత వారం రోజులుగా పోలీసులు పలువురినీ విచారిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని సుమిత్రా నగర్కు చెందిన డి.రవికుమార్ను రోజూ స్టేషన్కు పిలిచి రాత్రికి ఇంటికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా విచారణ నిమిత్తం స్టేషన్ వద్దకు వచ్చిన రవికుమార్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు తమను ఏమీ ఇబ్బంది పెట్టలేదని, వారం రోజులుగా స్టేషన్కు పిలిపిస్తుండటంతో భయాందోళనకు గురై నిద్ర మాత్రలు మింగారని రవికుమార్ కుటుంబీకులు తెలిపారు. -
ఎల్లలు దాటిన అభిమానం
కడప కార్పొరేషన్ : కువైట్ దేశంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖర్రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఖైతాన్ ప్రాంతంలో ఉన్న రాజధాని రెస్టారెంట్లో వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. కువైట్ కన్వీనర్ బాలిరెడ్డి, గల్ఫ్ కోకన్వీనర్ గోవిందు నాగరాజు మాట్లాడుతూ డా. వైఎస్సార్ తన పరిపాలనలో పేద బడుగు బాలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకం, తదితర పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ఎం.చంద్రశేఖర్రెడ్డి, కె.రమణయాదవ్, మర్రి కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిరి తాము రెడ్బుక్ తరహాలో రాయగలమని, అది తమ సంస్కృతి కాదన్నారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ రెడ్బుక్ పాలన ప్రక్కన పెట్టి డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీప్రసాద్, షేక్ రహంతుల్లా, షేక్ గఫార్, షాహుస్సేన్, ఎ.బాలక్రిష్ణారెడ్డి, గోవిందురాజు, అప్సర్అలీ, అన్నాజీ, వెంకటక్రిష్ణ, ఉపాసన, వెంకటరమణారెడ్డి, షేక్ గఫార్, నరసారెడ్డి, పి.సురేష్రెడ్డి, అబూతురాబ్ పాల్గొన్నారు. ఖతార్లో వైఎస్సార్ జయంతి ఖతార్ దేశంలోని దోహా పట్టణంలో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుక ఘనంగా జరిగింది. స్థానిక తాజ్ మహారాజ హోటల్లో వైఎస్సార్సీపీ ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఖతార్ వైఎస్సార్సీపీ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. శశికిరణ్ మాట్లాడుతూ రాజన్న భౌతికంగా తమ మధ్య లేకపోయినా, తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్.జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలు చేసి అద్భుతపాలన సాగించారన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధి వర్జిల్బాబు, వైఎస్సార్సీపీ ఖతార్ కమిటీ కో కన్వీనర్లు జాఫర్ హుస్సేన్, ఆరోన్ మనీష్, ఎన్.నాగేశ్వరరావు, జయరాజు, ఎన్.లియోపోల్డ్కింగ్, టి.అరుణ్కుమార్, హేమంత్, గణేష్, శివనారాయణ, తదితరులు పాల్గొన్నారు.కువైట్లో ఘనంగా మహానేత జయంతి -
వైభవం.. సౌమ్యనాథుని గరుడోత్సవం
నందలూరు : సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు బుధవారం రాత్రి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహనసేవ దిగువవీధి, పేటగడ్డ, బస్టాండ్ మీదుగా అరవపల్లి వరకు సాగింది.గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు.అరవపల్లిలో శ్రీ ముత్తు మారెమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన విడిదిలో ఉభయదారులు కుర్ర మణియాదవ్, ప్రభావతి దంపతులను మంగళవాయిద్యాలతో ఆహ్వానించి పూజలు జరిపించారు. బుధవారం ఉదయం పుష్పాలంకరణ ప్రియుడైన సౌమ్యనాథస్వామి మోహిని అలంకారంలో శేషవాహనంపై మాఢవీధుల్లో విహరించారు.ఊరేగింపు సందర్భంగా కడపకు చెందిన గణేష్ కోలాటం బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాలలో నేడు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
చెప్పులేసుకొని రొట్టెలు వదిలిన ఎమ్మెల్యే
– ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు కడప కార్పొరేషన్ : మొహర్రం పండుగను పురస్కరించుకొని నాదర్ షా వలీ దర్గా ఉరుసుకు ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలే సందర్భంగా ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకొని ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని పలువురు విమర్శిస్తున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్రంలో ప్రధాన మోదీ అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రటిఘటిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీఎస్ఐ చర్చి నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్, గోకుల్ సర్కిల్, ఒకటవ గాంధీ సర్కిల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మీదుగా సెవెన్ రోడ్స్ దగ్గరకు చేరింది. అక్కడ నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తోందన్నారు. లేబర్ కోడ్లు అమలుచేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలను సైతం పెంచుతున్నారని, కార్మిక సంఘాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 73 షెడ్యూల్లోని మునిసిపల్, అంగన్వాడీ, ఆశా, తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందక, ఉద్యోగభద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి సమస్యలపై ఇకపై నిరసన తెలుపుకొనే అవకాశం కోల్పోతారని, ఇది నిర్బంధ నిరంకుశ విధానాలకు తార్కాణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో, హమాలీ, వీధి విక్రయ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతూ ఆదానీ, అంబానీలకు పన్నులు తగ్గిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగసుబ్బారెడ్డి, బి.మనోహర్, కే.శ్రీనివాసులురెడ్డి, బండి రామలింగారెడ్డి. ఉద్దె మద్దిలేటి, సుబ్బరాయుడు, జయవర్ధన్, ఓబయ్య, ఐఎఫ్టీయూ నాయకులు రాము, రమణయ్య, యూటీఎఫ్ నాయకులు లక్ష్మిరాజా ఎన్.వెంకటశివ, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.దేశవ్యాప్త సమ్మె సభలో వామపక్ష నాయకులు -
రిమ్స్లో ‘దళారుల దందా’..!
సాక్షి, టాస్క్ఫోర్స్ : దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్, నూతన సర్టిఫికెట్లను ఇప్పించే విషయంలో కడప రిమ్స్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, పులివెందుల ఆసుపత్రుల ఆవరణలో దళారుల దందా యథేచ్చగా జరుగుతోంది. కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో తమకు తాము దళారాలు సర్టిఫికెట్కు ఓ రేటు ఫిక్స్ చేశారు. దివ్యాంగుల నుంచి రూ.30,000 వసూలు చేసి.. ఆస్పత్రిలో పనిచేస్తున్న మీడియేటర్ ఉద్యోగికి రూ.18 వేల నుంచి 22 వేల వరకు ఇస్టున్నట్లు ఆరోపణలున్నాయి. నూతన సర్టిఫికెట్కు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం దొంగ, మోసపూరితమైన సర్టిఫికెట్ల ఏరివేతను కొనసాగిస్తూ జూలై, ఆగష్టు, సెప్టెంబర్ వరకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతోంది. దివ్యాంగుల సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ కాకుండా మరో డాక్టర్ పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారులు నిఘా వుంచి దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పొలతలలో తలనీలాలకు వేలంపాటపెండ్లిమర్రి : మండలంలోని పొలతల మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల వేలం ఈఓ క్రిష్ణానాయక్ బుధవారం నిర్వహించారు. 59.250 కిలోల తలనీలాలను ఒంగోలుకు చెందిన యాదగిరి రూ.5,05,500కు వేలం పాడి దక్కించుకున్నారు. దీంతోపాటు గంగనపల్లె, తిప్పిరెడ్డిపల్లె, కొత్తగిరియంపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 15.48 ఎకరాల భూమిని మూడేళ్ల కౌలుకు వేలం వేయగా రూ.18,400 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాలి మదనపల్లె రూరల్ : ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జైలు సిబ్బంది కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ అంజనీకుమార్ అన్నారు. మదనపల్లె సబ్ జైలు, డీఎస్పీ మహేంద్రతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడి జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు గదులు, మరుగుదొడ్లు పరిశీలించి, మూడు నెలలకు పైగా జైలులో ఉన్న ఖైదీల వివరాలు, బెయిల్ మంజూరైనా, బయటకు వెళ్లని ఖైదీల సమాచారం, ఉచిత న్యాయసేవలపై జైలర్ లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. సీఐ ఎరీషావలీ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.ఒక్కో సర్టిఫికెట్కు రూ. 30,000 వసూలు -
పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేశామని పేర్కొన్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్ని రకాల ఇరిగేషన్ కాల్వల పనులను, గ్రామీణ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, స్మశానాలకు ప్రహారీలు వంటి నిర్మాణాలను ఉపాధి నిధులతో పూర్తి చేశామన్నారు. అన్ని మండలాల్లో మినీ గోకులం షెడ్లతోపాటు రైతుల డిమాండ్లను బట్టి చిన్నచిన్న జీవాల షెడ్లను కూడా చేపడుతున్నామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అధిక శాతం సబ్సిడీతో అన్ లిమిటెడ్ రుణ సాయం ఇస్తున్నామనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 10వ తేది అన్ని మండలాల్లోని పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గోకులం భవనాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సూర్యఘర్ పథకాన్ని అనుసంధించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిఽధిలోని రైతులకు మినీ గురుకులాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సీజన్ల వారీగా తెగుళ్ల నివారణ, ఎరువులవాడకంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడుతూ సదరమ్ ఎంట్రీలు ఆన్లైన్లో మూడుసార్లు చేస్తే తర్వాత ఎంట్రీలు చేయడానికి సైట్లో అవకాశం ఉండదని, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరారు. సబ్సిడీ గ్యాస్, రేషన్, రేషన్కార్డులలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. డీఆర్సీ సమావేశంలో మంత్రి సవిత -
ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం
ఉభయ వైఎస్సార్ జిల్లాలో కడప తర్వాత ఏర్పాటైంది రాజంపేట ఆర్టీసీ డిపో. ఇది ఏర్పాటై 50ఏళ్లు పూర్తి కానుంది. కేవలం ఏడు బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.గోల్డెన్ జూబ్లీ చేసుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. రాజంపేట: ఉభయ వైఎస్సార్ జిల్లాలో పార్లమెంటరీ కేంద్రమైన రాజంపేటలో ఆర్టీసీ ఆవిర్భావం ఐదు దశాబ్దాలకు చేరుకుంది. 1975 ఆగస్టు 15న డిపో ఏర్పాటుచేయాలని అప్పట్లో సంస్థ నిర్ణయించింది. కడప తర్వాత ఏర్పాటైన తొలి డిపో. ఈ క్రమంలో రాజంపేట–రాయచోటి రోడ్డులోని ఇప్పుడున్న ఎల్ఐసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా కంచె ఏర్పాటుచేసి, అక్కడి నుంచి ఆర్టీసీ సేవలను తాత్కాలికంగా ప్రారంభించారు. కడపకు అప్పటికే ఏర్పాటైన డిపో నుంచి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులను రప్పించారు. ఏడుబస్సులను తొలిసారిగా రొడ్కెక్కించారు.చరిత్ర ఘనంగా ఉన్నా అభివృద్ధి తిరోగమన దిశలో ఉంది. 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ హయాంలో.. మాజీ శాసనసభ్యురాలు కొండూరు ప్రభావతమ్మ ఆధ్వర్యంలో రాజంపేటలో ఆర్టీసీ ఏర్పాటుకు ప్రస్తుతం ఎర్రబల్లి ప్రాంతంలోని ఆరున్నర ఎకరాలకు పైగా ఉన్న స్ధలాన్ని ఎంపిక చేశారు. ఆ స్ధలంలో బస్స్టేషన్, ఆర్టీసీ కార్మికుల క్వార్టర్స్, డిపో గ్యారేజీల నిర్మాణం చేపట్టారు.ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు ఇదే.ప్రస్తుతం ఈ స్థలాలకు కోట్లాది రూపాయల విలువ ఉంది. ఆర్టీసీ బస్టాండు,డిపో పట్టణానికే కేంద్రంగా మారింది. ● డిపో ఏర్పాటు తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరుతో సమానంగా బస్సు సర్వీసులను ఇక్కడి నుంచి నడిపారు. 2011–2012 వరకు 125 బస్సులు ఉండేవి. ఆర్టీసీ కార్మికులతో కళకళలాడింది. సబ్డివిజన్ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేశారు. పల్లెపల్లెకు బస్సులు నడిచేవి. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వచ్చింది. ● మాజీ ముఖ్యమంత్రి జలగంవెంగళరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ హయాంలో చరిత్ర సృష్టించిన డిపో..ఇప్పుడైతే తిరోగమనదిశలో పయనిస్తుందనే విమర్శలున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోయాయి. సగానికిపైగా పల్లెలకు బస్సులు తిరగడంలేదు. ప్రైవేట్ వాహనాల కారణమని ఆర్టీసీ వారు చెబుతున్నారు. ఆర్టీసీకి 40 బస్సులు ఉండగా, అద్దె బస్సులు 30 ఉన్నాయి. ఆర్టీసీ ఆదాయం కూడా ఘననీయంగా పడిపోతూవచ్చింది. పూర్వవైభవం వచ్చేనా... రాజంపేట ఆర్టీసీ డిపో రోజురోజుకు తిరోగమన దిశలో ఉంది. కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు పుణ్యక్షేత్రాలకు డిపోనుంచి డైరెక్ట్ కనెక్టివిటీ సర్వీసులను ఫ్రీక్వెన్సీగా పెంచాలని ఆర్టీసీ వర్గాలవారు అంటున్నారు. నందలూరు ఆర్ఎస్ టు రాజంపేట ఆర్ఎస్ బసు సర్వీసుతోపాటు పల్లె సర్వీసులను పున రుద్ధరించాల్సిన అవసరం ఉంది. బ్యాటరీ బస్సులను ప్రవేశపెడితే రాజంపేట ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు చెబుతున్నారు. వందలాది రూట్లలో బస్సు సర్వీసులు ఉండగా, ఇప్పుడు 37 సర్వీసులకు వచ్చింది. ప్రస్తుతం 343 మంది కార్మికులు ఉన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. 50 ఏళ్ల కిందట వేసి శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. సిల్వర్జూబ్లీ చేసుకుంటున్న క్రమంలో ఆర్టీసీ అభివృద్ధిలో నూతన మార్పులు వస్తాయా? ఆ దిశగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తుందా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఏడు బస్సులతో డిపో ప్రారంభమైంది కేవలం ఏడుబస్సులతో రాజంపేట ఆర్టీసీ డిపో ప్రారంభమైంది. సాతుపల్లెకు ఎదురుగా ఖాళీస్థలంలో తాత్కలికంగా బస్టాండు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బస్సులను నడిపించారు. 1975లో డిపో ఏర్పాటులో పనిచేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. –ఎం.బ్రహ్మయ్య, మాజీ కండక్టరు. రాజంపేట పూర్వవైభవం తీసుకురావాలి కడప తర్వాత రాజంపేటలోనే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలి. ఆ బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకోవాలి. బస్సుస్టేషన్ ఆధునికీకరణతోపాటు కొత్త బస్సులు, అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి. రాజంపేట డిపోకు పూర్వవైభవం కల్పించాలి. –జీవీ నరసయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ -
కదులుతున్న రైలు నుంచి దూకి తల్లీకూతుళ్లకు గాయాలు
జమ్మలమడుగు : ఎక్కాల్సిన రైలుకు బదులు పొరబాటున మరో రైలు ఎక్కిన తల్లీకూతుళ్లు తీరా రైలు కదులుతున్న సమయంలో కిందకు దూకేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో జరిగింది. తల్లీకూతుళ్లయిన మహాలక్ష్మీ, శ్రీదేవి మంగళవారం మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే రైలు కోసం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. అయితే ఇంతలో మరో రైలు రావడంతో అదే ధర్మవరం రైలు అనుకుని అందులో ఎక్కారు. తీరా కదులుతున్న సమయంలో ఇది ధర్మవరం రైలు కాదని మీరు వెళ్లాల్సిన రైలు మరొకటి అని తోటి ప్రయాణికులు చెప్పారు. అప్పటికే రైలు కదిలింది. దీంతో మహాలక్ష్మీ, శ్రీదేవి వేగం పుంజుకుంటున్న రైలులో నుంచి ఒక్కసారిగా దూకేశారు. తల్లి మహాలక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా కుమార్తె శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులు ఏఏస్ఐ సలాం, సుబ్బరాయుడు పరుగున వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
పోలీస్ స్టేషన్ ముట్టడిపై కేసు నమోదుకు సన్నాహాలు
వేంపల్లె : వేంపల్లె పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీరుపల్లెకు చెందిన సుమియా అనే బాలిక అదృశ్యం కావడంతో సోమవారం రాత్రి పక్కీరుపల్లె, బిడ్డాల మిట్ట, కాలేజీ రోడ్డులో ఉన్న పలువురు పోలీస్ స్టేషన్ను ముట్టడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లోని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్పై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు రువ్వారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలిక సుమియా ఆచూకీ తెలిసిందని ఇక వెళ్లాలని నిరసనకారులకు పోలీసులు తెలిపిన వినకుండా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ సీసీ కెమెరాల్లో బంధించిన వీడియోలను చూసి నిరసనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. నిరసన సమయంలో రాత్రి రోడ్లపై తిరిగే మోటార్ బైకులను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మంగళవారం మోటార్ బైకుల కోసం వచ్చిన వారితో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, మోటార్ బైకు వద్ద ఫొటోలు తీసుకొని పంపించి వేశారు. సీసీ కెమెరాల్లో, పోలీసులు తీసిన వీడియోలో మోటార్బైకుదారులుంటే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో వందల మందిపై కేసు నమోదవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కేసు నమోదుపై పోలీసులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలనేది గుర్తించినట్లు తెలుస్తోంది. బాలిక సుమియాకు కడప రిమ్స్లో చికిత్స.. సోమవారం రాత్రి పక్కీరుపల్లెకు చెందిన సుమియా ఆచూకీ తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు మంచినీరు తాపించి కడప రిమ్స్కు పంపించారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్కు ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వెళ్లి చికిత్స పొందుతున్న బాలిక సుమియాను విచారించారు. మంగళవారం ఆ బాలిక కోలుకుని ఆరోగ్యంగా ఉందని సీఐ నరసింహులు తెలిపారు. వివరాలను బాలిక చెబితే తప్ప నిందితులను శిక్షించలేమని చెప్పారు. ఇప్పటికే చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడక బాబు, వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్ అనే అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.