breaking news
YSR District News
-
నాపై పోలీసులు దాడి చేశారు
కడప అర్బన్ : హోటల్లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో పోలీసుల ఆకస్మిక తనిఖీలుకడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్, అప్సర సర్కిళ్లలో ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలు, ఆర్టీసీ బస్టాండ్లో సోదాలు జరిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను నడిపేటపుడు నిబంధనలను పాటించాలన్నారు. లాడ్జీలలో గదులను అద్దెకు ఇచ్చేటపుడు గుర్తింపుకార్డును తీసుకోవాలని సూచించారు. -
వైఎస్ఆర్ పేరు తొలగింపు సరికాదు
ఉమ్మడి రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు కట్టించి, వైద్య సేవలు అంచిందిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. నాలుగు జిల్లాలకు నడిబొడ్డున రిమ్స్ను ఏర్పాటు చేశారు. అనంతరం రిమ్స్ను అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించారు. మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి జగన్ జాతికి అంకితం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు తీసేయడం సిగ్గు చేటు. దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. –కె.సురేష్బాబు, నగర మేయర్, కడప -
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్వో, బార్క్, డీఆర్డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. ’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. వివిధ స్థాయిల్లో పరీక్ష వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లెవిద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు -
పేదలకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను నిర్మింపచేసి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లారు. కానీ చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
ఫేక్ సర్టిఫికెట్లతోనే రిజిస్ట్రేషన్
ప్రొద్దుటూరు : వంశపారంపర్యంగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి అమ్ముకోవడం ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. ఒకరి ఆస్తి మరొకరికి మారాలంటే ఎన్నో రకాల నిబంధనలున్నాయి. అయితే అన్నింటినీ సులువుగా తయారు చేసి నకిలీ ముఠా కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం వేస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన గంజికుంట సుబ్బరాయుడు ఆస్తే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ట్ అయిన ఆయనకు 1986లో మైదుకూరు రోడ్డులోని ఎన్జీఓ ప్లాట్లలో ప్లాట్ నంబర్ 300ను కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయన తన ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నారు. తరచూ తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసుకోవడం జరుగుతోంది. చుట్టుపక్కల వారు చెప్పడంతోనే ప్రస్తుతం తన ఆస్తిని మరొకరికి దొంగగా రిజిస్ట్రార్ చేయించారని బయటపడింది. ఫేక్ సర్టిఫికెట్ల ముఠా ఉందా.. గంజికుంట సుబ్బరాయుడతోపాటు ఆయన సతీమణి లక్ష్మీదేవి మరణించినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించడం హైదరాబాద్కు చెందిన వ్యక్తికి సుమా రు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సజీవంగా ఉన్న సుబ్బరాయుడుతోపాటు ఆయన సతీమణి రిజిస్ట్రేషన్లో డెత్ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఈ డెత్ సర్టిఫికెట్లు మున్సిపాలిటీ నుంచి జారీ చేయలేదు. కేవలం సొంతంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లను తయారుచేసి అమ్మడం జరిగింది. ఈ సర్టిఫికెట్లలో సూచించిన 2015, 2017 సంవత్సరాలలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అప్పట్లో రఘునాథరెడ్డి లేరు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో రఘునాథరెడ్డి బదిలీపై వచ్చి వెళ్లారు. కాగా ప్రతి ఎన్జీఓ ప్లాట్కు సంబంధించి ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ నుంచి లేఖను జారీ చేసిన తర్వాతే ప్లాట్ను అమ్ముతున్నారు. ఈ ప్లాట్ అమ్మకానికి సంబంధించి కూడా ఆగస్టు నెల 8న సంఘం కార్యదర్శి సాల్మన్ లేఖ ఇచ్చినట్లు పొందుపరిచారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఫేక్ సర్టిఫికెట్ల ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం -
ప్రభుత్వ రంగాలను కూటమి అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా బిల్డింగ్లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబుతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకువైఎస్ఆర్ పేరు తొలగింపుపై ఆగ్రహం రిమ్స్ను పరిశీలించినవైఎస్ఆర్సీపీ నేతలు -
చాలీ చాలని జీతాలతో చాకిరి
కడప ఎడ్యుకేషన్ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో.. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్ఎంటీలు, 19 మంది మండల లెవల్ అకౌంటెంట్స్, 34 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కనికరించని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం ఎదురుచూపు -
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది. ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు. ● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు. ● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది. ● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది. ● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్కాగజ్ నగర్లకు చేరుకోవచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్క్లియర్ ఉమ్మడి కడప జిల్లా లైన్లో రక్సౌల్–చర్లపల్లె వీక్లీ 20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు -
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు. -
వంకలోపడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి
కొండాపురం : అప్పటి వరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుతున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మండలంలోని దత్తాపురం పునరావాస కేంద్రంలోని వంకలో పడి ఎనిమిదేళ్ల బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దత్తాపురం గ్రామానికి చెందిన పాపన్నగారి గుణదీపక్(8) మూడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదగా వినాయకుని విగ్రహం తయారు చేసుకోవడానికి బంకమట్టికోసం వంక దగ్గర తీసే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో పడి పోయాడు. కుటుంబీకులు గుర్తించేలోగానే బాలుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపా రు. తల్లిదండ్రులు గంగాధర్, గీతలు గుండెలవిసేలా ఏడ్చారు. బాలుడు మృతితో గ్రా మంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఉత్సాహంగా క్రీడా ఎంపికలుప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జి కారొనేషన్ క్లబ్లో ఉమ్మడి కడప జిల్లా ఎస్జీఎఫ్ఐ అండర్–19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు తమ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈనెల 23 నుంచి 26 వరకు కాకినాడ, రాజమండ్రిలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఫెన్సింగ్ పోటీలకు 28 మంది క్రీడాకారులు పాల్గొనగా 14 మంది, రైఫిల్ షూటింగ్లో 16 మంది పాల్గొనగా 9 మంది, టేబుల్ టెన్నిస్లో 17 మందికి గాను 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలను జార్జికారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ అండర్–19 జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ రాజు, కోచ్ రాఘవ, అల్లాబకాష్, శివారెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు. – సాగర్, గర్భిణి భర్త -
జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో 14 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు స్థానచలనం, నియామకం చేస్తూ శనివారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ను నియమించారు. ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ విభాగంలో అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. నేడో, రేపో ఆయన జిల్లాకు విచ్చేసి ఎస్పీగా బాధ్యతలను చేపట్టనున్నారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ బదిలీ.... వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఈ.జీ అశోక్కుమార్ 2025 జనవరి 24న విధుల్లో చేరారు. గతంలో కడపలో డీఎస్పీగా పనిచేసిన ఈజీ అశోక్కుమార్ మరలా జిల్లా ఎస్పీగా నియమితులై విధుల్లో చేరినపుడు ఒకవైపు ప్రజలు, మరోవైపు అధికారులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లామీద పట్టువున్న అధికారిగా విధులను నిర్వహిస్తారని భావించారు. అనుకున్నట్లుగానే శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో విధులను నిర్వహించారు. కానీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ, ఇతర అంశాలు అభద్రతా భావాన్ని నెలకొల్పాయి. ఐపీఎస్ అధికారుల నియామకంలో బదిలీ అయిన అధికారుల జాబితాలో ఈయన పేరును ప్రస్తావించలేదు. కానీ ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది నియామకాల జాబితాలో ఈ.జీ అశోక్కుమార్ పేరు రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎస్పీ అశోక్కుమార్ బదిలీ ఏడు నెలలకే జరగడం అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికంగా పనిచేస్తున్న ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ అశోక్కుమార్ బదిలీ -
నమో నారసింహా
గుర్రంకొండ: నమో నారసింహా అంటూ భక్తులు గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివారిని కొలిచారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రాత్మాక గుర్రంకొండ కోటలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో వేకువజామేన అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప రూరల్: ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలలో 474 వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్, డాక్టర్ రవిబాబు, రమేష్, మనోరమ, భారతి, ఖాజా తదితరులు పాల్గొన్నారు. నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర మంత్రి రామ్దాసు అథవాలే అక్టోబర్ 4, 5 ,6 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించ నున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. శనివారం కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మూడవ సారి కొనసాగుతున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శించ నున్నారని, అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళగిరిలోని సికే ఫంక్షన్ హాలులో మంత్రి అథవాలే చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పు మీద తప్పు!
సాక్షి ప్రతినిధి, కడప: సోమశిల బ్యాక్ వాటర్ ముంపు పరిహారం చెల్లింపులో అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. అవార్డు అయిన తర్వాత కూడా పరిహారం చెల్లించడం ఒక ఎత్తయితే, అక్రమంగా పొందిన పరిహారానికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం మరో ఎత్తు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సులతో తప్పులను సైతం అడ్డుకోలేక చేష్టలుడిగి జిల్లా స్థాయి అధికారులు ఉండిపోయారు. మరోవైపు అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సులు తోడు అవడంతో రూ.1.75కోట్లు అక్రమంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సన్నహాలు పూర్తి అయ్యాయి. ● సోమశిల బ్యాక్ వాటర్ 14వ రీచ్లో అట్లూరు మండలం చెర్లోపల్లె గ్రామంలో 254 ఇళ్లుకు ముంపు పరిహారం లభించింది. 6700 చదరపు మీటర్లు ఇళ్లున్నాయని గుర్తించి రూ.1.17 కోట్లు చెల్లించారు. అవార్డు అయిన తర్వాత వ్యవసాయ పొలంలో అవసరాలకు నిర్మించుకున్న నాలుగు ఇళ్లుకు పరిహారం చెల్లించాలని విన్నపం తెరపైకి వచ్చింది. అప్పట్లో మాజీ మంత్రి వీరారెడ్డి సిఫార్సులతో ఆ నాలుగు ఇళ్లుకు రూ.84లక్షల పరిహారం చెల్లించారు. అంతటితో ఆగకుండా తర్వాత మరో కొత్త కథ తెరపైకి తెచ్చారు. హైకోర్టు రిట్ ఫిటిషన్ 282/2010 ప్రకారం ఇచ్చిన తీర్పు మేరకు తమకు వడ్డి చెల్లించాలంటూ తాజాగా తెరపైకి తెచ్చారు. అందుకు అధికార పార్టీకి చెందిన నోరున్న ఎమ్మెల్యే తోడయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిఫల్ సెక్రెటరీ సానుకూలత లభించింది. ఎవరి వాటా వారికి అప్పగించేందుకు ముందుకు రావడంతో వడ్డీ రూపేనా రూ.1.75కోట్లు సొమ్ము చేసుకునేందుకు సన్నహాలు దాదాపు పూర్తి అయ్యాయని సమాచారం. సోమశిల బ్యాక్ వాటర్ అవార్డు అయిన తర్వాత ముంపు పరిహారం ఆపై వడ్డీ చెల్లించాలని మరో విన్నపం ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో సిఫార్సులు రూ.1.75 కోట్లు అక్రమంగా కొట్టేసేందుకు వేగంగా అడుగులు అధికారపార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో చేష్టలుడిగిన అధికారులు చెర్లోపల్లిలో అక్రమంగా ప్రజాధనం కొట్టేసేందుకు పన్నాగం ఒంటిమిట్ట మండలం బందారుపల్లెలో అవార్డు అయిన తర్వాత డబ్బులు చెల్లించలేదు. దాంతో రద్దు కావడంతో తిరిగి అవార్డు చేశారు. రెండేళ్లు కాలం గడిచిపోవడంతో ఆ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లిస్తున్న పరిహారానికి వడ్డీ కూడా జమ కట్టాలని కోరారు. ఆమేరకు హైకోర్టులో రిట్ ఫిటిషన్ 282/2010 దాఖలయ్యింది. విచారించిన హైకోర్టు రెండేళ్లు ఆలస్యంగా డబ్బులు ఇచ్చిన కారణంగా వారికి వడ్డీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ సాకు చూపెట్టి అట్లూరు మండలం చెర్లోపల్లెలో వడ్డీ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేందుకు సన్నహాలు చేశారు. అంతే కాకుండా కొత్త రేట్లు ప్రకారం పరిహారం ఇస్తే వడ్డీ చెల్లించరాదని ఉత్తర్వులు సైతం ఉన్నాయి. కొత్త రేట్లు ప్రకారం పరిహారం పొందినప్పటికీ తిరిగి వడ్డీ చెల్లించాలంటూ సిఫార్సులు ఆరంభించి దాదాపు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఒకమారు అవార్డు అయిన గ్రామంలో తిరిగి ఇళ్లు నిర్మించి పరిహారం కొత్త రేట్లుతో పొందారు. రూ.84లక్షలు 2014లో పరిహారం పొందిన నేపధ్యంలో 1996 నుంచి 2013 వరకూ వడ్డీ చెల్లించాలని సిఫార్సులు చేపట్టారు. అధికారులు తప్పు మీద తప్పుకు ఆస్కారం ఇస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సిఫార్సులు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం కానుంది. అక్రమార్కులు ముంపు పరిహారం పొందడంలో అడ్డదారులతో సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. -
ఆటో మిత్ర పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆటోమిత్ర పథకం కింద ఆర్థిక సాయం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కోరారు. ఆటో రిక్షా/మోటార్ క్యాబ్ /మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ యజమానులకు 2025– 26వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.15000 సాయం అందించేందుకు మార్గ దర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. వాహన యజమాని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనమై ఫిట్నెస్ సర్టిఫికెట్, మోటార్ వాహన టాక్స్ కలిగి ఉండాలన్నారు. ప్యాసింజర్ ఆటో రిక్షా దారులు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, తెల్లరేషన్కార్డు కలిగి ఉండడంతోపాటు ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుడి కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కారాదని, ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండరాదని, 300 యూనిట్ల కరెంటు వినియోగించేవారై ఉండరాదని అన్నారు. శానిటరీ పని చేసేవారికి మినహాయింపు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తడి పొలం మూడు, డ్రైలాండ్ అయితే పదెకరాలు, మున్సిపాల్టీ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ మీటర్ల స్థలం ఉండే అభ్యర్థులు ఈ పథకానికి అనర్హులన్నారు. అర్హులు ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న జాబితా ప్రకటిస్తారని, అర్హులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు అందిస్తారని వివరించారు. డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..... వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది. -
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు. -
అండర్–19 తైక్వాండో పోటీలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రైల్వే కోడురూలో నిర్వహించిన అండర్–19 తైక్వాండో పోటీలలో కడప విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి చంంద్రమోహన్రాజు పేర్కొన్నారు. తైక్వాండో 44 కిలోల విభాగంలో నాగమోక్షిత, 55 కిలోల విభాగంలో పీవీఎస్.రెడ్డెమ్మ, 59 కిలోల విభాగంలో కెఆర్.సరయురెడ్డి బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర 54 కిలోల విభాగంలో కెఆర్.సాత్విక్రెడ్డి, 85 కిలోల విభాగంలో మునిచైతన్య బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ వెంకటేష్, శారద, కోచ్లు, తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలిపై వానరం దాడి రాజంపేట రూరల్ : 75 ఏళ్ల వృద్ధురాలు మన్నూరు చెంగమ్మపై వానరం దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని ఎగువ మందపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిలో చెంగమ్మకు కుడి మోచేయి వద్ద నరం కట్ అయినట్లు ఆమె బంధువులు తెలియజేశారు. చెంగమ్మ రాజంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వానరాల సంచారంపై ప్రజలు పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదన్నారు. ఇప్పటికై నా వానరాలను పట్టి అడవిలో వదిలేయాని కోరారు. 14005 కేసులకు పరిష్కారం – రూ.9,94,86,943 కక్షిదారులకు చెల్లింపు కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో 14005 కేసులు పరిష్కరించి, కక్షిదారులకు రూ.9,94,86,943 చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కడపలో నాలుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలో మూడు చొప్పున, బద్వేల్లో రెండు, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు మరియు రైల్వే కోడూరులో ఒకటి చొప్పున బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లో లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి కేసులను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరి బాబా ఫకృద్దీన్లు కేసుల పరిష్కారానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి -
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్ను మెగా లోక్ అదాలత్లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్తో కలిసి బైక్లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు -
కాయ్ రాజా కాయ్
క్రికెట్ బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్ రాజా కాయ్ అంటూ యాప్లపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ● ప్రొద్దుటూరు క్రికెట్ బుకీలకు కళ్లెం వేసేది ఎవరు? ● ఆసియా కప్ టీ20 టోర్నీతో జోరందుకున్న బెట్టింగ్ ● నేడు ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ అంటే టీవీ, మొబైల్ పోన్లు, రాసుకోవడానికి నోట్ బుక్కులు, లైన్బాక్స్ సెటప్ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ బెట్టింగ్ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్, వరల్డ్కప్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసేవారు. సొంతంగా యాప్ల నిర్వహణ కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ మొబైల్తో టెక్నాలజీని క్రికెట్ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్ యాప్లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. యాప్ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యాప్ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో చెక్ పడుతుందా? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్ లాంటి వరుస మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లను చెక్పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమ్లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్లైన్లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్లైన్లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి. -
సెయిల్ కంపెనీలో చోరీ
కొండాపురం : సెయిల్ కంపెనీలో వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. టి.కోడూరు సమీపంలోని సెయిల్ కంపెనీలో శుక్రవారం రాత్రి సోలార్ కాపర్ ప్లేట్ల చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. సెయిల్ కంపెనీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు, మరో వ్యక్తి కలిసి సోలార్ కాపర్ ప్లేట్లను చోరీ చేశారు. టి.కోడూరు గ్రామానికి వచ్చే రోడ్డు వద్ద తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందన్నారు. సంస్థ సెక్యూరిటీ ఇన్ఛార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. కరస్పాండెంట్పై పోక్సో కేసు మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కాలువలో పడ్డ స్కార్పియో పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నగదు ఇవ్వమన్నందుకు దాడి మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్వలిలపై దాడి చేయించాడు. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : మండలంలోని ఓ మహిళఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతోంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
కబ్జా ఆరోపణలు నిరాధారం
కలసపాడు : తనపై వచ్చిన కబ్జా ఆరోపణలు నిరాధారమని బద్వేలు నియోజకవర్గ బూత్కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోరుమామిళ్ళలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తనపై కొన్ని ఛానెళ్ళలో, పత్రికల్లో తాను కబ్జాలకు పాల్పడినట్లు, ఆలయ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కథనాలు ప్రచురించడం చాలా బాధాకరమన్నారు. తన 20 సంవత్సరాల రాజకీయ చర్రితలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వెంట నడుస్తూ వైఎస్సార్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూ బద్వేలు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ బద్వేలు మార్కెట్యార్డు చైర్మన్గా తన భార్యను మొట్టమొదటిసారిగా చేశారన్నారు. తాను వైస్ చైర్మన్గా ఉండి రూ.10 కోట్లతో నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ఎకరా డీకేటీ భూములు పొందడం గాని వాగులు, వంకలు కబ్జా చేయలేదన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించలేదని తెలిపారు. తాను అంచెలంచెలుగా కష్టపడి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుకున్నానే తప్ప అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. రంగసముద్రం పంచాయతీ సర్వే నెంబర్ 930/2 లో 35 సెంట్ల స్థలాన్ని కబ్జాకు పాల్పడినట్లు రామచంద్రారెడ్డి, బైరిశెట్టిశ్రీనివాసులు తనపై ఆరోపించారన్నారు. తాను 90 సెంట్ల స్థలాన్ని గంగాధరఆచారి, నిజాముద్దీన్, రామకృష్ణారెడ్డిల వద్ద కొనుగోలు చేశానని, ఆ భూమిని ఇతరులకు విక్రయించగా గంగాధరఆచారి వారికి రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నారు. బైరిశెట్టిశ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ పొంది లేని భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తనకు దేవాలయానికి సంబంధించిన స్థలానికి, నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఛానెళ్ళు, పత్రికలు వారం లోపల తనకు సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు సింగమాలవెంకటేశ్వర్లు, గుండంహనుమంతరెడ్డి, రాళ్లపల్లినరసింహులు, జగన్మోహన్రెడ్డి, చాపాటిసాయినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గ బూత్కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి -
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూనియర్ కబడ్డీ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలికలు 150 మంది, బాలురు 200 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరి శ్రీకాంత్రెడ్డి, సెక్రటరి చంద్రావతి, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ గురుశేఖర్, సెక్రటరి సుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాణి,ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరి చంద్రహాజరాజు, విక్టర్ కోచ్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి కబడ్డీ పోటీలకు ఎంపికై నది వీరే.. బాలురు జట్టు : వేణుసాయి, దుర్గశంకర్, బ్రహ్మయ్య, నూర్ భాష, మల్లి ఖార్జున, కలాం, సాయి ప్రసాద్, యశ్వంత్, జయంత్ నాయక్, హుస్సేన్, మల్లిఖార్జున, నరేంద్ర, జశ్వంత్, గఫార్ బాషా. బాలికల జట్టు : జ్యోత్న, నీల మహేశ్వరి, రంగ శివజ్యోతి, సునీత, పల్లవి, సిఎం రామలక్ష్మీ, వర మేఘన, హేమ ప్రియ, షషీనా, మైధిలి, అయ్యవారమ్మ, గంగాదేవి, అనిత, కృపా జ్యోతి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న బాలుర జట్టు రాష్ట్ర పోటీలకు ఎంపికై న బాలికల జట్టు -
ఓంకారేశ్వర్ కుటుంబానికి ఆర్థికసాయం
కడప కోటిరెడ్డిర్కిల్ : రామాపురం మోడల్ స్కూలులో ఒకేషనల్ ఐటీ ట్రేడ్లో ట్రైనర్గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓంకారేశ్వర్ కుటుంబానికి సహచరులు ఆర్థికసాయం అందజేసి తమవంతుగా తోడ్పాటు అందించారు. ఓంకారేశ్వర్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో స్కిల్ ట్రీ కంపెనీ లిమిటెడ్ ఒకేషనల్ ట్రైనర్స్, ఒకేషనల్ కో ఆర్డినేటర్స్ సహకారంతో రూ. 1,15,000 సేకరించి ఆ మొత్తాన్ని శుక్రవారం మృతుడి సతీమణి అమృతకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆర్థికసాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒకేషనల్ ఉపాధ్యాయురాలు సురేఖ, కో ఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 8మంది పేకాటరాయుళ్ల అరెస్టు వేంపల్లె : స్థానిక గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో జూదమాడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం సీఐ నరసింహులు ఆదేశాల మేరకు గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ తిరుపాల్ నాయక్ తన సిబ్బందితో దాడులు చేశారు. దీంతో వెంకటరమణతోపాటు మరో 7 మందిని అరెస్టు అదుపులోకి తీసుకుని రూ.82,300 నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపై కేసు నమోదు చేశామన్నారు. మునయ్యకోనలో మృతదేహం లభ్యం ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలోని మునయ్యకోనలో చిట్టిబోయిన గంగాధర్(53)అనే వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. తొండూరు మండలం గంగాదేవిపల్లెకు చెందిన గంగాధర్ రెండురోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మునయ్యకోనలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. మరణానికి చెంనని కారణాలు ఇతర వివరాలపై విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితులకు జైలు పోరుమామిళ్ల : పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్లో 2019 ఎర్రచందనం కేసులో తిరుపతి కోర్టులో శుక్రవారం మల్లేపల్లె గ్రామానికి చెందిన నిందితులు కప్పలరమేష్, గురుప్రసాద్లకు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.11లక్షలు మోసం చేసారని కేసు ముద్దనూరు : మండలంలోని పెద్ద దుద్యాల గ్రామ సమీపంలోని జీయమ్ ఎకో కంపెనీకి చెందిన రూ.11లక్షల 54వేల సొమ్మును మోసం చేసారని కోకా ప్రదీప్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏఎస్ఐ రమణ సమాచారం మేరకు జీయమ్ ఎకో కంపెనీలో విశాఖపట్టణంకు చెందిన ప్రతీప్ మేనేజర్గా, అతని భార్య అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కంపెనీకి చెందిన లారీల బాడీ తయారీకి గ్యారేజీలో రూ.11లక్షల 54వేల సొమ్మును చెల్లించినట్లు ప్రదీప్ కంపెనీని మోసగించి, డబ్బు చెల్లించినట్లు నకిలీ లావాదేవీల పత్రాలు సృష్ఠించాడు. కొద్దిరోజుల అనంతరం కంపెనీ ఎండీ కనక ప్రసాద్ గ్యారేజీ ప్రతినిధులను సంప్రదించగా తమకు ఎటువంటి డబ్బు ముట్టలేదని వారు తెలిపారు. ప్రదీప్ను విచారించడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వుండడంతో ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా?
కడప కార్పొరేషన్: కూటమి అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10వ తేదీ కూటమి నేతలు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి విజయోత్సవ సభ నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. పదహారు నెలలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో.. 5లక్షల పింఛన్లు తొలగించడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడంలో.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేయడంలో సూపర్ హిట్ సాధించారని ఎద్దేవా చేశారు. 87లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఇవ్వాల్సి ఉండగా, 54లక్షల మందికే ఇచ్చి, 16 నెలల్లో ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి బంపర్హిట్ కొట్టారని ఎద్దేవా చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మొదటి ఏడాది పంగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చి 7లక్షల మందికి కోత వేశారన్నారు. యాభై ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసగించారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొనగాడుగా నిలిచారన్నారు. వాటిలో 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటుకు అమ్మేయాలను కోవడం దారుణమన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలను నిర్వీర్యం చేయడంలో..రైతులకు యూరియా దొరక్కుండా చేయడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఆ వ్యవస్థనే ఎత్తేశారన్నారు. ప్రభుత్వ బడులు, వైద్యశాలలను.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పతనావస్థకు తీసుకుపోయారన్నారు. కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించిన జిల్లాలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా అవమానిస్తే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, టీపీ వెంకటసుబ్బమ్మ, జమీల్, అజ్మతుల్లా, త్యాగరాజు, బసవరాజు, కంచుపాటి బాబు, అహ్మద్ పాల్గొన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో సూపర్హిట్ పదిహేనేళ్లు ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించారా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మంజూరు ఘనత వైఎస్ జగన్ది మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
కడప కోటిరెడ్డిసర్కిల్: భూ సమస్యల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై ఆమె డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణతో కలిసి సీఎంవో కార్యాలయం నుంచి అందిన కాల్స్ మేరకు ఆయా డివిజన్ల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్ఐలు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలు, పీవోటీ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూముల పరిష్కారంలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు అందడం లేదన్నారు. అనంతరం ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఉల్లి కొనుగోలుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి రైతులు, ట్రేడర్లతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఇన్చార్జి కలెక్టరు మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
రాజకీయ జోక్యంతో విచారణ మమ
● కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారులు ● వచ్చారు 6ఏ కేసు పెట్టి సరిచేసి వెళ్లారు..సాక్షి టాస్క్ఫోర్స్ : దువ్వూరులో గురువారం రాత్రి యూరియా అక్రమంగా తరలిస్తుండటంపై ‘రాత్రి అక్రమంగా యూరియా తరలింపు’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై విచారణ చేయడానికి జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ) చంద్రానాయక్, మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథరెడ్డి, దువ్వూరు ఎస్ఐ వినోద్కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా ఏడీఏ కృష్ణమూర్తి శ్రీమహానందీశ్వర ట్రేడర్స్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభంలో జాయింట్ కలెక్టర్ షాపును సీజ్ చేయమని చెప్పారని, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని చెప్పారని ఏడీఏ మీడియాతో చెప్పుకొచ్చారు. అనంతరం జేడీఏ చంద్రానాయక్ షాపు వద్దకు వచ్చారు. జేడీఏతో ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథ్ రెడ్డిలు ఈ ట్రేడర్స్కు గురువారం సాయంత్రం 9 టన్నుల యూరియా వచ్చిందన్నారు. ప్రస్తుతం 7.8 టన్నుల యూరియా నిల్వ ఉందని, 1.2 టన్నుల యూరియాను గురువారం రాత్రి అక్రమంగా విక్రయించినట్లు తెలిపారు. జేడీఏ వ్యవసాయాధికారులతో కలిసి ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న ఆ షాపు గోడౌన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న యూరియా బస్తాలను లెక్కించారు. మొదట 77 బస్తాల యూరియాను అక్రమంగా అమ్మినట్లు గుర్తించారు. నాటకీయ పరిణామాల మధ్య అకస్మాత్తుగా 57 బస్తాలు తక్కువ ఉన్నాయని, 30 బస్తాల యూరియా మరో గోడౌన్లో ఉన్నాయని అధికారులు కొత్త కథ చొప్పుకొచ్చారు. ఈ ట్రేడర్స్కు చెందిన మరొక గోడౌన్ను తనిఖీ చేయడానికి అధికారులు వెళ్లారు. అక్కడికి వెళ్లాక జేడీఏ, ఇతర వ్యవసాయాధికారులు 45 నిమిషాలు వేచివున్నా కూడా ట్రేడర్స్ వారు తాళాలు తీయలేదు. చివరకు వ్యవసాయాధికారులు తాళాలు తెప్పించి ఆ గోడౌన్ను తనిఖీ చేయగా రాజకీయ జోక్యంతో నాటకీయ పరిణామాల మధ్య అధికారులు మహానందీశ్వర ట్రేడర్స్పై అమితమైన ప్రేమనుకనబరిచి లేదు కేవలం 27 బస్తాలు మాత్రమే తక్కువగా ఉన్నాయని క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. ఆ 27 బస్తాల యూరియా అతను బ్లాక్ మార్కెట్కు తరలించలేదని, అది కూడా వారికి తెలిసిన రైతులకు డీబీటీ ప్రకారం ఇచ్చారని అధికారులు చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఆ షాపుకు 9 టన్నుల యూరియా వస్తే అదే రోజు రాత్రి యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైతులు నిలదీశారు. కానీ వ్యవసాయాధికారులు షాపు వారు డీబీటీ ప్రకారం యూరియాను ఎత్తించారనడం కొస మెరుపు. మొత్తం మీద విచారణను మసి పూసి మారేడు కాయ చేసి తూ.తూ. మంత్రంగా ఉన్న యూరియాను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసి ఆ ట్రేడర్స్పై భక్తిని చాటుకుని విచారణను మమ అనిపించారు. అధికారులు అనుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు చెప్పుకుంటున్నారు. అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నా విచారణకు వచ్చిన వ్యవసాయాధికారులు అధిక ధరలపై ఒక్క షాపుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. -
వాటా కోసం వేట
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా’ అన్నట్లుగా సంస్థలకు, కాంట్రాక్టర్లకు అధికార పరపతి ఎలా ఉంటుందో జమ్మలమడుగు కూటమి నేతలు రుచి చూపిస్తున్నారు. సంస్థ ఏదైనా సరే వారి కనుసన్నుల్లో నడుచుకుంటే సరే.. లేదంటే అల్లాడిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నుంచి అదానీ ఐడల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల వరకూ నిర్వాహకులు ముప్పుతిప్పలకు గురయ్యారు. తాజాగా టీ.కోడూరు వద్ద నిర్మాణంలో ఉన్న సోలార్ కంపెనీ ఆ జాబితాలో చేరింది. రాత్రికి రాత్రి కోట్లాది విలువైన ఫ్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కుయ్యో మొర్రో అంటూ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న వైనమిది. రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో.. కొండాపురం మండలం టీ.కోడూరు గ్రామ పొలాల్లో సెయిల్ (ఎస్ఏఈఎల్) కంపెనీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో 380 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టేందుకు సిద్ధమైంది. ఆమేరకు 2024లో రైతుల నుంచి 1500 ఎకరాల భూమి 30 ఏళ్లు లీజుకు తీసుకుంది. ప్రభుత్వ అనుమతులు దక్కడంతో 2025 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించింది. సెయిల్ కంపెనీ సోలార్ నిర్మాణ పనులు ఓ వైపు కొనసాగిస్తుండగా.. మరోవైపు కూటమి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. కొండాపురం మండల బాధ్యుల సహకారంతో టీ.కోడూరు నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. నిర్మాణ పనులు అప్పగించిన సంస్థకు అనేక సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు సెయిల్ కంపెనీ నిర్మిస్తున్న సోలార్ నిర్మాణ పనుల్లో రాత్రికి రాత్రి సోలార్ ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు వరసగా చోరీకి గురవుతున్నాయి. ఇప్పటికీ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులు తాళ్లప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెయిల్ కంపెనీ ప్రతినిధి ఆనంద్ దూభే ఫిర్యాదు మేరకు ఈ నెల 6న క్రైమ్ నంబర్ 154/25 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్యూరిటీ ఇన్చార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 8న క్రైమ్ నంబర్ 158/25 ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు కూటమి నేతల ప్రమేయాన్ని గుర్తించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మండల బాధ్యుడు ఒకరు పోలీసులతో మధ్యస్తం నెరిపారు. ‘మీ వాటా మీకు అప్పగిస్తాం, ఎలాంటి చర్యలు చేపట్టవద్దు’ అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆపై అధికార పార్టీ నేతల మాట జవదాటని పోలీసుశాఖ.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డబుల్ స్టార్ అధికారి పెద్ద మొత్తంలో దోపిడీదారుల నుంచి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ సంస్థకు మాత్రం ఇప్పటికీ కూటమి నేతల వేధింపులు తప్పడం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అధికార పార్టీ నేతలు ప్రత్యక్ష దౌర్జన్యం చేశారు. ఏకంగా సైట్ ఇంజినీర్పై దాడి చేశారు. సివిల్ పనులు చేస్తున్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై అల్ట్రాటెక్ పరిశ్రమపై దృష్టి పెట్టారు. అల్ట్రాటెక్లో పూర్తి ఆధిపత్యం కోసం చేయని దందాలు లేవు. అక్కడే టెంటు వేసుకొని సిమెంటు ఉత్పత్తికి ఆటంకం కల్గించారు. ఆమేరకు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దౌర్జన్యం రుచి చూపించారు. ఆర్టీపీపీలో సైతం అలాంటి వ్యవహారమే తెరపైకి వచ్చింది. తాజాగా సెయిల్ సోలార్ ప్లాంట్లో నిర్మాణ పరికరాలు చోరీకి గురవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు కోల్పోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇలాంటి దుస్సాహాసం వెనుక కూటమి నేతల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్నట్లు పరిశీలకులు ఆరోపిస్తుండటం గమనార్హం. సెయిల్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న కూటమి నేతలు ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు రాత్రికి రాత్రే మాయం కోట్లు విలువైన పరికరాల చోరీ వెనుక నాయకుల ప్రమేయం కేసు నమోదు చేసి చేతులుదులుపుకొన్న పోలీసుశాఖ -
మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ఇడుపులపాయలో నెమళ్లు విలాపం చెందుతుండటం.. పక్షుల ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. సంరక్షణ, పర్యవేక్షణ లోపంతో కొన్ని మృత్యువాత పడుతుండటం విషాదకరం. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం శీతకన్ను వేయ
కడప సిటీ: ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి, సంరక్షణ కేంద్రం (నెమళ్ల పార్కు)లో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పక్షిగా నెమలికి మన దేశంలో గుర్తింపు ఉంది. అటవీశాఖ నిబంధనల మేరకు జాతీయ జంతువు పులికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాధాన్యతను మయూరానికి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అడవుల్లో నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. ఇలాంటి కేంద్రాన్ని మరింత శ్రద్ధతో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 105 నుంచి 31కి తగ్గిన నెమళ్ల సంఖ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబరు 24న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల నిధులు కేటాయించారు. నెమళ్ల ఆరోగ్య సంరక్షణకు ఓ ఆస్పత్రి, గుడ్లను పొదిగించేందుకు ఇంక్యుబేటర్, ల్యాబ్, ఆకర్షణీయమైన షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 72 నెమళ్లు (10 మగ నెమళ్లు, ఆడ నెమళ్లు 29, మిగిలినవి పిల్లలు) ఉన్నాయి. ఆ తర్వాత ఇందులో నెమళ్ల సంఖ్య 105కి చేరింది. దాదాపు ఇక్కడ పెంచి పోషించిన నెమళ్లు 400 దాకా అడవుల్లోకి వదిలే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 31 నెమళ్లు మాత్రమే ఈ కేంద్రంలో ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. కోళ్ల కింద గుడ్లు పెట్టి పొదిగిస్తున్న వైనం ప్రస్తుతం నెమళ్ల పార్కులో గుడ్లు పొదిగించే ఇంక్యుబేటర్ మూలకు చేరింది. నాలుగేళ్లుగా పనిచేయకపోవడంతో కోళ్ల కింద గుడ్లు పొదిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరుత్పత్తి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇది కూడా నెమళ్ల సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. రూ.2 లక్షల ఖరీదు చేసే ఈ ఇంక్యుబేటర్ను కొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే.. ఏ మేరకు నెమళ్లపార్కు మీద శ్రద్ధ కనబరుస్తున్నారో అవగతమవుతోంది. అటవీ శాఖ అధికారుల విచారణ ఈ ఏడాది జనవరిలో ఒకేసారి తొమ్మిది నెమళ్లు మృతి చెందాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి భూమిలో పాతిపెట్టారు. ఒకేసారి ఇన్ని నెమళ్లు చనిపోవడంతో అధికారులకు అనుమానం మొదలైంది. ఎవరో విష ప్రయోగం చేశారన్న విషయం పోస్టుమార్టంలో తేలింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు చేశారన్నది గుర్తించడంలో ఇబ్బందిగా మారింది. ఎవరైనా చెడ్డపేరు తెచ్చేందుకు చేశారా? అనే అనుమానంతో అధికారులు ఉన్నారు. కుందేళ్లు, లవ్బర్డ్స్ కూడా లేవు ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నెమళ్లే కాకుండా 25 లవ్ బర్డ్స్, 20 కుందేళ్లు కూడా ఉండేవి. ప్రస్తుతం అవి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సంరక్షణ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు పర్యాటకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక పునరుత్పత్తి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నెమళ్ల పునర్పత్తి కేంద్రం, సంరక్షణ కేంద్రం ఇదొక్కటే ఉంది. ఇలాంటి కేంద్రాన్ని తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల దీనిని అతి జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకానొక దశలో ఎత్తివేసే యత్నం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నెలకొల్పిన ఈ నెమళ్ల పార్కును ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇక్కడ లేకుండా ఎత్తివేసే ప్రయత్నం చేశారు. 2016లో ట్రిపుల్ ఐటీలో కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరైనపుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నిధులు లేని కారణంగా మూసివేత దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని తీసివేసి అటవీశాఖ అతిథి గృహంగా మార్చాలన్న నిర్ణయానికి కూడా అప్పట్లో వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని 2016 డిసెంబరు 21న సాక్షి ‘పాపం మయూరం’ శీర్షికన కథనం ప్రచురించడంతో.. ఎక్కడ చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంరక్షించే వారు లేకపోవడమా? లేక పర్యవేక్షణ లోపమా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సక్రమమైన సంరక్షణ ఉంటే నెమళ్లు ఎందుకు పునరుత్పత్తి కావడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. సరిగా వాటికి పోషకాహారాన్ని పెడుతూ సంరక్షించుకుంటూ వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం అన్ని సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. నిధులు ఆలస్యంగా ప్రభుత్వం నుంచి అందుతున్నా.. ఇబ్బందులు లేవంటున్నారు. ఇడుపులపాయ నెమళ్ల పునరుత్పత్తి కేంద్రంపై నిర్లక్ష్యం తగ్గిపోతున్న మయూరాల సంఖ్య విష ప్రయోగంతో ఒకే సారి 9 మృతి మూలనపడిన ఇంక్యుబేటర్ సంఖ్య పెంచేందుకు చర్యలు నెమళ్లపార్కులో నెమళ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఇంక్యుబేటర్ కోసం నివేదికలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కోళ్ల కింద గుడ్లను పొదిగించి పునరుత్పత్తి చేస్తున్నాం. తొమ్మిది నెమళ్లు మృతి చెందిన విషయంపై కేసు నమోదుతోపాటు విచారణ ప్రారంభించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. సీసీ కెమెరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం. –బాలసుబ్రమణ్యం, అటవీ అధికారి, వేంపల్లె పార్కును సంరక్షించుకోవాలి నెమళ్లపార్కుపై అధికారులు చర్యలు చేపట్టి సంరక్షించాల్సిన అవసరం ఉంది. నెమళ్ల సంఖ్య తగ్గిపోకుండా పునరుత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెమళ్లపార్కు ఒక పర్యాటక కేంద్రంగా మారడంతో దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. – యు.చంద్ర ఓబుల్రెడ్డి, వేంపల్లె పర్యాటకుల్లో ఆందోళన నెమళ్ల పార్కులో నెమళ్ల సంఖ్య తగ్గిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గండి వీరాంజనేయస్వామిని దర్శించుకునే వారంతా ఇడుపులపాయకు వస్తున్నారు. అక్కడ నెమళ్లను చూసి చిన్న పిల్లలు ఆనందంతో కేరింతలు వేస్తారు. ఇలాంటి కేంద్రాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. – కొండారెడ్డి, వేంపల్లె -
ప్రమాదమా.. హత్యాయత్నమా..?
● జేఎన్టీయూ హాస్టల్ వార్డెన్కు తీవ్ర గాయాలు ● అందుబాటులోకి రాని 108 వాహనం పులివెందుల : పట్టణంలోని ఎర్రగుడిపల్లెకు చెందిన ఆనందరావు పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆనందరావు జేఎన్టీయూ సమీపంలో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నాలు చేశారు. పోలీసు సిబ్బందికి, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పులివెందుల ట్రైనింగ్ ఎస్ఐ అనిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఆనందరావు బైకు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా లేకపోతే ఎవరైనా వ్యక్తులు దాడి చేశారా అనేది అనుమానాం కలుగుతోంది. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందుబాటులోకి రాని 108 వాహనం : జేఎన్టీయూ సమీపంలో తీవ్రంగా గాయపడిన ఆనందరావును స్థానికులు గుర్తించి 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే సంఘటన జరిగిన అర్ధ గంటసేపు అయినా కూడా 108 వాహనం చేరుకోలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అటువైపు వస్తున్న వాటర్ క్యాన్ ఆటోలో క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆనందరావు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆనందరావు కోలుకుంటే ప్రమాదమా.. హత్యాయత్నమా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సీతారామిరెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. -
బతికుండగానే చంపేశారు
● రూ.2కోట్లు విలువైన ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని డెత్ సర్టిఫికెట్తో అమ్మేశారు ● ఎన్జీఓ ప్లాట్ 300కు సంబంధించి వెలుగుచూసిన సంఘటన ప్రొద్దుటూరు : బతికుండగానే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినట్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్ను సృష్టించి రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మరొకరికి అమ్మారు. ప్రభుత్వ ఉద్యోగి వీఆర్ఎస్ పొంది ప్రతినెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంఘటన ఎవరు చేశారు.. ఎలా జరిగింది... ఎవరెవరి హస్తం ఉంది అనే వివరాల గురించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆరా తీయలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1980 ప్రాంతంలో ఎన్జీఓ ప్లాట్లు వేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ కాలనీలోనే గంజికుంట సుబ్బరాయుడు (నీటి పారుదల శాఖ రిటైర్డు ఎస్ఈ)కు 1986లో సర్వే నంబర్ 194, 196లోని ప్లాట్ నంబర్ 300లోని 7.5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆయన గత 40 ఏళ్లుగా తన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ సృష్టించి... గంజికుంట సుబ్బరాయుడు నీటి పారుదల శాఖలో ఎస్ఈగా పనిచేసి 2003లో వీఆర్ఎస్ పొంది ప్రభుత్వం నుండి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి పెన్షన్ పొందుతున్నారు. గంజికుంట సుబ్బరాయుడు, తన భార్య గంజికుంట వెంకటసుబ్బమ్మ ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న (ఆధార్ కార్డు 994947290378) వివరాలతో గంజికుంట సుబ్రహ్మణ్యం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన వద్ది నారాయణ కుమారుడు నాగరాజు (ఆధార్ కార్డు నంబర్ 879824061289)కు రిజిస్టర్ చేయించారు. తన తండ్రి గంజికుంట సుబ్బరాయుడుతోపాటు తల్లి గంజికుంట లక్ష్మీదేవి మరణించినట్లు ఏకంగా మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని జత చేశారు. వాస్తవానికి గంజికుంట సుబ్బరాయుడుకు గంజికుంట సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో వీరికి తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్టర్ జరిగింది. స్టాంప్ రైటర్ తొండలదిన్నె శ్రీనివాసులు ఈ డాక్యుమెంట్ను తయారు చేయగా, దొరసానిపల్లెకు చెందిన వరద ఆంజనేయులు, డ్రైవర్ కొట్టాలకు చెందిన నల్లు జయశంకర్ సాక్షులుగా ఉన్నారు. తనకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న గంజికుంట సుబ్బరాయుడు కొద్ది రోజుల క్రితం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీఎన్జీ రామదాసును సాక్షి వివరణ కోరగా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. బతికుండగానే గంజికుంట సుబ్బరాయుడు మరణ ధృవీకరణ పత్రం గంజికుంట సుబ్బరాయుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని అమ్మిన వారు, కొన్నవారు -
పేద విద్యార్థుల డాక్టర్ కలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
బద్వేలు అర్బన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడంతో పాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వసతులతో అత్యుత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి వాటిని పూర్తి చేసి కొన్నింటిలో తరగతులు సైతం ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కేవలం 11 ప్రభుత్వ వైద్యకళాశాలలే ఉండేవని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందవన్న ఉద్దేశ్యంతో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలను కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
పత్రికా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. పోలీసులతో కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తోంది. ఇటీవల ఒక నాయకుడి ప్రెస్మీట్ కవర్ చేసినందుకు కేసు పెట్టడం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛకు విఘా తం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి. –వైఎస్ అవినాష్రెడ్డి, ఎంపీ, కడప కక్షపూరితం..దుర్మార్గం పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఏ ప్రసాదించింది. ప్రజల గొంతుకై న పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. పత్రికలో వచ్చే వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వవచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. అంతేకాని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభసభ్యుడు -
కొనసాగుతున్న ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఆసక్తికరంగా క్రీడా ఎంపికలు జరుగుతున్నాయి. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్– 14,17 బాల బాలికలకు రాష్ట్ర స్దాయి ఎంపికలు నిర్వహించారు. టెన్నిస్, టేబుల్ టేన్నిస్, ఊషు, తంగట, ఖురేష్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి ఈ క్రీడలను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఈ ఎంపికలకు 14 సంవత్సరాల, 17 సంవత్సరాల విభాగాల నుంచి దాదాపు 350 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అమరావతి క్వాంటం వ్యాలీకి ఎంపిక వేంపల్లె : రాష్ట్రస్థాయి అమరావతి క్వాంటం వ్యాలీకి ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈనెల 10వ తేదీన రీజనల్, జోనల్ స్థాయి అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్లో సత్తా చాటారు. గతనెల 28వ తేదీన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో జరిగిన ఇంటర్నల్ క్వాంటం వ్యాలీ హ్యాక్థాన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్లను తిరుపతిలోని మహిళా యూనివర్సిటీకి పంపగా, అక్కడ కూడా ఆ రెండు టీంలు సత్తా చాటి రూ.10వేల క్యాష్ అవార్డుతోపాటు ప్రశంసా పత్రంను అందుకున్నారు. ఈ రెండు టీంలలో సుమారు 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులను ఆకాంక్షించారు. 15న సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ నెల 15న జిల్లా స్థాయి సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ పురుషులు, మహిళల జట్లు ఎంపికలను నిర్వహిస్తుననట్లు పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు కడప నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27, 28 తేదీలల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9966211903 అనే నెంబర్ను సంప్రదించాలన్నారు. వైద్యరంగంలో జనరల్ మెడిసిన్కు ప్రత్యేక స్థానం కడప అర్బన్ : వైద్యరంగంలో జనరల్ మెడిసిన్కు ప్రత్యేక స్థానం వుందని ఏపీఐ చైర్మన్ డాక్టర్ మనోజ్కుమార్ తెలియజేశారు. ఏపీకాన్ –2025 ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్) ఆవరణంలో 53వ వార్షిక అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా వారి ఏపీ స్టేట్ ఏపికాన్ –2025 సదస్సు నిర్వహణకు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం నిర్వహణలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులు వివిధ కేటగిరిలలో తాము ప్రెజెంటేషన్ చేయాలనుకున్న అంశాలను జనరల్ మెడిసిన్ వైద్యాధికారుల ముందు తెలియజేశారు. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమాలను జాతీయ స్థాయి 53వ కాన్ఫరెన్స్గా కడప నగర శివార్లలోని రాయచోటి రోడ్డులో వున్న మాధవి కన్వెన్షన్ హాల్లో 13, 14 తేదీలలో జాతీయ స్థాయిలో అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. కార్యక్రమాలను డాక్టర్ టి. మునీశ్వర్రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ యాదవేంద్రారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అర్జున్కుమార్ వ్యవహరించనున్నారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభం అయ్యాయి. స్థానిక కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 57 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా చక్కగా బ్యాటింగ్ చేసి 107 పరుగులు, సాయి గణేష్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని షేక్ కమిల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్సార్ఆర్ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోషన్ పవన్ కుమార్ 213 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో అద్బుతంగా బ్యాటింగ్ చేసి 226 పరుగులు చేశాడు. సోహర్ వర్మ 53 పరుగులు, సూతేజ్ రెడ్డి 89 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలి
కడప ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వం మోమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరించాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ పోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్, శోభారాణి డిమాండ్ చేశారు. కడప తాలూకా కేంద్రం వద్ద నల్లబాడ్జీలు ధరించి గురువారం మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజ్జల తిరుపాల్, శోభారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు (7361 మంది), పోలీసులు (1821), గ్రూప్ 1, గ్రూప్2 ఉద్యోగులకు(1800) పాత పెన్షన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్, 01 తదుపరి నియామకం జరిగి సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న సుమారు 11000 మందికి పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పాత పెన్షన్ అమలుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు గత ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బి.గంగాధర్, ఎస్.బాబూరెడ్డి, పి.వెంకటసుబ్బారెడ్డి, చెన్నయ్య, రోజారాణి, చంద్రకళ, కె.చెన్నయ్య, లక్ష్మీరాజా, మోపూరి వెంకట శివారెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, రామిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ప్రతాపుడు, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్ -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు
కలసపాడు : మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తులచంద్రమోహన్, బత్తులఆదిలక్ష్మి, స్వర్ణ శ్రీనాథ్లపై పోలీసులు గురువారం అక్రమ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తుల చంద్రమోహన్ పొలంలో టీడీపీ నాయకుడు ఇటీవల గ్రావెల్ రోడ్డు వేశాడు. 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎవరికి ఉపయోగంలో లేదు. ఇటీవల గ్రామ టీడీపీ నాయకుడు కక్ష సాధింపులో భాగంగా చంద్రమోహన్ పొలంలో అడ్డంగా రోడ్డు వేశాడు. అయినా చంద్రమోహన్ ఏమీ అనలేదు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ట్రాక్టర్తో చంద్రమోహన్ మిగిలిన భూమిని దున్నుకున్నాడు. రోడ్డును దున్నేశాడని టీడీపీ నాయకుడు బక్కిరెడ్డినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు మామిళ్లపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్, అతని భార్య ఆదిలక్ష్మి, ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనాథ్లపై అక్రమంగా కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై అనుచిత వ్యాఖ్యలు మామిళ్లపల్లె గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ స్వర్ణశ్రీనాథ్పై ఎస్ఐ తిమోతి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నీపై రెండు, మూడు కేసులు ఉన్నాయని దుర్భాషలాడినట్లు బాధితుడు శ్రీనాథ్ తెలిపారు. -
ఉత్సాహంగా సాగిన ఎస్జీఎఫ్ క్రీడలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అండర్– 14, 17 రాష్ట్రస్థాయి పోటీలకు బాల బాలికల ఎంపిక నిర్వహించారు. ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాలలో పోటీలను ప్రత్యేకాధికారి జగన్నాథరెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, ప్రవీణ్ కిరణ్, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ఉద్యమిస్తాం
● ప్రజల ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేస్తారా...? ● పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఉండరాదనే కక్ష? ● మంజూరైన సీట్లను వెనక్కి ఇవ్వడం దుర్మార్గం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డికడప కార్పొరేషన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని తెహల్కా డాట్కామ్ ఎప్పుడో చెప్పిందని, దేశంలో ఆయనంత సంపన్నుడు ఎవరూ లేరని, ఆయనకున్న ఆస్తులు మరెవరికీ లేవని ఆరోపించారు. పెద్ద హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్, బెంగళూరు, చైన్నె నగరాల్లో ఉన్నా.. ఏపీలో కరోనాను వైఎస్.జగన్మోహన్రెడ్డి అధిగమించారన్నారు. తద్వారా రాష్ట్రంలో తక్కువ మరణాలు నమోదయ్యాయన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి రాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక విజన్తో ఒక్కో జిల్లాకు ఒక వైద్య కళాశాల చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరుచేయించారన్నారు. 1923 నుంచి రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తయ్యాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధగా ఉన్నాయని పేర్కొన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో అన్ని వసతులు, వైద్య పరికరాలు ఉన్నా.. పులివెందులకు 50 సీట్లు వద్దు అని లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ఎవరైనా మెడికల్ సీట్లు కావాలని కోరుకుంటారని, సీట్లు వద్దని చెప్పిన ఏకై క ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. పులివెందుల ప్రజలు మనకు ఓట్లేయరు...అక్కడ మెడికల్ కాలేజీలు ఉండకూడదనే కక్షతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 2024–25 సంవత్సరానికి 50 సీట్లు తీసుకొని ఉంటే, 2025–26 సంవత్సరానికి మరో 150 సీట్లు వచ్చి ఉండేవన్నారు. ఆ అవకాశాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వైఎస్ జగన్ మొదటి విడత చేపట్టిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ జీవో ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ 50–100 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మించారని, అవి లక్షల కోట్ల రూపాయల విలువజేసే ప్రజా ఆస్తులని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీల వల్ల 2360 మెడికల్ సీట్లు వస్తాయని, 2550 సీట్లు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. ఇక్కడ మెడికల్ సీట్లు లేక రాష్ట్రంలోని విద్యార్థులు రష్యా, చైనా, జార్జియా వంటి దేశాలకు పోతుంటే వచ్చిన వాటిని వెనక్కి ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే చంద్రబాబు నైజమని, 2014–19లో కూడా ఆయన అనేక ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటుపరం చేశారన్నారు. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలోకు అప్పగించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేయాలనుకోవడం సరికాదన్నారు. తాను, తన బినామీలను బాగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని, బాబు పాలనలో ప్రభుత్వ రంగంలోని ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సూపర్ ప్లాఫ్ సినిమాకు విజయోత్సవాలు చేసినట్లు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్హిట్ అంటూ సభలు నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, ఎస్. వెంకటేశ్వర్లు, యానాదయ్య, షేక్ షఫీ, శ్రీరంజన్రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి, కంచుపాటి బాబు, సాయి, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. కడప పెన్షనర్ల భవనంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ కనబరచడం విచారించదగిన విషయమన్నారు. కార్యదర్శి రామమూర్తినాయుడు మాట్లాడుతూ పెన్షనర్లకు రావాల్సిన 11వ పీఆర్సీ బకాయిలు, డీఆర్, ఈహెచ్ఎల్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై ఉదాసీనంగా ఉన్నందున అన్ని సంఘాలు కలిసి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జడపల్లి రాధాకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రంగనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమునిరెడ్డి, కోశాధికారి నూనె నగేష్, నాయకులు తుపాకుల నారాయణ, చలపతి గౌడ్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కడప సెవెన్రోడ్స్ : మార్క్ ఫెడ్ ద్వారా ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉద్యాన, మార్క్ ఫెడ్ అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వింటా ఉల్లి ధర రూ.1200 ప్రకారం ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు. మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డుల ఆవరణలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా, నాణ్యత పరిగణలోకి తీసుకుని కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు, మార్క్ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్వలి, తదితరులు పాల్గొన్నారు. -
బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను వెలికితీసేందుకు ఇన్స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు పంపేందుకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకూ గడువు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే ఈ పోటీలలో అన్ని ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 226 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి 1000 ప్రాజెక్టులు పంపాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇప్పటి వరకూ 632 ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయి. మరో మూడు రోజులు గడువు ఉండడంతో మరిన్ని ప్రాజెక్టులు పంపేందుకు మరో అవకాశం ఉంది. దరఖాస్తు చేయడం ఎలా.. పాఠశాల స్థాయిలో తొలుత ఐడియా కాంపిటేషన్ నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రాజెక్టులు పంపేలా చూడాలి. ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి ఆ విద్యార్థి పేరు, తండ్రిపేరు తరగతి వివరాలు, విద్యార్థి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు సంఖ్యలు నమోదుచేయాలి. అనంతరం ఠీఠీఠీ.జీ ుఽట ఞజీట్ఛ్చ్చఠ్చీటఛీట.జౌఠి.జీ ుఽ వెబ్సైట్లో విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల వివరాలను నమోదుచేయాలి. రెండు నెలల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు పంపేందుకు విద్యార్థి బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నగదు జమచేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న వారికి రూ.25 వేల వరకు అదనపు నిధులు కేటాయిస్తారు. పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ మనక్ పోటీల్లో ప్రతిభ చూపితే రాష్ట్రపతి భవన్ సందర్శనకు అవకాశం ఉంటుంది. అంతేగాక జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం లభిస్తుంది. ప్రతిభకు పట్టం ఇన్స్పైర్ మనక్కు నామినేషన్ల స్వీకరణకు ప్రభుత్వం ఈ నెల 15వతేదీ వరకూ గడువు విధించింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు ప్రేరేపించడానికి ఇన్స్పైర్ మనక్ పథకం ఉపయోగపడుతుంది. గైడ్ టీచర్లు శిక్షణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేయాలి. మంచి ప్రాజెక్టులను ఇన్స్పైర్ ప్రదర్శనకు తీసుకువచ్చి మంచిపేరు తేవాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారిఇన్స్పైర్ మనక్ నామినేషన్లకు గడువు పొడగింపు -
బెదిరింపులతో డబ్బు లాక్కున్న ముగ్గురు అరెస్టు
కడప అర్బన్ : కడప రిమ్స్ పీఎస్ పరిధిలోని తిలక్ నగర్ ఆంజనేయస్వామి గుడి సమీపంలో వెళ్తున్న వారిని బెదిరిస్తూ పర్సు లాక్కుని పరారవుతున్న చాంద్బాషా, మురాఫత్ అలియాస్ లడ్డు, గౌస్ పీర్లను గురువారం అరెస్ట్ చేసినట్లు కడప రిమ్స్ పోలీసులు తెలిపారు. గత నెల 22వ తేదీ రాత్రి తిలక్ నగర్ సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద వాకింగ్ చేస్తున్న ఇందుమతి, ఇంకా ఇద్దరు మహిళలు, అటువైపుగా వెళ్తున్న యువకులను బెదిరించి నిందితులు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఇందుమతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రిమ్స్ వైద్య విద్యార్థిని ప్రతిభకడప అర్బన్ : కడప రిమ్స్ వైద్య విద్యార్థిని కల్లూరి కిరణ్మయ ప్రతిభ కనబరచి బంగారుపతకం అందుకున్నారు. వైఎఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెకు చెందిన కల్లూరి శివప్రసాద్రెడ్డి (లేట్), ఎద్దుల రత్నమ్మల కుమార్తె కల్లూరి కిరణ్మయి కడప రిమ్స్లో వైద్య విద్య అభ్యసిస్తోంది. అనాటమీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భళా అనిపించింది. చిన్నపుడే తండ్రిని కోల్పోయిన కిరణ్మయి తల్లి రత్నమ్మ, మేనమామ, అత్త ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ సీటు సాధించి కడప రిమ్స్లో చేరారు. అనాటమీ విభాగంలో మొదటి సంవత్సరంలో ప్రతిభ చూపి బంగారు పతకానికి ఎంపికయ్యారు. ఈ నెల 9న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, ముఖ్య అతిథి డాక్టర్ ఓ.పి.యాదవ్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకున్నారు. కిరణ్మయి మాట్లాడుతూ భవిష్యత్తులో పీజీ వైద్యను డీవీఎల్ విభాగంలో అభ్యసించాలని, ప్రజలకు తమవంతుగా వైద్య సేవలదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం
ఉచిత బస్ ఎఫెక్ట్ రాజంపేట: కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్రలకు ఉచిత బస్సు పథకం.. రైల్వే ఆదాయానికి గండికొండుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మహిళా ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో మహిళా బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైళ్లలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు తొలగిస్తూ వస్తున్న క్రమంలో.. ఈ పథకం రైల్వే ఆదాయానికి మరో దెబ్బ కొట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తోందో.. వేచి చూడాల్సిందే. ● ఉభయ జిల్లాల మీదుగా మార్గంలో 25 స్టేషన్లు ఉండగా, డైలీ 30 (అప్ అండ్ డౌన్) రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో రైల్వేలకు వస్తున్న ఆదాయం పట్టాలు తప్పుతోంది. ఇప్పటి నుంచే అధికారుల్లో ఎర్నింగ్స్(ఆదాయం)పై ఆందోళన రోజురోజుకు హెచ్చరిల్లుతోంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో నడిచే నంద్యాల–రేణిగుంట డెమో ప్యాసింజర్, అరకోణం నుంచి కడప వరకు నడిచే అరక్కోణం, తిరుపతి నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఉచిత బస్ (సీ్త్రశక్తి పథకం) ప్రభావం పడింది. ఫలితంగా రైల్వే ఆదాయనికి ఉచిత బస్ (ఆర్టీసీ) గండికొట్టిందనే రైల్వే నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మోదీ సర్కారు రాయితీలను రానురాను తీసేసుకుంటూ వస్తోంది. జర్నలిస్టుల పాస్లతోపాటు అన్ని రకాల రాయితీలకు మంగళం పాడిన సంగతి విదితమే. రైల్వేకమర్షియల్ విభాగాన్ని.. ఇప్పుడు ఉచితబస్తో ఎర్నింగ్స్ కోల్పోతున్న అంశం వేధిస్తోంది. రైలు ప్రయాణానికి మహిళలు దూరం ఏ రైలులో అయినా గార్డుబ్రేక్ ముందు ఉండే లేడీస్కోచ్లో సీట్ల కోసం మహిళలు పోటీపడే పరిస్థితులు నిత్యం కొనసాగుతుండటం విదితమే. ప్రతి స్టేషన్లో అధికంగా మహిళలు ఈ కోచ్లో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లేడీస్కోచ్లో కనీసం పదిమంది కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఆసక్తి చూపుతుండటమే.. ఇందుకు కారణమని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితమే అన్న భావనలో రైలు ప్రయాణాలకు స్వస్తి చెపుతుండటం గమనార్హం. చాలా బోగీల్లో ఖాళీగా సీట్లు ముంబయి–చైన్నె రైలు మార్గంలోని ఉమ్మడి కడప జిల్లా మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లు బోసిపోతున్నాయి. ప్రయాణపు ధర తక్కువ అయిన క్రమంలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉండేవి. ఇప్పుడు ఆ దృశ్యాలు రైలు బోగీలు దూరమయ్యాయి. చాలా మటుకు సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఖాళీగా మహిళా బోగీలు ప్రతి స్టేషన్లో పడిపోయిన రాబడి బోసిపోతున్న ప్యాసింజర్ రైళ్లు రైల్వే అధికారుల్లో ఆందోళన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా సమాచారం మార్గం: ముంబయి–చైన్నె రైళ్లు : 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25కిలోమీటర్లు: 180ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైలు మార్గంలో ప్రతి రైల్వేస్టేషన్లో ఎర్నింగ్స్ పడిపోతున్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల ప్రయాణంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పేదోడి రైళ్లుగా నడు స్తున్న వీటిలో.. తక్కువ వ్యయంతో గమ్యాలకు చేరుకోవచ్చన్న భావనలో మహిళలు ప్రయాణాలు సాగించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సుతో రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపడం లేదు. కడప నుంచి ఒంటిమిట్ట, నందలూరు, తిరుపతి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు నంద్యాలడెమో, ఇంటర్సిటీ, అరకోణం రైళ్లను మహిళలు ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నంద్యాల నుంచి కడప, తిరుపతి కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా ఈ మూడు రైళ్లు ఆగే స్టేషన్లలో ఎర్నింగ్ పడిపోతున్నాయి. -
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాలు మినహా మిగతా 32 మండలాల్లో వాన పడింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ఆరుతడి పంటలకు ఎంతో ఉపయుక్తం అని అన్నదాతలు తెలిపారు. పంటలకు ఉన్న చీడపీడలు తగ్గే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. నాలుగు మండలాలు మినహా జిల్లా అంతటా వాన కడపలో అత్యధికంగా 66.2 మి.మీ వర్షపాతం -
రాత్రి అక్రమంగా యూరియా తరలింపు
దువ్వూరు: మండలంలో రాత్రిళ్లు అక్రమంగా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. నిజమైన రైతులకు యూరియా అందక ఎండకు క్యూలో నిలుచొని అష్టకష్టాలు పడుతుంటే.. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికి ఏ సమయంలోనైనా యూరియా దొరుకుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఏఎస్పీ గత నెలలో దువ్వూరులోని ఫర్టిలైజర్స్ దుకాణాలపై దాడులు చేసి హెచ్చరించినా.. వ్యాపారుల తీరు మారలేదు. దువ్వూరుకు చెందిన మహానందీశ్వర ట్రేడర్స్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో మూడు ఆటోల్లో యూరియాను అక్రమంగా తరలిస్తుండగా.. సమీపంలో ఉన్న దళితవాడ రైతులు యూరియా మాకు ఇమ్మంటే లేదన్నారు, ఈ సమయంలో ఎక్కడికి తరలిస్తున్నారని అడ్డుకున్నారు. ‘మా ఇష్టం మేము ఏ సమయంలోనైనా అమ్ముకుంటాం, మీరెవరు అడ్డుకునేది’ అంటూ షాపు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. నిజమైన రైతులకు అందడం లేదని ఆవేదన మరో పక్క వ్యవసాయాధికారులు దువ్వూరు మండలానికి 980 టన్నుల యూరియా ఇంత వరకు వచ్చిందని చెబుతున్నారు. ఆ యూరియాలో ఎంత శాతం రైతులకు అందిందో, పక్కకు ఎంత తరలిపోయిందో అధికారులే లెక్క తేల్చాలి. ఇంత స్థాయిలో యూరియా పంపిణీ చేసినా రైతులకు అందకుండా ఇలా రాత్రిళ్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే... నిజమైన రైతులకు యూరియా ఎక్కడ అందుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేయని అధికారులు.. అవసరం లేకున్నా యూరియా వాడుతున్నారని, రైతులపైనే నిందలు మోపుతున్నారు. దువ్వూరు మండలంలో 13,500 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, అందులో దాదాపు 60 శాతంపైన కేసీ కెనాల్ పరిధిలో రైతులు వరి సాగు చేశారు. ఒక ఎకరాకు ఎంత తక్కువ అన్నా మూడు బస్తాల యూరియా పడుతుందని, కానీ ఒక బస్తా కూడా దొరకడం కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికై నా యూరియా పక్కకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. విచారణ చేస్తాం ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి అమరనాథ్రెడ్డిని వివరణ కోరగా దువ్వూరు మండలానికి 52 టన్నుల యూరియా మంజూరైందన్నారు. ఆ యూరియాను శుక్రవారం రైతు సేవా కేంద్రాల ద్వారా, ప్రైవేట్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. అయితే దువ్వూరులోని మహానందీశ్వర ట్రేడర్స్ వారు రాత్రి 9 గంటల సమయంలో ఆటోలో యూరియాను తరలించడం తప్పని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడ్డుకున్న రైతులు దురుసుగా ప్రవర్తించిన ‘ఫర్టిలైజర్స్’ సిబ్బంది -
రెడ్బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి కూడా స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. స్టేట్మెంట్ పబ్లిష్ చేస్తే కేసులు పెడతారా? కంటెంట్ మారినా.. ఒక నాయకుడి ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు ఈ రాష్ట్రంలో లేవా? ప్రజాస్వామ్య దేశంలో మొదటి సారి ఇలాంటి విచిత్రాలు చూస్తున్నాం. ఎంతో కాలం ఇలాంటి ఆగడాలు సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం సమంజసం కాదు ఒక రాజకీయ నాయ కుడు తన అభిప్రా యాన్ని తెలియయజేసినప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రజల పక్షాన ఉన్న పత్రికల బాధ్యత. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం సమంజసం కాదు .అది పత్రికా స్వేచ్ఛను,వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే.కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఆగడాలు ఎంతో కాలం సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీవిప్, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు కొత్త సంస్కృతికి తెరరాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని, ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, ఎడిటర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం..ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది.ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు..ప్రజల ముందు కూడా నిలబడవు. –గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ -
ప్రశాంతంగా స్టాఫ్నర్స్ నియామకాల కౌన్సెలింగ్
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4)లో గురువారం నిర్వహించిన కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ నియామకాల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎంపికై న 67 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టాఫ్నర్స్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్స్ బత్తనయ్య, వనీష తదితరులు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు గురువారం 1315 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. కడపకు వచ్చిన యూరియా ర్యాక్ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 395 టన్నులు మార్క్ఫెడ్కు పంపగా మిగతా 205 టన్నులు మన గ్రోమోర్ సెంటర్కు, మరో 300 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకు 415 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 328 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు, 58 టన్నులు మనగ్రోమోర్ సెంటర్లు, మరో 29 టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు చెప్పారు. -
పాలకవర్గం పట్టు.. కమిషనర్ బెట్టు
● రెండో రోజున కొనసాగిన కౌన్సిల్ సమావేశం ● చైర్ పర్సన్ ఫిర్యాదుతో నిర్వహించిన కమిషనర్ ప్రొద్దుటూరు : మున్సిపల్ పాలకవర్గం పట్టుబట్టి భీష్మించగా.. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తన బెట్టు వదలి రెండో రోజున బుధవారం ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు. అజెండాలోని ఒక అంశం చదివిన తర్వాత గత నెలలో ఎందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయారో కమిషనర్ సమాధానం చెప్పాలని చైర్ పర్సన్ ప్రశ్నించారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, వాట్సాప్ మెసేజ్ పెట్టినా పలకకపోవడానికి కారణమేమిటని అడిగారు. ఎక్స్అఫిషియో మెంబర్ హోదాలో హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పందించి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కమిషనర్కు లేదని, ఆయన క్షమాపణ ఎందుకు చెబుతారు.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి .. అంటూ అడ్డు చెప్పారు. కమిషనర్ కౌన్సిల్ సభ్యులందరికీ జవాబుదారీగా వ్యవహరించాలని.. గతంలో ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని మున్సిపల్ వైస్చైర్మన్ ఆయిల్మిల్ ఖాజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ మహిళా చైర్ పర్సన్ అని చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చైర్ పర్సన్కు కమిషనర్ సారీ చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించారు. దీంతో కొంతమంది టీడీపీ సభ్యులు కమిషనర్కు మద్దతుగా బైఠాయించారు. వాగ్వాదాల మధ్య సభ జరుగుతుండగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అర్ధంతరంగా బయటికి వెళ్లిపోయారు. సమావేశం నుంచి వెళ్లిన కమిషనర్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు కిందివైపున ఉన్న తన ఛాంబర్కు వెళ్లిపోయారు. సమావేశం వాయిదా వేయకుండా, చైర్ పర్సన్ అనుమతి లేకుండా ఆయన ఎలా వెళ్లిపోతారని చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారుమునిరెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. తిరిగి కమిషనర్ సమావేశం జరిపే వరకు ఇక్కడే ఉంటామని హాల్లోనే రాత్రంతా గడిపి... అక్కడే భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్లను, కౌన్సిలర్లను అరెస్టు చేసేందుకు రాత్రి పోలీసులు బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు మీరు కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోకుంటే అరెస్టు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డితో అన్నారు. చైర్పర్సన్ అనుమతి లేకుండా పోలీసులు కౌన్సిల్ హాల్లోకి వచ్చేందుకే వీలులేదని, ఏ చట్ట ప్రకారం తమను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఏ చర్యలు తీసుకువాలన్నా చైర్ పర్సన్ అనుమతి తీసుకోవాలని అనడంతో పోలీసులు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం చైర్పర్సన్ పలుమార్లు అనంతపురంలోని మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. సమావేశం జరుపుతారా లేదా? అని అడిగారు. చైర్పర్సన్ ఫిర్యాదుతో ఆర్డీడీ కమిషనర్ ఆగ్రహంతో కమిషనర్, ఆర్ఓ, క్లర్క్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.లార్డీడీ ఆదేశాల మేరకు కమిషనర్ దిగి వచ్చి 20 గంటల తర్వాత మధ్యాహ్నం యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోను అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఎగ్జిబిషన్ గెజిట్ను సవరణ చేయాలని సూచించారు. సమావేశానికి కేవలం వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా మాట్లాడుతూ సభా సాంప్రదాయం ప్రకారం కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని, నిబంధనలను పాటించాలని సూచించారు. పంతాలకు, పట్టింపులకు పోతే నష్టపోయేది అధికారులేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కౌన్సిలర్లు చేపట్టిన నిరసనకు 13వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా మద్దతు తెలిపారు. పొరపాటు చేసిన కమిషనర్ మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెంట వెళ్లిన కమిషనర్ పొరపాటు చేసి ఇరుక్కుపోయారు. ఎందుకు సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారని చైర్పర్సన్ ఫిర్యాదు చేయగా విధి నిర్వహణ సమయం దాటిపోయిందని (ఆఫీస్ అవర్స్) వెళ్లిపోయినట్లు కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు బుధవారం ఆఫీస్ అవర్స్ ప్రారంభమయ్యాయని తిరిగి సమావేశం నిర్వహించాలని కోరారు. దీంతో కమిషనర్కు సందిగ్ద పరిస్థితి ఏర్పడింది. సభ్యులందరు బ్లాక్ రిబ్బన్లు ధరించి కౌన్సిల్ హాల్లో నిరసన వ్యక్తం చేయడంతోపాటు సెల్ఫీ వీడియోల ద్వారా ఆర్డీడీ, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ కౌన్సిల్ సమావేశం జరిగింది. -
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు ● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత బద్వేలు అర్బన్/ప్రొద్దుటూరు క్రైం : బద్వేల్ పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ వార్డులో చూసినా ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్సకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యుల కొరత ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల్లో బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 250 నుండి 400 ఓపీ నమోదవుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఆస్పత్రి కిటకిటలాడుతున్నా తగినంతమంది వైద్యులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఆరుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్పై వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షలు నిర్వహించే యంత్రం మరమ్మతులకు గురికావడంతో రోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రక్తనమూనాలు సేకరించి గాంధీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో పరీక్ష చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. కిక్కిరిసిన చిన్నపిల్లల వార్డు ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజూ సుమారు 1100 దాకా ఓపీ నమోదవుతోంది. మరోవైపు రాజుపాళెం, కామనూరు, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఓపీ పెరిగింది. కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు వర్షాలు పడుతుండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జ్వరం, జలుబు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కిటకిటలాడుతోంది. 20 మంచాలు మాత్రమే ఉండడంతో 30 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. మంచాల కొరత కారణంగా ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటుగా మరింతమంది చికిత్స పొందుతున్నారు. రక్త పరీక్షల కోసమే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఓపీ కోసం బారులు తీరిన జ్వరపీడితులు చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు -
కొండాపురంలో ఆగిన ఎక్స్ప్రెస్ రైళ్లు
కొండాపురం : కొండాపురం రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు ఆగింది. మనోహర్బాబు ఆద్వర్యంలో రైలుకు పూజలు నిర్వహించారు. కన్యాకమారి– పూణే మధ్య నడిచే 16381,16382 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కడప ఎంపి వైఎస్ అవినాష్రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి స్టాపింగ్ చేయించడంతో కొండాపురం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జయంతిఎక్స్ ప్రెస్ నిలుపుదలకు కృషి చేసిన కడపఎంపి వైఎస్ అవినాష్రెడ్డికి ఎల్లనూరు, కొండాపురం,సింహాద్రిపురం మండల ప్రజలు అభినందనలు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలి ప్రొద్దుటూరు కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో బుధవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్యాంసుందర్రెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న సీఎంకు మెయిల్స్ ద్వారా విజ్ఞాపనలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, వెంకటేశ్వర్లు, ఖాజాపీరా, వరప్రసాద్ రెడ్డి, అబ్దుల్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే నగల చోరీ బద్వేలు అర్బన్ : ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటే పట్టణ వాసులు భయపడిపోతున్నారు. అలా తాళం పడిందో లేదో.. ఇలా దొంగలు చొరబడి ఉన్నదంతా దోచేస్తున్నారు. రాత్రి పూట కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. పట్టణంలోని వెంకటయ్యనగర్లో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంటిలో దొంగలు చొరబడి 12.50 తులాల బంగారు నగలు, 100 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వెంకటయ్యనగర్లో సునీత, శ్రీనివాసులు దంపతులు నివశిస్తున్నారు. శ్రీనివాసులు ఉదయమే బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో సునీత పక్కవీధిలోని తండ్రి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులకొట్టి లాకరులో దాచిన 12.50 తులాల బంగారు నగలు, వంద గ్రాముల వెండి ఆభరణాలు అపహరించుకువెళ్లారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన సునీత చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లింగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేలిముద్రలు సేకరించారు. -
ఆదివాసుల హక్కుల కోసం స్టాన్స్వామి పోరాటం
ప్రొద్దుటూరు కల్చరల్ : ఆదివాసుల హక్కుల కోసం ఫాదర్ స్టాన్స్వామి తన జీవితాంతం పోరాటం చేశారని జన విజ్ఞాన వేదిక జిల్లా యూత్ కన్వీనర్ హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక జేవీవీ కార్యాలయంలో మానవ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి జైలులో రాసిన ‘మౌన ప్రేక్షకుణ్ణి కాను’ పుస్తక పరిచయ సభ బుధవారం నిర్వహించారు. కవి మహమూద్ అధ్యక్షతన జరిగిన ఈ సందర్భంగా హేమంత్కుమార్ మాట్లాడుతూ ఆదివాసుల గ్రామసభ అనుమతి లేనిదే ఎవరు భూములు కొనడానికి వీలులేదని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని గత ప్రభుత్వాలు తుంగలో తొక్కాయన్నారు. కనీస వసతులు కల్పించకుండా జైలులో ఆయన చనిపోవడానికి కారణమయ్యారన్నారు. మిత్రజ్యోతి సాహితీ సంస్థ కన్వీనర్ మహమూద్ మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక స్థితికి పుస్తకం అద్దం పడుతుందని, హక్కుల కోసం గొంతెత్తితే ఎటువంటి వారైనా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని చెబుతోందని అన్నారు. విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ఈ పుస్తకం భీమా కొరేగాం అక్రమ కేసులో నిబంధించబడిన బుద్ధి జీవుల గొంతుక అని చెప్పారు. మధ్య భారతంలో కగార్ పేరుతో సహజ వనరులను తవ్వి తీయడానికి ఆదివాసులపై నరమేధం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకుడు తవ్వాసురేష్, రచయితలు దాదాహయత్, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రహ్మణ్యం, చైతన్య మహిళా సంఘం పద్మ, గోపీనాథ్రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, ఇన్నర్వీల్ భారతి, దేవానంద్, కొత్తపల్లి శ్రీను, పౌరహక్కుల సంఘం సురేష్, ప్రొఫెసర్ షఫీవుల్లా, హైమ, రాకేష్, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీని, జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వ విధానాలు బలహీన పరుస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు శివ దాసన్ తీవ్రంగా విమర్శించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అధ్యక్షతన బుధవారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సెమినార్ లో సీపీఎం రాజ్యసభ్యులు శివదాసన్ మాట్లాడుతూ దేశంలో యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని, విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేటాయింపులు తగ్గిపోవడం వల్ల చిన్న సమస్యలు కూడా నియంత్రించలేని స్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు విగ్రహాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, కానీ స్కూళ్లను, హాస్పిటల్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై ఉందని, పెన్షన్ సదుపాయం అన్నది రాజ్యాంగ హక్కు అని పాలకులు గుర్తించాలని అన్నారు. కేరళ తరహా ప్రత్యామ్నాయ విధానాల కోసం అంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అవధానం శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మి రాజా, నాగమునిరెడ్డి, రాజశేఖర్ రాహుల్, రవి తేజ, ఎన్.శివశంకర్ , రామ్మూర్తి నాయుడు, అజీజ్, లలిత, రామకృష్ణా రెడ్డి, సుధాకర్, వెంకటరామరాజు పాల్గొన్నారు. -
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు–తాడిపత్రి రహదారిపై ఓ లారీ భీబత్సం సృష్టించింది. వేగంగా వస్తూ రహదారిపై వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. వాటిని మేపే ఇద్దరు గొర్రెల కాపరులపై వెళ్లడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 15 గొర్రెలు మృతి చెందాయి. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. నంద్యాల జిల్లా అళ్లగడ్డ తాలూకా నల్లవాగుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు(45), ఆలమూరు గ్రామానికి చెందిన నరసింహులు(35) తమ యజమాని క్రిష్ణయ్యకు చెందిన గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి గండికోట ప్రాంతంలో గొర్రెలు మేపి స్వగ్రామానికి యజమాని క్రిష్ణయ్యతో కలిసి బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డులో వెనుకవైపు నుంచి అతి వేగంగా గుర్తుతెలియని లారీ దూసుకువచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరసింహులును ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. యజమాని క్రిష్ణయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 15 గొర్రెలు మృతిచెందడంతో దాదాపు రూ. 2.50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, మృతుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని క్రిష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బోరున విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం మృతిచెందిన వెంకటేశ్వర్లు, నరసింహులు -
అయ్యా.. ఇవ్వండి యూరియా
చాపాడు : అయ్యా.. ఇవ్వండి యూరియా అంటూ మండలంలోని అల్లాడుపల్లెకు వచ్చిన వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ చంద్రానాయక్ను అల్లాడుపల్లె, లక్ష్మీపేట, శ్రీరాములపేట, పెద్ద గురవలూరు గ్రామాల రైతులు నిలదీశారు. జేడీఏను చుట్టుముట్టి యూరియా కోసం తాము పడుతున్న అవస్థలు విన్నవించారు. రైతుసేవా కేంద్రాల ద్వారా యూరియా తెప్పించి సరిపడేంత అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేట్ దుకాణాల్లో బస్తా రూ.400–500 వరకు పెట్టి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఒక బస్తా ఇస్తే పంటలు ఎలా సాగు చేయాలని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన జేడీఏ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని వరిపైరులో తగ్గించాలని, ఎకరాకు 75 కిలోలు మూడు విడతల్లో అందించుకోవాలని సూచించారు. మామూలు యూరియా బదులు నానో యూరియా వాడితే డబ్బు ఆదా అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కృష్ణమూర్తి, వ్యవసాయాధికారి దేవీపద్మలత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేడీఏను చుట్టుముట్టి నిలదీసిన రైతులు -
బాల్య వివాహాలను కట్టడి చేద్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా బాలల రీసోర్స్ సెంటర్లో సీడీపీఓలు, సూపర్వైజర్లకు మిషన్ శక్తి పథకంపై పది రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేక అనర్థాలకు దా రి తీస్తాయని సూచించారు. మిషన్ వ్యాత్సల్య పథకం ద్వారా చిన్నారులను చట్టబద్దంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. సీడీపీఓలు శ్రీలత, సునీత, శ్రీదేవి, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ శోభారాణి, డీసీపీఓ సుభాష్ యాదవ్, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అశ్విని, కౌన్సిలర్ పర్వీన్బాబు పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 14న జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సీనియర్స్ బాల బాలి కల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 7 నుంచి 10 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్నదాత పోరు’ను అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి, కేసులు పెడతామని బెదిరించినా రైతులు, రైతు కార్మికులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వాటికి లొంగకుండా రోడ్లపైకి వచ్చారన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా .. పోలీసులు అడుగడుగునా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూశారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించే పరిస్థితి రావాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రా నికి 8లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉంటే ముందే ప్లాన్ చేసి ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రానికి ఇండెంట్ ఇవ్వకుండా తాత్సారం చేసిందన్నారు. తీరా రైతులకు యూరియా అవసరమయ్యే సమయానికి ప్రభుత్వం వద్ద నిల్వలు లేవని, దీంతో ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు యూరియా వేసిన వరి తింటే కేన్సర్ వస్తుందని చెప్పడం సరికాదన్నారు. అలాగే 100 శాతం యూరియాను ప్రైవేటు డీలర్లకే అప్పగించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన క్వింటా యూరియాను రూ.700–800లకు అమ్ముతున్నారన్నారు. ఇందులో సుమారు రూ.400కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారం పదిరోజుల్లోనే 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అడుగడుగునా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు...? సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని కూటమి పార్టీల నేతలు సభ నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు తొలగించారని, 19 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి అసలే లేదన్నారు. సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నేతలు పులి సునీల్కుమార్, బీహెచ్ ఇలియాస్ పాల్గొన్నారు. పోలీసులు నోటీసులిచ్చి బెదిరించినారైతులు వెనకడుగు వేయలేదు ప్రభుత్వం రైతులకు అడుగడుగునా మోసం చేసింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్రెడ్డి -
ప్రతిభకు ఉపకారం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడుల్లో గ్రామీణ,పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుతుంటారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో అర్హత సాఽధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం అందుతుంది. దరఖాస్తుకు ఈనెల 4నుంచి 30వ తేదీ తుది గడువు విధించారు. పరీక్ష డిసెంబర్ 7వతేదీ నిర్వహిస్తారు. ఎవరు అర్హులు: ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7 వ తరగతిలో ఓసీ,బీసీలైతే 55 శాతం, ఎస్సీ,ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమాన మైన గ్రేడ్ పొందిన వారు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు ,రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు WWW.bse.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 వేలు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు ఈ పారితోషికానికి ఎంపికై తే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకారవేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని విభాగాల వారీగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఇందులో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. మూడు గంటల పాటు పరీక్ష సమయాన్ని కేటాయించారు. మెంటల్ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలుంటాయి. దీనికి 90 మార్కులు స్కాలిసిస్ అప్టిట్యూట్ పరీక్ష: ఇందులో 7,8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య,సాంఘిక విషయాలపై ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 180 మార్కులు. ఎన్ఎంఎంఎస్ సమాచారం ఇలా.. ఎన్ఎంఎంస్కు దరఖాస్తులకు వేళాయే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రోత్సాహకాలు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 8వ తరగతి విద్యార్థులు అర్హులు ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు డిసెంబర్ 7న రాత పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04–09–25 ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికిచివరితేదీ : 30.09.25 దరఖాస్తుకు వెబ్సైట్: WWW.bse.gov.in పరీక్ష ఫీజు వివరాలు ఓసీ, బీసీ విద్యార్థులకు ఫీజు: రూ.100 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు: రూ.50(ఎస్బిఐ కలెక్ట్ లింక్ ద్వారా) ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష: 07.12.2025 ఎంపీపీ, జెడ్పీ స్కూళ్లు 7698 ప్రభుత్వ స్కూళ్లు 503 మున్సిపల్ స్కూళ్లు 1563 ఎయిడెడ్ స్కూళ్లు 423 ఓరియంటల్ స్కూళ్లు 171 ఏపీ మోడల్ స్కూళ్లు 276 -
నేపాల్లోని తెలుగువారి రక్షణకు చర్యలు
కడప సెవెన్రోడ్స్: నేపాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకోసం వైఎస్సార్ కడపజిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూము నెంబరు 08562–246344 ఏర్పాటు చేసింది. నేపాల్లో ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటుచేసినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్లైన్ నెంబర్లు 98183 95787, 85000 27678 ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఏపీఎన్ ఆర్టీఎస్ హెల్ప్లైన్ నెంబరు 0863 2340 678 సైతం అందుబాటులో ఉంటుంది. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు పొందుపరిచేందుకు స్కానర్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. కలెక్టరేట్ కంట్రోల్ రూము 08562–246344 -
యూరియాపై ఆందోళన వద్దు
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో లక్ష ఎకరాలకు సరిపడ యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్లో రైతులకు 12500 టన్నుల యూరియా అందజేశామన్నారు. మూడు రోజులుగా 1100 టన్నులు అందజేశామని, ఈ రోజు 150 టన్నులు పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో 600–700 టన్నుల యూరియా జిల్లాకు రానుందని వెల్లడించారు. ఇప్పటికి 3.70లక్షల బస్తాల యూరియా తీసుకున్నారని తెలిపారు. ప్రైవేటు డీలర్లు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కేసులు పెడుతున్నామన్నారు. యూరియా కేవలం నత్రజనిని మాత్రమే ఇస్తుందని.. ఎక్కువ వాడితే పంటకు నష్టం కలుగుతుందని చెప్పారు. ఉల్లి ఎంతైనా కొంటాం: జిల్లాలో పదివేల ఎకరాల్లో ఉల్లిపంట సాగుచేశారని, రెండు రోజుల నుంచే కోత ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 22, 23 తేదీల నుంచి పంట మార్కెట్కు వస్తుందన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కిలో రూ.12ల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో చీని రైతులు 80 శాతం మంది ఇప్పటికే పంట అమ్ముకున్నారన్నారు. మార్కెట్లో వేలం నిర్వహించే సమయంలో బాగా గ్రేడింగ్ చేసి తీసుకురావాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి -
బీసీ మున్సిపల్ చైర్పర్సన్ అని చులకనా!
ప్రొద్దుటూరు: గత నెలలో ఎందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు..? తాను సమావేశం పెట్టాలని సమాచారం పంపినా ఎందుకు స్పందించలేదు.. అంటూ మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని ప్రశ్నించారు. తాను బీసీ మున్సిపల్ చైర్పర్సన్ అని చులకనగా చూస్తున్నారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షత వహించారు. గత నెలలో సాధారణ సమావేశం నిర్వహించాలని, తర్వాత అత్యావసర సమావేశం నిర్వహించాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టానని, సిబ్బంది ద్వారా సమాచారం అందించానని చైర్పర్సన్ తెలిపారు. అయినా ఎందుకు స్పందించలేదని కమిషనర్ను ప్రశ్నించారు. కమిషనర్ వాట్సాప్ మెసేజ్ కూడా తీసుకున్నారని చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. దీనిపై కమిషనర్ ఎంతకూ స్పందించకపోవడంతో పోడియం వద్ద వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు బైఠాయించారు. చైర్పర్సన్కు సమాధానం ఇవ్వకపోవడం అంటే చైర్పర్సన్ను అవమానించినట్లేననే వైఎస్సార్సీపీ సభ్యులు తెలిపారు. ఎక్స్ అఫిసియో సభ్యుని హోదాలో హాజరైన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కమిషనర్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని, జవాబు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. మీరు ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలే కానీ అడ్డుకోవడం తగదన్నారు. ‘కమిషనర్లు.. ప్రతి కౌన్సిలర్కు జవాబుదారీతనంగా ఉండాలని.. గతంలో మీరు చెప్పిన సూచనలు ఏమయ్యాయని వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సుమారు అరగంటకుపైగా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులకు సమాధానం ఇవ్వకుండానే కమిషనర్, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్ది వెంట సమావేశం నుంచి వెళ్లిపోయారు. తిరిగి సమావేశం నిర్వహించే వరకు తాము ఇక్కడే కూర్చుంటామని చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్లు, సభ్యులు సమావేశ మందిరంలోనే నిరసన తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్పర్సన్ ఆర్డీడీకి ఫోన్లో కమిషనర్పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ వేలం పాట నిర్వహించకూడదని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా జాప్యం చేశారని వైస్ చైర్మన్లు ఆరోపించారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలో టీడీపీ వర్గీయులు కొత్తగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారని, అందుకోసమే మున్సిపాలిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించకుండా వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజాతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మంగళవారం రాత్రంతా గడిపారు. ఈ విషయమై చైర్పర్సన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము మీటింగ్ హాల్లోనే ఉన్నామని.. అజెండా ప్రకారం సమావేశం నిర్వహించాలని కమిషనర్కు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని కమిషనర్ ఎమ్మెల్యే వరద వెంట వెళ్లడంతోబైఠాయించిన కౌన్సిలర్లు -
జాతీయ స్థాయి పోటీలకు ‘భారతి’ విద్యార్థులు
కమలాపురం : మండల పరిధిలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) లోని డీఏవీ భారతి విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం పరిశ్రమ ప్రతినిధులతో కలసి ఆయన విజేతల వివరాలు వెల్లడించారు. ఇటీవల విజయ నగరం జిల్లాలోని రాజాం సీఎంఆర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో జరిగిన డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో ఎన్వీ కార్తిక్రెడ్డి ట్రిపుల్ జంప్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే 400 మీ. పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రోలో ఎం. షారూన్ కుమార్ తృతీయ స్థానంలో, 4్ఙశ్రీ400 మీటర్ల పరుగు పందెంలో నరేష్, కార్తీక్, భార్గవ్, షారూన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్–17 బాలికల విభాగంలో వైశాలి ట్రిపుల్ జంప్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. జావలిన్ త్రోలో విహారిక ద్వితీయ స్థానంతో పాటు 400మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచింది. అండర్–14బాలికల విభాగంలో ట్రిపుల్ జంప్లో అశ్లిత ప్రథమ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో కేవీ రుషి జావెలిన్ త్రోలో తృతీయ స్థానంలో నిలిచాడు. కాగా విజేతలుగా నిలిచిన వారిలో కార్తిక్ రెడ్డి (ట్రిపుల్ జంప్), వైశాలి (ట్రిపుల్ జంప్), విహారిక (జావెలిన్ త్రో), అశ్లిత(ట్రిపుల్ జంప్) లు త్వరలో జరగబోయే డీఏవీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కాగా విజేతలుగా నిలిచిన వారిని పరిశ్రమ సీఎంఓ సాయి రమేష్ ,ప్రతినిధులు గోపాల్రెడ్డి, భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రిలు అభినందించారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పరిధిలోని పెన్నానదిలో గల్లంతు అయిన చెన్నూర్ ఫయాజ్ మృత దేహం లభించిందని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన చెన్నూర్ ఫయాజ్తో పాటు మరికొంత మంది యువకులు సోమవారం సాయంత్రం చేపలు పట్టడానికి పెన్నానది వద్దకు వెళ్లారు. అయితే చేపలు పడుతున్న సమయంలో చెన్నూరు ఫయాజ్ (25) అనే వ్యక్తి ప్రమాదశాత్తు నదిలో పడి గల్లంతు అయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా బోటు సాయంతో సోమవారం రాత్రింతా గాలించారు. మంగళవారం ఉదయం కూడా బోటు సాయంతో పెన్నానది నీటి ప్రవహం వెంబడి గాలింపు చేశారు. హనుమనుగుత్తి గ్రామ సమీయంలో దడికి ఫయాజ్ మృతదేహం ఉండటం అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎరువు కోసం వెళ్లి వస్తుండగా.. – లారీ ఢీ కొని రైతు మృతి చాపాడు : మైదుకూరు– ప్రొద్దుటూరు ప్రధాన రహదారిలో గల మండల పరిధిలోని ఆనంద ఆశ్రమం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమాపురం గ్రామానికి చెందిన లెక్కల లక్ష్మిరెడ్డి (65) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. లక్ష్మిరెడ్డి ఎరువుల కోసం మైదుకూరుకు వెళ్లి తిరిగి గ్రామానికి ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమాపురం క్రాస్ రోడ్డు దాటుతుండగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి ప్రొద్దుటూరుకు వెళుతున్న వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మోటార్ సైకిల్ నిప్పంటుకుని కాలిపోయింది. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారిని విస్తరణ చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం వలన సోమాపురం వెళ్లే గ్రామస్తులు రోడ్డు దాటుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణ అధికారులు చర్యలు తీసుకుని తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు. టిప్పర్ ఢీ కొని వ్యక్తి మృతి ఖాజీపేట : జాతీయ రహదారి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె. సుబ్బయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే చాపాడు మండలం నాగసానిపల్లె గ్రామం వద్ద ఉన్న గుట్ట నుంచి మట్టిని టిప్పర్ ద్వారా తరలిస్తున్నారు. అందులో భాగంగా అల్లాడు పల్లె నుంచి ఖాజీపేట మండల పరిధిలోని జాతీయ రహదారి అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు రాగానే ముందు వెళుతున్న బైక్ను టిప్పర్ ఢీ కొంది. దీంతో బైక్ పై ఉన్న సుబ్బయ్య రోడ్డు నుంచి కాలువలో పడ్డాడు. కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖాజీపేట పోలీసులు అక్కడికి చేరుకుని చనిపోయిన వ్యక్తిని కడప రిమ్స్ లోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తిది ప్రొద్దుటూరు గా గుర్తించారు. ఆమేరకు టిప్పర్ డ్రైవర్ జహంగీర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్ కడప అర్బన్ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం కు పాల్పడిన రౌడీ షీటర్ రాజ్కుమార్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ రాజ్ కుమార్ ఈనెల ఏడో తేదీన ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇచ్చి తన ఇంట్లో ఎత్తుకుని వెళ్లి అత్యాచారయత్నం కు పాల్పడే ప్రయత్నం చేశాడని తెలిపారు. ఈకేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం – టపాసులు పడి బోదకొట్టం దగ్ధం వీరబల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్లో కరిముల్లా అనే వ్యక్తి బోదకొట్టం నిర్మించుకొని టీ అమ్ముకొని జీవనం సాగించేవాడు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జ్ పదవి చేపట్టిన జగన్ మోహన్ రాజు మొట్టమొదటి సారిగా మండలానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్లో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతో అవి ఆ బోదకొట్టంపై పడి పూర్తిగా కాలిపోయింది. దీంతో కరీముల్లా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండిపోయింది. కరీముల్లా ఇటీవల వేలు ఖర్చుచేసి బోదకొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. -
కేఎన్ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై దాడి
పులివెందుల : పులివెందుల పట్టణంలోని శ్రీరామ హాలు రోడ్డులో ఉన్న కేఎన్ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ట్రావెల్స్ ఎదురుగా కారు పార్కింగ్ చేయడంతో ట్రావెల్స్లో పనిచేసే వ్యక్తి కారును పక్కకు తీయాలని బస్సు వస్తుందని తెలపడంతో మాట, మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ట్రావెల్స్లో పనిచేసే వ్యక్తిపై దాడికి పాల్పడటంతోపాటు ట్రావెల్స్లో ఉన్న ఫర్నీచర్, బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
గాయపడిన ప్రసాద్, శ్రీను, ప్రొద్దుటూరు ఆసుప్రతిలో వైద్యులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామ పరిధిలోని సిర్రాజుపల్లి రోడ్డులో జేసీబీ యంత్రం పనులు చేస్తుండగా అదే మార్గంలో పోతున్న బైక్ను ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకుపై పోతున్న మల్లికప్రసాద్ (40), యర్రగుళ్ల శ్రీను, శివశంకర్లకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికప్రసాద్కు తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... సిర్రాజుపల్లి గ్రామానికి చెందిన మల్లికప్రసాద్, దండుపల్లి గ్రామానికి చెందిన యర్రగుళ్ల శ్రీను, శివశంకర్లు ముగ్గురు సిర్రాజుపల్లి రోడ్డు నుంచి బైక్లో చిలంకూరుకు బయలు దేరారు. చిలంకూరు గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వద్దకు రాగానే జేసీబీ రోడ్డుకు అనుకుని పనులు చేస్తోంది. జేసీబీ ఆపరేటర్ ముందు భాగాన పనులు చేస్తుండగా వెనుక భాగాన ఉన్న జేసీబీ పళ్ల తొట్టి రోడ్డుకు దగ్గరలో ఉంది. అదే సమయంలో బైక్పైన ప్రసాద్, శ్రీను, శివశంకర్లు పోతుండుగా జేసీబీ తొట్టి తగిలింది. దీంతో బైక్పై ఉన్న ప్రసాద్ ఎగిరి తొట్టికి ఉన్న ఇనుప పళ్ల మధ్య ఇరుక్కోవడంతో ఇనుప పళ్లు ప్రసాద్ ఛాతీపై దిగింది. మిగిలిన ఇద్దరు శ్రీను, శివశంకర్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే డాక్టరు ఎం సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురికి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ పరిస్థితి విషమించడంతో కర్నూల్ కు తరలించారు. అక్కడ నుంచి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ విశ్వనాథ్రెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
దొరికింది ఎంత.. దాచింది ఎంత?
● గ్యాంబ్లింగ్ సంఘటనలో అనుమానాలు ఎన్నో ● 22 మంది పేకాటరాయుళ్లు అదుపులోకి.. ● రూ. 11,83,940 నగదు స్వాధీనం జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మండల పరిధిలోని గండికోట– దప్పెర్ల రహదారిలో ముళ్లపొదల్లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్బాబు ఎస్ఐ రామకృష్ణ, సిబ్బందితో కలసి దాడులు చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 22 మందిని పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి వద్ద నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు రూ. 80 లక్షల రూపాయలు మేరకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సీఐ నరేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ.. సీఐ నరేష్ బాబు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గండికోట– దప్పెర్ల రోడ్డు మార్గంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలసి 7వ తేదీ దాడి నిర్వహించి 22 మంది పేకాటరాయుళ్ల వద్ద నుంచి రూ. 11, 83, 940 స్వాధీనం చేసుకుని నోటీసులు ఇచ్చి పంపామన్నారు. కాగా.. మండలపరిధిలోని చిటిమిటి చింతలలో ఈ నెల 7వ తేదీ పేకాట ఆడుతూ పట్టుబడిన 22 మంది మంగళవారం కొలిమిగుండ్ల మండలం అవుకు నుండి 15 లీటర్ల నాటు సారా తెచ్చుకుని గ్రామ సమీపంలో తాగుతున్నట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకోని కోర్టుకు హాజరు పరిచామని.. కోర్టు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు విషయం ఎంత అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. జూదరుల అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉక్కాయపల్లె దిబ్బల సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి వద్ద నుంచి రూ. 75వేలు నగదుతో పాటు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. -
సాగు భూముల్ని కార్పోరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సాగు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షులు విజయ రాఘవన్ అన్నారు. మంగళవారం కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణంలో జాతీయ సమావేశాలు ప్రారంభ సూచిక సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ పంపిణీ సాగునీరు ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడి ఊహాజనితమైన పథకాలతో భూములు సేకరించి వ్యవసాయాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నదని, రైతుల్ని వ్యవసాయ కూలీలను అభద్రతకు భయభ్రాంతులకు పాలకులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. బలవంతపు భూ సేకరణ వల్ల అభివృద్ధి జరగలేదని దీనివల్ల లక్షలాది రైతులు కూలీలు వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని, సన్న ,చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి దస్తగిరి రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి మనోహర్, జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు రెడి,్డ జిల్లా నాయకులు ఏ రామ్మోహన్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం పుస్తకం ఆవిష్కరణ అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కార్పోరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయ రంగం పుస్తకాన్ని మంగళవారం కడప హరిత హోటల్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షుడు విజయ రాఘవన్ -
భూమి, ఉపాధి కోసం పోరుబాట
● అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు ● ఘనంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : భూ పంపిణీ, సాగునీరు, ఉపాధి హామీ కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు విజయ రాఘవన్, విజూ కృష్ణన్ వెంకట్, శివ దాసన్ తెలిపారు. కడపలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని హరిత హోటల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ కూలీల వలసల నివారణ కోసం ఆనాడు వామపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నేడు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తూట్లు పొడుస్తోందన్నారు. పంటలకు దక్కని గిట్టుబాటు ధర మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఢిల్లీ రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనువిప్పు కలగలేదన్నారు. కేరళ తరహా ప్రత్యామ్నాయ విధానాలు భారతదేశ రైతులు, వ్యవసాయ కార్మికులకు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులకు ఆశపడి రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు, యూరియా కోసం బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. రానున్న కాలంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు భూములు దక్కే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ వ్యవసాయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ చంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత నాయకులు విక్రమ్ సింగ్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ లలిత బాలన్తోపాటు ఏపీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, దండాల సుబ్బారావు, సీపీఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, కడప జిల్లా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు అన్వేష్ శివకుమార్, దస్తగిరిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.మనోహర్ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ కరస్పాండెంట్కు గాయాలు
కడప అర్బన్ : కడప సాక్షి టీవీ చానెల్ సీనియర్ కరస్పాండెంట్ వెన్ను శ్రీనివాసరావు (50) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన కడప నగరంలోని ఓంశాంతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఉదయం తన ఇంటి నుంచి స్కూటీలో వస్తుండగా చెత్తను తరలిస్తున్న ఆటోను తప్పిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆయన ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. కడప నాగరాజుపేటలోని సన్రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయనను మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పరామర్శించారు. సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.పెన్నాలో యువకుడి గల్లంతుఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి– ప్రొద్దుటూరు మార్గన ఉన్న పెన్నాలో చేపలు పట్టడానికి వెళ్లి చెన్నూరు ఫయాజ్ (25) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతు అయినారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులు చేపలు పట్టడానికి పోట్లదుర్తి పెన్నానది వద్దకు సాయంత్రం చేరుకున్నారు. వీరిలో చెన్నూరు ఫయాజ్ అనే యువకుడు చేపలు పట్టడానికి పోయే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయారు. నది బయట ఉన్న ముగ్గురు యువకులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఫయాజ్ నదిలో గల్లంతు అయినారు. వెంటనే వారు ఫయాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. ఫయాజ్ కుటుంబ సభ్యులు యర్రగుంట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లారు. సీఐ విఽశ్వనాథ్రెడ్డి, ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపులు చేపట్టారు. రాత్రి కావడంతో మంగళవారం ఉదయం గాలింపులు చేసే అవకాశం ఉంది. -
ప్రజా ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం
ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృత్తం కాకుండా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 121 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి.. చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆ ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో యూరియా ఎమర్జెన్సీ విధించాలి
● అఽధిక ధరకు విక్రయిస్తే చర్యలు చేపట్టాలి ● కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నాకడప సెవెన్రోడ్స్ : దేశంలో యూరియా ఎమెర్జెన్సీ విధించాలని, రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర కోరారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎరువుల కొరత సృష్టించి అఽధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా అందుబాటులో లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతేడాది ఇలాంటి సమస్య రాలేదన్నారు. యూరియా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా రైతులకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న యూరియాలో 80 శాతం ప్రైవేటు షాపులకు ఇస్తూ 20 శాతం మాత్రమే ఆర్ఎస్కే, సొసైటీలకు సరఫరా చేయడం తగదన్నారు. ఇందువల్ల బ్లాక్లో బస్తా రూ.400కు పైగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక ఆధార్కార్డుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తామనడం తగదన్నారు. డీలర్ల వద్ద యూరియా కొనుగోలుకు వెళితే యూరియాతోపాటు ఇతర ఎరువులు కూడా కొనాలని షరతు పెడుతున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు వెంకట్రాముడు, శంకర్నాయక్, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్రెడ్డి, ఈశ్వరయ్య, బషీర్, పక్కీరప్ప, కొండయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దేవగుడి x పోట్లదుర్తి
● గండికోటలో పనులు అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఆది వర్గం ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోట్లదుర్తి నాయకులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు టాస్క్ఫోర్సు : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు రోజు రోజుకు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ‘పోట్లదుర్తి బ్రదర్స్’ ఎక్కడ పనులు చేపట్టిన ఆ పనులు అడ్డుకోవడం దేవగుడి బ్రదర్స్లో ఒకరయిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పరిపాటిగా మారిపోయింది. పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం 70 కోట్లకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను లెస్ వేసి రిత్విక్ కంపెనీ పేరుతో పోట్ల దుర్తి బ్రదర్స్ దక్కించుకున్నారు. ఇటీవల గ్రామంలో రిత్విక్ కంపెనీ గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం యంత్రాలతో వెళ్లారు. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి స్థానిక నాయకులను రెచ్చగొట్టి పనులు అడ్డుకోవాలని సూచించారు. దీంతో స్థానిక నాయకులు పనులకు అడ్డు తగులుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు మొదలు పెట్టగా రెండు సార్లు గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. చేసేదిలేక రిత్విక్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఈ ఇద్దరి వివాదం తలనొప్పిగా మారిపోయింది. సోమవారం గండికోటలో పోలీసు బందో బస్తు మధ్య పనులు చేస్తున్న కంపెనీని సాయంత్రం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానికులు పనులు అడ్డుకున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా.. స్థానికంగా ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ అధికారులు వాపోతున్నారు. గతంలోనూ అంతే.. గతంలో కొండాపురం మండలంలో టి.కోడురు పంచాయతీ పరిధిలో అదాని గ్రూప్ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులకు ఎంపీ రమేష్నాయుడు దక్కించుకున్నారు. ఈ పనులు ప్రారంభించడానికి వెళ్లిన అధికారులపై దాడులు చేసి భయందోళనకు గురి చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది. అనకాపల్లి ఎంపీ రమేష్ నాయుడు సీరియస్గా తీసుకోవడంతో అధికారులు సైతం అలర్టు అయ్యారు. పనులు చేపట్టడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. అలాగే స్థానిక రైతులకు అదనంగా పరిహారం ఇస్తామన్న హామీని అమలు చేయనందున దానికోసం కంపెనీ ముందు ధర్నా నిర్వహించే విధంగా ఇటీవల దేవగుడి సోదరులు పావులు కదిపారు. సీఎంఓ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు రావడంతో హుటాహుటిన డీఎస్పీ స్థానిక పోలీసులతో వెళ్లి స్థానిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక నాయకులు ధర్నాను విరమించుకున్నారు. అదేవిధంగా ముద్దనూరులో సీఎం సురేష్ నాయుడు వర్గం బ్రాందీషాపు చేజిక్కించుకున్నారు. బ్రాందీషాపు ప్రారంభించటానికి రూములు అద్దెకు ఇవ్వకూడదంటూ ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు భయపెట్టడంతో స్థానికులు బ్రాందీషాపులకు రూములు అద్దెకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు బ్రాందీషాపుకు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే సురేష్ నాయుడు అప్పటి ఎస్పీని కలిశారు. దీంతో సీరియస్గా తీసుకున్న అధికారులు కంటైనర్లో బ్రాందీషాపును మొదట ప్రారంభింపజేశారు. స్థానికంగానే అమ్మవారి భూ వివాదం... పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ అమ్మవారుకు సంబంధించిన భూములు, అభివృద్ధి విషయంలో పోట్లదుర్తి బ్రదర్స్, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఎర్పడింది. ఎంపీ నిధులకింద అమ్మవారి ప్రాంగణం అభివృద్ధి చేయాలని సీఎంసురేష్ నాయుడు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి విషయంలో పోట్లదుర్తి, దేవగుడి వర్గీయుల మధ్య పనులు విషయంలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తన నియోజకవర్గంలో పోట్లదుర్తి బ్రదర్స్ పెత్తనం ఏమిటంటూ ఆదివర్గం, అధికార పార్టీలో ఉన్న తమ పనులే అడ్డుకుంటార అంటూ పోట్లదుర్తి బ్రదర్స్ పోటా పోటీ పెత్తనం చెలాయిస్తున్నారు. వీరి మధ్య స్థానకంగా ఉన్న అధికారులు ఎవరికి సర్దుబాటు చేయలేక నలిగిపోతున్నారు. మరి ఉన్నతాధికారులు.. ఆయా పార్టీ పెద్దలు ఎలా ముందుకెళతారో వేచి చూడాలి. పోస్టర్ల ఆవిష్కరణ కడప అగ్రికల్చర్ : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి నెల రోజుల వరకు ఈ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు సమావేశం కడప ఎడ్యుకేషన్ : కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు డీవీఈఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడిజిల్లా అండర్ 19 ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమోహన్రాజు తెలిపారు. ఎస్జీఎఫ్ఐ అండర్ 19 స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా జట్లను ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన పీడీ, పీఈటీ, ఇన్చార్జు పీడీలు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలిపారు. వివరాలకు 9290760996 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
వరాలందించే ఆరోగ్యమాత
● విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ● ఘనంగా ముగిసిన ఆరోగ్యమాత ఉత్సవాలు ముగింపు ఉత్సవాలకు హాజరైన విశ్వాసులు విశేష అలంకారంలో ఆరోగ్యమాత స్వరూపం కడప సెవెన్రోడ్స్ : విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆరోగ్యమాత అందజేస్తుందని విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ అన్నారు. కడప నగరం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన పూజ ప్రార్థన దినోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని, పది రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనలు వైభవంగా జరిగాయన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ఆరోగ్యమాత పతాక అవరోహణ చేశారు. రెవరెండ్ ఫాదర్ బి.జ్వాన్నేస్, రెవరెండ్ ఫాదర్ డేవిడ్రాజు పరిశుద్ధ జపమాల, దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం చేశారు. ఉత్సవాల్లో జి.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎర్రగుడిపాడుకు చెందిన ఏసన్న బృందం చెక్కభజన భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురువులు ఎండీ ప్రసాద్రావు, ఇతర గురువులు, కన్యసీ్త్రలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపులో భాగంగా మైనార్టీ విభాగం జిల్లాశాఖ, నగర శాఖల సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీన దస్తగిరి, నగర శాఖ అధ్యక్షుడు, కార్పొరేటర్ షఫీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్.గౌస్బాషా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇమామ్లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబరు వరకు ఎనిమిది నెల ల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయ న్నారు. గతేడాది ఎన్నికల సమయమైన ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. ఇలా 11 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది మార్చి వరకు వేతనాలు ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక వేతనాలు పెండింగ్లో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మసీదు కమిటీలు కూడా ఈ చెల్లింపులను భరించలేకపోతున్నాయన్నారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూర్బాషా కార్పొరేషన్కు రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, నగర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజమ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కరీముల్లా, మైనార్టీ విభాగం మాజీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ బొగ్దాది, మున్నా తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ మైనార్టీ నేతల ఆందోళన -
రైతు బిడ్డకు జాతీయ స్థాయి పురస్కారం
వేముల : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కడప రైతు బిడ్డ గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి అరుదైన జాతీయ స్థాయి పురష్కారాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా వేముల మండలం కుప్పగుట్టపల్లె గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి పదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిఫార్సుతో టర్బో సర్వీసెస్ రంగంలో కేవలం రూ.1400 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చేసే పనిలో అంకితభావరం, కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగిగా ఉంటూనే వ్యాపార మెళకువలను ఆకలింపు చేసుకున్నారు. 2017లో కూకట్పల్లె కెపీహెచ్బీ కాలనీ కేంద్రంగా న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు. కేవలం కొన్నేళ్లలోనే తన సంస్థను అగ్రగామిగా నిలిపాడు. సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన ఓ టీవీ న్యూస్ చానెల్ తెలంగాణాలో నిర్వహించిన కార్యక్రమంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు ఈనెల 5వ తేదీన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన సతీమణి కళ్యాణిలు అందుకున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసిన లక్ష్మీనారాయణరెడ్డి నేడు తన సంస్థలో 100మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్చార్జిగా బసవరాజు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్. బసవరాజును శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్చార్జిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సమ్మెట బసవరాజు మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీకి మంచిపేరు తెస్తానని, శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. 10 నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి సెలక్షన్స్ ఈ నెల 10 నుంచి 17వరకు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ చంద్రావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల క్రీడా పోటీలతో నిర్వహించే ఈ సెలక్షన్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. మార్కెటింగ్ ఏడీకి ‘షోకాజ్’ కడప సెవెన్రోడ్స్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఆజాద్వల్లికి సోమవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి షోకాజ్ నోటీసును జారీ చేశారు. రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక వేంపల్లె : జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు బి.నాగ పవన్, ఎస్.అరవింద్, జి.విజయ్ కుమార్, డి.రవితేజ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారని వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఛత్తీ్స్ఘడ్ బిలయోలో నిర్వహించే యోగాసన భారత్ జాతీయ స్థాయిపోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డైరెక్టర్తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రమేష్ కై లాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్ను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ పరీక్షకు నమోదు చేసుకునుటకు ఈ నెల 30 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ పరీక్ష రాయటకు ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యంలేని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3,50,000 లోపు ఉన్న విద్యార్థులందరూ అర్హులు అని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీబీ విద్యార్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింగ్ ద్వారా మాత్రమే పరీక్ష రుసుం చెల్లించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం వారిని కలవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చూడా లని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. వైభవం..పల్లకీ ఉత్సవం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి పల్లకీలో ఊరేగారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి స్వామి, అమ్మవారిని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చిరు. మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. -
మల్టీ డే మ్యాచ్లో చిత్తూరు, నెల్లూరు విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో అనంతపురం జట్టుపై చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 55.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తేజరెడ్డి 142 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి 106 పరుగులు చేశాడు. రెడ్డి ప్రకాశ్ 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, ప్రవీణ్కుమార్ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 46.2 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నిస్కయ్ 47, ప్రవీణ్ కుమార్ సాయి 32 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బ్రహ్మసాయి తేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 52, జెనిక్ దాస్ 34 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని భార్గవ 2 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై నెల్లూరు జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం రెండవ రోజు 140 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 86.1 ఓవర్లలో 501 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 167, సోహన్ వర్మ 68, మాధవ్ 66, శ్రీ హర్ష 58 పరుగులు చేశారు. కడప జట్టులోని ఎస్ఎండీ ఆయూబ్ 4, వరుణ్తేజ్రెడ్డి 4, చెన్నారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 33.1 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 53, నాగ చాతుర్య 33 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, నారాయణ 2, సూతేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. -
అన్నదాత సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరుబాట
● కమిషన్ల కోసమే ప్రైవేటుకు యూరియా ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కడప సెవెన్రోడ్స్ : కేంద్రం నుంచి యూరియా రాష్ట్రానికి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి మొత్తం ప్రైవేటుకే ఇచ్చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ప్రభుత్వంపై విమర్శించారు. దీంతో బస్తా రూ. 270లకు అమ్మా ల్సిన యూరియా బ్లాక్లో రూ. 800–1000లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటీర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఆ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యా ల రామగోవిందరెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల సమస్యపై ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ పిలుపునివ్వడంతో రైతులను మభ్య పెట్టేందుకు అధికారులు టోకన్లు పంపిణీ చేస్తున్నారని రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. తొలుతే ప్రణాళికబద్దంగా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే యూరియా కొరత తలెత్తేది కాదన్నారు. యూరియాకోసం రైతులు సొసైటీల ఎదుట క్యూలు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారన్నారు. కరోనా సమయంలోనూ రైతులను ఆదుకున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొండూరు అజయ్కుమార్రెడ్డి, వీఎన్ పల్లె, చెన్నూరు ఎంపీపీలు పాల్గొన్నారు. -
చీనీ కాయల మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత
పులివెందుల చీనీ కాయల మార్కెట్లో గొడవ పడుతున్న రైతులు, వ్యాపారులుమార్కెట్లో ఆందోళన చేస్తున్న చీనీ రైతులుపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణ పరిధి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని చీనీకాయల మార్కెట్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గిట్టుబాటు ధర లేదని రైతులు ధర్నా నిర్వహించారు. వ్యాపారస్తులంతా సిండికేట్ అయి నిండా ముంచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ఈ నెల 11వ తేదీన మార్కెట్ యార్డుకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. గతంలో చీనీ తోటల వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసేవారు. అప్పట్లో 10 టన్నులకు సూట్ కింద 2 టన్నుల వరకు వ్యాపారస్తులు, దళారులు రైతుల నుంచి తీసుకునేవారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు సూట్ అనే పద్ధతిని రద్దు చేసేందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మార్కెట్ యార్డులో చీనీ రైతులకు, వ్యాపారస్తుల మధ్య సయోధ్య కుదిర్చారు. సూట్ పద్ధతి లేకుండా మార్కెట్ యార్డులో చీనీ కాయల మార్కెట్ను ఏర్పాటు చేసి అక్కడికే వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. పులివెందుల ప్రాంతంలోని చీనీ రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించే విధంగా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జంబో షెడ్డులు ఏర్పాటు చేసి చీనీ కాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. సూట్ అనే విధానాన్ని కూడా లేకుండా చీనీ వ్యాపారస్తులు ప్రశాంతంగా గిట్టుబాటు ధరలతో వ్యాపారాలు చేసుకునేవారు. టన్ను రూ.30 వేల నుంచి లక్ష వరకు పలకడంతో రైతులు ఆనందంగా విక్రయాలు జరిపేవారు. కూటమి పాలనలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల చీనీ మార్కెట్లో దళారులంతా ఏకమై ఒకట్రెండు చీనీ కాయల కుప్పలకు మాత్రమే.. అది కూడా 2 నుంచి 3 టన్నులకు మాత్రమే అధిక ధర వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారు. అంతకుమించి ఉన్న మిగిలిన చీనీ కాయల కుప్పలకు నామమాత్రంగా ధరలు నిర్ణయించి నిండా ముంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు కాకపోతే అనంతపురం మార్కెట్ తీసుకుపోండని వ్యాపారస్తులు ఉచిత సలహాలు ఇస్తున్నారని వారు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దళారీ వ్యవస్థ ఉండటంతో గిట్టుబాటు ధరలు కూడా అందడం లేదని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో చీనీ ధరలు బాగా ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ జోక్యం చేసుకోవడంతో తమకు ఇష్టం వచ్చిన ధరలకు వేలంపాట నిర్వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. టన్ను రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకే పలుకుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. న్యాయం చేయాలి ఇతర రాష్ట్రాలలో టన్ను చీనీ కాయలు రూ.25 వేలు ఉంటే.. ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ రూ.14 వేలు, రూ.12 వేలు పెట్టడం ఏమిటని దళారులపై రైతన్నలు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వస్తే వారిని మార్కెట్కు రానివ్వకుండా.. వారితో కుమ్మకై ్క తమను ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పెద్దది కావడంతో అర్బన్ సీఐ సీతారామిరెడ్డి రంగ ప్రవేశం చేసి.. దళారులు, రైతులకు నచ్చజెప్పి వేలంపాటను యథావిధిగా కొనసాగింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు చీనీ ధర గిట్టుబాటు లేకుండా కొనుగోలు చేస్తే 11వ తేదీ నుంచి మార్కెట్ యార్డులో మండిలన్ని మూసివేసేయాలన్నారు. రైతులెవరూ కూడా మార్కెట్ యార్డులోకి చీనీ కాయలు తీసుకురావద్దన్నారు. తోటల వద్దనే వ్యాపారస్తులకు అమ్మితే బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు న్యాయమైన ధరలకు కొనుగోలు చేస్తారన్నారు. మార్కెట్ యార్డులోకి తెస్తే దళారుల చేతుల్లో మోసపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. 11వ తేదీ ప్రతి ఒక్కరూ పులివెందుల మార్కెట్ యార్డు చీనీ మండిల వద్దకు చీనీ రైతన్నలు చేరుకోవాలన్నారు. దళారులు చేస్తున్న మోసాలను నాయకులు, అధికారులు అరికట్టి.. తమకు న్యాయం చేస్తే యథావిధిగా కొనసాగిస్తామని, లేదంటే మండీలు మూత వేయాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. గిట్టుబాటు ధరలేదని రైతుల ఆందోళన దళారులు ముంచేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్ను రూ.లక్ష వరకు.. ప్రస్తుతం రూ.14,200 మాత్రమే -
నాణ్యమైన వైద్యం పేదలకు దూరం
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. ఆదివారం కడపలో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని, అయితే మన రాష్ట్రలో మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారన్నారు. వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు మొదటి ఏడాది 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని, రెండో ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ కూడా అందులో ఉందన్నారు. ఈలోపు ఎన్నికలు రావడంతో మూడు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయన్నారు. కేంద్రం సీట్లు కేటాయించినా.. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే, నిర్వహణ తమ వల్ల కాదంటూ కేంద్రానికి లేఖ రాసిన చరిత్ర కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు వైద్య విద్యను తక్కువ ఫీజులతోనే పూర్తి చేసే అవకాశముంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేటు పరం చేయడం వల్ల మెడికల్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకునే అవకాశముందని, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆరోగ్య సేవలు పేదలకు అందుబాటులో ఉండవన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే పరమావధిగా పెట్టుకుంటారని విమర్శించారు. విద్యారంగంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, నారాయణ, చైతన్య విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రభుత్వ విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉపయోగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ దుబారా ఖర్చు తగ్గిస్తే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించవచ్చన్నారు. కమీషన్ల్ల కోసం పన్నాగం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు దోచిపెట్టి కమీషన్లు కాజేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. అపర సంజీవని ఆరోగ్యశ్రీని భీమా పద్ధతిలో అమలు చేస్తూ దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఉరి వేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, సుదర్శన్, గుంటి నాగేంద్ర, రెడ్డి ప్రసాద్, బసవరాజు, శంకరాపురం సింధు, సాయిదత్త, పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దారుణం దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణ రద్దు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం
మైదుకూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి బైపాస్పై కలసపాడుకు చెందిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి షేక్ ఖాదర్ హుస్సేన్ (52) దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధికి చెందిన ఖాదర్ హుస్సేన్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఆదివారం బ్యాంక్ పని మీద వెళుతున్నాను అంటూ భార్య ఫాతిమాకు చెప్పి మోటార్ బైక్పై బయల్దేరారు. మైదుకూరు శివారులో జాతీయ రహదారి బైపాస్పైన ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సంఘటనలో బైక్పై ఉన్న ఆయన తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి ఖాదర్ హుస్సేన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. మృతునికి మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు, ఆమె మృతి చెందిన తర్వాత చేసుకున్న రెండో భార్య ఫాతిమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
లాండ్రీ షాపులో అగ్నిప్రమాదం
మైదుకూరు : లాండ్రీ నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు రాజారెడ్డి వీధిలో ఉంటున్న కంచర్ల ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లాండ్రీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫ్రిడ్జ్, మోటార్, టీవీ, బియ్యంతోపాటు ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు, శుభ్రం చేసి ఇసీ్త్ర చేసేందుకు తీసుకొచ్చిన పలువురి పట్టుచీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక అధికారి పి.బసివి రెడ్డి, సిబ్బంది వీరనన్న, రవికుమార్, భాస్కర్, కరీముల్లా సంఘటన జరిగిన ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆంజనేయులు కోరారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్ షౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా సాగాయి. అండర్ –18, 20 సీ్త్ర,పురుషులకు నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షాట్పుట్, హైజంప్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో 20 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 26, 27 తేదీల్లో ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు శివారెడ్డి, రాఘవ, నాగేశ్వరరావు, ఖాదర్రెడ్డి, దిలీప్, హసీనా, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ కార్యదర్శి అహమర్బాషా పర్యవేక్షించారు. -
నొప్పి మాయం.. సర్జరీ దూరం
● ఫిజియోథెరపీ దివ్య ఔషధం ● దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ● రిమ్స్లో ప్రత్యేక వైద్య సేవలు ● నేడు ఫిజియోథెరపీ దినోత్సవంకడప అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో అనేక మంది యువత, పెద్దలు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలకు మందులు లేకుండా ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందించి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్ట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిజియోథెరపీ ఎందుకు అవసరం? ఆధునిక జీవనంలో ఫిజియోథెరపీ అవసరం రోజురోజుకు పెరుగుతోంది. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ప్రమాదాల వల్ల కలిగే గాయాలు, పక్షవాతం, మానసిక ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఫిజియోథెరపీ అద్భుతమైన చికిత్సగా నిలుస్తోంది. వ్యాయామాల ద్వారా, చేతితో చేసే చికిత్సల ద్వారా (మాన్యువల్ థెరఫీ)తోపాటు, ఇతర పద్ధతుల ద్వారా శారీరక కదలికలను మెరుగుపరచి, నొప్పిని తగ్గించి, జీవిత నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, బలహీనత వంటి వాటిని నియంత్రించడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో కూడా ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ.. పిల్లల భవిష్యత్తు కోసం.. పిల్లల ఆరోగ్యానికి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఎంతో అవసరం. పుట్టినప్పటి నుంచి వచ్చే కండరాల బలహీనత, శరీర భాగాల కదలికలో సమస్యలు, మెదడు పక్షవాతం (సెలెబ్రల్ పల్సీ) వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపిస్టులు వ్యాయామాల ద్వారా పిల్లల శారీరక సామర్థ్యాన్ని పెంచుతారు. దీనివల్ల వారు నడవడం, కూర్చోవడం, చేతులు ఉపయోగించడం వంటివి సులభంగా నేర్చుకుంటారు. పిల్లలు సాధారణ జీవితం గడపడానికి, స్కూల్కి వెళ్లడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఈ చికిత్స దోహదపడుతుంది. ఫిజియోథెరపీలో మహిళల పాత్ర గర్భధారణ, ప్రసవం, రుతుక్రమం వంటి సందర్భాల్లో మహిళలు ఎదుర్కొనే శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ చికిత్సను ఉపయోగించుకోవడం లేదు. ఫిజియోథెరపీ ద్వారా ఈ సమస్యలను అధిగమించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కడప రిమ్స్లో ఫిజియోథెరపీకి ప్రత్యేక వైద్యం కడప రిమ్స్లో ఫీజియోథెరపీ విభాగంలో ప్రతి రోజు మేల్, ఫిమేల్ ఓపీలో సుమారు 70 నుంచి 80 మంది పేషెంట్స్ ఫీజియో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రజలకు సంపూర్ణ వైద్య విధానంలో ఫీజియోథెరపీ చేస్తున్నారు. ఇక్కడ ఫీజియోథెరపీ సంబంధంగా పిడియాట్రిక్స్, జినియాట్రిక్స్ ఎలక్ట్రో థెరపీ, ఎక్సర్సిస్ థెరపీ పరికరాలతో విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లతో పక్షవాతం, కీళ్ల నొప్పులు, పోస్ట్ ఆప్, ఆర్థో సర్జరీస్లకు, ఎముకల, నరాల సంబంధం అగు మరి ఎన్నో వ్యాధులకు రిమ్స్లో ఫీజియో విభాగం లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్థో, న్యూరో, కార్డియో, పిడియాట్రిక్స్ సర్జరీస్ భా గాలకు, తదితర అవసరమైన విభాగాలకు ఫీజియోథెరపీ చికిత్స చేయడం జరుగుతుంది. నూతన లేజర్, యుఆర్థెరెపీ ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు వయోవృద్ధుల వరకు కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. కడప, ఇతర ప్రాంతాల నుంచి చికిత్స మేరకు ఇక్కడికి రావడం జరుగుతుంది.ఫిజియోథెరపీని ప్రోత్సహించాలి వైద్యులు, ఫిజియోథెరపీ నిపుణులు ఫిజియోథెరపీని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించడానికి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలని కూడా అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రజలు కూడా మందులపై ఆధారపడకుండా ఫిజియోథెరపీ చికిత్సను స్వీకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మా విభాగంలో ముగ్గురు ఫీజియోథెరపిస్టులు 30 మంది సిబ్బంది ద్వారా ఇక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ ప్రోత్సాహంతో నూతన పరికరాలు, ప్రక్రియలతో ఫీజియోథెరెపీ విభాగం అభివృద్ధి చెందుతోంది. – డాక్టర్ సంపత్ కుమార్, హెచ్ఓడీ, ఫిజియోథెరపీ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్), కడప -
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (వైఎస్సార్, అన్నమయ్య) జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపికలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణమూర్తి, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్ జిల్లా జట్టుకు బాలురు 10 మందిని, బాలికలు 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14వ తేదిల్లో అనంతరపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్ కన్వీనర్ ఓబయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సెలక్షన్ కమిటీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా బాలుర జట్టు మహమ్మద్ బాబా (రాజంపేట) కె.కౌశిక్, హైడెన్, డి.రాజేష్, వెంకటేశ్, చిన్న ఓబులేసు (దువ్వూరు) డి.షడ్రక్, రఫెల్ (చిన్న సింగనపల్లె) ఎస్.మురళి, రాజు (ఒంటిమిట్ట) ఎస్. షాజిద్(రాజంపేట) జిల్లా బాలికల జట్టు డి.కీర్తి, డి.నయోమి (చిన్న సింగనపల్లె) ఎం.స్వీటీ (ఎస్.ఉప్పలపాడు) జి.వర్షిణీ (తాళ్ల ప్రొద్దుటూరు) ఎం.గౌతమి, జి.సునంద, కె.చెర్లీన్, ఎస్.అశ్వీనీ, ఎస్.లక్ష్మీ (చియ్యపాడు) -
సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అర్జున్ టెండ్కూలర్ 64, వికాస్ 53 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ముఖేష్ చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బాలాజీ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్లు 33 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 73, రెడ్డి ప్రకాశ్ 20 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప– నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 43.5 ఓవర్లకు 257 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భరత్రెడ్డి 66, ఎస్ఎండి ఆయూబ్ 51, శివ కేశవ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, ఇకాక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 53, శ్రీహర్ష 31 పరుగులు చేశారు. కడప జట్టులోని వరుణ్తేజ్ రెడ్డి 3 వికెట్లు, చెన్నారెడ్డి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం
● అన్నదాత సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ● 9న రైతు పోరును జయప్రదం చేయండి ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్రంలో ఏ పంటకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో 9న జరిగే రైతు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన మిర్చి, శనగ, ఉల్లి, చీనీ, అరటి, మినుముల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక, ప్రభుత్వం నుంచి సహాయం అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో రైతులు ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతులపై చిన్నచూపు హార్టికల్చర్ మాజీ చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియా కొరత ఉందని చెబితే.. భోజనానికి పోతే క్యూలో నిలబడమా, రైతులు కూడా ఎరువుల కోసం క్యూలో నిలబడ్డారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హేళన చేసి మాట్లాడటం తగదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరిలో యూరియా వేయడం వల్ల రోగాలు వస్తాయని, రైతులు వరి పంట వేయవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారన్నారు. రైతులకు కావలసిన యూరియా అందిస్తామని ఎక్కడా చెప్పడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రైతులు ఏ రోజు యూరియా కావాలంటూ రోడ్డున పడ్డ దుస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రైతులంటే అలుసైపోయిందని వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, వెంకటరెడ్డి, భాస్కర్రెడ్డి, బొనం సురేష్ పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 4నుంచి ప్రారంభమైన పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పవిత్ర విసర్జనాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ తదితర పూజలను అర్చకులు ఆగమోక్తంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులతోపాటు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
అమ్మకానికి ఎర్రబంగారం
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీశాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో(తిరుపతి)లో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిలతీర్ధంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సీఆర్ఎస్ ప్రధానంగా వ్యవహారిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సీఆర్ఎస్ సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో శేషాచలం, వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాపైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తులో ఉన్నాయి. రాజంపేట ఎర్రబంగారానికే డిమాండ్ జీవవైవిధ్యఅటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయమార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్సార్జిల్లాలో 3.2 మిలియన్లు హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం అనే పేరు ఎలా.. ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్సాంటలైనస్ అనేది దీని శాసీ్త్రయనామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు. రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలో.. రాజంపేట, రైల్వేకోడూరు రేంజ్ పరిధిలో 50 వేల హెక్టారలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో అధికంగా ఎర్రచందనం ఉంది. ఈ అడువులను జీవావరణ రిజర్వుగా కేంద్రం ప్రకటించింది. ఐదువేల వృక్షజాతులు మొక్కలు కలిగిన శేషాచల అడవులకు బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవులో 1700పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి. దుంగలన్నీ ఒకచోటికి.. స్మగ్లర్ల అక్రమరవాణా నేపథ్యంలో ఎల్లలు దాటిన ఎర్రచందనాన్ని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను , అటవీ, పోలీసు,కస్టమ్స్శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకేచోటికి రప్పించి భద్రపరిచే పనులకు నాలుగేళ్ల క్రితం అటవీశాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరిలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలుకూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతుంటారు. సంగీతవాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధగుణాలు ఉన్నాయి. వయగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్స్లో పోలీసు, ఫారెస్టు, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్క్వార్టర్గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. సీఆర్ఎస్ డిపోలోని నిల్వ ఉన్న మూడు రకాల ఎర్రబంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ–సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 6 వరకు ఎర్రబంగారు కొనుగోలు దారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది. ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దుంగలను కేంద్రీయ ఎర్రచందనం డిపోలో భద్రపరుస్తారు. వాటికి వేలం పాట నిర్వహించనున్నారు. అటవీప్రాంతం: శేషాచలం(బయోస్పెయిర్) అన్నమయ్య జిల్లా: 2.8 మిలియన్ల హెక్టార్లు వైఎస్సార్ జిల్లా: 3.2 మిలియన్ల హెక్టార్లు -
● ఉల్లి రైతులు, రైతు సంఘ నాయకుల ఆందోళన
పెండ్లిమర్రి మండలంలో ఉల్లి పంటను కోస్తున్న కూలీలుకడప అగ్రికల్చర్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సరికి సరైన గిట్టుబాటు ధర కరువై కంట కన్నీరు ఆగడం లేదు. ఇటు అతివృష్టి.. అటు అనావృష్టితో రైతులు ఏటా నష్టాలపాలవుతున్నారు. అన్నింటికి తట్టుకుని పంట చేతికొస్తే ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ లేక బతుకు బరువుగా మారుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఉల్లి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉల్లిపంటకు సరైన మద్దత ధర లేకపోవడంతో రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ ఉల్లి ధర రూ.700 నుంచి రూ. 800 పలుకుతోందని ఉల్లి రైతులు తెలిపారు. ఎకరా ఉల్లిపంట సాగుకు సేద్యాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు..ఇలా అన్ని కలిపి రూ.70 నుంచి 80 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. దిగుబడి కూడా ఎకరాకు 50 నుంచి 70 క్వింటాల్ వరకు వస్తుందని ధర చూస్తే మాత్రం క్వింటాల్ రూ. 700 రూ. 800 పలుకుతుందని తెలిపారు. ఈ ధరకు ఉల్లిగడ్డలు అమ్మితే కనీసం సాగు ఖర్చులు కూడా రావని ఉల్లిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి.. ఏదీ..! రైతులు నష్టపోకుండా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలుకాకపోవడంతో ఉల్లి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉల్లిపంటకు మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మద్దతు ధర లేక దిగాలుపడ్డ రైతులు జిల్లావ్యాప్తంగా 7532 ఎకరాల్లో ఉల్లి పంటసాగు 64 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా క్వింటాల్ 7 నుంచి 8 వందల ధర పలుకుతుందన్న ఉల్లి రైతులు సాగు ఖర్చులు కూడా రావనివాపోతున్న అన్నదాతలు ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఉల్లి రైతుల పరిస్థితి కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్న చందంగా మారింది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఉల్లిపంటను సాగుచేస్తే దిగుబడి వచ్చే సరికి గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. మరో పది పదిహేను రోజుల్లో ఉల్లిపంటను కోయాలి. ఈ ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. – చక్రధర్రెడ్డి, ఉల్లి రైతు, సింగనపల్లె, దువ్వూరు కనీస మద్దతు ధర క్వింటాకు 3వేల రూపాయల కల్పించాలి ఉల్లి పంటలకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 3 వేలు కల్పించాలి. ప్రభుత్వమేమో రూ. 1200లు ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటోంది. ఈ ధరతో అమ్మితే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి సుమారు 80 వేలు దాకా ఖర్చు వస్తుంది. ధర లేక రైతులు నష్టపోతున్నారు. – గాలి చంద్ర, ిసీపీఐ జిల్లా కార్యదర్శి. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
కడప సెవెన్రోడ్స్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడింది. ఈ కారణంగా దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే మున్సిపల్ హైస్కూలు వద్దగల శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, గడ్డిబజారులోని శ్రీ బాలాజీ ఆలయం, బిల్టప్ వద్దగల శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంతోపాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు. ఒంటిమిట్ట రామాలయం మూసివేత ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆదివారం మూతపడింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రామాలయాన్ని మధ్యాహ్నం 1:50 గంటలకు మూసివేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయశుద్ధి, పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం యథావిధిగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. రాయచోటి వీరభద్రాలయం రాయచోటి టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే పాత రాయచోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, చెక్పోస్ట్ వద్ద వెలసిన శ్రీ శివాలయ తలుపులు, యండపల్లె సమీపంలోని శ్రీ భైవరవుడి ఆలయాలను కూడా మూసివేశారు. -
కుటుంబ బంధాలకు స్ఫూర్తి మరియమాత
కడప సెవెన్రోడ్స్: మరియమాత కుటుంబ బంధాలు ఎలా ఉండాలో తన జీవితం ద్వారా తెలుపుతూ విశ్వాసులకు స్ఫూర్తినిచ్చారని కడప మేత్రాసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ ఎస్.సురేష్ అన్నారు. ఆరోగ్యమాత నవదిన ప్రార్థన ఉత్సవాల సందర్భంగా ఆదివారం మరియాపురంలోని సెయింట్ మేరీస్ క్యాథడ్రల్ చర్చిలో రెవరెండ్ ఫాదర్ మరియన్న దివ్య బలిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరియమాతను ఆరోగ్య వరప్రదాయిని అంటారని, విశ్వాసం, నమ్మకాలతో ఆమె సన్నిధికి వచ్చి ప్రార్థించిన వారికి ఆరోగ్యం, ఉపశమనం లభిస్తాయన్నారు. ఆమె చూపిన బాటలో విశ్వాసులంతా నడిచినపుడే శాంతి సమాధానాలు లభిస్తాయన్నారు. నగరంలో ఆరోగ్యమాత ఊరేగింపు అనంతరం ఆరోగ్యమాత తేరు ఊరేగింపు మరియాపురం నుంచి నగరంలోని పలు ప్రముఖ కూడళ్ల ద్వారా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి చేరుకుంది. వల్లూరు విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ శరత్ ఊరేగింపును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మేత్రాసన మరియదళ, విన్సెంట్ దె పాల్ సభ్యులు, ఆరోగ్యమాత సభ సిస్టర్లు పాటలు, జపమాల ధ్యానం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు నల్గొండ డాన్బాస్కో ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ విల్సన్ ఆధ్వర్యంలో పరిశుద్ధ దివ్య సత్ ప్రసాద ఆరాధన,స్తుతి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్యమాత యువత ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తి గీతాలాపన, నృత్య ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో గురువులు, మఠ కన్యలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యమాత స్వరూపానికి పూల అలంకరణ చేస్తున్న దృశ్యం, ఊరేగింపులో పాల్గొన్న విశ్వాసులు -
బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు.ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరోధించి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబుకు తొలి నుంచి రైతులపై ప్రేమ లేని కారణంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారన్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై గతంలో లాఠీ చార్జి చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో కొరత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు సమస్యలు లేవని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందించడంతోపాటు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు కూడా ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్నారు. సరైన ప్రోత్సాహం లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలులో వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తోందన్నారు. ఎంత మందిని ఎంత కాలం జైళ్లలో పెడతారని రాచమల్లు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, లావణ్య, జయంతి, రాగుల శాంతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చింపిరి అనిల్ కుమార్, రైతు నాయకులు టంగుటూరు విశ్వనాథరెడ్డి, శంకరాపురం మల్లికార్జునరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మల్లికార్జున ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
వేముల : మైనర్ బాలిక అత్యాచారం కేసులో కుంచపు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రవీణ్కుమార్లు తెలిపారు. వేముల పోలీస్ స్టేషన్లో శనివారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేముల గ్రామానికి చెందిన కుంచపు వెంకటరమణ 2021లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేవాడు. మధ్యలో చదువు ఆపేసి అప్పటి నుండి బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో గత నాలుగు నెలల నుండి వేముల గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ బాలికను బలవంతంగా మోటార్ సైకిల్పై ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కుంచపు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు. -
‘కృషి’కి దక్కిన ఫలితం
● ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని వరించిన పురస్కారాలు ● జోనల్ స్థాయిలో మూడు ప్రథమ, ఒకటి తృతీయ స్థానం ● హర్షం వ్యక్తం చేస్తున్న కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్తలు కడప అగ్రికల్చర్ : తమిళనాడులోని రాయవేలూరు వేదికగా ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన జోనల్ స్థాయి(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి,తెలంగాణ రాష్ట్రాలు) కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక కార్యాచరణ కార్యశాలలో కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రానికి జోనల్ స్థాయిలో నాలుగు పురస్కారాలు లభించాయి. ఇందులో ● షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు పరిచినందుకు ప్రథమ స్థానం. ● అపరాలు ఆదర్శ గ్రామం పథకాన్ని విజయవంతంగా నడిపిస్తునందుకు మూడవ స్థానం. ● జిల్లాలో మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విస్తరించినందుకు ప్రథమ స్థానం. ● అత్యుత్తమ ఫొటో విఽభాగంలో ప్రథమ స్థానం. ఈ పురస్కారాలను వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ(ఆలారీ)జోన్ –10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్. వీరా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్, జి. శివనారాయణ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ ఈ పురస్కారాలు రావడానికి కృషి చేసిన, తోడ్పాటు అందించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మికి, విస్తరణ సంచాలకులు డా. జి శివనారాయణ, సహాయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా. సుమతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ పురస్కారాలు సాధించడానికి విశేష కృషి చేసిన పూర్వపు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక, కార్యక్రమ సిబ్బందికి సహకరించిన వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల రైతులకు, వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
ఉల్లి ధర పతనంపై ఆందోళన
కడప సెవెన్రోడ్స్: ఉల్లి ధరలు భారీగా పడిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కడపలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఉల్లిగడ్డలు మార్కెట్లో క్వింటా వెయ్యి రూపాయలకు కూడా కొనడం లేదన్నారు. ప్రభుత్వం రూ.1200 ప్రకటించి కొనుగోలు చేస్తామంటోందని, ఈ రేటుకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి రూ. 80 వేల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగదారుల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించేందుకు, చీకటి మార్కెట్ల నివారణకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుత్నుప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, ఎన్.వెంకట శివ, కేసీ బాదుల్లా, సురేష్, జి.మద్దిలేటి, వెంకట్ రాముడు, శంకర్ నాయక్, భవాని శంకర్, నాగేశ్వరరావు, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, మునయ్య, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు రేటు రూ.3 వేలుకల్పించాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద ఉల్లిగడ్డలు తగలబెట్టిరైతు సంఘం నిరసన -
హెచ్ఐవీపై యువతకు అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు కడప రూరల్ : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి పట్ల నేటి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26లో భాగంగా శనివారం 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహించారు. కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు కొనసాగిన ఈ మారథాన్ యూ టర్న్ తీసుకుని తిరిగి మహావీర్ సర్కిల్కు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ అంటు వ్యాధి కాదని తెలుసుకోవాలన్నారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షను విడనాడాలన్నారు. ఇదే క్రమంలో యువత హెచ్ఐవీ బారిన పడి బంగారు భవిష్యత్తులను చేజేతులా కోల్పోవద్దని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్–టీబీ ఽఅధికారి డాక్టర్ యస్.రవి బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ /ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ వేంపల్లె మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ కి చికిత్స ఉందన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు . ఈ 5కే రెడ్ రన్ మారథాన్లో అబ్బాయిల విభాగంలో మొదటి బహుమతి ఎ. సింహాచలం (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప), రెండవ బహుమతి ఈ. సికిందర్ (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప) గెలుచుకున్నారు. అలాగే యువతుల విభాగంలో మొదటి బహుమతి శ్రీశ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ విమెన్ కాలేజీ, కడప), రెండవ బహుమతి కీర్తి (గంగాభవాని కాలేజీ) గెలుపొందారు. ట్రాన్స్ జెండర్స్ విభాగంలో మొదటి బహుమతి పింకి (యస్బీఆర్టీఎం కాలేజ్, కడప), రెండవ బహుమతి ఇ. మహేష్ (ఎస్వీ డీసీ కాలేజీ, కడప) గెలుపొందారు. జిల్లా క్రీడల అధికారి జగన్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురవయ్య, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, స్టాటిస్టికల్ ఆఫీసర్ రమేష్రెడ్డి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, కోచ్లు అమృత్రాజ్, కల్యాణ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘సంపూర్ణత అభియాన్’ సారథులకు సత్కారం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేసిన అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలు సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ కడప మాధవి కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా ఆకాంక్ష జిల్లా, బ్లాకుల లక్ష్య సాధనకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఏడీపీ భాగస్వామ్య శాఖల అధికా రులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప ఆకాంక్ష జిల్లాలో ఎంపికై న చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాక్లలో నీతి ఆయోగ్ గుర్తించిన 6 అంశాల్లో ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమాన్ని సంబంధిత శాఖలైన వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మొదలైన శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభు త్వం గుర్తించిన ఆరు ముఖ్యమైన సూచికల్లో (జీవన ప్రమాణాలు మెరుగు పరచుటలో) సంబంధించి సంతృప్తికర స్థాయిని పొందడమే సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి ఆకాంక్ష జిల్లా, బ్లాకుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ప్రెగ్నన్ట్ ఉమెన్ సమస్యలు, ఐసీడీఎస్లో బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్య శాఖలో మౌలిక సదుపాయలు, వ్యవసాయంలో సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, గ్రామీణాభివృద్ధి రంగాలు, ఏఏ గ్రూపులకు బ్యాంకు రుణాలు అందజేయడం.. వంటి ఆరు అంశాల్లో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుని వచ్చి సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్యాన్ని వంద శాతం సంతృప్తికర స్థాయిలో సాధించినందుకు గాను నీతి ఆయోగ్ మన జిల్లాకు మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగిందన్నారు. ఆరు ప్రామాణికాల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. 2018 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి హజరతయ్య, డీఎహెచ్ఓ శ్రీ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఈవో షంషుద్దీన్, డీఏవో చంద్రా నాయక్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎల్డిఎం జనార్దనం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : కడప నగరంలోని ఆరోగ్యమాత ఉత్సవాల్లో భాగంగా శనివారం 9వ రోజున నవదిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండ డాన్బాస్కో ప్రిన్సిపాల్ తాళ్ల విల్సన్ సందేశాన్ని అందజేశారు. తొలుత అలంకరించిన పల్లకీపై మరియమాత స్వరూపాన్ని ఉంచి చర్చి ప్రాంగణంలో విశ్వాసులు స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు ఆరోగ్యమాత సందేశాన్ని వినింపించారు. భక్తులు స్తుతి గీతాలు ఆలపించారు. తేరు, దివ్య బలిపీఠాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఎండీ ప్రసాద్రావు, ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి ఆనందరావు, డేవిడ్, ఆంథోని, జార్జి, రాజేంద్ర, మణి, జయరాజుతోపాటు పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. -
పంటల సాగులో రైతులకు తోడ్పాటునందించాలి
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అధికారులు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ఊటుకూరు పరిశోధన కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా జేడీఏ, జిల్లా ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాగుచేస్తున్న పంటల వృద్ధి దశలు, వాటిలో ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్టు ప్రభాకర్రెడ్డి -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి సూపర్ సెవెన్ క్రికెట్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 4వ సూపర్ సెవెన్ అండర్–23 యూత్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 11 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ప్రారంభించిన సీమాంధ్ర బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం క్రీడా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మార్తల సుధాకర్రెడ్డి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి, రాష్ట్ర సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర, నంద్యాల జిల్లా సెక్రటరీ కిరణ్, అన్నమయ్య జిల్లా సెక్రటరీ మురళీ, పలు జిల్లాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల రక్షణ చట్టాల అమలుపై సమీక్ష
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్లో శ్రీబాలల న్యాయం, పిల్లల రక్షణ చట్టాల అమలులో సమస్యలు, సవాళ్ల్ఙు మొదలగు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని మాట్లాడుతూ శ్రీబాలల న్యాయం, జేజేబీ చట్టం 2015, పోక్సో చట్టం 2012, పీసీఎంఏ 2006, బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం 1986, పీసీ మరియు పీఎన్డీటీ చట్టం 1994, ఆర్టీఈ 2009, హెచ్ఏఎంఏ చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వికాస చట్టం 1977, ఎంటీపీ చట్టం 2021, అంగీకారాలు ఉన్న వ్యక్తుల హక్కుల చట్టం 2016 మొదలగు చట్టాల అమలులో సమస్యలు, సవాళ్లు మొదలు అంశాలపై వివరించారు. శాఖల వారీగా సమస్యలు, సవాళ్లు అంశాలను ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బాల్య వివాహాలు, గర్భధారణ, పిల్లల ఆరోగ్యం, విద్య, పునరావాసం, ప్రభుత్వ పథకాలు, దూరప్రాంతాల పిల్లల సదుపాయాలు అనే అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగ జన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కడప కం జ్యువెనల్స్ బోర్డ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కె. భార్గవి, జిల్లాలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం
కడప ఎడ్యుకేషన్ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్ ఫెలోషిప్, డాడ్ ఫెలోషిప్ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో సెవెన్ స్పోక్ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్ క్వాలిటీ అసూరెన్స్ సెల్ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్ టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర, సభ్యులు డాక్టర్ దాక్షాయని, డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్ పి. సరిత, డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు.సురేష్ బాబు పాల్గొన్నారు. వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు -
అన్నదాత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. ఎన్నికల వేళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు పంటల భీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు దాన్ని నిరూపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖామంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు బఫే భోజనం కోసం నిల్చున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేయడం దుర్మార్గమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. యూరియా అందుబాటులో ఉందని చెబుతూనే, యూరియా వల్ల కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. వరి రైతులను నిరుత్సాహపరిచేలా, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మార్క్ఫెడ్ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం, ఆర్బీకేలను నిర్వీర్యం చేసిందన్నారు. కడపలోని ఆలంఖాన్పల్లె సొసైటీకి 50 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి సొసైటీకి ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. యూరియాపై కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన దాన్ని రూ.600లకు విక్రయిస్తున్న పరిస్థితి ఉందన్నారు. యూరియా సరఫరాలో రూ.300 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధి ఏదీ? రాష్ట్రంలో గతం కంటే తక్కువ సాగు విస్తీర్ణం నమోదైనప్పటికీ.. సక్రమంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో పుట్టి వడ్లు రూ.16 వేలు ఉండగా, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఉందన్నారు. చీనీ టన్ను గతంలో లక్ష రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.15 వేలే ఉందన్నారు. ఉల్లికి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ఇవ్వడం దారుణమన్నారు. కనీసం క్వింటా రూ.3 వేలతో కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ నిధే ఏర్పాటు చేయలేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘రైతు పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రైతు పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు యానాదయ్య, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, దేవిరెడ్డి ఆదిత్య, సీహెచ్ వినోద్ కుమార్, షంషీర్, చెన్నయ్య, ఆర్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. పంటలకు దక్కని గిట్టుబాటు ధర యూరియా సరఫరాలో విఫలం 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
టపాసులు పేలి గాయపడిన వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ బాగాదుపల్లెలో గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు కడప రిమ్స్కు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా గత వారం రోజులు గా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మతిస్థిమితం లేని మహిళ భర్తకు అప్పగింత కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామంలో గురువారం రాత్రి మతిస్థిమితం లేని మహిళ తిరుగుతుండగా స్థానికులు గుర్తించి 112కు సమాచారమిచ్చారు. దీంతో నైట్డ్యూటీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు ఉప్పరపురమాదేవి అని, చాపాడు మండలం ఎన్.ఓబాయపల్లె గ్రామానికి చెందినదిగా పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు ఆమె భర్త యేసోబుకు సమాచారం అందించి స్టేషన్కు పిలిపించి రమాదేవిని ఆమె భర్తకు అప్పగించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్, పోలీసులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాయచోటి టౌన్ : రోడ్డు ప్రమాదంలో మురికినాటి రాజారెడ్డి (75) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం చెన్నముక్కపల్లె నుంచి తన పొలానికి స్కూటీపై రాజారెడ్డి వెళ్తుండగా కడప వైపు నుంచి మదనపల్లె రోడ్డు వైపు వస్తున్న ఏపీ39 యుఎస్ 9908 నంబర్ గల కారు ఢీకొంది. రాజారెడ్డి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
ఒంటిమిట్టలో మందుబాబుల వీరంగం
● చిల్లర దుకాణంపై పెట్రోల్తో దాడి ● చిల్లర బాకీ అడిగినందుకు ఘాతుకానికి దిగిన మందుబాబులు ఒంటిమిట్ట : బాకీ అడిగాడని చిల్లర దుకాణంపై మందుబాబులు పెట్రోల్ పోసి దాడి చేశారు. బాధితుల వివరాల మేరకు..చిన్న కొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఒంటిమిట్టలోని కల్యాణ్ రామ్ టౌన్ షిప్ వద్ద ఉన్న పట్నం పెంచలయ్య చిల్లర దుకాణంలో చిల్లర బాకీ చేసి ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కట్టా మల్లికార్జున పెంచలయ్య చిల్లర దుకాణానికి వచ్చాడు. మల్లికార్జున రావడంతో దుకాణాదారుడు పెంచలయ్య తనకు బాకీ ఉన్న చిల్లర తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఎంత ఉందని మల్లికార్జున పెంచలయ్యను ప్రశ్నించాడు. రూ. 170 బాకీ ఉందడని చెప్పగా నువ్వు రూ. 100 అబద్ధం చెబుతున్నావు. నేను బాకీ రూ.70 మాత్రమే ఉన్నానని దుకాణాదారుడు పెంచలయ్యపై మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున దాడి చేశాడు. దీంతో దెబ్బలు తిన్న దుకాణాదారుడు స్థానిక పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున ఆగ్రహావేశంతో కట్టా బాలకృష్ణా అనే వ్యక్తితో కలిసి సాయంత్రం 4:50 గంటలకు వచ్చి, పెట్రోల్ పోసిన ప్యాకెట్లను పెంచలయ్య దుకాణంపై విసిరి, దుకాణానికి నిప్పుపెట్టి పారిపోయారు. వెంటనే స్పందించిన దుకాణాదారులు, స్థానికులు మంటల్లో కాలిపోతున్న దుకాణంపై నీరు పోసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బాధితుడు పెంచలయ్య దుకాణంలో రూ. 45 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తనకున్న బాకీ అడిగినందుకు తనకున్న జీవనాదారమైన దుకాణంపై దాడిచేయడం ఆమానుశమని, ఇంతటి దౌర్జన్యం, రౌడియిజం ఎన్నడు లేదని దుకాణదారుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మందుబాబులను కఠినంగా శిక్షించాలని బాధిత దుకాణాదారుడు పోలీసులను ఆశ్రయించి, పిర్యాదు చేశానన్నా డు. ఒంటిమిట్ట పోలీసులు దాడికి గురైన దుకాణం వ ద్దకు చేరుకుని, దాడి జరిగిన ప్రదేశాన్ని, సీసీ కెమరా లో దాడికి సంబంధించి విడియోను పరిశీలించారు. -
నెల్లూరు జట్టు ఘన విజయం
ఆదిల్ హుస్సేన్, కడప (58 పరుగులు)అఖిల్, నెల్లూరు (3 వికెట్లు) శివ కేశవ, కడప (66 పరుగులు) నారాయణ, నెల్లూరు (3 వికెట్లు) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ మ్యాచ్లు శుక్రవారం మూడవ రోజు అనంతపురం జట్టుపై నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భార్గవ్ రాజు 45 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 44 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 3 వికెట్లు, అఖిల్ 3 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 160 అధిక్యంతో విజయం సాధించింది. కాగా నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 187 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్ : వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 80 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ 66 పరుగులు, ఆదిల్ హుస్సేన్ 58 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 4 ఓవర్లకు 40 పరుగులు చేసింది. దీంతో కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 297 పరుగులు చేసింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యంతో ఉండటంతో 03 పాయింట్లు లభించాయి. -
ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి
● అడ్డుతగిలాడనే అక్కసుతో రమేష్ నాయక్పై సజీవదహన యత్నం ● ఆరుగురు నిందితులు అరెస్ట్, కారు స్వాధీనం మదనపల్లె రూరల్ : అన్నదమ్ముల ఆస్తివివాదాల నేపథ్యంలోనే బీకే.పల్లె వైఎస్సార్ కాలనీలోని షేక్ సలీంబాషా ఇంటిపైకి రాయచోటికి చెందిన వ్యక్తులు దాడిచేశారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. దాడి చేసే క్రమంలో సలీంబాషా ఇంటి కింది భాగంలో దుకాణం నిర్వహిస్తున్న రమేష్నాయక్ అడ్డుపడటంతో ఆగ్రహించి, పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించారన్నారు. సజీవ దహనానికి ప్రయత్నించిన కేసులో రాయచోటికి చెందిన ఆరుగురు నిందితులను శుక్రవారం పట్టణంలోని రామారావుకాలనీ ఆటోస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి, నేరం చేసేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మహేంద్ర కేసుకు సంబంధించి తెలిపిన వివరాలిలా.. పట్టణ శివారుప్రాంతం బీకే.పల్లె వైఎస్సార్ కాలనీలోని షేక్ సలీంబాషా తండ్రి షేక్ మహబూబ్బాషా, రాయచోటికి చెందిన ఖాసింసాబ్ అన్నదమ్ములు. వీరి రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంగా మనస్పర్థలు ఉన్నాయి. ఏడాది క్రితం షేక్ మహబూబ్బాషా రాయచోటిలో చనిపోయాడు. ఈ విషయంగా షేక్ మహబూబ్బాషా కుటుంబ సభ్యులకు అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణాంతరం ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున రాయచోటికి చెందిన ఖాసింసాబ్ కుమారులు షేక్జావేద్ హుస్సేన్(25), షేక్ షామీర్ హుస్సేన్(29)లు తమకు పరిచయస్థులైన షేక్ ఇలాహి అలియాస్ ఫాజిల్(32), కలికిరి మండలం దూదేకులపల్లెకు చెందిన వేంపల్లె మస్తాన్(38), కే.వి.పల్లె మండలం తిమ్మాపురం కొత్త ఇండ్లుకు చెందిన షేక్ అమీర్సాహెబ్(28), కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన కారు డ్రైవర్ కొమ్మిరిశెట్టి విశ్వనాథ్బాబుతో కలిసి మదనపల్లెలోని వైఎస్సార్ కాలనీకి చేరుకున్నారు. పథకం ప్రకారం మార్గమధ్యంలో ఓ పెట్రోల్బంకు వద్ద కారుకు డీజిల్ పట్టించి, బాటిల్స్లో పెట్రోల్ నింపుకున్నారు. సలీంబాషా ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్స్తో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. గేటును రాడ్లతో పగలగొడుతూ, ఇంటిపై రాళ్లు రువ్వుతూ, సలీంబాషాపై దాడిచేసేందుకు యత్నించారు. సలీంబాషా ఇంట్లో అద్దెకు ఉంటున్న రమేష్నాయక్ శబ్దాలు విని గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన జావీద్హుస్సేన్, షామీర్హుస్సేన్లు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ అతడిపై పోసి నిప్పంటించారు. ఈ విషయం గమనించిన సలీంబాషా, టూటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబసభ్యులు, బాధితుడ్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. నిందితులపై దాడి, హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభచూపిన సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. నిందితులు మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరులు రాయచోటి నుంచి వచ్చి మదనపల్లెలో రౌడీయిజాన్ని ప్రదర్శించి, ఎస్టీ కులానికి చెందిన రమేష్నాయక్పై సజీవదహనానికి యత్నించిన కేసులో నిందితులు జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఇదే వ్యక్తులు మదనపల్లెలో మంత్రి పేరు చెప్పి ఓ భూదందా సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. మంత్రి అండ ఉంది కనుకే.. రాయచోటి రౌడీమూకలు బరితెగించి మదనపల్లెలో దౌర్జన్యానికి పాల్పడ్డారని పలువురు మాట్లాడుకుంటున్నారు. -
పెన్నానదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య
● విస్తృతంగా జాలర్లు గాలింపు ● మాచుపల్లి సమీపాన మృతదేహాలు లభ్యం సిద్దవటం : పెన్నా నదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య (84), నాంచారమ్మ (80) దంపతులు బుధవారం తమ ఒంటిపై ఉన్న నగలు, నగదు ఇంటిదగ్గర పెట్టి కనబడకుండా పోవడంతో వారి పెద్ద కుమారుడు మహేష్ చెన్నూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమాంబ అమ్మవారిని దర్శించుకొని కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని పెన్నా నదిలో మొదట నాంచారమ్మ దూకగా కేసుపు అటూ ఇటూ ఇతరుగుతూ తడబడి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి కూడా పెన్నాదిలో దిగాడు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఒడ్డున నాంచారమ్మ పాదరక్షలు ఉండటంతో బంధువులు గుర్తించారు. మృతి చెందిన వృద్ధ దంపతుల చిన్న కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఐదుగురు జాలర్ల సహాయంతో పెన్నా నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మాచుపల్లి గ్రామ సమీప ప్రాంతాలలోని ముళ్లపొదల్లో మృతదేహాలు ఉన్నట్లు జాలర్లు గుర్తించి పెన్నా నదిఒడ్డున చేర్చారు. మృతి చెందిన వృద్ధులుగతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ అవస్థలు పడేవారు. పలుమార్లు వైద్యశాలలో చికిత్స కూడా చేయించామని వారి బంధువులు తెలిపారు. ఎస్ఐ మహమ్మద్ రపీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం మాచుపల్లి పెన్నా నది ఒడ్డున రిమ్స్ వైద్యుడు శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతులు వెంకటసుబ్బయ్య, నాంచారమ్మ (ఫైల్), పెన్నానది నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న దృశ్యం -
కవనీయం.. శ్రీరంగనాథుని కల్యాణం
రంగనాథస్వామిని దర్శించుకుంటున్న వైఎస్ మనోహర్రెడ్డి, కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు పులివెందుల టౌన్ : పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లె కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో భక్తులు చల్లా వంశీయుల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ భక్త జనసందోహంతో వేద మంత్రోచ్ఛారణలతో కమనీయంగా స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అంకాలమ్మ దేవస్థాన చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, పెద్దిరాజు, తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణ అనంతరం చల్లా వంశీయుల సౌజన్యంతో వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరంగనాథస్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో శ్రీరంగనాథస్వామి నూలుపూజ పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వి.రమణ, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, శ్రీరంగనాథ ట్రస్ట్ సీఈఓ అల్లం రంగనాయకులు, వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు సాయి భరద్వాజ శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు కాంభోజి మల్లికార్జున, దశరథ రామిరెడ్డి, మాధవాచారి, మేడం దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది,భక్తులు,తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శ్రీరంగనాథస్వామి నూలు పూజ పవిత్రోత్సవాలు -
బోధనలో ఒరవడి సృష్టిస్తున్న ఖాసీంవలి
కాశినాయన : పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు సైతం విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఆ ఉపాధ్యాయుడి తపన. అతడి పేరు ఖాసీంవలి. మండలంలోని బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి ఖాసీం సాబ్ రిక్షా తొక్కుతూ అతనికి వచ్చిన సంపాదనలో కుమారుడు కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని చదివించాడు. తండ్రి ఆశయం కోసం అతడు ఎంతో కష్టపడి చదివి 2011లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టాడు. రాజంపేట మండలంలోని చెంచురాజుపల్లెలో 2011లో ఉపాధ్యాయుడిగా చేరి 2021 వరకు దశాబ్దకాలం పనిచేసి అటు విద్యార్థులు, ఇటు గ్రామ ప్రజల మన్ననలను పొందారు. పేదరికం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిగా ఖాసీంవలి పేద విద్యార్థులను చేరదీసి వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించి తనదైన శైలిలో చక్కగా పాఠాలు బోధించారు. చెంచురాజుపల్లె నుంచి నలుగురు విద్యార్థులను నవోదయ పాఠశాల ప్రవేశానికి శిక్షణ ఇచ్చి నలుగురు విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికకావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బోధన సామగ్రిని పంపిణీ చేయించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2021లో బదిలీపై మండలంలోని పిట్టికుంట ఎంపీపీ పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించుకోవడానికి డబ్బులు లేని విద్యార్థులకు ఖాసీం వలి తన సొంత డబ్బుతో యూనిఫాం కుట్టించి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బాలాయపల్లె పాఠశాలకు వెళ్లారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాఠశాల ఆవరణలో మొక్కలను నాటించి గ్రామస్తులు, మండల విద్యాశాఖ అధికారుల మన్ననలను పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో నిర్వహించిన సభలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఖాసీంవలి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఖాసీం వలి మాట్లాడుతూ పేదరికం కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడి ఉపాధ్యాయుడినయ్యానని తెలిపారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ప్రతి పేద విద్యార్థి చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై న ఖాసీంవలికి జనవిజ్ఞాన వేదిక జిల్లా, రాష్ట్ర నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రార్థనల్లో భాగంగా తొలుత జపమాల, పాటలను ఆలపించారు. ఆరోగ్యమాత స్వరూపాన్ని అలంకరించి పల్లకీలో ఊరేగించారు. గుంటూరుకు చెందిన రెవరెండ్ పాదర్ దేవ దివ్య సత్ప్రసాద ఆరాధన, ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు ఎస్జీజేకు చెందిన రెవరెండ్ ఫాదర్ ఆకుల ధర్మరాజు దివ్యబలిపూజ నిర్వహించి భక్తుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గురువులు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ మరియమాత జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు. ఆ తల్లి ప్రేమ తరిగిపోనిదన్నారు. రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ గురువులు, కన్యసీ్త్రలు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కర్నూలులోనే కృష్ణా నది బోర్డు ఉండాలి
– పీసీసీ డెలిగేట్ శ్రీనివాసులరెడ్డి పులివెందుల టౌన్ : కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది జలాలు తెలంగాణ రాష్ట్రం తర్వాత కర్నూలు జిల్లాలోకి చేరుకుంటాయని, తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, వెలుగోడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కడప జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న గండికోట ప్రాజెక్టు, తదితర ప్రాజెక్ట్లకు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత గల శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు హైకోర్టు, రాజధాని రెండూ అమరావతిలోనే ఏర్పాటు చేసి రాయలసీమకు అన్యాయం చేశాయన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కమలాపురం : కమలాపురం–ఖాజీపేట ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామనూరు శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గంగవరం సమీపంలోని కుందూ నది వద్ద ఉన్న కాశీనాయన దేవాలయం సమీపంలో అరుగుపై కూర్చుని ఉన్న శ్రీరాములును సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అతడిని చితకబాదారు. మద్యం దుకాణంలో చోరీ ఖాజీపేట : మండలంలోని ఎస్వీబీ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బును దొంగలు దోచుకుపోయారు. ఖాజీపేట బ్రిడ్జి అవతల ఉన్న మద్యం దుకాణంకు చెందిన యజమానులు శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనుక భాగంలోని తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే దుకాణంలోనీ సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి ముఖానికి మాస్కు ధరించిన దొంగ తలుపు పగులకొట్టి లోనకు ప్రవేశించాడు. దుకాణంలోని నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యలను పరిశీలించిన తరువాత ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక
కడప సెవెన్రోడ్స్: భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, అందరూ మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) అడుగ జాడల్లో నడవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు. మహా ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పేరుతో నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, కడప నియోజకవర్గ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ)ను అల్లాహ్ చివరి ప్రవక్తగా పంపారని పేర్కొన్నారు. ఆయన్ను ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపారని తెలిపారు. నగరంలో భారీ ర్యాలీ: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని కడప నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మర్కజీ మిలాద్ జులూస్ ఆధ్వర్యంలో అగాడిలోని ఇనాయత్ఖాన్ తాలిం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అల్మాస్పేట, వన్టౌన్, పొట్టిశ్రీరాములు సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సలావుద్దీన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు హజరత్ మహమ్మద్ అలీబొగ్దాది, హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అబ్దుల్ రెహ్మాన్ బొగ్దాది, హజరత్ అబ్దుల్ రహీం, హమీద్ హుసేన్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్బాబు, ఆరీఫుల్లా, నజీర్ అహ్మద్, అలీఖాన్, సుబాన్బాషా, షఫీవుల్లా, మహమ్మద్ అలీతోపాటు పెద్దఎత్తున ముస్లిం యువకులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మతపెద్దలు, నగర ముస్లిం ప్రముఖులు, నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు మహా ప్రవక్త అడుగుజాడల్లో నడవాలి మిలాదున్నబీ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
ఉపాధ్యాయులు.. సమాజ నిర్మాతలు
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ సభాభవన్లో మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి ఽరాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెలీ రాంగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారంతా జ్యోతి వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైయిందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది రాజకీయ నాయకులు, అధికారులు కాదని గురువులేనని తెలిపారు. పిల్లలకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలన్నారు. ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపైన పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ తాను 15 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చానన్నారు. ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నాన్న కూడా ఉపాధ్యాయుడేనని, ఆయన మార్గదర్శకంలో నడిచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 64 మందికి అవార్డులు అందజేశారు. వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ కాగిత శ్యాముల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ డీఆర్ఓ విశేశ్వరనాయుడు, ఎస్ఎస్ఏ ఏపీసీ నిత్యానందరాజు, డిప్యూటీ ఈవోలు రాజగోపాల్రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్, జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటన్ సాంబశివారెడ్డి, సైన్సు మ్యూజియం క్యూరేటర్ రెహమాన్, పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు 64 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చతుష్ఠార్చన, ద్వారతోరణ, అనంత కళాపూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిత్య హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, ఇతర అర్చకులతోపాటు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కడప రూరల్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈవీఎంలపై వ్యతిరేక జాతీయ ఉద్యమ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ కన్వీనర్ సంగటి మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశ ముఖ ద్వారమైన హైదరాబాదులో మధ్యాహ్నం 2 గంటలకు ఈవీఎంలకు వ్యతిరేకంగా చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల నేతలు అవ్వారు మల్లికార్జున, కై పు రామాంజనేయులు, దేవర శ్రీకష్ణ, గుర్రప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో యూనివర్సిటీ పాడ్ కాస్ట్ను ప్రారంభించారు. శుక్రవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కో ఆర్డినేటర్ నందిగం సత్యానంద రాం ఆధ్వర్యంలో నిజమైన చర్చలు, నిజమైన నైపుణ్యాలు, వాస్తవ ప్రపంచం అనే పేరుతో యూనివర్సిటీ పోడ్ కాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో యూఎస్ఏ నుంచి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న మధుసూదన్రెడ్డి విద్యార్థులకు ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై సూచనలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి పి.రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
చాపాడు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా రైతు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగాన్ని విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించడం వల్ల ఈనెల 9న మైదుకూరులో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అత్యధికంగా మైదుకూరు నియోజకర్గంలో 92 వేల ఎకరాల్లో ప్రతి ఏటా వరితోపాటు వివిధ రకాలైన పంటలు సాగుతాయన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో యూరియా కొరత రైతులను వేధిస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి మైదుకూరు నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాల్లో యూరియా విక్రయించడం లేదన్నారు. దీంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ఎరువుల దుకాణాల్లో బస్తా రూ.400తో వ్యాపారులు గోప్యంగా విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరో వైపు ఉల్లి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఏమో క్వింటాల్ రూ.2 వేలకు కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ కనీసం రూ.800కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ క్రమంలో మైదుకూరులో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ నెల 9న మైదుకూరులోధర్నా, నిరసన ర్యాలీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
పవన్కుమార్, 83 పరుగులు(నెల్లూరు) ఇకాక్షర్, 5 వికెట్లు(నెల్లూరు) కనిష్, 4 వికెట్లు (కర్నూలు) విజయ్రామిరెడ్డి, 80 పరుగులు(కడప) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 304 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 88.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 80, భరత్రెడ్డి 37 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 4, అక్షిత్రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయిసూర్యతేజరెడ్డి 58, అక్షిత్రెడ్డి 47, సాయి ప్రణవ్ 51 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3, ఎస్ఎండీ ఆయూబ్ 2 వికెట్లు తీశారు. కర్నూలు జట్టు 113 పరుగుల వెనుకంజలో ఉంది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 196 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 43.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వెంకట్ లోకేష్ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని ఇకాక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. నారాయణ 3, మాధవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లకు 350 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ జట్టులోని రోషన్ పవన్కుమార్ 83 పరుగులు, సూతేజ్రెడ్డి 81 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ 3 వికెట్లు, టీవీ సాయి ప్రతాప్రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 3 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
రేపు 5కే రెడ్ రన్ మారథాన్
కడప రూరల్: కడప నగరంలో ఈ నెల 6న 5కే రెడ్ రన్ మారథాన్ను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం ఉదయం 5.30 గంటలకు స్ధానిక మహవీర్ సర్కిల్ నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు అక్కడి నుంచి మహవీర్ సర్కిల్ వరకు మారథాన్ ఉంటుందన్నారు. వివరాలకు సెల్ నంబరు 9866094531, 9052038569 ను సంప్రదించాలని సూచించారు. ప్రొద్దుటూరు కల్చరల్: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఉమ్మడి కడప (వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల) జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, కార్యదర్శి జి.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94901 81104, 7036907303 నంబర్లకు సంప్రదించాలని కోరారు. చింతకొమ్మదిన్నె: జిల్లా పరిషత్ సీఈఓ సి.ఓబులమ్మ స్థానిక చింతకొమ్మదిన్నె ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. జెడ్పీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన పనులకు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ సూచించారు. కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యా యి. నాలుగు రోజులపాటు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం, విశ్వక్సేన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు మయూ రం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణతరుణ్ ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యతను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ యస్.రమణ అన్నారు. గురువారం విద్యుత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడు వులోగా పరిష్కరించాలని, సమస్య మూలకారణాన్ని గుర్తించి సమగ్ర పరిష్కారం అందించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్ మంజూష, జిల్లాలోని ఏఈలు, జేఈలు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తా మని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టిందని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, చీని, మినుము, మిర్చి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు కావా ల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం, ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రైతులకు యూరియాను అందుబాటులో ఉంచలేక, యూరియా ఎక్కువ వాడితే కేన్సర్ వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ సమస్యలన్నింటిపై ప్రత్యక్ష పోరాటం చేయా లని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు జయప్రదం చేయాలని కోరారు. జయచంద్రారెడ్డి, బీహెచ్ ఇలియాస్, బంగారు నాగయ్య, బసవరాజు, అరీఫుల్లా బాషా, కె. బాబు పాల్గొన్నారు. ● ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ● మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కొండను తవ్వేశారు..!
● రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ తరలింపు ● అనుమతులు లేకుండానే తవ్వకాలు ● చర్యలు చేపడుతామంటున్న మైనింగ్ అధికారులు జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏకంగా కొండను తవ్వేసింది. పైసా ఖర్చు లేకుండా.. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా.. ఏకంగా 22 కిలోమీటర్ల దూరం రోడ్డ నిర్మాణం కోసం గ్రావెల్ వాడుకుంది. మండల పరిధి అంబవరం పంచాయతీలోని కొత్త గుంటపల్లె సమీపంలో ఎస్ఆర్సీ కంపెనీ ప్రకృతి వనరులైన కొండలను నాశనం చేసింది. దాదాపు 30 నుంచి 40 ఎకరాల్లో ఉన్న కొండ ప్రాంతాన్ని 30 అడుగుల మేర ఇటాచీలతో తవ్వి కొల్లగొట్టారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో శ్రీకొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టిశ్రీ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ ప్రాంతాన్ని మైనింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించబోతున్నారు. చర్యలు ఉంటాయా.. లేదా? జాతీయ రహదారి నిర్మాణం కోసం వాడే గ్రావెల్కు క్యూబిక్ మీటర్కు 700 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు తమకు పది వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం ఉందంటూ, దానికి అనుమతులు ఇవ్వాలంటూ తహసీల్దార్కు లెటర్ ఇచ్చారు. అయితే అనుమతులు లేకండానే ఏకంగా పది వేల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా గ్రావెల్ను రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగించినట్లు రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు. పైగా వార్త రావడంతో ఏమి చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. జాతీయ రహదారి అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల కంటె ఎక్కువగా గ్రావెల్కు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. ఈ డబ్బు అంతా కాంట్రాక్టర్ మిగిలించుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్పై తమకు ఫిర్యాదు అందిందని జిల్లా మైనింగ్ అధికారి రాధా తెలిపారు. దీనిపై విచారణ కోసం మైనింగ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు లేఖ పంపించామని పేర్కొన్నారు. మరి మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకుని, దానికి సంబంధించిన పరిహారం వసూలు చేస్తారో.. మరి కాంట్రాక్టర్, కంపెనీ, అధికార పార్టీకి దాసోహం అని తూతూ మంత్రంగా చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే. -
ముంచుకొస్తున్న సోమశిల ముంపు జలాలు
● సగిలేరు లోలెవల్ వంతెనపైకి వచ్చే ప్రమాదం ● నిలిచిపోనున్న ఆరు పంచాయతీల రాకపోకలు ● ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజలు అట్లూరు : పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. సోమశిల జలాశయంలో రోజు రోజుకు నీరు పెరుగుతోంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేమలూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెనపైకి సోమశిల వెనుక జలాలు నేడో రేపో చేరనున్నాయి. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. శుక్రవారానికి 66 టీఎంసీలకు చేరుకున్నాయి. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సోమశిల జలాశయంలోకి రోజూ 23.500 కూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 10 వేల పైచిలుకు క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. దీంతో రోజుకు ఒక టీఎంసీ నీరు నిల్వ చేరుతుంది. ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగి అధికారులు ఇలాగే నీటిని నిల్వ చేస్తే.. మరో వారం రోజుల లోపే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. శుక్రవారానికి లోలెవల్ వంతెన లెవల్కు నీరు చేరింది. ఒక టీఎంసీకి అడుగు మేర నీరు వస్తుంది. ఇలాగే కొనసాగితే రెండు లేదా మూడు రోజులకు వేమలూరు వద్ద ఉన్న లోలెవల్ వంతెనపై రాక పోకలు పూర్తిగా నిలిచి పోతాయి. మండల కేంద్రానికి 40 కిలో మీటర్లు తిరిగి వెళ్లాలి అట్లూరు మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సగిలేరు నదికి తూర్పున ఆరు, పడమర ఆరు పంచాయతీలు ఉన్నాయి. లోలెవల్ వంతెనపై నీరు రెండు లేదా మూడు అడుగుల మేర చేరితే వాహన రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి. రాకపోకలు నిలిచిపోతే అట్లూరులో ఉన్న తహసీల్దారు, ఎంపీడీఓ, వెలుగు తదితర మండల కార్యాలయాలతోపాటు పోలీస్స్టేషన్, బ్యాంకులకు వెళ్లాలంటే బద్వేలు మీదుగా 40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఆరు కిలోమీటర్ల దూరం వెళ్తే సరిపోతుంది. ఈ పరిస్థితి సగిలేరు నదికి తూర్పు భాగాన ఉన్న ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మణ్యవారిపల్లి, కమలకూరు గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు నెలకొంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వంతెన పైకి నీరు చేరడంతో ప్రమాదం అంచున వెళుతున్న ప్రజలు(ఫైల్) సగిలేరు నది లోలెవల్ వంతెన లెవల్కు చేరిన సోమశిల ముంపు జలాలు -
రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: రాష్ట్రంలోని రైతన్నలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ వరి ఎక్కువగా పండించవద్దని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందించకుండా వరి పంట పండించవద్దని, యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్కు దారి తీస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పక్కదారి పడుతున్న యూరియాను అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా 12లక్షల టన్నుల ఎరువులను రైతులకు అందజేశామని వివరించారు. ఉల్లి ధరలు కూడా పతమైనప్పుడు తమ ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద దాదాపు 9వేల టన్నులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వాసుపత్రిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం గురువారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల లోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు పద్మనాభరెడ్డి సోదరుడు నాగేశ్వరరెడ్డిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యురాలితో నాగేశ్వరరెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యురాలితో సిటి స్కాన్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ప్రశ్నించగా సిటి స్కాన్ ఉన్నప్పటికి సిబ్బందిలేరని బదులి చ్చారు. దీనికి స్పందించిన ఎంపీ ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కూడా కక్ష సాధిస్తోందని, పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరైన 50 మెడికల్ సీట్లను తిరస్కరించడం అందుకు నిదర్శనమన్నారు. -
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో గురువారం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో రెండవ మాసం కల్యాణం మఠం ఆస్థాన ప్రధాన అర్చకుడు ఇడమటికంటి జనార్ధనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారి శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి తన్మయులయ్యారు. ప్రతి నెల శుద్ధ ద్వాదశి నాడు దాతల సహకారంతో స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, పూజారులు, దాతలు పాల్గొన్నారు. -
లోకేష్ వ్యాఖ్యలు నీచరాజకీయాలకు పరాకాష్ట
కడప కార్పొరేషన్ : రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు నీచరాజయాలకు పరాకాష్ట అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు తన తల్లి విజయమ్మను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలకరించలేదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం విష ప్రచారానికి పరాకాష్ట అన్నారు. విషం చిమ్మడంలో లోకేష్ గోబెల్స్నే మించిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వర్ధంతి రోజు తాను విజయమ్మ పక్కనే ఉన్నానని, వైఎస్ విజయమ్మను జగన్ అప్యాయంగా పలకరించడం అందరూ చూశారని, ఆ దృశ్యాలు అన్ని టీవీల్లోనూ ప్రసారం అయ్యాయన్నారు. కళ్లుండి లోకేష్ చూడలేకపోవడం దురదృష్టకరమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నామని టీడీపీ ఓటర్లు చెప్పడం ఎంత అబద్ధమో, వైఎస్ జగన్ను కలిసేందుకు పాసులు ఇచ్చారని లోకేష్ విషం చిమ్మడం కూడా అంతే అబద్ధమన్నారు. మీ చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో లోకేష్ సమాధానం చెప్పాలని రెడ్యం సవాల్ విసిరారు. నాడు వ్యవసాయం దండగ అన్న నారా చంద్రబాబు నాయుడు నేడు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వరి ఎక్కువ పండిస్తే కొనే వారే ఉండరని చెప్పడం రైతు వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు లేని వాటిని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వై.నిరంజన్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బి. సుబ్బరాయుడు యాదవ్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటసుబ్బారెడ్డి -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచికలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. పకడ్బందీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్కు సంబంధించి ఈ నెల 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష మధ్యాహ్నం 3.00 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు. ● పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు 08562– 246344 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
టీడీపీకి అండగా ఉన్న బలిజలకే మోసం
● పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే ● టీడీపీపై బలిజ సంక్షేమ సంఘం నేతల ఆగ్రహం కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బలిజ వర్గీయులను అవమానపరచడం తగదని బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం స్థానిక హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 27 శాతం మంది బలిజ వర్గీయులు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తామంతా అండగా నిలిచామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడానికి బలిజలు కృషి చేశారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక బలిజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జిల్లాలో పార్టీ కోసం పని చేసిన హరిప్రసాద్కు నామమాత్రంగా డైరెక్టర్ పదవిని ఇచ్చి బలిజలను అవమానపరిచారని తెలిపారు. బలిజలకు టీడీపీ ఎందుకు గుర్తింపు ఇవ్వలేదో అధిష్టానానికే ఎరుక అని పేర్కొన్నారు. రాయలసీమ బలిజ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే సాగుతోందన్నారు. బలిజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బలిజ భవన్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. టీడీపీ సిద్ధాంతం కోసం మా వాళ్లంతా కష్టపడితే, ఆ పార్టీ అధిష్టానం తమకు ఏ మాత్రం న్యాయం చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా 2వ తేదీ దివంగత మహానేత వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించా రు. మంగళవారం మద్ధతు ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతుల కష్టాలను స్వయంగా రైతుల పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అలాగే అంబకపల్లె గంగమ్మ కుంట చెరువులో జలహారతి ఇచ్చారు. దారిలోని నల్లపురెడ్డిపల్లెలో స్థానికులతో మాట్లాడారు. సోమ, మంగళవారాలలో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలు, పార్టీ కేడర్లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారాలను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచిస్తూ ప్రజలు, కార్యకర్తలలో మనో ధైర్యం నింపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మూడు రోజుల పర్యటన విజయవంతం -
కలిసిరాని కాలం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై అటు వ్యవసాయ అధికారులు ఇటు రైతులు కేసీ కెనాల్పైనే ఆశలు పెట్టుకున్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు జిల్లాలో 92 వేల ఎకరాలకుపైగానే ఉంది. కేసీ కాలువకు నీరు వస్తుండటంతో చాలామంది రైతులు వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు వస్తున్న నేపథ్యంలో కేసీ పరిధిలో భూగర్భజలాలు కొంత మేర అభివృద్ధి చెంది బోర్ల కింద కూడా సాగు విస్తీర్ణం పెరగనుంది. కడప అగ్రికల్చర్: ఈ సారి ఖరీఫ్ కూడా రైతులకు కలిసిరాలేదు. సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు పలకరించినా.. ఆపై వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో చాలా మంది రైతులు పంటలసాగు చేయలేకపోయా రు. మరో 25 రోజుల్లో సీజన్ కూడా ముగియనుంది. ఇప్పటికే ఖరీఫ్ లక్ష్యానికి ఆమడదూరంగా సాగు నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా 77,551 హెక్టార్ల సాధారణసాగు కాగా ఇప్పటివరకు కేవలం 21,179.8 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. అంటే సాగు కేవలం 27.31 శాతానికే పరిమితమైంది. మిగతా 70 శాతంపైగా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. ఇక అక్కడక్కడ అరకొరగా సాగు చేసినా పంటలకు అవసరమైన యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద యూరి యా కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రైతుల తమ పనులను సైతం వదులుకుని బస్తా యూరియా కోసం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించడంపై అన్నదాతలు అందోళన చెందుతున్నారు. మరో 25 రోజుల్లో ముగియనున్న ఖరీఫ్ ఇప్పటికే లక్ష్యానికి దూరంగా సాగు అరకొర సాగుకే యూరియా దొరక్క రైతుల అవస్థలు జిల్లావ్యాప్తంగా 27.31 శాతానికేసాగు పరిమితం -
పెరిగిన నీటి ప్రవాహం
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల మైలవరం మండలం వేపరాల సమీపంలో యువకుడు గల్లంతు కావడం.. ఆతని ఆచూకి లభ్యం కాకపోవడంతో నీటినినిలుపుదల చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. తాజాగా మైలవరం జలాశయం నుంచి అధికారులు పెన్నాలోనికి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 4.5టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట జలా శయం నుంచి మూడు గేట్ల ద్వార పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మైలవరం ఇరిగేషన్ అధికారులు నీటిని 11వేల క్యూసెక్కుల మేర పెన్నానదిలోనికి విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పెన్నా పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
యూరియా కోసం పడిగాపులు
నేను ఆరు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాను. యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సచివాలయానికి అరకొర వస్తోంది. అది వస్తే క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి అనుభవించలేదు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరఫరా యూరియాను సరఫరా చేయాలి. – నాగేశ్వర్ రెడ్డి, రైతు, రావులపల్లి, ఖాజీపేట మండలం కేసీ కెనాల్ పరిధిలో... ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే వర్షాలు బాగా కురవడంతో సాగు పెరుగుతుందని ఆశపడ్డాం. కానీ సజన్ ప్రారంభం తరువాత వరణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో సాగు అనుకున్న మేర కాలేదు. ఇటీవల కురిసిన వర్షానికి ఆరుతడి పంటలసాగు పెరిగే అవకాశం ఉంది. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం
కడప కార్పొరేషన్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, అంజద్బాషా, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేదని, ఉల్లి, చీనీ, మినుము పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 9న రైతు సమస్యలపై నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, నిరసనలు చేయాలన్నారు. ఈ ర్యాలీలు, నిరసనల్లో రైతులు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, నూర్బాష్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఓ. రసూల్, శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్ కమిటీ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
డాక్టర్ వైఎస్సార్ సంకల్పం... వైఎస్ జగన్ సాకారం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధించాలని తద్వారా ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పిస్తే... తండ్రి సంకల్పాల్ని సాకారం చేయడానికి గత ప్రభుత్వంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. మౌళికవసతులు సమకూర్చి పారిశ్రామిక ప్రగతికి అనువైన ప్రాంతంగా కొప్పర్తి పారిశ్రామికవాడను తీర్చిదిద్దారు. ఫలితంగా చైన్నె–విశాఖ పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తిలో రూ.2,147కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాటి స్ఫూర్తితోనే నేటి కొప్పర్తిలో ఫలాలందుతున్నాయనే జగమెరిగన సత్యాన్ని మంత్రి నారా లోకేష్ మరిచిపోయారు. అంతేనా..జిల్లాలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలించే కుటిల యత్నం చేసిన కూటమి సర్కార్ వైనాన్ని కప్పిపెట్టారు. కేవలం ప్రారంభోత్సవాలు చేసి తామే చేశామని గొప్పలు చెప్పుకోవడంపై జిల్లా వాసులు నవ్వుకుంటున్నారు.● వైఎస్సార్ జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా తీర్చిదిద్దాలని కడపకు కూతవేటు దూరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు 6వేల ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పారిశ్రామికవాడకు మౌళిక సదుపాయాలు కల్పించారు. పైగా అందులో డాక్టర్ వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ కూడా నెలకొల్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు ఆహ్వా నం పలుకుతూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందడుగు వేశారు.పెట్టుబడుల వెల్లువ..వైఎస్సార్ ఈఎంసీలో రూ.10వేల కోట్లు పెట్టుబడులు, దాదాపు లక్ష మందికి ఉద్యోగాలకు ప్రణాళికలు వేశారు. ఇదివరకే నాలుగు షెడ్లలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి ఉద్యోగాలు లభించాయి. 1.5లక్షల చదరపు అడుగుల సామర్థ్యం ఉన్న మరో మూడు షెడ్లను డిక్సన్ కంపెనీ తీసుకుంది. రెండో ప్లాంట్ విస్తరించేందుకు సిద్ధమైంది. డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ, సెల్కాన్ రిజుల్యూట్, చంద్రహాస్ ఎంటర్ ప్రైజెస్, యూటీఎస్పీఎల్ సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా 7500 ఉద్యోగాలు లభించనున్నాయి. అప్పట్లో వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా 6400 ఉద్యోగాలు లభించనున్నాయి. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటి అనే మరోరెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. టీవీలు, ల్యాప్టాప్లు, ఐఏటీ డివైజ్లు, ట్యాబ్ తయారీ తదితర వస్తువులు ఇక్కడే తయారుకానున్నాయి. వీవీడీఎన్సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమిత్తం ఆయా సంస్థలు సిద్ధమవడం విశేషం.వైఎస్ జగన్ కృషితోనే... సీఎం చంద్రబాబుకు .. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొప్పర్తి పారిశ్రామికవాడలో 2014– 19లో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని జిల్లా వాసులు నిలదీస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్లో ఇండస్ట్రీయల్ మెగా హబ్గా ప్రతిపాదనలు చేశారు. 2023లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఫలితంగా పరిశ్రమలు స్థాపనకు మార్గం సుగమమైంది. కాగా ఇక్కడికి మంజూరైన ఎంఎస్ఎంఈ టె క్నాలజీ సెంటర్ను సైతం అమరావతికి తరలించే యత్నాన్ని కూటమి సర్కార్ చేసింది. పెద్ద ఎత్తు న నిరసన తలెత్తడంతో వెనక్కి తగ్గింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా టీడీపీ పెద్దలు అబద్ధా లు చెబుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: ప్రజలు సమర్పించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించా రు. బుధవారం కలెక్టరేట్ సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై జేసీ అదితి సింగ్తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలపై ఎక్కువగా ఫిర్యా దులు అందుతున్నాయని.. వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు కూడా అందడం లేదన్నారు. సంబంధిత మండల తహసీ ల్దార్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులపై విచారణ జరపాలన్నారు. అర్జీదారుడు అందించే ఫిర్యా దుకు.. సరైన,సూటి సమాధానం ఇవ్వాలన్నా రు. తద్వారా అర్జీదారునికి సంతృప్త స్థాయిలో పరిష్కారం అందే దిశగా అధికారులు పని చేయాలన్నారు. ఈ విషయంలో జిల్లా శాఖాధిపతులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం.. ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్ పై సమీక్షించి పూర్ పర్ఫార్మెన్న్స్ రికార్డు నమోదైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ రీ అడ్రసల్ సిస్టమ్లో భాగంగా శాఖల వారీగా చేపట్టల్సిన కార్యక్రమాల ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. -
కేసుల రాజీకి కృషి చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని సూచనల మేరకు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత పోలీసు స్టేషన్ల వారీగా కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తుగా సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ హెగ్డే, కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు, రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం ఆర్.కృష్ణమోహన్, మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి.రాజేంద్రప్రసాద్, ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి.భావన, కడప కోర్టు మానిటరింగ్ సెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ -
వినాయక నిమజ్జనం వీడియో వైరల్పై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఇటీవల వినాయక నిమజ్జనం ఉరేగింపు వీడియో వైరల్ అయిన సంఘటనపై గ్రామంలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెద్దనపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి విగ్రహం వెనుక రప్పారప్పా అని రాసిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో గ్రామ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోను చూసి అంకాల్రెడ్డి, అంకిరెడ్డి, అశోక్రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. కాగా మరి కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 14 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో 14 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో 15 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటికి డ్రా తీశామన్నారు. మిగిలిన 14 బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఈనెల 14వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రవికుమార్ , సీఐ కృష్ణ కుమార్ పాల్గొన్నారు. ఈనెల 8న అప్రెంటీస్ మేళా కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ఈనెల 8వ తేదీ కడపలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్స్ పుస్తకం, పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికై న వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ. 7700 నుంచి రూ. 10 వేలు స్టైఫండ్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ముగ్గురికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో ప్రొద్దుటూరు మండలం లింగారెడ్డి నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న షేక్ జవహర్ మునీర్, కాశినాయన మండలం రెడ్డికొట్టాల ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఎస్జీటీ పరిమళ జ్యోతి, పెండ్లిమర్రి మండలం ఎగువపల్లి జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడు ఎఫ్ఎంఎస్ ఖాదర్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ లబ్బిపేటలోని ఏ– కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందుకోనున్నారు. షేక్ జవహర్ మునీర్, పరిమళ జ్యోతి, ఎఫ్ఎంఎస్ ఖాదర్ -
బైక్ అదుపుతప్పి డీఎల్డీఓ సూపరింటెండెంట్ మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం(డీఎల్డీఓ)లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న తిప్పాబత్తిని గురుస్వామి (57) బుధవారం సాయంత్రం బైకు అదుపు తప్పి కిందపడిన ఘటనలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి బైక్లో బయలుదేరారు. మార్గమధ్యంలో సలివెందుల గ్రామం సుంకాలమ్మ దేవాలయం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనదారులు గమనించి కిందపడిన గురుస్వామిని లేపి కూర్చోబెట్టారు. గురుస్వామి తన ఫోన్ ఇచ్చి సమాచారాన్ని తన కుమారుడు మురళికి తెలపాలని సూచించడంతో వారు ఫోన్ చేశారు. అనంతరం 108 సహాయంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడు మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి కేవీపల్లె : వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మండలంలోని నూతనకాల్వ పంచాయతీ కామిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కామిరెడ్డిగారిపల్లెకు చెందిన అబ్బవరం సత్యంరెడ్డికి చెందిన భూమిలో ఉన్న రాతి కూసాలను బుధవారం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి, ఆనందరెడ్డి, దేవేందర్రెడ్డి, సందీప్రెడ్డి విరగ్గొట్టారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీకి చెందిన సత్యంరెడ్డి తోపాటు కంభం కొండారెడ్డి (61), కామిరెడ్డి వెంకటరమణారెడ్డి (42)లపై కొడవలి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ముగ్గురిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు సత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. గణేష్ ఊరేగింపులో యువకుడి హల్చల్ పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పీలేరులో జరిగిన గణేష్ ఊరేగింపులో రివాల్వర్తో ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పీలేరు పట్టణంలో గణేష్ విగ్రహాల సామూహిక ఊరేగింపు, నిమజ్జనం జరిగింది. ఊరేగింపు సందర్భంగా చెన్నారెడ్డికి చెందిన గణేష్ విగ్రహం వద్ద ఓ యువకుడు రివాల్వర్తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ విచారణ జరిపి యువకుడు అధికార పార్టీకి చెందిన గుండ్లూరు వెంకటరత్నంగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రివాల్వర్ ఆకారంలో ఉన్న లైటర్గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. లైటర్ను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శివకుమార్ ఎదుట బైండోవర్ చేసి విడుదల చేశారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
శివ కేశవ, కడప (43 పరుగులు) నాగ చాతుర్య, కడప (53 పరుగులు) ప్రశాంత్, అనంతపురం (90 పరుగులు)ప్రమోద్ కుమార్, అనంతపురం (5 వికెట్లు) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 53 పరుగులు, విజయ్ రామిరెడ్డి 62 పరుగులు, శివ కేశవ 43 పరుగులు, అయూబ్ 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 44.4 ఓవర్లకు 239 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 50 పరుగులు, మాధవ్ 56 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు, ప్రవీణ్కుమార్ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రశాంత్ 90 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 52 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 2 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
కొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టి.!
● గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ● చోద్యం చూస్తున అధికారులు రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన గ్రావెల్ లారీల ద్వారా తరలిస్తున్న గ్రావెల్ జమ్మలమడుగు : ప్రకృతి వరప్రసాదమైన కొండలను రోడ్ల నిర్మాణం పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇటాచీలతో కొండలను కొల్లగొట్టి అందులో ఉన్న గ్రావెల్స్ను భారీ లారీలతో తరలిస్తున్నారు. అధికారులు సైతం ఏమీ తెలియనట్లు, పైగా అది తమకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 167వ జాతీయ రహదారి పనుల కోసం .. నంద్యాల నుంచి జమ్మలమడుగు మండల పరిధిలోని మూడు రోడ్ల క్రాస్ వరకు 167వ జాతీయ రహదారుల పనులు చేపడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 22 కిలో మీటర్ల పనులు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తోంది. అయితే ఎస్ఆర్సీ కంపెనీ మాత్రం తమకు పదివేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కావాలని దానికి సంబంధించిన అనుమతులు కోరుతూ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారులు గ్రావెల్ తవ్వుకునేందుకు ఎక్కడ అనుమతులు ఇచ్చారో తెలియదు గాని తమకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో ఇటాచీలతో కంపెనీ మొత్తం కొండను తవ్వేస్తున్నారు. 30 నుంచి 50 ఎకరాల్లో... మండల పరిధిలోని కొత్తగుంటపల్లె సమీపంలో 30 నుంచి 50 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎస్ఆర్సీ కంపెనీ యాజమాన్యం తవ్వకాలు చేపట్టింది. భారీ వాహనాల ద్వారా ఈ ప్రాంతంలో గ్రావెల్ను బయటికి తీసి లారీల ద్వారా రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జమ్మలమడుగు పట్టణంలో నుంచి భారీ లారీల ద్వారా గ్రావెల్ను తీసుకెళుతున్నా ఎందుకు, ఎక్కడికి తీసుకెళుతున్నారని ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు సైతం ప్రశ్నించడం లేదు. దీంతో భారీగా గ్రావెల్ తవ్వుకుని రోడ్డు నిర్మాణానికి ఉపయోగించుకుంటున్నారు. తమకు సంబంధం లేదంటున్న ఆర్డీఓ... మండల పరిధిలోని కొత్తగుంటపల్లె ప్రాంత సమీపంలో నుంచి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో గ్రావెల్ అక్రమంగా తీసుకెళుతున్నారని ఆర్డీఓ సాయిశ్రీని ప్రశ్నించగా గ్రావెల్ తీసుకెళ్లేందుకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వాలి కానీ, అది తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. మేము అనుమతి ఇవ్వలేదు.. జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్ఆర్సీ కంపెనీకి సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంది. వారికి మైనింగ్కు సంబంధించిన అనుమతులు తాము ఇవ్వలేదని జిల్లా మైనింగ్ అధికారి వెంకటసాయి పేర్కొన్నారు. -
నేటి నుంచి ఉల్లి కొనుగోలు
కడప సెవెన్రోడ్స్: మార్క్ఫెడ్ ద్వారా గురువారం నుంచి జిల్లాలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి ఒక క్వింటాలు రూ. 1200 ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ, మైదుకూరు వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తాము పండించిన ఉల్లి పంటను ఇంటివద్దే శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని ఆమె కోరారు. పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం శ్రీరంగనాథుడు అశ్వవాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు. శుక్రవారం శ్రీరంగనాథుని కల్యాణాన్ని కల్యాణదుర్గం చల్లా వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా ఇన్ చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్గా (డీటీసీ) వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నగర శివార్లలోని ఊటుకూరు ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా డీటీసీగా విధులు నిర్వహిస్తున్న ఈయన్ను ఇన్చార్జ్ జిల్లా డీటీసీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ సమస్యలపై కార్యాలయంలో నేరుగా సంప్రదించాలన్నారు. -
ఇది ప్రజలను ముంచే ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను ముంచే ప్రభుత్వమని గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్పలతారెడ్డి విమర్శించారు. బుధవారం కడపలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కూటమి నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, దాన్ని పీ4కు అప్పగించామని చెప్పడం దారుణమన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించడం దురదృష్టకరమన్నారు. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయారన్నారు. ఉద్యోగులకు ఇంకా పీఆర్సీ ప్రకటించలేదని, ఐఆర్, డీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు కింద 80 శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చాలాచోట్ల అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద పాఠాలు వినాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లు పాడైపోయాయని, ఆర్ఓ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. ఈ సమావేశంలో 46వ డివిజన్ కార్పొరేటర్ ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి -
లింగ నిర్ధారణ పరీక్షలపై విచారణ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఓ నర్సు సిఫార్సుతో కర్నూల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఘటనపై జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. బద్వేల్కు చెందిన ఒక గర్భిణీ లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అక్కడే పని చేస్తున్న లత అనే నర్సును ఆశ్రయించింది. ఆమె సూచన మేరకు సదరు గర్భిణీ ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న ఒక హాస్పిటల్లో పని చేస్తున్న రూతు అనే స్టాఫ్నర్సు వద్దకు వెళ్లింది. స్టాఫ్ నర్సు కర్నూల్లోని ప్రసాద్ అనే ఏజెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్లమని గర్భిణీకి తెలిపింది. ఆమె కర్నూల్లో బస్సు దిగగానే అక్కడి ఏజెంట్ గర్భిణీని ఒక స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. అయితే ఆమెకు ఏడు నెలల గర్భం కావడంతో స్కానింగ్లో స్పష్టంగా కనిపించలేదని, నెల రోజులు గడచిన తర్వాత వస్తే మళ్లీ పరీక్షలు చేస్తామని చెప్పి పంపించాడు. అంతేగాక గర్భిణీ వద్ద రూ. 10 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే కర్నూలుకు వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే ఆమెకు అబార్షన్ అయింది. లింగనిర్ధారణ పరీక్షలు చేయనప్పుడు తమ డబ్బు ఇప్పించాలని బద్వేల్కు చెందిన మహిళ ప్రొద్దుటూరులోని నర్సును నిలదీసింది. ఈ విషయం బయటికి పొక్కడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీతా బుధవారం హాస్పిటల్కు వెళ్లి నర్సును విచారించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశామని, కర్నూల్లో స్కానింగ్ జరగడంతో అక్కడి వ్యక్తులు, స్కానింగ్ సెంటర్ వివరాలను కర్నూలు డీఎంహెచ్ఓకు తెలిపామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రొద్దుటూరులోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని అయితే తగు ఆధారాలుంటే తప్పకుండా స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామన్నారు. -
యూరియా స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన జేసీ
రాయచోటి : రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో ఉన్న యూరియా స్టాక్ పాయింట్లను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. బధవారం రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లి–2 లోని రైతు సేవాకేంద్రం, పట్టణంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులను బుధవారం పరిశీలించారు. యూరియా స్టాక్ను పరిశీలించి వ్యవసాయ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్తో కలిసి రాయచోటిలోని జాఫర్ సాబ్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఆ షాపు యాజమాన్యం నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. స్వామిత్ర సర్వే పరిశీలన... రూరల్ మండలం, దిగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న స్వామిత్ర సర్వే కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. మండల సర్వేయర్, పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు చేశారు. -
వైవీయూ భవనాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం అకడమిక్ బిల్డింగ్, ఆడిటోరియం, వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్ నిర్మాణాల శంకుస్థాపన శిలాఫలకాన్ని మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) కింద రూ.10.5 కోట్లతో యోగివేమన విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ కిచెన్ సెంటర్ ప్రారంభం చింతకొమ్మదిన్నె : రాష్ట్ర విద్య, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ చింతకొమ్మదిన్నెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ సెంటర్ను, ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. సాయంత్రం కొలుములపల్లి సమీపంలో కమలాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రారంభం పెండ్లిమర్రి : మండల కేంద్రం సమీపంలో నూతనంగా రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆ అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను, పరిపాలనా భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాపరంగా నాణ్యత పెంచడానికి సూచనలు అడిగారు. ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం ప్రారంభం కడప కార్పొరేషన్ : కొప్పర్తి పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని రాష్ట్ర విద్య, ఐటి, సాంకేతిక, ఆర్టీజీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రూ.31.50 కోట్లతో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం టెక్నోడోమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్ను సందర్శించి అక్కడ లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్ యూనిట్, డార్క్ రూమ్, ఈఎస్డీ ప్రొటెక్టెడ్ యూనిట్లను పరిశీలించారు. ఆ తర్వాత టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి యూనిట్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్ పాల్గొన్నారు. -
మొన్న కాలువ తీయించారు.. నిన్న పూడ్పించారు !
● రైతులతో అధికారుల చెలగాటం ● సాగునీటి సౌకర్యం కల్పించపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు ● గ్రీన్ఫీల్డుకు భూములిచ్చినా సాగునీరు లేకుండా చేస్తారా అని ఆవేదన గత నెల 22న రెవెన్యూ ఆధికారుల ఆదేశాలతో పోలీసుల సమక్షంలో తీయించిన పంట కాలువ మంగళవారం రోడ్డు నిర్మాణ అధికారులు పోలీసుల సమక్షంలో జేసీబీతో పంట కాలువ పైపులు తొలగిస్తున్న వైనం చాపాడు : మండలంలోని సోమాపురం గ్రామం వద్ద గ్రీన్ఫీల్డు హైవే నిర్మాణంలో వెళ్లిన పంట కాలువ పైపులను మంగళవారం మధ్యాహ్నం రోడ్డు నిర్మాణ అధికారులు తీయించారు. సాగునీటిని అందించే పైపులు తొ లగిస్తే నాటుకున్న వరి పైర్లు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీ సులు రైతులను అడ్డుకున్నారు. బాధిత రైతులు తెలిపి న వివరాల మేరకు.. బెంగుళూరు – విజయవాడ గ్రీన్ఫీల్డు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో మండలంలోని సోమాపురం వద్ద గల సర్వే నెంబరు 28–4బి2లో 8 ఎకరాల వ్యవసాయ సాగు భూమికి పంట లేకుండా పోయింది. అయితే రైతుల అవసరం మేరకు రోడ్డు నిర్మాణంలో పంట కాలువ కోసం పైపులు నిర్మించినప్పటికీ ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో పంట కాలువ సమస్యగా మారింది. ఈ క్రమంలో బాధిత రైతులైన అంకిరెడ్డిపల్లె రామచంద్రారెడ్డి, పెద్ద కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, భాస్కర్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డిలతో పాటు మరి కొంత మంది మహిళా రైతులకు చెందిన 8 ఎకరాల సాగుభూమికి సాగునీరు అందేలా పంట కాలువ ఏర్పాటు చేయాలని అధికారు లకు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో జమ్మలమడుగు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో గత నెల 19న రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా 22న రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పంట కాలువ తీయించారు. ఇదే పంట కాలువ విషయమైన 20న ఇరువర్గా ల వారు ఘర్షణ పడ్డారు. అయితే అప్పటి నుంచి అధికారులు తీయించిన పంట కాలువ ద్వారా బాధిత రై తులు వరి సాగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2న రోడ్డు నిర్మాణ అధికారులు పంట కాలువకు ఉండే పైపులను తొలగించారు. వీటిని తొలగిస్తే సాగునీరు ఎలా వస్తుందని, పంటలు ఎండిపోతాయని బాధిత రైతులు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భూములకు సాగు నీరు అందించే పంట కాలువ లేకుండా చేయడం ఏమిటని, దీనికి పోలీసులు సహకరిస్తే తాము పంటలు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు వాపోయారు. వారం రోజుల క్రితం పంట కాలువ తీయించిన అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా పంట కాలువ తీయించాలని కోరుతున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు వాపోయారు. -
కార్పెంటర్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య పరిస్థితుల కారణంగా మనస్తాపం చెంది ఉరి వేసుకుని కార్పెంటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని కోటవీధికి చెందిన నాగేంద్ర, శ్రీలత దంపతుల కుమారుడు టి.నాగరాజు(41) కార్పెంటర్గా పనిచేసేవాడు. అతనికి రామారావుకాలనీకి చెందిన వనితతో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్య వనిత 17 సంవత్సరాల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పట్టణంలో కార్పెంటర్ పనులు చేస్తూ జీవిస్తున్న నాగరాజు ఏడాది క్రితం పనులు చేస్తుండగా ఉలి తగిలి కాలికి గాయమైంది. సరైన చికిత్స తీసుకోకపోవడం, పైగా షుగర్ వ్యాధి సమస్య ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి గాయం పుండుగా మారింది. ఈ క్రమంలో రెండు నెలలుగా తిరుపతిలో చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో అక్కడి డాక్టర్లు కాలు తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చిన నాగరాజు మనస్తాపం చెంది ఐదురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం మండలంలోని కొత్తపల్లె పంచాయతీ వడ్డిపల్లె సమీపంలోని ఎలుకకుంట వద్ద అల్లనేరేడు చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఉరి నుంచి కిందకు దించి అతని పక్కనే ఉన్న బ్యాగును పరిశీలించగా, అందులోని ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
బాలుడిని గదిలో ఉంచి.. తాళం వేసిన అంగన్వాడీ టీచర్
● స్పృహ తప్పిపడిపోయిన వైనం ● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం బ్రహ్మంగారిమఠం : పిల్లలందరూ ఇంటికి వెళ్లారని భావించి ఓ బాలుడు లోపల ఉండగానే అంగన్వాడీ టీచర్ బడికి తాళం వేసుకుని వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుతో బడి తాళాలు పగులగొట్టి చూడగా బాలుడు లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఈ సంఘటన బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీ పీసీపల్లె అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. బాలుడి తండ్రి వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. వీరి కుమారుడు బత్తల హరికృష్ణ(5)ను రోజులాగే మంగళవారం కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రం టీచర్ చంద్రకళ, ఆయాలు పిల్లలను ఇళ్లకు పంపించి కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పెద్ద కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెతికారు. అనుమానంతో అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే తాము 11 గంటలకే అందరినీ ఇళ్లకు పంపించి వేశామని, తమకు తెలియదని చెప్పారు. కేంద్రం తాళాలు ఇవ్వండి లోపల ఏమైనా ఉన్నాడేమో చూస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా బాలుడు ఏడ్చి ఏడ్చి భయంతో అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే వారు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అంగన్వాడీ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోపోండి.. మీపైనే కేసు పెడతాం అంటూ వారు బెదిరిస్తున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
మహానేతకు ఘన నివాళి
వైఎస్సార్... భౌతికంగా మనిషి దూరమై పదహారేళ్లు గడిచాయి.. ఓ నాయకుడిగా ఆయన చేసిన మంచి ఇప్పటికీ ఉంది.. ఎప్పటికీ నిలిచే ఉంటుంది.. పేదల గుండె గడపల్లో ఆ నామం నిత్యం ధ్వనిస్తూనే ఉంది. ఆయన రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆ సత్యం నిరూపితమైంది. జోహార్..వైఎస్సార్ అనే నినాదం ఊరూరా మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. పల్లె..పట్టణం తేడా లేకుండా అభిమానులు అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు, పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కమలాపురంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న నరేన్ రామాంజులరెడ్డి పులివెందులలో రక్తదానం చేస్తున్న వైఎస్సార్ అభిమానులు పేదలకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పులివెందుల పట్టణంలోని భాకరాపురం వైఎస్సార్ ఆడిటోరియంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున యువతీ, యువకులు ఇందులో రక్తదానం చేశారు. పులివెందుల బైపాస్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలను అందంగా అలంకరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కడప కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళి అర్పించారు. కడప నగరంలోని హెడ్పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. యర్రగుంట్ల పట్టణంలో బస్టాండు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కమలాపురం వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కమలాపురం నియోజవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనాథ బాలుర క్షాత్రాలయంలో మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో మైదుకూరు రోడ్డులో అన్వర్ హాలు వద్ద, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మెన్ బి. లక్ష్మిదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారుమునిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నాగేంద్రారెడ్డి, ఆప్కాబ్ మాజీ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బద్వేల్ పట్టణంలోని గుంతపల్లె క్రాస్ రోడ్డు, బైపాస్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సేవలను స్మరించుకున్న నేతలు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు