మా ఇంటి స్థలాన్ని అధికార పార్టీకి చెందిన గంగవరం సూర్యసుమన్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శివారెడ్డి తదితరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వే నెంబరు 678/బిలో 11 సెంట్ల ఇంటి స్థలం మా తండ్రి పేరిట రిజిష్టర్ అయింది. ఆ స్థలానికి పక్కనున్న మూలే సుబ్బయ్య భార్య, కుమారుడు కలిసి మా స్థలంలో ఐదు సెంట్లు ఇతరులకు విక్రయించారు. కోర్టులో కేసు నడుస్తున్నా జేసీబీతో షెడ్డు తొలగించారు. అలాగే సర్వే నెంబరు 621లోని ఎనిమిది సెంట్ల స్థలం కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. – నత్తడ్ షావలీ, ఖాజీపేట


