Politics

‘బీఆర్ నాయుడు చేతగానితనం వల్లే టీటీడీలో అక్రమాలు’
సాక్షి,తిరుపతి: టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్ల తిరుమలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్రెడ్డి ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదైంది. ఆ అక్రమ కేసుపై భూమా అభినయ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడు భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వరుస వైఫల్యాలకు కారణం విజిలెన్స్ అధికారుల వైఫల్యమే. మీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్లే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మీ తప్పుడు కేసులకు భయపడే వ్యక్తి కాదు భూమన కరుణాకర్రెడ్డి. మీ తప్పులు సవరించుకోవాలి, మీరు మాపై ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజా గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారని’ ధ్వజమెత్తారు.

ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు.

కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్రెడ్డి చెప్పుకొచ్చారు.నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయిప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.

సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025
Sports

తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ పేరిట అక్రమాలు
తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తమ సంఘాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్హక్ కమిటీకి చైర్మన్గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్రాజ్తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.జాతీయ వెయిట్లిఫ్టింగ్ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్లోని ఓ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది.

IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయింది. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు. డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది. భారత్కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

ఆసీస్ భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో శుభారంభం లభించింది. ఓపెనర్లు అభిమన్యు ఈశర్వన్ (44), ఎన్ జగదీసన్ (50 నాటౌట్) తొలి వికెట్కు 88 పరుగులు జోడించారు. అనంతరం అభిమన్యు ఈశ్వరన్ను లియామ్ స్కాట్ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సాయి సుదర్శన్ (20 నాటౌట్) జగదీసన్తో కలిసి బాధ్యతగా ఆడుతున్నాడు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 28 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. ఈ దశలో వర్షం దంచికొట్టడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆ సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత-ఏ స్కోర్ వికెట్ నష్టానికి 116 పరుగులుగా ఉంది.అంతకుముందు ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ను 532 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియాకు ఆడిన ప్రసిద్ద్ కృష్ణ (16-0-86-0), ఖలీల్ అహ్మద్ను (15-0-80-1) ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. తనుశ్ కోటియన్కు (21-2-119-0) చుక్కలు చూపించారు. హర్ష్ దూబే (27-1-141-3), గుర్నూర్ బ్రార్ (19-2-87-2) వికెట్లు తీసినా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు.
National

రెండో మాజీ భర్త గుట్టు విప్పితే.. ప్రియుడేమో!
ప్రపంచం మొత్తమ్మీద ఏ గొడవకైనా రెండే రెండు కారణాలు ఉంటాయిట. మొదటిది నగదు. రెండోది మగువ అంటారు. కించపరచడం ఉద్దేశం కానే కాదు కానీ..మహిళలపై పురుషులకున్న వ్యామోహమనండి, వాంఛ అనండి.. ఇంకోటి అనండి అనేకానేక గొడవలకు కారణమవుతుందన్నది సత్యం. అసోమ్(అస్సాం) సివిల్ సర్వీసెస్ అధికారి నూపుర్ బోరా విషయమే తీసుకుందాం. అవినీతి ఆరోపణలతో ఆమెపై ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయి. సుమారు 92 లక్షల రూపాయల నగదు, రెండు కోట్ల రూపాయల విలువైన నగలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. కేసుకు సంబంధించి నూపుర్ బోరా బాయ్ఫ్రెండ్, రెవెన్యూ ఆఫీసర్ సుర్జీత్ డేకాను కూడా విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పోలీస్ రిమాండ్కు పంపారు. ఇక్కడితో స్టోరీ ఖతమైపోలేదు. షురూ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే..నూపుర్పై విజిలెన్స్ దాడులు జరగడంలో ముఖ్య పాత్ర ఆమె రెండో మాజీ భర్త. ఆయనిచ్చిన టిప్తోనే విజిలెన్స్ వాళ్లు ఆమెపై రెయిడ్ చేశారని తెలుస్తోంది. ఈయనతోపాటు అంతకుముందు ఇంకొకరితో నూపుర్కు వివాహం, విడాకులు రెండూ అయ్యాయి. ఆ తరువాత బాయ్ఫ్రెండ్తో కలిసి ఉంటోంది. బోరా పాపంలో ఇప్పుడు అతగాడి వాటాను తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. 2019లో అసోమ్ సివిల్ సర్వీసెస్లో చేరిన నూపుర్ కార్బీ అంగ్లాంగ్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత బార్పేట, కామ్రూప్ జిల్లాల్లో సర్కిల్ ఆఫీసర్గానూ సేవలందించారు. సివిల్ సర్వీసెస్లోకి చేరే ముందు ఇంగ్లీషు టీచర్గా పని చేసిన అనుభవమూ ఉంది.అవినీతి ఆరోపణలేమిటి?ప్రభుత్వ భూములను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు అక్రమంగా బదిలీ చేసిందన్నది నూపుర్పై ఉన్న అనేకానేక ఆరోపణల్లో ఒకటి. భూమికి సంబంధించిన విషయాలను సెటిల్ చేసేందుకు రూ.1500 నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసేదని చెబుతున్నారు. క్రిషిక్ ముక్తి సమితి అనే స్వచ్ఛంద సంస్థ, ఎమ్మెల్యేల అఖిల్ గొగోయ్ వంటివారు నూపుర్ అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు కూడా. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యవేక్షణలో ఉండే.. సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ ఆర్నెలుగా నిఘా ఉంచింది. ఆఖరికు ఆకస్మిక తనిఖీలతో అరెస్ట్ చేసింది. నగదు, నగలతోపాటు నూపుర్ అవినీతికి ఆనవాళ్లుగా గౌహతిలో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల రూపాయల విలువైన నగల్లో పద్నాలుగు బంగారు గొలుసులు, 15 వజ్రపుటుంగరాలు, మూడు వజ్రాల గాజులు ఉన్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే.. నూపుర్ ఇరువురు మాజీ భర్తలు కూడా రెవెన్యూ ఆఫీసర్లే కావడం.

గడ్చిరోలిలో ఎన్కౌంటర్
ముంబై: గడ్చిరోలిలో ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతబలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం ఉదయం మహరాష్ట్ర పోలీసులు,భద్రత బలగాలకు గడ్చిరోలి జిల్లాలోని దండకారణ్యంలో ఎటపల్లి తాలూకాలోని మోదస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి. గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ-నక్సల్ కమాండో దళం సీ-60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుండి పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. సీ-60 దళం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోల ఎదురు కాల్పులు పోలీసులు తిప్పికొట్టారు. ఇద్దరు మహిళా నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లోని ధార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్లోని మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB— BJP (@BJP4India) September 17, 2025ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు.

8 లక్షల రేషన్ కార్డుల రద్దు!
కర్ణాటక: రాష్ట్రంలో అక్రమంగా కలిగిఉన్న బీపీఎల్ కార్డులను రద్దు చేయడంపై బుధవారం ఉదయం ముఖ్యమైన సమావేశం జరుగుతుందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప చెప్పారు. రేషన్ కార్డుల సమస్యల పరిష్కారం గురించి అందులో మాట్లాడుతానని మంగళవారం బెంగళూరులో తెలిపారు. రేషన్ పంపిణీ భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. 6 లక్షల కార్డులకు ఈకేవైసీ లేదు రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీపీఎల్ కార్డులు రద్దు అయ్యే అవకాశముందని తెలిసింది. పేదలు కాకపోయినా ఈ కార్డులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం కనుగొంది. సర్కారు సర్వేలో మొత్తం 12,68,097 అనుమానాస్పద రేషన్ కార్డులు బయటపడ్డాయి. 19,690 మంది నియమాలకు విరుద్ధంగా బీపీఎల్ కార్డులు కలిగిఉన్నారు ఏటా రూ.25 లక్షలకు పైగా లావాదేవీలు కలిగినవారు 2,684 మందికి కార్డులు ఉన్నాయి. 6,16,196 మంది కార్డుదారులు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. ఏటా రూ.1.20 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన కార్డుదారులు 5,13,613 మంది ఉన్నారు. అంతర్రాష్ట్ర కార్డుదారులు 365 మంది, 7.5 ఎకరాల కంటే అధిక భూమి ఉన్న 33,456 కుటుంబాలు రేషన్ తీసుకుంటున్నాయి. ఆరు నెలల నుంచి రేషన్ పొందని కార్డుదారులు 19,893 మందిగా తేలింది. 1,146 కార్డులు మృతుల పేర్లతో ఉన్నాయి. 119 మంది కార్డుదారులకు సొంత కార్లు, జీప్లు ఉన్నాయి. ఇలా అనేక అవకతవకలు బయటపడడంతో ఆ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
International
NRI

గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి)

శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి
శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్ ఎ విలేజ్ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది. తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)

డల్లాస్ ఎన్నారై హత్య: ప్రాణభయంతో నాగమల్లయ్య..
అమెరికా టెక్సాస్ డల్లాస్ నగరంలో జరిగిన ఎన్నారై దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటక మూలాలున్న చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య(50)ను యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డల్లాస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్లో డౌన్టౌన్ సూట్స్ మోటల్ ఉంది. ఇందులో చంద్ర నాగమల్లయ్య(50) మేనేజర్గా పని చేసేవాడు. అదే హోటల్లో క్యూబాకు చెందిన యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ సిబ్బందిగా పని చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీన నాగమల్లయ్య పాడైపోయిన వాషింగ్ మెషిన్ విషయంలో కోబాస్కు ఏదో సూచన చేశాడు. అయితే అది నేరుగా చేయకుండా.. పక్కన ఉన్న మరో మహిళా సిబ్బందికి చెప్పి అతనికి చెప్పమన్నాడు. ఇది కోబాస్కు కోపం తెప్పించింది. తన గదిలో ఉన్న కత్తితో నాగమల్లయ్యను కోబాస్ వెంటాడి చంపాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్లో నాగమల్లయ్యను కోబాస్ ఆ మోటల్ కారిడార్లో కత్తితో వెంబడించిన దృశ్యాలు రికార్డయ్యాయి. నాగమల్లయ్య కొడుకు(18)బేస్బాల్ బ్యాట్తో కోబాస్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. నాగమల్లయ్యను అతని భార్యాకొడుకు ముందే కిరాతకంగా తలనరికి చంపాడు కోబాస్. అంతటితో ఆగకుండా.. ఆ తలను కాలితో ఫుట్బాల్లాగా తన్నాడు. అది కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్లాక.. దానిని చెత్తబుట్టలో పడేశాడు. ఇది కూడా అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యింది. ఆపై పోలీసులు హత్యానేరం కింద కోబాస్ను అరెస్ట్ చేసింది. తొలుత క్షణికావేశంలో జరిగిన హత్య అని.. కాదు జాత్యాంహకార హత్య అని.. ఇలా రకరకాల కోణాల్లో చర్చ జరిగింది. అయితే.. నిందితుడు యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) అందించిన వివరాల ప్రకారం.. కోబాస్-మార్టినెజ్కు క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారు. పైగా అతనిపై అమెరికాలోనే ఇంతకు ముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేరచరిత కూడా ఉంది. అయితే.. క్యూబా ప్రభుత్వం అతనిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద Immigration and Customs Enforcement కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆనాడు అలా విడుదల చేయకుంటే లీగల్గా సమస్యలు ఎదురయ్యేవి. ఈ ఘటనపై భారతీయ సమాజం, అంతర్జాతీయ వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ హత్య.. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, అలాగే ప్రవాస భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. “బాబ్” అనే ముద్దుపేరుతో స్నేహితులు పిలిచే నాగమల్లయ్యను కర్తవ్యపరుడని, మానవతావాదిగా గుర్తు చేస్తోంది. మరోవైపు.. భారతీయ కమ్యూనిటీలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఫ్యూనరల్ ఖర్చులు, కుమారుడి విద్యా ఖర్చుల కోసం ఫండ్ రైజర్ ఏర్పాటు చేశాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Sakshi Originals

అతివకు.. 'పాష్ప'తాస్త్రం!
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో టాప్–30 సంస్థలలో.. గతేడాది లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మహిళా ఉద్యోగులు తమ సమస్యల గురించి గొంతు విప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారనడానికి ఇది సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సంస్థలు కూడా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2023–24లో వచ్చిన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్బీఎస్ఈలోని టాప్–30 కంపెనీలకు.. తమ మహిళా ఉద్యోగుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 958 ఫిర్యాదులు అందాయి. 2023–24లో వీటి సంఖ్య 902. అంటే ఏడాదిలో ఫిర్యాదుల సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఫిర్యాదుల్లో పెరుగుదలకు ‘పాష్’ చట్టమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.ఏమిటీ పాష్ చట్టం?ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ (పాష్) యాక్ట్ను అధికారికంగా ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013’ అని పిలుస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకారానికి వ్యవస్థలను ఏర్పాటుచేసి కంపెనీలు ఊరుకోవడం లేదు. ఫిర్యాదుల పట్ల కూడా సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసమూ చర్యలు చేపడుతున్నాయి. 2023–24లో టాప్–30 బీఎస్ఈ కంపెనీలలో పాష్ కింద నమోదైన 902 కేసుల్లో 88% పరిష్కారం అయ్యాయని లైంగిక వేధింపుల నివారణపై కంపెనీలకు సలహాలు ఇస్తున్న ‘కంప్లైకరో’ అనే సంస్థ తెలిపింది. ‘ఇది గొప్ప మార్పునకు సూచిక’ అని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణభారత ప్రభుత్వ షీ–బాక్స్ పోర్టల్లో అన్ని కంపెనీలు (పెద్దవి లేదా చిన్నవి) తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కార్మిక కమిషనర్లు సర్వేలు చేయాలని ఆదేశించింది. అన్ని కంపెనీలు ఒకేచోట నమోదు కావడంతో షీ–బాక్స్ పోర్టల్లో బాధితులు తమ పాష్ ఫిర్యాదును దాఖలు చేయడం సులభతరమైంది. విచారణ ప్రక్రియను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందనే విషయం ఉద్యోగికి మరింత ధైర్యం, ఊరటనిస్తుందని నిపుణులు అంటున్నారు. పాష్ ఫిర్యాదులు, నిబంధనల అమలులో ప్రస్తుత సంవత్సరం ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్టు కంప్లైకరో వెల్లడించింది. పాష్ చట్టాన్ని పాటించడానికి పెద్ద కంపెనీలే కాదు, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల నుంచి రోజుకు సగటున 7–8 ఫిర్యాదులు వస్తున్నాయని వివరించింది.అవగాహన పెరిగిందిపాష్ ఫిర్యాదులు పెరగడం అంటే.. పని ప్రదేశాల్లో సమస్యల పట్ల బాధితులు తమ గొంతు వినిపించడానికి ధైర్యంగా ముందుకు రావడమేనని హెచ్ఆర్ నిపుణులు అంటున్నారు. ‘సంవత్సరాలుగా బాధితులు నిశ్శబ్దంగానే ఉన్నారు. పాష్ పట్ల మహిళల్లో అవగాహన పెరిగింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం పెరుగుతోంది. అందుకే ధైర్యంగా ఎక్కువ మంది ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు’ అని వారు చెబుతున్నారు. బ్యాంకుల నుంచే ఎక్కువఆసక్తికర విషయం ఏమంటే బీఎస్ఈ టాప్–30 కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫిర్యాదులలో బ్యాంకు ఉద్యోగుల నుంచి 34% ఫిర్యాదులు వస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి 31.5% వచ్చాయి. మూడింట రెండు వంతులు లేదా 627 ఫిర్యాదులు ఈ రెండు రంగాల నుంచే అందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గరిష్టంగా 125 ఫిర్యాదులను అందుకుంది. 2023–24లో ఈ సంస్థలో 110 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 117 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఫిర్యాదుల పరంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది.

ఒకటి కాదు.. మల్టిపుల్ రిటైర్మెంట్స్ కావాలి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్ఎస్బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్మెంట్లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి. ముందు వరుసలో భారతీయులుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ కల్చర్కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్ను డిజిటల్ నేటివ్స్గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇలా కెరీర్లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ అంటే... మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు. కొత్త బాటలో.. బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్ఎస్బీసీ అధ్యయనకర్తలు సర్వేలోని ముఖ్యాంశాలు..» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది. » తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం. » ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. » మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్మెంట్తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. » పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. » బహుళ రిటైర్మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం. నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం. » ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం. » కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం.

గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్
సమూలంగా మార్చేద్దాం: సీఎం రేవంత్
ఇంకెతసేపు తయారవుతార్సార్! త్వరగా వచ్చేయండీ!
మళ్లీ అమెరికాతో నెయ్యం
వార్తలు రాయడమే నేరమా?
అతడికి 22, ఆమెకు 35.. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ
జాన్ అలుకాస్ కార్ల కలెక్షన్లో ఈ కొత్త కార్ హైలైట్..
హాలీవుడ్ బ్యూటీకి జాక్పాట్.. ఏకంగా రూ.530 కోట్లా?
స్వదేశీ రక్షణ రంగ బలోపేతం ద్వారానే దేశ భద్రత
మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి
హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
ఈ ఒక్కదానిలో విఫలమయ్యామంటే.. మిగతా అన్నింట్లో సఫలమయ్యాం అనుకుంటారని..!
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
..రద్దు చేస్తారేమోననిపిస్తోంది సార్!
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్!
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం
క్రైమ్

పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య
మూసాపేట: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసాపేట యాదవ బస్తీలో నివాసముండే సూరవరపు రమ్య (18)కు మూడు నెలల క్రితం అశోక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూతురు, అల్లుడు అత్తింట్లోనే ఉంటున్నారు. సోమవారం రాత్రి అందరు కలిసి భోజనం చేసిన అనంతరం..రమ్య ముందుగా తన రూమ్కు వెళ్లి ఫ్యాన్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త భోజనం ముగించి రూముకు వెళ్లగా డోర్ తెరుచుకోలేదు. దీంతో అందరూ కలిసి తలుపులు తెరవగా రమ్య ఫ్యాన్కు వేలాడుతూ కని్పంచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మిస్టరీ వీడేదెన్నడు?
శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సతీష్ కుమార్ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.గదిలోనే కిరణ్ దారుణ హత్యమహారాష్ట్రకు చెందిన కిరణ్(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లుకదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల సెల్ఫోన్కు అందిన కాల్స్ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్జైలు ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్హౌస్లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి.

Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్రెడ్డిని మేడ్చల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Warangal: యూరియా కోసం రైతుల అవస్థలు


Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు


ఎన్టీఆర శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డుప్రమాదం


హైదరాబాద్ లో మెట్రో సేవలు బంద్?


పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని BRS డిమాండ్


అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


ఈ-ఫార్ములా రేసు సంస్థకు 44 కోట్లు విడుదలకు బాధ్యుడిని తానేనని చెప్పిన KTR


మూసీ వాగులో చిక్కుకున్న 20 మేకలు, ఇద్దరు కాపరులు


Road Accident: ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ సౌమ్య రెడ్డి మృతి


వర్షంలో కొట్టుకుపోయిన మామాఅల్లుళ్లు