Politics
ఎదురు మాట్లాడను.. ప్రెస్మీట్ పెట్టను: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: మహిళలంటే తనకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ'ని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్మీట్కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడని, ఆయన విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.ప్రశ్నిస్తూనే ఉంటాతన నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతానని, ఈయకపోతే దీక్షకు దిగుతానని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్!
‘రాహుల్.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’
వరంగల్: పాలిటెక్నిక్ విద్యార్థులపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్కు పట్టవా?అని నిలదీశారు హరీష్రావు.‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: వేటేస్తారా?.. వదిలేస్తారా?
‘100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానన్న హోంమంత్రి ఎక్కడ?’
సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
దొంగ ఎవరో తెలిసి కూడా.. పూజారుల్ని బలిచేస్తున్నారా?
సాక్షి, గుంటూరు: పొన్నూరు ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. పూజారులను సస్పెండ్ చేశారంటూ మండిపడుతున్నారు. పైగా కొత్త మంగళసూత్రం సమర్పించే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో.. గురువారం అమ్మవారికి తానే కొత్త మంగళసూత్రం సమర్పించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ, తప్పడం లేదు. 14వ తేదీన అమ్మవారి మంగళసూత్రం పోయింది. మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇది అశుభం. మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం ప్రకటించలేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. అమ్మవారి మెడలో పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం పోయిందని కబుర్లు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి వేయాలని ఆలయ అధికారి బసవ శంకర్ చూశాడు. అలాంటప్పుడు ఈవో, సీనియర్ అసిస్టెంట్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అమాయకులైన పూజారులనే ఎందుకు సస్పెండ్ చేశారు?.. దొంగ ఎవరో తెలుసు... కావాలనే బయట పెట్టలేదు. ఇవాళ మంగళసూత్రాలు ఇచ్చాం. నాను తాడు సెప్టెంబర్ 3వ తేదిన అందిస్తాం అని అంబటి మురళి పేర్కొన్నారు. పరువు నష్టం నోటీసులపై స్పందనఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా మారాడు. నాపై పరువు నష్టం దావా వేశాడు. రూ. 5 కోట్లకు నోటీసులు పంపించారు. ఆయన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టాడు. ఆ ఐదు పైసలు నేనే ఇస్తాను. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి అని అమ్మవారిని అంబటి మురళి వేడుకున్నారు. పూజారుల ఉసురు తగులుతుంది: ఆరే శ్యామలమంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. ‘‘అర్చకులను దొంగతనంలో భాగస్వాములను చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా?. పూజారుల ఉసురు తగులుతుంది. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వపైనే ఉంది’’ అని అన్నారామె.
Sports
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. 18 ఏళ్ల తర్వాత
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఫాలో- ఆన్లో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతంగా పోరాటం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదో రోజు ఆట ప్రారంభానికి శ్రీలంక చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి భారత్ మ్యాచ్ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి రోజు ఆటలో కథ తారుమారైంది. దినుషతో పాటు టెయిలాండర్లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ను ముగించలేకపోయాడు. ఆఖరికి గిల్ కూడా రంగంలోకి దిగి బౌలింగ్ చేశాడు. చివరి వికెట్ పడగొట్టేందుకు పార్ట్-టైమ్ స్పిన్నర్గా మారిన గిల్.. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు ఇచ్చాడు. వికెట్ ఏమీ తీయనప్పటికీ గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.గత 18 ఏళ్లలో శ్రీలంక గడ్డపై బౌలింగ్ చేసిన తొలి భారత టెస్టు కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2008 లంక టూర్లో అప్పటి భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలింగ్ చేశాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే సరసన శుబ్మన్ చేరాడు.చదవండి: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. ఆట బాయ్కట్ చేస్తామంటూ పాక్ బెదరింపులు!
లార్డ్స్ టెస్ట్లో పొలిటికల్ హీట్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బెదిరించిన పీసీబీ!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట లంచ్ విరామం సందర్భంగా ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. లంచ్ బ్రేక్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో బ్రిటీష్ బ్రాడ్కాస్టర్ 'స్కై స్పోర్ట్స్' ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే ఈ ఇంటర్వ్యూను లంచ్ విరామంలో ప్రసారం చేయవద్దని స్కై స్పోర్ట్స్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేస్తే ఆటను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించినట్లు 'ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో' తమ కథనంలో పేర్కొంది. కానీ పీసీబీ బెదిరింపులు పట్టించుకోని స్కై స్పోర్ట్స్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూను టెల్కాస్ట్ చేసింది. ప్రసారం అయినప్పటికి పాక్ ఆటగాళ్లు లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెద్దలు పీసీబీ అధికారులతో చర్చలు జరిపి శాంతింపజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇమ్రాన్ కుమారులు సులైమాన్, కాసిమ్లతో ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ అథర్టన్ 18 నిమిషాల పాటు నిర్వహించారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ప్రధాన మంత్రికి రాసిన లేఖ రాసిన 21 మంది కెప్టెన్లలలో మైఖేల్ అథర్టన్ ఒకరు. ఇక జైలులో ఉన్న తమ తండ్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆథర్టన్తో ఇంటర్వ్యూలో సులైమాన్, కాసిమ్లు ఆందోళన వ్యక్తం చేశారు.Complete interview of Former PM Imran Khan’s sons Sulaiman Khan and @Kasim_Khan_1999 with @Athersmike today on Sky Sports.They spoke about Imran Khan’s arbitrary torturous solitary confinement, lack of family meetings, his deteriorating health, and more.… pic.twitter.com/EQEfTfWHXb— PTI UK (@UKPTIOfficial) August 27, 2026చదవండి: PAK vs ENG: ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తున్న పాకిస్తాన్
PAK vs ENG: ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తున్న పాకిస్తాన్
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు... రెండో టెస్టులో ఫర్వాలేదనిపించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఆటకు వరుణుడు ఆటంకం కలిగించగా... వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (80 బంతుల్లో 61; 10 ఫోర్లు), జోర్డాన్ కాక్స్ (105 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ జో రూట్ (4), ఎమిలియో గే (8), బెన్ డకెట్ (17), హ్యారీ బ్రూక్ (15), డాన్ లారెన్స్ (17) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఒత్తిడి కొనసాగించిన పాక్ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. అట్కిన్సన్ (27 బంతుల్లో 34 బ్యాటింగ్; 5 ఫోర్లు), జోష్ టంగ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తుది జట్లుపాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, అజాన్ అవైస్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్, బాబర్ ఆజం(కెప్టెన్), సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అలీ ఉస్మాన్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీఇంగ్లండ్: బెన్ డకెట్, ఎమిలియో గే, జోర్డాన్ కాక్స్, జో రూట్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, డాన్ లారెన్స్, జామీ స్మిత్(వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్చదవండి: వారసులొచ్చారు
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్లో అమెరికా దిగ్గజం ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. తద్వారా ఈ చారిత్రత్మక రికార్డును ప్రజ్ఞానంద తన పేరిట లిఖించుకున్నాడు. అదేవిధంగా ఛాంపియన్గా నిలిచిన ప్రజ్ఞానందకు దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్లో నేరుగా పాల్గొనే అర్హతను అతడు దక్కించుకున్నాడు.చదవండి: వారసులొచ్చారు
National
‘ఈ బంధం అబద్ధమా..’.. ఇకపై క్లింటన్కు ‘రాఖీ’ లేదు!
జైపూర్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు రాఖీ కట్టి వార్తల్లో నిలిచిన రాజస్థాన్కు చెందిన మోహిని దేవి గత మార్చి నెలలో కన్నుమూశారు. దీంతో గత 26 ఏళ్లుగా భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ఓ అరుదైన, ఆత్మీయ అనుబంధం ముగిసింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో గల నాయ్లా గ్రామాన్ని సందర్శించారు.ఆ సమయంలో పంచాయతీ రాజ్ మహిళా సాధికారతను పరిశీలించేందుకు వచ్చిన క్లింటన్కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఆ సందర్భంగా గ్రామానికి చెందిన మోహిని దేవి క్లింటన్కు హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్ది రాఖీ కట్టారు. ఆ సమయంలో క్లింటన్ ఆమెతో కలిసి స్థానిక రాజస్థానీ గీతాలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పర్వదినాన మోహిని దేవి క్లింటన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రాఖీలు పంపడం ఆనవాయితీగా కొనసాగించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా ఈ రాఖీలు వైట్హౌస్కు చేరేవి. దీనికి ప్రతిగా బిల్ క్లింటన్ కూడా ఆమెకు ప్రత్యేక లేఖలు, కానుకలు పంపేవారు. మోహిని దేవి భద్రపరుచుకున్న ఆ లేఖలు, కానుకలు, జ్ఞాపకాలు వీరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. మోహిని దేవి మృతితో నాయ్లా గ్రామంతో పాటు ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్లైన్’ ప్రకటించిన పోలీసులు
అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్లైన్’ ప్రకటించిన పోలీసులు
న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ ఢిల్లీ, నోయిడాల నుంచి స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వే స్తంభించిపోయింది. గురువారం (ఆగస్టు 27) సాయంత్రం నుంచి ఎక్స్ప్రెస్వేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు దాదాపు 5 నుంచి 6 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఘజియాబాద్ మీదుగా వెళ్లే ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేతో పాటు నోయిడా-గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రహదారుల్లోనూ తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.నోయిడా సెక్టార్ 62 నుంచి దాస్నా వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పండుగ షాపింగ్ కోసం మార్కెట్లకు భారీగా జనం తరలిరావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా 10-15 నిమిషాల్లో ప్రయాణించే 4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ట్రాఫిక్ నియంత్రణకు ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ను (9643322904) ఏర్పాటు చేశారు. లాల్ కువాన్ వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. చిజ్జార్సీ సమీపంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. Ghaziabad: Raksha Bandhan की पूर्व संध्या पर Delhi-Meerut Expressway पर लगा भीषण जाम। 🚨🚗 pic.twitter.com/KFDEZhI4c0— Greater Noida West (@GreaterNoidaW) August 27, 2026ఘజియాబాద్ నుంచి మీరట్ వెళ్లేవారు దాస్నాకు ముందున్న కనెక్టర్ల ద్వారా ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ, ఘజియాబాద్ వాసులు మురాద్నగర్, మోదీనగర్ మీదుగా పాత జాతీయ రహదారిలో వెళ్లవచ్చు. మీరట్ ప్రయాణికుల కోసం ఎన్సీఆర్టీసీ నమో భారత్ రైళ్ల సర్వీసులను పెంచి ప్రతి 8 నిమిషాలకొకటి చొప్పున 47 అదనపు ట్రిప్పులను నడుపుతోంది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపడే గుడ్ న్యూస్.. ఇక నో ఫెయిల్!
ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్
ఢిల్లీ: నీట్, జేఈఈ లాంటి కీలక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కీలక నియామకాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ కేడర్కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ను ఎన్టీఏ డైరెక్టర్గా నియమించింది. ఐదేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (DoPT) గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ప్రసన్న వెంటేష్తో పాటు 2012 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్ను ఎన్టీఏకు మరో డైరెక్టర్గా నియమించారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేశ్, రవి కుమార్ సింగ్ ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. ఏది ముందైతే అప్పటివరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు.ప్రసన్న వెంకటేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. మరోవైపు రవి కుమార్ సింగ్ కేంద్ర డిప్యుటేషన్కు కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయనను ఎన్టీఏ డైరెక్టర్గా నియమించారు.ఇదే సమయంలో 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్) అధికారి అమిత్ సాందారియాను NTA జాయింట్ డైరెక్టర్గా నియమించారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాలో ఆయన నాలుగేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దాని ప్రక్షాళనకు దిగిన కేంద్రం.. పలువురిని తప్పించింది కూడా. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎవరీ ప్రసన్న వెంకటేశ్?2012 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వీ ప్రసన్న వెంకటేశ్. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. ఐఏఎస్లోకి వచ్చిన తర్వాత పాడేరు సబ్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించి, అనంతరం ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు.విజయవాడ మున్సిపల్ కమిషనర్గా 2019లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్, నగర హరితీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై నుంచి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్గా ఐదేళ్ల కాలానికి నియమించింది. దేశవ్యాప్తంగా NEET, JEE వంటి కీలక పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ కీలక పాత్ర పోషిస్తుండడం, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనలో అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేశ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: ఇక నో ఫెయిల్.. స్టూడెంట్స్కు గుడ్న్యూస్
అసెంబ్లీలో సీఎం విజయ్ కొత్త రూల్.. ప్రతిపక్షాల అభ్యంతరం
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం ఆసక్తికరంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్ కుర్చీకి సమీపంలో సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక సీటులో కూర్చునే ఆయన.. తొలిసారి ఆ స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయ్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కుడివైపున ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీటు ఉంటుంది. ఆయన పక్కనే మంత్రులు వారి సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం సమావేశాల సందర్భంగా విజయ్ తన సీటు నుంచి లేచి.. సభా నాయకుడు, మంత్రి కేఏ సెంగొట్టయ్యన్, మరో మంత్రి ఆధవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విజయ్ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని.. పాలనకంటూ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయని.. వాటిని ఆయన పాటించాలని సూచించాయి. అయితే సహచర మంత్రులతో మాట్లాడేందుకే ఆయన ఇలా స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. CM Vijay is in some discussion with Minister KAS pic.twitter.com/CynRjQChQB— Actor Vijay FC (@ActorVijayFC) August 27, 2026సాధారణంగా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు తమ సహచరులతో మాట్లాడేందుకు కొద్దిసేపు సీట్లు మారడం కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల కోసం ఉద్దేశించిన సీటులో కూర్చోవడం మాత్రం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా.. సభలో అధికారుల గైర్హాజరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్న సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీలోనే ఉండేలా చూడాలని స్పీకర్ను కోరారు. గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్తో పాటు చీఫ్ సెక్రటరీ, శాఖల కార్యదర్శులు సభలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం, ఉన్నతాధికారులు సభలో కనిపించడం లేదని విమర్శించారు.దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న ‘వార్ రూమ్’లో ఉండి, సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయనిధి సూచనతో ఏకీభవించిన స్పీకర్.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీనియర్ అధికారులు సభలోనే ఉండేలా ఆదేశిస్తామని చెప్పారు. అంతకుముందు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం విజయ్.. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు.ఇదీ చదవండి: రాఖీ పండుగను రాజకీయం కోసం వాడేసుకుంటున్నారా?
International
NRI
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నిజామాబాద్అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన రాహుల్ చివరి సారిగా తన తల్లితో ఫోన్లో ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు మాట్లాడాడు. తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలోనే స్నేహితులు క్యాబ్లో రావడంతో ‘‘ఆఫీస్కు వెళ్తున్నానని, రేపు ఉదయం నువ్వే కాల్ చెయ్ మమ్మీ..’’ అంటూ ఫోన్ కట్చేశాడు. అవే రాహుల్ చివరి మాటలు అంటూ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవీపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నాగమణి, హరిబాబు జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమణి గృహిణి కాగా, హరిబాబు రైల్వేలో ఏఎస్సైగా పని చేసి రిటైర్ అయ్యారు. కొడుకు రాహుల్ నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న రాహుల్ అక్కడే పీహెచ్డీ పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మే 5వ తేదీన తన చెల్లె పెళ్లికి ఇంటికొచ్చిన రాహుల్ అదే నెలలో 18వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. తన తల్లితో సోమవారం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే రాహుల్ దుర్మరణం పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుంబెలుబాదుకుంటున్నారు. తన కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తండ్రి హరిబాబు రోదిస్తూ వేడుకుంటున్నాడు.
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్లో ప్రకృతి విలయ తాండవం
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్బుక్లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనలో చాలామంది స్టిక్కీ నోట్ను కేవలం షాపింగ్ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే..ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్ బుక్లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.ప్రశంసల జల్లులుపుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. View this post on Instagram A post shared by Varnam MY (@varnammalaysia)– పుష్యజ్యోతి రవికుమార్ (చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
Sakshi Originals
భారత్కు మెడోగ్ ముప్పు?
నేపాల్లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టమూ తీవ్రంగానే ఉంది. అయితే నేపాల్ కాదు కానీ... భారత్ ఇలాంటి మరో ముప్పు ముంగిట్లో ఉందా? అవునంటున్నారు నిపుణులు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఇందుకు కారణమంటున్నారు వారు. మెడోగ్ పవర్ స్టేషన్గా పిలుస్తున్న ఈ భారీ డ్యామ్ను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో అరవైవేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యార్లుంగ్ సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా ఆ తరువాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మెడోగ్ పవర్స్టేషన్ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండటం ఒక కారణమైతే... ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూండటం ఇంకో కారణం. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపి.. మెడోగ్ పవర్స్టేషన్ పైజెన్ ఫాల్ట్పైనే ఉందని తేల్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా దాని ప్రభావం దిగువన ఉన్న మనపై పడుతుంది. యార్లుంగ్ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం... దిగువన మనం ఉండటం భారత్ ఆందోళనకు మరో కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా మనకు వరద ముప్పు తప్పదన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్ ప్రదేశ్తోపాటు అసోం, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశముంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల తగ్గి వ్యవసాయానికి సమస్యలొస్తాయి. అయితే... మెడోగ్ వపర్ స్టేషన్తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీగార్జెస్ డ్యామ్ కంటే పెద్దదైన మెడోగ్ బలాన్ని తట్టుకోగలదా అన్నది ప్రశ్న!!! – సాక్షి, నేషనల్ డెస్క్
రీల్స్తో రీచ్
సోషల్ మీడియా రీల్స్. ప్రస్తుతం దేశాన్ని కమ్మేస్తున్న మేనియా ఇదే. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్లో రీల్స్ను స్క్రోల్ చేయడం సర్వ సాధారణ మైపోయింది. భారతీయ మార్కెట్ను సైతం రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు.. వివిధ ఉత్పత్తులతో సరిపోల్చేందుకు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా సగటు భారతీయులు రీల్స్పైనే ఆధార పడుతున్నారు. ప్రధానంగా జెన్జీ తరం సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలను సైతం రీల్స్ మేనియా ప్రభావితం చేస్తోందని మెటా తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా కాస్మొటిక్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, క్రీడలు, ఇతర యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలను సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. రీల్స్ చూడాలి.. తరువాతే కొనాలి⇒ జెన్జీ తరంలో 81 శాతం మంది కొత్త ఉత్పత్తుల గురించి రీల్స్ ద్వారానే తెలుసుకుంటామన్నారు. వాటిలో 66 శాతం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. 47 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ⇒ 76 శాతం మంది మహిళలు తమ కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల్లో 76 శాతం మంది ఆర్థిక విషయాలపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రీల్స్పై ఆధారపడుతున్నారు.‘మెటా’ ఏం తేల్చిందంటే..⇒ ‘మెటా ఇంపోసోస్ –2026’ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైన రీల్స్ చూడాల్సిందే⇒ భారత్లో మెటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖాతాదారుల్లో 90 శాతం మంది రీల్స్ను చూస్తున్నారు. అతి తక్కువ నిడివి గల వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.⇒ జెన్జీ తరానికి చెందిన వారిలో 98 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తున్నట్టు చెప్పారు. ⇒ మెటా ఖాతాదారులైన మహిళల్లో 96 శాతం మంది రోజుకు ఒక్కసారైన రీల్స్ చూస్తామన్నారు.⇒ అధిక ఆదాయం కలిగిన వర్గాల్లో 88 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తామన్నారు.
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్తో పాటు భారత్లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట!
ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
అక్కడ వినూత్నంగా రక్షాబంధన్..చెట్టుకు రాఖీ..!
సీఎం రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
కికు చిరంజీవి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
పాకిస్థాన్కు సిమ్ కార్డులు పంపిన దంపతులు అరెస్ట్!
ఇంత క్రూరత్వమా?.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
వెస్టిండీస్ గడ్డపై పాక్ ఓపెనర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్స్లతో
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్కు సూటి ప్రశ్న
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
..కరువెక్కడా కనపడి చావదేం!!
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
'రవితేజను ఓ బూతు మాట అనాలి.. నా వల్ల కాలేదు'
రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే!
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
‘ఇడుపు కాయితం’.. ఆకట్టుకుంటున్న ‘శ్రీలత సాంగ్’ ప్రోమో
క్రైమ్
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్ఖాన్ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!
అమెరికాలో నగర యువతి హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి
మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!
మలికిపురం/యలమంచిలి: అప్పుల బాధ తట్టుకోలేక.. మూడేళ్ల కుమారుడిని వంతెనపై వదిలేసిన దంపతులు గోదావరి నదిలో దూకేశారు. వారి కోసం పోలీసులు, స్థానికులు నదిలో గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) కొంతకాలం వేల్పూరులో ఉన్నారు. డ్రైవర్గా పని చేసే సాయి అప్పుల పాలై, వాటిని తీర్చలేక కొన్నాళ్ల క్రితం భీమవరానికి వచ్చారు. వారికి మూడేళ్ల క్రితం కవల పిల్లలు బాబు, పాప జన్మించారు. ఇక్కడ కూడా అప్పుల బాధలు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయారు.గురువారం రాత్రి పాపను ఇంటి వద్దే వదిలి, బాబును తీసుకొని స్కూటీపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య దిండి–చించినాడ వంతెనపైకి వచ్చారు. రాత్రి 9 గంటలకు స్కూటీని, బాలుడిని వంతెనపై వదిలేసి, నదిలో దూకేశారు. స్థానికుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దంపతుల కోసం స్థానికులతో కలిసి నదిలో గాలిస్తున్నారు. ఎస్సై రాజ్కుమార్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని యలమంచిలిలో ఉంటున్న బంధువులకు అప్పగించారు. సాయి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లైంగిక వేధింపులు భరించలేకున్నా..
వికారాబాద్: తన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వ్యక్తి పెడుతున్న లైంగిక వేధింపులు, బెదిరింపులను భరించలేకున్నానని బాధిత మహిళ బుధవారం పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఊరికి చెందిన కర్రె సుధాకర్ నెల రోజులుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈవిషయమై బాధితురాలు ఈనెల 15న స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 18న కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని డీఎస్పీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన ఎస్ఐ బాలవెంకటరమణతో ఫోన్ మాట్లాడి, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు.
వీడియోలు
రేవంత్ కు రాఖీ కట్టిన సురేఖ.. 'రాజీ'నా.. రాజీనామానా!
నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు
24 గంటల్లో న్యాయం చేయకపోతే మృతదేహాలతో పుల్లారావు ఇంటిని ముట్టడిస్తాం
వారంలో కేబినెట్ విస్తరణ.. ఆ మంత్రులు ఔట్..!
హైదరాబాద్ నుంచి వెళ్లిన 35 మంది సేఫ్.. నాకు వాళ్లు ఫోన్ చేసి చెప్పింది ఇదే
నేపాల్ వరదల్లో చిక్కుకున్న సుహాసిని రెడ్డి పేరెంట్స్ ఆవేదన
నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు
కొండా సురేఖ రాజీనామా! చేతులెత్తేసిన TPCC చీఫ్..
కొండా సుష్మిత ప్లాన్ "B"లో ఎవరు టార్గెట్..?
సచివాలయం వద్ద కలకలం.. హుస్సేన్ సాగర్ లో దూకిన విదేశీయుడు..!

