Politics
ఖైరతాబాద్కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం
సాక్షి,హైదరాబాద్: దానం నాగేందర్పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత నిర్వహించనున్న తొలి ఉప ఎన్నిక అవుతుంది. ఈ నేపథ్యంలో ‘సర్’ ద్వారా వెలువడిన నూతన ఓటర్ల గణాంకాలు నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉప ఎన్నికపై ప్రభావం.. ఈ ఉప ఎన్నిక మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్ ప్రక్రియ ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసింది. అర్బన్ నియోజకవర్గాల్లో నమోదయ్యే డబుల్ ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లతో గతంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు సాధారణమే. కాగా.. సర్ ముసాయిదా జాబితా ప్రక్షాళన కావడంతో బోగస్ ఓటింగ్ ఆధారపడే వ్యూహాలకు గండిపడింది. సర్కు ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,96,036 ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత మిగిలిన ఓటర్లు 1,72,564 మంది. మరణించిన, నివాసం మారిన, ఆచూకీ లేని, డూప్లికేట్ (ఏస్డీడీ) తొలగించిన ఓటర్లు 1,23,472. నగర పరిధిలో ఏకంగా 1.23 లక్షలకుపైగా నకిలీ/అసలు లేని ఓట్లు తొలగించడం ఒక రికార్డు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గ ఓటింగ్ సరళి, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది.సీరియస్ ఓటర్ల భాగస్వామ్యం.. కాగితాలపై ఉండే ఓటర్ల సంఖ్య తగ్గడంతో, ఉప ఎన్నికల్లో నమోదయ్యే ఓట్ల ఆధారంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ తగ్గుతుందనే అంచనా ఉన్నప్పటికీ, సవరించిన జాబితా వల్ల శాతంలో మెరుగుదల కనిపిస్తుంది. సర్ అనంతరం జరగనున్న పోలింగ్ కావడంతో సీరియస్ ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో సర్ వల్ల పోయిన బోగస్ ఓట్లు ఏ పార్టీ ఆధారిత ఓటు బ్యాంకుని దెబ్బతీస్తాయనేది అభ్యర్థుల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. సర్ తెచ్చిన ఈ మార్పు ఏ పార్టీకి కలిసి వస్తుందో మరి! కార్యకర్తలూ.. నిరుత్సాహ పడొద్దు: దానం బంజారాహిల్స్: తన వెన్నంటి వుండే కార్యకర్తలెవరూ నిరుత్సాహ పడవద్దని, ఎప్పట్లాగే ఉత్సాహంగా తమ కార్యక్రమాలు చేసుకోవాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా రు. ఆయన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన తరువాత శనివారం ఉదయం పలువురు నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబందించి ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందరాదని కోరారు. ఇది ఒక విధంగా మన మంచికే అని, రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని వెల్లడించారు. ఇలాంటివి తాను ఎన్నో చూశానని, మళ్లీ గెలిచి తీరుతామని, ఎప్పట్లాగే అందరూ కలిసికట్టుగా ఉండి తనకు అండగా నిలబడాలని కోరారు.
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ 21న వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించతలపెట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్కు మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు
రేవంత్ సర్కార్కు కేటీఆర్ సవాల్
సాక్షి, వనపర్తి జిల్లా: కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. శనివారం ఆయన వనపర్తి నియోజకవర్గం పెబ్బేరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని.. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ తేల్చి చెప్పారు.‘‘ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. నీళ్లు ఇవ్వకపోతే గల్లా పట్టుకుని అడుగుతామన్నారు. తాము తప్పు చేశామని తేలితే చర్యలు తీసుకోండి.. అక్రమాలు జరిగితే ప్రజలకు చూపించి యాక్షన్ తీసుకోవాలన్నారు. రైతులు విద్యుత్, సాగునీటి కష్టాలు చెప్పుకున్నారు.. ప్రకృతి కావాల్సినన్ని నీళ్ళు ఇచ్చినా రైతులకు సాగునీరు లేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏడు మెగా వాట్ల సామర్థ్యం ఉండేది. 24 వేల మెగా వాట్లకు విద్యుత్ సామర్థ్యం పెంచినం. అత్యల్పంగా కృష్ణా నీళ్లను తెలంగాణ వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముప్పై శాతం కంటే ఎక్కువ నీళ్లు వాడుకున్నాం. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్లుగా మార్చినం. ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వరద వస్తుందంటే వెంటనే నీళ్లు మళ్లించే వాళ్లం...చెక్ డ్యామ్లు, చెరువులు నింపి పాలమూరులో నీళ్లు ఇచ్చాం. రెండు సబ్ స్టేషన్లకు రైతులతో కలిసి వెళ్ళాం. అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆరు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావట్లేదని రైతులు చెప్తున్నారు. లో వోల్టేజ్, తరచూ కట్ చేయడంతో మోటార్లు కాలిపోతున్నాయని అంటున్నారు. నీళ్లు, కరెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విద్యుత్ కష్టాలు, తాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని ఉన్నప్పటికీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం
‘ఈ కీలుబొమ్మ సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు.విశాఖలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉద్యోగుల తొలగింపులు, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.నగరంలో మూడు, నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని ప్రచార కార్యక్రమాలను, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి తక్షణమే విశాఖ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:విశాఖ నీటి సమస్యపై సీఎం సమాధానం చెప్పాలిముఖ్యమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారని ఆశించాం. కానీ విశాఖలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మూడు రోజుల నుంచి నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుందామన్నా దొరకడం లేదు. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రేపటి నుంచి నీటి సమస్య తీరుతుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై, వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం విశాఖ ప్రజలకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది.విశాఖ భూములపై ఎన్నో ప్రశ్నలు2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వందలాది ఎకరాలు ఇచ్చారు. వాటిలో ఒక్క కంపెనీ అయినా నిర్మాణం చేపట్టిందా? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కంపెనీల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి.విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాఖకు నీరు కూడా అందకుండా పోతే పెట్టుబడిదారులు ఈ నగరం వైపు ఎందుకు చూస్తారు? విశాఖను అభివృద్ధిని పణంగా పెట్టి మరీ అమరావతిని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదు.స్టీల్ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలివిశాఖ స్టీల్ప్లాంట్కు రూ.1,000 కోట్లు ఇచ్చాం. రూ.10 వేల కోట్లు ఇచ్చాం. రూ.20 వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ డబ్బులు ఎందుకోసం ఇచ్చారు? బ్యాంకు రుణాలు చెల్లించకపోతే ప్లాంట్ వేలానికి వెళ్లే పరిస్థితిని నివారించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసి ఉంటే, దాన్ని కార్మికులను, ప్లాంట్ను ఉద్ధరించినట్లు చెప్పుకోవడం ఏమిటి? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 6,500 మందిని ఎందుకు తొలగించారు?పర్మినెంట్ ఉద్యోగులకు ఎందుకు వీఆర్ఎస్ ఇచ్చారు? ఈ రెండున్నరేళ్లలో కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు కలిపి దాదాపు 10 నుంచి 12 వేల మందిని తొలగించిన అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాలుగున్నర నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. ప్లాంట్ భవిష్యత్తు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్లాంట్ను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేకపోతే ఇప్పటివరకు ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదు? కార్మికులకు ఎందుకు భరోసా ఇవ్వలేదు?ఇళ్ల పట్టాల పేరుతో డ్రామా వద్దుఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వం పేద కుటుంబాలకు భూములు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. విశాఖ నగరంలో సుమారు 1.30 లక్షల కుటుంబాలకు సొంత స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు. పేదల సొంత ఇంటి కలను ఆపేశారు.2019లో జీవో 463 ద్వారా అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ భూములను రూపాయికే రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించాం. 2021లో జీవో 225, 2023లో మరిన్ని రాయితీలు, జీవో 60 ద్వారా పట్టాలు పొందిన వారికి హక్కులు కల్పించాం. గాజువాక హౌస్ కమిటీ సమస్యకు కూడా జీవోలు తీసుకొచ్చి పరిష్కారం చూపాం. వీటి ద్వారా మా ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లను భరించి పేద కుటుంబాలకు ప్రయోజనం కల్పించింది. ఇప్పుడు అదే కార్యక్రమాలను కొత్తవిగా చూపించుకోవడం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు.ముందు ప్రజల దాహం తీర్చండిప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విశాఖ ప్రజలు పెన్షన్లు వద్దు, మహిళలకు ఇస్తామన్న రూ.1,500 వద్దు, పిల్లలకు ఇస్తామన్న రూ.15 వేలు వద్దు, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలూ వద్దు.. కనీసం గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ముడసర్లోవ, మేదరగడ్డ, రైవాడ రిజర్వాయర్లు ఎండిపోయాయి. తాడిపూడి నుంచి నీరు రావడం లేదు. పోలవరం నీరు అనకాపల్లి వరకు వచ్చిందని చెబుతున్నారు. మరి ఆ నీరు విశాఖకు ఎందుకు రాలేదు? ఈ సమస్యపై ఒక్క మంత్రి అయినా సమీక్ష నిర్వహించారా?వచ్చే ఏడాది వర్షాలు పడతాయని చెప్పడానికి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోలేదు. కరవు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, నగరానికి నీరు ఎలా అందించాలి, పరిశ్రమలకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. రాజకీయ విమర్శలు మానేసి తక్షణమే విశాఖ ప్రజల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని గుడివాడ్ అమర్నాథ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు
Sports
చరిత్ర సృష్టించిన మంధన
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రెండో సెమీఫైనల్లో ఈ రికార్డు నెలకొల్పింది.ఈ రికార్డు సాధించే క్రమంలో మంధన న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ను అధిగమించింది. బంగ్లాదేశ్ మ్యాచ్లో 8 పరుగుల వద్ద మంధన ఈ రికార్డు సొంతం చేసుకుంది.మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లుస్మృతి మంధన- 4788సుజీ బేట్స్- 4758హర్మన్ప్రీత్ కౌర్- 4287చమారి ఆటపట్టు- 4282సోఫీ డివైన్- 3817మంధన ఇప్పటికే మహిళల అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ కొనసాగుతుంది.మరో అరుదైన రికార్డుఈ మ్యాచ్లో మంధన మరో ప్రత్యేక ఘనతను కూడా నమోదు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 600 ఫోర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఓపెనర్లు మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (28 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తమ సహజ శైలిలో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోర్ 101-2గా ఉంది. మంధన, కమలిని (3) ఔట్ కాగా.. షఫాలీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్ను చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. ఇదీ చదవండి: Asian Games Cricket: ఫైనల్స్కు దూసుకెళ్లిన శ్రీలంక
Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్
జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది.మరో పతకం ఖాయంమహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్కు చేరుకోవడంతో భారత్కు మరో పతకం ఖాయమైంది.హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభంభారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్పై టీమిండియా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్ సాధించింది.టేబుల్ టెన్నిస్లోనూ ఘనంగా బోణీమహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లోనూ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.నేడు భారత్ కీలక ఈవెంట్లుమహిళల క్రికెట్: బంగ్లాదేశ్తో సెమీఫైనల్పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్బ్యాడ్మింటన్: కజకిస్థాన్తో మహిళల టీమ్ మ్యాచ్వుషు: భారత్ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలుఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
Asian Games Cricket: ఫైనల్స్కు దూసుకెళ్లిన శ్రీలంక
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీస్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్త చేసి, తుది బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (71), షవాల్ జుల్ఫికర్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా డకౌట్ కాగా.. సైరా జబీన్ 17, కెప్టెన్ ఫాతిమా సనా 20 (నాటౌట్), ఎయ్మాన్ ఫాతిమా 5 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కావ్యా కవిండి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, సుగంధిక కుమారి తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. చమారీ ఆటపట్టు (50 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు హాసిని పెరీరా (42), ఇమేషా దులానీ (27), హర్షిత సమరవిక్రమ (20 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, నష్రా సంధుకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఓడినా, పాక్ జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇవాళే భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో పాక్ సెప్టెంబర్ 22న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత సెప్టెంబర్ 22నే జరిగే ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు.ఈ మ్యాచ్లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అమ్స్టర్డామ్ను మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్స్టర్డామ్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
National
రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!
భోపాల్ : పేపర్ లీకేజీలతో పాటు ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం రాజకీయ దుమారానికి దారితీసింది.మధ్యప్రదేశ్ ఇండోర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు.కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిపోయిందని, వారు శాశ్వతంగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యారని ఆర్ఐపీ వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాకోరుతనానికి అట్టడుగు స్థాయికి దిగజారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. విద్యార్థుల సంభాషణ వేదికను ఉపయోగించుకుని ప్రధానిని అపహాస్యం చేయడం వారిలో మానవతా దృక్పథం లోపించడాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. బీజేపీ నాయకుడు సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తులతో వేదికను పంచుకోవడమే కాక, ఆ వ్యాఖ్యలకు నవ్వుతూ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చవకబారు సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ వివాదానికి కారణం ఏమిటి?ఇండోర్లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి రాహుల్ గాంధీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన మిమిక్రీ ప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పేపర్ లీక్లు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు విద్యా వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే, ఇదే వేదికపై కమెడియన్ పుల్కిత్ మణి చేసిన ప్రదర్శన ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పుల్కిత్ మణి ఒక ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్.ఆయన 2021 నుంచి ప్రొఫెషనల్గా స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు. లైవ్ షోలు, కామెడీ క్లిప్లు, ప్రముఖుల మిమిక్రీ , పొలిటికల్ సెటైర్లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుత కాలంలో యువతను ఆకట్టుకునేలా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై కామెడీ స్కిట్లు చేయడం ఆయన శైలి. #WATCH | Indore, Madhya Pradesh: At the 'Chhatron Ki Goonj' programme in Indore, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "...The 'andhbhakt' says development is not needed. Modi ji is an incarnation of Vishnu. But the andhbhakt never asks questions. An andhbhakt will… pic.twitter.com/0Xa5b70O8h— ANI (@ANI) September 19, 2026
మోస్ట్ వాంటెడ్.. బ్రిజేష్ గంజూ కథ ముగిసింది!
న్యూఢిల్లీ: బ్రిజేష్ గంజూ.. ఒకప్పుడు గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్. ఆ తర్వాత నిషేధిత మావోయిస్టు సంస్థ టీఎస్పీసీ (తృతీయ సమ్మేళన్ ప్రెజెంటేషన్ కమిటీ) అగ్రనేతగా ఎదిగాడు. అనంతరం రూ.30 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారి.. చివరకు ఉత్తర్ప్రదేశ్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జార్ఖండ్లో దాదాపు రెండు దశాబ్దాలుగా మావోయిస్టులకు సమాంతరంగా టీఎస్పీసీ కార్యకలాపాలు సాగించడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు.2004లో ప్రత్యేక సంస్థ ఏర్పాటుబ్రిజేష్ సింగ్ గంజూ అలియాస్ గోపాల్ సింగ్ భోక్తా, దులార్చంద్ గంజూ, రంజన్, ఫుల్చంద్ గంజూ తదితర పేర్లతోనూ చలామణి అయ్యాడు. జార్ఖండ్లోని చత్రా జిల్లా లావాలౌంగ్ పోలీస్ స్టేషన్ పరిధి లుట్టూ సోహావన్ గ్రామం అతడి స్వస్థలం. 2004లో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కి వ్యతిరేకంగా సమాంతర సంస్థను ఏర్పాటు చేశాడు. అదే తర్వాత టీఎస్పీసీగా విస్తరించింది.మావోయిస్టులతో సుదీర్ఘ ఆధిపత్య పోరుచత్రాతోపాటు రాంచీ, హజారీబాగ్, రామ్గఢ్, పలామూ, లాతేహార్ జిల్లాలతో పాటు బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో టీఎస్పీసీ కార్యకలాపాలు పెరిగాయి. మావోయిస్టులతో ఆధిపత్యం కోసం రెండు దశాబ్దాలపాటు ఘర్షణలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మావోయిస్టులతోపాటు పలువురు గ్రామీణులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు.మావోయిస్టు కార్యకలాపాలతోపాటు ‘ముఖియా’టీఎస్పీసీకి నాయకత్వం వహిస్తున్న సమయంలోనే బ్రిజేష్ గంజూ రాజకీయంగానూ గ్రామస్థాయిలో గుర్తింపు పొందాడు. 2010లో లావాలౌంగ్ పంచాయతీకి ఏకగ్రీవంగా ముఖియాగా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి పేరు మావోయిస్టుల జాబితాలో చేరింది. భద్రతా బలగాల నిఘా పెరగడంతో చాలాకాలంగా పరారీలో ఉన్నాడు.రూ.30 లక్షల రివార్డుబ్రిజేష్ గంజూపై జార్ఖండ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో రూ.5 లక్షల రివార్డు పెట్టింది. దీంతో అతడిపై మొత్తం రూ.30 లక్షల రివార్డు ఉంది.రామనగర్లో ఎన్కౌంటర్బనారస్లోని రామనగర్ ప్రాంతంలోని టెంగ్రా మోడ్ లంకా మైదానంలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఝార్ఖండ్ పోలీసులు తెలిపారు. బైక్పై బ్రిజేష్ గంజూ వెళ్తున్న సమాచారంతో యూపీ ఏటీఎస్ అక్కడ మోహరించింది. ఉదయం సుమారు 5 గంటలకు అతడిని అడ్డుకోగా, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిగా ఏటీఎస్ జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఏటీఎస్ డీఎస్పీ విపిన్ రాయ్, హవల్దార్ నితేంద్ర కృష్ణ బుల్లెట్ప్రూఫ్ జాకెట్లకు కూడా తూటాలు తగిలాయి. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయపడ్డారు.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. 40 పిరమిడ్లు కట్టేంత శిథిలాలు
బెంగాల్ బైపోల్స్లో బిగ్ ట్విస్ట్.. టీఎంసీ, స్వతంత్ర అభ్యర్థుల అరెస్ట్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ అరెస్టులు ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రెజీనగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైఫుల్ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఐదేళ్ల నాటి కేసులో సెప్టెంబర్ 19న ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సైఫుల్ ఇస్లాం.. హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP)తో సంబంధం కలిగి ఉన్నారు. బెర్హంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఓ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.ఒక్కరోజులో ఇద్దరు అభ్యర్థుల అరెస్ట్అంతకుముందు.. నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో నమోదైన దాదాపు రెండు దశాబ్దాల నాటి కేసులో సెప్టెంబర్ 18న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నికలకు ముందు వరుసగా ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.ముఖ్యమంత్రి సువేందు అధికారి నందిగ్రామ్తో పాటు భవానీపూర్ నుంచి కూడా గెలవడంతో నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. మరోవైపు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నవదా స్థానాన్ని నిలుపుకోవడంతో హుమాయూన్ కబీర్ గెలిచిన రెజీనగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఇదిలా ఉండగా, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై నమోదైన కేసులో AJUP అధినేత హుమాయూన్ కబీర్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. సెప్టెంబర్ 14న ఈ కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బెర్హంపూర్లో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు ఓ ఆడియో రికార్డింగ్ను వినిపించారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రకు సంబంధించిన సూచనలు ఆ సంభాషణలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఉప ఎన్నికలకు ముందు వరుస అరెస్టులు, పోలీసుల దర్యాప్తులతో బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.టీఎంసీకి భారీ షాక్.. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నందిగ్రామ్, రెజీనగర్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్లో టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే నామినేషన్ ఉపసంహరించుకుని, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు మద్దతు ప్రకటించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ తర్వాత మిలన్ ప్రధాన్ పాత కేసులో అరెస్టయ్యారు. రెజీనగర్లోనూ టీఎంసీ అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురి నామినేషన్ ఉపసంహరణపై తొలుత ప్రకటన చేసినప్పటికీ, అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీలో కొనసాగనున్నట్లు ప్రకటించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: గణపతి మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రొఫెసర్పై కేసు
ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుల వివక్ష, వేధింపులే తన కుమారుడి మరణానికి కారణమని సాహిల్ తండ్రి రవీంద్ర చక్రధర్ వాకోడే ఆరోపిస్తున్నారు.ఇటీవల ఐఐటీ బాంబే నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి సాహిల్ వాకోడే మొబైల్ ఫోన్ ఉపయోగించి, సమాధానాలు వెతికేందుకు ప్రశ్నాపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేసి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఇన్విజిలేటర్కు దొరికిపోవడంతో మనస్తాపం చెంది అతను తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ బాంబే అధికారికంగా ప్రకటించింది.అయితే, తన కుమారుడి మరణానికి కుల వేధింపులే కారణమని బాధిత విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల తనను వేధించారని సాహిల్ తనతో చెప్పినట్లు ఆయన తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన సాహిల్, 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందాడు. కాలేజీ మొదటి సంవత్సరం సజావుగా సాగినప్పటికీ, రెండవ సంవత్సరంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి. గత మూడు నెలలుగా సాహిల్ తీవ్రమైన మానసిక వేధింపులకు, కుల దూషణలకు గురయ్యాని వాకోడే ఆరోపించారు.సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడిన పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్ల పేరిట ఈ ఫిర్యాదును నమోదు చేశారు. డైరెక్టర్ శిరీష్ బి. కేదారే ఆదేశాల మేరకు ఆయన కులపరమైన దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను 'తక్కువ కులానికి' చెందినవాడిని కాబట్టి, తనపై సులభంగా తప్పుడు కేసు బనాయించగలనని ప్రొఫెసర్ దుల్లా బెదిరించినట్లు సాహిల్ తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు ప్రొఫెసర్ దుల్లాను బాధ్యుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాకోడే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణన్ దూళ్లపై ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రొఫెసర్ రాజీనామాకు డిమాండ్మరోవైపు, క్యాంపస్లో ఎలాంటి కుల వివక్ష లేదని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే తీవ్రంగా ఖండించారు. సాహిల్ ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ సెల్కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కళాశాల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదంతం నేపథ్యంలో ఐఐటీ బాంబే విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టి, డైరెక్టర్, సంబంధిత ప్రొఫెసర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.సాహిల్ వాకోడే ఐఐటీలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐఐటీ బాంబే పవాయ్ క్యాంపస్లోని తన హాస్టల్ గదిలో అతను విగతజీవిగా కనిపించాడు.ఐఐటీ బొంబాయి వివరాల ప్రకారం.. సాహిల్ ఆ రోజు అంతకుముందు పరీక్షా హాలులో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ, సమాధానాల కోసం ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ, అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, బదులుగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, అతని కెరీర్కు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు?
International
NRI
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్లోని లోవెల్లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్కు ఆగస్టు 28న టెక్సాస్లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
పెన్సిల్వేనియాలో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో వైఎస్సార్ పదిహేడవ వర్ధంతి నేపథ్యంలో 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 12, 2026 న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్త దాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, శివ మేక పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 300 మంది దాక కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్కి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది దాక రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ పోలంరెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, ఎల్లంపల్లి రామమోహన్ రెడ్డి, నగేష్ ముక్కమల్ల, ఆనంద్ తొండపు, ప్రసాద్ సానికొమ్ము, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, భాస్కర రెడ్డి, ఉయ్యూరు నాగి రెడ్డి, రవి మరక, కొత్త రమణ, కొండా లక్ష్మీనరసింహ రెడ్డి, గీత దోర్నాదుల, ఆళ్ళ అనుపమ రెడ్డి, తాతా రావు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.యువ వాలంటీర్స్ అనేక మంది ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ పెనుమాడ, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు మరియు ఇతరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్!మంచి భోజనం ఏర్పాటు చేసిన పెప్పర్ హౌస్ రాజేంద్ర మోదుగుల వారికి, సాక్షి టీవీ శివ్ వొడపల్లి గారికి కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా ఇలాంటి మెగా రక్త దాన శిబిరాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా అభినందించింది.ఇదీ చదవండి: వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల)
లండన్లో తెలంగాణ వ్యక్తి చారిత్రాత్మక ఘనత!
లండన్కు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) అవార్డును తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల స్వీకరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గణేశ్ కుప్పాల ఉద్యోగరీత్యా లండన్లో స్థిరపడ్డారు. కాగా సెప్టెంబర్ 16న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ చేసి, డామే సూసన్ కరోల్, కరోలిన్ లూసి సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఫ్రీమెన్ హక్కుల కొనుగోలు, వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరంలో నమోదు చేయబడింది. లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తాజాగా ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ కుప్పాల నిలిచారు. అంతేకాదు తెలంగాణకు చెందిన తొలి వ్యక్తిగా లండన్లో అరుదైన గౌరవం పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్, ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాలను పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ అభినందించారు. గణేశ్ను అభినందించిన వారిలో ఎంపీ సీమా మల్హోత్రా, ఎంపీ జస్ అథ్వాల్, ఎంపీ వెస్ స్ట్రీటింగ్, మాజీ యూకే ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
జీబ్రా క్రాసింగ్ ఉపయోగించకుంటే పదివేలు జరిమానా!
రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అబుదాబి పోలీసులు వాహదారులకు, పాదాచారులకు హెచ్చరించారు. రహదారి భద్రతను నిర్ధారించే చర్యల్లో భాగంగా, సోషల్ మీడియాలో పోలీసులు అవగాహన సందేశాన్ని విడుదల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్లను పాదాచారులను ఉపయోగించకుంటే వారికి ఇకనుంచి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్ల(భారత కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సిగ్నళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాదాచారులను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్వాక్లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.#فيديو | دعت #شرطة_أبوظبي السائقين والمشاة على أهمية الالتزام بقواعد السلامة المرورية، محذرة من مخاطر عبور الطرق من الأماكن غير المخصصة لما قد يسببه من حوادث دهس، وناشدت السائقين إلى توخي الحيطة والانتباه للمشاة وخفض السرعة بالقرب من مناطق العبور، فيما حثّت المشاة على استخدام… pic.twitter.com/B4Dalb7Fae— شرطة أبوظبي (@ADPoliceHQ) September 16, 2026
Sakshi Originals
లైక్స్ రాకుంటే టీనేజర్లలో నిద్రలేమి!
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఆశించినంత స్పందన రాని టీనేజర్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా నిద్రలేమి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని దేశంలో తాజాగా జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. ‘ద జర్నల్ ఆఫ్ థియరిటికల్ అకౌంటింగ్ రీసెర్చ్’లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో భాగంగా టీనేజర్లు తమ పోస్టుకు వస్తాయని ఆశించిన లైక్స్ సంఖ్యకు, నిజంగా వచ్చిన లైక్స్ సంఖ్యకూ మధ్య ఉన్న తేడాను పరిశోధకులు పరిశీలించారు. ఈ సమయంలో టీనేజర్లను 30 రోజులపాటు స్మార్ట్ వాచ్ల ద్వారా పర్యవేక్షించారు.వారి నిద్రలోని దశలు, గుండె కొట్టుకొనే తీరులో మార్పులు, శ్వాస తీసుకొనే రేటు, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత స్కోర్ తదితర అంశాలను నమోదు చేశారు. సోషల్ మీడియా కలిగించే భావోద్వేగ ఆందోళనలు టీనేజర్లలో నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. ఒక పోస్టుకు ఆశించిన దానికన్నా తక్కువ లైక్స్ వస్తే ఇతరులతో పోల్చుకొని ఆందోళన చెందుతుండటం ఈ పరిస్థితికి దారితీస్తోందని వెల్లడైంది. 18–25 ఏళ్ల మధ్య యువతలో 64.7 శాతం మందికి నాణ్యమైన నిద్ర లేదని ఉండట్లేదని మరో అధ్యయనం వెల్లడించింది. 22.5 శాతం మంది రాత్రంతా నిద్రపోకుండా సోషల్ మీడియాలోనే ఉంటున్నారని.. 7.8 శాతం మంది తమకు తక్కువ లైక్స్ లేదా కామెంట్లు రావడం వల్ల బాధపడుతున్నారని అంచనా వేసింది.
రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్ డబుల్ గేమ్!
రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధికారం ఇచ్చే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా చమురు కొనుగోలులో కీలకంగా ఉన్న భారత్, చైనాలకు 100 శాతం వరకు టారిఫ్ ముప్పు పొంచి ఉంది. అయితే.. ఇదే బిల్లులో అమెరికాకు అనుకూలంగా ఉన్న మరో కీలక నిబంధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ట్రంప్ సర్కార్ ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఆ ఆదాయాన్ని తగ్గించడంతో పాటు.. రష్యాతో ఇంధన వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు(అధ్యక్షుడు పుతిన్ సహా..), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా కఠిన చర్యలకు ఇందులో అవకాశం కల్పించారు. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262–159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇందులో 203 మంది రిపబ్లికన్లు, 58 మంది డెమొక్రాట్లు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు అనుకూలంగా ఓటేశారు. అంతకుముందే సెనేట్ కూడా ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ డెస్క్కు చేరగా.. ఆయన సంతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అసలు ట్విస్ట్ ఇదే..రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ టారిఫ్లకు సిద్ధమైన అమెరికా.. అందులో తనకు అనుకూలంగా ఓ సెక్షన్ను జత చేర్చుకుంది. అవసరమైన రష్యా యురేనియం విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంచుకుంది. అయితే బిల్లులోని సెక్షన్ 111 రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఇప్పటికే ఉన్న అమెరికా ఆంక్షలను అమలు చేయాలని చెబుతోంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్, దాని అనుబంధ/వారస సంస్థల నుంచి వచ్చే యురేనియం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.కానీ అదే బిల్లులోని సెక్షన్ 114 మాత్రం కొన్ని ముఖ్యమైన మినహాయింపులను ఇచ్చింది. అమెరికా–రష్యా మధ్య కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాల కింద జరిగే కొన్ని కార్యకలాపాలకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే అణు రియాక్టర్లలో ఉపయోగించే కొన్ని రకాల లో-ఎన్రిచ్డ్ యురేనియం (LEU) దిగుమతులకు కూడా మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని వైద్య ఐసోటోపుల దిగుమతులకు కూడా వెసులుబాటు కల్పించారు. అంటే రష్యాతో అణు రంగంలో ప్రతి లావాదేవీని పూర్తిగా నిలిపివేసేలా ఈ బిల్లు లేనేలేదన్నమాట.అమెరికాకు ఎందుకంత అవసరం?రష్యాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అణు ఇంధన రంగంలో మాత్రం మాస్కో పాత్ర ఇప్పటికీ పెద్దదే. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్ సంస్థలు మొత్తం 12.71 మిలియన్ సెపరేటివ్ వర్క్స్ యూనిట్స్ (SWU) మేర ఎన్రిచ్మెంట్ సేవలను కొనుగోలు చేశాయి. అందులో రష్యా నుంచి వచ్చినవి 3.284 మిలియన్ ఎస్డబ్ల్యూయూ.. అంటే సుమారు 26 శాతం. అమెరికా దేశీయ ఎన్రిచ్మెంట్ సేవల వాటా సుమారు 23 శాతంగా ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ కూడా అమెరికాకు ఎన్రిచ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. యురేనియం కొంటే సరిపోదు..అణు ఇంధనం తయారీ ప్రక్రియ ముడి చమురు లాంటిది కాదు. గనుల నుంచి తీసిన యురేనియంను నేరుగా చాలా వాణిజ్య అణు రియాక్టర్లలో ఉపయోగించలేరు. ముందుగా కన్వర్షన్, ఎన్రిచ్మెంట్ వంటి పలు దశలు దాటాలి. ఈ ఎన్రిచ్మెంట్ సామర్థ్యంలో రష్యా చాలా కాలంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. అందుకే రష్యాతో విస్తృత ఆర్థిక సంబంధాలను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అణు విద్యుత్ రంగానికి అవసరమైన ఇంధన సరఫరాను ఒక్కసారిగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.2024లోనే రష్యా యురేనియంపై నిషేధంఈ ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. అమెరికా 2024 మేలో రష్యా యురేనియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీలు మినహాయింపులు కోరుకునే అవకాశం కల్పించింది. ఈ మినహాయింపు వ్యవస్థ 2028 జనవరి 1 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది.అదే సమయంలో అమెరికా దేశీయ అణు ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు 2.72 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. దీని లక్ష్యం కూడా రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడమే. అయితే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్లకు మార్గం వేస్తూనే.. తన అణు విద్యుత్ రంగానికి అవసరమైన కొన్ని రష్యా యురేనియం సరఫరాలకు మాత్రం మినహాయింపులు ఉంచింది. ఇలా.. ఒకే బిల్లులో అమెరికా రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్, చైనా.. టారిఫ్లపై సస్పెన్స్రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం ఈ బిల్లుతో ట్రంప్కు దక్కింది. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఈ విషయంలో ప్రభావితం కానున్నాయి. అయితే భారత్ మాత్రం రష్యా ఆయిల్ విషయంలో తగ్గేదే లేదని చెబుతోంది. జాతి ప్రయోజనాల కోసం తాము ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ టారిఫ్ ముప్పు గురించి అమెరికాతో చర్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: డయానా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా?
అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది. రష్యా, చైనా లాంటి దేశాలు అంతరిక్ష యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నట్లు వార్తలు వస్తూండగా.... అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్ పరిస్థితి ఏమిటి? ఉపగ్రహాలను కూల్చే సత్తా మనకుందా? ఉంటే.. అమెరికా మాదిరిగానే మనమూ అంతరిక్షంలో మనదైన అ్రస్తాన్ని సిద్ధంగా ఉంచగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా భారత్కు ఇప్పుడు కాదు... ఏడేళ్ల క్రితం అంటే 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను భారత్ పరీక్షించింది. అగ్రరాజ్యాలు అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో పురుడుపోసుకున్న ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధాల ఆలోచన ఆ తరువాత బహుముఖంగా విస్తరించింది. అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది కూడా. ఇలా క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించని, నిత్యం కదులుతూ ఉండే ఉపగ్రహాలను గుర్తించడం, క్షిపణులతో ఢీకొట్టడం అంతా చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దేశాలు మాత్రమే ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగాయి. 1985లో అమెరికా మొట్టమొదటిసారి ఈ రకమైన వ్యవస్థలను ప్రయోగించి విజయం సాధిస్తే చైనాకు 2007 వరకూ సాధ్యపడలేదు. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్లు ఉన్నాయని ప్రకటించుకుంది. మన పరిస్థితి ఏమిటి? ముందుగా చెప్పుకున్నట్లు మిషన్ శక్తితో మనకు ఉపగ్రహాలను కూల్చేయగల సామర్థ్యం సమకూరింది. ఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. నేరుగా ఢీకొట్టడం ద్వారా మాత్రమే పృథ్వీ క్షిపణి ఉపగ్రహాన్ని నాశనం చేయడం గుర్తించాల్సిన విషయం. అంటే.. క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదన్నమాట. ప్రయోగం తరువాత జరిపిన పరిశీలనల్లో క్షిపణి ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడంలో విజయవంతమైందని స్పష్టంగా తెలిసింది. దీనర్థం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను గుర్తించి.. దాని దారిని పరిశీలిస్తూ... అడ్డుకుని పేల్చేయగల సత్తా భారత్కు ఉందీ అని!!! ఇప్పుడు çపృథ్వీ క్షిపణిలో పేలుడు పదార్థం ఉందని ఒక్కసారి ఊహించుకోండి... – సాక్షి, నేషనల్ డెస్క్
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్
మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి..
నెల్లూరు మేయర్ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి!
తరగతి గదిలో విభజన రేఖలు!
జియో రీచార్జ్ ప్లాన్: ఒక్కసారి చేస్తే 3 నెలలు ఫుల్ బెనిఫిట్స్!
అందరూ వారిస్తున్నా.. పాము నోట్లో నోరు పెట్టి..
‘రామాయణ’ ఈ వెర్షన్లో 30 నిమిషాల నిడివి తగ్గింపు!
అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే!
ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో.. బాబు డ్రామా పీక్స్: కేకే రాజు ఫైర్
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్కు టీమిండియా
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
సాక్షి కార్టూన్ 19-09-2026
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
అవన్నీ ‘కొవ్వెక్కిన’ మాటలు! ఇప్పుడు తేలిపోయిందిగా!!
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
భారత్కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
పుల్లను తీపి చేసే... మిరాకిల్ ఫ్రూట్!
క్రైమ్
మొదటి భార్యతో రిలేషన్ : కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది!
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త మొదటి భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే ఆగ్రహంతో తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కలకలం రేపింది. రామ్కిశోర్ వాల్మీకిగా గుర్తించిన బాధితుడి మృతదేహం సెప్టెంబర్ 17న భావఖేడ కాలువ సమీపంలోని ఒక బాక్సు (ట్రంక్)లో లభ్యం కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.నిందితురాలు సుఫియా బానోకు రామ్కిశోర్తో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన రామ్కిశోర్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుఫియాకు మున్నా అలియాస్ ముచ్ఛద్ (52) అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు రామ్కిశోర్కు తెలిసిపోయింది. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు రామ్కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుసుకోవడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని సుఫియా వ్యతిరేకించింది. ఫలితంగా వివాదం మరింత ముదిరింది.హత్యకు పథకం మొదటి భార్యతో రామ్కిశోర్ సాన్నిహిత్యాన్ని సహించలేని సుఫియా.. తన ప్రియుడు మున్నా, అతని సహచరుడు ఇక్బాల్తో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 14-15 మధ్య రాత్రి సమయంలో తన ప్రియుడు మున్నాను, అతని సహచరుడు ఇక్బాల్ను తన ఇంటికి ఆహ్వానించి, తలుపు గడియ పెట్టకుండా వదిలేసింది. నిద్రపోతున్న రామ్కిశోర్పైకి ఎటాక్ చేసిన దుండగులు అతనిని కత్తితో పొడిచి చంపారు.హత్య తర్వాత నేల మీద అంటిన రక్తపు మరకలను ప్లాస్టరింగ్ చేసి, రక్తంతో ఉన్న చీపురు, బాధితుడి దుస్తులు, కత్తిని దాచిపెట్టారు. ఆ తర్వాత తన 16 ఏళ్ల కుమారుడి సహాయంతో మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. మరుసటి రోజు రాత్రి ఆ మృతదేహాన్ని ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ వంతెన కింద పడవేశారు. ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!సెప్టెంబర్ 17న రామ్కిశోర్ మొదటి భార్య కవితా దేవి మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే రోజు మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ-రిక్షా ఆధారంగా కేసు చేధించారు.నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!
ప్రియురాలితో కలిసి మలేషియా టూర్ ఎంజాయ్ చేసొద్దామని భావించిన ఒక వ్యాపారవేత్తకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పూణెకు చెందిన ఒక వ్యాపారవేత్త, తాను బిజినెస్ ట్రిప్ అని చెప్పి మరో మహిళతో కలిసి మలేషియా వెళ్లాలని ప్లాన్ వేశాడు. కట్ చేస్తే...వ్యాపార పర్యటన నిమిత్తం తాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కనిపించడం లేదంటూ భార్య కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, తాను మరో మహిళా స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న నిజం బయటపడకుండా ఉండేందుకే ఆయన ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ అబద్ధం ఆడినట్లు పోలీసులు తెలిపారు.లాండ్రీ వ్యాపారం చేసే 46 ఏళ్ల ఆ వ్యాపారి, బిజినెస్ ట్రిప్ పేరుతో సెప్టెంబర్ 14న ఒక మహిళా స్నేహితురాలితో కలిసి కౌలాలంపూర్ వెళ్లాలని ప్లాన్ చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆ మహిళ గతంలో పోగొట్టుకున్నట్లు ప్రకటించిన పాత పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఇదీ చదవండి: కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులుభార్యకు అబద్దం చెప్పి..!చట్టపరమైన చిక్కులు రావడం, మరో మహిళతో ప్రయాణిస్తున్న విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ కట్టుకథ చెప్పాడు. అక్కడితో ఆగలేదు విమానాశ్రయం ల్యాండ్లైన్ నుంచి భార్యకు ఫోన్ చేసి, ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల తన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు. మళ్లీ మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో ఆందోళన చెందిన భార్య బుధవారం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కిడ్నాప్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి బుధవారం రాత్రి సాహర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తానే అబద్ధం ఆడినట్లు అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో కోర్టులో "సి సమ్మరీ" (C Summary) క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
హఫీజ్పేట్ హోంగార్డ్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు.వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో డిప్యూటేషన్పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.https://t.co/NEZsAOdnPg pic.twitter.com/iIuyboVgfB— CV Anand IPS (@CVAnandIPS) September 19, 2026డీజీపీ సీరియస్..మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. This is atrocious behaviour by Telangana police Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
స్పా సెంటర్ల మాటున చీకటి దందాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే పోలీసుల తనిఖీల్లో సైతం బయటపడకుండా కొందరు నిర్వాహకులు పక్కా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ మాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు చడీచప్పుడు లేకుండా మెరుపుదాడులు నిర్వహించారు. ఒకటి కాదు.. ఏకంగా 18 స్పాల్లో ఒకేసారి సోదాలు చేశారు. అయితే అక్కడ లోపల కనిపించిన సీన్లు, అక్కడ లభించిన వస్తువులు చూసి పోలీసులే అవాక్కయ్యారు.హరియాణాలోని గురుగ్రామ్లో గత రాత్రి జరిగిన స్పా సెంటర్లపై గురుగ్రామ్ పోలీసులు, హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ జాయింట్గా నిర్వహించిన తనిఖీలు.. ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. ఆ సమయంలో తలుపులు తీయకుండా నిర్వాహకులు ప్రయత్నించగా.. వెల్డింగ్ మెషీన్లతో తెరిపించి బలవంతంగా పోలీసులు లోపలికి వెళ్లారు. Gurugram में आधी रात 18 मसाज पार्लरों पर चला ग्राइंडर, 100 पुलिसकर्मियों ने मारे छापे, 40 युवक युवतियां मिली, एक ही मॉल में चल रहे थे सभी स्पा सेंटर, मसाज की आड़ में देहव्यापार का काला कारोबार#SpaCentre #SapphireMall #GurugramNews #GurgaonNews #SexRacket pic.twitter.com/TcYpsHu2Q3— Gurugram News गुरुग्राम न्यूज़ (@TheGurugramNews) September 19, 2026లోపల మరో ప్రపంచమే!సెక్టార్-90లో ఉన్న సఫైర్ 90 మాల్లో గత అర్ధరాత్రి ఈ భారీ ఆపరేషన్ జరిగింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉషా ప్రియదర్శిని, ఆమె బృందం, డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల కోసం ఏర్పాటు చేసిన బోర్డుల వెనుక.. ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా.. లోపల దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. అలాగే కొన్ని స్పా కేంద్రాలకు బయట నుంచి తాళాలు వేసి ఉండగా.. తెరిచి లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. లోపల ప్రత్యేక గదులతో పాటు సెక్స్ టాయ్స్, కొన్ని వస్తువులు కనిపించాయి. అలాగే 30 మంది మహిళలు, 20 మంది పురుషులు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించారు. వాళ్లలో కొందరు వీడియోలు తీయొద్దంటూ పోలీసులను వేడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కొందరు నిర్వాహకులు అందులోని వస్తువుల్ని డస్ట్ బిన్లలో పడేసి దాక్కునే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ సోదాలు కొనసాగగా.. దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆ సెంటర్ల నుంచి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలతో పాటు ఇతర వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లందరినీ స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. అసలు.. అంత పెద్ద మాల్లో చీకటి కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.#WATCH | Gurugram, Haryana: The Haryana Women’s Commission and Gurugram Police conducted a joint operation at a Sector 90 mall, raiding 18 spa centres. Several objectionable items and suspected narcotic substances were also recovered. (18.09) pic.twitter.com/9NpIoOqhCB— ANI (@ANI) September 19, 2026
వీడియోలు
వైష్ణవి కేసులో సంతోష్ అరెస్ట్
అమ్మ కోసం పరుగెత్తి.. కారు ఢీ.. స్పాట్ లో మూడేళ్ల బాలుడు మృతి.
ఖైరతాబాద్ బై ఎలక్షన్!
అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్
హైదరాబాద్ లో దారుణం.. జుట్టు పట్టుకుని మహిళను ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్
BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు!
త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..?
సుప్రీం కోర్టుకు దానం నాగేందర్ ..?
సత్యమేవ జయతే.. దానం అనర్హత వేటుపై KTR సంచలన ట్వీట్
MLA దానంపై వేటు హైకోర్టు సంచలన తీర్పు
