Politics
‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.‘మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబేమంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్ ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్షానే లెటర్ రాశారుదేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు.
ట్రంప్కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు.
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం.
Sports
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్ తర్వాత (మార్చి 28) ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది.జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.ఆతర్వాత భారత్ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్లు, 2 టీ20ల సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.
బాబర్ ఆజమ్పై వేటు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన కోసం 15 మంది సభ్యుల వన్డే జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి కలిగించింది. బాబర్ ఇటీవలికాలంలో మిగతా ఫార్మాట్లతో పాటు వన్డేల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అందుకే అతనిపై వేటు పడిందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై పాక్ కోచ్ మరోలా వివరణ ఇచ్చాడు.బంగ్లా సిరీస్ నుంచి బాబర్ను తప్పించలేదు. ఈ సిరీస్ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్తో పాటు సైమ్ అయూబ్, నసీమ్ షా కూడా జట్టులో లేరని గుర్తు చేశాడు. మొత్తంగా బాబర్పై పడింది వేటు కాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని స్పష్టతనిచ్చాడు.కాగా, బంగ్లా సిరీస్కు దేశీయంగా సత్తా చాటుతున్న అబ్దుల్ సమద్, సాద్ మసూద్, షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్ వంటి యువ ఆటగాళ్లతో పాటు టీ20 వరల్డ్కప్ 2026లో చెలరేగిపోయిన (2 సెంచరీల సాయంతో 383 పరుగులు) సాహిబ్జాదా ఫర్హాన్కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్గా షాహీన్ అఫ్రిది కొనసాగాడు. కొత్తగా ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.బంగ్లా పర్యటనలో పాక్ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకాలోని షేక్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా మార్చి 11, 13, 15 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.జట్లు.. పాకిస్తాన్: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్ఱం, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, మొహమ్మద్ ఘాజీ ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షమైల్ హుస్సేన్. బంగ్లాదేశ్: మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ షాంటో, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ఆఫిఫ్ హొసైన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హొసైన్, తాన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నాహిద్ రానా.
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 వరల్డ్కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్తో సిరీస్లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్తో టచ్లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు.
T20 WC 2026: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్ ఇన్నింగ్స్లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా
National
లిక్కర్ స్కాం కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానాలు కోరింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) ఇచ్చిన తీర్పును హైకోర్టులో సీబీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(మార్చి 16) తదుపరి విచారణ చేపట్టనుంది. Delhi Excise Policy Case: Delhi High Court begins hearing the CBI’s appeal challenging the trial court order that discharged former Delhi Chief Minister Arvind Kejriwal, former Deputy Chief Minister Manish Sisodia and 21 others.The matter is being heard by Justice Swarna Kanta…— ANI (@ANI) March 9, 2026
Mallikarjun Kharge Says Modi a slave of dictator Trump
పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్సభ వాయిదా.స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026
పసికందు మృతదేహంతో 20 కిలోమీటర్లు నడక
జార్ఖండ్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్దిసేపటికే మృతిచెందిన పసికందును ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్లో తరలించడానికి నిరాకరించాయి. దీంతో ఆ పాప మృతదేహాన్ని తండ్రి చేతపట్టుకొని 20 కిలోమీటర్ల వరకూ నడుస్తూ తీసుకెళ్లాడు. ఈ ఘటన పలువురిని ఆవేదనకు గురిచేసింది.పశ్చిమ సింగ్ఫూమ్, బాంగ్రాసాయ్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్యను చక్రధర్ పుర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం రోజు ఆ మహిళ ప్రసవించింది. అయితే కొద్దిసేపటికే ఆ పాప మృతిచెందింది. అయితే ఆ వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయితే దానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా సదరు సిబ్బంది కోరగా వారు నిరాకరించారు.అయితే పేదరికం రీత్యా ఇతర వాహనాన్ని ఏర్పాటు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఆ పసికందు మృతదేహాన్ని తన తండ్రి ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్లాడు. 20 కిలోమీటర్ల దూరం ఉన్న తన ఇంటికి నడుస్తూ వెళ్లాడు. ఈ బాధాకర సన్నివేశం అక్కడున్న వారిని ఆవేదనకు గురి చేసింది. అయితే డెలివరీ సమయంలోనూ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.కాగా ఈ ఘటనపై ఆసుపత్రి డాక్టర్ అనుష్మాన్ శర్మ భిన్నంగా స్పందించారు. అంబులెన్స్ కావాలని ఆ పాప తండ్రి గాని బంధువులు గానీ తమను సంప్రదించలేదని ఒకవేళ సంప్రదిస్తే తప్పనిరిగా అంబులెన్స్ ఏర్పాటు చేసేవారిమని డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.
International
NRI
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు.
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
Sakshi Originals
శత్రు భయంకర క్షిపణి
ఇరాన్పై ఇంతకు మునుపెన్నడూలేనంతగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ములపొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీరంగ దిగ్గజం లాక్హీడ్ మార్టీన్ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధిచేసి ఇచ్చిన ‘ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్(పీఆర్ఎస్ఎం) సైతం ఇప్పుడు ఇరాన్పై దాడులకు సిద్ధమైంది.యుద్ధంలో పీఆర్ఎస్ఎంను తొలిసారిగా ఉపయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ‘‘చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి క్షిపణి పీఆర్ఎస్ఎంను ఇరాన్పై మొదలెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఉపయోగించాం. తీవ్రమైన దాడులను విజయవంతంగా పూర్తిచేసింది. క్షిపణుల సాయంతో శత్రుసేనలను ఎటూ పాలుపోకుండా చేస్తున్న మా సాయుధ బలగాల శక్తియుక్తులను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో వ్యాఖ్యానించారు. క్షిపణి లాంచర్ అయిన హైమొబిలిటీ ఆర్టీలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ఎం142 నుంచి పీఆర్ఎస్ఎంను ప్రయోగించిన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ తన ఖాతాలో షేర్చేశారు. దాడిచేస్తే తప్పించుకోవడం కల్ల.. అమెరికాలోని మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే లాక్హీడ్ మార్టీన్ సంస్థ 2023 డిసెంబర్లో ఈ రకం క్షిపణులను అమెరికా బలగాలను అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో నాశనంచేయడం పీఆర్ఎస్ఎంల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(ఎంఆర్ఎల్ఎస్)తోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు.ముఖ్యంగా ఎంఎల్ఆర్ఎస్ఎం–270, హైమార్స్ఎం–142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంచర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంచర్ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ‘ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్’విధానంలో దీనిని రూపొందించారు. వేర్వేరు ఇతర కంపెనీల లాంచర్ నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు. అత్యంత సురక్షితం.. యుద్ధక్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించకముందే రవాణా సమయంలో పొరపాటున కిందపడినా, అగి్నకి ఆహుతైనా, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్ను క్రియాశీలంచేశాక మాత్రమే భారీస్థాయిలో పేలిపోయి పెనువినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం ఎంజీఎం–140 బాలిస్టిక్ క్షిపణుల స్థానంలో కొత్త పీఆర్ఎస్ఎంలను తీసుకొచ్చారు. ఇవి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు.పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లుకాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్ సమీపంలోని రస్ అల్ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే పీఆర్ఎస్ఎంలతో ఇరాన్పైకి నిరాటంకంగా దాడిచేయాలని అమెరికా భావిస్తోంది.రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్య శ్రేణి అణ్వాస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే పీఆర్ఎస్ఎస్ల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,నేషనల్ డెస్క్
నాయకి..
దేశంలో మహిళా నిపుణులు నాయకత్వ స్థానం కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పని ప్రదేశంలో సమానత్వాన్ని సైతం కోరుకుంటున్నారు. నియామకాల్లో వివక్ష, వేతన వ్యత్యాసాలు ఇప్పటికీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ.. వారు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. ‘మహిళా నిపుణులు ఏమి కోరుకుంటున్నారు’పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ తన రెండవ ’వాయిస్ ఃవర్క్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 50కిపైగా పరిశ్రమలకు చెందిన 50,000 మందికిపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను గుర్తించడానికి, వాటిని సరిదిద్దడానికి క్రమబద్ధమైన విశ్లేషణ (ఈక్వల్ పే ఆడిట్) జరగాలని కోరుకుంటున్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్ భారీగా పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే మెన్స్ట్రువల్ లీవ్కు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్టాప్లో హైదరాబాద్..సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 83% మంది తాము నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. గత ఏడాది జరిపిన సర్వేలో మూడింట రెండొంతుల మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళా నాయకత్వానికి అత్యధిక స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడంలో హైదరాబాద్ (86%) టాప్లో నిలిచింది. అయితే కార్యాలయాల్లో వివక్ష ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. దాదాపు ఇద్దరు మహిళల్లో ఒకరు తమ వివాహం లేదా మాతృత్వ ప్రణాళికల గురించి ఉద్యోగ ఇంటర్వ్యూలలో వెల్లడించడానికి సంకోచిస్తున్నారు. వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇందుకు కారణం. ఫ్రెషర్స్లో 29% మంది, 10–15 ఏళ్ల పని అనుభవం ఉన్న నిపుణులలో 40% మంది ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కార్యాలయాల్లో వేతన సమానత్వం లేదని మూడింట ఒక వంతు మంది భావిస్తున్నారు. నియామకాలు, పదోన్నతుల్లో పక్షపాతం చూపిస్తున్నారని 42% మంది తెలిపారు.మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సాహాన్ని పొందుతున్నారని భావిస్తున్నారా?అవును 83%కాదు 17%
అన్నింటా 'ఆమె'
అడ్డంకులను అధిగమిస్తూ.. అవహేళనలు, అవమానాలను దాటుకుంటూ నేడు అన్ని రంగాలనూ ఆమె జయిస్తోంది. దేశ రక్షణ మొదలు క్రీడల వరకు.. ప్రభుత్వ కొలువుల నుంచి ప్రైవేటు ఉద్యోగాల దాకా అన్నింటా తనదైన ముద్ర వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి బడ్జెట్ తయారు చేయడం నుంచి దేశ బడ్జెట్ రూపొందించే స్థాయి దాకా అతివ హవా కొనసాగుతోంది. దేశంలో నారీ శక్తి ఇప్పుడు కేవలం నినాదానికే పరిమితం కాకుండా అదొక నిరంతర ప్రవాహంగా మారింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళామణుల సమాహారం. – సాక్షి, హైదరాబాద్దేశ రక్షణకు పాటుపడుతూ.. దేశ రక్షణ రంగంలోనూ అతివలు చురుగ్గా రాణిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ (పోరాటంలో మొదటి మహిళా యుద్ధ పైలట్), కల్నల్ సోఫియా ఖురేషి (విదేశాలలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ) ఉన్నారు. భారత నావికాదళ యుద్ధనౌకకు మొదటి మహిళా కమాండర్గా ప్రేరణ దేవస్థలీ గుర్తింపు పొందారు. రక్షణ రంగం (డిఫెన్స్) లో భావనా కాంత్తోపాటు అవని చతుర్వేది మోహనా సింగ్ దేశ తొలితరం ఫైటర్ పైలట్లుగా ఖ్యాతిగాంచారు. అంతరిక్షం రంగంలో రీతూ కరిధాల్ (రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా) మంగళయాన్, చంద్రయాన్–2 మిషన్లలో కీలకపాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో పారామిలిటరీ దళాల్లో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి సిమ్రాన్ బాలా నాయకత్వం వహించారు. ‘భారత క్షిపణి మహిళ’గా పేరుగాంచిన డాక్టర్ టెస్సీ థామస్ డీఆర్డీవోలో కీలకమైన క్షిపణి ప్రాజెక్టులను ముందుండి నడిపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో 20–30% మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటల్లో ఐకాన్లుగా..క్రీడారంగంలో మేరీ కోమ్ (బాక్సింగ్) మిథాలీ రాజ్ (క్రికెట్) వంటి క్రీడల్లో ఐకాన్లుగా మారారు. పి.వి. సింధు (బ్యాడ్మింటన్) రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. వివిధ రంగాల్లో ముందంజ...దేశంలో 20% స్టార్టప్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 2022 నాటికి అగ్రశ్రేణి కంపెనీలలో సీఈవో/ఎండీ పాత్రలలో మహిళా ప్రాతినిధ్యం 55% పెరిగింది. ప్రముఖ వ్యక్తులలో ఫల్గుణి నాయర్ (నైకా), కిరణ్ మజుందార్–షా (బయోకాన్) అగ్రభాగాన కొనసాగుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిశ్రమలో 30% మంది, వ్యవసాయ శ్రామికశక్తిలో దాదాపు 42% మంది అతివలు ఉన్నారు. జార్ఖండ్లోని ‘రాణి మిస్త్రీలు’(క్వీన్ మేస్త్రీలు) భవన నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ద్వారా సంప్రదాయ పాత్రలకు మించి ముందుకు సాగుతున్నారు. ఇంకా సవాళ్లు.. : అనేక రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ మహిళలు ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగ వేతన అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే ఒకే రకమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో లింగ వేతన అంతరం ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంలో జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్పొరేట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు ఉన్నతస్థాయి నాయకత్వ స్థానాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు, సీనియర్ స్థాయిల్లో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ‘బోర్డు’ల్లోనూ ఆమెప్రైవేట్ సంస్థల్లో 29% బోర్డు డైరెక్టర్ పదవులను, ప్రభుత్వ సంస్థల్లో 20% డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలోని మొత్తం సంస్థల డైరెక్టర్ల పదవుల్లో 32 శాతం అతివలు ఉన్నారు. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు మొత్తం పురుష బోర్డుల కంటే సగటున 16% నుంచి 29% ఎక్కువ నిధులను సేకరించాయి. 2015 తర్వాత స్థాపించిన కంపెనీలు పాత సంస్థల కంటే (16%) ఎక్కువ వైవిధ్యాన్ని (20% మహిళలు) కలిగి ఉన్నాయి. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పూర్తిగా పురుషుల బోర్డులు ఉన్న వాటి కంటే ఏడాదిలోగా పబ్లిక్గా ఇష్యూకు వెళ్లే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇంజనీర్, ర్యాపర్, మేయర్.. బాలేన్
ఆయన పాటలు జెన్ జెడ్ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్..!మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్ చేసిన గడ్డం, తనదైన స్టయిల్లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. బాలేన్ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్లైన్లో బాలేన్ షా గ్లాసెస్ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చదివాడు. 2013లో నేపాల్లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. అమెరికా, చైనాతోపాటు భారత్నూ వదల్లేదు..!గతేడాది సెప్టెంబర్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్లను తిట్టిపోసిన బాలేన్..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్బుక్లో షాకిచ్చే పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలేన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. మేయర్గా దూకుడు... 2022లో బాలేన్ కఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పారీ్టలను షాక్ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
అమెరికాలో ఆకలికేకలు... ఆపన్న హస్తంగా భారతీయ హిందువు
‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు
తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములా..: స్టాలిన్
బెంగళూరులో హోటళ్లు బంద్!?
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
స్టేట్ అవార్డుతో సాయిపల్లవి.. కోలీవుడ్లో 'బేబి' బిజీ
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
విజయ్తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
యుద్ధంతో ధరలకు రెక్కలు
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
పసిడి ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా రేట్లు రివర్స్!
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
క్రైమ్
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్ నోట్ రాసి, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసు కుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.
బీమా డబ్బుల కోసం భర్త హత్య
ఖమ్మం రూరల్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్ ప్రకారం జోగి వెంకటేశ్కు చెందిన కారును రాజ్కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు.
మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావాది అయిన ఓ ఉపాధ్యాయురాలు గుర్తించి పోలీసుల సాయంతో అనాథాశ్రమానికి చేర్చింది. ప్రస్తుతం ఆ యువతి నిండు గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓ అభాగ్యురాలి దీనగాథ పలువురిని కలిచి వేస్తోంది.అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలుఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు
వీడియోలు
మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్
మళ్లీ జైలుకే! లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్
మా వెంట్రుకలు మాకు కావాలి.. విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్
గ్యాస్ సరఫరాపై యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బుకింగ్స్
నల్గొండలో కారు బీభత్సం.. షాకింగ్ వీడియో
ముగ్గురు బిడ్డలను పోషించలేక కన్న తండ్రి దారుణం
చానా కాలం యాదుండే వీడియో
కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని హతమార్చిన కన్న తండ్రి
10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు

