Politics
-
యూసుఫ్ పఠాన్, శత్రుజ్ఞ సిన్హా సహా 19 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు
కోల్కతా: టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా, కాకోలి ఘోష్ దస్తిదార్, సయోనీ ఘోష్ సహా 19 మంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామన్న తమ నిర్ణయాన్ని అందులో వెల్లడించినట్టు సమాచారం.కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో రెబెల్ ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేసి, ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్టు జాతీయ మీడియా తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టీఎంసీ సంస్థాగత సంక్షోభం బయటపడింది. తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రారంభమైన తిరుగుబాటు ఇప్పుడు పార్లమెంట్ వరకు విస్తరించింది.అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. అంతర్గత అసంతృప్తిగా మొదలైన వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్యేల, ఎంపీల సంఖ్యాబలం, సంస్థాగత నియంత్రణ, రాజకీయ చట్టబద్ధతపై పోరాటంగా మారింది.శాసనసభలో మొదలైన చీలిక పార్లమెంట్ వరకు విస్తరించింది. సీనియర్ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలుశత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్)కాకోలి ఘోష్ దస్తిదార్ (బరాసత్)జగదీశ్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)ఖలీ ఉర్ రెహ్మాన్ (జంగీపూర్)యూసుఫ్ పఠాన్ (బెహ్రంపూర్)అబూ తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)పార్థ భౌమిక్ (బారక్పూర్)బాపి హల్దార్ (మథురాపూర్)సాయోని ఘోష్ (జాదవ్పూర్)మాలా రాయ్ (కోల్కతా దక్షిణ)మితాలి బాగ్ (ఆరాంబాగ్)దీపక్ అధికారి (ఘటాల్)కాలీపద సోరెన్ (ఝార్గ్రామ్)జూన్ మాలియా (మెదినీపూర్)అరూప్ చక్రవర్తి (బాంకురా)షర్మిలా సర్కార్ (వర్ధమాన్ తూర్పు)అసిత్ కుమార్ మాల్ (బోల్పూర్)శతాబ్ది రాయ్ (బీర్భూమ్)రచనా బెనర్జీ (హుగ్లీ) -
సన్నిహితురాలి నుంచి తిరుగుబాటు వరకు..!
బెంగాల్ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోనీ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ఎవరైనా ఒక్క మాట అంటే సివంగిలా విరుచుకుపడే సయాని తాజాగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలిపి మమతను ఒంటరి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నటికీ మమత వెంటే ఉంటానని కొద్ది రోజుల క్రితమే బాస చేసిన సయాని ఇంతలోనే మనసు మార్చుకున్నారు. కష్టకాలంలో అధినేత్రిని ఒంటరి చేసి తన దారి తను చూసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సలాం కొట్టారు!మొన్న ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సయోనీ ఘోష్ (Saayoni Ghosh) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నటి, గాయని అయిన ఆమె తన వాగ్దాటి, మేనరిజంతో ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో ఆమె సభలకు జనం పోటెత్తారు. మమతా బెనర్జీ కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్నారు. జాదవ్పూర్ నుంచి లోక్సభకు పంపి అక్కున చేర్చుకున్నారు. సయాని కూడా పార్టీకి ఎంతో విధేయంగా ఉంటూ మమత నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ పార్టీలో కీలకంగా మారారు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం దొరికినప్పుల్లా తన వాగ్ధాటితో ఎన్డీఏ సర్కారును ఏకీపారేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.పరిస్థితి తారుమారుమమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్టుగా ఒకాకొక సందర్భంలో ప్రకటించారు. మమత పీఎం అయితే ఆమె బెంగాల్ సీఎం అవుతారు అన్నంతగా ప్రచారం సాగింది. ఇదంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోని ముచ్చట. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. మమతా బెనర్జీ కోట బద్దలయింది.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారం పోవడం కాదు ఏకంగా పార్టీయే మమతా బెనర్జీ చేతుల్లోంచి జారిపోయే పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, తాజాగా ఎంపీలు.. మమతకు చేయిచ్చారు. ఎన్డీఏకు మద్దతుగా లోక్సభ స్పీకర్కు ఇచ్చిన లేఖలో సంతకాలు చేసిన 20 మంది తృణమూల్ రెబల్ ఎంపీల్లో సయోనీ ఘోష్ ఉన్నారన్న సంగతి తాజాగా వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.అప్పుడలా.. ఇప్పుడిలా..తాను ఎన్నటికీ బీజేపీ పంచన చేరనంటూ రాఘవ్ చద్దా పార్టీ మారిన సందర్భంలో వ్యాఖ్యానించిన సయోనీ ఘోష్.. ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడం సంచలనంగా మారింది. బీజేపీ దగ్గర వేల కోట్ల డబ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. తమకు అండగా హవాయి చెప్పులు, తెల్లచీర ధరించిన మమతా బెనర్జీ ఉన్నారని.. ఆ సమయంలో సయోనీ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అలా మాట్లాడిన ఆమె.. ఇంతలోనే ఎలా ఎన్డీఏకు ఎలా జై కొడుతుందని చర్చించుకుంటున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన సయోనీ ఘోష్.. తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలుపుతారని అస్సలు ఊహించలేదని జనం అంటున్నారు. ఎన్నికల్లో తేడా కొడితే ముందుగా జంప్ అయ్యేది ఈలాంటి వారే అంటూ సోషల్ మీడియాలో ఆమెపై కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.కొసమెరుపు: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సయోనీ ఘోష్. "మేము ఓడిపోలేదు. ఓట్ల దోపిడీ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా భావించే ఎంపీ మాలా రాయ్ కూడా రెబల్ శిబిరంలో చేరిపోయారు. -
నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.దేశ అవసరాలే మా విధానాలకు పునాది ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటే?
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.టీఎంసీ అంతర్గత అసంతృప్తి, ప్రముఖ నేతల నిష్క్రమణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనను సోనియా గాంధీ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుందని ఆమె సూచించినట్టు చెబుతున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ, మమతా బెనర్జీ మధ్య చర్చ జరిగినట్టు సోర్సెస్ పేర్కొన్నాయి. టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి, వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.మమత ఏమన్నారు? మమతా బెనర్జీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్లో టీఎంసీ విలీనం జరిగితే అనుసరించాల్సిన విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. ఆ ప్రతిపాదన ప్రకారం.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వవచ్చని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.అయితే, ఇలాంటి ప్రతిపాదన నిజంగా ఉందా? లేదా? అన్న విషయంపై కాంగ్రెస్, టీఎంసీ నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. పార్టీ భవిష్యత్ దిశ, అభిషేక్ బెనర్జీ పాత్రపై టీఎంసీలో అసంతృప్తి ఉన్నట్టు వస్తున్న వార్తల మధ్య ఈ ఊహాగానాలు వెలువడ్డాయి.అభిషేక్ బెనర్జీ-రాహుల్ గాంధీ భేటీపై ఆసక్తిఈ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి రేపేలా అభిషేక్ బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం సానుకూలంగా సాగిందని తెలుస్తోంది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశం గంటన్నర కంటే అధిక సమయం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
మమత ముందున్న 4 మార్గాలు ఇవే.. ఇలాచేస్తేనా సామిరంగా..
ఒకే ఒక్క ఓటమి.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఆ తర్వాతి నుంచి పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్బై చెబుతుండడంతో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కంటే మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తిరుగుబాట్లు, వలసలు పెరగడంతో ఆ బలహీనత బయటపడింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన టీఎంసీ.. ఇప్పుడు నిజమైన రాజకీయ పార్టీగా తిరిగి నిలబడుతుందా? లేక క్రమంగా విచ్ఛిన్నమవుతుందా?తృణమూల్ కాంగ్రెస్ సాధారణ రాజకీయ పార్టీలా ఎదగలేదు. అది ముందుగా ఒక భావోద్వేగంగా రూపుదిద్దుకుంది. మమతా బెనర్జీ చుట్టూ ఆవేదన, ప్రతిఘటన, వామపక్ష వ్యతిరేక భావన, వీధి పోరాట స్ఫూర్తి, ప్రాంతీయత వంటి అంశాలు చేరి ఒక రాజకీయ శక్తిగా మారాయి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలు విజయవంతమైంది. మమతా ప్రజల అసంతృప్తిని ఉద్యమంగా మార్చి, దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు 2011లో ముగింపు పలికారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.అయితే 2026 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించగా, తృణమూల్ సుమారు 80 స్థానాలకు పరిమితమైంది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. ఓటమి ఒక్కటే సమస్య కాదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత బలహీనతలు బయటపడ్డాయి.పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకున్నా పార్టీ నియంత్రణ బలహీనంగా కనిపించింది. మమతా నిర్వహించిన సమావేశాలకు తక్కువ మంది నేతలు రావడం, పలు కమిటీలను రద్దు చేయడం వంటి పరిణామాలు సంస్థాగత సంక్షోభాన్ని సూచించాయి.పార్లమెంటులో తృణమూల్ స్థితి కూడా అస్థిరంగా మారింది. రాష్ట్ర అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ బలం, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం లేకపోవడంతో ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించడం ప్రారంభించారు. తిరుగుబాటు వర్గం నిజమైన తృణమూల్గా నిలిస్తే, చాలామంది తమ రాజకీయ మనుగడ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన నాయకురాలు. కానీ ఆమె చుట్టూ పెరిగిన నాయకత్వంలో చాలామంది అధికార రాజకీయాలకు మాత్రమే అలవాటు పడ్డారు. అధికారం ఉన్నప్పుడు విశ్వాసంగా కనిపించిన నాయకులు, ఓటమి తర్వాత వైఖరి మార్చుకోవడం దీనికి ఉదాహరణ.చేయాల్సినవి ఇవే.. ప్రస్తుతం మమతా ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీపై నియంత్రణ కొనసాగించడం, తిరుగుబాటు వర్గంతో రాజీకి రావడం, కింది స్థాయి నుంచి తిరిగి నిర్మాణం చేపట్టడం, లేక కాంగ్రెస్-వామపక్షాలతో పెద్ద కూటమి ఏర్పాటుపై ఆలోచించడం. ఇవి అంత ఈజీ కాదు. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలిగితేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ నిజమైన రాజకీయ పార్టీగా నిలిచి పునర్నిర్మాణం చేసుకోగలదా? లేక నాయకురాలి వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడిన వ్యవస్థగా క్రమంగా విచ్ఛిన్నమవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. -
మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్కు లింకు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్లో యూనిట్ విద్యుత్కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా?స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా?ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాంగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్ప్లాంట్ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్ జగన్ ప్రకటించారు. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది. ఈసారైనా జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నేనావత్ బాలునాయక్లలో ఎవరిని మినిస్ట్రీ వరిస్తుందన్న చర్చ సాగుతోంది. ఎప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా.. మొదట జిల్లా నేతలకు మంత్రి పదవిపైనే చర్చ జరగడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్రెడ్డికి సంకేతాలు!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలువడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అప్పడు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్రెడ్డి పక్కా బెర్త్ లభిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన రాహుల్గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ తనకు అధిష్టానం ఏం హామీ ఇచ్చింది... తనకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా ఎలా నిర్వర్తించారు.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై రాహుల్గాంధీకి వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్రెడ్డి మాత్రం.. తాను రాహుల్గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు.బాలునాయక్కు అవకాశందేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జిల్లా నుంచి బలహీనవర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదీ పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమ్ము పాపయ్య, రవీంద్రనాయక్కు 1985కు ముందు మంత్రి పదవులు దక్కగా, ఆ తరువాత బలహీనవర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా, లంబాడా కోటాలో బాలునాయక్కు ఇస్తారని, సీఎం రేవంత్రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది.నెలాఖరులో కేబినెట్ విస్తరణ?ఈ నెల 18వ తేదీతో రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తరువాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని, ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి రాజగోపాల్రెడ్డి, బాలునాయక్లలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
సీఎం పదవి మళ్లీ మిస్: డీసీఎం
నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్ కారణంగా హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్కు చెప్పేశానన్నారు. -కర్ణాటక -
ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్.టి.ఆర్ విహ్రహ ఆవిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్.టి.ఆర్ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్పూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే, రేవంత్లో ఏదో భయం వెన్నాడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది.అవసరం ఉన్నా, లేక పోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లు మాట్లాడుతున్నారా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్ను ఉద్దేశించి.. 'కేసీఆర్ రాసిపెట్టుకోండి.. మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం.. మీ పదేళ్ల పాలన.. మా రెండున్నర ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేదంటే మీరు ఫామ్ హౌస్కే పరిమితం కండి' అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా!అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండటం తప్పు కాదు. దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ, దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కాని రేవంతే పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్ కైనా మరే పార్టీకైనా వర్తిస్తుంది.కేసీఆర్ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసందే. అదేదో కేటీఆర్ కో, హరీష్ రావుకో సవాల్ విసిరి ఉంటే వారేమైనా స్వీకరించేవారేమో! అయితే, వారితో తనకు పొంతన ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్కు ఉన్న భాష, ప్రసంగ సామర్ద్యంతో పోల్చితే రేవంత్కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీపడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాఫణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది. కాని ఇలా ఒకరు క్షమాపణతో, మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా!ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్లో ఆయన హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు మంచిదే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి, జర్మని నియంత హిట్లర్ సమయంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలనలో డిక్టేటర్ షిప్ చూసిన తర్వాత హిట్లర్ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ను సమర్ధించేవారు కారు. చివరికి యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశం అయితే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏ మాత్రం సెన్సిబుల్గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న వస్తుంది. అంతేకాదు. నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించానని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా? అన్న చర్చ కూడా వస్తుంది.హైదరాబాద్లో హైడ్రా టీమ్ యాక్టివిటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచిపేరే వచ్చి ఉండవచ్చు కాని అదే టైమ్ లో అవసరం ఉన్నా, లేకపోయినా పేద, మధ్య తరగతివారి ఇళ్ళలను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పు పట్టింది. ఆ సంగతి బహుశా రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తనను తాను హిట్లర్తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్పూర్తి అవుతారు?అసలు హిట్లర్ టీమమ్కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా, ఎట్టి పరిస్థితిలోను దానిని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయమూ ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే! అది వాస్తవమా? కాదా? అన్నది చెప్పలేదే! అందువల్లే బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తన కామెంట్లో హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు చేస్తున్నారని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు.రేవంత్ నిరంకుశ, పాష్టిస్ట్ మనస్తత్వం దేశం అంతటికి అర్థం అయిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు. తమకు మాత్రం మహాత్మా గాంధీజి, అంబేద్కర్, జయశంకర్లు స్పూర్తి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిని రాజకీయ విమర్శగా చూడవచ్చు. అది వేరే సంగతి. రేవంత్ కు మిగిలిఉన్న ఇమేజీని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు. ఏది ఏమైనా రేవంత్ కు స్పూర్తి నివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటివారు కాని హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది. -
కాంగ్రెస్కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసత్యపు వార్తలతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపై ఆరోపణలకు ఉన్న ఆధారాలను వారికి ఇవ్వాలని అన్నారు.వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్క్లబ్లో గానీ, అమరవీరుల స్తూపం వద్ద గానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడను.. ‘పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్రెడ్డి చేస్తున్న తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా. వారి ఇళ్ల ముందే ఘెరావ్లు చేసి, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్రెడ్డి సరి్టఫికెట్ నాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని.ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోలీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన, చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, అభద్రతాభావం, అహంకారంతో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు..’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. మంత్రులు దోచుకుంటున్నారు.. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహారశైలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి..’అని కేంద్రమంత్రి విమర్శించారు. ఆఖరి గింజ వరకు కొంటామన్నారుగా.. ‘రాష్ట్రం అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతోంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, గోడౌన్లు ఖాళీ లేకపోయినా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణలో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం..’అని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్లో రాష్ట్రం నుంచి మరొకరికి చాన్స్! ఈ నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, బీజేపీ పార్టీ కమిటీలను కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తారని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో అవకాశం ఉంటుందన్నారు. -
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్క్ లు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్ నుంచి వీలును బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలని హస్తిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా, మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి కబురు వస్తుందని, ఈ నెలాఖరులోపే మార్పులు జరగవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంకేతాలిస్తున్న ఇటీవలి పరిణామాలు.. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దలను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాహుల్గాం«దీని ఇటీవల కలవడం లాంటి ఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుందనే దానికి ఊతమిస్తున్నాయి. పలు కోణాలు.. పలువురు ఆశావహులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు ఈసారికి పీసీసీ అధ్యక్ష పదవి తోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్రెడ్డి, ఎస్టీ లంబాడా కోటాలో బాలూనాయక్లో కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.కానీ రాజగోపాల్రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎస్టీ కోటాలో బాలూనాయక్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా లంబాడా వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారనే సమీకరణం బాలూనాయక్కు ఆటంకంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.ఒకవేళ లంబాడా వర్గానికి కేబినెట్లో అవకాశం ఇస్తే బాలూనాయక్కే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్గా ఆయన్ను నియమించే అవకాశముందని కూడా సమాచారం. ఇక బీసీ సామాజికవర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పించే అంశం కూడా ఇటు సీఎం, అటు అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్లో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేబినెట్లోకి స్పీకర్! అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఈసారి కేబినెట్లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్కు మంత్రిగా అవకాశమివ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజికవర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్ పెట్టవచ్చనే ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఆయన ఇటీవల పార్టీ పెద్దలను కలవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పని భారం తగ్గించుకునే యోచనలో సీఎం ఎన్నికల కేబినెట్ రానున్న నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఈ శాఖలను కూర్చే పనిలో భాగంగా ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖలు కూడా మారతాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లుగా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని, సీఎంను కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి శాఖలు మారుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకరిపై వేటు తప్పదా?ప్రస్తుత మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్ మంత్రిని తప్పిస్తారనేది కూడా గాం«దీభవన్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. రాజకీయంగా మంత్రుల వ్యవహారశైలితో పాటు ఆయా శాఖల్లో వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపునకు ప్రాతిపదికగా మారతాయని, అన్నీ కుదిరితేనే ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. -
ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్. ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం -
దీదీ అంతలా మారిపోతారనుకోలేదు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. “దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు.. .. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.తృణమూల్ కాంగ్రెస్లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. -
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి పైవిధంగా స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి? ‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం సమకూర్చింది ‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? ‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్రావు, కేటీఆర్లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్ఫ్రంట్ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం అడ్డుకుంటారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్, మూసీ ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు.‘మున్సిపల్ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశాననిఅడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వివక్ష, వితండవాదం వద్దు ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే.. ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్కు ఆ దుస్థితి రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు. పేదల కోసం లక్ష ఇళ్లు ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు. ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్లోని లక్ష్మీనగర్లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.కాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేసిన శాలువ, బొకెతో సీఎం రేవంత్రెడ్డిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సన్మానించారు. వాటర్ పెట్ బాటిల్స్ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కూర్చున్నారు. దుండిగల్లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. -
మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని 20 మంది టీఎంసీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు 20 మంది టీఎంసీ ఎంపీలు లేఖ రాయనున్నారు. కకోలీ ఘోష్ను తమ నాయకురాలిగా టీఎంసీ రెబల్ ఎంపీలు ఎన్నుకున్నారు. రెబల్ ఎంపీలు అందరూ సీఎం సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న వేళే ఆమెకు తమ పార్టీ నుంచి ఇబ్బందులు మరింత పెరగడం గమనార్హం. విప్ పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ప్రకారం తమ “భవిష్యత్ రాజకీయ దిశ ఎన్డీఏతో అనుసంధానమై ఉండాలి” అని నమ్ముతున్నామని చెప్పారు.తనతో పాటు దాదాపు 20 మంది తృణమూల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి, ఎన్డీఏలో భాగం కావాలన్న తమ కోరికను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని ఘోష్ దస్తిదార్ ఈరోజు విలేకరులతో చెప్పారు.తిరుగుబాటు తృణమూల్ ఎంపీ షర్మిల సర్కార్ మాట్లాడుతూ, “మేము 20 మంది ఎంపీలతో వేరే కూటమిని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోతున్నాం. కాకోలి ఘోష్ దస్తిదార్ మా ప్రధాన విప్, శతాబ్ది రాయ్ మా ఉప నాయకురాలు” అన్నారు.పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు ఒక కూటమిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో శివసేన అనుసరించిన విధానంలోనే తమది “నిజమైన” తృణమూల్ అని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా శోభన్దేబ్ చటర్జీని పార్టీ ఎంపిక చేయడమే వారి అసంతృప్తికి కారణం. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి చేయాలని తన అనుచరుల ఉసిగొల్పారు. వైఎస్సార్ సీపీ హయాం లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని సోషల్ మీడియా లో జేసీకి వైఎస్సార్ సీపీ నేతలు కౌంటర్ ఇవ్వడంతో పచ్చమూకలు దాడులకు దిగాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలను నామినేషన్లు వేయనీయమని హెచ్చరించిన జేసీ ప్రభాకర్రెడ్డి.. వైఎస్సార్ సీపీ నేతల ఇళ్ల పైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పి పంపారు. దాంతో 50 వాహనాల్లో తాడిపత్రి నుంచి పెద్దవడగూరు మండలానికి వెళ్లారు జేసీ అనుచరులు. వైఎస్సార్ సీపీ నేతల ఇళ్ల వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం చేశారు. జేసీ అనుచరులు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. -
పొలిమేర దాటనివ్వననడానికి రేవంత్రెడ్డి ఎవరు..?: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.‘‘పొలిమేర దాటనివ్వననడానికి అతను ఎవరు..? కలసికట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం. అలాగే, టీబీజేపీ నేతలమంతా ఐక్యంగానే ఉన్నాం. అందుకు ఎలాంటి అనుమానాలకు తావులేదు’’ అని డీకే అరుణ తెలిపారు. -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
‘పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్ లీవల్ను వన్ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్ ఆర్డర్ పని చేసే ఒక్కో పోలీస్కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్ అండ్ డ్రైవ్లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.ప్రతి పీఎస్ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్ నిండినవారిని ఏఆర్కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్ జగన్ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు. -
కేశినేని చిన్ని ఓ ‘చార్లెస్ శోభరాజ్’ : కేశినేని నాని
సాక్షి,కృష్ణా: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నిని ‘చార్లెస్ శోభరాజ్’తో పోల్చారు. ఎంపీ చిన్ని రోజూ రూ.కోటి అవినీతి సోమ్మును తింటున్నాడు. నీ సిబ్బంది ఆ సొమ్మును పంచుకుంటే వాళ్లపై యాసిడ్ పోసి హింసించాలా?. ఇంతకంటే ఘోరం మరేదైనా ఉంటుందా’అని మండిపడ్డారు. -
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై ఈ కమెడియన్ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించాడు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ పవన్ని నిలదీస్తూ ఎక్స్లో వరుస పోస్టులు పెట్టాడు.‘ PESA 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ చివర్లో ‘జై తెలంగాణ’ అని ట్వీట్ చేశాడు.ఆ తర్వాత మరో ట్వీట్లో ‘మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు’ అని రాహుల్ రామకృష్ణ తనదైన శైలీలో పవన్కు చురకలు అంటించాడు. కాగా,ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ .. హైదరాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మినహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తెలంగాణ మేధావులు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. Apart from your usual bravado, have you implemented section 4.1(b) of proactive disclosure of the Right To Information Act in every department of every position you hold sir?I’m asking because I’m you’re fan and you need to constantly answer our questions— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026Asking questions doesn’t make me an anti national— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026 -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
గోదావరి–కావేరి లింక్పై రేవంత్ సర్కార్ జలద్రోహం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–నల్లమల సాగర్ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని హరీశ్రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్కు లింక్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే...పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్ పెన్గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాంపోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్తో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు సాగనిస్తాం
సాక్షి, హైదరాబాద్: భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు జరగనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోహెడలో 239 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు భూములు రైతులవని, వారి నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు.ఇప్పటికే అక్కడ ఫ్రూట్ మార్కెట్ అందుబాటులో ఉందని, అయినా, రైతుల భూములను సేకరించి, వాటిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ భూసేకరణను రైతులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా రైతులను అరెస్టు చేశారని, సాయంత్రం వారిని విడుదల చేశారని తెలిపారు. పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగినవి కాదన్నారు.సీఎంతోపాటు కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ సంస్థలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ గేట్ వద్ద అయినా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేస్తే, తాము కూడా వివరాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
రాజకీయ కుట్రతోనే నాపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: కనీస ఆధారాలు లేకుండా తనపై దు్రష్పచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న టీడీపీ అనుకూల ఎల్లో మీడియాపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వైఎస్సార్సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్రెడ్డి (కేఎన్ఆర్) ప్రకటించారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు సంబంధంలేని మద్యం విధానంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ ప్రకటనలో కేఎన్ఆర్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవీ.. ⇒ ఎల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది. నేను సీనియర్ జర్నలిస్ట్ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశా. 20 ఏళ్ల కిందటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టి అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటరŠన్స్ దాఖలు చేస్తున్నా. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా. నాకు ఏమాత్రం సంబంధంలేని అంశాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేస్తున్నారు. నా బంధువులు, స్నేహితుల ఆస్తులు కూడా నావే అనడం ఎంతవరకు న్యాయం? అలా అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరినీ అలాగే చూడాల్సి వస్తుంది. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బి.ఆర్.నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయా? ⇒ విశాఖపట్నంలో ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల విషయాన్ని వక్రీకరిస్తూ నాపై దు్రష్పచారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డుకు చెందిన 97.50 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం ఏపీ ప్రభుత్వం, సింగపూర్కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ ఒప్పందం చేసుకున్నారు. అదంతా చట్టబద్ధ వ్యవహారమే. దాంతో నాకే మాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది. ⇒ ఎల్లో మీడియా ప్రస్తావించిన రమణారెడ్డి సింగపూర్వాసి. ఆయన మత్సడో కంపెనీలో వాటాదారు కూడా కాదు. కానీ ఆయనకు, నాకు మధ్య ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఆయన 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. విశాఖపట్నంలోనే నాలుగు ప్రాజెక్టులు చేపట్టారు. చంద్రబాబుకు సింగపూర్లో మంత్రులు, వ్యాపారవేత్తలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబుకే సన్నిహితుడు. సింగపూర్కు చెందిన జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకురావడంలో రమణారెడ్డే సహకరించారని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆయన నాకు బినామీ ఎలా అవుతారు...? ఆయన నా బినామీగా ఎల్లో మీడియా ఎలా దు్రష్పచారం చేస్తుంది? ⇒ విజయవాడలో ఎవరో రియల్టర్ను నేను బెదిరించినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోంది. నేను గన్ పెట్టి మరీ బెదిరించానని విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. రాజకీయ కుట్రతో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటా. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్కు సంబంధమే లేదు ⇒ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆర్బిట్రేషన్కు వక్రీకరణలు చేస్తారా? ⇒ ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా.. బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చట్టరీత్యా నేరం విశాఖపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన 97.5౦ ఎకరాల అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో అనేక కంపెనీలు, వ్యక్తులు దాదాపు రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధంగా నడిచిన ప్రక్రియ. కానీ పనులు ఎంతకూ ప్రారంభం కాకపోవడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి మధ్య ఉన్న వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దీనిపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరిగింది. మత్సడో కంపెనీ తన వద్ద పెట్టిన పెట్టుబడుల మేరకు భూములను అప్పగించింది. ఆ కంపెనీలో దాదాపు 13 పార్టీలు పెట్టుబడులు పెడితే.. ఒక్కో పార్టీలో మళ్లీ వేర్వేరు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. ఇందులో 13వ పార్టీలో ఒక కంపెనీతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురిలో కేఎన్నార్ బావమరిది రాంగోపాల్రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలసి పెట్టిన పెట్టుబడికి గాను వివాద పరిష్కారంలో భాగంగా 2.5 ఎకరాలను మత్సడో వారికి దఖలు పరిచింది. ఈ వ్యవహారం అంతా చట్టపరంగా జరిగింది. ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా కూడా దీనికి బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో ప్రస్తావించిన సింగపూర్ వాసి రమణారెడ్డితో మత్సడోకు, దాంట్లో పెట్టుబడి పెట్టున వారికి ఎలాంటి సంబంధం లేదు. అతను వాటాదారు కూడా కాదు. ఎలాంటి క్రయ విక్రయాలు కూడా జరపలేదు. రమణారెడ్డి, కేఎన్నార్ మధ్య బినామీ వ్యవహారం నడిచినట్టుగా తప్పుడు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్కు సంబంధమే లేదు. విష కథనాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసినందుకు కోర్టుకు ఈడుస్తాం. – పి.శ్రేయస్రెడ్డి, న్యాయవాది -
పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! సీనియర్ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒక్క మహిళా కనపడలేదా? మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. కార్పొరేట్ వైపే మొగ్గు.. తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. విజయ్ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? జనసేన అంటే టీడీపీకి బీ టీమ్ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్కళ్యాణ్ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. -
బుజ్జగింపుల పర్వం.. పవన్పై పోస్ట్ డిలీట్!
కడప: రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి ఒకరు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఒకటి. ఈ పోస్ట్ను టీడీపీ అధిష్టానం డిలీట్ చేయించింది. ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ ట్వీట్ కనుమరుగు కావడంతో ఇది కాస్తా బుజ్జగింపు పర్వం చర్చకు దారి తీసింది. టీడీపీ అధిష్టానం ఆశావహులను బుజ్జగించే క్రమంలోనే శ్రీనివాసులరెడ్డి చేత ఆ పోస్ట్ డిలీట్ చేయించిందనే చర్చ నడుస్తోంది. మరొకవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా శ్రీనివాసులురెడ్డి ప్రకటించడంతో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైందనేది విశ్లేషకుల మాట.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. డిసెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ కడప పర్యటన నేపథ్యంలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ మీటింగుకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ శ్రీనివాసులురెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్ అండ్ బి శాఖలో బిల్లు పెండింగ్ ఉందన్న శ్రీనివాసులురెడ్డి.. పవన్ను సూటిగా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త సొంత నిధులు ఖర్చు చేస్తే 18 నెలలుగా బిల్లులు ఇవ్వరా అని నిలదీశారు. నెలలు తరబడి బిల్లు పెండింగులో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదే సమయంలో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కూడా టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. ఇదీ చదవండి..చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై పెట్టిన పోస్ట్ ఇది..గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026 -
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్ జోక్గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్లైన్లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్వర్క్లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది. -
న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఇండి కూటమి సమావేశంలో పాల్గొనడానికి కీలక నేతలు ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జూన్ 8న జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఇండియా బ్లాక్ సమావేశం ఇదే.కొన్ని రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇండి కూటమి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో స్పందిస్తూ.. ప్రతిపక్ష కూటమి ఐక్యంగానే ఉందని, కొన్ని పార్టీలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోయినా ఐక్యత దెబ్బతినలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనున్న సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని ప్రకటించారు. సమావేశానికి రాకపోయినా, ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయని రమేశ్ చెప్పారు."మోదీ ప్రభుత్వం కోట్లాది భారతీయుల ఓటు హక్కును హరించే చర్యలు చేపడుతోంది. రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోట్లాది ప్రజల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిరంతర ద్రవ్యోల్బణంతో కుటుంబాల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోంది. పెట్టుబడి వాతావరణాన్ని బలహీనపరుస్తోంది. విదేశాంగ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. భారత్ మాదిరిగానే ఇండియా జనబంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.ఇండియా బ్లాక్ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, కూటమిలోని అంతర్గత విభేదాలు మరోవైపు ఉన్నాయి.తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమావేశానికి హాజరుకాబోమని తెలియజేస్తూ రాసిన లేఖలో.. దేశ సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఇతర పార్టీలు లేవనెత్తే విషయాలకు తాము ఎప్పటిలాగే మద్దతుగా ఇస్తామని డీఎంకే పేర్కొంది. -
‘ఆర్ఆర్ఆర్పై కిషన్రెడ్డి జవాబు చెప్పాలి’
హైదరాబాద్: మూసీ మురికి కారణంగా ఉప్పల్ పరిధిలో ఉన్న భూముల రేట్లు పెరగడం లేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. మూసీ ప్రక్షాళన చేద్దామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో రేవంత్ మాట్లాడారు. ‘మేం మూసీ నది ప్రక్షాళన చేయోద్దా..?, మూసీ మురికి కారణంగా ఇక్కడ భూముల రేట్లు పెరగడం లేదు. నల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆడబిడ్డలు కడుపుకోతకు గురౌతారని అక్కడి వాళ్లు బయటకు పంపుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయమని నల్గొండ ప్రజలు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశాను. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మూసీకి అడ్డంపడుతున్నాడు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు.హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి పడిపోయింది. మెట్రోను విస్తరించడానికి అడ్డుపడుతున్నారు. మెట్రో విస్తరించాలన్న అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. అన్ని అనుమతులు వచ్చాక కేంద్ర మంత్రి గా పనిచేస్తున్న ఆయన కాళ్లలో కట్టెలు పెట్టి ఆపుతున్నాడు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం ఉంటుంది. రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని కలిశాను. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..?, హైదరాబాద్ ప్రజలు కిషన్రెడ్డికి ఓట్లు వేయలేదా..?, మెట్రోకు అనుమతులు తెచ్చే బాధ్యత, మూసీకి నిధులు తీసుకువచ్చే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..?, తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవరు కొనాలి. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా?, తెలంగాణ ప్రజలతో గోకున్నోడు బాగుపడినట్లు లేదు. 15 వ తేదీ తర్వాత బరాబర్ మా కార్యచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
రేవంత్.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్: తనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, నిన్న(శనివారం, జూన్ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. -
‘కూటమి’ కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారు: విడదల రజిని
పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ను మాజీ మంత్రి విడదల రజిని తీవ్రంగా ఖండించారు. ఏపీలోని కూటమి సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. బాధితుడు బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, కూటమి ప్రభుత్వం కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారని చెప్పారు. బ్రహ్మ నాయుడు చేసిన మంచి సేవా కార్యక్రమాలు వినుకొండ ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకూ తెలుసని విడదల రజిని తెలిపారు. అటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపడం అత్యంత బాధాకరమని చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని, బొల్లా బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. -
ఏపీని విషాదాంధ్రప్రదేశ్గా మార్చేశారు: సీపీఎం నేత శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై సీపీఎం నేత శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఏపీని కూటమి ప్రభుత్వం మార్చుతున్న తీరుపై శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కూటమి రెండేళ్ల పాలన గాడి తప్పిందని చెప్పారు. ఏపీని విషాదాంధ్రప్రదేశ్గా మార్చేశారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కూటమి విఫలమైందని చెప్పారు. కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్వి మతిలేని వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. -
హిట్లర్, తుగ్లక్ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.‘సాక్షి’తో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్ ప్లస్ తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్ రెడ్డి.పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. -
‘జగన్ పాలన సంక్షేమం.. చంద్రబాబు పాలన సంక్షోభం’
సాక్షి, తిరుపతి: రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఐదేళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీ, తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించారు. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచిపోషిస్తున్నారంటూ భూమన మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ పాలన సంక్షేమం.. కూటమి పాలన సంక్షోభం. సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ సిక్స్ మోసాలు. కూటమి ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వమని ప్రజలు అనుకుంటున్నారు. ఆడబిడ్డ నిధి ఎక్కడని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. ఫ్రీ బస్సు కస్సుబుస్సులా తయారైంది. దీపం పథకం పేదల పాలిట శాపంగా మారింది. గ్రాఫిక్తో గ్యాస్ కొడుతూ వెలగని దీపాన్ని చంద్రబాబు ఇస్తున్నారు’’ అంటూ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. అన్నదాతలకు కష్టకాలం.. చంద్రన్న దాతలకు సుఖీభవ. ప్రభుత్వ ఉద్యోగులను నిండా ముంచారు. విద్యారంగం కూటమి పాలనలో హీన దశకు వెళ్లింది. కూటమి పాలనలో పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలకు చంద్రగ్రహణం పట్టింది. ఆంధ్రప్రదేశ్ను అప్పులప్రదేశ్గా మార్చారు. తాగుదాం ఆంధ్రాగా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. ఇంటింటికి కాదు.. వీధివీధికి బెల్ట్ షాపు తెచ్చారు. గోల్కొండ కట్టింది నేనే, సముద్రాన్ని తవ్వించింది నేనే అని బాబు చెప్పగలరు’’ అని భూమన ఎద్దేవా చేశారు.‘‘ఎన్టీఆర్ను ఒక్కసారి వెన్నుపోటు పొడిచారు, ప్రజలను అనునిత్యం పొడుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. చంద్రబాబు ధర్మపరిరక్షకుడు పవన్ కల్యాణ్. లోకేష్ సేవలో పవన్ లోకాలు మరిచిపోతున్నారు’’ అంటూ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేకే ఆత్మహత్యలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక కర్నూలు జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి శనివారం ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్సేన్ అనే సచివాలయ ఉద్యోగి సర్జరీ అయింది... సెన్సస్ డ్యూటీ వల్ల తిరగలేక బాధ పడుతున్నా... మళ్లీ ఇంటింటికీ తిరిగి పని చేయలేను అని ఎంత వేడుకున్నా వినకుండా బీఎల్వో డ్యూటీ వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్సుల గోలకు తోడు సర్వేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు క్షోభకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు నలుగురు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మరణించారు’ అని పేర్కొన్నారు. హామీలేమయ్యాయి చంద్రబాబూ..? ‘ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను ఒకటే అడగదల్చుకున్నా. అయ్యా! ఉద్యోగులంతా ఎగబడి మీకు ఓటు వేసింది మీ చేతిలో ఇలా బలి అవడానికా? మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడా నికా..? ఆత్మహత్యలు చేసుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవం పెంపొందిస్తామన్నారు.ఇదేనా ఉద్యోగులకు మీరు కల్పించే అనుకూలమైన పని వాతావరణం! ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పని వాతావరణం అంటే? ఆర్థికపరమైన హామీలు ఎలాగూ అమలు చేయలేదు. కనీసం ఇలాంటి హామీలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసే చర్యలు ఆపాలి’ అని డిమాండ్ చేశారు. ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. సచివాలయ ఉద్యోగులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
ఈ ఉద్యోగం చేయలేను.. తనువు చాలిస్తున్నా..
కర్నూలు(సెంట్రల్): ‘అనారోగ్యం అని చెప్పినా వినిపించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనంటూ అధికారులు ఆదేశించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేను..’అంటూ కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్లోని 28వ వార్డు రెవెన్యూ సెక్రటరీ (వీఆర్వో) ఎస్ఎండీ షేక్ మహమ్మద్ హుసేన్ (45) శనివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు అర్బర్ తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ధనుంజయలే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. డిస్క్ ఆపరేషన్.. అయినా తప్పని పనిభారం సిబ్బంది కొరత కారణంగా 30, 31వ వార్డు సచివాలయ బాధ్యతలను కూడా హుస్సేన్కు అప్పగించారు. అంతేకాక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో 37వ వార్డు బీఎల్ఓ విధులను కూడా కేటాయించారు. దీనికి తోడు తన వార్డుల పరిధిలో జనగణన విధులు ఉంటాయి. అదనంగా సచివాలయ ఉద్యోగులు సాధారణంగా చేసే దాదాపు 25 రకాల సర్వేలు సరేసరి. ఇక జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బూత్ లెవల్ ఆఫీసర్ విధుల్లో భాగంగా ఇంటింటి సర్వే చేయాలి.ఇంత పనిభారం నేపథ్యంలో మూడు నెలల క్రితం హుస్సేన్ సెలవు పెట్టి నడుము నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుని ఇటీవలే విధుల్లో చేరాడు. ఈనేపథ్యంలో బీఎల్ఓ విధులు నిర్వర్తిస్తే క్షేత్రస్థాయిలో తిరిగే సమయంలో నొప్పి వస్తుందని భావించి విషయాన్ని తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్కు తెలియజేశాడు. ఆ విధుల నుంచి తప్పించాలని కోరాడు. అయితే వారు అవేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనని ఆదేశించడంతో ఉద్యోగంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహంతో కలెక్టరేట్ను ముట్టడించిన ఉద్యోగులు హుస్సేన్ మరణ వార్త సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. తోటి మిత్రుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10గంటలకే కలెక్టరేట్ చేరుకుని హుస్సేన్ మృతదేహాన్ని గాంధీ విగ్రహం ఎదుట ఉంచి ‘ఇది ప్రభుత్వ హత్యే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక్క హుస్సేన్ సమస్య మాత్రమే కాదని, తమ అందరికీ పని ఒత్తిడి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు సచివాలయ ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.టీసీ, వీసీల్లో అందరి ముందే పురోగతి లేదని అవమానిస్తున్నారని, తాము చెప్పేది ఏ మాత్రం వినడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడికి కారణమవుతున్న ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ మరణానికి కలెక్టరే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే ఆమె బయటకు రాకుండా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను పంపారు.ఆమె వచ్చి హుసేన్ భార్య షేక్ ఖాజాబీ, కుమారులు షేక్ మౌలాలి, షేక్ ఖాజా, కూతూరు షేక్ సానతోపాటు కొందరు సచివాలయ ఉద్యోగులను వెంట బెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి హుస్సేన్ కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.50 వేలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2.30 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుటుంబ సభ్యుల వేధింపులే కారణం: కలెక్టర్ హుస్సేన్ ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణం కాదని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొనడం గమనార్హం. అతని మానసిక స్థితి సరిగా లేదని కలెక్టర్ పేర్కొన్నారు. భార్య, పిల్లలే హుస్సేన్ను కొట్టేవారని, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే.. ఎందరు ఉద్యోగులు మిగులుతారని ఆమె ఎదురు ప్రశి్నంచారు. సూసైడ్నోట్ నిజానిజాలపై విచారణ జరిపిస్తామని కూడా ఆమె తెలిపారు. -
2028లో మళ్లీ కేసీఆరే సీఎం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. -
7 రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే...
న్యూఢిల్లీ: ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తొలగించాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, దీనిపై గళం వినిపించడమే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమై, జనరేషన్-జీ వల్ల వేగంగా ఎదిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలు లేవు" అని చెప్పారు. నేటి నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. "నా తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాను. వారిని చివరిసారి కలిసి ఏడాదికి పైగా అయింది. గత 15 రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపుల కారణంగా ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తాను" అని ఎక్స్లో పేర్కొన్నారు."ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏమి సాధిస్తారని ప్రజలు అంటారు. కానీ వాటి ద్వారా మేము ఇంకా జీవించి ఉన్నామని నిరూపిస్తాం! ప్రభుత్వానికి మేము కేవలం కీటకాల్లా కనిపించవచ్చు. కానీ మేము జీవించి ఉన్నాం. మా హక్కుల కోసం పోరాడే సామర్థ్యం మాకు ఉంది" అని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్లో పేర్కొంది.కాగా, విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న దిప్కే శనివారం తెల్లవారుజామున భారత్కు చేరుకుని, నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్కు వెళ్లారు. నీట్-యూజీ, సీయూఈటీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ జీడీ వంటి ప్రధాన జాతీయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల చుట్టూ ఈ నిరసన సాగింది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షలకు సంబంధించిన వివాదాలు ప్రభావం చూపాయని పేర్కొంటూ, భారత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే యువత చేస్తున్న ఉద్యమంగా సీజేపీ తన ప్రచారాన్ని మలిచింది. ఈ ఉద్యమం ఆన్లైన్లో విపరీతంగా ఆదరణ పొందింది. తమకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని, సామాజిక మాధ్యమ వేదికల్లో బలమైన జనరేషన్-జీ అనుచర వర్గం ఉందని సంస్థ చెబుతోంది.నిరసనకు ముందు సంస్థ తన నిర్మాణాన్ని అధికారిక రూపంలో ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టింది. సౌరవ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకాను అధికారిక ప్రతినిధులుగా ప్రకటించింది. వీరు మాధ్యమాలతో మాట్లాడనున్నారు.ప్రతినిధులు నిరసన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని, జాతీయ జెండాలు, పుస్తకాలు తీసుకురావాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భద్రతా కారణాలు, ప్రజలకు అసౌకర్యం కలగొచ్చనే ఆందోళనల దృష్ట్యా, తాను వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి రావద్దని మద్దతుదారులను కోరారు. అరెస్టు సహా చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఉద్యమం రాజ్యాంగ పరిమితులలోనే కొనసాగుతుందని, శాంతియుత భిన్నాభిప్రాయ వ్యక్తీకరణపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ ఉద్యమంలో లడఖ్ ఉద్యమనేత సోనం వాంగ్చుక్ కూడా పాల్గొంటున్నారు. -
టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ప్రజలకు సరైన సేవ చేయలేకపోతున్నామని చెబుతూ 300 మందికి పైగా ఆ పార్టీ సభ్యులు టీవీకేలో చేరారు. శనివారం చెన్నై సమీపంలోని పనయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా వారు టీవీకేలో చేరి, సీఎం విజయ్ నాయకత్వాన్ని కొనియాడారు.టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మైలాపూర్ మాజీ ఎమ్మెల్యే నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమక్కుడి మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ నగర కార్యదర్శి డిటి కుమార్, మరో 300 మందికి పైగా ఉన్నారు.టీవీకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ ఆనంద్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఈ చేరిక జరిగింది.మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు ఉదుమలై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తనతో పాటు త్రిచి ఎన్ ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఎంసి సంపత్, పన్నీర్సెల్వం, గోవిందసామి, కొలత్తూర్ కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకులు అధికార టీవీకేలో చేరినట్లు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె హయాంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కఠిన క్రమశిక్షణ పాటించారని, ఆమె మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అన్నాడీఎంకేలో కొనసాగినా, ప్రజలకు సమర్థంగా సేవ చేయలేకపోయామని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశామని రాధాకృష్ణన్ తెలిపారు.ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్లో ఎంజీఆర్, జయలలిత ఆశయాలు కనిపిస్తున్నాయని, టీవీకేలో లభించిన గౌరవం, గుర్తింపే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. టీవీకే కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తూ యువ నాయకత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.పార్టీ క్రమశిక్షణ పట్ల తమ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నమ్మకంగా నిర్వర్తిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి కార్యకర్తలు, సీనియర్ అన్నాడీఎంకే నాయకులు మరింత మంది టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సెంగొట్టైయన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని నమ్మి తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని చెప్పారు. "భారత చరిత్రలో పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే విజయం సాధించిన ఉద్యమం ఏదైనా ఉంటే అది తమిళగ వెట్రి కళగమే. ఎన్ని కూటములు ఏర్పడినా, తమిళ నేలపై పుట్టిన ఎవరూ తమిళనాడులో మా ఉద్యమాన్ని ఓడించలేరు. స్వచ్ఛమైన పాలన అందించగల నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. అది సాధించగల వ్యక్తి ఆయనే. ఎప్పటికీ విజయ్ తమిళనాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను విప్లవ నాయకుడు ఎంజీఆర్తో ప్రయాణించాను. విప్లవ నాయకురాలు అమ్మతో కూడా కలిసి పనిచేశాను. విశ్వాసం లేని వారు గెలిచారు. ఇతరులను నమ్మిన వారు ఓటమిని చూశారు" అని అన్నారు.ఇదే కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. సెంగొట్టైయన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించే విషయంలో టీవీకే ప్రభుత్వం మాజీ డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను మించి పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గాలతో పోల్చుతూ.. వారి వారసత్వాన్ని టీవీకే ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు."అన్నా, ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మలా నిజాయితీగా ఎదిగిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మేము ముందే చెప్పాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న పార్టీల నాయకులతో కూర్చున్నారని సెంగొట్టైయన్ను అన్నాఏడీఎంకే సభ్యులు ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎంజీఆర్ మంత్రివర్గంలో మంత్రి. కుమార్ అమ్మ మంత్రివర్గంలో మంత్రి. ఇప్పుడు ఇద్దరూ జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు" అని చెప్పారు. -
అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
‘మద్యం, డీఎస్సీ, భూములు.. ఇలా ఏదీ వదలకుండా దోపిడీ’
తాడేపల్లి : ఏపీలో దోచుకో, దాచుకో అనే రీతిలో పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబే ఎవరు ఎలా దోచుకోవాలో సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు అందేలే డీబీటీ సిస్టం అమలు చేస్తే చంద్రబాబు మాత్రం డీపీటీ( దోచుకో.. పంచుకో-తినుకో) పద్థతి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దోపిడీనీ కూడా నిఖార్సుగా చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడని, కార్యకర్తల నుండి మీడియా సంస్థల వరకు దోచి పెడుతున్నారన్నారు. ఈరోజు(శనివారం, జూన్ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబుకు ఐదు ఎకరాల్లో కడుతున్న ఇంటి నిర్మాణం చేస్తున్నదెవరని ప్రశ్నించారు. ‘ఆ సంస్థకు నక్కపల్లిలో ఇచ్చిన కాంట్రాక్టులు బయట పెట్టాలి. తెలంగాణలో హెరిటేజ్ ఐస్ క్రీం కంపెనీ నిర్మాణం చేస్తున్న కంపెనీ అమరావతిలో కాంట్రాక్టు సంస్థే. ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకుడుకి పోలవరం కాలువల నిర్మాణం కాంట్రాక్టు ఇచ్చారు. ఎల్లోమీడియా అంతా దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఇబ్రహీంపట్నం దగ్గర హైడెల్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నారు. టీవీఫైవ్ యజమానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో అంతులేని అవినీతి, దోపిడీ జరుగుతోంది. అమరావతిలో అడుగుకు రూ.20 వేలకు పైనే ఖర్చు చేయటం అవినీతికి పరాకాష్ట. అమరావతికి కనెక్టివిటీ రోడ్లే వేయలేకపోయిన చంద్రబాబు లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తారట. ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను కాదని మళ్ళీ వేల కోట్లతో కొత్తవి నిర్మించటం ఎందుకు?, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేసి, పెద్దలు మాత్రం భూదోపిడీ చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ అడుగుకు రూ.6 వేలు మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం రూ.20 వేలు ఎలా ఖర్చు చేస్తారు?, ఈ ఖర్చులు చూసి దేశ ఆర్ధిక నిపుణులే విస్తుపోతున్నారు. రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చేసే ఖర్చు చూస్తే కల్లు తిరగాల్సిందే. మద్యం, డీఎస్సీ, భూములు, ప్రాజెక్టులు.. ఏదీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు’ అని విమర్శించారు. -
‘చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పోరాటం చేయాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
దూసుకుపోతున్న అన్నామలై కొత్త ఉద్యమం.. అంతా జెన్ Z మాయ
బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్సైట్లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.జెన్ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.వైఖరిని చెప్పేసిన ప్రసంగం ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.జాతీయవాదం+తమిళ గుర్తింపు అన్నామలై టీమ్లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.విజయ్కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్సైట్లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్ తెలిపాయి.తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది. -
కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు
సాక్షి, విజయవాడ: మైలవరంలో జరుగుతున్న మాఫియాపై కేశినేని నాని మరోసారి సంచలన పోస్టు పెట్టారు. వరుసగా నాలుగో ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో విజయవాడ పార్లమెంట్ స్థానంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా? అని ప్రశ్నించారు.మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా అక్రమ దందాలపై ప్రశ్నించిన సొంతపార్టీ(టీడీపీ) నేతలపై వేధింపులు ఏ విధంగా కొనసాగుతున్నాయో పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాని.. ఎంపీ కేశినేని చిన్ని అక్రమ దందాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలపైనే ఏకంగా హత్యా ప్రయత్నం కేసులు పెట్టి జైలుకు పంపుతారా? ఇదా మీ ఫ్యాక్షన్ రాజకీయం?. ఫ్లై యాష్, గ్రావేల్ మాఫియా అక్రమాలను సాక్ష్యాలతో సోషల్ మీడియాలో బయటపెట్టడమే ఉయ్యూరు పెదబాబు, రమేష్ రెడ్డి తప్పా?. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెనుక ఎంపీ చిన్ని ఉన్నాడు. చిన్ని, ఆయన సహచరుడు మూల్పూరి కిషోర్ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా?. మొదట షోకాస్ నోటీసులు ఇప్పించారు. రాత్రికి రాత్రే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు.మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లి వస్తుంటే ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఆటో ఎక్కనంటే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లినంత పని చేస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించినందుకు, వారిపై ఏకంగా సెక్షన్ 307 హత్యా ప్రయత్నం లాంటి తప్పుడు కేసులు బనాయించి, నందిగామ సబ్ జైలుకు రిమాండ్కు తరలించారు. వాళ్లేమన్నా రౌడీ షీటర్లా లేక హంతకులా? ఒక ప్రజాప్రతినిధి అండతో పోలీసులు ఇంతలా బరితెగిస్తారా?. నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం, సొంత దందాలను కాపాడుకోవడం కోసం ప్రశ్నించిన వారి గొంతు నొక్కడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్లు కాదు. మైలవరంలో సాగుతున్న ఈ గ్రావెల్, ఫ్లై యాష్ అక్రమాలపై, అలాగే ఈ అక్రమ కేసులపై తక్షణమే విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
డీఎంకే అవుట్.. టీవీకే ఇన్: రౌత్ వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ సందర్భంగా రౌత్.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది. -
10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత!
సాక్షి, చైన్నె : రాధాపురం ఎన్నికల కేసులో హైకోర్టు పదేళ్లకు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై విజయం చెల్లదని బుధవారం ప్రకటించింది. రీకౌంటింగ్ అనంతరం అక్కడ డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం సాధించినట్టు తీర్పు వెలువరించారు. వివరాలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ఇన్బ బదురై, డీఎంకే తరఫున అప్పావు పోటీ చేశారు. అప్పట్లో కేవలం 104 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బబదురై గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ అప్పావు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై 6 నెలల్లోపు తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో సుదీర్ఘ కాలయాపన జరిగింది. ఎట్టకేలకు వివాదాస్పద పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించగా.. అప్పావు ఆధిక్యం సాధించినట్లు తేలింది. దీంతో హైకోర్టు ఇన్బదురై విజయాన్ని తాజాగా రద్దు చేస్తూ, అప్పావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.మాజీ ఎమ్మెల్యే హోదా, జీతభత్యాలు రద్దుపదవీకాలం (2016–2021) ముగిసిపోయిన తర్వా త ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఇన్బదురైకు షాక్ తప్ప లేదు. 2016 నుండి 2021 వరకు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఇన్బదురై పొందిన జీతం, రోజువారీ భత్యా లు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా జీవితాంతం వచ్చే మాజీ ఎమ్మెల్యే పెన్షన్, ఉచిత వైద్య బీమా సదుపాయాలు పూర్తిగా రద్దవుతాయి. 2016–2021 కాలంలో రాధాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ, అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడెక్కడైతే అన్బదురై పేరు ఉందో.. వాటన్నింటినీ తొలగించి ‘అప్పావు’ పేరు పొందు పరిచే విధంగా హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇన్బదురై ప్రస్తుతం అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ఆలస్యమైనా న్యాయం గెలిచిందితీర్పు రావడంలో చాలా కాలయాపన జరిగినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ స్పీకర్ అప్పావు సంతోషం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 135 సీట్లతో అధికారాన్ని దక్కించుకోగా, డీఎంకే ఈ ఒక్క స్థానాన్ని కోల్పోవడంతో అప్పట్లో 89 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. -
సురేష్ గోపీ రాజీనామా?.. సస్పెన్స్కు ఎండ్ కార్డ్!
తిరువనంతపురం: కేంద్ర మంత్రి పదవికి సురేష్ గోపి రాజీనామా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, పలు వార్తా సంస్థల్లో వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పూర్తిగా కొట్టిపారేశారు. మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ కల్పిత సినిమా కథలు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.రూమర్లకు కారణం ఇదేనా?కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుండి విజయం సాధించి, ఆ రాష్ట్రం నుండి లోక్సభకు ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా సురేష్ గోపి చరిత్ర సృష్టించారు. అయితే, తన పూర్తి స్థాయి సినీ కెరీర్ను కొనసాగించడం కోసం ఆయన మంత్రి బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. సినిమాలు ఆపేయడం వల్ల తన వ్యక్తిగత ఆదాయం భారీగా తగ్గిపోయిందని, అందుకే పదవి నుండి తప్పుకునేందుకు అనుమతించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కోరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, కేంద్ర మంత్రివర్గంలో తన వారసునిగా కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్ పేరును కూడా సురేష్ గోపి ప్రతిపాదించారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.ఫేస్బుక్ వేదికగా గట్టి కౌంటర్ఈ ప్రచారాలన్నింటికీ కేంద్ర మంత్రి సురేష్ గోపి తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. వైరల్గా మారిన తన సోషల్ మీడియా పోస్టులో ఆయన స్పందిస్తూ.. ‘సురేష్ గోపి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ విషయం మీకేమైనా తెలుసా? నిజానికి, ఈ సంగతి తెలియని ఏకైక వ్యక్తిని నేనే! నిజాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్లిక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి, ఇలాంటి సినిమా స్క్రిప్ట్లను నమ్మి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు’ అంటూ వ్యంగ్యంగా నెటిజన్లను కోరారు.ఫేక్ న్యూస్ రాయుళ్లకు హెచ్చరిక ఒకవైపు అగ్ర నటుడిగా, మరోవైపు బాధ్యతాయుతమైన ఎంపీగా రెండు పాత్రలను సమన్వయం చేసుకోవడం ఆయన రాజకీయ నిశ్చయానికి సవాలుగా మారిందంటూ విమర్శకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఈ సందర్భంగా తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారికి సురేష్ గోపి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫేక్ న్యూస్ను తయారు చేసేవారికి నేనొక్కటే చెబుతున్నాను.. అది పద్ధతి కాదు... ఇప్పటికైనా మీ అలవాటును మార్చుకోండి’ అంటూ ఆయన ఘాటుగా హితవు పలికారు. ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా సాగుతున్న పొలిటికల్ సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడింది.ఇది కూడా చదవండి: రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా? -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మోటార్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ మేరకు హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదేపదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని మేము ముందుగానే హెచ్చరించినా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టు ద్వారా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి పడిపోయింది.కృష్ణా జలాల్లో తెలంగాణ తాత్కాలిక వాటా 34 శాతం, ఆంధ్రప్రదేశ్కు వాటా 66 శాతం. 2025–26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరగ్గా తెలంగాణ వినియోగం ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయిలో 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తో సాగునీటి రంగానికి ముప్పు ‘సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్కో సూచించడంతో భారీ పంపులను తరచూ ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తోంది. ఈ విధానంతో పంపులు, మోటార్లకు జరిగే నష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.8 ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ పరిమిత సమయంలోనే జరిగే ప్రమాదం పొంచి ఉంది.తద్వారా నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా–గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతు డిస్కమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే !
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి భర్తీ అవుతున్న నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. అధికారికంగా మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించుకున్నారు. కానీ, జనసేన అభ్యర్థిగా చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న లింగమనేని రమేష్ ని ఎంపిక చేయడంతో నాలుగు స్థానాలూ టీడీపీయే తీసుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తులో భాగంగా నాలుగింటిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీ చెరొక స్థానం పంచుకోవాల్సి ఉంది. కానీ, కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తమకు 3 సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీని ఒప్పించి టీడీపీకి చంద్రబాబు మూడు స్థానాలు కేటాయించుకున్నారు. గతంలో భర్తీ అయిన 4 స్థానాల్లో బీజేపీ రెండు తీసుకోవడంతో మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున తన మనిషిని అభ్యర్థిగా పెట్టి మొత్తం నాలుగింటిని టీడీపీకే దక్కేలా చేసుకున్నారు. టీడీపీలో భారీ లాబీయింగ్ టీడీపీకి దక్కనున్న మూడు స్థానాల కోసం ఆ పార్టీలో పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కి ఆ పదవి రెన్యువల్ చేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు మంత్రి నారా లోకేశ్ అనుయాయుడు కిలారు రాజేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజేష్, విజయ్ పేర్లు ఖరారైనట్లు శుక్రవారం అంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భాష్యం రామకృష్ణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తన మద్దతుదారులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.అయితే అక్కడున్న నేతలు ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు మార్చాలని చంద్రబాబు భావిస్తే బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అందులో మహిళా నేతలు గుండా లక్ష్మీదేవి, సజ్జా హేమలత, ఉండవల్లి శ్రీదేవి పేర్లను పరిశీలించినా వారు ఆర్థికంగా టీడీపీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన డాక్టర్ దేవయ్య, కంభంపాటి రామ్మోహనరావు పేర్లను పరిశీలించినా చివరికి వారినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి గానీ శనివారం గానీ అధికారికంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. బాబు సొంత మనిషి.. ఇప్పుడు పవన్కి ఆప్తుడులింగమనేని రమేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటున్నా నిజానికి ఆయన చంద్రబాబు సొంత మనిషిగా, బినామీగా పేరు పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే. రమేష్ దాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్తో సైతం రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపాలని పవన్ నిర్ణయించారు. రమేష్ జనసేన తరఫున ఎంపీ అయినా చంద్రబాబు జేబులో మనిషేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యూహం ప్రకారమే రమేష్ జనసేన తరఫున రాజ్యసభ రేసులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలను చేజిక్కించుకోవడానికి చంద్రబాబు పన్నిన వ్యూహం ఫలించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
మమతపై మరో తిరుగుబాటు?
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీకి, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల నుంచీ షాక్ తగలొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కనీసం 23 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారు ఏక్షణమైనా తిరుగుబావుటా ఎగురవేయవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల బాటలోనే ఎంపీలు.. ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి బయటపడింది. తిరుగుబాటు వర్గంలోని రితబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వర్గం తమ బలం మరింత పెరుగుతుందని ప్రకటించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఎంపీలు సైతం పార్టీకి, మమత మేనల్లురు అభిõÙక్ బెనర్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ విప్ కల్యాణ్ బెనర్జీల మధ్య ఉన్న విభేదాలు వెలుగులోకి వచ్చాయి. బెనర్జీ మహిళలపై విద్వేష పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఘోష్ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీపై అసంతృప్తితో ఉన్న ఘోష్, పార్టీలో ఉండగానే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఇక పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సైతం వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. శాసనసభ పక్షం తర్వాత పార్టీ పార్లమెంటరీ పక్షం కూడా చీలిపోవచ్చని ఆయన పేర్కొన్నారు. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ చీలిక ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో టీఎంసీ వేరు కుంపటి ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది ఎంపీల్లో 23 మంది బయటకు వస్తే పార్లమెంట్లో పార్టీ బలం దాదాపు సగానికి పడిపోతుంది. కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్ష కూటమిలో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా టీఎంసీకున్న ప్రాధాన్యం పడిపోయే అవకాశం ఉ ంది. ఇప్పటికే పలువురు పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అయితే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మాత్రం తిరుగుబాటు టీఎంసీ నేతలను పెద్దఎత్తున చేర్చుకునే ఆలోచన లేదని ఇటీవల ప్రకటించారు. దీంతో ఎంపీల పార్టీ మార్పు ఎక్కడికి దారితీస్తుందనేది మున్ముందు స్పష్టం కానుంది. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం రాజీనామా కోల్కతా: టీఎంసీ సీనియర్ నేత, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫిర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందునే, పార్టీ చీఫ్ మమతా బెనర్జీ నుంచి అనుమతి తీసుకుని రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తలెత్తుకు వెళ్లిపోవాలన్నది తన కోరికంటూ వ్యాఖ్యానించారు. హకీమ్ తన రాజీనామా లేఖను కోల్కతా మున్సిపల్ చైర్పర్సన్ మాలా రాయ్ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే కూడా అయిన ఫిర్హాద్ హకీంకు..టీఎంసీ పట్టణ ప్రాంత నాయకత్వంలో మైనారిటీ వర్గం నేతల్లో అతిముఖ్యుడిగా పేరుంది. కోల్కతా 150 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మేయర్ ఫిర్హాద్. 2018 నుంచి ఆయన ఇదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కోల్కతాయే కాదు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఎంసీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. -
కొందరిపై వేటు కొత్తవాళ్లకు చోటు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జూన్ 20న ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయి లో పనితనం కనబరచని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన కొనసాగనుంది.ఈ రేసులో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒకరికి నేరుగా కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కట్టబెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు హస్తినలో హాట్ టాపిక్గా మారింది. దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ప్రశ్నపత్రం పేపర్ లీక్ వ్యవ హారం మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నార్థకంగా చేసింది. విపక్షాల నిరసనలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు కోడై కూస్తున్నాయి. రామ్మోహన్పై అసంతృప్తి! ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడి పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, మహారాష్ట్రలో విమాన ప్రమాదాలు, విమాన చార్జీలు చుక్కలనంటడం వంటివి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల్లో ఒకరికి కేబినెట్ ర్యాంక్ ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది.తెలంగాణ పరిస్థితి.. దక్షిణాదికి తెలంగాణను సింహద్వారంగా భావిస్తున్న బీజేపీ 2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి మరో ఒకరిద్దరికి కేబినెట్లో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని.. కుమారుడి కేసు నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవికి గండం ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. ఎవరి మంత్రి పీఠం భద్రం? ప్రస్తుతానికి మోదీ కేబినెట్లో కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి అగ్రశ్రేణి మంత్రుల స్థానాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో చోటు ఎవరికి? ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి, విద్యా రంగానికి సంబంధించిన లోతైన అవగాహన ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న కీలక నాయకులకు చోటు దక్కే ఆస్కారముంది. ఉత్తర భారతం లేదా ఒడిశా సమీకరణాలను బట్టి ఈ ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి మాజీ ముఖ్యమంత్రులను కేంద్రంలోకి తీసుకున్నట్లే ఈసారి సైతం సుదీర్ఘ అనుభవం ఉండి, రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్రంలో సేవలు అవసరమని భావిస్తున్న ఒక ప్రముఖ హిందీ ప్రాంతం లేదా పశి్చమ భారతానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరికి? బండి సంజయ్ను ఒకవేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పిస్తే తెలంగాణ నుంచి గెలిచిన మిగతా ఎంపీలలోని సీనియర్ లేదా సామాజిక సమీకరణాలకు సరిపోయే మరో నేతకు ఈసారి మోదీ కేబినెట్లో ఛాన్స్ దక్కవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు. రామ్మోహన్ను తప్పిస్తే? ఏపీలో ఎన్డీయే కూటమి పొత్తు ధర్మం పాటించనుంది.ఒకవేళ రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆయన స్థానంలో టీడీపీ తరఫున గెలిచిన కీలక లోక్సభ సభ్యులలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నాయని పార్టీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ నుంచి ప్రమోషన్? ఈ ప్రమోషన్ రేసులో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఒకవేళ టీడీపీ కోటాలోనే మార్పులు చేయాలని భావిస్తే ఈయనకు కేబినెట్ ర్యాంకుకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం పరిశీలించవచ్చు. ఒకవేళ బీజేపీ ఏపీలో తన సొంత బలాన్ని, సామాజిక సమీకరణాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తే ప్రస్తుతం భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగావున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కేబినెట్ హోదా కల్పంచే దిశగా కూడా అధిష్ఠానం ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా మరో వారం, పది రోజుల్లోపు కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే ఆస్కారముంది. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’
జడ్చర్ల: పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు తెలుసన్నారు సీఎం రేవంత్రెడ్డి. జడ్చర్ల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కెసీఆర్ను లంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే…పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికిఖర్చు చేశాం. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
‘డీఎస్సీలో అక్రమాలు నిజం’
తాడేపల్లి : ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగింది నిజమేననడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడం డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి నిదర్శమన్నారు. అసలు తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు అన్యాయం జరిగింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాల్ లెటర్స్ 1:1 రేషియోలో పంపాము అంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటి..?, వారి మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ యధాతథంగా అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారిని హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇచ్చాం అంటున్నారు. ఏ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వస్తారో మీకు తెలియదా ?, స్పోర్ట్స్ కోటాలో కొందరికి ఇవ్వటానికి పిలిచిన వాళ్లలో కొంతమందిని బలిచేసినట్లుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడా జరగదు. మీరు చేసింది కరెక్టేనా అనేది పునః సమీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ విధానంలో చేయని విధంగా మీరు చేశారు. మీరు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనిది వాస్తవమా.. కాదా ?, కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. టీచర్, డాక్టర్ పోస్టులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కుదరదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాన్ని వైలెట్ చేయడానికి లేదు. ఆర్డర్స్ తయారు చేసిన వాళ్లు, అమలు చేసిన వాళ్లు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ, టెట్ రాయకుండా.. బీఎడ్, డీఎడ్ చదవకుండా వారికి ఎలా పోస్ట్స్ ఇస్తారు. శాప్ ధృవీకరణ ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులతో మా పార్టీ వారిని తిట్టిస్తున్నారు. అన్యాయం అయినవారి పట్ల సానుభూతి చూపించాలి..పోస్టులు అమ్ముకున్న ఉదంతాలపై విచారణ చేపట్టాలి. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ రాయటం రాని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ కాని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. -
తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్
సాక్షి,బెంగళూరు: తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేసిన తర్వాత, ఆయన బాటలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా కనీసం 15 మంది కీలక పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేశారు.కరు నాగరాజన్ 2016లో మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2017లో ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేశారు. అయితే రెండు సార్లూ ఘోర పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా 2017 ఉపఎన్నికలో ఆయనకు వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఆ ఎన్నికలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు.ఇక బీజేపీకి రాజీనామా, రాజీనామాకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలపడంపై అన్నామలై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో తాను కొత్త ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం (AMI) పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కల్ట్ పొలిటిక్స్ నుంచి బయటపడుతూ, సాధారణ ప్రజల రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిఅన్నామలై ఈ వారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖలో, తమిళనాడు రాజకీయ వ్యూహంపై పార్టీ నాయకత్వంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.అన్నామలై రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి వీద ఫౌండర్ లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించారు. 2020లో బీజేపీలో చేరి, ఏడాదిలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ఆయన చేసిన దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు బీజేపీకి తమిళనాడులో గుర్తింపు తెచ్చాయి. అయితే 2026 ఎన్నికల్లో బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో చివరికి ఆయన పార్టీని వీడారు. -
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్తో పాటు లింగమనేని రమేష్కు లావాదేవీలు ఉన్నాయి. లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా లింగమనేని రమేష్కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది. -
‘పరిటాల సునీత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది’
అనంతపురం: రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమస్యలతో మహేష్ అనే యువకుడి ఆత్మహత్య చేసుకుంటే తన సోదరుడు తోపుదుర్తి రాజాను సునీత అక్రమంగా అరెస్ట్ చేయించారని, అదే సమయంలో బెయిల్ రాకుండా కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడినా పరిటాల కుటుంబం ఆగడాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగి, ఆ పార్టీతో తన ప్రస్థానాన్ని ముగించుకున్న అన్నామలై వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ స్పందించారు. ప్రధానంగా అన్నామలై రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చిన అన్నామలై పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. ‘ అన్నామలై ఆరేళ్ల కింద ఐపీఎస్కి రాజీమానా చేసి బీజేపీలో చేరారు. ఆయన తమిళనాడు లో బీజేపీకి గుర్తింపు తెచ్చాడు. అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. ఇలాంటి నేతలు పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే.. దానికి కారణం తెలుసుకోవాలి... వారిని పిలిచి మాట్లాడాలి. నాకు జరిగిందో అన్నామలై విషయంలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగిన విషయాలనే కేంద్ర పెద్దలకు చెప్పాను. పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేశా.. ఎవ్వరు కలవలేదు.. చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను. కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చావో అడగకుండా రాజీనామాను ఆమోదించారు. నేను బయటకి వచ్చి ఏడాది అయింది.. ఏ పార్టీ లోకి వెళ్ళలేదు.. వెళ్ళను కూడా. నాలాంటి, అన్నామలై లాంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత పార్టీ పై ఉంది. ఇలాంటి వాళ్ళు బాధ పడితే.. రాష్ట్ర, కేంద్ర నాయకులు పిలిచి మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు.. -
ఉత్త ప్రచారానికే 40 కోట్లు!
ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఒకవైపు, ప్రచార వ్యూహాలు మరోవైపు ఉండే సున్నితమైన సరిహద్దు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పేరుతో భారీ నిధుల కేటాయింపు జరిగిందన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది.సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పబ్లిసిటీ కోసం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా? అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా ప్రధాని మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు భారీ ప్రచార వ్యయంపై విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తైంది. ఈ కాలంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. రెండూ పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన కూడా ముందుకు వస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా టీంలు చంద్రబాబు విషయంలో ఎంత హడావిడి చేస్తున్నదో తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విభాగం ద్వారా ఆ పనిని ముమ్మరం చేయాలని చంద్రబాబుకు తనయుడు, మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు దుబారా విమర్శను అంగీకరించకుండా.. డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరాలంటే సోషల్ మీడియా ప్రచారం అవసరమేనని అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. -
బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడులో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీతో తన అనుబంధాన్ని ముగించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా పార్టీ హైకమాండ్తో పలు అంశాలపై తనకు విభేదాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీపై గౌరవం ఉంది కానీ.. అభిప్రాయ బేధాల కారణంగానే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను కొత్త రాజకీయ ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఒంటరిగా తన దారి తాను ఏర్పరచుకుంటానని స్పష్టం చేశారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాని అన్నారు. దీంతో, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మరాయి. తాజాగా అన్నామలై రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నామలై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మార్పు కోసం బీజేపీలో చేరాను. బీజేపీ భవిష్యత్ కోసం ఎంతో కృషి చేశాను. సమాజంలో మార్పు తేవాలని భావించాను. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. అభిప్రాయ బేధాల కారణంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాను. 2025 డిసెంబర్లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పాను. ఎన్నికల తర్వాత వెళ్లాలని బీజేపీ అధిష్టానం చెప్పింది. గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతృత్వంతో అనేకసార్లు చర్చలు జరిపాను. నా అభిప్రాయ భేదాలను స్పష్టంగా వివరించాను. అయితే తమిళనాడులో పార్టీ భవిష్యత్ దిశపై మా అభిప్రాయాలు ఒకేలా లేవని చివరకు అర్థమైంది. తమిళనాడు ప్రజలు అర్థం చేసుకునే భాషలో జాతీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అభివృద్ధి కేంద్రిత, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే రాజకీయాల అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తాను. అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. సామాన్యులకి నా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాను. రాజకీయాల్లో కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదు. After resigning from the BJP, K Annamalai says, "Today, we are going to start a movement. Our political party will contest in the next assembly election in Tamil Nadu." pic.twitter.com/RtWoJQ5LUQ— ANI (@ANI) June 5, 2026రాజకీయాల్లోకి వచ్చే ముందు రజినీకాంత్ సలహాలు తీసుకున్నాను. రజినీకాంత్ను నాతో కలిసి రావాలని కోరాను. ఇక రాజకీయ ఉద్యమం మొదలుపెడుతున్నాను. ఒంటరిగా నా దారి నేను ఏర్పరచుకుంటాను. తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. తమిళనాడు అభివృద్ధే నా ప్రధాన లక్క్ష్యం. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాను’ అని తెలిపారు. దీంతో, అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యూహంపై, అలాగే దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘అక్కడ టెర్రరిస్టులున్నారా?’.. ఇంటి కూల్చివేతపై బాలశౌరి ఆగ్రహం
మచిలీపట్నం జనసేన లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందరు మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎపిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత ఆరాచకపాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్దం అవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్తానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల నలభై లక్షల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఆయన అడిగారు. అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా. ఇల్లు కూల్చడమన్నది చిన్న విషయం కాదని, ఇద్దరు వ్యక్తుల మద్య ఉన్న ప్రైవేటు తగాదాలో మీరెలా జోక్యం చేసుకున్నారని ఆయనఅడిగారు.మహిళలు కాళ్లమీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపంచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా.పోలీసుల పాయం కావాలని ఏ ప్రాతిపదికన లెటర్ రాశారు. అదేమి మున్సిపల్ ఆస్తి కాదు కదా అని,ఇంటిలో పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కట్టుకుటుంటే దానిని కూల్చుతారా? ఇదేనా ప్రెండ్ లీ ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు.దాంతో కలెక్టర్ దీనిని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేన కు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడం బందరులో టీడీపీ, జనసేన ల మధ్య రచ్చ రాజుకుంది. ఈ నేపధ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగిపారేయడం చర్చనీయాంశం అయింది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలన్నట్లుగా పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా ,బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ అడ్డుకోవడానికి యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని ,టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది. కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మూకలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే , టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లో బీతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత ఒకరికి సంబంధించి వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి అనేక చోట్ల ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన క్యాడర్ లోను, ఆయన అభిమానులలోను నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులు చేశారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని శ్రీధర్ వ్యాఖ్య చేసిన వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ రాజీనామా చేయించారు. ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు.పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్త కేసు పెట్టడం కూడా వివాదంగా మారింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసు కేసులు పెట్టడం అంటే పార్టీ అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఇచ్చారు. ప్రోఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటివాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టవలసి ఉంటుందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ఇచ్చింది. అది పవన్ ను బాగా డామేజీ చేసింది. అయినా ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కధలు ఇన్నీ అన్నీ కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసిన దాదాపు ప్రతి సందర్భంలోను ,అక్కడ కూర్చుని చూసినట్లు,విన్నట్లు రాసిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ఎన్నడూ కేసులు పెట్టలేదు.కాని ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన,కొన్ని మీడియా సంస్థలపైన టీడీపీ నాయకత్వం కేసులు పెట్టించిందని,దీనివల్ల జనసేనకే తీరని నష్టం వచ్చిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వర్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది. రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్ లో దాచుకుంటే అది వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీదని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు.అది పెద్ద ఉద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు.తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో సీల్ తీయకతప్పలేదు.బాలశౌరి బందరులో జరిగిన ఘటనకే పరిమితం అయినా, వైఎస్సార్సీపీపైన ఈ రెండేళ్లలో జరిగినన్ని దాడులు ఇన్నీ అన్నీ కావు.వైఎస్సార్సీపీ తర్వాత జనసేనపై టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేన ఎంపీ బాలశౌరి ఈ మాత్రం అయినా ప్రతిఘటించి, గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘వేళ్లన్నీ లోకేష్వైపే.. రాజీనామా చేయాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేక ఉత్తరకొరియా పాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయటం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అన్ని వేళ్లు విద్యాశాఖ మంత్రివైపు చూస్తున్నాయి. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గానీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి. డీఎస్సీలో స్పోర్ట్స్ కోట పేరిట ఎలా ఉద్యోగాలు ఇస్తారు. నీట్లో జరిగిన అక్రమాలు బయటపడి దేశవ్యాప్తంగా ఎలా కలకలం రేపాయో.. ఏపీలో డీఎస్సీ వ్యవహారం కూడా అదే స్థాయిలో బయటపడుతోంది. చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటుంది. అన్ని వేళ్ళు విద్యాశాఖ మంత్రి వైపే చూపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్కు ఆద్యుడు చంద్రబాబే. రష్యాలో లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ చేస్తామంటున్నారు. అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదు. సంపద సృష్టి అని చెప్పిన చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు ఓటేస్తున్నారంటే మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
గోపిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఇంటినుంచి బయటకు వచ్చిన గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మధ్య తోపులాట జరిగింది.దీంతో పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు గోపిరెడ్డి సిద్ధమవ్వగా.. కోటప్పకొండ వెళ్లకుండా గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చకు భయమెందుకంటూ ప్రశ్నించారు.కాగా, నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందులో భాగమే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించారు.నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, అందజేసిన సంక్షేమంపై శుక్రవారం చర్చించేందుకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. అభివృద్దిపై తొలుత సవాల్ విసిరింది డాక్టర్ చదలవాడే. దీనికి స్పందించిన డాక్టర్ గోపిరెడ్డి.. చర్చకు తాను సిద్ధమని, ఆ చర్చా వేదిక పట్టణంలోని టౌన్హాలు లేదా కోటప్పకొండ వేదికగా ఉంటే బాగుంటుందని సూచించారు.దీనిపై గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తానూ కోటప్పకొండ వేదికగా సిద్ధమేనని డాక్టర్ చదలవాడ పేర్కొన్నారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి స్పందిస్తూ కోటప్పకొండ దిగువ భాగంలో చర్చకు ఏర్పాట్లు చేయాలని, తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.2019–24 మధ్యలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాము రూ.2476 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమం అందజేసినట్లు ఇప్పటికే డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు. పేదలందరికీ ఇళ్లు పథకం పరిశీలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 14,700 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ఇళ్ల పట్టా అందజేయలేదు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు రూ.7.45 కోట్లు అందజేశారు.జగనన్న విద్యాదీవెన ద్వారా 22,243 మంది విద్యార్థులకు రూ.70.7 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. వసతి దీవెన ద్వారా మరో రూ.18 కోట్లు అందజేశారు. సుమారు రూ.74 కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేశారు. పింఛన్ కానుక ద్వారా రూ.356.32 కోట్లు, అమ్మ ఒడికి రూ.119,80 కోట్లు, రైతు భరోసా కింద రూ.138.76 కోట్లు, డ్వాక్రా రుణమాఫీ ద్వారా రూ.144 కోట్లు, రుణాలు రూ.975 కోట్లు, నాడు–నేడు ద్వారా రూ.31.78 కోట్లు, 42 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.16.35 కోట్లు, 36 హెల్త్ క్లినిక్లకు రూ.6.82 కోట్లు, 31 ఆర్బీకేలను రూ.6.75 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్లకు రూ.13 కోట్లు, 11 కమ్యూనిటీ సెంటర్లను రూ.7.13 కోట్లను ఖర్చు చేశారు.మిల్క్కసెంటర్లు రూ.6.13 కోట్లు, నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రూ.6.07 కోట్లు, రూ.80 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్కేర్ సెంటర్, 2,718 మంది విద్యార్థులకు ట్యాబ్లు, పలు పాఠశాలల్లో టచ్ర్స్కీన్లు 148, స్మార్టు టీవీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తాగునీటికి రూ.78 కోట్లు, జేఎన్టీయూ నిర్మాణానికి రూ.150 కోట్లు , 34.68 కి.మీ. సీసీ రోడ్లు, 15 కి.మీ. సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. -
సస్పెన్స్కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.అలా మొదలైంది.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. నొచ్చుకుని..రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఎల్డీఎఫ్లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
కేరళలో ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవిపై సీపీఎం–సీపీఐ మధ్య తీవ్ర పోటీ చెలరేగడంతో లెఫ్ట్ కూటమిలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఒకవైపు ఈ పదవి తమకే దక్కాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతుండగా, మరోవైపు సంప్రదాయాలను చూపిస్తూ సీపీఎం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష డిప్యూటీ నేత పదవిపై ఎల్డీఎఫ్లో భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తమకే ఈ పదవి దక్కాలని సీపీఐ స్పష్టం చేస్తూ.. ఈ విషయంలో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కూడా కోరింది. ఇక సీపీఎం మాత్రం గత సంప్రదాయాలను ప్రస్తావిస్తూ, ఈ పదవిని ఎప్పటినుంచో తమ పార్టీనే నిర్వహిస్తోందని వాదిస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో కీలక పదవుల పంపకంలో మార్పులు అవసరం లేదని సీపీఎం నేతలు చెబుతున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ ఓటమి పాలైన తర్వాత కూటమిలో అంతర్గత సమీక్షలు, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు సమావేశాలు జరుగుతూ, ఎన్నికల పరాజయానికి కారణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఈ అంతర్గత చర్చల మధ్యే సీపీఎం–సీపీఐ మధ్య పదవుల వివాదం మరింత వేడెక్కింది. అంతకుముందే ప్రతిపక్ష నేత పదవిపై కూడా పినరయి విజయన్ పేరుకు సీపీఐ అభ్యంతరం తెలిపిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఓటమికి నాయకత్వమే కారణమన్నది సీపీఐ వాదనగా ఉంది. మొత్తంగా, ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో మొదలైన అంతర్గత చిచ్చు ఇప్పుడు కీలక పదవుల పంపకంపైకి చేరి, కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
డీకే కేబినెట్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తన శాఖపై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ బాంబు పేల్చారు. మంత్రివర్గంలో అసంతృప్తి..అయితే, అంతకుముందు శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖకు బదులుగా రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించడంతో ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివకుమార్, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడల మధ్య విధాన సౌధలో సుదీర్ఘంగా అత్యవసర చర్చలు జరిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే శాఖల సర్దుబాటు వ్యవహారం బెంగళూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.🔴#BREAKING | Ramalinga Reddy unhappy with allocated portfolio, likely to resign from Karnataka cabinet: SourcesNDTV's @reethu_journo joins @reetksahni with more details pic.twitter.com/B2SRLdG7g5— NDTV (@ndtv) June 5, 2026మరోవైపు.. గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు ఆయనను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజీనామా చేసిన సందర్భాల్లో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా.. సీఎంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి. పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా) బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ పోర్ట్ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్మెంట్) శాఖను కేటాయించారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం), గొల్లపల్లి డేవిడ్ రాజు(కొత్తపేట), ఎస్.సత్యనారాయణమ్మ(కర్నూల్) పార్టీ కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులయ్యారు.అలాగే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జె.మారయ్య(ఆలూరు), ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి(పాణ్యం), గంధం వీర రాఘవరెడ్డి(ఆళ్లగడ్డ), నారపురెడ్డి జగదీశ్వర్ రెడ్డి(జమ్మలమడుగు), రాచంరెడ్డి భాస్కర రెడ్డి(పుట్టపర్తి), రాజులపూడి భాస్కరరావు(అమలాపురం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్టీలో చీలికతో కుంగిపోయిన మమతా బెనర్జీకి ఇప్పుడు అనూహ్యమైన అండ లభించింది. ఒకప్పుడు తనపై కుట్రలు పన్నాడని, బీజేపీతో చేతులు కలిపాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన నేతే.. ఇప్పుడు మమతా బెనర్జీ కోసం తన ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం అసెంబ్లీ సభ్యురాలు కాదు. మళ్లీ సభలో అడుగుపెట్టాలంటే ఏదైనా ఉప ఎన్నికలో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె నందిగ్రామ్(సువేందు పోటీ చేసిన రెండో స్థానం.. రాజీనామా కూడా చేశారు) నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు స్వరాలు కూడా పెరుగుతుండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై.. ప్రస్తుతం ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’ (ఏజేయూపీ)ని నడిపిస్తున్న హుమాయున్ కబీర్ సంచలన ప్రకటన చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని నవడా, రెజీనగర్ స్థానాల నుంచి గెలిచిన ఆయన.. అవసరమైతే రెజీనగర్ సీటుకు రాజీనామా చేసి మమతా బెనర్జీని అక్కడి నుంచి అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.“మమతా బెనర్జీ నన్ను సంప్రదిస్తే రెజీనగర్ నుంచి ఆమెను అసెంబ్లీకి పంపగలను. నందిగ్రామ్లో పోటీ చేస్తే ఆమె గెలుపు కష్టమే. కానీ నా నియోజకవర్గంలో ఆమె విజయాన్ని నేను ఖాయం చేస్తా” అని కబీర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, “నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మమతా బెనర్జీయే. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి నన్ను బాధిస్తోంది” అంటూ తన విధేయతను కూడా చాటుకున్నారు.హుమాయున్ కబీర్పై టీఎంసీ గతంలో చేసిన ఆరోపణలు చిన్నవి కావు. బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు భారీ మొత్తంలో నిధులు స్వీకరించాడని, రాజకీయ కుట్రలో భాగస్వామి అయ్యాడని తృణమూల్ కాంగ్రెస్ స్టింగ్ వీడియోలు విడుదల చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదాల కారణంగానే ఎంఐఎం కూడా ఆయనతో పొత్తును తెంచుకుంది. అయితే కబీర్ మాత్రం అవన్నీ కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన వీడియోలేనని కొట్టిపారేశారు.అయినప్పటికీ, తనపై టీఎంసీ చేసిన ఆరోపణలు, బహిష్కరణ, రాజకీయ దాడులను పక్కనబెట్టి అదే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సహాయం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం కొనసాగిన ఆయన, తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కబీర్.. గత ఏడాది ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నమునాతో మసీదు నిర్మిస్తానన్న వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.ఇదిలా ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది. 58 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించినప్పటికీ, మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలని పలువురు స్పష్టం చేశారు. తమ వ్యతిరేకత అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతాపై కాదని పేర్కొన్నారు. ఆమెను కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అవసరమైతే తిరుగుబాటు శిబిరంలో కొనసాగడంపైనా పునరాలోచిస్తామని హెచ్చరించారు.ఒకవైపు సొంత పార్టీ తిరుగుబాటు వర్గం "మమతనే మా సుప్రీం లీడర్" అంటూ గళమెత్తుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుమాయున్ కబీర్ తన ఎమ్మెల్యే సీటునే ఆఫర్ చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాటను ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
బీజేపీకి ఝలక్.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్కళ్యాణ్ ప్రకటిస్తారని మనోహర్ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గతంలో రెండు, రెండు గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్కళ్యాణ్ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్ కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. -
రాక్షస పాలనపై రణభేరి
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి కర్నూలు/సాక్షి,నెట్వర్క్: చంద్రబాబు రెండేళ్ల రాక్షసపాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో గురువారం నుంచి 12 తేదీ వరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దగాకోరు సర్కారుకు వ్యతిరేకంగా కదంతొక్కింది. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణన్నినాదం మోగించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని నిప్పులు చెరిగింది. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావు నుంచి నేడు రాష్ట్ర ప్రజల వరకు అందరూ బాబు బాధితులేనని, ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టింది. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడవడం మినహా చేసింది ఏమీ లేదు. సూపర్సిక్స్ హామీల్లోని ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. దగాకోరు బాబు నుంచి ప్రజలను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తాం. మహోద్యమానికి ఉద్యుక్తులమవుతాం. నారాసురుడిని గద్దె దించే వరకు విశ్రమించం’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ఎగిసిన ఆగ్రహజ్వాలలుగుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. గుంటూరు గుజ్జనగుండ్ల, చుట్టుగుంట సెంటర్లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవైఎస్సార్సీపీ శిబిరం వద్దకు వచ్చి రెచ్చగొట్టే నినాదాలుచేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల అడ్డంకులను అధిగమించి నేతలు ప్రదర్శనను జయప్రదం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్లలో నిరసన కార్యక్రమం జరిగింది. పెదకూరపాడులో సూపర్సిక్స్ హామీల ప్రతులను దహనం చేశారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ ప్రభాకర్రావు జులుం ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాలల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. అనంతపురం అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నంద్యాల కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. గుంటూరులో ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి అంబటి, ప్రజలు పోలీసులు అడ్డుకున్నా...శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు వెనుకడుగు వేయలేదు. పలాస నియోజకవర్గం మందసలో మానవహారం నిర్వహించారు. నరసన్నపేటలో మానవహారం చేపట్టి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మండుటెండనూ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కారక్రమాలు చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్సిక్స్ హామీల బాండ్ ప్రతులను దహనం చేశారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై మానవహారం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పెందుర్తి, గాజువాకలో మానవహారం నిర్వహించి ఫ్లకార్డులు ప్రదర్శించి టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. ఏలూరు, నూజివీడు, పోలవరంల్లో నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నిరసనలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నగరి, కార్వేటినగరం, పూతలపట్టు, బంగారుపాళ్యంలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లెల్లో చంద్రబాబు దిష్టి»ొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిగ్విజయంగా సాగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసి టీడీపీ మేనిఫెస్టోలు దహనం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ నిరసనల ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల టీడీపీ మేనిఫెస్టో ప్రతులను వైఎస్సార్సీపీ నేతలు చించివేశారు. కొన్ని చొట్ల దహనం చేశారు. ఈ దహనం కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. -
తెలంగాణ నీళ్లు కర్ణాటకకు ధారాదత్తం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ తెలంగాణ నీటి వాటా ధారాదత్తం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కర్ణాటకకు అదనపు వాటా లేకపోయినా రాయచూర్ వద్ద నిర్మిస్తున్న కోరకుంట ప్రాజెక్టుకు నీటి సరఫరాకు అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మెప్పు పొందేందుకే డీకే శివకుమార్ సీఎం కాగానే రేవంత్ ఈ బహుమతినిచ్చారని విమర్శించారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడడంతో..మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నానని, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మాట్లాడదామా? అని అన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ‘12 ఏళ్ల తెలంగాణ: ఆకాంక్షల సాధన– భవిష్యత్ ప్రయాణం’పై నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో రాంచందర్రావు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ నేతృత్వంలో సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుదీర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా.. రామచందర్రావు మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే.. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు స్పష్టమైన పాలసీ లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కార్ రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంటూ ప్రకటనలు చేస్తోంది. తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కచ్చితంగా బీజేపీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమాజం అంశాన్నే ఎజెండాగా తీసుకోదు. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. గతంలో ఒక్క వార్డులో కూడా గెలవని త్రిపురలో ఇంకా హర్యానా, అస్సాంలలో మూడేసి సార్లు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లలో గెలిచిన బీజేపీ తెలంగాణలోనూ గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సాధనలో బీజేపీ చరిత్రాత్మకమైన పాత్రను పోషిస్తే, బీఆర్ఎస్, కాంగ్రెస్ సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ బిల్లు రూపకల్పన, సవరణల ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామినయ్యా. పార్టీ నేతల మధ్య విభేదాల్లేవు.. అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని చెప్పి, ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకులను బీఆర్ఎస్లో చేర్చుకుని ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరం. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’ లాంటి దు్రష్పచారాల వెనుక అర్బన్ నక్సల్స్ శక్తులు పనిచేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని రాజకీయ విధానాలు, అంశాలు, రాజకీయ ఎజెండా వేర్వేరుగా ఉంటాయి. వచ్చే జీహేచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్నికల విధానాలు, పొత్తులు వంటివి జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సభకు అనుమతినిస్తే సరిపోయేది. ఎలాంటి వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
త్యాగధనులను కేంద్రం అవమానిస్తోంది
డెహ్రాడూన్: రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉత్తరాఖండ్ ప్రజలు చేసిన త్యాగాలను, పడిన కష్టాలకు మోదీ సర్కార్ పూచికపుల్ల అంత విలువ కూడా ఇవ్వట్లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. ఉత్తరాఖండ్లో పాలనను మోదీ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ మాదిరి పరిపాలిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్ ఆల్మోరా, పౌడీ గడ్వాల్లో పర్యటించాలని భావించారు. అయితే ఉధమ్సింగ్ నగర్ జిల్లాలోని పంత్నగర్ ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్తో బయల్దేరిన హెలికాప్టర్ భారీ వర్షం, అననుకూల వాతావరణంతో తిరిగి ఎయిర్పోర్ట్కే చేరుకుంది. దీంతో రాహుల్ రెండు ర్యాలీల్లో వర్చువల్గా ప్రసంగించారు. ‘‘ఎంతో చారిత్రక అవసరంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలుచేశారు. మీరు సాధించిన ఈ రాష్ట్రాన్ని మీరు కాకుండా వేరే వాళ్లు(మోదీ) రిమోట్ కంట్రోల్ పాలిస్తుండటం దురదృష్టకరం. స్థానికుల ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రేతరులు ఇక్కడి సహజ సంపదను కొల్లగొడుతున్నారు’’ అని అన్నారు. కేంద్రం అమలుచేస్తున్న అగ్నిపథ్ పథకంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పౌడీ గడ్వాల్లో మాజీ సైనికుల ర్యాలీలో రాహుల్ వర్చువల్గా మాట్లాడారు. ‘‘ జవాన్లతో భారత్కు శాశ్వత పవిత్రబంధం ఉండేది. యువత జవాన్లుగా శాశ్వతంగా దేశసేవలో నిమగ్నమయ్యేవారు. దేశం కోసం సరిహద్దుల పరిరక్షణ కోసం జవాన్లు తమ రక్తాన్ని ధారపోస్తారు. అవసరమైతే ప్రాణాలను అర్పిస్తారు. అలాంటి వాళ్లకు, వాళ్ల కుటుంబాలకు భారతసర్కార్ భరోసా ఇస్తుంది. ఇలాంటి జవాన్లతో ఉండే పవిత్రబంధాన్ని ‘అగ్నిపథ్’ పథకం తెచ్చి ప్రధాని మోదీ సర్కార్ తుంచేసింది. యువతను త్రివిధ దళాల్లోకి అగ్నివీర్లుగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటూ 2022లో అగ్నిపథ్ పథకం తెచ్చారు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే ఈ అసంబద్ధ అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేస్తాం’’ అని రాహుల్ చెప్పారు. -
మమతా బెనర్జీయే మా సుప్రీం లీడర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం గుర్తింపు పొందిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరంలో తొలిసారిగా అసంతృప్తి వ్యక్తమైంది. మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలిగా కొనసాగాలని పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒకవేళ ఆమెను కేవలం సలహాదారు పదవికే పరిమితం చేస్తే, తిరుగుబాటు వర్గంలో ఉండాలో వద్దో పునరాలోచన చేస్తామని తేల్చిచెప్పారు. కొత్తగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం వారిలో భిన్న స్వరాలు వ్యక్తమయ్యాయి. తమ వ్యతిరేకత అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతా బెనర్జీపై కాదని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోనే కొనసాగాలని రెబెల్ ఎమ్మెల్యే గుల్షన్ ములిక్ తేల్చిచెప్పారు. సలహాదారుగా వ్యవహరించాలని మమను రితబ్రత కోరారు. ఈ అంశాన్ని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే రితబ్రత వర్గంలో విభేదాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ పట్ల తమ విధేయతలో ఏ మార్పూ లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చారు. -
‘డీఎస్సీ అక్రమాలను డైవర్టు చేయడానికే పవన్ పాట్లు’
సాక్షి, తాడేపల్లి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచించిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలన పూర్తయినా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపానపోలేదని.. బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ బాండ్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంతో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.పవన్ కళ్యాణ్కి పాలన చేతకాకనే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడని, చేతనైతే విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని వంగవీటి నరేంద్ర హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ఆరోపణలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనతో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి చివరికి ఏదీ కాకుండా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బాండ్ పేపర్ల మీద సంతకాలు చేసి మరీ సూపర్ సిక్స్ హామీల విషయంలో మాటతప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల తరఫున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.అక్రమ కేసులతో వేధింపులు, దాడులతో బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో అడ్డంగా దొరికిన ప్రతిసారీ ప్రజల దృష్టిని మరల్చడానికి తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జరగని కుంభకోణాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లడంతోపాటు అక్రమ కేసులతో వైఎస్ జగన్కి దగ్గరగా ఉన్న నాయకులను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క దానికీ ఆధారాలు లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు బదులు తీర్చుకోవగానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.కూటమి పాలనలో గాడితప్పిన శాంతిభద్రతలువైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నోటికొచ్చినట్టు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం అప్పులపాలై శ్రీలంకగా మారిపోయిందని ఊదరగొట్టారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారని పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారు చేసిన ఆరోపణల్లో దేనినీ నిరూపించలేకపోయింది.మహిళలకు రక్షణ కల్పస్తామని చెప్పిన కూటమి నాయకులు, రెండేళ్లుగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోయారు. కేంద్ర సంస్థల నివేదిక ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం అట్టడుగున ఉందని, మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని, నేరాలు గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెరిగాయని రుజువైంది. వైయస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ కల్పించిన దిశ యాప్కి శక్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. కూటమి ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి వేధిస్తున్నారని ఆధారాలతో సహా మహిళలు ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోకపోగా, బాధితులనే వేధిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఏం చేశాడో పవన్ కళ్యాణ్ చెప్పాలిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణకి వెళ్లి తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన అధ్యక్షుడిగా విభజన హామీలు పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి చూడటం సిగ్గుచేటు.కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ పేరుతో సంతకాలు పెట్టి రిలీజ్ చేసిన బాండ్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమాధానం చెప్పాలి. ఏపీలో పాలన గాలికొదిలేసి తెలంగాణలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పక్క రాష్ట్రం వెళ్లి విద్వేష ప్రకటనలు చేస్తున్నాడు.దీంతో పాటు అమరావతిలో అవినీతి నిరంతర ప్రక్రియగా మారిపోయింది. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ దోపిడీని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అక్రమాలను వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తుంటే ఏ ఒక్కదానికి ప్రభుత్వం జవాబు చెప్పడం లేదు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం నడుచుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్కి కూడా ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. -
‘కూటమి రెండేళ్ల పాలన ఓ పెద్ద వెన్నుపోటు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి.. గత రెండేళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలును గాలికొదిలేసి.. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం వైఎస్ జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3.50 లక్షల కోట్ల అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడమే కాకుండా.. ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ, మెగా డీఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ భూముల దోపిడీ, ఉద్యోగుల వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలతో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా గాడి తప్పించారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వ ఈ మోసపూరిత వైఖరిని, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు రాజీలేని నిరసన పోరాటాలు చేపడుతుందని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ప్రజాస్వామ్యం కాదు.. ఇది 'పొలిటికల్ గవర్నెన్స్'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినట్లుగా రాష్ట్రంలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదని, కేవలం తమ కార్యకర్తల ప్రయోజనాల కోసమే నడిచే ‘పొలిటికల్ గవర్నెన్స్’ మాత్రమే. "ప్రజాస్వామ్యం అంటే మేం ముగ్గురమే.. మేం చెప్పిందే నడవాలి" అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్త వస్తే ప్రభుత్వ అధికారి కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి పనులు చేసి పెట్టాలని మంత్రి అచ్చన్నాయుడు బహిరంగంగా ఆదేశించడం చూస్తుంటే రాష్ట్రంలో వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థమవుతోంది.కూటమి హామీల అమలు శూన్యం..ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. వాటికి అదనంగా మరిన్ని పథకాలు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, నేడు అసలు పథకాలకే ఎసరు పెట్టారు. ఈ నేపథ్యంలో కూటమి మోసాలపై వైఎస్ జగన్ పిలుపునిచ్చిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు, నాలుగు కూడళ్లలో బ్యాండు పేపర్ల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో విఫల నాయకుడుప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక్కడ సమాధానం చెప్పలేక రాష్ట్ర సరిహద్దులు దాటి మరో సమస్యలో చిక్కుకుని అందరితో తిట్లు తింటున్నారు. "పవన్ కళ్యాణ్.. మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ ప్రజా జీవితంలో మీరు పూర్తిగా విఫల నాయకుడు. నాడు ప్రశ్నిస్తానన్న నాయకుడు నేడెక్కడ దాక్కున్నాడు?". కనీసం సీఎం కూడా కాలేని వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ ఎందుకు?.డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి..వైఎస్సార్సీపీ ప్రజల తరపున నిలదీస్తుంటే.. కూటమి నేతలు సమాధానం చెప్పలేక వైఎస్సార్సీపీపై ‘గొడ్డలి పార్టీ’, ‘క్రిమినల్స్ పార్టీ’ అంటూ బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఉదయం లేచింది మొదలు వైఎస్ జగన్ పేరు తలచుకోకుండా కూటమి నేతలకు రోజు గడవడం లేదు. పేదలపై ప్రేమ ఒలకబోసే చంద్రబాబు.. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ కేటాయించిన 50 వేల ఇళ్ల స్థలాలను ‘డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్’ (జనాభా సమతుల్యత దెబ్బతింటుంది) అనే సాకుతో రద్దు చేయడం సిగ్గుచేటు. ఈ అన్యాయాలపై భాగస్వామ్య పార్టీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలి.అస్తవ్యస్త పాలన.. అక్రమాలమయం..రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది, చివరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలే సొంత ప్రభుత్వంపై అడ్డం తిరిగే పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీలో అపాయింట్మెంట్ ఆర్డర్లు రావాల్సిన అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, స్పోర్ట్స్ కోటా పేరిట పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని, బాధితులంతా వైఎస్ జగన్ను కలిసి మద్దతు కోరగా.. వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచింది. నాడు వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను రక్షిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 12 కీలక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి భక్షించే కార్యక్రమానికి తెరలేపింది.99 పైసలకే భూములు:ఏ ప్రభుత్వమైనా 99 పైసలకే ఎకరా భూమిని అమ్ముతుందా? పెట్టుబడిదారుల పేరుతో ప్రభుత్వ భూములను, పేదల అసైన్డ్ భూములను తమ అనుయాయులకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. అమరావతి నిర్మాణం అనేది అంతులేని కథగా మారిందని, గాలిలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో చారిత్రాత్మక భూసర్వే చేపడితే విషప్రచారం చేసిన కూటమి నేతలు, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ వైయస్సార్సీపీ చేసిన అభివృద్ధి పనులకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు.మహిళలపై అఘాయిత్యాలు..కూటమి ఎమ్మెల్యేలు కీచకుల్లా మారి వరుసగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. అలాగే, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఆ డబ్బు అంతా ఎటు పోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి చేసిన అక్రమ అప్పులపై ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.విద్యా, వైద్య రంగాలు ధ్వంసం.. ఉద్యోగులపై వేధింపులు..రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సూది, దూది, మందులు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి నెలకొంది. వైయస్.జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూశారు, అయితే వైయస్సార్సీపీ పోరాటానికి భయపడి ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధులు నిలిపివేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ హక్కులైన డీఏ, ప్రమోషన్స్, ఐఆర్ అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.రైతుల అరెస్టులు దుర్మార్గం..రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లపైకి వస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హతను కూటమి ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది, కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమ అరెస్టులపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుంది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి.ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం:"ఎన్నికల నాడు రంగురంగుల బ్యాండు పేపర్లు (మేనిఫెస్టో) చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజల వీపున పొడిచిన ఈ పొలిటికల్ వెన్నుపోటును జనాల్లోకి బలంగా తీసుకెళ్తాం. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగే మా ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు రైతులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తాం" అని జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కూటమి పాలకుల ప్రతి అక్రమంపై వైఎస్సార్సీపీ భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ జరిపించి తీరుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అరెస్టులు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా కూటమి మెడలు వంచే వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని జూపూడి ప్రభాకరరావు అన్నారు. -
ఇండి కూటమిలో కలకలం.. మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది?
చెన్నై: ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో తాము పాల్గొనబోమని డీఎంకే గురువారం తెలిపింది. ముఖ్యంగా "కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం" కావడంతో హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని డీఎంకే తెలిపింది."తమిళనాడు శాసనసభ ఎన్నికల తర్వాత డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్ల మా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ.. జూన్ 8న న్యూఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాదు" అని పార్టీ తెలిపింది.అయితే ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే పేర్కొంది.డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, లోక్సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డీఎంకే అధికారికంగా కోరింది. దీంతో దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్కు దూరంగా నిలిచింది.మరోవైపు, పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఇండి కూటమి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. -
మరోసారి డీలిమిటేషన్ బిల్లు.. డీఎంకే, టీఎంసీ మద్దతు?
ఢిల్లీ: పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. డీ లిమిటేషన్ పై తమ విధానంలో పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదని డీఎంకె వర్గాలు అంటున్నాయి. డీఎంకే నేతలతో అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వాజ్పేయీ మంత్రివర్గంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ గుడ్బై చెప్పడంతో పరిణామాలు మారాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది.డీఎంకే, టీఎంసీ పార్టీలకు లోక్ సభలో 50 మంది ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 50 శాతం లోక్ సభ, 50 శాతం అసెంబ్లీ సీట్లు పెంచేలా డీ లిమిటేషన్ బిల్లును రూపొందించారు. గత ప్రత్యేక సమావేశాల్లో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. జమిలి ఎన్నికల బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టి యోచనలో ప్రభుత్వం ఉంది. వర్షాకాల సమావేశాల తొలి వారంలో జేపీసీ నివేదికను వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ప్రవేశపెట్టనుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు ఉన్నాయి -
‘‘సీఎం విజయ్ను ఎంజీఆర్తో పోల్చడమేంటీ?’’
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది. అభిమాన సంఘాల నెట్వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్లా చాలా సంవత్సరాలు విజయ్ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్తో విజయ్ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కే కృష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్ను చూడొద్దు. నేను విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.సినిమాలు చూసి ప్రభావితమయ్యారు.. ‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృష్ణస్వామి అన్నారు.విజయకాంత్, శరత్కుమార్, భాగ్యరాజ్ వచ్చారు.. ‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి. ఇప్పటి కాలం మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు. -
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆటను పెట్టారు. ఏ ఆటకు ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్ సంతకం లేకుండా స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్కల్ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.ఓటు బ్యాంక్ మొత్తం..గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్కే పరిమితం. కానీ కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్లో గణనీయమైన భాగం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.అందుకే చేరికలకు విముఖత?టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.ఒడిశా మోడల్ ఇప్పుడు బెంగాల్లోనా?ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.అసలు పోరాటం ఇప్పుడే మొదలైందిప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు. -
కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బరితెగింపు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని కోట మండల ఎంపీపీ ఉపఎన్నికలో టీడీపీ బరితెగింపు రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి కౌన్సిల్ హాల్లో బలవంతంగా పార్టీలోకి లాక్కుంది. ఈ క్రమంలో పచ్చ పార్టీ బెదిరింపులపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాసామ్య ఎన్నికను వైఎస్సార్సీపీ బాయ్కాట్ చేసింది.అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ దిగజారుడు రాజకీయం చేసింది. వైఎస్సార్సీపీ బీఫామ్తో గెలిచింది 14 మంది, టీడీపీ తరఫున గెలిచింది నలుగురు. మా పార్టీ ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ కండువా కప్పి తీసుకొని వస్తారా?. వెన్నుపోటు రాజకీయాలు చేయడం టీడీపీకి మొదటి నుండి అలవాటే. పార్టీకి నమ్మక ద్రోహం చేసిన, పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీలకు భవిష్యత్తులో బుద్ధి చెబుతాం. పార్టీ కోసం నిలబడ్డ ఎంపీటీసీలకు అండగా ఉంటాం.చంద్రబాబు నీచ రాజకీయాలు మరొకసారి కోటలో బయటపడ్డాయి. నాలుగు నెలల ఎంపీపీ పదవి కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. నేరుగా ప్రజల మద్దతుతో గెలిచే ధైర్యం లేక అడ్డదారులు తొక్కారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్పే సమయం వస్తుంది అని హెచ్చరించారు. -
పవన్ స్క్రిప్ట్లో మిస్సయిన మెయిన్ మెసేజ్!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బెంగాల్లో మరో సంచలనం.. మమతకు బిగ్ షాక్!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీఎంసీలు ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. 18–20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత అసంతృప్తి, పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. పార్టీ తన కమిటీలు, అనుబంధ విభాగాలను రద్దు చేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. కాగా, 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 29 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.ఇదిలా ఉండగా, అంతకుముందు.. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్ను విసిరినట్లయ్యింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. -
నన్నే టార్గెట్ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను “పరారీలో ఉన్న వ్యక్తిని కాదు” అంటూ స్పష్టం చేస్తూనే.. రాజకీయ కారణాలతో కొందరు తన పేరును పదే పదే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కడికీ పారిపోలేదు. భారత ప్రభుత్వానికి నన్ను పట్టుకునే శక్తి ఉంది. నిజంగా కావాలంటే ఎప్పుడో పట్టుకునేవారు. ఇది ప్రభుత్వం సమస్య కాదు, మీడియా సృష్టి” అని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న ‘ఫ్యుజిటివ్’ అనే ముద్రను కూడా ఆయన తిరస్కరించారు.భారతదేశంలో కేసుల విషయంపై స్పందిస్తూ.. ‘‘నన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలన్న బలమైన కోరిక ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఆ కోరిక కలిగినప్పుడు కచ్చితంగా వాటిని ఎదుర్కొంటా’’ అని ఆయన పేర్కొన్నారు.రాహుల్ గాంధీపై ఆరోపణలులలిత్ మోదీ ప్రధానంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో, పార్లమెంట్లో తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రికెట్కు ఉన్న ప్రజాదరణ కారణంగా తన పేరును రాజకీయంగా ఉపయోగిస్తున్నారని అన్నారు.ఐపీఎల్ షిఫ్ట్ వివాదంలో చిదంబరంపై..2009లో ఐపీఎల్ను దక్షిణాఫ్రికాకు తరలించిన విషయంపైనా మోదీ మరోసారి స్పందించారు. అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తనపై ఒత్తిడి తెచ్చారని, టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ, కేంద్ర స్థాయిలో రాజకీయ కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అందుకు ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. “చిదంబరం నన్ను బెదిరించారు. ఆయన అప్పట్లో హోంమంత్రిగా చాలా శక్తివంతంగా ఉండేవారు” అని కూడా వ్యాఖ్యానించారు.భారత ప్రభుత్వం ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించేందుకు కట్టుబడి ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ జాబితాలో లలిత్ మోదీతో పాటు విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి. గతంలో లండన్లో జరిగిన విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల వీడియోను షేర్ చేస్తూ, “భారతదేశానికి చెందిన ఇద్దరు పెద్ద ఫ్యుజిటివ్స్” అని చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి దారితీశాయి. తర్వాత ఆ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ.. లలిత్ మోదీ క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు.లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లిపోయారు. అప్పట్లో ఐపీఎల్ ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన అలా వెళ్లిపోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ప్రధానంగా యూకేలో నివసిస్తూ, భారత్కు తిరిగి రాలేదు. తాను పరారీలో లేనని లలిత్ మోదీ మళ్లీ స్పష్టం చేసినప్పటికీ.. రాహుల్ గాంధీ, చిదంబరం పేర్లతో చేసిన ఆరోపణలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
రండి దొర.. రండి.. ప్రకాశ్రాజ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్రాజ్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రకాశ్రాజ్ తాజాగా ఎక్స్ వేదికగా..‘మీరొస్తానంటె మేమొద్దంటామా?. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?. లేదా సింగల్గా వస్తున్నారా?. అది చెప్పి రండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026 -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్ను విసిరినట్లయ్యింది. అసలు ఇంత తక్కువ టైంలో.. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆయన ఎలా తనవైపు తిప్పుకోగలిగాడని రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి?.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. అలాగే..తాజా రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలిచింది మాత్రం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద్ ఒపోజిషన్ (LoP) నియామకంపై వచ్చిన వివాదం. తృణమూల్లోని కొందరు ఎమ్మెల్యేలు తమ సంతకాలను ఫోర్జరీ చేసి సోభందేబ్ చటోపాధ్యాయ్ను ఎల్వోపీగా ప్రకటించారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రీతాబ్రత బెనర్జీ సహా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ “అంతర్గత వ్యతిరేక కార్యకలాపాలు” పేరిట మమతా బెనర్జీ బహిష్కరించారు. దీంతో రీతాబ్రత నేతృత్వంలోని వర్గం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.రీతాబ్రత మాములోడేం కాదు.. రీతాబ్రత బెనర్జీ.. పుట్టింది 15 నవంబర్ 1979. చదువంతా కోల్కతాలోనే సాగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో ఎస్ఎఫ్ఐలో కీలక నాయకుడిగా ఎదిగి.. సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. 34 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి సస్పెండ్ అయ్యి, తరువాత బహిష్కరణకు గురయ్యారు. అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్లో చేరి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఉలుబేరియా పూర్వ (Uluberia Purba) నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ అంతర్గత వివాదాలు, అసంతృప్తి, ఫోర్జరీ సంతకాల ఆరోపణల వివాదం నేపథ్యంలో టీఎంసీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ లోపల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించడమే కాదు.. ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రకటించుకుని, ఆ గుర్తింపు ఇవ్వాలంటూ స్పీకర్కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అసలు ‘టర్నింగ్ పాయింట్’ ఇదేబెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. టీఎంసీలో చీలిక(తిరుగుబాటు) ఒక్కరోజులో జరిగినది కాదు. దీని వెనుక మూడు కీలక దశల్లో జరిగింది.. 1) ఎన్నికల తర్వాత అసంతృప్తి పెరుగుదల: తాజా ఎన్నికల తర్వాత పార్టీ లోపల నాయకత్వంపై అసంతృప్తి వేగంగా పెరిగింది. నిర్ణయాలు కేంద్రీకృతంగా (centralized) మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లోనే ఉండటంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.2) ‘సైడ్లైనింగ్’ భావన: పార్టీ టికెట్ దక్కినా, ప్రభుత్వ–పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్, మిడ్-లెవల్ ఎమ్మెల్యేలు భావించారు. బెంగాల్ రాజకీయ భాషలో దీనిని “অবহেলা” (అవహేళన) భావనగా పేర్కొంటారు.3) రీతాబ్రత ఎంట్రీ.. “అసంతృప్త వేదిక”గా మారడం: ఇక్కడే అసలు ట్విస్ట్. రీతాబ్రత బెనర్జీ కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయనకు ముందే రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభలో టీఎంసీ, లెఫ్ట్ రెండింటిలో పని చేసిన నేపథ్యం ఉంది. దీనివల్ల ఆయనను “అనుభవజ్ఞుడైన అవుట్సైడర్”గా కొంతమంది నేతలు చూశారు.రీతాబ్రత రెబల్స్ గ్రూప్నకు ప్రాతినిధ్యం వహించడంలో రాజకీయ వ్యూహమే కీలకంగా మారింది. ప్రత్యక్షంగా పార్టీకి వ్యతిరేకంగా కాకుండా “నిర్ణయాల పునర్వ్యవస్థీకరణ” అనే నినాదంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక చోటుకి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో.. ఫోర్జరీ సంతకాల ఆరోపణ తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తన వైపు మలుచుకున్నాడు. తన సస్పెన్షన్తో “పార్టీ లోపల న్యాయం లేదు” అనే భావనను టీఎంసీ శ్రేణుల్లో బలపరిచగలిగారు. తద్వారా.. రాజకీయంగా హై-ప్రొఫైల్ కాకపోయినా, అతను లోపలే నెట్వర్క్ నిర్మించుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా.. బెంగాల్ రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలు మమత చేతిని ఎప్పుడో దాటేసి పూర్తిగా అభిషేక్ బెనర్జీ ప్రభావంలోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రీతాబ్రతకు అనుకూలంగా మారాయి.పరిశీలకులు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన తిరుగుబాట్లతో పోలుస్తున్నారు. అయితే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో సిద్ధాంత బలం ఉంది. కానీ, టీఎంసీలో అలాంటిది మచ్చుకైనా కనిపించదని విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ తిరుగుబాటు ఒక ఐడియాలజీపై కాకుండా, నాయకత్వ అసంతృప్తి, అధికార పంపకాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నారు.ఇప్పటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి.. పార్టీలో తిరుగుబాటును నియంత్రించడం. రెండోది.. అధికార కేంద్రాన్ని తిరిగి స్థిరపరచడం. పార్టీలో ఉన్న అన్ని వర్గాలు విడిపోకుండా ఒకటిగా ఉండేలా చేయగల నాయకురాలిగా మమతా మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించుకోగలగాలి..కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గిన ఉన్న నాయకుడు 60 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్లో లోపలి బలహీనతలను బయటపెట్టింది. అంతేకాదు.. తాము మమతా బెనర్జీ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని రీతాబ్రతా ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. దీంతో.. ఇది కేవలం నాయకత్వ సంక్షోభమా? లేదంటే పెద్ద రాజకీయ విభజనకు సంకేతమా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. -
వెన్నుపోటుకు రెండేళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్.. నేటి నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. అలాగే, ఈ నెల 8 లేదా 9 తేదీల్లో టౌన్ హాల్ సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతాయి. కృష్ణాజిల్లా, మచిలీపట్నం:మచిలీపట్నం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంకూటమి ప్రభుత్వ హామీల పత్రాలను తగలపెట్టి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులుబూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను వంచన చేశారుఅప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చి సంక్షేమాన్ని పక్కన పెట్టారుఅబద్ధాలు, మోసం రెండు పిల్లర్లుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తుందిహామీలను అమలుపరచకపోగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నిసిగ్గుగా ప్రజలకు ప్రచారం చేస్తూ మోసగిస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తెలియపరుస్తారు: పేర్ని కిట్టు వాల్పేపర్లు దగ్ధంవిశాఖలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆందోళనలువిశాఖ వెంకోజిపాలెం జంక్షన్, డైమండ్ పార్క్ జంక్షన్, కంచరపాలెంలో వాల్పేపర్లు దగ్ధంనంద్యాల జిల్లా..బేతంచర్ల నగరపంచాయతీలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి బుగ్గనబుగ్గన కామెంట్స్..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేకపోయాడు.అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.కరోనా సమయంలో కూటమి నాయకులు బయటకు రాకుండా బాదుడే బాదుడు అని ఇప్పుడు తీపి లడ్డూలు ఇస్తున్నారా?ఇంటింటికి తిరిగి అక్క, వదిన, బావ అని వరసలు కలిపి సూపర్ సిక్స్ పథకాలు అని నట్టేట ముంచారు.రెండేళ్లు గడిచినప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు.కూటమి నాయకులు కరెంట్ లేని సమయంలో బయటకు వెళితే ప్రజలు దుప్పటి కప్పి కొట్టే పరిస్థితి ఉంది.వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయారు.ప్రజలు అబద్ధాలు నమ్మి మోసపోయారు. విజయవాడ..మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..చంద్రబాబు అంటేనే మోసం.. మోసం అంటేనే చంద్రబాబుకూటమి ప్రభుత్వం మహిళలను ఘోరంగా వంచించింది ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక అబద్ధపు హామీలను ఇచ్చారుజగన్ కంటే ఎక్కువ పథకాలు అందిస్తామని నమ్మించారుఅధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారుకూటమి ప్రభుత్వం మహిళలకు పూర్తిగా మోసం చేసిందిఆంధ్రాలోనే ఏం పీకలేను అన్న పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందిఆడబిడ్డ నిధి పథకం ఊసే లేదుమూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని అరకొరగా మార్చేశారుమహిళలకు ఉచిత బస్సు అని చెప్పి వంచించారునిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను మోసం చేశారు50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారుఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలిచిత్తూరు జిల్లా..నగరి క్లాక్ టవర్ సర్కిల్లో టీడీపీ పోసర్ట్, మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన చేపట్టిన మాజీ మంత్రి రోజానగరిలో పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్న పార్టీ నాయకులు. కార్యకర్తలుమాజీ మంత్రి రోజా కామెంట్స్చంద్రబాబు వెన్నుపోటు పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారుసంక్షేమ పాలన అందిస్తామని చెప్పి సంక్షోభ పాలన చేస్తున్నారురాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశాడు సీఎం చంద్రబాబుచేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయి?.సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారుసూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు30 లక్షలు మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారుసంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజలు అందరూ కలిసి చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారుఎన్టీఆర్ జిల్లా..ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంఇబ్రహీంపట్నంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు కాదు 30 ఏళ్లు.1996లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడంతో మొదలైన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది.ఇచ్చిన హామీలను మరచి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకూటమి పాలనలో ఏ ఒక్క పంటకు దక్కని గిట్టుబాటు ధరలుసూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలలో చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారుచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించాలివైఎస్ జగన్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.గుంటూరు..మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్....కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదుఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వడంఅధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ఉండటం చంద్రబాబుకు అలవాటేఅందుకే ఇవాళ వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టాం.మేము గుజ్జనగుంటలో కార్యక్రమం నిర్వహించాలని ముందే నిర్ణయించుకున్నాం.టీడీపీ నాయకులు అక్కడ మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేశారువైఎస్ జగన్ దిష్టిబొమ్మను పోలీసులు దగ్గర ఉండి దగ్ధం చేయించారుటీడీపీ నాయకులు దగ్ధం చేయాల్సింది జగన్ దిష్టి బొమ్మను కాదు చంద్రబాబు దిష్టి బొమ్మని.ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేయాలిమా ఇంటి పైన దాడి చేసిన వారంతా ఇవాళ నిరసన పేరుతో గుజ్జునుకుంట దగ్గర హడావిడి చేశారుప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కాదువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..చంద్రబాబు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు నిరసన తెలుపుతున్నాం..నిరసనలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో, బాండ్లు తగలబెడుతున్నాం.మహిళా లోకం మా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారుజగన్ హయంలో ఆసరా, చేయూత, ఇంటి స్థలం వంటివి అందించారుకూటమి 50ఏళ్లకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అన్నారు..చదువుకున్న పిల్లలకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదు.ఏ ఒక్క పథకం అమలు చేయలేదుమ్యానిఫెస్టోని ఏవిధంగా తగలబెట్టారో అదే విధంగా చంద్రబాబును మంటల్లో వేస్తారు .జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించారు.. ఇళ్ల పట్టాలు ఇచ్చారు..చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నది చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రమే.ప్రజానీకం డబ్బులతో మంత్రులు సింగపూర్లో జల్సాలు చేస్తున్నారుజగన్ను చూసి కూటమి నేతలు పరిపాలన నేర్చుకోవాలి.చంద్రబాబు కరెంట్, పెట్రోల్, కూరగాయలు వంటి రేట్లు పెంచారు8వ తేదీన టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం..12వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహిస్తాం..చంద్రబాబుకు బుద్ది వచ్చే విధంగా పోరాటం చేస్తాం. నంద్యాల..నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్..వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం చెయ్యడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సరైనది కాదు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన శిల్ప చక్రపాణి రెడ్డిప్రజల అధికారం ఇస్తే రెండేళ్లలో ఏం చేశావు ప్రజలకు చెప్పుఅధికారం ఇస్తే నియోజకవర్గంలో నువ్వు చేయని అరాచకాలు లేవుకూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ కావడంతో ప్రజలు తిరస్కరించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందిశ్రీశైలం నియోజకవర్గంలో నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరురాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందిసూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరగలేదుప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాడులు దౌర్జన్యాలు దుర్భాష లాడటం పరిపాటిగా మారిందిఇలాంటివి చేసి భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితుల్లో లేము.అవసరమైతే ఎదురు దాడి చేయడానికి కూడా వెనకాడం.టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి హెచ్చరిక. అనంతపురం..వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లుహామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలంనిరసనగా అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనవైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనచంద్రబాబు హామీలపై ప్లకార్డుల ప్రదర్శననల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలువైఎస్సార్ జిల్లా..పులివెందులలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనటీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులుకార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధు రెడ్డి, ఇతర నాయకులుప్రొద్దుటూరులో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనమాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పార్టీ నేతల నిరసనలు. విజయవాడ..విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంసూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోను అమలు చేయని కూటమి ప్రభుత్వంఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీకార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. నంద్యాల జిల్లా..ఆత్మకూరు పట్టణంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.వైఎస్సార్సీపీ ఆఫీసుతో పాటు పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అలర్ట్.నంద్యాల నుంచి ఆత్మకూరు వస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శాంతి భద్రతల దృష్ట్యా ఆత్మకూరులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పార్టీ నాయకులకు నోటీసులుసవాళ్లు ప్రతి సవాళ్ల నేపధ్యంలో ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్తతఅవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు. -
రెండు ముక్కలైన దీదీ పార్టీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 28 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రెండు ముక్కలైంది. 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పార్టీని చీల్చేశారు. అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా అధికారికంగా గుర్తింపు పొందారు. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమను టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. మరోవైపు ఇప్పటికీ మమతా బెనర్జీయే తమ నాయకురాలు అని రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. తమ శాసనసభ బృందానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలని, తమకు మార్గనిర్దేశం చేయాలని ఆమెను కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ప్రారంభమైన తిరుగుబాటు చివరకు పార్టీని చీల్చడం గమనార్హం. పార్టీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అంతర్గత పోరు పట్ల వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ వర్గం తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను తక్షణమే రద్దు చేసింది. ఈ పరిణామాలు టీఎంసీ దుస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల బలం తృణమూల్ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ బుధవారం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ రతీంద్ర బోసుతో సమావేశమయ్యారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తించాలని కోరారు. మొత్తం 58 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను స్పీకర్కు సమరి్పంచారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే రితబ్రత వర్గంపై అనర్హత వేటు పడదు. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రితబ్రతకు 58 మంది మద్దతు ప్రకటించడంతో ఆయన వర్గాన్ని శాసనసభాపక్షంగా స్పీకర్ గుర్తించారు. తగిన సంఖ్యా బలం ఉండడంతో అనర్హత వేటు తప్పినట్లే. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సమర్ ముఖోపాధ్యాయ, అరూప్ రాయ్, రతిన్ ఘోస్, జావెద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ సైతం అసమ్మతి వర్గంలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం బయట ఉన్న మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం తమకే మద్దతు ఇస్తున్నారని, వారు త్వరలోనే తమ శిబిరంలో చేరుతారని రితబ్రత బెనర్జీ చెప్పారు. తామంతా తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపైనే ఎన్నికల్లో గెలిచామని, అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. స్పీకర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టంచేశారు. అఖ్రుజమన్ను చీఫ్ విప్గా, జావెద్ అహ్మద్ ఖాన్, సాందీపన్ సాహా, సబీనా యాస్మిన్, షియులీ సాహాను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించినట్లు చెప్పారు. తమ శాసనసభాపక్షం కొత్త కూర్పును స్పీకర్ ఆమోదించారని, ప్రతిపక్ష నాయకుడి కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తనకు కేటాయించారని తెలిపారు.ఎందుకీ ముసలం? తృణమూల్ కాంగ్రెస్లో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలన్న దానిపై తొలుత వివాదం మొదలైంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అసెంబ్లీ స్పీకర్కు గతవారం లేఖ రాశారు. సీనియర్ ఎమ్మెల్యే శోభన్దేవ్ చటోపాధ్యాయను టీఎంసీ శాసనసభాపక్ష నాయకుడిగా, ఫర్హాద్ హకీంను చీఫ్ విప్గా నియమించాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా పంపించారు. దీనిపై రగడ జరిగింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీఐడీ విచారణకు కూడా దారితీసింది. అభిషేక్ బెనర్జీకి సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించారన్న కారణంతో రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, తమ అధినేత మమతా బెనర్జీ మాత్రమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఆమె టీఎంసీ చైర్పర్సన్గా పనిచేస్తారని వెల్లడించారు. శాసనసభాపక్షానికి సంబంధించిన అంశాల్లో దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు.వీరవిధేయుడే కానీ...కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి విధేయుడిగా పేరుగాంచిన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆమెపైనే తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ దీదీని ఆయన కొంతకాలం క్రితం వరకు రష్యా దివంగత నేత వ్లాదిమిర్ లెనిన్తో పోల్చేవారు. ధీరవనితగా కొనియాడేవారు. అసలు సిసలైన ప్రజా నాయకురాలిగా కీర్తించేవారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడైన రితబ్రత బెనర్జీ నేడు తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికను సృష్టించడం గమనార్హం. 28 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేని అంతర్గత తిరుగుబాటుకు నేతృత్వం వహించారు. ఆయన మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నారంటూ రాజకీయ విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏకంగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 46 ఏళ్ల యువకుడైన రితబ్రత వెనుక జట్టుకట్టడం ఆసక్తికరంగా మారింది. రితబ్రత 1979 నవంబర్ 15న కోల్కతాలో జని్మంచారు. కోల్కతాలోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు. కాలేజీలో వామపక్ష భావజాలం ఉండేది. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించారు. 2008లో వామపక్ష విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చురుకైన యువ నేతగా అందరి దృష్టిని ఆకర్శించారు. 2011లో 31 ఏళ్ల వయస్సులో కోల్కతా సౌత్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా బక్షి చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా రు. మూడేళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆయనకు అండగా నిలిచారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. కమ్యూనిస్టు నాయకుడైన రితబ్రత బెనర్జీ జీవనశైలి అప్పట్లో విలాసవంతంగా ఉండేది. ఖరీదైన వస్తువులు, ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించేవారు. దీనిపై పార్టీలో అసంతృప్తి చెలరేగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సీనియర్ నాయకులు విమర్శలు గుప్పించారు. క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. 2017లో రితబ్రతను సీపీఎం నుంచి బహిష్కరించారు. తర్వాత బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయ్వర్గియాతో రితబ్రత సన్నిహితంగా మెలిగారు. ఓ మహిళకు సంబంధించిన వివాదంలో పోలీసు కేసు నమోదు కావడంతోపాటు చట్టపరమైన ఇబ్బందుల వల్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. 2020లో రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిపోవడంతో అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీకి సారథ్యం వహించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మినబంటుగా మారారు. ప్రతిఫలంగా 2024లో రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ సైతం దక్కింది. ఎమ్మెల్యేగా గెలిచారు. అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. పార్టీలో అతడి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు ప్రారంభించారు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
రేవంత్ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీశ్రావు చేసిన విమర్శల్లో తప్పేమీ లేదు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీపై తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాం. రేవంత్ సీఎం కాగానే తెలంగాణ తల్లి రూపం మార్చి, సెక్రటేరియట్ ముందు రాజీవ్గాంధీ విగ్రహం పెట్టాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ విగ్రహాలను గాందీభవన్కు పంపుతాం. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలపై రుద్దింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి తిరోగమనంలోకి నెడుతోంది. మోదీ– రేవంత్ భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం సాగుతోంది. మొదటి అర్ధభాగం ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ పాలనలో ట్రైలర్ కాదు, ఇంటర్వెల్ కూడా పూర్తయింది. మిగతా అర్ధభాగం మరింత అధ్వానంగా ఉంటుంది. ఆయన తెలంగాణను పాతాళంలోకి తొక్కుతున్నారు. మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీని రేవంత్ బొంద పెడతారు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రవికాంత్రెడ్డి వ్యవహరించగా.. ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.విజయ్కుమార్రెడ్డి, వరికుప్పల రమేష్ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. పదేళ్లలో సాధించిన ప్రగతి క్షీణించింది.. తెలంగాణ రైజింగ్ నినాదం పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్ జరుగుతోంది. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పురోగతి ప్రస్తుతం క్షీణించింది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు కాంగ్రెస్ హామీలతో మోసపోయారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఉచిత విద్యుత్ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్రెడ్డి సిద్ధాంతం. లేని అప్పులను ఉన్నదిగా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆర్బీఐ తన నివేదికతో చెంపదెబ్బ కొట్టింది. తెలంగాణాకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్ మాకు పొలిటికల్ గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 90కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి ఓడిపోతారు. దుమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఉప ఎన్నికలకు రావాలి. 2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నా. బీజేపీతో పొత్తు ఉంటుందన్నది పూర్తిగా ఊహాజనిత ప్రచారం. బీఆర్ఎస్కు కేసీఆర్ ట్రంప్ కార్డు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్. ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు. పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ ఖచ్ఛితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అనడంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. ఈ నేల.. పోరాటాలు, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిచింది. మీరు వచ్చి మీ కుటుంబాలతో ఉండండి. మీ భూములు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదం అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నాడు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయేందుకు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? మోదీ ఆర్థిక ప్రాంతీయ వాదం సరైనదేనా? ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తీసుకెళ్తున్నారు. జాతీయ వాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం, గుజరాత్కు ప్రధానమంత్రి మాదిరి వ్యహరిస్తున్న తీరు సరైనదేనా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. జనగణమన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. మాకు జాతీయ భావన, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్ కళ్యాణ్ను నటుడిగా అభిమానిస్తాం, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం. పవన్ వ్యాఖ్యల వెనుక రేవంత్ ఉన్నట్టు అనుమానం ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో 2018లో చంద్రబాబు టీడీపీ, 2023లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసింది. తెలంగాణలో కొత్తగా జనసేన పోటీ చేసేదేం ఉంది? తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇక్కడకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు వచ్చి ఇక్కడ సభ పెట్టి విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. మరొకాయన ంతల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. జనసేన సభకు అనుమతి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారనే అనుమానం వస్తోంది. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చట్టం చేయాలి ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే.. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తాం. రేవంత్రెడ్డి హయాంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని అన్ని కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లకే దక్కుతున్నాయి. సుంకిశాల నిర్మాణం కూలిన ఘటనలో కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టు చేయాలని జలమండలి కోరితే.. చేయలేని దమ్ములేని సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. సెక్షన్ 8ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర గతంలో కొంత జరిగింది. మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలో మరో బలమైన ఉద్యమం వస్తుంది. -
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
అసలే ఓటమి బాధతో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరో పిడుగుపడేలా చేశారు రితబ్రత బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారని ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభా పక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ను కూడా స్పీకర్ అంగీకరించారని ఆయన చెప్పారు.తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మద్దతుగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచి, శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టు స్పీకర్ రథీంద్ర బోస్కు అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ చర్యతో తృణమూల్ కాంగ్రెస్ శాసన విభాగంపై నియంత్రణ తిరుగుబాటు వర్గానికి వెళ్లినట్టయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద సవాలుగా ఇది నిలిచింది.అసలు రితబ్రత బెనర్జీ ఎవరు?పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బా నియోజకవర్గం నుంచి రితబ్రత బెనర్జీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,838 ఓట్ల తేడాతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎన్నికల పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, రితబ్రత విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సోమవారం బహిష్కరణకు గురైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రితబ్రత ఒకరు. ఒకప్పుడు సీపీఎంలో ఎదుగుతున్న నాయకుడిగా, వామపక్షాల భవిష్యత్ నేతగా భావించేవారు. అయితే ఓ వివాదాస్పద ఘటన, వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఎదుగుదల ఆగిపోయింది. 2018లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించిన వెంటనే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం రితబ్రతను బహిష్కరించింది. ప్రతిపక్ష నేతగా శోభన్దేబ్ చట్టోపాధ్యాయ్కు మద్దతు తెలిపిన పార్టీ లేఖపై తమ సంతకాలు నకిలీవని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తెలిపారని ఆరోపణలు వచ్చాయి.రితబ్రత రాజకీయ ప్రయాణంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. వామపక్ష ఉద్యమంలో ప్రారంభించి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వేగంగా ఎదిగి, సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. పార్టీ కీలక యువ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత వామపక్షాల్లో ఆయన ప్రభావం తగ్గి, 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.తృణమూల్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనం ప్రారంభమైంది. అక్కడ కూడా సంస్థాగతంగా ఎదిగారు. తొలుత పార్టీ కార్మిక సంఘ విభాగ బాధ్యతలు అప్పగించారు. తర్వాత రాజ్యసభ నామినేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, రితబ్రత ఉలుబేరియా పూర్బా నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా ఆయనను చూస్తున్నారు. టీఎంసీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును పొందారు. రితబ్రత బెనర్జీ పార్టీ నాయకత్వ అధికారాన్ని సవాలు చేస్తున్న తీరును మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సృష్టించిన రాజకీయ ప్రకంపనలతో పోలుస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
బిగ్షాక్.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఇప్పటివరకు పార్టీని ఏకపక్షంగా నడిపించిన మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం ఒక వైపు, అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కించుకున్న రెబల్ ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ వర్గం మరో వైపు ఇలా టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్ తీర్మానించారు.ఈ సందర్భంగా రితాబ్రత మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీ పార్టీ కన్వీనర్, ఎంపీగా ఉన్న అభిషేక్ బెనర్జీకి అసెంబ్లీతో సంబంధం లేదు. మే 6న మమతా బెనర్జీ నివాసంలో ఎలాంటి తీర్మానం జరగలేదు. మే 19న మాత్రమే మేం సంతకం చేశాం. మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్కు లేఖ పంపారు. అందుకే అభిషేక్ బెనర్జీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.మే 6న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగిందని ప్రచారం జరిగింది. ఈ సమావేశంలో దీదీ వర్గానికి చెందిన సోభన్దేబ్ చటర్జీని ప్రతిపక్ష నేతగా, ఇతరులను డిప్యూటీ లీడర్స్, చీఫ్ విప్గా నియమించేందుకు పార్టీ ఎమ్మెల్యేలందరూ తీర్మానించారని తెలుపుతూ టీఎంసీ పార్టీ కన్వీనర్ అభిషేక్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్కి లేఖ ద్వారా సమాచారం పంపారు.అయితే రితాబ్రత, సందీపన్ ఇద్దరూ ‘ఆ ప్రచారంలో వాస్తవం లేదు. దీదీ నివాసంలో మే 6న ఎలాంటి తీర్మానం జరగలేదు. మే 19న మాత్రమే మేం సంతకం చేశాం. మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్కు అభిషేక్ బెనర్జీ లేఖ పంపారు. అందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ పరిణామం మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటివరకు ప్రతిపక్ష హోదా ఆమె ఆధీనంలోనే ఉండేది. కానీ రితాబ్రత బెనర్జీకి ఆ హోదా దక్కడంతో అసెంబ్లీ లోపల మమతా ప్రభావం తగ్గిపోతుంది. టీఎంసీ లోపల విభేదాలను మరింతగా బహిర్గతం చేస్తూ, మమతా నాయకత్వానికి సవాలు విసురుతోంది.మమతా బెనర్జీకి ప్రతిపక్ష హోదా కోల్పోవడం వల్ల ఆమెకు ఉన్న ప్రతిష్ట, అధికారిక గుర్తింపు, అసెంబ్లీ వేదికపై ప్రత్యేక హక్కులు అన్నీ తగ్గిపోతాయి. ఇకపై ప్రతిపక్ష నేతగా రితాబ్రత బెనర్జీకి అధికారిక గుర్తింపు లభించడం, టీఎంసీ రెండుగా చీలిపోవడంతో మమతా బెనర్జీకి రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. #WATCH | Kolkata, West Bengal | Expelled TMC MLA Ritabrata Banerjee says, "... As far as the 18th West Bengal Legislative Assembly is concerned, Abhishek Banerjee has no relation with this Legislative Assembly. As a member of the Parliament, he has sent a letter earlier with… pic.twitter.com/G0Nqx3rW4V— ANI (@ANI) June 3, 2026 -
ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై పచ్చ మూకలు దాడికి యత్నించాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అరాచకాలను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యాలయంపై చొచ్చుకొచ్చిన టీడీపీ గూండాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(గురువారం) జరగబోయే కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. -
మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు మినహా అందరూ...
బెంగళూరు: డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీ పరమేశ్వర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కొత్త మంత్రివర్గంలో శివకుమార్ సహా ఇద్దరు నేతలు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు మంత్రులు మైనారిటీ వర్గాలకు చెందినవారు. పరమేశ్వర సహా ఇద్దరు మంత్రులు దళిత వర్గాలకు చెందినవారు.జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, రామలింగ రెడ్డి, సతీశ్ జార్కిహోళి, యూటీ ఖాదర్, కృష్ణ బైరె గౌడ, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, శరణ ప్రకాశ్ పాటిల్, బైరతి సురేశ్, ఈశ్వర్ ఖండ్రే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఖాదర్, యతీంద్ర మినహా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గతంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. ఖాదర్ కర్ణాటక శాసనసభ స్పీకర్గా సేవలు అందిస్తున్నారు. ఇక సిద్ధరామయ్య కుమారుడే యతీంద్ర. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సిద్ధరామయ్య, శివకుమార్తో సమావేశమై కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్న నేతలపై మంగళవారం కూడా చర్చలు జరిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రెండో మంత్రివర్గ విస్తరణ రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంది.గత వారం శివకుమార్ను కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ వివాదానికి ముగింపు పడింది. పదవి నుంచి వైదొలిగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే శివకుమార్ పేరును ప్రతిపాదించారు. పరమేశ్వర ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలోనే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నాయకత్వ పోటీ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. -
డీకేకు సీఎం కిరీటం.. 2028 ఎన్నికలే లక్ష్యంగా మాస్టర్స్ట్రోక్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేలా చేసి, డీకే శివకుమార్కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సక్సెస్ఫుల్గా అధికార మార్పిడి చేసింది. అయితే, 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండనుంది? డీకే శివకుమార్కు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయి?కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్కు అత్యంత కీలక నాయకుడిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న తన ఎన్నో ఏళ్ల ఆకాంక్షను జూన్ 3న నెరవేర్చుకున్నారు.కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిద్ధరామయ్యది. ఆయన నుంచి బాధ్యతలను శివకుమార్కు అప్పగించడం ద్వారా కాంగ్రెస్.. కొత్త ముఖ్యమంత్రి అనుచరుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారాన్ని నడిపిన శివకుమారే ఈ పదవికి అర్హుడని ఆయన అనుచరులు భావించారు.రాజస్థాన్, పంజాబ్ పరిణామాలు ఇలా.. పైకి కనిపిస్తున్న దాని ప్రకారం.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2020లో రాజస్థాన్, 2021లో పంజాబ్లో జరిగిన పరిణామాల కంటే మెరుగ్గా నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పటికీ 2020లో అశోక్ గెహ్లాట్ను కొనసాగించారు. అంటే, సచిన్ పైలట్ సీఎం పదవి కోసం ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ను మార్చకుండా పదవిలోనే కొనసాగించింది. పంజాబ్లో 2021లో అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్జిత్ సింగ్ చన్నీని తీసుకొచ్చారు. అయితే ఆ మార్పులు అన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం ఇవ్వలేదు.కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ వంటి వొక్కలిగ (కర్ణాటకలోని ఒక ప్రముఖ సామాజిక వర్గం) నాయకుడిని ఎంపిక చేసింది. బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అన్ని వర్గాలను కలుపుకోవాలి.. జేడీఎస్ అగ్ర నాయకులు కూడా వొక్కలిగ వర్గానికే చెందినవారు. పాత మైసూరు ప్రాంతంలో ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు శివకుమార్ వారితో దశాబ్దాలుగా పోటీపడుతున్నారు. సాధారణంగా కర్ణాటకలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 35 ఏళ్ల ఈ రాజకీయ సంప్రదాయాన్ని కాంగ్రెస్, శివకుమార్ సరైన వ్యూహంతో ముందుకు సాగితే చెరిపివేసే అవకాశం ఉంది.రాజకీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న శివకుమార్ ఇప్పుడు 2028 ఎన్నికల్లో విజయానికి ప్రణాళిక రూపొందించాలి. పార్టీకి చెందిన అన్ని వర్గాలను కలుపుకుని నడవాలి. కీలక విధాన నిర్ణయాల సమయంలో సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.అనేక సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను అమలు చేసినప్పటికీ కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.19,500 కోట్లు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది అతి తక్కువ స్థాయి.ఇది కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, కర్ణాటక మొత్తం ఆదాయ వసూళ్లలో పెరుగుదల కేవలం 6.3% మాత్రమే నమోదైంది. ప్రాంతాల మధ్య స్పష్టంగా కనిపిస్తున్న అసమానతలను తగ్గించడం ప్రాధాన్యంగా ఉండాలి. 2024-25లో బెంగళూరు నగర జిల్లా కర్ణాటక జీఎస్డీపీకి దాదాపు 40% వాటా అందించింది. దక్షిణ కన్నడ, బెలగావి జిల్లాలు వరుసగా 5.3%, 3.9% వాటా అందించాయి.ప్రస్తుతం రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక వనరులు, అభివృద్ధి అవకాశాలు తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ముఖ్యమంత్రులు వెనుకబడిన వర్గాలపై ప్రభావం చూపుతున్న క్లిష్ట సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. శివకుమార్కు ఉన్న అనుభవం ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడవచ్చు. -
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని లోక్ భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసినవారుడీకే శివకుమార్ జీ పరమేశ్వర్కె హెచ్ మునియప్పకె జే జార్జ్ఎం బీ పాటిల్రామలింగ రెడ్డిసతీశ్ జరకిహోళికృష్ణ బైరెగౌడప్రియాంక్ ఖర్గేయూటీ ఖాదర్ఈశ్వర్ ఖండ్రేయతీంద్ర సిద్ధరామయ్యబైరతి సురేశ్శరణ ప్రకాశ్ పాటిల్భద్రత కట్టుదిట్టంలోక్ భవన్లో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డీకే శివకుమార్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. శివకుమార్ను అభినందిస్తూ నగరమంతా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న సిద్ధరామయ్యకు శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కాంగ్రెస్లో కీలక బాధ్యత లభించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కర్ణాటకలో దీర్ఘకాలంగా సాగిన పోరు తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2023 మేలో అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ సందేశండీకే శివకుమార్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. “అందరినీ కలుపుకుని ముందుకు సాగండి. మీరు కర్ణాటకకు విజయవంతంగా నాయకత్వం వహిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీ కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించండి” అని ఆమె చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖులు డీకే శివకుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. -
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
పవన్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..‘దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి పోటీ చేసుకోవచ్చు. ఎక్కడ పోటీ చేస్తారో ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవాలి. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రమే పవన్ను అడ్డుకున్నారు. ఓటమిని చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మీటింగ్ పెట్టి విభజన సరిగా జరగలేదని అంటున్నారు. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి. తెలంగాణలోనే ఉన్నాయి కదా.తెలంగాణ నాలుగు కోట్ల భూమి పుత్రులది. తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణ గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు. మోదీ జాతీయ వాదం ముసుగులో ఆర్ధిక ప్రాంతీయ వాదం చేయడం లేదా?. ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా?. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కదం తొక్కిన నేల తెలంగాణ. ప్రాంతీయవాదం అంటున్న పవన్.. మరి మద్రాసు నుంచి వేరుపడటం కోసం పొట్టి శ్రీరాములు చేసింది ఏంటి?. దేశభక్తి గురించి పవన్ మాకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోము. పవన్ సినిమా పేరు ఓజీ.. కానీ తెలంగాణ ఓజీ కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అవుతుంటే మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడాము అని గుర్తు చేశారు. -
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
సాక్షి, సోమాజిగూడ: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి సాధించినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోని తప్పుకుంటానని సవాల్ చేశారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డి.. అందరినీ తొక్కేస్తా అంటూ నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా సోమాజిగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఎన్నో పోరాటాలు, బలి దానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ పుట్టింది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం పూర్తి అయ్యింది. తెలంగాణ పోరాట, త్యాగాలను స్మరించుకోవాలి. అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టేలా చేశాం. గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నిర్మించాం. 2014కు ముందు వలసలు, ఆత్మహత్యలు ఉండేవి. తెలంగాణ వచ్చాక వలసలను అరికట్టాం, ఆత్మహత్యలను నిర్మూలించాం. రైతుల ఆత్మహత్యలు నివారించాం. తెలంగాణను టాస్క్గా తీసుకున్నాం. కేసీఆర్ తెచ్చిన పథకాలను కేంద్రం సైతం కాపీ కొట్టింది. చివరకు మాపైనే అహంకారం అనే ముద్ర వేశారు. అధికారం పోయింది అనే బాధ మాకు లేదు. తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ మనపై రుద్దింది. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో 300 మంది అమరులను బలిగొన్నది కాంగ్రెస్. 2004లో కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ కథలో నంబర్-1 విలన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ ఆమరణ దీక్ష లేకపోతే తెలంగాణ లేదు. 2001లో పార్టీ పెట్టి ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి అన్న గుండె ధైర్యం ఒక్క కేసీఆర్కు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవచ్చు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాంతాలుగా విడిపోయినా కలిసి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా కేసీఆర్ పాలన సాగింది. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రాజెక్ట్లను నిర్మించాం. తెలంగాణలో నాయకత్వ కెపాసిటీ ఉందా? అని అడిగిన వాళ్ళు మాకు కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండేది అనే పరిస్థితి వచ్చింది.కేసీఆర్ తెలంగాణలో అమోఘమైన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి జరిగిందా?. కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నా. ఇతర రాష్ట్రాల్లో ప్రగతి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఇస్తామన్నారు. మళ్లీ మూడు నెలల్లో పిల్లలు పుడతారా? అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 30 నెలలు అయినా హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని ఏమనాలి?. ఢిల్లీకి కప్పం కట్టడం ఒక్కటే రేవంత్ రెడ్డికి తెలుసు. కేసీఆర్ నామస్మరణ తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏంటి?. తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది’ అని ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొక్కేస్తా.. తొక్కేస్తా అని నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశాడు. మా పదేళ్ల పాలనలో మేము రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారు. మంత్రులు పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేబినెట్లో మంత్రులకు శృతి, లయ లేదు. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. రెండేళ్లలో కాంగ్రెస్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బంతా ఏం చేశారు. దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కం ఇక్కడే ఎందుకు? అని ప్రశ్నించారు. -
ఆలయానికి వచ్చిన నలుగురు నేతలు సీఎంలయ్యారు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖచ్చితంగా బాధ్యతలు చేపడతారని ఆనాడే జోస్యం చెప్పామని గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు శ్యామాచారి గుర్తుచేశారు గతంలో ఈ ఆలయాన్ని సందర్శించిన నేతల్లో నలుగురు సీఎం పీఠాన్ని అధిరోహించారన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబరులో రాయచూరు జిల్లా పర్యటనలో భాగంగా గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామికి శివకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా.. గాణదళ పంచముఖీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మధ్వమతాచార్యుడు గురు రాఘవేంద్రస్వామి ఇక్కడే 16 సంవత్సరాలు తపస్సు చేసి, పంచముఖీ హనుమంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు చెబుతారు. త్రేతాయుగంలో.. రామ-రావణ సంగ్రామం సమయంలో.. రామలక్ష్మణులను మైరావణుడు అపహరించి, పాతాళానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..! వారిని కాపాడేందుకు హనుమంతుడు గాణదళ నుంచే పాతాళానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతారు. మైరావణుడి ప్రాణం అయిదు భ్రమరాల్లో ఉండడంతో.. వాటిని ఏకకాలంలో చంపేందుకు హనుమంతుడు పంచముఖీ ఆంజనేయస్వామి అవతారమెత్తినట్లు చెబుతారు. ఇక్కడ హనుమంతుడి కోసం కుట్టే భారీ తోలుచెప్పులు ప్రతీ ఐదేళ్ల కోసారి అరిగిపోవడం విశేషం. -
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో భారీ చీలిక చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లి తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు. ఈ పరిణామంతో తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలుపుతున్నారని, దీంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఆయనను ప్రతిపక్ష నేత (LoP)గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో అధికార టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త శక్తి రూపుదిద్దుకుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.బెంగాల్లో టీఎంసీ దారుణ ఓటమి తర్వాత.. ఆ పార్టీలో మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి బయటపడుతోంది. ఇక ఇటీవల మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన టీఎంసీ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అది దాదాపు ఖాయమైంది. అదే సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలంతా విడిగా ఓ హెటల్లో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీటా బ్రతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పార్టీ చీలిక నిజంగానే జరుగుతోందా? లేదంటే ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? అన్నది బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.మహా సీన్ రిపీటా?టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తి మరింత పెరిగితే పార్టీపై మమతా బెనర్జీ పట్టు బలహీనపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కీలకంగా మారితే.. పార్టీ ఆమె చేజారి పోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉదాహరణగా చెబుతున్నారు.2022లో మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మొదలైన అసంతృప్తి.. ఏక్నాథ్ షిండే వర్గం భారీగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో అసెంబ్లీలో మెజారిటీ సమీకరణం మారిపోయింది. చివరికి పార్టీ గుర్తు, నాయకత్వం కూడా మారిన పరిణామం రాజకీయంగా పెద్ద మలుపుగా నిలిచింది. రీటా బ్రతా బెనర్జీ చేసిన 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలిస్తున్నాయనే చెప్పొచ్చు. మహారాష్ట్ర శివసేన సంక్షోభం తరహాలో టీఎంసీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు సమీకరణం మారితే, ప్రస్తుత అసంతృప్తి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని మమతను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎవరీ రీటా బ్రతా బెనర్జీ..రీటా బ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వివాదాలతో పాటు వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కోల్కతా సౌత్ పాయింట్ హైస్కూల్, అసుతోష్ కాలేజీలో చదువుకున్న ఆయన 2000ల ప్రారంభంలో విద్యార్థి రాజకీయాల ద్వారా ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనను సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికు దగ్గరగా ఉన్న యువ నాయకుడిగా భావించేవారు.తరువాత 34 ఏళ్లకే సీపీఎం ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం ఆయనను తొలుత సస్పెండ్ చేసి, తరువాత పూర్తిగా బహిష్కరించింది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగ విమర్శలు చేయడం, అంతర్గత విభేదాలు తీవ్రమవ్వడం ఈ చర్యకు కారణమయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఆయన, పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టి తిరిగి రాజకీయంగా పుంజుకున్నారు.టీఎంసీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రయాణం వివాదాల నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ ఆరోపణల వివాదం ఆయనను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. పార్టీ కమ్యూనికేషన్లో తప్పుదారి పట్టించే సంతకాలు ఉన్నాయని ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పార్టీ చర్యలు తీసుకుని ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య.. మమతకు దగ్గరేనా?తాజాగా ఆయన “50 మంది ఎమ్మెల్యేల మద్దతు” ఉందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రీటా ఒక్కసారిగా రెబల్ వర్గానికి కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ మద్దతు ఎంతవరకు వాస్తవమో ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇలాంటి క్లెయిమ్స్ సాధారణంగా అంతర్గత అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు. అలాగే..మాజీ సీఎం మమతా బెనర్జీతో ఆయన సంబంధంపై చూస్తే.. ప్రారంభంలో పార్టీ వేదికలో భాగంగా ఉండటం వల్ల ఒక స్థాయి సాన్నిహిత్యం, రాజకీయ సమన్వయం ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఆ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనను మమతకు “దగ్గర నేత”గా కాకుండా, పార్టీ లైన్కు వ్యతిరేకంగా నిలిచిన రెబల్ నేతగా మాత్రమే చూస్తున్నారు. -
'బాబు'ది నో ఆన్సర్.. ఓన్లీ డైవర్షన్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఎం రమేష్కు షాకిచ్చిన జనసేన నేత
సాక్షి, అనకాపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కూటమి నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే.. పాలకుల అరాచకాలను బయటపెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని వంశీ డిమాండ్ చేశారు.వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు.అలాగే, అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ పాల్పడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు. -
ప్రమాణస్వీకారం వేళ డీకే కీలక వ్యాఖ్యలు
“నేను వెళ్లబోయే మార్గం సులభం కాదని నాకు తెలుసు..” అంటూ కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ వర్గాలను, విశ్లేషకులను ఆయన మాటల్లో అంతర్యాన్ని వెతుక్కునే పనిలో పడేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో సాయంత్రం 4.05 గంటలకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంకేతాలు అందుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే..ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల నుంచి తనపై ఉంచిన నమ్మకానికి తాను కృతజ్ఞుడినని ఆయన తెలిపారు. అదే సమయంలో “ముందున్న మార్గం సులభం కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు, పాలనలో ఎదురయ్యే సవాళ్లపై ముందస్తు సంకేతంగా భావిస్తున్నారు.డీకే శివకుమార్ ఎమోషనల్గా చేసిన వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ పాలనా దిశపై హింట్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆయన “ఒక కొత్త యువ యుగం ప్రారంభమవుతుంది” అని చేసిన వ్యాఖ్యలు.. కొత్త ప్రభుత్వంలో యువత, అభివృద్ధి, సమగ్ర పాలనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను కలుపుకుని పాలన సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: Karnataka CM-designate DK Shivakumar says, "The faith and the confidence the people of this country have shown me, I am very much obliged, and I have to do a lot of hard work and deliver. I know roads will not be so easy. It will be difficult times, but still I… pic.twitter.com/0LutwvdX9l— ANI (@ANI) June 3, 2026ఈ పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన “యువ యుగం” వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, తన వర్గానికి ప్రాధాన్యం కొనసాగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం సీనియర్ల మద్దతును ఆయన ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీకే యువత, అభివృద్ధి, సమగ్ర పాలనపై ఇచ్చిన సంకేతాలు భవిష్యత్ పాలనా శైలిపై స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్లో కొత్త సమీకరణాలు, అంతర్గత సమతుల్యతపై చర్చలు మరింత వేగం అందుకున్నాయి.డీకే శివకుమార్ అలియాస్ డీకే.. 64 ఏళ్ల వోక్కలిగా నేతగా, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్యక్రమాన్ని కొంత నియంత్రిత స్థాయిలో నిర్వహిస్తున్నారు. -
విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!
సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం విజయ్ తిరుచ్చి పర్యటనలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ ఎ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలోని అన్నా అరివాలయ మంగళవారం పార్టీ సీనియర్నేత ఆర్ఎస్ భారతీతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి విజయ్ వైఖరిని, పరిపాలనా పరిణితిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చూస్తే విచారంగా, అలసటతో, తడబాటుగా, నిస్సహాయతతో కనిపించే సీఎం విజయ్.. తిరుచ్చి సభకు వెళ్లేసరికి అంత ఉత్సాహంగా, వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలిగారు? ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు?‘ అని రాజా ప్రశ్నించారు. మోదీ ముందు ఎందుకు నోరు విప్పలేదు: తాను కూర్చున్న సీఎం పదవికి తగినట్లు కాకుండా, తన స్థాయిని తగ్గించుకుని విజయ్ సినిమా డైలాగులు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు కేవలం 10 నిమిషాలే కదా సమయం ఇచ్చారు... ’విజయ్ బ్రో’.. అప్పుడు ప్రధాని ముందు మీ శౌర్యం ఏమైంది?, అక్కడ ఎందుకు మాట్లాడకుండా వచ్చారు?, వచ్చాక కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టకుండా ఎందుకు వెళ్లిపోయారు? అని రాజా నిలదీశారు. పాలనపై అవగాహన లేదు రైతుల సమస్యలు, ఎన్నికల మేనిఫెస్టోపై విజయ్ ప్రభుత్వాన్ని రాజా తప్పుపట్టారు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలు లేకుండా పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదన్న కనీసం ఈ ప్రాథమిక విషయం కూడా తెలియకుండానే 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారా? అని ప్రశ్నించారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఈ విషయాల్లో టీవీకే ప్రభుత్వం తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదని మండి పడ్డారు.స్టాలిన్ సీఎంగా ఉన్నంత వరకే మేఘదాతు సమస్య, విజయ్ ఒక లెక్కే కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ అంటుంటే.. దానికి తమరి ప్రభుత్వం ఎందుకు బదులివ్వడం లేదు? అని ప్రశ్నించారు.నిద్ర పట్టడం లేదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే ఇప్పటికీ స్టాలిన్ కారణం అంటున్నారని మండి పడ్డారు. విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది, రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. మనం అసలు ఎటు వైపు వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు, డీఎంకే ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని హితవు పలికారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటమి ఊహాగానాలపై స్పందిస్తూ, పార్టీలోని రెండు, మూడో శ్రేణి నాయకులు ఏవైనా మాట్లాడి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ తమ పార్టీ అధినేత తుది నిర్ణయం ఏంటి? తాము అధికారికంగా ఎగ్జిక్యూటివ్ లేదా జనరల్ కౌన్సిల్ సమావేశాలు పెట్టి తీర్మానాలు చేశామా? లేదు కదా‘ అని స్పష్టం చేశారు. వీసీకే తిరుమాపై అమితమైన ప్రేమ ఉందని, ప్రేమ ఉన్నచోటే కోపం వస్తుంది. కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులపై తమకు అంతగా కోపం రాదు. ఇది కేవలం ఒకే కూటమిలోని సోదరుల మధ్య వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదం మాత్రమే. ఇది శాశ్వతం కాదు అని ఆ. రాజా తేల్చిచెప్పారు. -
విజయ్కు గట్టి పోటీ! అతడి ఎంట్రీతో సంచలనం తప్పదా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీజేపీకి అన్నామలై గుడ్బై చెప్పారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, డీఎంకే–అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలు ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.డీఎంకే–అన్నాడీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ముఖ్యంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం విజయ్ నాయకత్వం ఒకవైపు చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్న అన్నామలై పేరు మరింత బలంగా వినిపిస్తోంది.అన్నామలై బీజేపీని వీడుతున్నారన్న వార్తలను కేవలం సంస్థాగత మార్పుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్, ప్రత్యక్ష విమర్శల ధోరణి ఆయనను తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముఖంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించకపోయినా, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆకర్షణను పూర్తిగా తక్కువ అంచనా వేయలేమన్న చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ ఆయన్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.ఇక సీఎం విజయ్ విషయానికి వస్తే.. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ నిర్మాణ బలం, అనుభవం వంటి అంశాల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోటును ప్రత్యర్థులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే భవిష్యత్ రాజకీయ సమీకరణాన్ని నిర్ణయించనుంది.ఈ నేపథ్యంలో అన్నామలై పాత్రపై చర్చ మరింత కీలకంగా మారింది. ఆయన బీజేపీలోనే కొనసాగి పార్టీని బలోపేతం చేస్తారా? లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే కూటములకు ప్రత్యక్ష సవాల్గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాలకంటే కూడా ఆయనకు ఉన్న ఇమేజ్, యువతలో ప్రభావం ఆయనను ఒక “పొలిటికల్ ఫోర్స్”గా చూస్తున్న వాదన బలపడుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో “సీఎం విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ సవాలుగా ఎవరు ఎదుగుతారు?” అనే ప్రశ్నే తమిళనాట కీలకంగా మారింది. ఈ కోణంలో చూస్తే అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి తమిళ రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. ఒకవైపు సీఎం విజయ్ కొత్త ప్రభుత్వం, మరోవైపు డీఎంకే–అన్నాడీఎంకే సంప్రదాయ ప్రతిపక్ష బలాలు, మధ్యలో అన్నామలై వంటి కొత్త ముఖం రాజకీయ సమీకరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాట అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అన్నదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు..అమరవీరుల స్వప్నాలను సాకారం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన సొంత ఏటీఎంగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: నితిన్ నబీన్ ‘జై తెలంగాణ‘నినాదంతో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కాంగ్రెస్ అవినీతి పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఒక అవినీతి ప్రభుత్వం పోయిందనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఘోరమైన మరో అవినీతి సర్కార్ కొలువు దీరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు కప్పంగా కడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా నిలబడ్డారని, వాజ్పేయి హయాం నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతుగా ఉందన్నారు. తెలంగాణ వికాసం, సమృద్ధి కేవలం మోదీ నేతృత్వంలోని ‘వికసిత్ తెలంగాణ’తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది ఊసరవెల్లి రాజకీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి, వెనుక నుంచి మిర్చి పౌడర్లు, పెప్పర్ స్ప్రేలు కొట్టించిన ఊసరవెళ్లి రాజకీయాల చరిత్ర కాంగ్రెస్దని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది అమాయకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నాడు బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ‘బంగారు తెలంగాణ’పేరుతో కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకొని, తీవ్ర అవినీతితో దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు వచి్చన రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదన్నారు. సహకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రగతి: రాంచందర్రావు తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు..అది అసంఖ్యాక త్యాగాల ఆత్మగౌరవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. ‘వికసిత్ తెలంగాణ’–‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’లు పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతో కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’స్వప్నం సాకారమవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మైండ్ సెట్ను బయటపెట్టుకుందని రాంచందర్రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులకు, అర్బన్ నక్సలైట్ల సభలకు అనుమతులిచ్చే ఈ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. సెంటిమెంట్ రాజకీయం సాగదు: ఎంపీ రఘునందన్రావు ఏపీకి వెళ్లి మాజీమంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయొచ్చు కానీ, పవన్ కల్యాణ్ వస్తే తప్పా? అని నిలదీశారు. ఉడత ఊపులకు బీజేపీ భయపడదని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. -
ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన పోరాటం అధికారం కోసం కాదు.. తెలంగాణ కోసం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసం.. తెలంగాణ తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతోంది. తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగిలించుకు పోతోంది. అందుకే మరోసారి ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విష ప్రచారాలతో అధికారంలోకి కాంగ్రెస్ ‘గత ప్రభుత్వం పైనా, కేసీఆర్ పైనా చిల్లర ప్రచారాలు చేశారు. అబద్ధాలతో కూడిన విష ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 హామీలతో ప్రజలను మోసం చేసింది. దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు వచ్చింది. అడ్డదారిలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టింది. రైతుబంధు లేదు..ఎరువుల్లేవు ⇒ సంతోషంగా సాగిన తెలంగాణ వ్యవసాయం ఈ రోజు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుబంధు లేదు.. ఎరువులు ఇచ్చేవాళ్లు లేరు.. పండించిన పంట రెండు నెలలైనా కొనేవాళ్లు లేరు. ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు. నాలుగు సార్లు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారు. 70 లక్షల మంది రైతన్నలు బాధతో, ఆవేదనతో రేవంత్రెడ్డిని తిడుతున్నారు. గురువు గారికి నదీజలాల సమర్పణ ⇒ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. కేసీఆర్ను బద్నామ్ చేయాలనే పగతో ప్రాజెక్టులపై దాడి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ హక్కులుగా కాపాడాల్సింది పోయి గురువు గారికి సంతర్పణ చేసే పరిస్థితి తీసుకొచ్చారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి.. ⇒ ‘నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసింది. అశోక్నగర్లో యువతను కూర్చోబెట్టి ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టారు. రెండున్నరేళ్లలో కనీసం నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్గాం«దీకి ఇప్పుడు తెలంగాణకు రావడానికి మొహం చెల్లడం లేదా? దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్నగర్ చౌరస్తాకు పోలీసుల్లేకుండా రావాలి. క్షీణించిన శాంతి భద్రతలు తెలంగాణను మేం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చాం. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గనుల పేరుతో దోపిడీలు సాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయింది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో వినిపిస్తున్న నినాదం ఒక్కటే. అదే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!
కోల్కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.ఎస్ప్లనేడ్లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.శోభన్దేబ్ చటోపాధ్యాయ్ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పోరాడతాం లేదా చనిపోతాం: ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.మొదట ఎస్ప్లానేడ్లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్ పాలిటిక్స్తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.కోల్కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. -
50 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ? టీఎంసీ ఇక తమదేనంటూ..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కోల్కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్లో “మహారాష్ట్ర మోడల్” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారని కూడా చెప్పారు.బెంగాల్లో మహారాష్ట్ర నమూనా?బెంగాల్లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. -
బీజేపీకి అన్నామలై రాజీనామా
సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్మీట్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్ హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్మీట్కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో వెటకారంగా ఓ పోస్ట్ చేశారు. -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
రెండు పడవలపై రేవంత్ ప్రయాణం!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.కాంగ్రెస్పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్కు ఎలా స్పూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు కదా! అంటే ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్ ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక హార్స్ పవర్కు ఏభై రూపాయలకే రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్కు ఏమి సంబంధం. వైఎస్సార్ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.బహుశా సోనియాగాంధీ ఆయన అంటే పడదు కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్కు ఉండగా, ఎన్టీఆర్ పేరును అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్లోకి వచ్చాక ఎన్టీఆర్ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన ఒక్కరే అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే, విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్తో పోల్చి రేవంత్ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.అలాగే కాంగ్రెస్ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్కు పడి ఉండవచ్చు. కాని భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే రేవంత్రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తమిళ రాజకీయాల్లో కొత్త స్క్రిప్ట్.. అన్నామలైకి మైనస్సే!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ కలకలం నడుస్తోంది. బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. వరుస అవమానాల నేపథ్యంలో అనుచరుల నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయని.. అందుకే పార్టీకి గుడ్బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆ ప్రచార సారాంశం. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ వాతావరణం వేడెక్కించింది మాత్రం.. ఇందులోకి సీనియర్ నటుడు, సూపర్స్టార్ రజినీకాంత్ పేరు వచ్చి చేరడం.మాజీ ఐపీఎస్ అయిన అన్నామలైకి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. అలా ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. ఇక డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చీఫ్గా ఓ మినీ యుద్ధమే చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రతిపక్షం అన్నాడీఎంకే కంటే ఆయన బెటర్ అవుట్పుట్ కనబరిచారు. అయితే.. బీజేపీ ఆ క్రేజ్ను సరిగ్గా వాడుకోలేదనే చర్చ నడుస్తుంటుంది అక్కడ.ఎన్నికల ముందు పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా మొండి చేయి, ఎన్నికల ప్రచారంలోనూ ప్రాధాన్యత తగ్గించడం లాంటి పరిణామాలు ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనం పెంచింది. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు తగ్గిపోవడంతో కొత్త పార్టీ ప్రతిపాదన తెర మీదకు వచ్చిందని తెలుస్తోంది. ఈ పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో “అన్నామలై కొత్త పార్టీ పెడతారా?” అన్న చర్చ వేగంగా పెరిగింది. దీనికి కారణాలుగా నెటిజన్లు చూపుతున్న అంశాలు ఇవి:యువ నాయకుడిగా ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుల తర్వాత వచ్చిన అనిశ్చితిసాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన మాట్లాడే శైలి.. ఇవన్నీ కలిపి “తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి” అనే ఊహాగానాలకు బలం ఇచ్చాయి.మరోవైపు.. అన్నామలైకి రాజ్యసభ సీటు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారనే ప్రచారం ఈ మధ్యే వినిపించింది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ భావించిందని.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారని.. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి లేదంటే తన పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తికే ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నారనన్నది ఆ ప్రచార సారాంశం. ఈలోపు..మరో ప్రచారం తోడైంది. సీనియర్ నటుడు రజినీకాంత్ ఆశీర్వాదంతోనే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తులపై చర్చ వచ్చిన ప్రతిసారీ రజినీకాంత్ పేరు సహజంగానే తెరపైకి వస్తుంది. ఆయనకు ఉన్న విస్తృతమైన ఫ్యాన్ బేస్ అందుకు ప్రధాన కారణం. అలా అన్నామలై కొత్త పార్టీకి రజినీ సపోర్ట్ అంటూ జోరుగా పోస్టర్లతో ప్రచారం నడుస్తోంది. రజినీకాంత్ కర్ణాటక మూలాలు కలిగి ఉండటం, అలాగే అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య “ కర్ణాటక కనెక్షన్” ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..అన్నామలై చుట్టూ నడుస్తున్న చర్చకు ఒక సమాంతర వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయ ప్రయాణం స్వయంగా ఒక “అన్ఫినిష్డ్ చాప్టర్”గా మిగిలిపోయిందని.. కాబట్టి అనన్నామలైకు ఆ అవసరమే లేదన్నది ఆ వాదన. రజినీకాంత్ 2017–2021 మధ్య రాజకీయ ప్రవేశానికి గట్టి సంకేతాలు ఇచ్చినా, చివరికి పార్టీ ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆరోగ్యం, రాజకీయ ఒత్తిళ్లు, సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కొందరు విశ్లేషకులు—“పొలిటికల్ స్పేస్లో రజినీకాంత్ ఒక ‘మిస్డ్ ఛాన్స్’ మాత్రమే” అని వ్యాఖ్యానిస్తారు.ఇక మరో అంశం సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తోంది. రజినీకాంత్ ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అధికార పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి స్పష్టమైన విమర్శలు చేయకపోవడం, ఆయనను “పాసివ్ స్టాండ్”లో ఉన్న నేతగా చూపిస్తోందని ఒక వాదన ఉంది. కొంతమంది అయితే ఆయన స్టాలిన్ను కలిసిన సందర్భాలను ప్రస్తావిస్తూ, ఆయన డీఎంకేకు సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో.. ఆయన విజయాన్ని రజినీకాంత్ బహిరంగంగా అభినందించలేదన్న అంశాన్ని కూడా కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “నాకేం అసూయ లేదు” అని ఇచ్చిన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. దీనిని ఆధారంగా చేసుకుని, రజినీ ఇప్పుడు “యాక్టివ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్” కలిగిన వ్యక్తి కాదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.ఈ నేపథ్యంతోనే అన్నామలై వంటి యువ నాయకుడికి రజినీ మద్దతు అవసరం లేదని. కారణం, ఆయనకు ఇప్పటికే ఉన్నది ఒక వేరే పొలిటికల్ ఐడెంటిటీ. ఐపీఎస్ నేపథ్యం, బీజేపీలో ఎదిగిన సంస్థాగత అనుభవం, సోషల్ మీడియాలో ఉన్న యువ ఫాలోయింగ్.. ఇవే ఆయనకు ప్రధాన బలం అని ఈ వర్గం భావిస్తోంది. -
సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్కు డీకే బ్రేక్!
ఢిల్లీ: కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిమండలి కూర్పు వ్యవహారం హస్తినకు చేరుకుంది. మాజీ, కాబోయే సీఎంలు ఇద్దరూ హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలి, ప్రభుత్వం ఎలా సాగాలి అనే దానిపై చర్చిస్తున్నారు. రేపటి(బుధవారం)లోగా కొత్త అమాత్యుల జాబితా రెడీ కావచ్చు.కర్ణాటక కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. అధిష్టానం పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారు. దాదాపు పదిమంది పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ కౌన్సిల్ సీట్ల పైన చర్చలు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, హెచ్కే పాటిల్, బీకే హరిప్రసాద్కు శివకుమార్ మద్దతు పలకగా, అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తున్నారు. సిద్ధరామయ్య వర్గానికి 10కి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.జీ.పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబి పాటిల్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారని.. మరో వైపు ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇవొద్దని డీకే శివకుమార్ వాదిస్తున్నట్లు సమాచారం. అలాగైతే మరో పవర్ సెంటర్గా మారుతారని డీకే వాదిస్తున్నారు. సిద్ధ రామయ్య తనయుడు యతేంద్రకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. తొలి దశలో పది నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు(బుధవారం) ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సిద్దరామయ్య సతీమణి పార్వతి, తనయుడు యతీంద్రకు పదవులు లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. రాజీనామా చర్చల సమయంలో హైకమాండ్ నేతలు సిద్దరామయ్యకు రాజ్యసభ స్థానం ఆఫర్ ఇచ్చారు. కానీ సిద్దరామయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. ఆయనకు బదులు భార్య పార్వతికి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా సిద్దరామయ్య అంగీకరించలేదని, ఆమెకు రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేదని చెప్పారని సమాచారం. ఇక పుత్రుడు యతీంద్రకు మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. -
బీజేపీ అంత సాహసం చేస్తుందా?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.బహిరంగంగానే అంగీకారంపార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్బుక్ లైవ్లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.అభిషేక్పై అసంతృప్తి?పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి నిష్క్రమణల పరంపరఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎందుకు దూరమవుతున్నారు?రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీజేపీ అంత సాహసం చేస్తుందా?టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనతటీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.అసలైన పరీక్ష ఇప్పుడేబెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. -
ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా?
బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ నితిన్ నబిన్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు.త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది.జూన్ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. బెంగళూరు సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉంటూ మంచి పేరు సంపాదించారు. -
చంద్రబాబు రెండేళ్ల పాలన అట్టర్ఫ్లాప్
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలన సూపర్హిట్ కాదని, అట్టర్ఫ్లాప్ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చెప్పారు. చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలు, అసత్యాలు అని ప్రజలు తెలుసుకున్నారన్నారు. అందుకే కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం నిర్వహించిన సభలో నుంచి మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు. రాజా సోమవారం తుని మండలం ఎస్.అన్నవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. విధ్వంసం తప్ప అభివృద్ధి లేని చంద్రబాబు రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. సభలో చంద్రబాబు మాట్లాడిన 10 నిమిషాల్లోనే మహిళలు బయటకు వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు.ప్రజల కోసం ఏం చేశారో చెప్పుకొనే అవకాశం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఆరులక్షల మందికి పింఛన్లు తొలగించారని చెప్పారు. ఆడబిడ్డ నిధి, రైతుభరోసా తదితర పథకాలను ఇవ్వలేదన్నారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. మంచి చేయకపోగా గత ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ప్రజలు గమనించారన్నారు. వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయమని, అందుకే పదేపదే గొడ్డలి పార్టీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. -
‘యువగళం’ బ్యాచ్కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.సోమవారం కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.కాగా, బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. -
సీఎం విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ రహస్యం బయట పడింది
సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
అన్నామలై సంచలన నిర్ణయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన అనుచరులు కూడా తమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి అన్నామలైని ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.ఇటీవల తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవి మార్పు, అనంతరం జరిగిన పరిణామాలపై అన్నామలై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి.అన్నామలై కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నప్పటికీ.. ఆయన ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లేనని, అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మక్కల్ శక్తి ఖచ్చి (టీఎంఎస్కే)’గా వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బీజేపీ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. తమిళనాడులో కూడా నాయకత్వ మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో, ఈ నెల చివర్లో కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వదంతులు అన్నామలై కేంద్ర నాయకత్వం ముందు తన బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహమని ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు.2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం, నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్ వంటి సీనియర్ బీజేపీ నాయకుల ప్రభావం తగ్గిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అన్నామలై కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ స్థానంలో వనతి శ్రీనివాసన్కు అవకాశం ఇ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన అన్నామలై చివరికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని గానీ ఆశించే అవకాశంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.రాజీనామా నిజమేనా?అన్నామలై పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్కు తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న అన్నామలై, తన నిర్ణయాన్ని ఖరారు చేస్తూ నబిన్ను కలవనున్నారు.ఇప్పటికే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ సమావేశం కోసమే కాకుండా తన ఆరేళ్ల రాజకీయ జీవితం పట్ల కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నన్నారని, ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనకు కల్పించిన అవకాశాలు, అనుభవాలు, రాజకీయ ప్రయాణానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
‘తెలంగాణ ప్రజలకు పవన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలి’
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్.. ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను అవమానించిన విషయంలో కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి. పవన్ సభ పై బీజేపీ, బిఆర్ఎస్ మౌనం వెనక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బిఆర్ఎస్ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు. పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు! -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ కీలక ప్రకటన
ఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేందుకు భారత్కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.అయితే, అభిజీత్ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. Important announcement:CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026 -
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నిలకకు సంబంధించిన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పది రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. -
అధికార మదమా?.. పవన్ తీరుపై వైరల్ వీడియో
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు -
డిప్యూటీ సీఎం పోస్టులు లేవా?
శివాజీనగర: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానాలను సృష్టించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆదివారం కల్బుర్గిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రెండు దశల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. డీసీఎం పదవుల గురించి ప్రస్తావన రాలేదు. జూన్ 3 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటుగా తొలి దశలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనేది 2 రోజుల్లో ఖరారవుతుందన్నారు. తొలి దశ మంత్రిమండలి ఏర్పాటు తరువాత 15 రోజుల్లోగా 2వ దశ మంత్రివర్గ విస్తరణ అవుతుందని, పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఒకవేళ డీసీఎంలు అవసరమైతే ఎంతమంది ఉండాలనేది చర్చిస్తాము, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. జూన్ 3 తరువాత స్పష్టమైన చిత్రం లభిస్తుంది అని చెప్పారు.కేపీసీసీ సారథిపైకేపీసీసీ అధ్యక్షుని మార్పుపై ఖర్గే స్పందిస్తూ, సీఎం ప్రమాణం తరువాత సహజంగానే కేపీసీసీ కొత్త సారథి నియామకం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సుపరిపాలనకు ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుని మధ్య ఉత్తమ అవగాహన అవసరముందన్నారు. సీఎం, మంత్రులతో ఐకమత్యంతో పనిచేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో శక్తియుక్తులు, ప్రజా మద్దతు కలిగిన నేతను పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చర్చలు జరిగాయన్నారు.


