breaking news
Politics
-
మరాఠా గడ్డపై సరికొత్త చరిత్ర.. తొలి డిప్యూటీ సీఎంగా సునేత్ర
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో ఐదుగురు మహిళలు.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యలక్ష్మి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.కమలమ్మ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1952లో కమలమ్మ తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో, ఆమె దేశ చరిత్రలోనే మొదటి ఉప ముఖ్యమంత్రిగా చర్రితలో నిలిచిపోయారు.పాముల పుష్ఫ శ్రీవాణి.. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.తారాసింగ్.. పంజాబ్కు చెందిన తారా సింగ్ 1960లో తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె విధుల్లో కొనసాగారు.రాజేంద్ర కౌర్ భట్టాల్.. పంజాబ్కు చెందిన రాజేంద్ర కౌర్ భట్టాల్ 1996లో ఉప ముఖ్యమంత్రిగా విధుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లకు పైగా ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు.నిత్యానందా దేవి.. బీహార్కు చెందిన నిత్యానందా దేవి 1990ల్లో తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో ఆమె విధులు నిర్వహించారు.జమునా దేవి.. మధ్యప్రదేశ్కు చెందిన జమునా దేవి 1998లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం ఐదేళ్ల పీరియడ్ మొత్తం ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దీంతో, ఎక్కువ కాలం డీప్యూటీ సీఎంగా ఉన్న మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.కమలా బెనీవల్.. రాజస్థాన్కు చెందిన కమలా బెనీవల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 2003లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.దియా కుమారి.. రాజస్థాన్కు చెందిన దియా కుమారి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వంలో 2023 నుంచి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.పార్వతీ పరిడా.. ఒడిశాకు చెందిన పార్వతి ప్రస్తుత సీఎం మోహన్ చరణ్ మాంఝీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. 2024 జూన్ నుంచి బాధ్యతల్లో ఉన్నారు.అయితే, దేశంలో ముఖ్యమంత్రి స్థానాల్లో మహిళలు ఎక్కువ కాలం సేవలు చేసినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రలుగా మాత్రం చాలా తక్కువ మంది, తక్కువ కాలం మాత్రమే విధుల్లో ఉన్నారు. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం (2026 జనవరి నాటికి) రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఒడిశా) మాత్రమే మహిళలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహిళల రాజకీయ ప్రాధాన్యం పెరుగుతున్నందున మరిన్ని రాష్ట్రాల్లో మహిళలు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. -
గుంటూరులో టీడీపీ జంగిల్ రాజ్
పల్నాడులో మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నించిన టీడీపీ గూండాలు.. ఇవాళ గుంటూరులో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు . అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ::సాక్షి ప్రతినిధి, గుంటూరు -
కేసీఆర్పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ విషయం సునేత్ర కూడా చెప్పలేదు: శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. పేపర్లో ఓ వార్త చూశా. అందులో ప్రఫుల్ పటేల్, సునీల్ టాటాకరే.. ఇలా ఇతరుల పేర్లే కనిపించాయి. ఆమె డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడుతోందనే విషయం నాకు తెలియదు. ఆమె నాతో కూడా ఆ మాట చెప్పలేదు. బీజేపీ కూటమితోనే కొనసాగాలని ఆమె భావిస్తుందని మేం అనుకోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనిపై నేను, మా వర్గం ఎలాంటి చర్చా జరపలేదు. బహుశా ఆమె పార్టీనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొచ్చు.రెండు వర్గాల విలీనంపై స్పందిస్తూ.. గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు నడుస్తున్నాయన్నారు. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. జనవరి 17న విలీనంపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నాం. విలీనం సమయంలోనే ఇది ఊహించని పరిణామం అని అజిత్ పవార్ మృతిని ఉద్దేశించి అన్నారు. అయితే.. ఆయన(అజిత్ పవార్) కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 2023 జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) వర్గం రెండుగా చీలింది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలలో.. 40 మందితో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరారు. ఆ తర్వాత అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీ గుర్తింపు దక్కింది. దీంతో శరద్ పవార్ తన వర్గానికి ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ కూటమి అని పేరు పెట్టారు. 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. పవర్ షేరింగ్లో భాగంగా.. అజిత్ పవార్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే.. జనవరి 28వ తేదీన తన నియోజకవర్గం బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో అజిత్ పవార్(66) మరణించారు. దీంతో ఈమధ్యలో జరిగిన ఎన్సీపీ వర్గ విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో.. ఆయన వర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము గౌరవిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఎన్సీపీ వర్గం ఆమెను శనివారం లెజిస్టేచర్ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆపై ఇవాళ సాయంత్రం ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది. మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోవింద్బాగ్లో పవార్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్ తనయుడు రోహిత్ పవార్ హాజరయ్యారు. అయితే ఇది కుటుంబ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం అనే ప్రచారం జరుగుతునప్పటికీ.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళే ఈ భేటీ జరగడం రాజకీయ చర్చా అనే అనుమానాలకు తావిస్తోంది. -
కూటమి అపచారం.. వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువచ్చింది. దీంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తుల డిమాండ్ చేస్తున్నారు.విజయవాడఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా?.ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తారా?.రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగుతారా.రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు క్షమాపణ చెప్పాలి.జరగని ఒక ఘటన జరిగిందని ప్రచారం చేసారు సీబీఐ అలాంటిది ఏమి లేదని చెప్పింది.పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వచ్చి మళ్ళీ మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నా.కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక సమాధానం చెప్పలేక తిరుగుతున్నారు. కర్నూలు..కల్లూరు అర్బన్లోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలునంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలుచంద్రబాబు, పవన్ చేసిన అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులువారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకన్నను వేడుకుంటూ టెంకాయలు కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలువిజయవాడలబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పక్షాళన పూజలుపూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు.బందర్ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేసిన పార్టీ శ్రేణులుచంద్రబాబు, పవన్ వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు విశాఖ..సీతమ్మధార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు.పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి , పార్టీ నేతలు.తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారంపై నేతలు ఆగ్రహం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు.. వైయస్సార్ జిల్లా...బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో 101 టెంకాయ కొట్టి పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు...కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పులివెందుల నాయకులు ప్రత్యేక పూజలు విశాఖ..మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..కేకే రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారంపై పార్టీ నేతల ఆగ్రహం..ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టిన నేతలు..పాప పరిహార పూజకు భారీగా హాజరైన పార్టీ శ్రేణులు.. -
మహారాష్ట్ర రాజకీయం.. అజిత్ కుమారుడికి బంపరాఫర్!
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్ కుమారుడు పార్థ్ పవార్కు బంపరాఫర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్ పవార్.. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.సునేత్ర రికార్డుమహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. -
నేను టీడీపీ.. మా పార్టీ వాళ్లే.. కొంప ముంచారు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘సొంత పార్టీ కార్యకర్తనే సర్వనాశనం చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కై నా ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు. ఎదురు తిరిగితే భార్యను, కుమార్తెల జీవితం నాశనం చేస్తామని బెదింరించారు. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. వ్యాపారంలో నేను సంపాదించిన ఆస్తులన్నీ సొంత పార్టీ వాళ్లే లాక్కోవడంతో రోడ్డున పడ్డాను’ ఇది ప్రకాశం జిల్లా టంగుటూరు టీడీపీ కార్యకర్త కారుమంచి సురేంద్ర ఆవేదన. శుక్రవారం విజయవాడ ప్రెస్క్లబ్లో తనకు జరిగిన అన్యాయంపై కారుమంచి సురేంద్ర భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను గత 25 ఏళ్లుగా అధికార టీడీపీకి చెందిన కామని విజయ కుమార్, కామని బాల మురళీ మోహన కృష్ణ, కామని రాజా రంగ భూపతిలకు చెందిన ‘ప్రగతి టొబాకో ట్రేడర్స్’ కంపెనీలో క్లర్క్గా, ఆ తర్వాత అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కేవలం ఉద్యోగం మీద వచ్చే జీతం మీదే ఆధారపడకుండా కుటుంబాన్ని 2014లో ‘నవ్య సప్లయర్స్’ పేరుతో టెంట్ హౌస్, ‘నవ్యాస్ డిజే’ ‘ఎల్ఈడీ స్క్రీన్స్’ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా మేనల్లుడు నలతోటి సుధీర్ ఈ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. 2022లో సింగరాయకొండలో ఒక రెస్టారెంట్ ప్రారంభించాను. ఆ తర్వాత రైతుల దగ్గర పొగాకు కొనుగోలు చేసి ఇతర కంపెనీలకు అమ్మడం ప్రారంభించాను. అలా కిలో రూ. 180 చొప్పున 50 టన్నుల పొగాకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాను. ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీకి ఎగుమతి ఆర్డర్ వచ్చింది. మార్కెట్లో పొగాకు కిలో రూ. 260కు చేరింది. దీంతో నేను పనిచేస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరైన బాల మురళీ మోహనకృష్ణ నా వద్ద ఉన్న పొగాకుపై కన్నేశారు. తక్కువ ధరకు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు నేను అంగీకరించలేదు. కిలో రూ.260 ఉండగా కేవలం రూ.200ల ధరకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. మార్కెట్ రేటు ఇస్తే నా పొగాకు ఇచ్చేస్తానని చెప్పాను. తక్కువ కులం వాడివి మా దగ్గర తింటూ మాకే ఎదురు తిరుగుతావా? నీ బతుకు ఎంత? నీవు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను. అంటూ బెదిరించాడని సురేంద్ర వాపోయాడు. ఆ తర్వాత కిలో రూ. 250లకు కొనుగోలు చేస్తానని, తనను ఒంగోలు రావాలని నమ్మబలికాడు. అందుకు అంగీకరించి గతేడాది ఆగస్టు 28న ఒంగోలు బయలు దేరిన తనను మార్గమధ్యంలో ట్రాఫిక్ సీఐ వై. పాండురంగారావుతో పాటు మరికొంత మంది పోలీసులు నన్ను అక్రమంగా ఎత్తుకెళ్లి నిర్బంధించారు. విపరీతంగా కొట్టి బెదిరించారు. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న నా పెద్ద కూతురుని నాశనం చేస్తామన్నారు. నా భార్యను, నా ఇద్దరు ఆడపిల్లలను నీచంగా దూషించారు.గన్తో బెదిరించి ఆస్తి పత్రాలపై, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. ఎస్పీ ఏఆర్. దామోదర్, డీఎస్పీ రాయపాటి సాంబశివరావుల ఆదేశాలతో సీఐలు హజరత్తయ్య, పాండురంగారావు, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, కమలాకరరావు మా ఇంటిపై దాడి చేసి రూ.40 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారు. అక్కడ నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆ సొమ్ము మొత్తాన్ని ఎస్పీ దామోదర్, డీఎస్సీ సాంబశివరావులు.. బాల మురళీ మోహన కృష్ణకు అప్పగించారు. నన్ను, నా భార్య కమల, నా మేనల్లుడు సు«దీర్ ను మరోసారి అక్రమ కస్టడీలోకి తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. కంపెనీ యజమానులు కామని విజయ కుమార్, బాల మురళీ మోహన కృష్ణ, రాజా రంగ భూపతి ముగ్గురు టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, పోలీసుల సహకారంతో నేను కష్టపడి సంపాదించిన ఆస్తినంతా తమ పేర్ల మీద బలవంతంగా రాయించుకుని తనను రోడ్డుపై పడేశారని మొరపెట్టుకున్నాడు. 50 టన్నుల పొగాకు, ఫ్లాట్లు, కార్లు, అన్నీ తమ పేర్లపై మార్చుకుని.. తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, తన కుటుంబాన్ని సర్వ నాశనం చేశారని వాపోయాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబుకు లేఖరాశానని, కానీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. 2024లో పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పనిచేశా. సొంత పార్టీ నాయకులే నన్ను సర్వనాశనం చేశారు. నాకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు, లోకే‹Ù, పవన్ కళ్యాణ్ స్పందించాలి. నన్ను ఇబ్బందులకు గురిచేసిన కంపెనీ యజమానులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కారుమంచి సురేంద్ర వేడుకున్నాడు. -
టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు. కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?కరూర్లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మళ్లీ సినిమాలు చేస్తారా?.. దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తుతాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు.. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించాఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా? నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు.. షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నాతమిళనాడు రాజకీయాల్లో కింగ్మేకర్ అవుతారని అనుకుంటున్నారా?నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?ఎన్నికల చిహ్నంపై రియాక్షన్ మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది Source: NDTV -
Sunetra Pawar: డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది. -
‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’
నల్లగొండ: మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. గతంలో బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) నల్లగొండలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదు. యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామన్న భావనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయి. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితం. నల్లగొండ కార్పొరేషన్ లో 48 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాం. నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం మా పార్టీకే లభిస్తుంది’ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్తో కేటీఆర్, జగదీష్రెడ్డి భేటీ
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన తనయుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, జగదీష్రెడ్డిలు సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్ను కోరారు. అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. ఈ మేరకు సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. -
‘బాబు, పవన్, లోకేష్లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి. తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్ కాట్ చేయాలి’’ అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
విశాఖ చరిత్రలో ఇవాళ బ్లాక్డే
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కౌన్సిల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారు. మహిళా కార్పొరేటర్లని కూడా చూడలేదు. డిప్యూటీ మేయర్పై పాశవికంగా దాడి చేశారు. అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి?.... కూటమి ప్రభుత్వంలో సిగ్గూ, శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే భూముల్ని గీతంకు కట్టబెట్టారు. గీతంకు భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్డే. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.అంతకు ముందు.. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ నేతలంతా నల్ల కండువాలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందన్నారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారాయన. గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో గీతం భూముల క్రమబద్దీకరణ చేసింది కూటమి ప్రభుత్వం. -
24 గంటల్లో ఆ ఫ్లెక్సీ తొలగించాలి: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: నగరంలో టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. చిల్లీ సెంటర్లో అబద్ధాలతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముందు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక ఇచ్చింది. అయినా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీపై వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బొమ్మలు వేసి విష ప్రచారం చేస్తున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలి. లేకపోతే మేమే ఆ ఫ్లెక్సీలు చింపేస్తాం. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు. మా పార్టీ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబు,పవన్ కళ్యాణ్లను ఆ దేవుడు కూడా క్షమించడు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ముగిసిన విచారణ.. వచ్చే నెల 18న మహేశ్వర్ రెడ్డి విచారణ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు.ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్పై దానంను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. సుమారు రెండు గంటల పాటు విచారించినట్టు తెలిసింది. మరోవైపు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే, దానం అనర్హత పిటిషన్ విచారణకు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి తన లాయర్లను పంపించారు. ఈరోజు విచారణకు సంబంధించి ఎవిడెన్స్ అఫిడవిట్ను లాయర్తో పంపించారు. కాగా, తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎవిడెన్స్ అఫిడవిట్లో దానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా 2024 పోటీ చేసిన డాక్యుమెంట్స్ పొందుపరిచారు. తాను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరడంలో స్పీకర్ అనుమతి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ఫిబ్రవరి 18న విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. ఇందు కోసం కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ రమన్నారు. దానం నాగేందర్ను స్పీకర్ సస్పెండ్ చేస్తాడని నమ్ముతున్నాం. దానం బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకి వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లు స్పీకర్కు ఇస్తాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు విచారణలో భాగంగా కాసేపటి క్రితమే దానం నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్షీట్లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
GVMC Council: మీడియాకు అనుమతి నిరాకరణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. ఇవాళ ఉదయం వరకు మీడియాకు అనుమతి ఉందంటూ ప్రకటించిన అధికారులు.. మీడియా ప్రతినిధులకు పాసులు కూడా జారీ చేశారు. కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుందనగా మీడియాకు అనుమతి లేదంటూ సమాచారం ఇచ్చారు.కౌన్సిల్ సమావేశంలో గీతం భూదోపిడీని నిలదీస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిసందే. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్ సమావేశానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా కాసేపట్లో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలు బయలుదేరనున్నారు. -
‘కుక్కను చూసినా వదిలిపెట్టడు’
‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని ఉద్దేశించి కూటమి నేత ఒకరు చేసిన వ్యాఖ్య నెట్టింట వాయిస్ కాల్ రూపంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరిట వాయిస్ కాల్ ఒకటి గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్కు చపలత్వం ఎక్కువ. రాంగ్ట్రాక్లో పోతున్నాడు. మనోడు ఇన్స్టాలో వచ్చిన మెసేజ్లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు.దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని బాధితురాలు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ::: సాక్షి, రైల్వే కోడూరు -
మోదీ మార్క్ రాజకీయం.. ఇండియా కూటమికి బిగ్ షాక్
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో, రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది.ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 20 శాతం(80సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఆరు నెలల కిందటితో పోల్చితే మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ 27 శాతం మంది మొగ్గు చూపినట్లు సమాచారం.#MoodOfTheNation | BJP at 41% vote share, Congress at 20% if polls are held todayProjected seat shareBJP - 287 Congress - 80 BJP national spokesperson @Sanju_Verma_ decodes the findings of the #MOTN survey.@BJP4India | @SardesaiRajdeep @maryashakil pic.twitter.com/luJIoaCpER— IndiaToday (@IndiaToday) January 29, 2026ఇక, ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీయేకి 324 సీట్లు, ఇండియా బ్లాక్కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీయే సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మోదీ వేవ్లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు. -
మహారాష్ట్రలో ట్విస్ట్.. బీజేపీకి ఎన్సీపీ కొత్త డిమాండ్
ముంబై: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, దివంగత అజిత్ పవర్ భార్య సునేత్రకు తక్షణం మహారాష్ట్ర కేబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఎన్సీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీలతో ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించాలని ఆ పార్టీ ముఖ్యలు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.విలీనంపై మొదలైన గుసగుసలు బాబాయితో విబేధించి ఎన్సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ లేకపోవడంతో ఇకపై పవార్ సారథ్యంలోని పార్టీని శరద్పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనంచేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అజిత్ వర్గం నేతలు ఇందుకు మొగ్గుచూపుతున్నారు. ‘‘ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుక నడవాలని నేతలంతా భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ)తో మా పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోంది. ఇకమీదటా శాశ్వతంగా కలిసే ఉంటాయి’’ అని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నరహరి జిర్వాల్ అన్నారు.‘‘పవార్ల కుటుంబాలు ఒక్కటవ్వాలి. ఎన్సీపీ(ఎస్పీ), ఎన్సీపీలు కలిసిపోవడమే ఉత్తమం’’అని ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, ప్రమోద్ హిందూరావ్ అభిప్రాయపడ్డారు. అయితే సునేత్రకు పార్టీ పట్టంకట్టే అంశం ఇంత త్వరగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత, ఆహార, పౌరసరఫరాల మంత్రి ఛగన్ భుజ్బల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ సమ్మతితోనే పార్టీల విలీనం సాధ్యమని ఎన్సీపీ(ఎప్పీ) నేత ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు.తమిళనాడు తిరువాయూర్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎస్.ఏ. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్తో పొత్తు సాధ్యమని, విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా కొత్త చర్చలు మొదలయ్యాయి. టీవీకే పొత్తు ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించాలని ఆయన కోరారు.కాంగ్రెస్కు ఒక చరిత్ర, వారసత్వం ఉంది. విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చి వారి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యం కోసం పోరాడుతోంది. వారి ప్రాభవం తగ్గుతుంటే రక్షించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అటు టీవీకే అధికార ప్రతినిధులు కానీ.. ఇటు విజయ్ కానీ ధృవీకరించరించలేదు. ఖండించలేదు.అయితే, చంద్రశేఖర్ ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తోసిపుచ్చారు. ‘మా పార్టీ కార్యకర్తలకు విజయ్ నుండి ఎలాంటి ఉత్తేజం అవసరం లేదు. మా కార్యకర్తలను చూడండి, వాళ్లలోనే ఉత్తేజం కనబడుతోంది. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు అవసరమైన ‘బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా’ ఇస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. -
వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
‘ఓన్లీ యాక్టింగ్.. నో యాక్షన్’
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల తప్పం ఏం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు. ఇక్కడ జరిగేది ఓన్లీ యాక్టింగ్ మాత్రమేనని, నో యాక్షన్ అంటూ చమత్కరించారు. ఇద్దరూ దోస్తులు కాబట్టి నటిస్తున్నారని,. బ్రేవరీస్ గతంలో వాళ్లు ఇచ్చినవే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారన్నారు. ‘ రెండు పార్టీలు కలిసి ప్రజలతో ఆడుకుంటున్నారు. సిట్లతో పనికాదు. నోటుకు ఓటు కేసులో రేవంత్ను బీఆర్ఎస్ కాపాడింది. ఇప్పుడు రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ను కాపాడుతున్నారు. రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రో నడుస్తుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అన్ని నిర్ణయాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నం. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు జరగాలి. ఇక్కడ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. నోటీసులు ఇస్తున్నారు తప్ప నేతలను అరెస్టు చేయడం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలి’ అని పేర్కొన్నారు. -
పెద్దాయన చక్రం తిప్పుతారా?
విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో గురువారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రితేశ్ దేశ్ముఖ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు సజల నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మరాఠా రాజకీయాల్లో అజిత్ పవార్ శకం శాశ్వతంగా ముగిసిసోయింది.విలీనానికి బ్రేక్అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీలో రెండు గ్రూపుల పునరేకీకరణకు బ్రేక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబాయ్- అబ్బాయ్ వర్గాలు కలిసిపోతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పోరుతో ఈ రెండు గ్రూపులు చేతులు కలిపాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. తన నాయకత్వంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ) కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం మళ్లీ ఏకమైందని అన్నారు.పింప్రి- చించ్వాడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 84 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించింది. ఎన్సీపీ ద్యయం 37 స్థానాలకే పరిమితమైంది. శివసేన 7, ఇతరులు 5 చోట్ల గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ 77, ఎన్సీపీ 35 స్థానాలు విజయం సాధించాయి. ఎన్సీపీలోని రెండు గ్రూపులు చేతులు కలిపినా పింప్రి- చించ్వాడ్లో కమలం పార్టీని ఓడించలేకపోయాయి. అయితే పవార్ కుటుంబం (Pawar Pariwar) మళ్లీ ఏకం కావడం ఎన్సీపీ మద్దతుదారుల్లో ఉత్సాహం నింపింది. మళ్లీ రెండు గ్రూపులు కలిసిపోతాయన్న ఆశాభావం వ్యక్తమైంది. అనూహ్యంగా అజిత్ పవార్ మరణించడంతో ప్రస్తుతానికి దీనికి బ్రేక్ పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.''ఎన్సీపీలోని రెండు గ్రూపుల పునరేకీకరణకు సంబంధించిన చర్చలు పవార్ కుటుంబ సభ్యులకే పరిమితం. ఇరు వర్గాల సీనియర్ నాయకులతో కలిసి పునరేకీకరణకు అవసరమైన ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అజిత్ పవార్ అకాల మరణంతో పునరేకీకరణ ప్రక్రియ కొద్దిరోజులు ఆగిపోతుంది. ఎన్సీపీకి కొత్త అధినేత వచ్చాక మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కే అవకాశముంద''ని అజిత్ పవార్ సన్నిహితుడొకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో అన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అజిత్ సతీమణి సునేత్రకు (Sunetra Pawar) పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది.పట్టుసాధిస్తారా?రాజకీయాల్లో మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పార్టీ అధినేత ఎంపికలో 'పెద్దాయన' కీలకపాత్ర పోషించే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన ఎవరివైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. తన కుమార్తె సుప్రియ సూలేను (Supriya Sule) తెరపైకి తెస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీలో రెండు వర్గాలను ఏకం చేసేందుకు ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. అలాగే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీ మాత్రం అజిత్ రాజకీయ వారసురాలిగా ఆయన సతీమణి సునేత్రను ఎంపిక చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దాయన మళ్లీ పార్టీపై పట్టుసాధిస్తారా, లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.చదవండి: ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్! -
‘ఇకనైనా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యి కల్తీ జరగలేదంటూ సీబీఐ రిపోర్ట్ చూసైనా చంద్రబాబు బుద్ధితెచ్చుకోవాలన్నారు. ఈరోజు(గురువారం, జనవరి 29వ తేదీ) చంద్రబాబు మాటలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సీబీఐ చార్జ్షీట్ చూశాక కోట్లాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల లడ్డూలో జంతవుల కొవ్వు కలపలేదని తేలింది. దీంతో జనం తమను రాళ్లతో కొడతారని కూటమి నేతల భయపడ్డారు. అందుకే మళ్లీ తప్పుడు రాళ్లతో కొడతారని కూటమి నేతలు భయపడ్డారు. అందుకే మళ్లీ తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలు వేస్తున్నారు.ఎల్లోమీడియా అంతరాత్మతో పని చేయాలి. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. దళితులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నిత్యం మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. చేసిన అప్పులను ఏం చేస్తున్నారు?, ఎంతసేపూ పబ్లిసిటీ, ప్రత్యర్థులపై బురద జల్లటం తప్ప మరేమీ జరగటం లేదు. రైతులు, యువత, మహిళలు ఏ వర్గమూ ప్రశాంతంగా లేదు. యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా?, హెరిటేజ్ నెయ్యి తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు?, అందులో ఏం కల్తీ కలుపుతున్నారో చంద్రబాబు వెల్లడించాలి. బోలేబాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబే. చంద్రబాబు కుట్రలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచన చేయాలి’ అని స్పష్టం చేశారు. -
తిరుమల లడ్డూపై కూటమి కుట్ర బట్టబయలు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:సీబీఐ ‘సిట్’ ఛార్జ్షీట్లో ఏముంది?:తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు’ అని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఆ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ‘తిరుమలలో వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు’ అందులో తేల్చి చెప్పింది. హరియాణలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.ప్రజలను మభ్యపెట్టేలా మళ్లీ కొత్త కథనాలు:తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో తమ కుట్ర బెడిసి కొట్టడంతో, ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ కూటమి, మాట మార్చి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అంటూ కథనాలు రాస్తోంది. ఇంకా మరో అడుగు ముందుకేసి.. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, విష ప్రచారానికి దిగింది. ప్రజాక్షేత్రంలో జగన్గారిని ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వ హననంతో పాటు, వైఎస్సార్సీపీని అప్రతిష్ట పాల్జేసే కుట్ర, దురుద్దేశంతో అలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.అది హిందూ ధర్మంపై దాడి:దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ సిట్లో ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా కల్తీ మకిలీని వైయస్ఆర్సీపీకి అంటించాలనే దుర్మార్గపు ఆలోచనతో కోర్టు సూచనలను, సీబీఐ నివేదికలను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది, ఇది ప్రజల విశ్వాసంతో పాటు, హిందూ ధర్మంపై దాడి చేయడమే.ఫిర్యాదు చేస్తాం.. కోర్టునూ ఆశ్రయిస్తాం:సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉంది. వాటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి నిజాలు బయటపెడతాం. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గం. అందుకే పోలీసులకు ఫిర్యాదుతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఎం.మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. -
‘90 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో’..
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్తో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి శశి థరూర్ చెక్ పెట్టారు.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సుమారు 90 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర వ్యక్తిగత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా పార్టీతో తన అనుబంధం బలంగా ఉందని, విభేదాల ఊహాగానాలకు తావు లేదని థరూర్ స్పష్టంచేశారు.శశి థరూర్ ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను సమర్ధించినట్లు చెప్పారు.ఆ తర్వాత పలు పత్రికల్లోని గెస్టు కాలమ్స్లో ఆపరేషన్ సిందూర్ను కీర్తించారు.దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో విభేదాలు మరింత పెరిగాయని, ముఖ్యంగా కేరళ యూనిట్లో అసమ్మతి ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాహుల్, ఖర్గేలను కలవడం ద్వారా పార్టీ లోపల ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమావేశం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ భేటీని సానుకూలంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలు థరూర్తో చర్చలు జరిపి, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం అత్యవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం.ముఖ్యంగా కేరళలలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్లోని అన్ని వర్గాలు ఒకే దిశగా కదలాలని ఈ సమావేశం సంకేతం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘కేసీఆర్పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ కుట్రలు’
హైదరాబాద్: తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్పై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను కొనసాగిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్నారు హఱీస్. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు హరీష్ ట్వీట్ చేశారు. ‘కేసీఆర్పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు… అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు’ అని ట్వీట్లో మండిపడ్డారు.తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం…— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2026 -
చంద్రబాబూ.. ఇంకా ఎంతకాలం ఇలా అబద్దాలు?: లక్ష్మీపార్వతి
తాడేపల్లి. ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదంపైన చంద్రబాబు నీచమైన అబద్దపు ప్రచారాలు చేశారని, సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్షీట్ తేల్చి చెప్పిందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. దేవుడి పేరుతోనూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, ఇలా ఎంతకాలం అబద్ధాలు చెబుతూ వాటి పునాదుల మీద బతుకుతారని ఆమె చురకలంటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారన్న ఆమె, అసలు బోలే బాబా డెయిరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. పవిత్ర తిరుమల లడ్డూపైనా విషం చిమ్మిన చంద్రబాబుకు, అలా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బ తీయటానికి సిగ్గు లేదా? అని నిలదీశారు. తిరుమల ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నాడు మాట్లాడిన చంద్రబాబు, సిట్ ఛార్జ్షీట్ తర్వాత జనం ముందుకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.ప్రెస్మీట్లో నందమూరి లక్ష్మీపార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు అబద్ధాలకు సిట్ ఛార్జ్షీట్తో చెక్చంద్రబాబు, ఆయన కుమారుడు, వీళ్ల బానిస పవన్కళ్యాణ్ తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిపై నీచమైన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో అన్ని విషయాలు బట్టబయలయ్యాయి. ఆ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్ తేల్చింది. అయినా చంద్రబాబు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో జగన్గారితో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై చంద్రబాబు చెప్పినవి అబద్దాలేనని సిట్ ఛార్జ్షీట్ తేల్చేసింది. అలా మరోసారి చంద్రబాబు దొరికిపోయారు.నీదీ ఒక బతుకేనా చంద్రబాబు?:చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కూడా తిడుతున్నా మారట్లేదు. ఇదీ ఓ బతుకేనా చంద్రబాబు?. పచ్చమీడియా గొట్టాలు పెట్టుకుని ప్రచారాలు చేయించుకుంటున్నా, సోషల్ మీడియా అప్పటికప్పుడు నిజాల్ని తేటతెల్లం చేస్తోంది. తాజాగా రైతుల పాస్ బుక్కుల విషయంలోనూ జగన్ చేసిన పనిని తనదిగా చెప్పుకుని సోషల్ మీడియాకు దొరికిపోయారు. ప్రజల దురదృష్టం కొద్దీ చంద్రబాబు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. దేవుడి లాంటి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, చెప్పులేయించింది కాక, నాపైనా నిందలు వేశారు. ఇప్పటికీ పచ్చమీడియా సాయంతో అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జంతు ప్రవృత్తి ఉన్నందునే చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవుడినే రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు పాపం పండింది. దేవదేవునితో ఆడుకుంటున్న వారెవరూ ప్రశాంతంగా బతకలేదు. నిజానికి చంద్రబాబు ఏనాడూ తనంతట తానుగా ప్రజల మనసు గెల్చి అధికారంలోకి రాలేదు. ఎప్పుడూ, ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని ఆయన గద్దెనెక్కాడు. అదీ ఏ మాత్రం విలువలు లేని, నీచ రాజకీయ జీవితం చంద్రబాబుది.చంద్రబాబూ.. ఇప్పటికైనా అబద్ధాల్ని ఒప్పుకోండితిరుమల లడ్డూపై సీబీఐ ఛార్జ్షీట్లో పామాయిల్ తప్ప జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినా చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. సిట్ ఛార్జ్షీట్ తర్వాత చంద్రబాబు తీరుపై సోషల్ మీడియా కూడా దుమ్మెత్తి పోస్తోంది. గతంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్పై దుమ్మెత్తిపోయడానికే అలా అబద్ధాలు చెప్పానని చంద్రబాబు ఒప్పుకోవాలి. చంద్రబాబు చెప్పిన అబద్దాలకు పచ్చ మీడియా వంతపాడి ప్రచారాలు చేసింది. చేస్తున్న తప్పులన్నీ మీవే. ఎన్నో మంచి పనులు చేసిన జగన్గారిని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికే చంద్రబాబు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేశారు.కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దుకలియుగ దైవమైన సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి వారే నెయ్యి మీద నివేదిక బయటపెట్టించాడు. గతంలో మీ కరపత్రిక అయిన ఈనాడుతో అబద్ధాలు రాతలు రాయించి ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చరిత్ర మీది. ఇప్పటికీ అదే అబద్ధాలు ఆడుతూ దేవుడితో ఆటలు మొదలు పెట్టారు. మీ పాపాలకు తగిన మూల్యం అతి కొద్ది కాలంలోనే చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు క్రూర స్వభావం వల్లే దేవుడితో కూడా రాజకీయాలు చేయగలిగారు. ఇక ఆయన బానిస అయిన పవన్కళ్యాణ్ కూడా అదే బాటలో నడిచాడు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లక్షల లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపారని నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇంకా సనాతనవాది వేషం వేసి విజయవాడలో దుర్గ గుడి మెట్లు కడిగి అప్పటికప్పుడు హిందుత్వవాది అయిపోయాడు.చివరకు పవన్కళ్యాణ్ కూడా ఇంతగా దిగజారాలా? ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే కనీసం సమాధానం చెప్పరా? కోట్లాది భక్తుల ఇష్టంగా స్వీకరించే ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగొద్దు. మీ హయాంలోనే వనస్పతి ఉందని నెయ్యి వెనక్కి పంపినట్లు ఈవోనే చెప్పారు. వెనక్కి పంపించిన నెయ్యి లడ్డూలో ఎలా కలుస్తుంది?. పైగా ల్యాబ్ టెస్టు తర్వాతే కదా ఏ నెయ్యి అయినా లోపలికి వస్తుంది? ఆ కంపెనీ మీద వేసిన కేసు ఇంకా నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి తప్పు చేశారని ఎలా చెబుతారని నందమూరి లక్ష్మీపార్వతి నిలదీశారు. -
‘గీతం భూ కబ్జాపై పవన్ మాట్లాడాలి.. పచ్చ మీడియాకు కళ్లు లేవా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ స్టాండ్ ఏమిటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాటం లేదు. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు.విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకునేతల పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్ నియోజకవర్గ సమన్వయకర్తలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ వేయాలంటూ డిమాండ్ చేశారు.అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘చంద్రబాబు భూ దోపిడీని అడ్డుకోవడానికి గీతం యూనివర్సిటీకి వచ్చాము. చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదువేల కోట్ల భూమి ప్రభుత్వానికి చెందిందని గత వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో హెచ్చరిక బోర్డులు పెట్టాం. ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా?. చంద్రబాబు లెజెండరీ అని రోజూ సొల్లు కబుర్లు చెబుతారు. భూ కబ్జాలు చేయడమేనా మీ లెజెండరీ. ఏబీఎన్, టీవీ-5, ఈనాడులకు భూ దోపిడీ కనిపించడం లేదా?. భూ కబ్జాపై నోరూ విప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్కు ఉంది. విశాఖలో ఉండి కూడా పవన్ గీతంపై ఎందుకు మాట్లాడలేదు?. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలి. అవసరమైతే గీతం భూకబ్జా భూములను పరిశీలించడానికి వైఎస్ జగన్ను పిలుస్తాము. చంద్రబాబు భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలి. భూ దోపిడీని రేపు కౌన్సిల్లో అడ్డుకుంటాం అని హెచ్చరించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘గీతం సంస్థకు భూమి కట్టబెట్టడంలో ప్రభుత్వం బరితెగించింది. భూములను ధారాదత్తం చేస్తే అడిగే వారు లేరని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. మా ప్రభుత్వం టూరిజం భవనాలు కడితే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గీతం సంస్థకు 55 ఎకరాలు కట్టబెడుతుంది ప్రభుత్వం. గీతం భూ కబ్జాపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటి?. గతంలో ఇక్కడికి వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటమే మీ స్టాండా పవన్?. తిరుమల లడ్డు విషయం ఇప్పుడు పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.జీవీఎంసీ అజెండా నుంచి గీతం భూముల అంశం తీసేయ్యాలి. లేదంటే జీవీఎంసీ కౌన్సిల్ జరగనివ్వం. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. గీతం సంస్థ కబ్జా చేసి కేటాయించమని అడుగుతుంది. ఈ కబ్జాను అంగీకరించిన రోజే ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రచ్చ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ నడుస్తోంది. ఎంపీ భరత్ మీద కేసు పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్న భూములను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘రుషికొండ ప్రభుత్వ భవనాలపై తప్పుడు ప్రచారం చేశారు. గీతం కబ్జాపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వేల కోట్లు విలువైన భూమి కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం. గీతంలో డబ్బున్న వారు చదువుతారని ఎంపీ చెప్పారు. చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని చట్టం ఏమైనా చేశారా?. కూటమి జమానాలో భూ కబ్జాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. గీతం కబ్జాపై కూటమి నేతలకు బాధ్యత లేదా?. ఈ భూమిని కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. -
తిరుమల లడ్డూపై ఆగని టీడీపీ పాపపు ప్రచారం
సాక్షి, విజయవాడ: సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర్ స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారు చేశారు. వైకాపా పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు’’ అని వాటిపై పేర్కొన్నారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్!
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు ఎవరికి?.. పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణంతో ఎన్సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. అజిత్ వర్గం ఎన్సీపీ చీలకుండా.. బీజేపీ పక్కా వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పార్టీ బాధ్యతల విషయంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.ఇక, మహారాష్ట్రలో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే.. శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్పై తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి ఎన్సీపీ పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి.ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్వాడ్లో ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా, రెండు వర్గాల మధ్య ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సూలే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు.అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్లో పార్థ్ పవార్కు మంచి గుర్తింపు ఉంది.ధనంజయ్ ముండేఅజిత్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ఎన్సీపీ వ్యవస్థాపక నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఒకరు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.బీజేపీ వ్యూహమేంటి?మరోవైపు.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. భవిష్యత్లో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశం ఉందని.. వారిలో కొందరు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీనిని ఊహించిన బీజేపీ.. అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కుచెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాబినెట్లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బీజేపీ ఇప్పటికీ షిండే సేనతో సంప్రదించాల్సి ఉంటుంది. -
‘చంద్రబాబూ.. వెంకన్న స్వామి నిన్ను క్షమిస్తాడా?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. అధికారం కోసం దేనికైనా తెగిస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహా ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో.. గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం. కానీ, దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవకాశవాది. అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ‘చంద్రబాబుగారూ.. శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా?. మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు. ఇందుకుగానూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?’.. .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని, ఆయనకు బుర్ర లేదని, చేసిన తప్పును ఒప్పుకుని తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలి అని అంబటి డిమాండ్ చేశారు. -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్గఢ్లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్ను అందుకే వీడుతున్నా.. దానం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో తనను విస్మరించిన కారణంగానే పార్టీని వదుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘పోస్టుల కోసం పదవుల కోసం నేను ఎక్కడికిపోలేదు. విస్మరించారు కాబట్టే నేను వదలాల్సి వచ్చింది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. నా ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు.ఎంతవరకు అయితే అంత వరకు పోరాటం చేస్తాను. స్పీకర్ నోటీసులు నాకు ఇంకా అందలేదు. పిటిషనర్కి నోటీసులు అంది ఉండవచ్చు. ఉన్న విషయాలను సమర్థవంతం చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాను. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్తాం. స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు ఉంటాయి. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వాళ్లు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమీ భయపడను’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
‘జస్టిస్ స్వామినాథన్’ అంశంలో మీ స్పందనేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మదురైలోని థిరుప్పారాన్కుండ్రం కొండపై కార్తీకదీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్పై మతపర ఆరోపణలు చేసిన నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విషయంలో మీ స్పందన తెలపాలని డీఎంకే సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తదితరులకూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదావేసింది. డీఎంకే మిత్రపక్షాలు, కార్యకర్తలు, లాయర్లు మద్రాస్ హైకోర్టు చెన్నై, మదురై ప్రాంగణాల్లో జడ్జికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉల్లంఘనలకు పాల్పడ్డారని న్యాయవాది జీఎస్ మణి ఈ పిటిషన్ వేశారు. -
మైకుల్లో కాదు ‘మెటా’లో..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అప్పుడే తమ పోరాట క్షేత్రాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ వేదికలకు తరలించాయి. ‘మెటా’, గూగుల్ యాడ్ ట్రాన్స్పరెన్సీ లైబ్రరీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇటీవల ‘ఇండియా టుడే’ బృందం విశ్లేషించింది. ఈ నివేదికలోని వివరాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి జనవరి 16 మధ్య సాగిన డిజటల్ యుద్ధం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.నెల రోజులకు రూ. 6.38 కోట్లుగడచిన నెల రోజుల వ్యవధిలో బెంగాల్లోని రాజకీయ పార్టీలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్లలో ప్రకటనల కోసం ఏకంగా రూ. 6.38 కోట్లు వెచ్చించాయి. ఈ డిజిటల్ ప్రకటనల ఖర్చుల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రధాని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.ప్రకటనల్లో టీఎంసీ జోరుతృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహకర్త ‘ఐ-ప్యాక్’ (ఐ-పాక్)తో కలిసి గూగుల్, మెటా ప్లాట్ఫారమ్లలో ప్రకటనల కోసం గత నెలలో సుమారు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసింది. కేవలం అధికారిక పేజీలే కాకుండా.. ‘అబర్ జీత్బే బంగ్లా’, ‘అమీ బంగ్లార్ డిజిటల్ జోద్ధా’ లాంటి పలు సరోగెట్ (అప్రత్యక్ష) పేజీల ద్వారా మరో రూ. 32 లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది.మమతా బెనర్జీకి అనుకూలంగా..ఈ పేజీలలో పార్టీ గుర్తును నేరుగా వాడకపోయినప్పటికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘బోల్చే బంగ్లా’ లాంటి పేజీలు ఒకడుగు ముందుకు వేసి, బీజేపీపై పలు విమర్శలు చేస్తూ, ఇందుకు ప్రయాగ్రాజ్ మాఘ మేళా వీడియోలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీపై వ్యూహాత్మక దాడులకు దిగాయి.అధికారిక ప్రచారంలో బీజేపీపశ్చిమ బెంగాల్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెటాపై రూ. 72 లక్షలు, గూగుల్పై రూ. 63 లక్షలు వెచ్చించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి సరోగెట్ పేజీల కంటే అధికారిక ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా తమ పథకాల ప్రచారం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నెల రోజుల్లో రూ. 2.1 కోట్లు ఖర్చు చేసింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ సుమారు రూ. 19 లక్షలు వెచ్చించింది.బెంగాల్ కోటలో సమరభేరిదేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారం సాగించడంలో బీజేపీకి తిరుగులేకపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్ను మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి గణాంకాలను పరిశీలించినా టీఎంసీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రచార శైలిని చూస్తే, టీఎంసీ గూగుల్ యాడ్స్ ద్వారా విధానపరమైన ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బీజేపీ ‘మెటా’ వేదికలపై భావోద్వేగపూరిత అంశాలను ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుండగా, పటిష్టమైన వ్యూహాలతో టీఎంసీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ -
అల్విదా..‘దాదా’
సాక్షి ముంబై: శరద్ పవార్ సోదరుడి కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడిన అజిత్ పవార్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే తనదైన ముద్ర వేసుకున్నారు. 1982లో కోఆపరేటీవ్ చక్కెర ఫ్యాక్టరీ బోర్డుతో కార్యదర్శిగా, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే మహావికాస్ ఆఘాడిలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన అజిత్ 2023లో శరద్పవార్తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీ, శివసేన (శిందే)ల మహాయుతి కూటమిలో చేరారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకముందే బుధవారం తన స్వంత నియోజకవర్గం బారామతి వద్ద జరిగిన విమానప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన జీవితంలోని విశేషాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాల వివరాలివీ.. బాల్యం.. రాష్ట్ర ప్రజలంతా దాదా (అన్నా)గా ముద్దుగా పిలుచుకునే అజిత్ పవార్ 1959, జులై 22న అహిల్యనగర్ (అహ్మద్నగర్) దేవలాలి ప్రవరాలో జని్మంచారు. ఎన్సీపీ (ఎస్పీ)అ«ధ్యక్షుడు శరద్ పవార్ అన్న, అజిత్ పవార్ తండ్రి అనంత్రావ్ పవార్ సినిమా రంగంలో పనిచేసేవారు. పవార్ తాత గోవింద్రావ్ పవార్ బారామతి సహకారి వ్యాపారం, ఆయన అమ్మమ్మ, తాతలు వ్యవసాయం చేసేవారు. ఇక అజిత్ పవార్ అన్న శ్రీనివాస్ పవార్ అగ్రికల్చర్, అటోమొబైల్ రంగంలో ఉన్నారు. పెరిగి పెద్దయ్యాక తాను తీసుకునే అనేక కీలక నిర్ణయాల్లో అన్న శ్రీనివాస్ సలహా తీసుకునేవారు అజిత్ పవార్. విద్యాభ్యాసం అజిత్ పవార్ బారామతిలోని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం కొల్హాపూర్లోని శివాజీ విద్యాపీఠం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి పద్మసింహ్ పాటిల్ చెల్లెలు సునేత్ర పవార్ను వివాహం చేసుకున్నారు. అజిత్ పవార్, సునేత్ర పవార్ దంపతులకు జయ్ పవార్, పార్థ్ పవార్ అనే ఇద్దరు కుమారులున్నారు. 1982లో రాజకీయ రంగ ప్రవేశం.. 1982లో సహకార చక్కె కర్మాగారం బోర్డు ఎన్నికల ద్వారా అజిత్ పవార్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే అంతకన్నా ముందు అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించినట్టు ఓ ఛానెల్ ఇంటర్యూలో ఆయన స్వయంగా పేర్కొన్నారు. సహకార చక్కెర కార్మగారం బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన 1991లో పుణే జిల్లా సహకారి బ్యాంకు (పిడిసి) అధ్యక్షునిగా సుమారు 16 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. 1991లో బారామతి ఎంపీగా ఎన్నిక.. 1991లో మొట్టమొదటిసారిగా ఆయన బారామతి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే తన బాబాయి శరద్ పవార్ కోసం అజిత్ పవార్ తన పార్లమెంటు నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. దీంతో ఎంపీగా ఎన్నికైన శరద్ పవార్ దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ. నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి... 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన 1995, 1999, 2004, 2009, 2014, 2019, 2023 వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా రికార్డు.. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరు సార్లు చేపట్టారు. ఇలా అత్యధికంగా ఉపముఖ్యమంత్రి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2010 నవంబరు 11వ తేదీన మొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2012, సెపె్టంబరు 25న ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో పృ«థ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం మూడు నెలల కాలవ్యవధిలోనే చవాన్ నేతృత్వంలో మళ్లీ 2012, డిసెంబరు ఏడో తేదీన రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ప్రభుత్వం గడువు ముగిసేవరకు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగారు. అలాగే 2019 నవంబరు 23వ తేదీన మూడోసారి ఆయన చేసిన ప్రమాణ స్వీకారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ప్రమాణ స్వీకారం మూడు రోజుల్లోనే బెడిసి కొట్టింది. ఆ తరువాత ఆయన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో 2019, డిసెంబరు 30న నాలుగోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక అయిదవ సారి 2023 జులైలో, ఆరవసారి 2024, డిసెంబరు అయిదవ తేదీన ఉపముఖ్యమంత్రి పదవులు స్వీకరించారు. పనితీరు..సమయ పాలనతో ప్రత్యేక గుర్తింపు అజిత్ పవార్ పనితీరు, సమయపాలనతోపాటు నిర్మొహమాట వైఖరి ఇతర రాజకీయ నేతలకు ఆయన్ను భిన్నంగా నిలిపింది. సాధారణ కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయం తీసుకోవడం, అది పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోకపోవడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మృతి చెందే రోజు వరకూ ఈ అలవాటును వీడలేదు అజిత్ పవార్. -
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు! శరద్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.చివరి ట్వీట్ చెబుతోందిగా..అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది. आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026 -
కూటమి పాలనలో ఆటవిక రాజ్యం
చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయట పెడితే, ఏ చర్యా లేదు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. – వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరి తెగింపు చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని.. ఇలాంటి ఆటవిక రాజ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండమంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు. ‘మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్లు.. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించారు. మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి 8, 9 సెంటర్లు పెట్టి నిర్వహించుకున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేయిస్తోంది..’ అని మండిపడ్డారు. ‘భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్లో ఉండి.. ‘ఊపేయ్.. కుదిపేయ్!’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఇది జంగిల్ రాజ్యం. దోచుకున్న సొత్తు.. పైనుంచి కింది వరకు, చంద్రబాబు, లోకే‹Ô మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు.. చివరకు పోలీసులు కూడా మీకింత, నాకింత అని పంచుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పార్టీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తొలుత ఏలూరు నియోజకవర్గంతో ఈ సమావేశాలు మొదలు కాగా రెండో సమావేశం భీమవరం కార్యకర్తలతో నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..కూటమి ప్రజా ప్రతినిధుల బరితెగింపు..కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరి తెగింపునకు అడ్డు లేకుండా పోయింది. అవినీతి, విచ్చలవిడితనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయటపెడితే, ఏ చర్యా లేదు. ఆమదాలవల ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా కూడా ఏ చర్యా లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళను బలాత్కారం చేసి, చివరకు అధికార దుర్వినియోగంతో కేసును క్లోజ్ చేయించుకున్నాడు. ఎంత దారుణం? మంత్రి సంధ్యారాణి పీఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అతడిని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల రికారి్డంగ్ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి అంతా విచ్చలవిడితనం, దోపిడీ కనిపిస్తోంది. పథకాలు రద్దు.. హామీలిచ్చి మోసాలుచంద్రబాబు వచ్చిన తరువాత జరిగింది ఏమిటంటే.. మన పథకాలన్నీ ఒకవైపు రద్దయ్యాయి. మరోవైపు ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. విపరీతంగా ప్రచారం చేశారు. ప్రకటనలు ఇచ్చారు. చివరకు ఇంటింటికీ బాండ్లు కూడా పంపారు. దానిపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంతకాలు కూడా చేశారు. పథకాల ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతెంత వస్తుందనేది చెప్పారు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారా? మోసాలు చేస్తారా? అనేది ఊహకు కూడా అందదు. ఎవరైనా ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే 420 అని కేసు పెట్టి జైల్లో వేస్తారు. కానీ ఒక్క చంద్రబాబు, ఆయన కూటమిలో మాత్రమే కేసులు లేకుండా బయట ఉన్నారు. అన్ని వర్గాలకు బాబు మోసాలు..ఆరోజు ఇంటింటికీ వెళ్లి ఏం చెప్పారు? ఏమన్నారు..? ఆ ఇంట్లో ఎవరైనా పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఎవరైనా ఒక యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా కప్పుకుని రైతు కనిపిస్తే నీకు రూ.26 వేలు అని, ఇంకా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు ఇస్తాం అని చెప్పారు. ఆ తర్వాత పచ్చి మోసం చేశారు. చివరకు గ్యాస్ సిలిండర్లలో కూడా మోసం చేశారు. ఏటా మూడు సిలిండర్ల చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది ఒకటి రెండు మాత్రమే. అది కూడా అందరికీ ఇవ్వలేదు. చివరకు అక్కడా, అలా పచ్చి మోసం చేశారు.ఆ డబ్బంతా ఏమైంది?.. అంతా డీపీటీ!మన హయాంలో ఐదేళ్లలో.. రెండేళ్లు కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఆ డబ్బు ఎవరికి పోయింది అనే వివరాలు, వారి బ్యాంక్ అక్కౌంట్ల నెంబర్లు, వారి ఆధార్తో సహా ఇవ్వగలిగే విధంగా మన పాలన సాగింది. చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో.. తినుకో.. పంచుకో! అదే డీపీటీ! అది మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం. రెడ్బుక్ రాజ్యాంగం..మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు అదే పని చేస్తున్నారు. అంతా విచ్చలవిడి దోపిడీ, రెడ్బుక్ రాజ్యాంగం. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. మరోవైపు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. హామీలు ఏవీ అమలు కాలేదు. అన్నీ మోసాలే. పథకాలు పోయాయ్..పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ. ఇక వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ పెట్టారు. నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్ శిక్షణ, ఇంగ్లిష్ మీడియం, ట్యాబ్లు ఆగిపోయాయి. మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలే. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఇవ్వాలి. రూ.6 వేల కోట్లకుగానూ రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ పెట్టారు. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. రైతు భరోసా కింద రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మా హయాంలో ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. మేం యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చాం. ఇవాళ విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ..ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. పార్టీ కార్యకర్తలు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మనపై ఉంది. మనం ప్రజలకు ఎన్నో చేశాం. మరి ఏమీ చేయని చంద్రబాబుకు ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. చూస్తుండగానే రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తా. అలా ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటా.« ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం.ప్రతి ఇంటా చర్చ జరగాలి... మీరు చొరవ చూపాలిఇప్పుడు మీరంతా కలిసికట్టుగా నిలిచి పోరాడాలి. చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఆ దిశగా మీరంతా కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ స్ట్రీమ్లైన్ చేయాలి. అన్నీ వ్యవస్థీకృతం కావాలి. చంద్రబాబు అన్యాయ పాలనను ప్రజల్లో బలంగా ఎండగట్టాలి. ఆ దిశగా మీరు చొరవ చూపాలి. అందరూ కలిసి పని చేయాలి.ఏ ఒక్క వర్గానికైనా ఒక్కటైనా మంచి జరిగిందా?చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా భావించేవాళ్లం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపన పడేవాళ్లం. కోవిడ్ సంక్షోభం లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజూ, ఏ హామీని ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటి కంటే ప్రజల సమస్యలే ఎక్కువని భావించి చిరునవ్వుతో స్వీకరించాం. అన్ని హామీలూ అమలు చేశాం. ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చూశాం. అంతా కలసి పంచుకుంటున్నారు..ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దోపిడీ, అవినీతి. అది ఏ స్థాయిలో ఉందంటే.. అసలు పాలకులు ఉన్నారా? అనిపించే పరిస్థితి. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతోంది అంటే.. చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు ఇంత అని పంచుకుంటున్నారు. మద్యం మాఫియా. ప్రైవేటు షాపులన్నీ లాటరీలో వాళ్ల మనుషులకే ఇచ్చుకున్నారు. గ్రామస్థాయిలో బెల్టు షాప్లు వేలం పాట పాడి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కొట్టుకోకూడదు కాబట్టి! అక్కడ పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నారు. మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్లు, అక్కడ పెగ్గుల్లో అమ్మకం. అక్కడా దోపిడీ. వైన్ షాప్ల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మకాలు. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. ఎమ్మార్పీపై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒకటి నకిలీ.అలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోంది. ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నా ఎక్కడా ఫ్రీగా లేదు. ఎక్కడ చూసినా లారీలు, మిషన్లతో దోచేసుకుంటున్నారు. ధర చూస్తే గతంలో కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఐదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. ఏ ఒక్క గని వదలడం లేదు. సిలికా, మైకా, లేటరైట్, క్వార్ట్జ్.. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం..జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి కోవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్ 2.0 లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం. చిత్తశుద్ధితో కూడిన మంచి పాలన అంటే ఎలా ఉంటుంది? అనేది మనం చూపిస్తే.. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎలా అన్నదానికి చంద్రబాబు పాలనే ఉదాహరణ. -
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని కౌంటర్ దాఖలు చేసిన దానం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టి వేయాలని విన్నవించారు.‘‘నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. కాంగ్రెస్ పార్టీకి సమావేశానికి నేను వ్యక్తిగత హోదాలో వెళ్లాను. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోంది’’ అని దానం నాగేందర్ అన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం బాబూ?: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.మహిళా లోకానికి మీ దృష్టిలో విలువ లేదా బాబూ?ఒక మహిళ మీ వద్దకు వచ్చి.. మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కీచక పర్వంగా మారింది. అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా, వచ్చినది టీడీపీ నుంచే. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు కీచకత్వం కొనసాగుతూనే ఉంది.3 హత్యలు, 6 మానభంగాలు.. ఇదేనా మీ పాలన?రాష్ట్రంలో పరిపాలన పక్కదారి పట్టింది. 10 విహారయాత్రలు, 3 హత్యలు, 6 మానభంగాలు… ఇదే ఈ రోజు రాష్ట్ర పాలన పరిస్థితి. రైల్వే కోడురు బాధిత మహిళ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం. హోంశాఖను ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా మార్చేశారు, హోం మంత్రి పోలీస్ వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు.మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో ముఖ్యమంత్రికి బాధిత మహిళ స్వయంగా వెళ్లి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక వివాహిత మహిళ జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేది. అదే మీ ఇంట్లో మహిళ గురించి ఏమీ అనకపోయినా రాద్ధాంతం చేసే మీరు… రైల్వే కోడూరులో బాధిత మహిళపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?ఇది దద్దమ్మ ప్రభుత్వంకుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను పంచాయితీ చేసి పక్కదారి పట్టించారు. అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేసులోనూ చర్యలు లేవు. ఇదే టీడీపీ పాలన. ముఖ్యమంత్రిగా, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన పాలన చూసి సిగ్గుపడాలి. బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంటే మాటల దాడులు చేయిస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తారా? అరవ శ్రీధర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది.శాంతిభద్రతలు కాపాడలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయింది. అయినా గొప్ప ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి స్పందించకపోతే బాధిత మహిళ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సుగాలి ప్రీతికి జరిగిన ఘోరం, ఇవాళ రైల్వే కోడూరులో మహిళకు జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తాం” అని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
‘బాధితురాలినే నిందితురాలిగా చేసేందుకు కూటమి కుట్రలు’
సాక్షి, తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్టు చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా? అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.‘‘అరవ శ్రీధర్ చేసిన పనితో ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థం అవుతుంది. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారు. పోలీసు వ్యవస్థ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?. కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు.?..హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్పై ఉన్న శ్రద్ధ మహిళ భద్రతపై లేదు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు.?. ఎమ్మెల్యేపై పార్టీ కమిటీ వేయడం ఏంటి? పోలీసుల విచారణ వుండదా?. మంత్రి సంధ్యారాణి కొడుకు పేకాట అడుగుతూ దొరికిపోయారు’’ అంటూ వరుదు కల్యాణి మండిపడ్డారు. -
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి,అమరావతి: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాల గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని బాధితురాలు మీడియాతో ఎదుట బాంబు పేల్చారు. ఎమ్మెల్యే శ్రీధర్పై చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. నారావారిపల్లెలో 10రోజల క్రితమే చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడతారునుకున్నా. బాబు మాత్రం సాధారణ అర్జీదారునిగానే ఫిర్యాదును తీసుకున్నారు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాట చేస్తా. ఎమ్మెల్యే నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు’అని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు టెలిగ్రామ్లో మెస్సేజ్ చేశాను.రెండురోజులు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత పర్సనల్ ఫొటోలు పంపించమని అడిగాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించాడు. నీ ట్రాన్స్ఫర్,ప్రమోషన్ నా చేతిలోనే ఉంటుందని బెదిరించాడు. మా ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఓ ఇంటి వద్ద ఆపాడు. నేను,నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరా అయ్యింది. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. -
‘జనసేన అంటే కామసేన.. కామాంధుల సేన’
సాక్షి,చిత్తూరు: ‘జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన’అని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్ కే రోజా, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలు నిరసన చేపట్టారు. కీచక ఎమ్మెల్యేని శిక్షించాలని డిమాండ్ చేస్తూ..నగరి ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన.క్యారెక్టర్ లేనివాళ్లతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నాయకులుంటే ప్రజలకు విలువ ఉండదు. మహిళకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయరు. రైల్వేకోడూరులో బాధితురాలికి న్యాయం చేయాలి. రాష్ట్ర హోంమంత్రిని సస్పెండ్ చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్లైన్లు, వార్నింగ్లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. -
అరవ శ్రీధర్ ఎపిసోడ్.. మొహం చాటేసిన పవన్ కల్యాణ్
సాక్షి, ఢిల్లీ: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై స్పందించేందుకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరాకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన్ని.. బుధవారం మీడియా ప్రతినిధులు పలకరించారు. అయితే చాలా అంశాలపై మాట్లాడిన ఆయన.. శ్రీధర్ అంశంపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ఆయన నోరు విప్పలేదు. సైలెంట్గా మొహం చాటేసుకుని కారెక్కి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో అరవ శ్రీధర్పై సస్పెన్షన్ వేటు పడిందని నిన్నంతా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదంతా జన సైనికుల అత్యుత్సాహం అని తర్వాతే తేలింది. రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు అరవ శ్రీధర్ను రక్షించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా.. కేవలం విచారణ కమిటీ పేరిట తతంగం నడిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
‘ఎంపీ భరత్ భూ దోపిడీ.. పవన్, బీజేపీకి కనిపించట్లేదా?’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.మరోవైపు.. విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్పవార్తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. ఆయన బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు. Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.My condolences to his family including his uncle…— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు ఆయన మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అజిత్ పవార్ మామ, శరద్ పవార్ సహా ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంతాపాన్ని ప్రకటించారు. అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరమన్న కాంగ్రెస్ గౌరవ్ గోగోయ్.. ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని.. పారదర్శకమైన దర్యాప్తుతో వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యే(గోషామహల్) రాజాసింగ్ సైతం అజిత్ పవార్ మరణంపై స్పందించారు. అజిత్ పవార్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడెన్ గా ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి విమాన ప్రమాదం వెనక ఎమైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సహజం. గత కొంతకాలంగా ఆయన అధికార నుంచి బయటకు పోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుట్రలు కూడా జరుగు తున్నాయని ప్రచారం జరుగుతోంది. విమాన బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే..కుట్ర ఉందా లేదా తేలొచ్చు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. పవార్ అస్తమయంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు. -
తూచ్.. అదేం లేదు.. జనసేన యూ టర్న్?
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ఒంటరి మహిళను బెదిరించి శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా జనసేన పార్టీ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు మహిళ ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కమిటీ మహిళ ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందించనుంది. అనంతరం, నివేదికను పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంశాన్ని, పవన్ కళ్యాణ్ను సేవ్ చేయడానికి జనసైనికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అరవ శ్రీధర్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక, తాజాగా పార్టీ ప్రకటనతో జనసైనికులకు భంగపాటు ఎదురైంది. అయితే, జనసేన కమిటీ ఏర్పాటుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇదంతా డైవర్షన్లో భాగంగానే జరుగుతోందని.. శ్రీధర్ను కాపాడే ప్రయత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
మహిళలకు వేధింపులు.. సోషల్మీడియాలో షాకింగ్ వీడియోలు.. జంగిల్ రాజ్లా ఏపీ
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని.. ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్నివర్గాలను మోసం చేశారని.. దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ బడ్జెట్తో కలిపి మూడు బడ్జెట్లు పెట్టినట్టు అవుతుంది. ఈరెండేళ్లలో చంద్రబాబునాయుడు వల్ల ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా?. గతంలో ఒక మాట చెప్తే.. ఆమాటమీద నిలబడే ప్రభుత్వం ఉండేది. మేనిఫెస్టోను పవిత్రగ్రంధంగా భావించాం. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్న తప, తాపత్రయం ఉండేది. క్రమం తప్పకుండా ప్రతినెలా ప్రజలను ఆదుకున్నాం. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా.. ఏ పథకాన్ని ఎగరగొట్టలేదు. ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ సమస్యలకన్నా ప్రజల సమస్యలనే ప్రాధాన్యతగా తీసుకున్నాం. ఎన్ని సమస్యలున్నా చిరునవ్వుతో ప్రజలను ఆదుకున్నాం. ఇవాళ్టికీ సగర్వంగా చెప్పగలం. 👉చంద్రబాబు వచ్చాక మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దైపోయాయి. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. చంద్రబాబుగారిలో ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యంకాదు. ఇలాంటి మాటలు చెప్తే.. వేరొకరిపైన 420 కేసులు పెడతారు. చివరకు గ్యాస్ సిలెండర్లలోకూడా చంద్రబాబు మోసాలు చేశారు. మన హయాంలో ఐదేళ్లలో, కోవిడ్ ఉన్నా దాదాపు రూ. 3.32 లక్షల కోట్లు అప్పులు చేశాం. అందులో 2.73లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. ఎవరికి డబ్బులు వెళ్లాయో వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల పరంగా చూపగలం. రెండేళ్లు తిరక్కముందే చంద్రబాబు రూ. 3లక్షల కోట్లు అప్పు చంద్రబాబు చేశాడు. మరి ఆ డబ్బు ఎక్కడకు పోయింది? ఎవరికి పోయింది?. దోచుకో.. పంచుకో.. తిను.. పద్ధతి జరుగుతోంది. ప్రతిచోటా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడంలేదు. చంద్రబాబుగారు, ఆయన మనుషుల జేబుల్లోకి ఆదాయాలు పోతున్నాయి..👉మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. మద్యం షాపులన్నీ.. చంద్రబాబుగారి మనుషులే. బెల్టుషాపులు కూడా వారివే. దగ్గరుండి బెల్టుషాపులు నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ రేట్లకు లిక్కర్ అమ్మడం లేదు. బెల్టుషాపులు దగ్గరకు వెళ్లేసరికి రూ. 20-30లు పెంచి అమ్ముతున్నారు. నాలుగైదు బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతున్నారు:👉మన హయాంలో ఇసుక నుంచి ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. ఐదేళ్లపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక ఉచితంగా వస్తోందా?. డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నా. సిలికా, క్వార్ట్జ్, లెటరైట్.. ఏ ఖనిజాన్నైనా కొల్లగొడుతున్నారు. మొన్న సంక్రాంతిరోజు చూస్తే.. ప్రభుత్వమా? జంగిల్రాజ్ అన్నట్లు అనిపించింది. సోషల్మీడియాలో వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేసింది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్లు నడిపారు. తాగరా.. తాగి చిందేయరా.. అన్న రీతిలో జరిగాయి. ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనిపిస్తోంది. కోడిపందాలు నడపడానికి వేలం పాటలు నిర్వహించారు:పులివెందులలోనూ కోడిపందాలకు వేలంపాటలు పెట్టారు. ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తోంది. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్, పోలీసు అధికారులు పంచుకున్నారు:భీమవరం డీఎస్పీమాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ‘‘ఊపేయ్.. కుదిపేయ్..’’ అని అంటున్నాడాయన. మనం ఏ సమాజంలో ఉన్నామో.. అర్థంకావడంలేదు. రాష్ట్రం జంగిల్ రాజ్ అయ్యింది. బరితెగింపునకు అడ్డులేకుండా పోయింది. విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు👉చంద్రబాబుగారు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏస్థాయికి వెళ్లారో తెలియడంలేదు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడు. ఆముదాలవలస అమ్మెల్యే కూనరవికుమార్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అరెస్టు చేయాల్సిందిపోయి, బాధిత మహిళను జైలుకు పంపారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు. 👉రాష్ట్రం జంగిల్ రాజ్లా మారిపోయింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. గత 8 త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్ మెంట్ రావడంలేదు. పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి:ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. వసతి దీవెనకింద డబ్బులు ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో క్రమం తప్పకుండా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వపు గోరుముద్దలో నాణ్యత లేదు. హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏ రైతుకూ ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. యూరియాకూడా రైతులకు దొరకడంలేదు. రైతులకు రెండేళ్లలో రూ.40వేలు ఇవ్వాలి. రూ.10వేలు ఇచ్చారు. ఆక్వారైతులకు మనం రూ.1.5కే కరెంటు ఇచ్చాం. రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. ఇవాళ ఒక్కపైసాకూడా ఇవ్వలేదు. వ్యవసాయం, వైద్యం, చదువులు ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉండి ఎందుకు?:దుర్మార్గ పాలనలో వైయస్సార్సీపీ కార్యకర్తలు ప్రజల తరఫున గట్టిగా నిలబడుతున్నారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్లా తంతారు. ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రలో ప్రజలమధ్యే ఉంటాం. మొత్తం 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. భీమవరంలో క్యాడర్ చెక్కుచెదరలేదు. గ్రామ స్థాయిలో కమిటీ నిర్మాణం బలంగా జరగాలి. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుంది. నేను కూడా పాలన మీద ఎక్కవ దృష్టిపెట్టాను. కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు. రాబోయే కాలంలో కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మంచి జరుగుతుంది’’ అని జగన్ అన్నారు. -
దావోస్ సదస్సు విహారయాత్ర?
దావోస్ సమావేశాలు నిజంగానే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయా? లేక అవి విహార యాత్రల్లా మారిపోయాయా? ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి సాధిస్తున్నది ఏమిటి? పదిహేనుసార్లు దావోస్కు వెళ్లి రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ భారీ కంపెనీ లేదా పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే నిరాశే ఎదురవుతుంది.ఎందుకంటే.. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న దావోస్ పర్యటనలు మొత్తం సొంత డబ్బాలకే వాడుకుంటున్న భావన కలుగుతుంది. ప్రజా ప్రయోజనం ఎంతో కాని, ప్రభుత్వ నేతలకు మంచి టైమ్పాస్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఇవి పూర్తిగా నిష్ప్రయోజనమనీ చెప్పలేము కాని కాలక్రమంలో షో బిజినెస్గా మారుతోందన్నది ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ప్రకటనలు కొన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.గత ఏడాది దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క ఒప్పందమూ చేసుకోలేకపోయింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలు ఓ మోస్తరు నుంచి భారీ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు చూడండి.. అచ్చం అలాగే.. చంద్రబాబు అప్పట్లో ‘దావోస్కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య’ అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని సాగతిస్తున్నానని తెలిపారు. విశేషం ఏమిటంటే ముందుగా ఆయన సరైన సూచన ఇవ్వాల్సింది తన కుమారుడు లోకేశ్కే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్లినప్పుడు గ్రీన్కో వంటి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకువచ్చారు. కానీ అప్పట్లో లోకేశ్ అండ్ కో ‘విదేశాలకెళ్లి దేశీ కంపెనీని తీసుకొస్తారా’ అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన నెగెటివ్ మైండ్సెట్ సరికాదని చంద్రబాబు.. లోకేశ్కు అప్పుడే చెప్పిఉండాల్సింది.తాజా పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ ఛైర్మన్తో సమావేశమైన సందర్భంలో మాట్లాడుతూ గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. అప్పుడేమో మిథ్య అన్నారు.. ఇప్పుడు మాత్రం బోలెడంత పెట్టుబడి వచ్చిందంటున్నారు. ఏది నిజం? ఈయన అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అది రాష్ట్రానికి అప్రతిష్ట కాదా?. ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు దావోస్లో తొమ్మిది సెషన్లు, సమావేశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలు అన్నీ ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈవోలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా!.కాకపోతే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ పెట్టుబడులు పెట్టాలని బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్.ఎమ్.జడ్ను కోరితే వారు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ రూ.91 వేల కోట్ల పెడుతుందని, లక్ష ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లు కూడా లేకపోగా ఉద్యోగుల సంఖ్య వెయ్యి మంది మించడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీతో లక్ష ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ ఇమేజీని చంద్రబాబు, లోకేశ్లు పెంచారా అంటే ఉన్న పరువు కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏమి చెబుతున్నానో మర్చపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది.‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త’ విధానం తెచ్చానని, కనీసం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది ఐదు లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని చంద్రబాబు మరో సమావేశంలో అన్నారు. ఈ లక్ష్యం సాధిస్తే తర్వాత పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్టిలో చెబితే వాళ్లు ఏమనుకుంటారు? పైకి ఏం అనకపోయినా తర్వాత అయినా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ను హైదరాబాద్ తెస్తానని అంటూ కొన్ని అతిశయోక్తులు చెప్పినా తన గురించి కాకుండా.. తెలంగాణ, హైదరాబాద్లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. సుమారు రూ.29 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. రేవంత్ తన ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్ కో సంస్థతో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం దావోస్లో ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోధాకు చెందిన కంపెనీతో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు చేశారు.2014-19 టర్మ్లో చంద్రబాబు దావోస్ పర్యటనలో చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్ హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరాంకో, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, అలీబాబా రెండో డేటా సెంటర్ ఏపీలోనే.. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ, ఏపీ బ్రాండింగ్ @దావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా! దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. గతంలో బ్రాండ్ ఇమేజీ లేదని మనమే దావోస్లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజీ పడిపోయిందో, పెరిగిందో ఆలోచించుకోవచ్చు.ఇక రెడ్బుక్ అరాచకాల విషయం జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. దావోస్ వరకు వెళ్లి తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. దావోస్లో తెలుగువారి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ను విమర్శించడం వల్ల ఏపీకి ఏం మేలు కలిగినట్లు!. సీపీఎం నేత బీవీ రాఘవులు దావోస్ పర్యటనలను ప్రజాధనంతో జరిగే తీర్ధయాత్రలుగా అభివర్ణించారు. దావోస్లో చంద్రబాబు, లోకేశ్లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజీతో కాకుండా, తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దలాల్ ఒక ట్వీట్ చేస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని వ్యాఖ్యానించారు. దావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఇబ్బందికర వ్యవహారంగా మారిన సంగతిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకోగల ఒప్పందాలను దావోస్లో చేసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ప్రచార ఆర్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత వ్యాఖ్యానించారు. ఏపీ అనుభవం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
44 ఏళ్ల రాజకీయం.. డిప్యూటీ సీఎం పవార్ ప్రస్థానం ఇలా..
ముంబై: మహారాష్ట్రలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బారామతిలో విమాన ప్రమాదం కారణంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో, విమానంలో ప్రయాణించిన అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది. దీంతో, అజిత్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.రాజకీయ ప్రస్థానం.. అజిత్ పవార్ స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కటేవాడి. అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. పవార్ పదో తరగతి వరకు డియోలాలిలో విద్యాభ్యాసం చేశాడు. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబై వచ్చారు. తన విద్యను పూర్తి చేసిన తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు. అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్గా వ్యవహరించారు.1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అజిత్ పవార్ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అకాల మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు అజిత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ..‘అజిత్ పవార్ ప్రజల నేతగా, కింద స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలనా వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు, పేదలు-అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకితభావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు చేశారు. Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R— Narendra Modi (@narendramodi) January 28, 2026కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కొరకు పని చేశారని అన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది. -
బండారు శ్రావణి అనుచరుల దాడి.. పోలీసుల నిర్వాకం ఇలా..
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు పోలీసుల నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, వీరంతా ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు కావడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివరాల మేరకు.. జనవరి ఒకటో తేదీన వైఎస్సార్సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో యల్లనూరు టీడీపీ కన్వీనర్ రామాంజనేయులు సహా మరో 24 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే, నిందితులంతా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులే కావడం గమనార్హం.కాగా, ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నిందితులు బాహాటంగా తిరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే కేసులో 12 మంది వైఎస్సార్సీపీ నేతలను మాత్రం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బండారు శ్రావణి కార్యక్రమాల్లో టీడీపీ నేత రామాంజనేయులు, ఆయన అనుచరులు పాల్గొంటున్న వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. కేసు నమోదు చేసినప్పటికీ ఎందుకు వారిని అరెస్ట్ చేయడం లేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్య సర్కార్కు ఝలక్?
బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై రాజకీయం నడుస్తున్న వేళ సిద్దరామయ్యపై సర్కార్కు మరో ఝలక్ తగిలింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి దాదాపు 6000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో, మద్యం కుంభకోణం విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఖర్గే, రాహుల్కు లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. వివరాల మేరకు.. కర్ణాటకలో మద్యం అమ్మకాలకు సంబంధించిన సీఎల్-7 లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఒక్కో లైసెన్స్ జారీకి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేశారని, అలా మొత్తంగా దాదాపు 6000 కోట్లు తిన్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు భాగమైనట్టు వారు చెప్పుకొచ్చారు. కాగా, మద్యం అమ్మకాల్లో అవినీతినిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. మరోవైపు.. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్పై కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల సిద్ధరామయ్య పాలన అవినీతికి కేరాఫ్గా మారిందన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రూ. 700 కోట్ల స్కాం జరుగుతోందని 2024లోనే సీఎం సిద్ధరామయ్యకు, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే, మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధూ సర్కారు ముందుకు రాలేదని.. దీంతో స్కాం తీవ్రత పెరిగిపోయిందని వాపోయారు. దీంతో, మద్యం వ్యవహారం కర్ణాటకలో కొత్త చర్చకు దారి తీసింది.ఇదిలాఉండగా తమ కస్టమర్లకు మద్యాన్ని ఇవ్వడానికి బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాల్లోని హోటల్స్, బోర్డింగ్ హౌజ్ల యజమానులు సీఎల్-7 పేరిట ప్రత్యేక లైసెన్సులను తీసుకొంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ లైసెన్స్ రూ. కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, ఎక్సైజ్ శాఖ స్కాం వార్తలను మంత్రి తిమ్మాపూర్ కొట్టివేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన.. దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడుతానన్నారు. ఈ స్కామ్పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. పాలనను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుంభకోణాల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. -
ఏదోరోజు బాంబు పేలుస్తా..
సాక్షి, నల్గొండ జిల్లా: ‘మరికొద్ది రోజులు వేచిచూస్తా.. ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా’.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయకుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు లేకుండా సీఎం, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను సగానికి పైగా పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో అనేకమంది కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారన్నారు. ఈ విషయాన్ని నెల రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. వారం రోజుల్లో పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించేలా చొరవ చూపుతానన్నారని తెలిపారు. ఆయన హామీ ఇచ్చి మూడు వారాలు గడుస్తున్నా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
పురపోరుకు బీజేపీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యావత్ పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మె జారిటీ స్థానాలు గెలిచేలా అన్నిస్థాయిల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానించింది. బుధ, గురువారాల్లో నామినేషన్ల దాఖలు సమయం ముగియనున్నందున వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.తొలుత నోవాటెల్లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్రపార్టీ ఇన్చార్జి అభయ్ పాటిల్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో జాతీయ నాయకత్వం నియమించిన ఇతర రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జీలు సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయేదాకా నోవాటెల్లోనే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలతో పార్టీ నేతలు రాంచందర్ రావు, కిషన్రెడ్డి, అభయ్ పాటిల్, డీకే అరుణ, కె.లక్ష్మణ్ ఇతర ముఖ్యనేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలతో రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున బహిరంగ సభ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. విజయసంకల్ప సమావేశాలు: రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళామోర్చా, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో విజయసంకల్ప సమావేశాలు జరిగాయి. మహిళా మోర్చా సన్నాహక సమావేశంలో రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వీరేందర్ గౌడ్తోపాటు ఎన్నికల కో ఇన్చార్జి, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, మరో కో–ఇన్చార్జి, ఎంపీ రేఖాశర్మ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. -
Karnataka: డీకే డీకే అంటూ అరిచేది ఎవరు?
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో సీఎం మార్పు అంశానికి దాదాపు తెరపడినట్లే కనిపించినా, అక్కడక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను అభిమానించే గణం మాత్రం తమ వాయిస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ‘డీకే.. డీకే’ అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెద్దగా అరుపులు అరవడం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విపరీతమైన కోపం తెప్పించింది. అది కూడా తాను పాల్గొన్న ర్యాలీలో ఇలా అరవడం ఏంటనే చిరాకు సిద్ధరామయ్యలో కనిపించింది. ‘ఎవరు డీకే.. డీకే అరుస్తుంది.. నెమ్మదిగా ఉండలేరా.. కామ్గా ఉండండి’ అంటూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధరామయ్యా.వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి పథకం "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఓ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో సిద్ధరామయ్యతో పాటు శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.అయితే దీనిలో భాగంగా వేదిక వద్దకు సిద్ధరామయ్య నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డీకే.. డీకే అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న సిద్ధరామయ్య.. ఎవరు.. డీకే డీకే అంటూ అరిచేది.. అరవ కుండా ఉండలేరా. అంతా సైలెంట్గా ఉండండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో కూడా డీకే నాదమే వినిపించడంతో సిద్ధరామయ్యకు మరింత కోపం తెప్పించింది. కాకపోతే చేసేది లేక అలాగే ప్రసంగించారు సిద్ధరామయ్య. -
‘అధైర్యం వద్దు.. మీకు అండగా నేను ఉన్నాను’
సాక్షి,తాడేపల్లి: అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సీసీ నేతలు, క్యాడర్కు భరోసా ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవలే జోగి రమేష్, రాము విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.ఈ భేటీలో తమను, తమ కుటుంబాన్ని అక్రమ కేసులతో టీడీపీ ప్రభుత్వం ఇబ్బందిపెట్టిన తీరును జోగి సోదరులు వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, క్యాడర్ ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. పార్టీ లీగల్ సెల్ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. -
‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాలి’
సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారుఅధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. -
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది. -
జోగి సోదరులను తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు: కేతిరెడ్డి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జోగి రమేష్, జోగి రామును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ను కలిశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని.. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.‘‘జోగి రమేష్ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యుల పైనా కేసు పెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మర్డర్లు చేసిన వారిపై కేసులు పెట్టడం లేదు. కోడిని, గొర్రెలను కోసిన వారి పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మావాళ్లు పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పిదాల పై జోగి రమేష్ పోరాటం చేస్తూనే ఉంటారు.చంద్రబాబుకు కేతిరెడ్డి సవాల్..‘‘ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోంది. కల్తీ మద్యం తయారు చేసేది నీ జిల్లా నుంచే చంద్రబాబు. బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నావ్. కానీ ఇప్పుడు ఊరికి నాలుగు బెల్టు షాపులు ఉన్నాయి. వేలంపాటలో బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. గిట్టుబాటు కావడం కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తన పై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. కేసు పెట్టిన వాసుదేవ రెడ్డి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదే వాసుదేవ రెడ్డి మరో కేసులో అప్రూవర్ అవుతాడు. ఇది కేసును ప్రభావితం చేయడం కాదా?. చంద్రబాబుపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎలా తొలగిస్తున్నారు?..కేసులు పెట్టిన మీరే ఆ కేసులు తీసేయాలని కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్లో లోకేష్ చెప్పాడు. లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్గా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముంది?. మీరు ఎంతమందిని జైల్లో వేస్తారో.. అంతకు పదింతలు ప్రశ్నిస్తాం. కేసులు.. అరెస్టులు.. జైళ్లు మాకు కొత్త కాదు...ఇలాంటివి మేం చాలా చూశాం. తప్పుడు కేసులు కట్టే అధికారులు ఆలోచన చేయండి. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సన్నిహితులుగా ఉన్నారు.. ఫోటోలు ఉన్నాయని కేసులు పెట్టడం కాదు. అత్యాచారాలు చేసిన వారు లోకేష్తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లోకేష్ను కూడా ముద్దాయిగా చేరుస్తారా?. చట్టం అందరికీ ఒకటే..కేసులు తీయించుకోవాలని చూస్తున్న ప్రయత్నంపై అప్పీల్కు వెళతాం. నాయకులు చెప్పారని అధికారులు అక్రమ కేసులు పెడితే ఇబ్బంది పడతారు. మీకు చేతనైతే నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో అరికట్టండి. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిపారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. ఈ రోజు లడ్డూలో అలాంటిదేమీ లేదని తేలింది. తాము ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిందని కూటమి నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూమతాన్ని కాపాడతాడా?. నకిలీ మద్యం విషయంలో తప్పుడు ఆధారాలతో బురదజల్లారు. దీని పై లీగల్ గా ఫైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదలం..మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ మేం అధికారంలో ఉన్నప్పుడే తెచ్చాం. మంచి మద్యం ఇస్తానని చంద్రబాబు చెబితే అందరూ ఈలలు వేశారు. మంచి విద్య, వైద్యం ఇస్తామని జగన్ చెబితే ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మా ధర్మవరంలో ఇవాళ తనిఖీ చేసినా 70 శాతం నకిలీ మద్యం దొరుకుతుంది. జనం దగ్గరకు వెళ్లాంటే గట్స్ ఉండాలి. నేను ఇది చేశానని చెప్పి గడప గడపకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. వైఎస్ జగన్ ఎమ్మెల్యేలందరినీ ప్రజల ఇళ్లకే పంపించారు. వాళ్లచేతిలోనే కదా ప్రభుత్వం ఉంది. నా పై ఆరోపణలకు ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు. ఈ ప్రభుత్వంలోని నేతలకు దమ్ముంటే గడపగడపకు వెళ్లమని చెప్పండి. నేను ఎక్కడ భూ కబ్జాలు చేశానో చూపించమనండి. చేతనైతే వాటిపై చర్యలు తీసుకోమనండి’’ అంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. -
ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు రూ.3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు.సూరాయపాలెం ఇసుక రీచ్పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ విరివూరు ఇసుక రీచ్లో అర్ధరాత్రి, వేకువ జామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా ఎలా దోచేస్తున్నదీ ఆయన వివరించారు.సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి వారికి బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లాలని కాకాణి గోవర్థన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న వారు దొరికితే అరెస్ట్ చేసి శిక్షించాల్సిన పోలీసులు మంత్రి పర్మిషన్ అడగడం ఏమిటని మండిపడ్డారు. పైగా కూటమి నాయకుల ఇసుక దందాను బయటపెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే కూటమి నాయకుల దందాకు కలెక్టర్, ఎస్పీ లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రెస్మీట్లో కాకాణి గోవర్థన్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:పెన్నా నదికి గర్భశోకం:అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. నదీగర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీలతో తరలిస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.సెమీ మెకనైజ్డ్ రీచ్లకు పొక్లెయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఐదు రెట్లు అధిక ధరలకు ఇసుకను అమ్మేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్లు నిర్వహించి ఏడాదికి రూ.700 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.3500 కోట్ల ఆదాయం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పేరుతో ఆ మొత్తాన్ని కూటమి నాయకులు దోచుకుంటున్నారు.రాత్రింబవళ్లూ ఇసుక దోపిడీ:ఒక్క సూరాయపాలెం ఇసుక రీచ్ ద్వారానే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రూ.100 కోట్లు దోపిడీకి స్కెచ్ వేశారని గతంలో నేను ఆరోపిస్తే, ఆయన తోసిపుచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ఏకంగా సాయి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్కి వెళ్లేలా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి నేరుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్ షీట్ పేరుతో చేత్తో రాసిన స్లిప్ చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులు లోడ్తో వెళ్లే ఒక ట్రాక్టర్కి టన్నుకి రూ.68 చొప్పున రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉంటే ఐదు రెట్లు అధికంగా రూ.1,250 వసూలు చేస్తున్నాడు. పైగా ఉ. 6 గం. నుంచి సా. 6 గం. మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రేయింబవళ్లు పొక్లెయినర్లతో తోడేస్తున్నారు. (అంటూ.. పెన్నా నదిలో విరువూరు ఇసుక రీచ్లో వేకువజామున, అర్ధరాత్రి వేళల్లో ఇసుక తవ్వుతున్న ఫొటోలు ప్రెస్మీట్లో ప్రదర్శించారు).ఓపెన్ రీచ్లలో ఏకంగా రైతులకు సాగు నీరు వెళ్లే కాలువలకు అడ్డంగా గట్టు కట్టి మరీ గ్రావెల్తో రోడ్డేసి ఇసుక లారీలను రప్పిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను బేఖాతరు చేసి మరీ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పడి అమాయకుల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారిని నడిరోడ్డు మీద బేడీలు వేసి నడిపించాలి.ఐదు రెట్లకు మించి అధిక ధరలు:సూరాయపాలెం ఇసుక రీచ్ను కేస్ స్టడీగా తీసుకుని తెలుగుదేశం నాయకుల ఇసుక దోపిడీపై మేం కూలంకషంగా స్టడీ చేశాం. ఇసుక రీచ్ మీద నెలకు ఏకంగా రూ.3 కోట్లు దోచేస్తున్నారు. రూ.1400 వసూలు చేయాల్సిన టిప్పర్కి ఏకంగా రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. 12 టైర్ల లారీకి రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు, 14 టైర్ల లారీకి రూ.2024 వసూలు చేయాల్సి ఉంటే రూ.15 వేలు వసూలు చేస్తున్నారు.ఇసుక దోపిడీదారులకు పోలీసుల రక్షణ!:కూటమి నాయకుల ఇసుక దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీని పోలీసులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెబుతూ నిందితులపై చర్యలు తీసుకోమని ఆదేశించకుండా, రాత్రుళ్లు టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. (అంటూ.. మంత్రి మాటల ఆడియోను ప్రెస్మీట్లో వినిపించారు)ఇసుక దొంగలు చేతికి దొరికితే వారిని అరెస్ట్ చేయకుండా మంత్రి నారాయణ సలహా అడగడం చూస్తుంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు న్యాయబద్ధంగా నిబంధనల మేరకు వ్యవహరించడం లేదు. కూటమి నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే, కూటమి నాయకుల ఇసుక దోపిడీకి కలెక్టర్, ఎస్పీలు లైసెన్స్ ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. -
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం టౌన్లోని బొట్టుగూడలో తాను నిర్వహించే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నిప్పులా.. నిజాయితీగా బతుకుతున్నా. నల్లగొండ నా గుండెకాయ. అందుకే కొడంగల్కు ఎన్ని నిధులు తీసుకెళ్తారో.. తనకూ అన్నే నిధులు ఇవ్వాలని సీఎం రేవత్ను కోరా. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటే పోటీ చేస్తా. లేదంటే ఇదే బొట్టుగూడ స్కూల్లో ఓ గది తీసుకుని ఉంటా. ఇక్కడి పిల్లల్లోనే చనిపోయిన నా కొడుకుని చూసుకుంటూ కాలం వెల్లదీస్తా. గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. ఆ టైంలో కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దొంగలు దోచుకుంటున్నారు. నేను గనుక విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ను మూయించేస్తా. వైఎస్ఆర్ హయాంలో నల్లగొండలో ఎంజీ యూనివర్సిటీ నిర్మించా. లా పాటు అనేక నూతన కోర్సులను ఎంజీ యూనివర్శిటీలో తీసుకొచ్చా. నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్డును గిఫ్టుగా గడ్కరీ ఇచ్చారు. నల్లగొండలో ప్రతీ ఇంటికి 24 గంటల నీటిని అందిస్తాం.చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం. ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇదే స్కూల్ చేర్పించాలి అని కోమటిరెడ్డి కోరారు. -
తెలుగు ఎన్నారైలపై ‘మీనింగ్లెస్’ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ విషయం చాలాకాలంగా అందరికీ తెలుసు కానీ.. తాజాగా దావోస్లో ఆయన తెలుగుదేశం అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్య మాత్రం ప్రవాస భారతీయులను బిత్తరపోయేలా చేసింది. ఎందుకంటే.. 195 దేశాల్లో ఈరోజు తెలుగు వాళ్లు ఉండేందుకు తానెప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే కారణమి ఆయనగారు వాకృచ్ఛారు మరి!. నిజానిజాలతో సంబంధం లేదు.. ఎవరు ఏమనుకుంటారన్న విషయమూ పట్టదు!. చదువుకోసం లేదంటే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఆయా కుటుంబాలు తీసుకునే నిర్ణయం. వారి కష్టం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?. ఉన్నచోట లేదా దేశంలో సరైన అవకాశాలు లేకపోతేనే కదా!. విదేశాల నుంచి యువత భారత్కు రాకపోవడానికి కూడా అక్కడ మంచి అవకాశాలు ఉండటమే కారణం. బతుకుతెరువు కోసం చాలామంది తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. వెళుతున్నారు కూడా. అది తప్పు కాదు కానీ.. అదంతా తనవల్లే అని చంద్రబాబు వంటి వారు చెప్పడం మాత్రం దారుణం.అమెరికాలో తెలుగువాళ్లు కాస్తో, కూస్తో మెరుగ్గా ఉండవచ్చు. పైగా డాలర్ మారకపు విలువ ఎక్కువ ఉండటం కూడా ఒక ఆకర్షణ. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీసా దొరకడమే పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక కారణాలను పక్కనబెడితే ఏ దేశంలోనైనా విదేశీయులు రెండో తరగతి పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి, ఆ దేశ పౌరుడు అయ్యేందుకు ఎంత వ్యయం చేయాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో అందరికి తెలుసు.అదేమీ గొప్ప సంగతి కాదు. పైగా విదేశాలకు వెళ్లడం అన్నది చంద్రబాబు కనిపెట్టింది కాదు!!. స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్నదే.. ..1970వ దశకంలో భారత ప్రభుత్వం మేధో వలసను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అంటే మన మేధస్సు ఇతర దేశాలకు కాకుండా దేశాభివృద్ధికి దోహదపడాలన్న ఆలోచనలు చేశారు. అయినా వలసలు ఆగలేదు. ఇది నిజానికి భారత్కు ప్రతిష్ట కాదు. ఉదాహరణకు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆ కంపెనీ విస్తరణలో భాగంగానే మన దేశంలో కూడా పెట్టుబడులు పెడుతుండవచ్చు. అలాగే గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటివారు మరికొందరు ఉండవచ్చు. కాని అలాంటి మేధావులను మనం ఎందుకు ఇక్కడే ఉంచి వారికి అవకాశాలు కల్పించలేకపోయాం అన్నదాని గురించి ఆలోచించకుండా అదే గొప్ప విషయం అన్నట్లు చెబుతుండడం యువతను మభ్య పెట్టడమే. అమెరికా తర్వాత మన భారతీయులు, అందులోను తెలుగువారు ఇంగ్లండ్, సింగపూర్, దుబాయి వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. గల్ఫ్ దేశాలలో ప్రత్యేకించి అంతగా చదువు లేనివారు వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నది తెలిసిందే. ఒంటెలు, గొర్రెలు కాపలా కాసే ఉద్యోగాలలో ఉంటున్నారు. నిర్మాణ రంగంలో చాకిరి చేస్తున్నారు. చివరికి అక్కడి షేక్లు, ఇతర వ్యాపారుల వద్ద బానిసలుగా బతుకుతున్న ఘట్టాలు కోకొల్లలు.విదేశీ వ్యామోహాన్ని అడ్డు పెట్టుకుని పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అటు చీపురు ఇటు వేయడానికి నామోషీగా ఫీల్ అయ్యేవారు అమెరికా తదితర దేశాలకు వెళ్లినప్పుడే వారే బాత్రూములు శుభ్రం చేయవలసిన పరిస్థితికి బాధ పడుతుంటారు. మాల్స్లో, పెట్రోల్ బంకుల్లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలామంది ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సైబర్ ఫ్రాడ్ కారణంగా కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని మన దేశం వెనక్కి తీసుకు వస్తుంటుంది. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం వేరు. వ్యాపారం, లేదా మంచి ఉద్యోగం వస్తే వెళ్లవచ్చు. కాని విదేశాలపై మోజుతో వెళ్లి చాలామంది అవస్థలు పడుతున్నారు. అలాంటప్పుడు.. అమెరికా నుంచి వెనక్కి రావచ్చు కదా అని అడిగితే మన తెలుగువారు ఏమి చెబుతారో తెలుసా! ఇక్కడ రూల్స్ సరిగా ఉండవు. భారత్లో అవినీతి ఎక్కువ అని. వాటిని సరి చేయడానికి చంద్రబాబు వంటివారు చేసిన కృషి ఏమి ఉంది? పైగా అబద్దపు హామీలు, అక్రమాలతో ఎన్నికలలో గెలవడం వంటివి చేయడానికి వెనుకాడరు. తెలంగాణ ఉద్యమం రావడానికి నిరుద్యోగం కూడా ఒక కారణం అని ఈ రాష్ట్ర నేతలు చెబుతారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి యువత అరేబియా దేశాలకు వెళ్లి నానా అగచాట్లు పడుతున్నారని, ముంబై వంటి నగరాలకు వలస పోతున్నారని వారందరిని వెనక్కి వచ్చేలా చేస్తామని అనేవారు. పాలమూరులో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఆ వలసలను ఆపగలిగామని అంటారు. మరి ఏపీలో సైతం కోనసీమసహా పలు ప్రాంతాల యువకులు లక్షల మంది ఎక్కడైనా సరే ఉద్యోగమంటూ వస్తే చాలని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. అవన్నీ ఎందుకు హైదరాబాద్ నగరంలో స్థిపరడిన ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చాయి?. పొట్టచేత పట్టుకుని వచ్చారని, కడుపు కొడుతున్నారని ఎందుకు తెలంగాణ ఉద్యమంలో విమర్శించే వారు. తెలంగాణలోనే ఆంధ్రులు ఒకరకంగా రెండో తరగతి పౌరులుగా ఉండే పరిస్థితి ఉండిందా? లేదా?. చంద్రబాబు వాదన ప్రకారం మన రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, కూలి, నాలి చేసుకుని బతకడం కూడా ఆయన గొప్పే అనుకోవాలి. కుప్పం నుంచి రోజూ వేల మంది బెంగుళూరు వెళుతుంటారు. బీహారు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వేల మంది ఏపీ, తెలంగాణలకు వచ్చి నిర్మాణ పనులు, ఇతర చిన్న,చిన్న కూలీ పనులు చేసుకుంటున్నారు. వారంతా అలా వెళ్లడం తన ఘనతే అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించగలుగుతారా? అలాగే చంద్రబాబు చెప్పేది కూడా అర్థంలేని విషయం. పోనీ చంద్రబాబు వల్లే విదేశాలకు వెళ్లారన్నది కూడా అర్ధరహితం. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్.టి.రామారావు విదేశాలలో ఉన్న తెలుగు వారు వెనక్కి రావాలని పిలుపు ఇచ్చి వారితో పెట్టుబడులు పెట్టించడానికి ఎన్ రిచ్ అనే ఎన్.ఆర్.ఐ. సంస్థను స్థాపించారు. 1960లలోనే అనేక మంది వైద్యులు భారత్ నుంచి అమెరికా తదితర దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1992లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి టైమ్ లో అమీర్పేటలో ఉన్న మైత్రివనం భవనంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఉండేది. అక్కడ నుంచి మాదాపూర్ వైపు తరలించడానికి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీని తీసుకు వచ్చి శంకుస్థాపన చేయించారు. భారత్ కంప్యూటర్ యుగం ఆరంభమైంది అప్పటి నుంచి. చంద్రబాబు 2000వ సంవత్సంలో హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అప్పటికే దేశంలోని బెంగుళూరు, ముంబై, చెన్నై నగరాలు ఐటి రంగంలో ప్రసిద్ది గాంచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్తో ఇంజనీరింగ్ విద్య పేద వర్గాలకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ కారణంగానే తాము చదువుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డామని పలువురు చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2000 సంవత్సరం నాటికే లక్షలాది మంది తెలుగువారు విదేశాలలో ఉద్యోగార్థం వెళ్లారన్నది వాస్తవం. కాని అదంతా తమ క్రెడిట్ అని ఆరోజుల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. కాని చంద్రబాబు మాత్రం ప్రతిదానిని, తమ తల్లిదండ్రుల శ్రమని సైతం తన క్రెడిట్లో జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే 195 దేశాలలో తెలుగువారు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా?::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఆయనో ఎమ్మెల్యే. ఆ పార్టీ జిల్లాకు అధ్యక్షుడు కూడా. ఈ రెండే కాకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగానూ ఉన్నాడు. అందుకేనేమో నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కుతుంటే పట్టించుకునే తీరికలో లేడేమో అంటూ సెటైర్లు పేలుతున్నాయి. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. ఎండకాలం ఇంకా రాక మనుపే.. తాగునీటి సమస్యలతో నియోజకవర్గ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వరుసగా.. బేగార్లపల్లి, వడ్రపాళ్యం, కొడగార్లగుట్ట, కూగిరినపాళ్యం, జమ్మలబండ, రాళ్లపల్లి గ్రామాల్లో మహిళల నిరసనలు చేపట్టారు. తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా మడకశిరలో ఖాళీ బిందెలతో బైఠాయించి మహిళలు నిరసన తెలుపుతున్నారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, తమ కన్నీటి కష్టాలు తీర్చే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట తాగునీటి కోసం ఆందోళన జరుగుతునే ఉన్నాయంటున్నారు. తాజాగా.. బోరు మోటర్ చెడిపోవడంతో మడకశిర పట్టణంలోని 18వ వార్డుకు 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రతి రోజూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడం, కనిపించిన ప్రతి అధికారినీ వేడుకోవడం మామూలైపోయింది. దీంతో రిపబ్లిక్ డే నాడు.. మహిళలంతా ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. బేగార్లపల్లి క్రాస్లోని హిందూపురం ప్రధానరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటసేపు ఆందోళన చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ లావణ్య వెంటనే అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలంలోని కేజీగుట్ట, కొడగార్లగుట్ట గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అదే విధంగా మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యంలో తాగునీటి సమస్యపై మహిళలు హిందూపురం ప్రధానరోడ్డుపై నిరసన తెలిపారు. గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లులో కూడా మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు.కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో చిన్నచిన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి. ప్రజల సమస్యలపై దృష్టిసారించకుండా.. అనవసర విషయాలపై ఎమ్మెల్యే ఆర్భాటం ఎక్కువైందని స్థానికులు మండిపడుతున్నారు. -
సొంతగూటికి అరూరి రమేశ్
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన రమేశ్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరనున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేశ్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు
సాక్షి ఎన్టీఆర్ జిల్లా: రెడ్బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. అయితే అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగిరమేశ్కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైస్సార్సీపీలో యాక్టివ్గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైళ్లో తోస్తుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ఎంత హింసిస్తే వైఎస్సార్సీపీ నేతలు అంత పట్టుదలగా పార్టీ బలోపేతానికి సిద్ధపడతారని తెలిపారు. ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్నే సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పరోక్షంగా జనం సంతృప్తిగా లేరని తెలిపారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందన్నారు. చంద్రబాబు , లోకేష్ల పోకడే వారి పతనానికి నాంధి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచిన వారు రెడ్ బుక్ పేరుతో చేస్తున్న బెదిరింపులకు భయపడతారా అని అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమలలో లడ్డూ తయారికీ దశలవారిగా నెయ్యిపరీక్ష చేస్తారన్న సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ను మోసం చేసిన చంద్రబాబుకు ఆయన విగ్రహాం పెట్టే అర్హత ఎంతమాత్రం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైఎస్సారీపీ నేతలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
‘గవర్నర్తో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడించింది’
తాడేపల్లి : రాష్ట్ర గవర్నర్తో కూడా కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడించిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అబద్ధాలతోనే బతుకుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. రిపబ్లిక్ డే రోజున కూడా గవర్నర్తో పచచి అబద్ధాలు చెప్పించడం దుర్మార్గమన్నారు. ఈరోజు(సోమవారం, జనవరి 26వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ చంద్రబాబు ఎన్నికలలో గెలవటానికి సూపర్ సిక్స్ పేరుతో పచ్చి మోసం చేశారు. జనవరి 1న జాబ్ కేలండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు మోసపు మాటలు మాట్లాడారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వలేదు. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్ పథకాల పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారు. జగన్ చేయూత పథకం కింద రూ.18 వేలు ఇచ్చారు. చంద్రబాబు పీ4 పేరుతో మోసం చేశారు. పీ4ని గొప్పగా అమలు చేస్తన్నామంటూ గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు. పెన్షన్ 5 లక్షల మందికి తగ్గించి వృద్దులు, వితంతువులను మోసం చేశారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగటం తప్ప ప్రభుత్వ పెద్దలు ఏమీ చేయటం లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గమూ హ్యాపీగా లేదు. మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ స్కూళ్లు సర్వం నాశనం అయ్యాయి. అమరావతి రైతులను చంద్రబాబు దగా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధిస్తున్నారు. మందడంలో రైతు రామారావు చావుకు ప్రభుత్వమే కారణం. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అమరావతిని అడ్డం పెట్టుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి సైలెంట్ గా ఉన్నారు. జగన్ని విమర్శించటం తప్ప హోంమంత్రికి మరేం పనిలేదు. సిగ్గులేని మాటలు మాట్లాడటం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అలవాటే. 2014-19 మధ్య మా పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే ఈ స్పీకర్ ఏం చేశారు?’ అని ప్రశ్నించారు. -
ఏపీలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ ఫలితాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో రాజ్యాంగానికి విలువ,గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విషు.. జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు స్వాతంత్ర ఫలాలను ప్రజలకు చేరువ చేశాం.. కానీ 20 నెలల కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అని మల్లాది విష్ణు అన్నారు.ఏపీలో అన్యాయం రాజ్యమేలుతోంది: కేకే రాజువిశాఖ: విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించిన పాలన ఇక్కడ జరగడం లేదని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు రాజ్యాంగానికి లోబడి వైఎస్ జగన్ పాలన చేశారని కేకే రాజు అన్నారు.‘‘విద్య ఒక్కటే సమాజంలో సమానత్వం తీసుకొస్తుందని నమ్మి వైఎస్ జగన్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. వెనుకబడిన వర్గాల వారికి వైఎస్ జగన్ ఊతం ఇచ్చారు. అణగారిన సామాజిక వర్గాలకు చట్ట సభల్లో వైఎస్.జగన్ ప్రాతినిధ్యం కల్పించారు. వెనుకబడిన కులాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేదు. రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనపై మనమంతా ఐక్యంగా పోరాడాలి’’ అని కేకే రాజు పిలుపునిచ్చారు. -
‘ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ’
సాక్షి,చేవెళ్ల: ధైర్యం ఉంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను పక్కన పెట్టారు. మేం అప్పుడు చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని. ఇప్పుడు అది నిజమైంది.రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల కాలంలో వృద్ధుల నుంచి ఆడబిడ్డల వరకు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారు. శాసనసభ స్పీకర్ ధృతరాష్ట్రుని పోలి కళ్ళకు గంతలు కట్టుకొని నిజాలు చూడలేకపోతున్నారు. చేవెళ్ల నాయకుడు కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, స్పీకర్ మాత్రం ఆయనను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడిగానే గుర్తిస్తున్నారు. యాదయ్య స్వయంగా తాను కాంగ్రెస్లో ఉన్నానని చెబుతున్నా స్పీకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్కు ధైర్యం ఉంటే తమ పార్టీలో చేరిన యాదయ్యపై చర్యలు తీసుకొని ఎన్నికలకు రావాలి’ అని సవాల్ విసిరారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ అదే మోసం కొనసాగుతుంది. కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది’అని స్పష్టం చేశారు. -
దావోస్ దారి ఖర్చులూ కలిసిరాలేదట.. నిజమేనా?
‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’ - సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’ - చంద్రబాబు నాయుడు ప్రశంస..‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’- నెటిజన్ల వ్యాఖ్య..పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.ఆంధ్రప్రదేశ్కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్లు అది మాని ఏపీ బ్రాండ్ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇంతకంటే దుర్మార్గం ఏముంది బాబూ?: పేర్ని నాని
సాక్షి, ఏలూరు జిల్లా: చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారని.. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘‘తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిపారని దుష్ప్రచారం చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ దుర్గగుడికి మెట్లు కడిగారు. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారు. పాపపు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాలుకపై వాతలు పెట్టాలి’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డూలో ఎలాంటి పంది, జంతువు, చేప కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్షీట్లో చెప్పిందని పేర్ని నాని గుర్తు చేశారు. ‘‘కలియుగదైవం వెంకటేశ్వరస్వామి వేసే శిక్షను చంద్రబాబు,పవన్ తప్పించుకోగలరా?. వెంకటేశ్వరస్వామి పవిత్రతో ఆటలాడిన చంద్రబాబు, పవన్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
‘నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం’
నిజామాబాద్ : నిజామాబాద్ కార్పోరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్. మన నిజామాబాద్ మన అభివృద్ధి... పేరుతో ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు(ఆదివారం, జనవరి 25వ తేదీ) నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్తకర్తల సమావేశంలో పాల్గొన్న మహేష్కుమార్ గౌడ్.. ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే ఉత్తమ్కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కాంగ్రెస్.. బీజేపీకి ఎంత దూరమో మజ్లిస్కు అంతే దూరం. బీజేపీ నేతల అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం చిమ్ముతన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర వద్దు, ప్రలోభాలతో టికెట్స్ రావు ,డబ్బులు ఎవరికి ఇవ్వొద్దు. కులం , మతం పేరిట ప్రజల జీవితాలు విచ్చిన్నం చేస్తానంటే చూస్తూ ఊరుకోం’ అని స్పష్టం చేశారు. -
ఏబీఎన్ క్షమాపణ చెప్పాల్సిందే: BRS
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానెల్ డిబేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వైఖరిని బీఆర్ఎస్ ఖండించింది. ప్రత్యేక చర్చ సందర్భంగా MLC రవీందర్ రావుపై ఏబీఎన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్యా స్పూర్తికి ఇది విరుద్ధం అని పేర్కొంది. కనుక తక్షణమే ఎమ్ఎల్సీకి, ఏబీఎన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఇక నుంచి ఏబీఎన్ ప్రతినిధులను బీఆర్ఎస్ సమావేశాలకు అనుమతించేది లేదని కీలక నిర్ణయం తీసుకుంది. -
‘రేవంత్ కళ్లలో ఆనందం కోసం భట్టి పనిచేయడం బాధాకరం’
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. అంతటి అనుభవం ఉన్న భట్టి.. రేవంత్రెడ్డి కళ్లలో ఆనందం కోసం పనిచేయడం బాధాకరమన్నారు. సింగరేణి స్కాంలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, జనవరం 25వ తేదీ) మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. సింగరేణి స్కాంలో లబ్ధిదారుడు రేవంత్రెడ్డేనన్నారు. అయితే భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. ‘అవినీతి ఆరోపణలు వచ్చినప్పడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారు. సింగరేణి ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్. తనకు లేఖ రాస్తే.. భట్టి ముఖ్యమంత్రితో మాట్లాడుతాననటం హాస్యాస్పదం. రేపో మాపో నాకు మరో లేఖ(సిట్ నోటీసులు) వస్తుంది. మే 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ వర్క్స్ కోసం సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చింది. ఓబీ వర్క్స్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి. నైమీ బ్లాక్ టెండర్లు కాదు.. సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఎంత మందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రిని బొగ్గు స్కాం నుంచి బయట పడేయటానికి ప్రయత్నం చేసి భట్టి విఫలమయ్యారు. భట్టి మాటల గారడితో మసిపూడి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎరరు? నష్టం ఎంత? ఎవరు బాధ్యడు.. భట్టి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఆనాడు మాపై విషం చిమ్మి.. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా’
నగరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ మహిళా నేత ఆర్కే రోజా మరోసారి ధ్వజమెత్తారు. భూముల రీసర్వే అంశానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేనే ఇప్పుడు మీరు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఆనాడు తమపై విషం చిమ్మి.. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్కే రోజా.. చంద్రబాబు పాలనంతా ఎగనామాలు, కోతలే అంటూ విమర్శించారు.‘పాస్బుక్లపై మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు. మీ పాలనంతా ఎగనామాలు.. కోతలుగానే ఉంది. 51 లక్షల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎగనామం పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. సిగ్గులేకుండా సూపర్-సూపర్హిట్ అని ప్రచారం చేసుకోవడం నిజంగా సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. -
వేల కోట్ల భూములను దోచిపెడుతున్నారు : అమర్నాథ్
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములు విశాఖలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన 57 ఎకరాల అత్యంత విలువైన భూములను ఉర్సా కంపెనీకి ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. ఎన్నికల ముందు భూములు కాపాడతామని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన విశాఖ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రూ. 5వేల కోట్ల విలువైన భూమి అక్కడి గీతం సంస్థ ఆధీనంలో ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అత్యంత విలువైన భూములు కట్టబెట్టడం ఏంటని దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం న్యాయం కాదని అందుకే దీని కోసం వైస్సార్సీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టిన వెనక్కితగ్గేది లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!ఏపీ బ్రాండ్ ఇమేజ్ను రెడ్బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్ లేదు. సోషల్ మీడియాలో లైక్, కామెంట్ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: రామచందర్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.బీజేపీ కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరిగాయి. కర్పూరి ఠాకూర్ జీవితం కార్యకర్తలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయి. రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ ఉండాలి. అరెస్టులు చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఛార్జ్షీట్లు, తెలంగాణలో ఎందుకు కాదు?. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ ఆరోపణలకు విలువ లేదు. అధికారులపై మాత్రమే చర్యలు ఉన్నాయి. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు?. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
అది మా దౌర్భాగ్యం.. అనితపై టీడీపీ నేత ఫైర్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా టీడీపీలో నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటామని పీలా గోవింద్ హెచ్చరించారు.వివరాల మేరకు.. అనకాపల్లిలో టీడీపీ నాయకులకు విలువ ఇవ్వలేదంటూ హోం మంత్రిపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా టీడీపీ అధ్యక్షులు చూసి కూడా కారు ఆపకుండా ఎలా వెళ్ళిపోతారు?. పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వడం లేదు, అది మా దౌర్భాగ్యం. మమ్మల్ని అని రకాలుగా అవమానం చేస్తుంటే ఎలా?. వీధిలోకి రావాలా?. ఇలా వీధిలోకి రావడం నాకు ఇష్టం లేదు. అనకాపల్లి ఉత్సవాలకు పాసులు కూడా ఇవ్వలేదు. మాకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత వద్ద తేల్చుకుంటాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎంపీ భరత్కు భూములు ఎలా ఇస్తారు?: జగ్గు నాయుడు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ భరత్ భూ దోపిడీపై విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ భరత్ భూదోపిడిని అరికట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది? అని ప్రశ్నించారు.విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎంపీ భరత్ కబ్జా చేశారు. భూమి విలువ సుమారు 5000 కోట్లు ఉంటుంది. ఎంపీ భరత్ భూ దోపిడిని అరికట్టాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టరాదు. ఎన్నికలకు ముందు విశాఖలో భూములను కాపాడుకుంటామని కూటమి పార్టీలు చెప్పాయి. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది. పేదవాడికి 60 గజాలు భూమి ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ఎంపీ భరత్కు ఎలా ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు.కాగా, విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. -
బాబు ఫ్రస్టేషన్ పతాక స్థాయికి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పతాకస్థాయికి చేరుకున్నట్టుంది. వయసు కూడా మరచిపోయి వైఎస్సార్సీపీ నేతలపై అధ్వాన్నపు దూషణలకు దిగుతున్నారు. సందర్భమేదైనా సరే ఒకటే అజెండా. జగన్ను, ఆయన పార్టీని తిట్టడం. ఈ వైఖరితో ప్రజల దృష్టిలో పలుచనవుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకపోవడం, పాలన గాడి తప్పి అస్తవ్యస్తంగా మారడం.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో... వారి దృష్టి మరల్చేందుకు ఈ టెక్నిక్ను వాడుతున్నారేమో మరి! ఏడాదిన్నరగా రెడ్బుక్ పేరుతో సాగిన అరాచకాలు, కొన్ని గ్రామాల్లో దళతల కుటుంబాల బహిష్కరణ, తాజాగా సంక్రాంతి పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ పరువును ఎప్పుడో బజారున పడేశాయి. దీన్ని కవర్ చేయడానికా అన్నట్ట జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని వాడుకునే ప్రయత్నం జరిగింది కానీ.. ఆ సభలోనూ ఎన్టీఆర్ గురించి నాలుగు మంచిముక్కలు మాట్లాడటం కంటే వైఎస్సార్సీపీని దూషించేందుకే ప్రాధాన్యమిచ్చారు. షరా మామూలన్నట్టు ఎల్లోమీడియా ఈ వాగుడుకే తానా తందానా అని మురిసిపోయింది. చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటోంది. ఐదేళ్ల పాలనలో భూముల రీసర్వేతోపాటు జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కొనసాగించలేకపోవడం ఒక కారణమైతే.. 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తన ఖాతాలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం రెండో కారణం. వీటిపై ఎప్పటికప్పుడు సాక్షి, సోషల్ మీడియాల్లో ఆధారసహితంగా కథనాలు వస్తూండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు ఉంది. భూమి, ఇసుక, మద్యం, గనులు, గంజాయి, డ్రగ్ మాఫియాలేవైఎస్సార్సీపీ క్రెడిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పెద్దక్షరాలతో ప్రచురించింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఇప్పటికీ మునుపటి ప్రభుత్వంపై ఏడుపే కొనసాగుతోందన్నమాట. పైగా అన్నీ అబద్ధాలు. జగన్ టైమ్లో జరిగాయని చెబుతున్న ఎన్ని భూ దందాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది? ఎన్నింటిని రుజువు చేశారు? కూటమి పాలనలో అనంతపురంలో జరిగిన భూ కబ్జా ఆరోపణ మాటేమిటి? ఊరు, పేరు లేని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు ఇచ్చేయడాన్ని ఏమనాలి? ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది ఎందుకు? జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక విక్రయించి ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం సమకూరిస్తే మాఫియా అన్నారు మరి.. ప్రస్తుతం ఉచిత ఇసుకపై టీడీపీ నేతలు చేస్తున్న దందాలేమిటి? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారే? వీరిని అదుపు చేయలేక చంద్రబాబువైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. గనుల విషయానికి వద్దాం.. టీడీపీ నేతలు కుప్పంలోనే అక్రమ మైనింగ్కు పాల్పడినట్లు వచ్చిన వార్తల మాటేమిటి? నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు గనులు కబ్జా చేసి కప్పం చెల్లించమని డిమాండ్ చేసిన మాటేమిటి? మద్యం మాఫియా అంట! తన హయాంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వ పరం చేశారు జగన్. విక్రయాలకు నిర్ణీత వేళలు నిర్ణయించారు. బెల్ట్ షాపులు లేకుండా చేశారు. మరి.. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోంది? ప్రైవేటు వారికి, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుయాయిలకు షాపులు కేటాయించి, వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టించి, ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటోంది. ఇది కదా మాఫియా అంటే? అవి చాలవన్నట్లు టీడీపీ నేతలే నడుపుతున్న నకిలీ మద్యం ప్లాంట్ ఇటీవలే పట్టు బడింది కదా! సర్వే రాళ్ళపై నవరత్నాల బొమ్మతోపాటు జగన్ చిత్రపటం వాడడం వల్ల రూ.700 కోట్లు వృథా అయ్యాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సర్వే రాళ్లు ఎందుకు వృథా అవుతాయి.ప్రభుత్వానికి చాతకాకపోతే తప్ప. మరో వైపు ప్రభుత్వ ఆఫీసులు, ఇతరత్రా, చివరికి రోడ్డు డివైడర్లపై టీడీపీ పచ్చ రంగు, జనసేన రంగులు వేయడాన్ని ఎలా సమర్థిఃచుకుంటారు. రీసర్వే మీద జగన్పై తప్పుడు ఆరోపణలు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా! మళ్లీ దానిని ఎలా కొనసాగిస్తున్నారు. క్రెడిట్ చోరీ అంటే మాత్రం కోపం వస్తుంది. గంజాయి,డ్రగ్స్ గురించి జగన్ టైమ్లో ఉన్నవి, లేనివి కల్పించి ఎన్ని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవి ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది కనబడుతూనే ఉంది కదా! విశాఖ,గుంటూరు,తదితర చోట్ల పోలీసులకు గంజాయి పట్టుబడిన మాటేమిటి?జగన్ సొంతగా పెట్టుకుని కష్టపడి ఈ స్థాయిలో ఉన్నవైఎస్సార్సీపీని ఫేక్ అని చంద్రబాబు అంటున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఆయనకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు.తన అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశారని, మానవత్వం లేదని, తనకు ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వయంగా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ ప్రముఖంగానే కనిపిస్తుంది కదా! నేర రాజకీయాలు చేస్తున్నారంటూ మరో తప్పుడు ఆరోపణ. పల్నాడులోవైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ను ను టీడీపీ గూండాలు హత్య చేస్తే, అలాంటి వాటిని నిరోధించడంలో విఫలం అవడమే కాకుండా,వైఎస్సార్సీపీ వారు రెచ్చగొడుతున్నారని అనడం సీఎం స్థాయికి తగునా!ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షన్ హత్య జరిగితే పాడె మోసి రాజకీయ రంగు పులిమిన చంద్రబాబు ప్రస్తుతంవైఎస్సార్సీపీ వారిపై ఆరోపణ చేస్తున్నారు. టీడీపీ వారు వందల కుటుంబాలను గ్రామాలలోకి రానివ్వకుండా బహిష్కరణ చేస్తున్న ఘటనలను అదుపు చేయకుండా అలాంటివాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా సిగ్గు చేటైన విషయం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వాఖ్యాత -
కర్ణాటకలో కలకలం.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..
బెంగళూరు: కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్లారి శివార్లలో రూ.3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్కు నిప్పుపెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే, ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్థన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, జనవరి ఒకటో తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘కూటమిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’
సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్లకు వైఎస్సార్సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్సీపీ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది. కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు. -
రాహుల్కు ఝలక్.. మోదీకి శశిథరూర్ సపోర్ట్?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశాన్ని డుమ్మా కొట్టి.. కేరళలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉండటం మరోసారి అనుమానాలను పెంచింది.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి సీనియర్ నేత శశిథరూర్ హాజరుకాలేదు. ఆయన నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆయన కార్యాలయం స్పందిస్తూ.. కొలికోడ్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్ట్లో పాల్గొనేందుకే థరూర్ రాష్ట్రంలో ఉన్నారని తెలిపింది.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న థరూర్.. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన్ను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొచ్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనతో సరిగా వ్యవహరించకపోవడంపై థరూర్ తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్లు తెలిసింది. -
జనసేన సమావేశంలో రసాభాస
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాభాస జరిగింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఎదుట తూర్పు నియోజకవర్గ జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది.వివరాల మేరకు.. జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సౌజన్య వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని సౌజన్యపై ఆరోపణలు చేశారు. దీంతో, తనపై ఆరోపణలు కాదు బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను వారికి సర్ది చెప్పారు. -
ఇదో కాలక్షేప కథాచిత్రం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ సిట్ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకు వీరుల ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అంటూ వ్యాఖ్యానించారు.సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్ ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సిట్ అధికారులను అడిగితే సమాధానం లేదు, మా వ్యక్తిత్వ హననానికి గురిచేసిన వాళ్ల చర్యలు ఏవి అని అడిగాను. వేధింపుల తప్ప.. సిట్ అడిగినదాంట్లో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు.‘‘నాకు మద్దతు పలికిన పార్టీ నాయకత్వానికి- సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలీసుల సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను సిట్ను ప్రశ్నించాను. మాపై తప్పుడు ప్రచారం, లీకులు ఇస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాను. ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించినట్లు కథనాలు నిజామా? అని అడిగాను. హీరోయిన్పై కథనాలు వాస్తవం కాదని పోలీసులు ఖండించారు...మా నాయకుల ఫోన్ ట్యాప్ కావడం లేదా అని నేను అడిగా. మంత్రి ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు.. నిజమేనా అని అడిగాను. సిట్ అధికారులు ఫోన్ కాల్స్ మాట్లాడటమే సరిపోయింది. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకైనా.. ఎన్ని సార్లు అయినా వస్తాం. సింగరేణి టెండర్లలో సీఎం - మంత్రుల మధ్య వాటాల పంచాయతీపై హరీష్రావు బయటపెట్టారు...సీఎం అనుచరుడు 3 వందల కోట్ల టెండర్ గురించి గన్ పెడితే, మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్ ఎందుకు లేదు?. ఖాకి బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదు? సిట్ అడిగిందే అడగడం - తిప్పి తిప్పి అడగడం తప్ప ఏమి లేదు. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. మాకు కుటుంబాలు ఉన్నాయి మీడియా వాస్తవాలను రాయాలి. నన్ను ఒక్కరినే విచారణ చేశారు. తారక రామారావు, సిట్ అధికారులు తప్ప ఎవరూ లేరు. మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ చెప్పింది... నేను సహకరిస్తానని చెప్పాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
సింగరేణిలో సోలార్ పవర్ స్కాం జరిగింది: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్రావు. కాంగ్రెస్ ప్రభుత్వం లీక్లతో కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీక్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ బావమరిది కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెడితే సిట్ నోటీసులు ఇచ్చారు. సృజన్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఈ డైవర్షన్ డ్రామా. నీ చిట్టాలు బయటపెడుతూనే ఉంటాం. ఇవాళ సింగరేణి స్కాం పార్ట్-2 బయటపెడుతున్నాను. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బొగ్గు స్కాంతో తెలంగాణ ప్రతిష్టకు మచ్య పడింది. సింగరేణిలో సోలార్ పవర్ స్కాం జరిగింది. 127 మెగావాట్ల సోలార్ పవర్ స్కాం జరిగింది. దీనికి కూడా సైట్ విజట్ కండీషన్ పెట్టారు. 107 మెగావాట్లను రూ.540 కోట్లకు అప్పగించారు. రూ.214 కోట్లను అదనంగా కేటాయించారు.మూడు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాల్సి ఉండగా.. మూడు కలిపి సింగిల్ టెండర్ పిలిచారు. ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టారు. గోల్టి సోలార్ పవర్ ప్లాంట్కు టెండర్ ఇచ్చారు. ఈ స్కాం రామగుండంలో జరిగింది. బొగ్గు స్కాం కుంభకోణంతో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బీజం పడింది. సీఎం బావమరిది స్కాం ఆధారాలు బయటపెడితే నోటీసులు ఇస్తారా?. కడుపు మంటతోనే కేటీఆర్, నాకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు మేము భయపడేవాళం కాదు.దేశ వ్యాప్తంగా సోలార్ పవర్ టెండర్లు జరుగుతున్నాయి. దేశం అంతటా మూడు కోట్లకే ఒక మెగావాట్ ఇస్తుంటే.. తెలంగాణలో 5కోట్ల 4లక్షలకు ఒక మెగా వాట్ ఇస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ వాళ్లకు కాకుండా గుజరాత్ సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో మెగావాట్కు 7కోట్లకు కట్టబెట్టారు. ఇది కేవలం ఇష్టాలేషన్లో జరిగిన స్కాం. రేపు కొత్తగూడెం సింగరేణిలో కిషన్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్న అన్ని స్కాంలపై విచారణ చేయాలని కోరుతున్నాను.మూడో స్కామ్ ఉంది ఎక్స్క్లూజివ్ స్కాం జరిగింది. ఈ స్కాంలో జీవన్ రెడ్డి మరో అధికారి రిజైన్ చేసి వెళ్లారు. ప్రకాశం ఖని స్కాం జరిగింది.. వెయ్యి కోట్ల టెండర్లో జరిగింది. సైట్ విజిట్ పేరుతో ప్రకాశం ఖని టెండర్ పిలిచారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పు అయితే దీని క్యాన్సిల్ చెయ్యాలి. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లతో స్కాం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సైట్ విజిట్తో పిలిచిన టెండర్లు అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మీ బావమరిదిపై సిట్ వేయాలి. సింగరేణితో పాటు అన్ని కలిసి సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బెదిరింపులకు నేను భయపడను అంటూ హెచ్చరించారు. -
డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైందని.. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. -
కేరళపై బీజేపీ మాస్టర్ ప్లాన్.. మోదీ గ్యారంటీ అంటూ..
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV— ANI (@ANI) January 23, 2026ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. -
కాంగ్రెస్పై ఫైర్.. జీవన్రెడ్డికి ఎంపీ అరవింద్ సపోర్ట్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు.జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయి. సంబంధిత వారిని అరెస్టు చేస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా? అన్నది కాంగ్రెస్ పార్టీనే తేల్చుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో జగిత్యాల రాజకీయాలపై స్పందిస్తూ..‘జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానం. జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని నా అభిప్రాయం. ఈ వయసులో ఆయనను హింసించడం మహాపాపం. మానసిక క్షోభకు గురి చేయడం కాంగ్రెస్కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. -
జగన్ ఇచ్చిన పాస్బుక్కులే అవి.. మీరు చేసిందేమిటీ?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి రెండేళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ల మీద అనగాని పచ్చి అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చారా?. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లు తీసుకుని కొత్త పాస్ బుక్లు ఇస్తున్నారు. పాస్ బుక్ల మీద వైఎస్ జగన్ ఫొటో తీయడం తప్ప మీరు చేసిందేమిటీ?. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా?. 1802లో మొట్టమొదటి సారి ఇండియాలో సర్వే చేశారు. 1926-32 వరకు తరువాత బ్రిటీషర్లు సర్వే చేశారు. ఈ సర్వేనే ఇప్పటి వరకు ఇండియాలో కొనసాగుతోంది. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారు. మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారు. రూ.25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రైతులు ఇబ్బందుల గురించి ఆలోచన చేశారా?. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు. మంత్రి అనగాని తన డిపార్ట్మెంట్ మీద దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేలో కొంచెం కూడా తేడా రాదు. జగన్ ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేశారు. ఈ ఆరువేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన పరికరాలనే బాబు వాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ కలిపి ఏపీలో భూ సమగ్ర సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన డ్రోన్ ప్లే డేటా, ఓఆర్ఐ కాపీలను బాబు ప్రభుత్వం వాడుతుంది. శాలిలైట్తో లింక్ చేసి వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు. వైఎస్ జగన్ తెచ్చి సిస్టం ప్రపంచంలోనే అద్భుత భూ సర్వే అని చెప్పుకొచ్చారు. -
ట్యాపింగ్ నేరమేం కాదు.. ఆ మాట రేవంతే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ట్యాపింగ్ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్ డైవర్షన్చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్, హరీష్ పోరాడుతున్నారు. ఈ-కార్ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. అదొక చెల్లని సిట్ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్రావు, కేటీఆర్లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్తో మరొక సిట్ వేశారు. ఈ సిట్కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్కు చీఫ్గా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్పై విచారణ జరగాలి. నిజంగా సిట్ వేయాలనుకుంటే.. చెక్ డ్యామ్లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్ స్కామ్పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్ వేశారు. దేశ రక్షణపై రేవంత్రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్. -
మారని శశిథరూర్ తీరు..!
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా?, కాంగ్రెస్తో అంటీ ముట్టనట్లు, బీజేపీతో అత్యంత దగ్గరగా ఉండే శశిథరూర్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదొక వంకతో కాంగ్రెస్ను దూరం పెడుతూనే ఉన్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సమావేశం కావడానికి సమయం ఫిక్స్ చేశారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) మధ్యాహ్నం గం. 2.30 ని.లకు సమావేశం కానున్నారు. అయితే దీనికి కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ దూరంగా ఉండనున్నారట.తనను ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ నుంచి అవమానం ఎదురైందనే భావనలో ఉన్నారు శశిథరూర్. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని శశిథరూర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అందుచేతనే ఆయన.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏఐసీసీ నేతల సమావేశానికి హాజరు కావడం లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ కారణంగా శశిథరూర్.. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగే ఈ సమావేశానికి శశిథరూర్ దూరంగా ఉండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీడబ్యూసీ సమావేశానికి వెళ్లిన శశిథరూర్.. రాహుల్ గాంధీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు కేరళ కాంగ్రెస్లో అలజడికి కారణమైంది. ఎన్నికలు వచ్చిపడుతున్న వేళ.. శశిథరూర్ తీరు కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. -
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
బాబుగోరూ.. ఓసారి మీ మొహం అద్దంలో చూస్కోండి..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాజకీయమంతా... అబద్దాలు, డాబుసరి కబుర్లు, వక్రీకరణలు, బురద జల్లుడులపైనే ఆధారపడి ఉంటోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి బట్టబయలైంది. గోదావరి జిల్లా రాయవరం వద్ద పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా చంద్రబాబు అబద్ధాలు బహిరంగమయ్యాయి. ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు అందరికీ అందాయా?’’ అనే చంద్రబాబు ప్రశ్నకు అసలు సమాధానమే లేకపోయింది. అందిన వారు చేతులెత్తాలంటే ఎవరూ స్పందించలేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు ఒకరిద్దరిని నేరుగా అడిగారు. ‘‘అందలేదు’’ అని వారు ఠకీమని సమాధానం చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియకుండా పోయింది చంద్రబాబుకు. ఆ అసంతృప్తిని కాస్తా అక్కడి అధికారులపై విసుక్కుని తీర్చుకున్నారు. ‘‘సరిగా ఆర్గనైజ్ చేయడం రాదా’’ అంటూ జాయింట్ కలెక్టర్పై కూడా విసుగు చూపించారు. ఆర్గనైజ్ చేయడం అంటే రైతులను మభ్యపెట్టడం అన్న అర్థం వస్తుంది. చంద్రబాబు అప్పటికే ఒకట్రెండు కుటుంబాలతో కలిసి పొలాల్లోకి వెళ్లి పాస్ పుస్తకాలు అందినట్లు హడావుడి చేశారు. ఆయా కుటుంబాల వాళ్లు కూడా తాము సంతోషపడుతున్నట్టుగానే చెప్పారు. కానీ సభలో మాత్రం దీనికి భిన్నమైన స్పందన రావడంతో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ఏం జరగలేదని అందరికీ తెలిసిపోయింది. ఆ సభలో ఒకవైపు చంద్రబాబు మాట్లాడుతూండగానే ప్రజలు ఒక్కరొక్కరుగా వెళ్లిపోవడమూ కనిపించింది. నిజానికి ఈ సర్వే కొత్తగా చేపట్టిందేమీ కాదు. జగన్ సీఎంగా ఉండగా భూముల రీసర్వే చేపడితే చంద్రబాబు, ఎల్లోమీడియా విపరీతమైన దుష్ప్రచారం చేసింది. జగన్ భూములు లాగేసుకుంటారని రైతులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వచ్చాక టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెబుతున్నారు. దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? కేంద్రం ఆదేశాల ప్రకారమే జగన్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూముల రీసర్వే నిర్వహించారు. అంతేకాక భూముల సర్వే పూర్తి అయ్యాక, అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు తెలపాలని, ఆ తర్వాత ప్రభుత్వం రైతులకు భూమి గ్యారంటీ పత్రాన్ని ఇస్తుందని చట్టంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ దానిని బలపరిచారు కూడా. కాని ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇదే రీసర్వేపై చిలవలు, పలవలు చేసి, ఏదో అయిపోతుందంటూ వదంతులు సృష్టించారు. జగన్ ఫోటో ఉంటే భూములు అన్ని పోయినట్లు అబద్దాన్ని నూరిపోసి రైతులలో భయం నింపే యత్నం చేశారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ అంశంపై చేసిన నీచమైన ప్రచారానికి అంతేలేదు.. ఎలాగైతే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేని ఆపారా అంటే లేదు. జగన్ ప్రభుత్వం టైమ్లో నిర్వహించిన సర్వేనే కొనసాగించి, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు. జగన్ సర్వేని సమర్థంగా అమలు చేసినందుకు కేంద్రం ఇచ్చిన ఇన్సెంటివ్ సుమారు రూ.400 కోట్లను కూటమి ప్రభుత్వం పొందింది. ఇంత లబ్ది పొందినా, కూటమి ప్రభుత్వం రాకపోతే మీ భూములు గోవిందా అయ్యేవి అని చంద్రబాబు స్పీచ్ ఇచ్చారు. ఇది అసత్యమని ఆయనకు తెలుసు. అయినా తను ఆడిన అబద్దాన్ని నమ్మే స్థితిలోనే జనం ఉండాలన్నది ఆయన సిద్ధాంతం అన్నమాట. కాని వాస్తవం ఎప్పటికైనా జనానికి తెలియకుండా పోతుందా! సర్వే రాళ్లపై ఉన్న పటం కారణంగా రూ.700 కోట్లు వృథా అయ్యాయని అర్థం లేకుండా మాట్లాడారు. అంటే ఆ రాళ్లను వృథా చేయబోతున్నామని చెబుతున్నారు. అదే జరిగితే బాధ్యత చంద్రబాబు సర్కార్దే అవుతుంది కదా! మాజీ ముఖ్యమంత్రి జగన్ భూముల రీసర్వేపై ప్రతిపక్షంగా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఆడిన నాటకాన్ని... అధికారం దక్కిన తరువాత చేస్తున్న మోసాలను, క్రెడిట్ చోరీని మీడియాకు పూస గుచ్చినట్లు వివరించారు. ఈ విమర్శలు వేటికీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జవాబు ఇవ్వలేకపోయారు. కాకపోతే యథాప్రకారం జగన్ను దూషించడానికి మాత్రమే పరిమితమయ్యారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ టైమ్లోనే 6800 గ్రామాలలో సర్వే పూర్తయిన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఒక వైపు అమరావతి పేరుతో రైతుల భూములు వేల ఎకరాలను కైవసం చేసుకుంటున్న చంద్రబాబు గత ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. జగన్ 22ఎ నిబంధన తెచ్చి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. తీరా చూస్తే ఆ నిబంధనను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని వెల్లడవుతోంది.దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని సవాల్ చేస్తూ జగన్ టైమ్లో ఒక్క భూమిని అయినా నిషేధిత జాబితాలో చేర్చారేమో రుజువు చేయాలని అన్నారు. పైగా ఆ జాబితా నుంచి వేల ఎకరాల భూమిని విడిపించి జగన్ రైతులకు న్యాయం చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధునిక సర్వే వ్యవస్థనే అమలు చేస్తూ బ్లాక్, క్లౌడ్ అంటూ రైతులకు అర్థం కాని పదాలు వాడుతూ మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీయడం తప్ప, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. చంద్రబాబు గతంలో ఈ సేవ సర్టిఫికెట్లపై తన ఫోటో ఎలా వేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బురద వేయడమే తప్ప, ఎదుటివారు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. రైతులను చంద్రబాబు పాస్ పుస్తకాల గురించే కాక మరికొన్ని ప్రశ్నలు వేసి ఉండాల్సింది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన రూ.నలభై వేలలో రూ.ఐదు వేలే ఇచ్చారు. ఆ స్కీమ్ అందిందా? లేదా? యూరియా అందుతోందా? రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయా? లేక ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వం పని చేయడం బాగుందా? అన్న ప్రశ్నలు రైతులకు వేసి సమాధానాలు తెలుసుకోవాల్సింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం సరైనదేనా? కాదా? 99 పైసలకే పాతిక ఎకరాలు ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తున్నాం.. మీకు సంతోషమేనా అని అడిగితే తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నది తెలిసేది కదా!. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాగుందా?అని ప్రశ్నించగలిగితే ఇంకా బాగుండేది. పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో అయినా తన ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉంది చంద్రబాబుకు తెలియడం కొంతలో కొంత బెటర్.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాంగ్రెస్లో దండుపాళ్యం ముఠా.. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అంతులేని కథలా సాగుతోందని.. నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ కేసులో సిట్ విచారణ బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారాయన. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎన్నికేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అని కేటీఆర్ అన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా.. అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఉంది. ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులు? రేవంతా? అధికారులా?. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదేళ్లపాటు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేశా. ప్రభుత్వం పోలీసులు కలిసి గత రేండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఎంక్వైరీలకు భయపడేది లేదు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. అయినా పిలిస్తే 10సార్లు విచారణకు వెళ్తా.. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్రావు చెప్పారు. ఆ కుంభకోణంలో సీఎం రేవంత్రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు. అలా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రొగ్రాం అని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వాళ్ల దోపిడీ బయటపెడతామనే నోటీసులు, విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని కేటీఆర్ అన్నారు. -
కేటీఆర్ విచారణపై సిట్ ప్రకటన
కేటీఆర్ సిట్ విచారణ.. లైవ్ అప్డేట్స్కేటీఆర్ విచారణపై సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా సజ్జనార్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెం. 243/2024 కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు అనుగుణంగా మాజీ మంత్రి కేటీఆర్కు 23 జనవరి 2026న ఒక నోటీసు జారీ చేయబడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:00 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించబడింది.నోటీసుకు అనుగుణంగా కేటీఆర్.. సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయనను వివరంగా విచారించడం జరిగింది. కేసులోని సంబంధిత అంశాలను రాబట్టడం జరిగింది. వాటిని రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నారు. ఆయన ఏ సాక్షులను సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆదేశించబడింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం.రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, ప్రముఖులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది పౌరులపై విస్తృతంగా అనధికారిక, చట్టవిరుద్ధమైన ఫోన్ నిఘా, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన క్రైమ్ నెం. 243/2024 కేసు విషయంలో మాత్రమే కేటీఆర్ను ఈరోజు విచారించడం జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని పేర్కొంటూ, కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు తప్పుదోవ పట్టించే నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు గమనించబడింది. దర్యాప్తు సంస్థ ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం కలిగి లేదు. దర్యాప్తు చట్టానికి అనుగుణంగా, నిష్పక్షపాతంగా వృత్తిపరంగా నిర్వహించబడుతోంది.In continuation of the further investigation in Crime No. 243 of 2024 of Panjagutta Police Station, and pursuant to the constitution of a Special Investigation Team (SIT), a notice was issued to Sri K. T. Rama Rao, former Minister and MLA, Sircilla, on 23 January 2026, directing… pic.twitter.com/R5QPjfxrDZ— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 23, 2026 కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్మీట్తెలంగాణ భవన్కు బయల్దేరిన కేటీఆర్ముగిసిన విచారణకాసేపట్లో బయటకు రానున్న కేటీఆర్. కేటీఆర్ను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించిన సిట్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు కేటీఆర్ విచారణసీరియల్లా సిట్ విచారణ : బండి సంజయ్సిట్ విచారణ సీరియల్లా ఉందిప్రభుత్వ పెద్దల డైరైక్షన్లోనే సిట్ విచారణసిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదుకేటీఆర్ను ఎందుకు విచారణకు పిలిచారు కొనసాగుతున్న సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ జూబ్లీహిల్స్ పీఎస్లో కేటీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు కేటీఆర్తో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావులను కలిపి ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదుదేశ భద్రత కోసం అత్యంత గొప్యంగా జరపాల్సిన ట్యాపింగ్ విషయాన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారుకు ఇడ్చారుహరీష్ రావు, కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ సంపద కాపాడందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది తెలంగాణ సంపద నైనీ కోల్ బ్లాక్ను దోచుకునే ప్రయత్నం చేస్తే కేటీఆర్,హరీష్ రావు అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్, పార్మలా ఈ రేసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై టైమ్ పాస్ చేస్తోంది సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్ను సిట్ పేరుతో వేదించడం ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదుస్వాతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేస్తారు.దేశ అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తోంది.ఆనాడు దివంగత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు.టెలిఫోన్ ట్యాపింగ్ తప్పుకాదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ కేవలం పోలీసులు మాత్రమే చేస్తారు.ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు.దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా సీఎం రేవంత్ వ్యవహార శైలి ఉంది.మంత్రులు, సీఎం ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు!ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదుప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్యాపింగ్ను వాడుతున్నారురేవంత్ రెడ్డికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు.సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు.పంజాగుట్ట కేసులో వేసిన ఎస్ఐటీ చట్ట వ్యతిరేకంఆ సిట్ సభ్యులు 350 మందిని విచారించారు.ఆ విచారణలో ఏ ఒక్కరూ కేటీఆర్, హరీష్ రావు పేరు చెప్పలేదు ఆ సిట్తో నాయకుల పేర్లు రాలేదు కాబట్టి... సజ్జనార్తో మరో సిట్ వేశారు.సజ్జనార్తో వేసిన సిట్ రెండోది.. నాయకులను వేధించే సిట్.. ఈ సిట్కు భాద్యత వహించే అర్హత సజ్జనార్కు లేదు.ఆనాడు ఇంటలిజెన్స్లో సజ్జనార్,శివధర్ రెడ్డి ఉన్నారు.ఆనాడు రేవంత్ రెడ్డి 50లక్షలు ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డిని ఎలా పట్టుకున్నారు అనేది సజ్జనార్, శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలి.సిట్ నన్ను విచారణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేశాను కేటీఆర్ సిట్ విచారణసజ్జనార్ సిట్ ముందుకు కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ సిట్ ఏర్పాటుసజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిట్ సభ్యులుఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన ఏపీసీ పీ.వెంకటగిరి,ఎస్పీ ఎం.రవీందర్ రెడ్డి కేటీఆర్ను విచారించనున్న సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సభ్యులు సిట్ కార్యాలయం లోపలికి వెళ్లిన కేటీఆర్కేటీఆర్ ఒక్కడినే లోపలికి అనుమతించిన పోలీసులుహరీష్రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బయటేజూబ్లీహిల్స్ పీఎస్ బయట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీస్ బందోబస్తుసిట్ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణసిట్ ఆఫీస్కు చేరుకున్న కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ వెంట హరీష్రావులోపలికి కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులుతెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతసిట్ కార్యాలయానికి బయల్దేరిన కేటీఆర్ఆ సమయంలో కార్యకర్తల అత్యుత్సాహంఅడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులుతెలంగాణ భవన్ గేట్ వద్ద తోసుకున్న పోలీసులు, కార్యకర్తలుకాసేపు ఉద్రిక్తతగాయపడ్డ మహిళా కార్యకర్తలుసిట్ విచారణకు బయల్దేరిన కేటీఆర్జూబ్లీహిల్స్ పీఎస్కు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కేటీఆర్ వెంట కీలక నేతలు పార్టీ శ్రేణులులోపలికి కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులుసిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం.. భారీ బందోబస్తు ఏర్పాటుతెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్రెండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ప్రభుత్వం, పోలీసుల కుట్రనోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్ గేమ్బీఆర్ఎస్ ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మాదిరాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. పదేళ్లు రాష్ట్రం కోసమే పని చేశాంఅక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నాపై దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారుఈ వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు? సీఎం రేవంతా? అధికారులా?ఎమ్మెల్యేగా, మంత్రిగా చిత్తశుద్ధితో పని చేశా. ఎంక్వైరీలకు భయపడేది లేదు. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్రావు అన్నందుకే నోటీసులు ఇచ్చారు సింగరేణి స్కామ్లో సీఎం రేవంత్రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రోగ్రాం మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వారి దోపిడీ బయటపెడతామనే మాకు నోటీసులు ఇస్తున్నారు. రేవంత్కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలను కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాఈ కేసుతో నాకు సంబంధం లేదుప్రజల దృష్టి మళ్లించేందుకే కుతంత్రాలుసీఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారుఅయినా పిలిస్తే పదిసార్లైనా విచారణకు వెళ్తాఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుమరికాసేపట్లో సిట్ విచారణతెలంగాణ భవన్లో కీలక నేతలతో కేటీఆర్ సమాలోచనలుతన న్యాయవాదులతో మాట్లాడుతున్న కేటీఆర్కేటీఆర్ వెంట సిట్ కార్యాలయానికి వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులుపోలీసులు అడ్డుకునే చాన్స్తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావుతెలంగాణ భవన్ వద్ద కేటీఆర్కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్తెలంగాణ భవన్కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుకోకాపేట టెంపుల్ ట్రీ నివాసం నుండి తెలంగాణ భవన్కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావుతొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ రానున్న కేటీఆర్కేటీఆర్తో పాటే హరీష్ రావుతెలంగాణ భవన్ చేరుకున్న కార్యకర్తలు, అభిమానులుపార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేటీఆర్10 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్10:30 కు బయలుదేరి జూబ్లీహిల్స్ పీఎస్కి వెళ్ళనున్న కేటీఆర్రాత్రి బీఆర్ఎస్ లీగల్ టీంతో సమావేశమైన కేటీఆర్,హరీష్ రావుఇప్పటివరకు ఈ కేసులో విచారించిన వ్యక్తులను ఏం ప్రశ్నించారు?కేటీఆర్ను ఏం ప్రశ్నించబోతున్నారు అనే విషయాలను బ్రీఫ్ చేసిన లీగల్ టీంబీఆర్ఎస్ నేతలు,ఓయూ విద్యార్థుల అరెస్ట్కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు సిట్ విచారణకు కేటీఆర్.. ఓయూ విద్యార్థుల అరెస్ట్అర్దరాత్రి హాస్టల్కు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులుబీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపుజూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోన్ ట్యాపింగ్ కేసులో నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకేటీఆర్ను విచారించనున్న జాయింట్ సీపీ విజయ్ కుమార్,ఏసీపీ వెంకట గిరికేటీఆర్ విచారణ కోసం ప్రత్యేక ప్రశ్నలు సిద్దం చేసిన సిట్జూబ్లీహిల్స్ పీఎస్,తెలంగాణ భవన్ వద్ద భారీ భద్రతజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుపోలీస్ స్టేషన్కి రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు రంగంలోకి లోకల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు మరికాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్మరికాసేపట్లో కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్కేటీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా!కేటీఆర్కు వీరతిలకం దిద్దిన మహిళా నేతలుతెలంగాణ భవన్లో కీలక నేతలతో భేటీఅనంతరం మీడియాతో మాట్లాడే అవకాశంఅక్కడి నుంచే సిట్ విచారణకు కేటీఆర్.. కేటీఆర్ను విచారించనున్న వెంకటగిరిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సీపీ సజ్జనార్ నేతృత్వంలోని బృందంకేటీఆర్ను విచారించనున్న వెంకటగిరి అండ్ టీంఇంతకు హరీష్రావును విచారించిన ఇదే బృందంవిచారణకు రావాలంటూ నోటీసులుకేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులుసీఆర్పీసీ 160 సెక్షన్ కింద విచారణకు రావాలని పిలుపునందినగర్ నివాసంలోని వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేతఇవాళ ఉదయం 11గం. జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు -
నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్ చోరీ
సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నకు సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా. రీ సర్వే ప్రక్రియ చేపట్టడానికి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో 2020 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నాం. యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీ సర్వేలో వినియోగించాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా సీవోఆర్ఎస్లు (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్) పెట్టాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి 3,640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అందుబాటులోకి తెచ్చాం. కచ్చితత్వం కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడిన ప్రభుత్వం మాది.సమగ్ర రీ సర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హైఎండ్ డ్రోన్స్ను తొలిసారిగా వినియోగించాం. దీని మీద అవగాహన కోసం సచివాలయాల్లోని 40 వేల మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇదెప్పుడూ గతంలో జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. అందుకే దీన్ని మహా యజ్ఞం అంటున్నాం.చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఆయనకు అవగాహన తక్కువ. సర్వే మీద కూడా అవగాహన తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇలాంటి సర్వే చేయాలని తపన, తాపత్రయ పడలేదు. సర్వే రాళ్లు లేకుండా సర్వే ఎలా పూర్తవుతుంది? కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించారని బుద్ధి, అవగాహన, జ్ఞానం లేకుండా మాట్లాడారు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అలా చేస్తే కథ మళ్లీ మొదటికి రాదా? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు ృ భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు. మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులు, భూ యజమానులకు అందకూడదని, జగన్కు మంచి పేరు వస్తుందని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్ వ్యవహరించారు. యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాన రాక్షసుడు.. ఆయన లెఫ్ట్, రైట్లో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్ల రాక్షసుల పాత్ర పోషించారు. మీ భూమి మీది కాదు.. కాళ్ల కింది నేల కదిలిపోతోంది! అంటూ అబద్ధాలు, వక్రీకరణలు చేశారు. 2024 మే 13న పోలింగ్ అయితే మే 10వ తేదీన ఈనాడులో ‘మీ భూమి మీకు కాకుండా పోతుంది’ అంటూ ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి లక్షలాదిగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విషపూరిత, తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ, అబద్ధాలు ఎంతో కాలం దాగవు. నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భూముల సర్వే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులు, రైతులకు జరిగే మేలు భూములు ఉన్నంత వరకూ నిలిచిపోతాయి. రీ సర్వేలో ఏపీ ప్లాటినమ్ గ్రేడింగ్ సాధించిందని డిసెంబర్ 2023లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్ చోరీకి పాట్లు పడుతున్నారు. మాకు నాలుగేళ్లు సమయం పడితే.. చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్ గ్రేడింగ్ ఇచ్చారట! మరి ఎన్నికల ముందు వరకు ఆయన చేసిన ఆరోపణలు ఏమైపోవాలి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహోన్నత సంకల్పంతో మేం సమగ్ర భూ రీసర్వే మహా యజ్ఞాన్ని చేపడితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాక్షసుడిలా విషం చిమ్మి.. ఇప్పుడు ఆ రీసర్వే నీ ఘనతే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడతావా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూ మండలంలో అత్యంత దారుణంగా క్రెడిట్ చోరీకి పాల్పడే వారు నిన్ను మించి ఎవరైనా ఉంటారా.. నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూ రీ సర్వేపై చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వెనుక దాగిన నిజాలను సాక్ష్యాధారాలతో వివరించారు. ‘‘జగనన్న భూ హక్కు – భూరక్ష’’ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడింగ్ ఇవ్వడాన్ని.. ఈ సర్వే దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ స్పష్టం చేయడాన్ని, వివిధ రాష్ట్రాలు భూ సర్వేను ప్రశంసిస్తూ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఉద్ఘాటించడాన్ని, నీతి ఆయోగ్ అత్యంత పారదర్శకంగా కచ్చితత్వంతో భూ రీ సర్వే చేశారంటూ కితాబు ఇచ్చిన అంశాలను సాక్ష్యాధారాలతో గుర్తు చేశారు. అప్పట్లో ఈ మహాయజ్ఞంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చిమ్మిన విషాన్ని.. నాడు చేసిన భూసర్వేను ప్రశంసిస్తూ కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే అది తన ఘనతేనని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏనాడైనా రీసర్వే ఆలోచనైనా చేశావా? ఈ మధ్య కాలంలో భూముల రీ సర్వేపై చంద్రబాబు మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీ సర్వే క్రెడిట్ అంతా తనదేనంటూ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ భూ మండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉంటారా.. అనిపిస్తోంది. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి బహుశా సిగ్గు పడుతుందేమో! అంతటి దారుణమైన మోసాలు.. అబద్ధాలు. నాలుగుసార్లు సీఎం అని చెప్పే చంద్రబాబుకు భూములు రీ సర్వే చేయాలనే కనీస ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ఏనాడైనా తపన పడ్డావా? ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తూ మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి మా ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించి, డ్రోన్ సర్వే కూడా పూర్తి చేశాం. ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్ (ఓఆర్ఐ) అన్ని జిల్లాలకు పంపేశాం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి చేసేశాం. రైతుల భూ సరిహద్దులను ఖరారు చేశాం. సర్వే రాళ్లను పాతడం పూర్తయింది. ఈ గ్రామాల్లో రికార్డులన్నింటినీ అప్డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యుటేషన్లు పూర్తి చేసి, ప్రతి భూ కమతాకు విశిష్ట నంబర్ (యూనిక్ నంబర్) ఇచ్చాం. భూ కమతా మ్యాప్ను కూడా జియో ట్యాగింగ్ చేసి, పాస్బుక్లో పొందుపరిచి, 30 లక్షల మంది రైతుల సమస్యలు మొబైల్ మెజిస్ట్రేట్లతో పరిష్కరించాం. వివాదాలు లేని విధంగా క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఈ క్యూ ఆర్ కోడ్ ప్రజలు స్కాన్ చేస్తే మొత్తం భూమి, యజమాని వివరాలు కనిపిస్తాయి. మీ భూమి పోర్టల్ అప్గ్రెడేషన్ పూర్తి చేశాం. జియో ట్యాగింగ్ చేసిన క్రమంలో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం భూమి వివరాలు వచ్చేస్తాయి. రియల్ టైమ్ అలర్ట్లతో.. మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, భూ రికార్డులపై ఆటోమేటిక్గా మీకు అలర్ట్లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పథకం ఇది. ఇందులో 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం. ఇలా ఏనాడైనా చేశావా బాబూ? చంద్రబాబూ.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చేశారా? రైతు, భూ యజమాని నష్టపోకూడదని, అన్ని రకాలుగా మంచి జరగాలని మీరెప్పుడైనా తాపత్రయ పడ్డారా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దొంగలో ఇప్పుడు చెప్పండి. ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని అనుకునే ఎవరైనా ప్రత్యేక (డిస్టింక్ట్) రాళ్లు పాతి, భూ కమతాల నలుమూలలా జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మంచి చేస్తారా? అబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. మాపై బాబు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఒకసారి పాత, కొత్త పాస్ పుస్తకాలను అందరూ గమనించాలి. పాత వాటిలో భూ వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకంలో ఎక్కడా మ్యాప్లు లేవు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియో ట్యాగింగ్ లేదు. మేం సబ్ డివిజన్, మ్యూటేషన్ చేశాక, విశిష్ట భూ కమతా నంబర్, ఏ మాత్రం తేడాలేని కొలతలతో కూడిన జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. పాస్బుక్ చివరలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి, రైతుల వివరాలు అప్డేట్ చేసి, రియల్ టైమ్ అప్డేట్స్తో అందుబాటులోకి తెచ్చాం. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాన్ని పూర్తిగా వదిలేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఎందుకంత ముఖ్యమంటే.. కళ్ల ఎదుటే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ, రికార్డులు అప్డేట్ అవుతున్నప్పుడు, మోసాలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు కాబట్టి. నీతి ఆయోగ్ కొనియాడింది.. మేం చేపట్టిన రీసర్వే గొప్పగా జరిగింది కాబట్టే నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర వచ్చి ప్రశంసలు కురిపించింది. అసోం బృందం ఏపీలో పర్యటించి, ఏపీ ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ మా ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. (వీడియో ప్లే చేసి చూపించారు). క్రెడిట్ కోసం పడరాని పాట్లు సమగ్ర భూ సర్వేతో భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని నాడు చంద్రబాబు విష ప్రచారం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామిగా ఉండీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మా ప్రభుత్వంలో సర్వే చేశామని కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేయడం, చంద్రబాబు థ్యాంక్యూ అని రీ ట్వీట్ చేయడం ఆశ్యర్యంగా ఉంది. క్యూ ఆర్ కోడ్ తానే తెచ్చానంటూ చంద్రబాబు సొల్లు మాటలు చెబుతున్నారు. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. మేమిచ్చిన పుస్తకాలకే రంగు మార్చి.. మేం ఇచ్చిన 30 లక్షల పాస్ బుక్లు వెనక్కి తీసుకొని, వాటికే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారు. రంగు మార్చి ఇస్తున్న వాటిలో తేడా ఏముందో చూస్తే.. అదే క్యూ ఆర్ కోడ్, అదే ఫార్మాట్. జీయో కో ఆర్డినేట్స్తో భూ కమతా నంబర్, జియో కో ఆర్డినేట్స్ ల్యాండ్ మ్యాప్ ఇలా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్సీపీ హయాంలో అప్గ్రేడ్ చేసిన మీ భూమి పోర్టల్ను కాపీ కొట్టి ముద్రించారు. మేం ఇచ్చిన పుస్తకాలకు రంగు మార్చడం తప్ప ఈ 19 నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. రంగు మార్చి ఇచ్చే పుస్తకాల్లోనూ తప్పుల తడకలే. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నింట్లో తప్పులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి రైతులు మళ్లీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. పేర్లు చెరిపేయడానికి రూ.15 కోట్లు రీ సర్వే చేసి కొన్ని కోట్ల సర్వే రాళ్లను మేము పాతాం. ఆ రాళ్ల మీద ఉండే వైఎస్సార్, జగనన్న భూ హక్కు – భూ రక్ష పేరును రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి, ఇంత పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా? ఈయన కొత్తగా రాళ్లు ఇవ్వకపోగా, మేం పాతిన రాళ్లపై పేర్లను చెరిపేస్తున్నారు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి, అందులో ఉండే ప్రత్యేకతను(డిస్టింక్ట్) దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటి? బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర కూడా ఇంతే. విగ్రహం నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసి, ఆవిష్కరించిందీ నేనే. అదే పనిగా అధికారులను పంపి నా పేరును తీయించారు. ఇటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేడ్కర్ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా? రీ సర్వే ఎవరు చేయించారో తెలియదా? ట్యాంపర్కు వీల్లేని పాస్ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా? చంద్రబాబు వయసేమో 80 ఏళ్లు. మా నాన్నతో సమకాలికుడు. మా నాన్నతో పోటీ దేవుడెరుగు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీకి అవస్థ పడుతున్నారు. కమీషన్ కోసం దేన్నీ వదలడం లేదు⇒ మా హయాంలో రూ.55.79కు పట్టాదారు పాస్బుక్ ఇచ్చాం. కలర్ మార్చి రూ.76కు చంద్రబాబు ఇస్తున్నారు. అంటే రూ.20 కమీషన్. కమీషన్ కోసం దేనినీ వదలడం లేదు. ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు 22–ఏ గురించి మాట్లాడటం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, నిషేధిత జాబితా కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది. తప్పులన్నీ ఆయన చేసి, బురద మాత్రం వేరేవాళ్ల మీద చల్లుతారు. ⇒ మేం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద పూర్తి హక్కులు కల్పించిన ఘనత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. ⇒ చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు మేం హక్కులు కల్పించాం. షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద హక్కులు వచ్చాయి. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు కలిగిస్తూ హక్కులు కల్పించాం. ⇒ చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము పేదలను, రైతులను బయటకు వేశాం. ఇప్పుడేమో ఆ పెద్ద మనిషి 22–ఏ మా హయాంలో పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క సెంటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించాం. చంద్రబాబు క్రెడిట్ చోరీలో భాగంగా, 22ఏ మేము పెట్టామని అంటున్నాడు. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ దేశంలో తొలిసారిభారత్లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గ్రామాల్లో పట్వారీ ఉపయోగించే మ్యాప్స్ను నిజంగా మ్యాప్లు అని కూడా అనలేం. అవి కచ్చితత్వం లేని, తప్పులతో కూడిన మ్యాప్స్. ఈ పరిస్థితిని సరిచేయడానికి 2008లో ఎన్ఎంఎల్ఆర్పీ అనే ఒక పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు. ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్ జగన్ సంస్కరణల దిశగా అడుగులు వేశారు. భూ రికార్డులను సంపూర్ణంగా సరిచేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. మొదటగా 10 వేల మందికిపైగా గ్రామ సర్వేయర్లను నియమిస్తూ అడుగులు వేశారు. రీసర్వే అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఏవీలు, డ్రోన్స్, హెలికాప్టర్లు, విమానాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాప్స్తో పోలిస్తే, ఇకపై రైతులకు లభించే వివరాలు, మ్యాప్లు అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇది దేశంలోనే ఒక మైలు రాయి. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. 17 వేల గ్రామాలకుగాను ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. – 2022 నవంబర్ 23న నరసన్నపేటలో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ (ఈ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు) -
ఎమ్మెల్యే కామినేని ఓవరాక్షన్.. షాకిచ్చిన కొల్లేరువాసులు
సాక్షి, ఏలూరు: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే కామినేనిపై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కామినేని శ్రీనివాస్ను ప్రజలు నిలదీశారు. దీంతో, అసహనానికి గురైన ఎమ్మెల్యే.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల మేరకు.. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరు స్థానికులకే ఇచ్చేస్తామని కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు.. స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాజాగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లడంతో స్థానికులు హామీ విషయమై నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కామినేనితో స్థానికులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఏం చేశారంటూ కామినేనిని కొల్లేరు వాసులు నిలదీశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బంది పడలేదని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు. అనంతరం, చెరువుల విషయంలో కామినేనిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కొల్లేరు వాసులపై అసహనం వ్యక్తం చేశారు. నేను పట్టించుకోను ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.. ఓవరాక్షన్ చేశారు. నోరు మూయండి అంటూ కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా మాట్లాడటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. -
ఉదయనిధికి అన్నామలై కౌంటర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ నాయకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. తన పదవికి ఉదయనిధి రాజీనామా చేయాలన్నారు. తమ పార్టీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను స్టాలిన్ సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు."అమిత్ మాలవీయకు సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి 48 గంటల క్రితం ఇచ్చిన తీర్పులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మత విశ్వాసాలపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జాతి నిర్మూలనకు దారితీసేలా ఉన్నాయన్నారు. తమిళనాడు పోలీసులు కనీసం ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. ఇది నిజంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే, ఆయన నుంచి రాజీనామా లేఖ తీసుకోవాల''ని అన్నామలై అన్నారు.చెన్నైలో మూడేళ్ల క్రితం ఈ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల్లా.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. దీన్ని మారణహోమానికి పిలుపుగా అమిత్ మాలవీయ (Amit Malviya) వర్ణించారు. దీంతో తమిళనాడు పోలీసులు ఆయనపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.కోర్టు తీర్పులను లెక్కచేయడం లేదుకోర్టు తీర్పులను స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని అన్నామలై తాజాగా ఆరోపించారు. తిరుప్పరంకుండ్రం కేసుతో సహా అనేక వివాదాల్లో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. మరో 50 రోజుల పాటు ప్రజలు డీఎంకే ప్రభుత్వ దారుణాలను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ''డీఎంకే, వామపక్ష పార్టీలు ఏ తీర్పును ఆమోదించవు. న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే.. వారు కులం, మతం ఉపయోగించి దుర్భాషలాడేందుకు ప్రయత్నిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పోరాడతాయని పేరుండేది. కానీ డీఎంకేతో చేతులు కలిపిన తర్వాత తోక పార్టీలుగా మారిపోయాయ''ని ధ్వజమెత్తారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేత -
అబద్ధాల కోరు చంద్రబాబు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు.. దావోస్ వెళ్లి అబద్దాలు చెప్పారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలతో తండ్రి, కొడుకులు బతుకుతున్నారంటూ దుయ్యబట్టారు. కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూముల కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో గ్రీన్కో కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడితో ఉద్యోగి మరణించాడు. అదే నిజమైతే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ దేనికోసం?. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఎందుకు రాజీపడుతున్నారు. కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ కావాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
రేవంత్, సిట్.. టీవీ సీరియల్ వంటి డ్రామా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్ అనే విధంగా సిట్ వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదా? అని ప్రశ్నించారు. అడిగిందే అడిగి.. టైం పాస్ చేయడం తప్ప దీంట్లో మరేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్. పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఫోనట్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ మాదిరిగా నడుస్తోంది. కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది. ఇది మాత్రం అవ్వట్లేదు. టీవీ సీరియల్ డ్రామాలను తలపించేలా డ్రామాలు చేస్తున్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బలి అయ్యేది పోలీసు అధికారులే అని చెప్పుకొచ్చారు. ఇది ట్రాష్ కేసు.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. హరీష్ రావును అడిగిందే అడిగి టైమ్ పాస్ చేశారు. రేపు నాతో కూడా అదే చేస్తారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్ను అడుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదు?. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డిని విచారణకు పిలిచారా?. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సిట్ వేయాల్సింది ఎవరి మీదనో తెలుసా.. గూండాలతో భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి కొడుకుపై సిట్ వేయాలి. బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావమరిదిపై సిట్ వేయాలి. కంచె గచ్చిబౌలి భూముల్లో స్కామ్ జరిగింది. సిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు సిట్ వేయలేదన్నారు.హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారు. సాయంత్రం కల్లా సిట్ నోటీసులు అందాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అనేది నేడు జరుగుతోంది ఏం కాదు.. 1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా అదే ట్వీట్ చేస్తాడు. ఆయనకేం తెలుసో, లేదో నాకైతే తెలియదు. సిట్ విచారణకు బరాబర్ వెళ్తాను. అన్ని సమాధానాలు చెబుతాను అని అన్నారు. అలాగే, పరాభవం తప్పదనే భయంతో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రజల సౌలభ్యం కోసమే మేము జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారు. కొత్త జిల్లాల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సులభతరం అవుతుందని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ ఫలితాలు మించి మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సంపాదిస్తుంది. జిల్లాల ఏర్పాటుపైన కమిషన్ వేస్తున్నామంటున్నారు. కొత్త జిల్లాలైన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలను రద్దు చేయాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయమంటూ తుగ్లక్ పనులు చేస్తే ప్రజల చేత తిరస్కరించబడతారు. అధికార వికేంద్రీకరణ కొరకు కేసీఆర్ అడుగేస్తే మీరు చెరిపేయాలనుకుంటే ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. -
జేసీ అరాచకం.. కేతిరెడ్డిపై దాడికి స్కెచ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్ వేశారు. తాడిపత్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక పాత్ర పోషించడం గమనార్హం.తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అధికార కూటమికి సవాల్ విసిరారు. తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ పాలనకు, ఐదేళ్ల తన పాలనపై చర్చకు రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే, కేతిరెడ్డి సవాల్కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేపు(శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతల జనసమీకరణ చేశారు.ఇందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు స్కెచ్ రచిస్తున్నట్టు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జేసీ వర్గీయులు ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చి.. కేతిరెడ్డి ఇంటి వద్ద పోశారు. దాడి చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కంకర రాళ్లు సిద్ధం చేసుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
కాసేపట్లో ఫాంహౌస్కు కేటీఆర్, హరీష్.. కేసీఆర్తో భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠను రేపింది. మరోవైపు.. కాసేపట్లో ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వద్దకు కేటీఆర్, హారీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణపై చర్చించే అవకాశం ఉంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్, మెదక్లో హరీష్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ఎర్రవల్లి చేరుకుంటారు. అయితే, సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. రేపు సిట్ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్దమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రేపు తెలంగాణభవన్కు రావాలని బీఆర్ఎస్ సూచించింది. -
కేటీఆర్కు సిట్ నోటీసులు.. హరీష్రావు రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ సిట్ నోటీసులపై హరీష్రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారన్న హరీష్.. అటెన్షన్ డైవర్షన్లకు భయపడబోమన్నారు. ‘‘నాకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంటే పడతాం’’ అంటూ హరీష్రావు వ్యాఖ్యానించారు.నీ బావమరిది కుంభకోణం బయటపడొద్దనే ఈ డైవర్షన్ డ్రామా. ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. నేను, కేటీఆర్ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారంటూ హరీష్రావు మండిపడ్డారు. ‘‘బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్.. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం’’ అని హరీష్ తేల్చి చెప్పారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్కు తాజాగా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) కేటీఆర్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు విషయంలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా రేపు(శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. సిటీలోని నంది నగర్లో ఉన్న కేటీఆర్కు నివాసానికి వెళ్లిన పోలీసులు.. అక్కడే నోటీసులు అందజేశారు. 160 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఇప్పటికే సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేటీఆర్కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లకు భయపడే ప్రసక్తే లేదు. నాకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్కు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నీ వెంట పడుతాం. నీ బావ మరిది కుంభకోణం బయటపడొద్దనే ఇలా డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారు. నేను, కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే మాకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులకు భయపడేది లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటాం అని హెచ్చరించారు. -
ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న “రెడ్ బుక్ పాలన” కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.పార్లమెంట్ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
ముంబై మేయర్ ఎంపికలో బిగ్ ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ముంబై మేయర్ పోస్టును ఏ కేటగిరికి కేటాయించాలి? అనే అంశంపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపిక కావడంపై ఉద్దవ్ థాక్రే శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో, మేయర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.వివరాల మేరకు.. ముంబై మహిళా మేయర్ రానున్నారు. అయితే, సదరు మహిళా మేయర్.. ఏ కేటగిరి నుంచి రావాలనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, ఈ పోస్ట్ను ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్ మహిళ’ కేటగిరీ ఎంపికైంది. కాగా, ఈ లాటరీ ప్రక్రియ, ఫలితంపై ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది గందరగోళ పరిస్థితులకు దారితీసింది. బీఎంసీని ఓబీసీ కేటగిరీ కింద ఎందుకు పరిగణించలేదని మాజీ మేయర్ కిశోరి ఫడ్నేకర్ ప్రశ్నించారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం, సభ నుంచి ఉద్దవ్ వర్గం సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, మేయర్ స్థానంలో ఉత్కంఠ నెలకొంది.#WATCH | Mumbai | Following reservation lottery announcement for mayor post, Shiv Sena (UBT) leader & former mayor, Kishori Pednekar says," There are many areas where OBC community stays in Mumbai. No chit with names of their representatives was put in the lottery. This is wrong.… pic.twitter.com/HtBViPvsm2— ANI (@ANI) January 22, 2026మరోవైపు.. మేయర్ పదవి కోసం డ్రా పూర్తయిన తర్వాత బీఎంసీలోని అర్హులైన కార్పొరేటర్లు నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. ఈ లాటరీ ప్రక్రియ తర్వాత పుణె, ధూలే, బీఎంసీ, నాందేడ్, నవీ ముంబయి, మాలేగావ్, మీరా భయందర్, నాసిక్, నాగ్పుర్ మేయర్ పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే.. లాతూర్, జల్నా, థానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో లాతూర్, జల్నా ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగానికి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో అకోలా, చంద్రపూర్, అహిల్యానగర్, జల్గావ్ ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేయబడగా.. పన్వెల్, ఇచల్కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్నగర్ ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు.Mumbai is set to have a woman mayor for the second term in a row after the BMC mayoral post was placed in the Open (Women) category during the reservation lottery. #MumbaiMayor #BMC #WomenLeadership #MaharashtraPolitics #CivicPolls #MayorReservation pic.twitter.com/RnNjhxIcT9— Mumbai Insights (@Mumbai_Insights) January 22, 2026 -
దావోస్.. డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
జూదం చట్టబద్ధమా?
సాక్షి, అమరావతి: ‘జూదం అనేది చట్టబద్ధమా..?’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ దగ్గరుండి జూదాలు (గ్యాంబ్లింగ్) నడిపించారని.. ఈ వ్యవహారంలో రూ.2 వేల కోట్లు చేతులు మారాయని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇందులో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసులు కూడా వాటాలు పంచుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమిటని నిలదీశారు. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా..? ఇది అవినీతి కాదా..? ఇది లూటీ కాదా..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్... విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పారు. ఇవన్నీ అవినీతి కాదా..? కళ్ల ముందు టీడీపీ కూటమి నేతలు చేస్తున్న అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము నిజాయితీపరులమనే భ్రమను కల్పించే యత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, వాడవాడనా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూమ్లు వెలిశాయి. వాటిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ దోచుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఇసుక అమ్మకాలతో వైఎస్సార్సీపీ హయాంలో ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అని మభ్యపెడుతూ ఎడాపెడా దోచేస్తున్నారు. నాటికీ, నేటికీ ఇసుక ధర చూస్తే రెట్టింపు అయ్యింది. ప్రభుత్వ ఖజానాకు పైసా ఆదాయం రావడం లేదు. దోచేస్తున్న డబ్బు అంతా చంద్రబాబు, టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇది అవినీతి కాదా? ఇసుకే కాదు.. సిలికా, క్వార్ట్ ్జలేటరైట్ లాంటి సహజ వనరులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తూ టీడీపీ మాఫియా దోచుకుంటోంది. ఇది అవినీతి కాదా..? మా హయాంలో విద్యుత్ యూనిట్ అత్యంత చౌకగా రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తే చంద్రబాబు రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు యూనిట్ రూ.4.60 వంతున కరెంట్ కొనుగోలు చేస్తున్నారు. రూ.2.49 ఎక్కడ..? రూ.4.60 ఎక్కడ..? ఇది అవినీతి కాదా..? అమరావతిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్నది ఏమిటి..? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? చదరపు అడుగుకు రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. రాజధాని నిర్మాణంలో జరుగుతోంది అవినీతి కాదా..? ఈ అవినీతిపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని వైఎస్ జగన్ కోరారు. బాబు సర్కారు అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తామనే భయంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవడంపై అనేక సందర్భాల్లో గతంలోనే స్పష్టమైన సమాధానాలు చెప్పానని మరో ప్రశ్నకు జవాబుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు.. ఒకటి అధికారపక్షం.. రెండోది ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. మరి.. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా స్పీకర్ను అడ్డుకుంటున్నదెవరు? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, సభా నాయకుడికి మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంత సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తాననే భయంతోనే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా 175 మంది ఎమ్మెల్యేల తరహాలోనే కేవలం 5 నిమిషాలే సమయం ఇస్తామంటే ప్రజల గొంతును వినిపించే అవకాశం ఉండదు. ప్రజల గొంతుకను బలంగా వినిపించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది..’ అని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. -
లోకేశ్.. ఇది పాయె.. అదీ పాయె!
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే ఆంధ్రప్రదేశ్ సకల శాఖల మంత్రి నారా లోకేశ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఈయనేమో ఐటీ, విద్యాశాఖల మంత్రి. కానీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇతర శాఖలన్నీ తనవే అన్నచందంగా వ్యవహరిస్తూంటారు. ఒకపక్క రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షల్లో తగ్గిపోతూంటే దాన్ని పట్టించుకోకపోగా.. ఇతర శాఖలపై పెత్తనం ఏమిటన్నది ప్రశ్న. చిత్రంగా ఎల్లోమీడియా మాత్రం లోకేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చేశారని ఊదరగొడుతూంటుంది. అందుకే చాలామంది రెండు శాఖలలోను లోకేశ్ పనితీరు అంతంతమాత్రమేనంటున్నారు. తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది కూడా ఇదే. ఎలివేషన్ ఇచ్చేందుకేమో... చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్కు కీలకమైన విద్య ఐటీ శాఖల మంత్రిగా చేశారు. యువకుల్లో లోకేశ్కు ఒక గుర్తింపు వస్తుందని కూడా భావించి ఉండవచ్చు. తల్లికి వందనం స్కీమ్ లోకేశ్ ఐడియానే అని చంద్రబాబు చెప్పడం కూడా ఎలివేషన్లో భాగమే. కాకపోతే ఈ పథకాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ పేరుతో మొదలుపెడితే.. క్రెడిట్ లోకేశ్కు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఐటీ శాఖకు సంబంధించి కూడా.. ఇదే రకమైన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తెప్పించానికి లోకేశ్ కృషి చేసినట్టుగా చెప్పారు ఆయన. ఆసక్తికరంగా ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెడిసికొట్టాయి కూడా. చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు పరుగులు పెడతాయని ఒకప్పుడు ఊదరగొట్టిన లోకేశ్ ఆ తరువాత ఆ విషయం ఎత్తకపోగా.. ఐటీ అభివృద్ది పేరుతో 99 పైసలకే ఎకరాలకు ఎకరాల భూమి కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టారు. పోనీ అలాగైనా కంపెనీలు వచ్చాయా? ఊహూ లేదు. అది చాలదన్నట్టు మంత్రివర్గం స్థాయిలో తీసుకోవాల్సిన భూ కేటాయింపు నిర్ణయాలను తానే తీసుకుంటూ విమర్శలకు గురయ్యారు. తొంభై తొమ్మిది పైసలకే భూములెలా పంచుతారంటే అహంకారపూరిత ధోరణిలో తన నిర్ణయాలను సమర్థించుకుంటున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు. లోకేశ్ శాఖల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర శాఖల విషయంలో జోక్యం చేసుకోవడం ,ముఖ్యంగా రెడ్బుక్ అంటూ హోం శాఖను తానే నడుపుతున్నట్లుగా ప్రవర్తించడం, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి ఆయన ఇమేజ్ను డామేజీ చేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్య,ఆరోగ్య రంంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కాని కూటమి ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి.దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ బాధ్యులవుతారా? కాని ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులు ఏ మాత్రం బాగోలేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీడియా కథనం ప్రకారం.. 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో హైస్కూలు స్థాయి లోపు 18 లక్షల మంది విద్యార్ధులు చదువులకు దూరం అయ్యారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఐదు శాతం మంది తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో ఒక శాతం, హైస్కూలు దశలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. జగన్ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమాల ద్వారా, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై ఆసక్తి రేకెత్తించారు. పేదలు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్లకుండా స్కూళ్లలో చేర్చే అవకాశాలు కల్పించారు. ‘‘నాడు-నేడు’’ కింద ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి వాటికి కొత్త కళ తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడే డిజిటల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్లు ఇచ్చారు. ఎల్లో మీడియా విష ప్రచారం చేసేది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు.అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా రూ.14 వేల చొప్పున ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో మెనూ గురించి కూడా శ్రద్దపెట్టారు. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్, బూట్ల నుంచి అన్నింటినీ టైమ్కు అందించే ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాలు మాత్రం టీచర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి. టీచర్లు కూడా కొంత వరకూ వీరి ట్రాప్లో పడినట్లు చెబుతారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పద్దతులను యధాతధంగా పాటించినా మంత్రి లోకేశ్కు మంచి పేరే వచ్చేదేమో! కానీ.. ఏడాది పాటు తల్లికి వందనం ఎగవేయడం, రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేయడంతో విద్యార్థులు చదువులకు దూరమై ఉండవచ్చని చెబుతున్నారు. గ్రామాలలో, పట్టణాలలో మనీ సర్కులషన్ బాగా పడిపోయిందని అంటున్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు.దీని ప్రభావం కార్మికరంగంపై కూడా ఉంటుంది. వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. జగన్ హయాంలో వివిధ స్కీముల ద్వారా జనంలో డబ్బు చెలామణిలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో పనుల్లేక జనాలు వలస వెళుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా చూసేందుకు ప్రయత్నించడం అత్యవసరం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ మూకలు సాగిస్తున్న రాక్షస దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితుడు సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి అని స్పష్టంచేశారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఏ స్థాయికి పోయిందనటానికి ఇదో ఉదాహరణ. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందినవారు. ఈ నలుగురితోపాటు 300 పైచిలుకు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి వెళ్లేలా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఊరిలో వారికున్న ఆస్తులు, పొలాలు అన్నింటినీ వదిలేసేలా దౌర్జన్యం చేసి గ్రామాన్ని వీడేలా సాక్షాత్తు చంద్రబాబునాయుడే ప్రోత్సహిస్తున్నారు. పోలీసు భద్రతతో పికెట్ ఏర్పాటుచేసి వారు గ్రామంలోకి తిరిగి వచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని వీడి వెళ్లిపోయిన ఒక దళితుడు, పేదవాడు అయిన సాల్మన్ భార్య తన ఇల్లు చూసుకునేందుకు అక్కడకు వెళ్లింది. అయితే అనారోగ్యం బారిన పడి అక్కడే ఉండిపోవడంతో తన భార్యను చూడటానికి వెళ్లిన సాల్మన్పై దాడిచేసి రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. చంపేందుకు పావులుగా వాడిన వ్యక్తులకు, సాల్మన్కు ఎలాంటి గొడవలు లేవు. పైనుంచి చెప్పి అతడిని చంపించారు. ఈ హత్యలో సీఐ, ఎస్ఐలు, ఎస్పీ, చంద్రబాబునాయుడి ఎమ్మెల్యేలు, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు.. వీరంతా దోషులే. చంద్రబాబు ఓ తప్పుడు మనిషి ..!ఈ మనిషి చంద్రబాబు.. నాయకుడు, పాలకుడు కాదు. అన్నీ చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లున్న ఒక తప్పుడు మనిషి. భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా దేవుళ్లు మనకు చెప్పిందేమిటి..? మోసం చేయకండి, అబద్ధం ఆడకండి.. నిజాయితీగా బతకాలని నేర్పిస్తారు. కానీ చంద్రబాబునాయుడుకున్న అలవాటు, తన కుమారుడికి నేర్పించిన అలవాటు.. చివరికి ఆయన పార్టీ వారికి కూడా చంద్రబాబు చెప్పేదేంటంటే.. దౌర్జన్యం చేయండి, మోసం చేయండి తప్పులేదు! అబద్ధాలు ఆడినా తప్పులేదు... వెన్నుపోటు పొడిచినా తప్పులేదు... అధికారమే ముఖ్యం..! ఇవీ ఆయన నేర్పించేవి! జరుగుతున్న పరిణామాలు కోర్టుల దృష్టికి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల కమిషన్)కి కూడా ఫిర్యాదు చేస్తాం. కోర్టుల రక్షణ ద్వారా గ్రామస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. తిరిగి గ్రామంలోకి పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎల్లకాలం చంద్రబాబునాయుడు రోజులుండవు. ఇప్పటికే రెండేళ్లయిపోయింది. మరో మూడేళ్లు కూడా అయిపోతాయి. తర్వాత ఇదే చందబ్రాబునాయుడికి తాను వేసిన విత్తనాలు వృక్షాలైతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకులుగా న్యాయం, ధర్మం వైపు నిలబడాలి దెబ్బలు తిన్న సాల్మన్ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆరో రోజు మరణించాడు. చనిపోయిన ఆ మనిషిని సొంత గ్రామంలో ఖననం చేయడానికి కూడా గ్రామంలోకి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలా అడ్డుకుంటారని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి బంధువులు, వేలమంది నిలదీస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలోకి ప్రవేశానికి అనుమతించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించాలి. ఇలా చేసి తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే చంద్రబాబు వేసిన విషపు విత్తనాలు రేపు చెట్లు అవుతాయి. మీరు ఏవైతే నాటారో.. అవే పండుతాయి. నష్టపోయిన వారు చూస్తూ ఊరుకోరు. సహజంగా ఇది మానవ నైజం. పాలకులుగా ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. న్యాయం ధర్మం వైపు నిలబడాలి. పాలకులు న్యాయం, ధర్మం తప్పితే విషపు గింజలు నాటినట్లవుతుంది. రేపు ఎవరూ నియంత్రించలేని విధంగా ఆ విషపు బీజాలు చెట్లు అవుతాయి. -
ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు: వైఎస్ జగన్
తాడేపల్లి: భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. ఈరోజు(గురువారం, జనవరి 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు సర్వేలో అసలు సర్వే రాళ్లు లేవన్నారు. ‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్ బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే. ట్యాంపర్ చేయలేని పాస్బుక్లు ఇవ్వాలన్నదే మా తపన. పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. కమీషన్లు తీసుకుని పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారు. 22ఏ గురించి బాబు మాట్లాడం ఆశ్చర్యమేస్తోంది. 22ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుది. 35లక్షల 40 వేల ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించాం. 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పించాం. చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాం. రూ. 55.79కు మేం పట్టాదార్ పాస్బుక్ ఇస్తే.. చంద్రబాబు రూ. 76కు పాస్బుక్ ఇస్తున్నారు. మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారం. సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్’ అని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.ఇవీ చదవండి:వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా? -
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను మరోసారి ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వ దాష్టీకాలను తీవ్రంగా విమర్శించిన జగన్, తమ హయాంలో జరిగిన భూ రీసర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలముందుంచారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ భూమండలంపై క్రెడిట్ చోరీ అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాల్సిందే. అంత దారుణమైన మోసాలు చేస్తున్నారు.’’ అని జగన్ విమర్శించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఆయనకు అస్సలు లేకుండా పోయిందని, 2019-2024 మధ్యకాలంలో తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ కూడా లేదు’’ అని జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని తాను 2019నాటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీకి కట్టుబడి 2020 డిసెంబరు 21న దాన్ని ప్రారంభించామని వివరించారు. రైతులకు మేలు చేసే ఏ ఆలోచన కూడా చంద్రబాబుకు అస్సలు రాదని.. వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘‘నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో సమగ్ర భూ సర్వే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా యజ్ఞం. వివాదాల్లేకుండా, అత్యంత పారదర్శకంగా భూముల రీ సర్వే జరగింది. ఎవరూ మార్చలేని విధంగా భూ రికార్డులు సిద్ధం చేశాం. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం. అందుకు ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. రైతుల పాస్బుక్కుల్లోనూ క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచాం.’’ అని జగన్ తెలిపారు. విప్లవాత్మకమైన చర్యలు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను జగన్ సవివరంగా వివరించారు. గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు మొదలుకొని, వాటిల్లో ఒక్కోదాంట్లో పది మంది సిబ్బంది నియామకాలను కూడా ఆయన గుర్తు చేశారు. సమగ్ర భూ సర్వే విజయవంతం అయ్యేందుకు రికార్డు స్థాయిలో 40 వేల మంది సిబ్బందిని పురమాయించామని చెప్పారు. సిబ్బంది మొత్తానికి ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకున్నామని, హెలికాప్టర్లు, డ్రోన్లతో సర్వే నిర్వహించామని జగన్ వివరించారు. ‘‘మా హయాంలోనే మొదటిసారి డ్రోన్లతో సర్వే జరిగింది. కోట్ల సర్వే రాళ్లను ఉచితంగా రైతులకు అందించాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం’’ అని తెలిపారు. సర్వేలో ఎక్కడా రాజీ పడలేదని, భూమి కొలతల్లో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కచ్చితమైన సర్వే చేశామన్నారు. ఇందుకోసం రూ.ఆరు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడలేదని... ఈ కృషిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చిందని, రూ.400 కోట్ల రాయితీ కూడా వచ్చిందని తెలిపారు. 2023 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినాసరే.. చంద్రబాబు తన పాత అలవాటు ప్రకారం ‘‘అంతా నేను చేశాను’’ అంటున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో జరిగిన భూముల రీసర్వేను ఎన్నో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనియాడాయని జగన్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అధికారులు కూడా అధ్యయనం జరిపారని, సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ సర్వేను ఎంతగానో మెచ్చుకున్నారని చెప్పారు. చంద్రబాబు రాక్షసపాత్ర...భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు పాత్ర రాక్షసుడికి ఏమాత్రం తగ్గదని, ఎల్లోమీడియా అసిస్టెంట్ రాక్షస పాత్ర పోషించిందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా భూ సర్వేపై రైతులను భయపెట్టారని, ఇప్పుడు కూడా దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. అయితే నిజాలను ఎంతో కాలం దాచిపెట్టగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు సర్వే రాళ్లు కూడా లేకుండా సర్వే అంటున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు పాస్బుక్కుల విషయంలో మమల్ని అనుసరిస్తున్నాడు. కాకపోతే రంగు మార్చాడంతే. మార్చేందుకు వీల్లేని పాస్బుక్కులు ఇచ్చేందుకు మేము ప్రయత్నించాం. ఇప్పుడు విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. మేము పాతిన సర్వే రాళ్లను తొలగించేందుకు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం. మేము ఒక బృహత్తర లక్ష్యంతో మొదలుపెట్టిన భూముల సర్వేను చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు నీరుగారుస్తోంది’’ అని వివరించారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ, పల్నాడు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటన.. తదితర అంశాలపై పలు కీలక విషయాలను ఆయన వివరించారు. జగన్ ప్రెస్మీట్ హైలైట్స్భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబుఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుంది. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారాయనరైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదుభూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడూ రాలేదురీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చిందిరైతన్నలు లేవనెత్తిన సమస్యల నుంచి పరిష్కారమే రీసర్వేమేం అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరుభూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదుసవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే రీసర్వే22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసువందేళ్ల కిందట బ్రిటీషర్లు భూ సర్వేలు చేశౠరుమేం అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టాంచెప్పినట్లుగానే.. 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టాంసువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ప్రారంభించాంభూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టాంవివాదాలు లేని విధంగా పాదర్శకంగా భూములు రీసర్వే చేశాంరికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించాంభూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాంప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాంఅడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్లు ఇచ్చాం.. ఆ పాస్బుక్కుల్లో క్యూఆర్ కోడ్ పెట్టాంనాలుగుసార్లు సీఎంగా ఉండి.. 80 పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?చంద్రబాబు ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?సమగ్ర సర్వే చేసిన మేం చేసిన ప్రతీది రికార్డే.. ఇది ఎవరూ తుడిచిపెట్టలేనిది గ్రామాల్లో సచివాలయాలు నిర్మించాం. వాటిల్లో పది మంది చొప్పున సిబ్బందిని నియమించాం. సర్వే కోసం రికార్డు స్థాయిలో సిబ్బందిని పురమాయించాం. సుమారు 40 వేల మంది సిబ్బంది శ్రమ, కృషి దాగుంది ఈ మహాయజ్ఞంలో. టెక్నాలజీపై అవగాహన కోసం వీళ్లకు శిక్షణ ఇప్పించాం. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. డ్రోన్లతో సర్వే జరిగింది మా హయాంలోనే. కోట్ల సర్వే రాళ్లను గ్రామాలను తరలించాం. వాటిని ఉచితంగా రైతులకు ఇచ్చాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం. 5 సెం.మీల తేడా లేకుండా సర్వే జరిపాం. విదేశాల్లో కూడా చేయలేని ప్రయత్నాలు చేశాం. ఇది మహా యజ్ఞం అంటే.. భూముల రీసర్వేకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ కృషిని మెచ్చి కేంద్రం ప్లాటినమ్డ్ గ్రేడ్ ఇచ్చింది. మా పని వల్ల కేంద్రం నుంచి రూ.400 కోట్ల రాయితీ వచ్చింది. కానీ చంద్రబాబు అదంతా తన వల్లే అని చెప్పుకుంటున్నారు2023 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసింది భూముల రీసర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందికేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారుమహరాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారుఅసోం కూడా మా సహకారం కోరిందిసర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేం చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారుచంద్రబాబుది రాక్షస పాత్ర.. ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షస పాత్రఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నికల సమయంలో రైతులను భయపెట్టారుదుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారునిజాలను ఎంతో కాలం దాచిపెట్టలేరు సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారుఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారుపాస్ బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతేట్యాంపర్ చేయలేని పాస్బుక్లు ఇవ్వాలన్నదే మా తపనపైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయిమేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారుసర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారంసర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్ 22 ఏ గురించి చంద్రబాబు మాట్లాడితే ఆశ్చర్యమేస్తోంది22 ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుదేగ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు గాలికొదిలేశారురూ.55.79 మేం పట్టాదారు పాస్బుక్కు ఇస్తే.. చంద్రబాబు రూ.76 ఇస్తున్నారుకమీషన్లు తీసుకుని పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నారు చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాంచంద్రబాబు ఇవేవీ చేయకపోగా.. అదంతా తన పనిగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా.. రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారుపల్నాడు జిల్లా పిన్నెల్లిలో దారుణం జరిగిందిప్రజలు ఊర్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితికి రెడ్బుక్ రాజ్యాంగం చేరింది.. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితిఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి ప్రజలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రొత్సహిస్తున్నారు. సాల్మన్ ఒక దళితుడు.. ఒక సామాన్యుడు. తన భార్య అనారోగ్యం బారిన పడిందని సొంత గ్రామం పిన్నెల్లి వెళ్తే.. సాల్మన్ను రాడ్లతో కొట్టి చంపేశారు.చికిత్స పొందుతూ ఆ మనిషి చనిపోతే.. కనీసం మృతదేహాన్ని ఊరిలోకి కూడా రానివ్వలేదు. మా పార్టీ నేతలు పోరాడితేగానీ అంత్యక్రియలకు అనుమతించలేదు. తన పాలనలో చంద్రబాబు విషపు గింజలు నాటాడు. చంద్రబాబు చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తి . పిన్నెల్లి ఘటనలో.. సీఐ, ఎస్సైలు, ఎస్సీ, ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా దోషే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఇది ఆయన గుర్తిస్తే మంచిది. పిన్నెల్లి ఉదంతంపై కోర్టులను.. మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తాం కూటమి వచ్చాక.. రాష్ట్రంలో వాడవాడలా బెల్ట్ షాపులు వెలిశాయిఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారుఉచిత ఇసుక పేరుతో దోచేస్తున్నారుమా హయాంలో ఇసుకతో రూ.750 కోట్ల ఆదాయం ప్రతీ ఏడాది వచ్చేదికూటమి ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందిదోపిడీలో కింద నుంచి పైవరకు వాటాలు వెళ్తున్నాయిప్రైవేట్ వాళ్లకు భూములు ఇవ్వడమేకాదు.. నిర్మాణ ఖర్చులూ ఇస్తున్నారుభూములు ఇవ్వడమే పెద్ద స్కామ్.. నిర్మాణ ఖర్చులనేది ఇంకా పెద్ద స్కామ్అమరావతిలో నిర్మాణాల పేరుతో జరిగేది ఏంటి? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్ జరిగింది. జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రొత్సహించడమేంటి?. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి కిందకే వస్తుంది కదా.. లూటీ కదా!.. రాష్ట్రంలో మేం తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే విషయాన్ని అంతా గుర్తించాలి సభలో మైక్ ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది -
విజయ్ టీవీకే పార్టీకి కొత్త కష్టాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సైలెన్స్లోనే..అయితే ఆయన తన పనిని తాను సైలెంట్గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు. కొత్త కష్టం.. టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్లో ఉన్న కామన్ సింబల్లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. -
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
వచ్చే ఏడాది ప్రజల్లోకి.. ప్రజల మధ్యే ఉంటాను: వైఎస్ జగన్
చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పార్టీ కేడర్తో సమావేశం అవుతాను. ఇదే క్రమంలో ప్రజల తరఫున గట్టిగా యుద్ధం చేద్దాం. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. అలా దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే ఉంటాను. ఈ దుర్మార్గ పాలనను, శిశుపాలుడిని తెర మరుగు చేసే రోజు దగ్గర్లోనే ఉంది.జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.. ఇలాగే మరో మూడేళ్లు అయిపోతాయి.. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున జెండా పట్టుకుని పోరాడుతున్నాం.. ఇంకో ఏడాదిన్నర గట్టిగా యుద్ధం చేస్తే నా పాదయాత్ర మొదలవుతుంది.. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. శిశుపాలుడు తెరమరుగయ్యే రోజు దగ్గర్లోనే ఉంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. ‘నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నాం. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇక నుంచి ప్రతి వారం కార్యకర్తలతో భేటీలు.. ప్రజల తరఫున పోరాటాలు.. ఇలా ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది’ అని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రతి ఇంట్లోనూ అదే చర్చరాష్ట్రంలో ఈ రోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండ కావరంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్ధాలు, మోసాలు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.మోసం.. దగా.. అదే బాబు పాలనమనం ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ప్రపంచంలోనే ఉండరని అందరూ గ్రహించారు. ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే. ఏదీ అమలు కాలేదు. మరో వైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. నాడు–నేడు మనబడి లేదు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు లేవు. పిల్లలకు టోఫెల్ క్లాస్లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవి. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేది. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారు. నాడు మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈ రోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.వ్యవస్థలు నిర్వీర్యం.. అన్నీ బకాయిలే⇒ ఫీజు రీయింబర్స్మెంట్ ఏకంగా ఎనిమిది క్వార్టర్లు పెండింగ్. ఒక త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన డబ్బులు జమ చేసే వాళ్లం. 2024 ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన త్రైమాసిక చెల్లింపు, ఏప్రిల్లో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో, అప్పటి నుంచి ఫీజుల చెల్లింపు లేకుండా పోయింది. ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు. అలా ఎనిమిది క్వార్టర్లకు సంబంధించి రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. అలా రూ.4,900 కోట్లు బకాయి పడ్డారు. వసతి దీవెన కింద మనం పిల్లలకు కోర్సును బట్టి ఏటా రూ.20 వేల వరకు ఇచ్చే వాళ్లం. అలా ప్రతి ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఇవ్వక రూ.2,200 కోట్లు బకాయి పడింది. అలా చదువుల రంగం పూర్తిగా నాశనం అయింది. ఇక్కడ చదవాలంటే పిల్లలు భయపడుతున్నారు. ⇒ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేశారు. నెలకు రూ.300 కోట్లు దానికి కావాలి. మన హయాంలో 3,300 ప్రొసీజర్లకు విస్తరించి, రూ.25 లక్షల వ్యయం వరకు ఉచిత వైద్యం అందించాం. దాదాపు 20 నెలల నుంచి నెలకు రూ.300 కోట్ల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. రూ.4 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్ టైమ్లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశ పెడితే.. ఇవాళ వాటిని పడకేయించారు. ఇప్పుడు టీడీపీ డాక్టర్ల వింగ్కు చెందిన వారికి ఆ సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్ చేస్తే, రెండు మూడు గంటలైనా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి. ఇలాంటి స్కామ్కు పాల్పడిన వారిపై మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.నాలుగు రంగాలు నాశనంవ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. నాడు గ్రామాల్లో ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు ఇప్పుడు పని చేయడం లేదు. ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పంటలకు మద్దతు ధర లేదు. చివరకు రైతు భరోసాలో కూడా మోసం. రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలు. దాన్నీ నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అలాగైతే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?జనంతో వైఎస్సార్సీపీ మమేకం‘అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతును నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరఫున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి. ఏలూరులో మన పార్టీ నాయకుడు జేపీ (జయప్రకాష్)కి మీ అందరి సహకారం కావాలి. మీరంతా ఆయనకు తోడు కావాలి’ అని జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త జయప్రకాష్, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కారుమూరి సునీల్తో పాటు, దాదాపు 200 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘నేను ఎమ్మెల్యేపై దాడి చేయలేదు’
ఢిల్లీ: తాను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఖండించారు. తాము సోదరులుగా ఉంటామని, ఇద్దరం కూడా సంక్షేమం పనులు చేయడానికి ఉన్నామన్నారు. ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు ఎవరో కావాలని క్రియేట్ చేశారన్నారు. అల్లాపూర్లో కొన్ని శంకుస్థాపనలు జరిగే సమయంలో ఎమ్మెల్యే విజయుడు, తాను కలిసి కొన్నికార్యక్రమాలు నిర్వహించామన్నారు. ‘నేను, ఎమ్మెల్యే,ప్రోటోకాల్ పాటిస్తూనే కార్యక్రమాలు నిర్వహించాం. నేను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేయలేదు, అలాంటి ఉద్దేశ్యం నాకు లేదు. మేము ఇద్దరం దళితులం. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. ఎల్లుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం ఉంది మళ్ళీ అక్కడ కలుస్తున్నాం. ఎమ్మెల్యే విజయుడు నాకు ఇంతకు ముందు ఫోన్ చేసి టీవీలో ఏమో వస్తుంది నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కొందరు దిన్ని రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే, నేను అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. ప్రజలు నన్ను గెలిపించారు నేను ఎంపీని అయ్యాను. అప్రజాస్వామ్యంగా నేను ఎప్పుడూ వ్యవహరించలేదు’అని స్పష్టం చేశారు. -
సింగరేణిపై వ్యాఖ్యలు.. కిషన్రెడ్డికి మహేష్ గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్, కాంగ్రెస్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘కిషన్ రెడ్డి పలుకులు బీఆర్ఎస్ నేతలవి. కేటీఆర్, హరీష్ దారిలో కిషన్ రెడ్డి ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా విచారణ జరపమనండి.. ఎవరు వద్దన్నారు. టెండర్ల అవకతవకలపై చర్చకు రండి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిజాలపై చర్చకు రండి. గత బీఆర్ఎస్ హయంలో అవకతవకలపై దర్యాప్తు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పారదర్శకత వచ్చింది’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కిషన్ రెడ్డి టెండర్ల విషయమై సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారని అన్నారు. -
‘దావోస్లో చంద్రబాబు, లోకేష్లు బేతాళ కథలు వినిపిస్తున్నారు’
తాడేపల్లి : దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు బేతాళ కథలు వినిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. వారు తెచ్చే పరిశ్రమల సంగతి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉందని మండిపడ్డారు. పనిలో పనిగా ట్రంప్ స్వయంగా వచ్చి చంద్రబాబును కలిశారని కూడా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు శైలజానాథ్. అసలు ఇప్పటివరకూ చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు. ఈరోజు( బుధవారం, జనవరి 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ఎంవోయూల కోసం వచ్చేదంతా టీడీపీ ఏర్పాటు చేసిన మనుషులేనని స్పష్టం చేశారు. ‘ వాళ్ళ కోటు రంగులు మారతాయే కానీ కంపెనీలు మాత్రం రావు. చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. ఏమైనా అడిగితే పెట్టుబడుల కోసం కాదు.. బ్రాండ్ వాల్యూ పెంచటం కోసం వెళ్తున్నామని లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆర్ఎంజెడ్ సంస్థతో లక్ష ఒప్పందం కుదుర్చుకున్నామని.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అసలు లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తుంది?, లక్ష ఉద్యోగాలు ఆ సంస్థ ఇవ్వకుంటే ఏం చేయాలి?, అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ ఏర్పాటు చేస్తాం అన్నారు. దొనకొండలో డ్రోన్స్ యూనిట్ అన్నారు. వారు చెప్పిన ఏ ఒక్క కంపెనీ కనిపించటం లేదు. వీటి ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదు. చంద్రబాబు, వారి మంత్రులు తిరిగే ప్రత్యేక హెలికాఫ్టర్ల ఖర్చుతో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. దేనికి ఖర్చు పెట్టారో కూడా లెక్కలు లేవు. గత ప్రభుత్వ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో 90 శాతం గ్రౌండ్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో దక్షిణ భారత దేశంలో సేవారంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం సాధించాం. చంద్రబాబు పరిశ్రమల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములు మొత్తం ప్రజలవే. దావోస్ వెళ్ళినా కూడా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు. -
నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవినీతి, అక్రమాలు: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నా నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు?. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైనీ కోల్ బ్లాక్ను సింగరేణికి అప్పగించింది. టెండర్లను ఆహ్వానించి వాటిని రద్దు చేశారు. దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం.. కానీ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒడిషాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను.నేను సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 32వేల కోట్ల బకాయి పడింది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పనిచేస్తోంది. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. 12 ఏళ్లుగా నైనీ బ్లాక్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు. సీబీఐ అనుమతి కోరుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. బీఆర్ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారు. అవినీతి, అక్రమాలతో సింగరేణిని నాశనం చేయవద్దు. సింగరేణిలో ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సింగరేణి అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పరిశీలిస్తాం. మంత్రుల మధ్య వాటాల తేడా వల్లే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు జరిగింది. సైట్ విజిట్ నిబంధన పెట్టాలనే విషయం కేంద్రానికి తెలియదు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన ఉంటే.. ఇక్కడ మాత్రం వేరుగా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే లాభాల్లోకి తీసుకువస్తాం అని అన్నారు. -
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. బీజేపీ, ఉద్దవ్ సేనకు ఝలక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్దవ్ థాక్రేకు తన సోదరుడు రాజ్థాక్రే ఊహించని షాకిచ్చారు. పదవుల కోసం మరోసారి శివసేనను రెండుగా చీల్చిన ఏక్నాథ్ షిండేతో రాజ్థాక్రే చేతులు కలిపారు. శివసేన (యూబీటీ) బద్ద శత్రువైన షిండేతో రాజ్ థాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. ఈ క్రమంలో కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ఇచ్చింది. అయితే.. స్థానిక ఎంఎన్ఎస్ నాయకుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కళ్యాణ్-డోంబివిలి ప్రాంతంలో అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. 122 మంది సభ్యులు ఉన్న కళ్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50, షిండే సేనకు 53, ఎంఎన్ఎస్కు 05, ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ 11 స్థానాలను గెలుచుకుంది. కేడీఎంసీని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 62 కావాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయి.Navi Mumbai, Maharashtra: Shiv Sena MP Shrikant Shinde says, "Shiv Sena is establishing its faction at Konkan Bhavan with its 53 corporators. Along with them, MNS has also come here with their city corporators..." pic.twitter.com/D1rsWck9Vh— IANS (@ians_india) January 21, 2026బీజేపీకి నో చాన్స్..అయితే, శివసేన-బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేయర్ పదవుల్ని దక్కించుకోవడానికి పొరాడుతున్నాయి. బుధవారం కొంకణ్ భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, శివసేన ఎంపీ మరియు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, రాజ్థాక్రే పార్టీతో పొత్తును ధృవీకరించారు. ఇది వారి బలాన్ని 58కి పెంచుతుంది. ఉద్ధవ్ వర్గం నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు ఈ కూటమిలో చేరవచ్చని శ్రీకాంత్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా చేసింది. మరోవైపు.. ఎంఎన్ఎస్ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. In a major political development in Kalyan-Dombivli Municipal Corporation (KDMC), the Maharashtra Navnirman Sena (MNS) has announced support for the Eknath Shinde-led Shiv Sena faction. The announcement was made after a meeting at Kokan Bhavan, attended by MP Dr. Shrikant Shinde… pic.twitter.com/vVvZsc8utY— Pune Mirror (@ThePuneMirror) January 21, 2026ఉద్దవ్ వర్గానికి ఎదురుదెబ్బ!ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 ఏళ్ల ఈగోను పక్కన బెట్టి థాక్రే సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. థాక్రే బ్రదర్స్ రీయూనియన్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వీరి కలయిక మాత్రం రెండు పార్టీల కేడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. కానీ, ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రాజ్థాక్రే ఇలా ట్విస్ట్ ఇవ్వడం ఉద్దవ్ వర్గానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. -
హెరిటేజ్ పాల కంటే విశాఖలో భూమి ధర తక్కువ: కన్నబాబు
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కూటమిగా ముఠా కట్టి.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే భూమి ధర ఎలా తక్కువగా ఉందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి నేతలు ప్రజలను సూపర్ మోసం చేశారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకం ఒక్కటే. ప్రైవేటు వాళ్లకి దోచిపెట్టడం. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే విశాఖపట్నంలో ఎకరా భూమి ధర తక్కువ. సామాన్యులను వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వాళ్ళని దావోస్ మ్యాన్ అంటారు. దావోస్లో కూటమి నేతలు కలరింగ్ ఇస్తున్నారు.భూములు ప్రజా సంపద. చంద్రబాబు.. విశాఖ భూములు ఏమైనా మీ బాబు గారి సొమ్మా?. భూములున 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి?. విశాఖపట్నం భూములు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు మరి అమరావతి భూములు ఎందుకు ఇవ్వరు?. చెప్పింది ఆచరించటం, చేసేదే చెప్పడం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధాంతం. మాట నిలబెట్టుకోవడం కోసం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. కూటమి ముఠా చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారు. -
బీజేపీ నూతన సారథికి ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల’ సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన నలభై ఐదేళ్ల నితిన్ నిబీన్కు తొలి అడుగులే అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల రూపంలో ఆయన తక్షణ సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణముల్కు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామే కానుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్రణాళిక ఏ మేరకు ఫలించేదీ తమిళనాడు, కేరళ ఎన్నికలు తేల్చనున్నాయి. వీటికి తోడు పార్టీపరమైన సమన్వయం, ఎన్డీఏ భాగస్వాములు, ఇతర మిత్రపక్షాలతో సమన్వయం, పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.ఆ మూడు రాష్ట్రాలే అసలు సవాలు కొద్ది నెలల్లో జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు నబీన్కు అత్యంత కీలకం కానున్నాయి. వాటిలో బెంగాల్ను బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా అప్రతిహాతంగా సాగుతున్న తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అధికారానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లకు గాను మమత పార్టీకి 223, బీజేపీకి కేవలం 65 సీట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో 150 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడం బీజేపీకి గట్టి సవాలేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.2024 లోక్సభ ఎన్నికల్లోనూ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ దిగజారింది. 2019లో 18 సీట్లు నెగ్గగా పోయినసారి ఆరింటిని కోల్పోయి 12 స్థానాలతో సరిపెట్టుకుంది. తృణముల్ ఎంపీ స్థానాలు 22 నుంచి 27 స్థానాలకు పెరిగాయి. కోల్కతాతో పాటు చాలా నగర ప్రాంతాల్లో బిహారీ వలసదారులు ఎక్కువ. కనుక అటు నుంచే నరుక్కు రావాలన్నది నబిన్ యోచన. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు తదితరాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తృణమూల్కు బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచే, గ్రామీణ ఓటర్లతో బీజేపీకి అనుబంధం పెంచే చర్యలపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టే అవకాశముంది. ప్రజల్లో గుర్తింపున్న నేతలకే టికెట్లని నబీన్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.తమిళనాట... ఇక దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ఈసారైనా పట్టు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీఎంకే ప్రభుత్వ అవినీతి, విద్య, ఉద్యోగ రంగాల్లో వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వైఫల్యాల వంటి అంశాల్లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త అధ్యక్షుడు ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించే పరిస్థితులు లేనందున అన్నాడీఎంకేతో (AIDMK) పొత్తు, ఇతర చిన్న పార్టీల మద్దతు ద్వారా ఓటు బ్యాంకును విస్తరించాలని భావిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలతో పాటు యువత, మహిళలను ఆకర్షించేలా కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న కేడర్ను బలోపేతం చేయడం, స్థానిక భాషలో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యతపై నబీన్ ఫోకస్ చేసే అవకాశముంది.234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ గెలవగలిగే అవకాశామున్న 65 స్థానాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తు దిశగా అన్నాడీఎంకేతో వారంలో చర్చలు మొదలవనున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటికే ‘మిషన్–2026’పేరుతో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు దీటుగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అక్కడ 45 ఏళ్ల తర్వాత ఎల్ల్డీఎఫ్కు కమలం పార్టీ చెక్ పెట్టడం తెలిసిందే. ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చుకోవాలని చూస్తోంది.చదవండి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల శిక్షణ, ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక వంటివి మొదలయ్యాయి. గ్రామాల నుంచి నగరాల దాకా ఓటర్లను నేరుగా కలిసే ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నేతలకు కొత్త అధ్యక్షుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కేరళలో దశాబ్దాలుగా బలంగా ఉన్న వామపక్ష రాజకీయాలు, జాతీయ పార్టీల పట్ల సంప్రదాయ వ్యతిరేకత బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఓటేసే నవ యువతను తమ వైపు తిప్పుకోవడంతో పాటు కీలకమైన విద్య, ఉద్యోగాలపై ప్రచారం చేయాలన్నది కొత్త అధ్యక్షుని వ్యూహమని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించాల్సిందే: కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే ముగ్గురు కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని కెకె రాజు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే కూటమి ప్రభుత్వ ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను విడతలవారీగా ప్రైవేటు పరం చేస్తున్నారని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు.కేంద్రంలో చక్రం తిప్పుతానని, డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ చంద్రబాబు చేతులెత్తేశాడని ఆయన ధ్వజమెత్తారు. త్వరలోనే కేకే లైన్ను విశాఖ డివిజన్లో కలిపేలా వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే కూటమి నాయకులు కలిసి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉత్తరాంధ్రకు ద్రోహంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. విశాఖలోని వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెడుతూ ఒకపక్క, కేంద్రం నుంచి సాధించాల్సిన ప్రాజెక్టుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ మరోపక్క ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని పణంగా పెడుతున్నాడు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేసేలా కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుటనే చెప్పారు.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా అటకెక్కించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని విడతల వారీగా ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు అంగీకరించాడు. విశాఖ మెట్రో ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారు. ఇప్పుడు విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరించారు. మాది డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నా, కూటమి వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని బాకాలు ఊదుతూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాడు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిని పట్టించుకోరనే కుట్రతో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచీ ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నాడు. విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. రైల్వే జోన్ విభజనతో ఈ విషయం మరోసారి రుజువైంది.ఉత్తరాంధ్రకు తీరని నష్టంవిశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రయోజనాల సాధనలో సీఎం చంద్రబాబు వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసినా సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు చోద్యం చూస్తూనే ఉన్నారు. అరకుతోపాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను విశాఖ జోన్ కోల్పోయినా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తవలస- కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖ రైల్వే జోన్ను కేంద్రం ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోలేదు.రైల్వే ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగా విశాఖ రైల్వే డివిజన్కి తీరని అన్యాయం జరిగింది. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. ఈ రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. ఈ డివిజిన్లు విభజించిన విధానం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా ఎంపీలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం దారుణం.నాడు వైఎస్సార్సీపీ ఒత్తిడితో విశాఖ రైల్వే జోన్వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని నాడు వైయస్సార్సీపీతోపాటు వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు డిమాండ్ చేశాయి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వైయస్సార్సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో ప్రకటించింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస-కిరండోల్ సెక్షన్తోపాటు పలాస - ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించి ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో విశాఖ డివిజన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాకపోగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.ఉద్యమ కార్యాచరణతో ముందుకు..విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటాలు చేసింది. గతంలో మా పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కేకే లైన్తో కూడిన విశాఖ డివిజన్ ఏర్పాటుచేయడంతో పాటు రాయగడ డివిజన్లో కలిపిన ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ డివిజన్లోనే కొనసాగించేలా వైయస్సార్సీపీ పోరాడుతుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేకే లైన్ను విశాఖ డివిజన్లో చేర్చడానికి వైయస్సార్సీపీతో కలిసి ఉద్యమించాలి. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారమే రైల్వే జోన్ విషయంలో కేంద్రం ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై త్వరలోనే పక్కా ప్రణాళికలతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. -
వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
సాక్షి, తాడేపల్లి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సాల్మన్ ఉదంతాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు. పిన్నెల్లి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు జగన్ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను ఓదార్చిన జగన్.. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అక్రమ కేసులు పెడతామని టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించారనే విషయాన్ని గ్రామస్తులు జగన్కు తెలియజేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారాయన. ఎవరూ భయపడవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని.. పార్టీ తరఫున లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. పిన్నెల్లి గ్రామస్తుల వెంట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.చల్లా నాగరాజుకు భరోసా.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చల్లా నాగరాజు.. 2024 అక్టోబర్లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్కు వివరించాడు. రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. నాగరాజు పరిస్థితికి చలించిపోయిన వైఎస్ జగన్.. పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమ్మమక్కల్ మున్నేట్రకళగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయేలో చేరారు. పళనిస్వామితో విభేదాలు కారణంగా గతంలో ఎన్డీయే నుంచి దినకరన్ వైదొలిగారు. బుధవారం ఆయన బీజేపీ తమిళనాడు ఇంఛార్జ్ పీయూష్గోయెల్ను కలిశారు. డీఎంకే ఓడించగల శక్తి ఎన్డీయేకి మాత్రమే ఉందని దినకరన్ అంటున్నారు. అమ్మమక్కల్ మున్నేట్రకళగం ఎన్డీయే కూటమిలో చేరికపై డీఎంకే నేతలు స్పందిస్తూ.. తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.గతంలో కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దినకరన్.. గత కొంతకాలంగా నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను పొగుడుతూ వచ్చారు. విజయ్ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగింది. టీవీకేతో చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఇంతలోనే విజయ్ పార్టీకి దినకరన్ షాక్ ఇచ్చినట్లయ్యింది.కాగా, బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్డీయే కూటమి సీట్ల పంపకాల లెక్కను తేల్చేదిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇవాళ (జనవరి 12 బుధవారం) ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఇక ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. బీజేపీరాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్, కో ఇన్చార్జ్లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్చార్జ్గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాం మెహా్వల్, సివిల్ ఏవియేషన్ కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ ఇప్పటికే రంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో సంప్రదింపు ముగించారు.ఇక కూటమిలోకి వచ్చే పార్టీలతో సంప్రదింపును విస్తృతం చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలోకి ఇప్పటికే అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే అధికారికంగా చేరింది. ఇక జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చి, రవి పచ్చ ముత్త ఐజేకే వంటి పార్టీలతో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తాజాగా ఎన్డీఏలో ఉన్నప్పటికీ సీట్ల పందేరం విషయంగా చర్చలలో మునిగి ఉన్నాయి.అదే సమయంలో అమ్మమక్కల్ మున్నేట్రకళగం (AMMK) టీటీవీ దినకరన్ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునే దిశగా పీయూష్ గోయల్ ప్రయత్నాలు ఫలించాయి. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్రకళగం ఎన్డీయేలో చేరింది.ఈనెల 23వ తేదీన మధురాంతకం వేదికగా జరిగే సభలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే చోట చేర్చే విధంగా, ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రకటించే విధంగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు అవుతుండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మదురాంతకంకు పీఎం వెళ్లనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. మోదీ సమక్షంలో ఎన్డీఏ కూటమిని ప్రకటించేందుకు తగ్గట్టుగా పీయూష్ గోయల్ స్థానికంగా తిష్ట వేసి రచిస్తున్న వ్యూహాలన్నీ ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో శుక్రవారం తేలనున్నది. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామితో పోన్ ద్వారా ఎప్పటికప్పుడు పీయూష్ చర్చలు జరుపుతూ వస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ‘‘ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు.‘‘ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోము. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి.ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం.ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ,… https://t.co/gHtfUrCENN— KTR (@KTRBRS) January 21, 2026 -
ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపే చూస్తున్నారు. కేడర్ అంతా.. తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్, కారుమూరి సునీల్, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను.ప్రశ్నిస్తే కేసులు పెడతారా?..ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందిజగన్ ఉన్నప్పుడే బాగుండేది, ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు. చెప్పింది చేసే వాడు. మాట నిలబెట్టుకునేవాడు. అన్నీ ఇచ్చేవాడు అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నా ప్రజలను ఇబ్బందిపెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు. మరోవైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూల్స్ పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూల్స్, ప్రైవేటు పాఠశాలతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.కూటమి పాలనలో సంక్షేమం సున్నా.. నాడు మన హయాంలో గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు. ఇక, ఫీజు రీయింబర్స్మెంట్ ఎనిమిది క్వార్టర్లు పెండింగ్లో పెట్టారు. రూ.5600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన కింద రూ.2200 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్య శ్రీ కనుమరుగు చేశారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్ టైమ్లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశపెడితే.. వాటిని ఇవాళ పడకేయించారు. ఇప్పుడు టీడీపీకి, డాక్టర్ల వింగ్కు చెందిన వారికి సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్ చేస్తే, మూడు గంటలైనా రావడం లేదు.ప్రైవేటుకు ప్రభుత్వ జీతాలా?మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో పెద్ద కుంభకోణానికి తెరతీశారు. మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తైన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడమే కాకుండా, రెండేళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారట. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. ఇంకా నిర్వహణ ఖర్చు ప్రభుత్వానిది. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి వెళ్తాయి. ఇలాంటి స్కామ్కు పాల్పడిన వారిని, మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం కాగా, తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలను కూడా నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అదే అనుకుంటే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?. అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతు నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరపున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి’ అని అన్నారు. -
అవిముక్తేశ్వరానందకు అనూహ్య మద్దతు
ప్రయాగ్రాజ్ మాఘమేళా ఎపిసోడ్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్యోతిర్మఠ శంకరాచార్యుడు స్వామి అవిముక్తేశ్వరానందను పోలీసులు పవిత్ర స్నానం చేయనివ్వకుండా అడ్డుకున్న సంగతి దుమారం రేపిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ విషయంలో యోగి సర్కార్తో అవిముక్తేశ్వరానంద ఓపెన్ చాలెంజ్కు దిగారు. ఈ తరుణంలో ఆయనకు అనూహ్య మద్దతు లభించింది.కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవిముక్తేశ్వరానందను ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది. అయోధ్యలో నిర్మాణం పూర్తికాకుండానే ఆలయాన్ని ప్రతిష్టించడం తప్పని ఆయన అన్నారు. మహా కుంభమేళా నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలియాడడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని యూపీ బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అని కాంగ్రెస్ అంటోంది.చాలామంది బీజేపీని కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీగా భావిస్తారు. కానీ ఇప్పుడది హిందూ మతానని వదలడం లేదు. ఒక హిందూ సన్యాసినిని అవమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కారణంగా.. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి పవిత్ర స్నానానికి దూరంగా ఉన్నారు. మొఘలులు, బ్రిటీషర్ల కాలంలోనూ ఇలా జరగలేదు. హిందువుల రక్షకులమని చెప్పుకునే ప్రభుత్వం ఇలాంటి పని చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. అవిముక్తేశ్వరానంద కంటే మోహన్ భగవత్ గొప్పవారా?.. ఆయనకేమో జెడ్ప్లస్ సెక్యూరిటీ నడుమ పుణ్య స్నానాలు చేయించి.. ఈయన్నేమో అడ్డుకుంటారా?. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారాయన.తిట్టిన వ్యక్తే..అవిముక్తేశ్వరానంద గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2024లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ మండిపడింది. ఆ సమయంలో అవిముక్తేశ్వరానంద ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రసంగాన్ని వక్రీకరించారని, నిజానికి రాహుల్ “హిందూ మతం హింసను తిరస్కరిస్తుంది” అని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే..2025 మే నెలలో మనుస్మృతిని రాహుల్ గాంధీ అవమానించారని చెబుతూ.. హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో శంకరాచార్య మఠం నోటీసు ఇచ్చినా రాహుల్ స్పందించలేదని, క్షమాపణ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది.. జనవరి 16వ తేదీన హిందువులను దూషించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదని.. ఆయన వస్తే గనుక అడ్డుకోవాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కోరారు. ఈలోపు.. ఆ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు మద్దతు ప్రకటించడం గమనార్హం.అసలేం జరిగింది.. ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి 46వ శంకరాచార్యుడు(స్వయం ప్రకటిత) స్వామి అవిముక్తేశ్వరానందను మాఘమాసి అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి తన అనుచర గణంతో రథంపై వచ్చారు. అయితే రథం దిగి నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు అభ్యంతరాలు చెప్పారు. అలా మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. పోలీసులు సాధువుల మధ్య తోపులాట జరిగింది. ఆ గొడవలో రథాన్ని నదీ సంగమానికి దూరంగా తీసుకెళ్లారు. అలా అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయలేకపోయారు.ఆయనతో పాటు 200–300 మంది భక్తులు ఉన్నారని.. అనుమతులు లేవని.. భద్రతా సమస్యల దృష్ట్యా అడ్డుకోవాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకున్నాయి. అయితే ఇది శంకరాచార్యుడి హోదా వ్యక్తికి జరిగిన అవమానమంటూ అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారాయన.అవిముక్తేశ్వరానందకు నోటీసులుజ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానందకు మాఘమేళ నిర్వాహకులు షాకిచ్చారు. నిజమైన శంకరాచార్యా అవునా కాదా అని 24 గంటల్లోగా నిరూపించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాఘ మేళ వద్ద అవిముక్తేశ్వరానంద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపును ఓ అధికారి వెళ్లి నోటీసులు అందించారు.సుప్రీం కోర్టులో వివాదం..ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ శంకరాచార్య స్థానంపై దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. 1989 ఏప్రిల్ 8వ తేదీన స్వరూపానంద సరస్వతి తనకు తాను శంకరాచార్య అని ప్రకటించుకున్నారు. అయితే 1989 ఏప్రిల్ 15వ తేదీన ఆ పీఠానికి చెందిన వసుదేవానంద సరస్వతిని వారసుడిగా శతానంద ప్రకటించారు. దీంతో ఆ పీఠానికి ఇద్దరు పీఠాధిపతులు కొనసాగారు. 2022 సెప్టెంబర్లో స్వరూపానంద సరస్వతి పరమపదించారు. ఆ మరుసటి రోజే తానే శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. కానీ అదే ఏడాది అక్టోబర్లో ఆయనపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవర్నీ శంకరాచార్యగా ప్రకటించరాదు అని, పట్టాభిషేకం కూడా నిర్వహించరాదని.. ఆ పోస్టును ఎవరూ ఆక్రమించరాదని కోర్టు స్పష్టం చేసింది.అయితే.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాఘమేళ క్యాంపు వద్ద శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద బోర్డు పెట్టుకున్నారని.. అందుకే నోటీసులు ఇచ్చామని మాఘమేళ అధికారులు చెప్తున్నారు. -
రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటా
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నోటీసుల్లో పస లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వ్యాఖ్యానించారు. విచారణ పేరిట సిట్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తూ ‘అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం’అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ముగ్గురు అధికారులు విచారణ జరుపుతూ మధ్యలో తరచూ బయటకు వెళ్లి ఫోన్లు మాట్లాడారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్రెడ్డి బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయట పెట్టినందుకే నాకు నోటీసులు ఇచ్చారు. సీఎంకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు నాపై ఇదివరకే అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలి. రేవంత్ కుంభకోణాలు కుండబద్ధలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంటా. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు..’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశం తర్వాత హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విచారణలో నేనే పోలీసులకు వంద ప్రశ్నలు వేశా. సమాధానాలు చెప్పలేక వారే ఉక్కిరిబిక్కిరి అయ్యారు.గతంలో నేనేమైనా హోం మంత్రిగా పనిచేశానా? ఫోన్ ట్యాపింగ్ అంశం నాకేం తెలుసు? అప్పటి డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా..’అని హరీశ్ తెలిపారు. కాగా సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా హరీశ్రావు..కేటీఆర్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో నష్ట నివారణకే డైవర్షన్ ‘చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరవుతున్నా. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బొగ్గు స్కామ్తో పాటు వాటాలు పంచుకోవడంలో మంత్రులు తన్నుకుంటున్న వైనాన్ని బయట పెట్టా. మున్సిపల్ ఎన్నికలకు ముందు తమ అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందనే రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్కు, ప్రస్తుతం నాకు నోటీసులు ఇచ్చి ఎన్నికల మీద మేము దృష్టి కేంద్రీకరించకుండా కుట్రలు పన్నుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే విచారణ జరపాలి ఫోన్ ట్యాపింగ్ పేరిట రేవంత్ రెండేళ్లుగా సీరియల్ నడుపుతున్నాడు. ఎంతగా పక్కదారి పట్టించినా బొగ్గు, విద్యుత్, హిల్ట్ కుంభకోణాలను బయట పెట్టడమే కాకుండా, ఆంధ్రాకు అమ్ముడు పోయిన తీరుపై నిలదీస్తాం. కుంభకోణంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి లేఖ రాస్తున్నా. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే రేవంత్ తన బావమరిదితో కలిసి చేస్తున్న కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి. నైనీ బ్లాక్తో పాటు ఇతర టెండర్లు రద్దు చేసి అవినీతిపరులను అరెస్టు చేయాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.హరీశ్రావు నివాసానికి కేటీఆర్ కేటీఆర్ మంగళవారం ఉదయం కోకాపేటలోని హరీశ్రావు నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నేతలు భారీ కాన్వాయ్తో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిట్ విచారణ కోసం వెళ్లేందుకు బయలుదేరిన హరీశ్రావును అనుసరించేందుకు ప్రయతి్నంచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీశ్రావుకు ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్న కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. -
ఎన్డీఏలో భాగస్వామి.. కాంగ్రెస్తో రహస్య కాపురం!
సాక్షి, అమరావతి: టీడీపీని దెబ్బ తీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి అలా మాట్లాడుతున్నారంటే హైకమాండ్, రాహుల్ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ను ఆపించానని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్తో, రాహుల్గాందీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు – రాహుల్ బంధంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి.. టీడీపీని వెనకేసుకురావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి.. టీడీపీ ప్రయోజనాల కోసం తహతహలాడటం, బాధపడటం ఏమిటని విస్తుపోతున్నారు. ‘తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్ఎస్ను, కేసీఆర్ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. బీఆర్ఎస్ వాళ్లు గద్దెలు దిగాలి... ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి..’ అని ఖమ్మం జిల్లాలో రేవంత్రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యల ద్వారా రాహుల్గాంధీ ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్లో ఉంటున్నట్లు నిరూపితమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటునే మరోవైపు కాంగ్రెస్తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనాలని విశ్లేషిస్తున్నారు. ఇక దేశంలో ఓట్ల చోరీ గురించి పదేపదే ఆందోళనకు దిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీ.. 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రి వేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్లు గురించి ఏనాడూ కనీసం నోరు విప్పిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడూ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. బాబు అనైతిక బంధం! రాజకీయ ఊసరవెల్లి నారా చంద్రబాబు మళ్లీ రంగులు మార్చుతున్నారు. ఒక్కోసారి ఒక్కో రంగు మారుస్తూ వచి్చన ఆయన ఈసారి... ఏకకాలంలో విభిన్న రంగులు మారుస్తూ ఊసరవల్లికే అసూయ కలిగిస్తున్నారు. సొంతంగా ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ప్రతి ఎన్నికకు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసగించడం బహిరంగ రహస్యమే. ఈసారి ఆయన తన రాజకీయ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకువెళుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అక్రమ సంబంధం నెరుపుతుండటం విస్మయపరుస్తోంది. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీతో తెరచాటు మైత్రి కొనసాగిస్తున్నారని టీడీపీ వర్గాలు సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్తో చంద్రబాబు తెరచాటు రాజకీయ మంత్రాంగంపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్తో అక్రమ సంబంధం కోసం చంద్రబాబు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. మరోవైపు కాంగ్రెస్తో అంటకాగుతుండటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలుస్తోందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 2018లో బీజేపీతో విడిపోయి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ... మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టినా సరే కాంగ్రెస్తో తెరచాటు మైత్రికి ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్త పడుతోంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు సహకరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. ఇక రేవంత్రెడ్డి తెలంగాణ సీఎం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది. ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని గ్రహించి అనివార్యంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతమాత్రాన కాంగ్రెస్తో బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకోలేదు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ, టీడీపీ భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలో కూడా టీడీపీ ప్రత్యేక ప్రతినిధులు రాహుల్గాందీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు టీడీపీ ఎంపీలు ఎవరూ కూడా కాంగ్రెస్ను విమర్శించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా సాగుతోందన్నది సుస్పష్టం. ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టి..చంద్రబాబు ఇటు బీజేపీతో బహిరంగ మైత్రి... అటు కాంగ్రెస్తో తెరచాటు బంధం కొనసాగిస్తే కొనసాగించుకోవచ్చు. టీడీపీ రాజకీయ వైఖరి ఆ పార్టీ ఇష్టం. కానీ అందుకోసం ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు అత్యంత ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నిలిపివేయడమే అందుకు నిదర్శనం. ఆ విషయాన్ని స్వయంగా రేవంత్రెడ్డి తెలంగాణ శాసనసభలోనే వెల్లడించారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని చంద్రబాబును క్లోజ్డ్ డోర్ మీటింగ్లో కోరా.. ఆయన ఆ పనులను నిలిపివేశారు..’ అని రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఆయన చెప్పింది నిజం కాదని చంద్రబాబు కనీసం ఖండించకపోవడం గమనార్హం. పైగా రాయలసీమ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదంటూ చంద్రబాబు, మంత్రులు దారుణంగా మాట్లాడటం నివ్వెరపరుస్తోంది. తద్వారా రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది! -
హరీష్ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్ విసిరారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
అంతా ఉత్తదే.. సిట్ విచారణపై హరీష్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంతా అటెన్షన్.. డైవర్షనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి అని సవాల్ విసిరారు. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్ చేశాడా? సజ్జనార్ చేశాడా? నాకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమే. ముగ్గురు అధికారులు కలిసి ప్రశ్నించారు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం. నేను ఏమైనా హోంమంత్రినా?. నేను అప్పుడేమైనా హోంమంత్రిగా పని చేశానా?. నేనే వాళ్లకు వంద ప్రశ్నలు వేశాను. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారించాలి. రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టాను. అందుకే నాకు సిట్తో నోటీసులు ఇప్పించాడు. దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించండి. బొగ్గు కుంభకోణానికి కింగ్పిన్ రేవంత్ బావమరిదే. తప్పు చేయకపోతే రేవంత్ బావమరిదిపై విచారణకు ఆదేశించాలి. సీఎం, మంత్రుల మధ్య వాటాల పోరాటం రోడ్డు మీదకు వచ్చింది. మేము అన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. రేవంత్ నిజాయితీపరుడైతే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి.చిల్లర రాజకీయాలే.. రేవంత్ చిల్లర రాజకీయాలపై మాకు అసహ్యం వేస్తోంది. ఎన్ని సిట్ నోటీసులు పంపినా భయపడేది లేదు. సిట్ విచారణపై లీకులు ఇస్తారు.. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్ చేశాడా? సజ్జనార్ చేశాడా? నాకు తెలియదు. మాకు అరెస్ట్లు, పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వ్యవహారం అంతా అర్థం అవుతోంది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. మీవన్నీ కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలే. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు నడవవు. విచారణ పేరుతో సమయం వృథా చేశారు. మీరు ఇచ్చిన నోటీసులు గౌరవంగా భావిస్తాం. ఎన్నిసార్లు సిట్ అధికారులు పిలిచినా వస్తాను. విచారణకు సహకరిస్తాను అని తెలిపారు. ముగ్గురి మధ్య వాటాల పంచాయితీ.. సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినోళ్ళం. సిట్ నోటీసులు రాగానే పారిపోయేవాళ్లం కాదు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నా సిగ్గు రావటం లేదు. రేవంత్ భాష, మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ తయారుచేసిన సైనికులం. రేవంత్ మాదిరి వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు. దర్యాప్తు పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. బొగ్గు కుంభకోణంపై విచారణ జరుపుతాం అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సిట్ అధికారులు.. హరీష్ను దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం, హరీష్ రావు నేరుగా తెలంగాణభవన్కు చేరుకున్నారు. పార్టీ నేతలను కలిసి చర్చించారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎంతటి వారున్న శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై హరీష్ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ ఏమీ తెలియదు. టెలిగ్రాఫిక్ యాక్టు చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కేటీఆర్కు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు. నా ఫోన్, షబ్బీర్ అలీ ఫోన్ సహా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలు విన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. మహిళా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూశారు. తప్పు చేశారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ వేధింపులు కానే కాదు, వేధింపులకు పాల్పడాలంటే రెండేళ్ల వరకు ఎందుకు వేచి చూస్తాం. అప్పుడే జైలుకు పంపే వాళ్లం అని వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘గతంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని నన్ను కూడా విచారణకు పిలిచారు. నా కుటుంబ సభ్యులు, మా ఇంటి వాచ్మెన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయంలో నాపైనే అధికంగా కేసులు పెట్టారు. గాంధీభవన్ లోపలికి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. -
టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ రుణాలు మంజూరు అయ్యేవి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్గా ఏపీని మార్చారు.కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావును సిట్ ప్రశ్నిస్తోంది. ఐదు గంటలుగా హరీష్ను విచారిస్తున్నారు. హరీష్ రావు ఆరోగ్యం పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ విచారణకు న్యాయవాదులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు విచారణ వీడియో విడుదల చేయాలని కోరారు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. హరీష్ను ప్రశ్నిస్తోంది. తనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల ఉత్తర్వులను సిట్కు హరీష్రావు అందజేశారు. -
పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పెట్టుబడుల పేరుతో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని, కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తున్నది మాత్రమే నిజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్రెడ్డి అన్నారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగస్ అని, లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయన చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తమను తాము పొగుడుకోవడానికో, వైఎస్ జగన్ని తిట్టడానికే దావోస్ వెళ్లడం దేనికని సతీష్ రెడ్డి మండిపడ్డారు.పక్క రాష్ట్రం తెలంగాణలో భూములను వేలం వేసి మరీ కంపెనీలకు అప్పజెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం దోపిడీకాక ఇంకేమిటని ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. మా ఇష్టం నేనిస్తా అని చెబుతున్న నారా లోకేష్కి అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి నిరంకుశ నియంత పోకడలతోనే ఫ్రెంచి విప్లవం పుట్టిందనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం అనుకూల మీడియాలోనే తీవ్రమైన వ్యతిరేక కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నారా లోకేష్కి అధికార మదం తలకెక్కిందికూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటనలు చేసే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి తమను తామే పొగుడుకోవడం, వైఎస్ జగన్ని తిట్టడం తప్ప, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం శూన్యం. 2014-19 మధ్య జరిగిందే ఇప్పుడూ జరుగుతోంది. లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ఎల్లో మీడియాలో ఇబ్బడిముబ్బడిగా రాయిస్తారే కానీ, వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు మాత్రం ఎప్పటికీ చెప్పరు.కానీ వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన పరిశ్రమలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసి తామే సాధించినట్టుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం వైఎస్ జగన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎంగా చంద్రబాబు రూ.23 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకుంటే వాటిలో కార్యరూపం దాల్చినవి 5 శాతం కూడా లేవు. పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీల ఏర్పాటు పేరుతో ఊరూపేరులోని కంపెనీలకు విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99పైసలకు కట్టబెడుతున్నారు.తెలంగాణలో ప్రభుత్వ స్థలం ఓపెన్గా వేలం వేసి ఎకరం రూ.170 కోట్లకు విక్రయిస్తుంటే, చంద్రబాబు మాత్రం పెట్టుబడుల పేరుతో తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు. భూ పంపిణీ రూపంలో ఏడాదిన్నరలోనే చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అప్పనంగా భూములు కట్టబెట్టడంపై జర్నలిస్టులు నారా లోకేష్ని ప్రశ్నిస్తే.. విమర్శలకు సమాధానం చెప్పకుండా నా ఇష్టం, నేనిస్తా అంటున్న నారా లోకేష్ అహంకారాన్ని ప్రజలే దించుతారు. అప్పనంగా ఇచ్చుకోవాలంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకో, ప్రజల సంపదను దోచిపెట్టడానికి నారా లోకేష్ ఎవరు?విదేశీ పర్యటనను రహస్యంగా ఎందుకు ఉంచారు?ప్రైవేట్ కార్యక్రమం అంటూనే నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి జరుపుకున్న సంక్రాంతి సంబరాలను టీవీల్లో లైవ్ ఇచ్చుకున్న చంద్రబాబు, వారం రోజులు తండ్రీకొడుకులు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? కనీసం ఏ దేశానికి వెళ్లిందీ ఎందుకు చెప్పలేదు? పర్యటన వివరాలను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా బాధ్యతమరిచి వ్యవహరించడంపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి.రాష్ట్రంలో దోచుకుంటున్న అవినీతి సంపదను పెట్టుబడుల రూపంలో దాచుకోవడానికే విదేశీ పర్యటనలు చేశారని ప్రజలంతా అనుకుంటున్నారు. దీనికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పి తీరాల్సిందే. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో సైతం ప్రభుత్వ పెద్దల అవినీతిపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజనీతి అనే టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్లో రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఐఏఎస్ అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అభియోగం మోపారు. ఈ 19 నెలల కూటమి పాలనలో ఒక్కో అధికారి రూ. 300 నుంచి రూ. 500 కోట్ల వరకు దోచుకున్నాడని అందులో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.నిజాయితీ ఉంటే టీడీపీ మీడియా చేసిన ఆరోపణలకైనా చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబే ఐఏఎస్ అధికారుల సమావేశంలో స్వయంగా ఒప్పుకున్నాడు. చంద్రబాబే దోపిడీకి డోర్లు బార్లా తెరవడంతో ఆయన బాటలోనే కూటమి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి సంబరాలను సైతం దోపిడీ మార్గంగా మార్చకున్నారు.కోడి పందేలకు బరులు ఏర్పాటు చేసి కేసినోల తరహాలో పేకాట ఆడించి మద్యం ఏరులై పారించారు. కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకుతిన్నారు. కూటమి ప్రభుత్వం లాంటి విధానాలను అవలంభించడం వల్లనే ఆనాడు ఫ్రెంచి విప్లవం వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి జరిగితే నేనే అని, అవినీతి జరిగితే పక్కనోళ్ల మీదకు నెట్టే చంద్రబాబు విధానం మార్చుకోవాలని సతీష్ రెడ్డి హితవు పలికారు.


