వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ, పల్నాడు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటన.. తదితర అంశాలపై పలు కీలక విషయాలను ఆయన వివరిస్తున్నారు.
జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు
ఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుంది. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారాయన
రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదు
భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడూ రాలేదు
రీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చింది

రైతన్నలు లేవనెత్తిన సమస్యల నుంచి పరిష్కారమే రీసర్వే
మేం అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరు
భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదు
సవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే రీసర్వే
22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు
- వందేళ్ల కిందట బ్రిటీషర్లు భూ సర్వేలు చేశౠరు
- మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టాం
- చెప్పినట్లుగానే.. 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టాం
- సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ప్రారంభించాం
- భూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం
- వివాదాలు లేని విధంగా పాదర్శకంగా భూములు రీసర్వే చేశాం
- రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించాం
- భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం
- ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాం
- అడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్లు ఇచ్చాం.. ఆ పాస్బుక్కుల్లో క్యూఆర్ కోడ్ పెట్టాం
- నాలుగుసార్లు సీఎంగా ఉండి.. 80 పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?
- చంద్రబాబు ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?
- సమగ్ర సర్వే చేసిన మేం చేసిన ప్రతీది రికార్డే.. ఇది ఎవరూ తుడిచిపెట్టలేనిది
- భూముల రీసర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది
- సర్వేకుగానూ కేంద్రం మా ప్రభుత్వానికి ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చింది
- కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు
- మహరాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు
- అసోం కూడా మా సహకారం కోరింది
- సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేం చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారు
- చంద్రబాబుది రాక్షస పాత్ర.. ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షస పాత్ర
- ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రైతులను భయపెట్టారు
- దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు
- నిజాలను ఎంతో కాలం దాచిపెట్టలేరు


