breaking news
YSRCP
-
డబ్బా కొట్టుకొనే డబ్బా రాయుళ్లు.. అఖండ2 పై సెటైర్లు
-
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం.. వైఎస్సార్సీపీ పోరాటం.. తుది అంకానికి చేరుకున్నాయి.. -
వల్లభనేని వంశీని కలిశారనే కోపంతో..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
బాబుకు దిమ్మతిరిగేలా YSRCP భారీ ర్యాలి..
-
వాళ్ల మొహం కూడా చూడం.. ఊళ్లోనే ఉండం!
వేంపల్లె: వైఎస్సార్సీపీకి ప్రజా మద్దతు మరోసారి స్పష్టమైంది. మూడు కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)తో పాటు టీడీపీ నాయకులు గ్రామంలోకి అడుగుపెట్టగానే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. ఆ గ్రామాన్నే వదిలివెళ్లిన ఘటన వైఎస్సార్జిల్లా వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో చోటుచేసుకుంది. నిరసనను అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ చర్యలు స్థానికులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దేశం కుతంత్రాలకు సమాధానం గత కొన్నేళ్లుగా వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న గ్రామస్తులను రాజకీయంగా చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు తెరలేపుతూ అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్రెడ్డితో పాటు మరో రెండు కుటుంబాలను టీడీపీలోకి చేర్చుకునేందుకు బీటెక్ రవి తదితర టీడీపీ నాయకులు గ్రామానికి వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే విందులో గ్రామంలోని ప్రజలంతా పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసులనూ ఇందుకు వినియోగించుకున్నారు. ఈ రాజకీయ కుతంత్రాలకు గ్రామస్తులు గట్టి సమాధానం చెప్పారు. టీడీపీ నాయకుల ముఖాలను కూడా చూడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరును ఖాళీ చేశారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ వద్ద వైఎస్సార్సీపీకి సంఘీభావంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని పోలీసులు అంతక్రితం గ్రామస్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేదంటూ విందును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు లెక్కచేయలేదు. ఈ ఘటనతో టీడీపీ నాయకులకు తీవ్ర అవమానం ఎదురైంది. గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రవిసహా ఇతర అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఇదిలావుండగా టీడీపీ నాయకులు, పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీలోనే ఉంటామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడుతోందనడానికి అమ్మగారిపల్లె ఘటనే రుజువు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. – ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
జగనన్న 2.0 పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు గంటమస్తాన్ వీధిలో అనుబంధ విభాగాల కోర్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ వార్డు నాయకులు బండల మురళి, చంద్రమౌళిల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అనుబంధాల కోర్ కమిటీ సమావేశాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రతి నాయకులు, కార్యకర్త సైనికుల్లా పనిచేస్తేనే కూటమి నాయకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చునన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వార్డులోని ప్రజలకు వివరించాలన్నారు. 2.0 జగనన్న పాలనలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే పదవులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కమిటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సోపాల వీరా, కనక, సంపత్, దశరథరామిరెడ్డి, రత్న, కిశోర్, మాబ్జాన్, బాషా, వినోద్, రమేష్, బాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. వేముల : గొందిపల్లె సమావేశంలో మాట్లాడుతున్న మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి , పెద్దముడియం : బీటిపాడులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పులివెందుల రూరల్ : గ్రామస్థాయి కమిటీలతో వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బలరామిరెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బాల గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్రెడ్డి, బాల ఓబుళరెడ్డి, గంగిరెడ్డి, చిన్న, మస్తాన్, ఎంపీటీసీ గంగన్న, రవీంద్రారెడ్డి, గుండాలయ్య, చంద్రమోహన్రెడ్డి, రామకృష్ణ, సూర్యుడు, రామచంద్ర, మనోహర్, వేణుగోపాల్ యాదవ్, రమేష్, అర్జున్, కృష్ణయ్య, రఫి, రజాక్, కొత్తపల్లె గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. లింగాలలో.. లింగాల : ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతోంది. కమిటీలు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోనాల గ్రామంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కమిటీలు అహరి్నశలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, అబ్జర్వర్ పి.శ్రీనివాసులరెడ్డి, ఐటీ వింగ్ సుదర్శన్రెడ్డి, సోషల్ మీడియా సుమంత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బోనాల గ్రామ నాయకులు, సర్పంచ్ రాము కార్యకర్తలు పాల్గొన్నారు. వేములలో.. వేముల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పటిష్టతకు సంస్థాగత కమిటీలతో గ్రామస్థాయి నుంచే శ్రీకారం చుట్టారని ఆ పార్టీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకటబయపురెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గొందిపల్లె గ్రామంలో శనివారం సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే సంస్థాగత కమిటీలే పారీ్టకి పట్టుకొమ్మలన్నారు. గ్రామాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై గ్రామ సమస్యలతోపాటు పార్టీ పటిష్టతపై చర్చించుకోవాలన్నారు. రాబోవు కాలంలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలలో సంస్థాగత కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.0 పాలనలో కమిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, గంగిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్రెడ్డి, నాగేంద్రారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాష్రెడ్డ, శేషారెడ్డి, దేవేంద్రారెడ్డి, రామాంజనేయులు, ముసలయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురంలో.. సింహాద్రిపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో శనివారం సింహాద్రిపురం మండలం సుంకేసుల, బి.చెర్లోపల్లె, లోమడ గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అబ్జర్వర్లు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, నీలవర్థన్రెడ్డి, కె.భాస్కర్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ప్రసాద్రెడ్డి, లోమడ వైఎస్సార్సీపీ నాయకులు పవన్ చంద్రారెడ్డి, హృషికేశవరెడ్డి, జనార్థన్రెడ్డి, బషీర్, జయచంద్రారెడ్డి, దేవపుత్రారెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజబాబు, వి.రాజా, వీరప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, భరత్రెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి, భార్గవ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, రామకోటిరెడ్డి, సోమశేఖరరెడ్డి, చంద్రమౌళి, వివేకానందరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, పార్థసారథిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, సురేష్, షబ్బీర్, మనోహర్రెడ్డి, కృపాకర్రెడ్డి, శాలివాహనరెడ్డి, శంకర్రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, రాజశేఖరరెడ్డి, హాజివలి, గోవర్థన్రెడ్డి, తిరుమన్రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో.. జమ్మలమడుగు : గ్రామ కమిటీలే పారీ్టకి బలమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దముడియం మండలంలోని బీటిపాడు, పాపాయపల్లె గ్రామాల్లో గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గ్రామ స్థాయి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ విష్ణువర్థన్రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షుమయ్య, రామలింగేశ్వరరెడ్డి, చౌడయ్య, వెంకటరామిరెడ్డి, గిరీష్రెడ్డి, విశ్నాథ్రెడ్డి, పాపాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, చిట్టేపు విశ్వనాథ్రెడ్డి, రెండు గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. వీరపునాయునిపల్లెలో వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు గ్రామంలో గ్రామ కమిటీ అనుబంద విబాగాల కమిటీలు సర్పంచు వెంకటేసు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, స్థానిక నాయకులు గోపాల్రెడ్డి, రమేష్రెడ్డి, నందకుమార్రెడ్డి, రాంబాబు. జగన్, వీరపునాయునిపల్లె ఎంపీటీసి రాఘవ యాదవ్, వెంకటరామిరెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసుల్రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరంలో.. మైలవరం : వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాలను గ్రామాలలో ఎగరడంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకుందామని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొమెర్ల, కర్మలవారిపల్లె గ్రామ పరిధిలో ఉన్న గ్రామాల కార్యకర్తలతో ఆయన గ్రామ సభను నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో వైఎస్సార్సీపీ మరింత బలం పెరగాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త మన ప్రభుత్వంలో చేసిన పనిని, ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు, అమలు కాని హామీల గురించి వివరించాలన్నారు. కష్టపడిన ప్రతికార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచిగుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివగుర్విరెడ్డి, రామాంజనేయుల యాదవ్, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లెలో.. వేంపల్లె : మండలంలోని గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, వేంపల్లె 5వ ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ కమిటీ నియామక కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మునీర్బాషా, రవిశంకర్గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, మణిగోపాల్రెడ్డి, కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, నిస్సార్ బాషా, ఎంపీటీసీ ఎం.హెచ్.హబీబుల్లా, బండల షుకూర్, బీఎస్ షేక్షావలి, సురేంద్ర, ముత్యాల రమేష్బాబు, మల్లయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కారు కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్ను తప్పించారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు. బాబు ప్రభుత్వం రాగానే కుట్ర చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు. మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్ను జైలుపాలు చేశారు. మేయర్ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్లో మేయర్కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
రెడ్జోన్లో కూటమి 80 శాతం ఎమ్మెల్యేలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్మెంట్పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు. -
ఇదిగో మీ 2,270 రూపాయల బ్యాగ్.. కమిషన్ కి కక్కుర్తి పడితే ఇలానే ఉంటుంది
-
ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు..?
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.సాక్షి పొలిటికల్ టాస్్కఫోర్స్: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్ కట్ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్బై చెప్పి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ.. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ రంగప్రవేశంతో సీన్ రివర్స్ వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు. క్యాషే.. క్యాషునిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్ రంగప్రవేశంతో వీరికి డిమాండ్ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్కు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు. -
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పచ్చ పోలీసులు..!
-
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్), జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్చైర్మన్లు , జెడ్పీటీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు. -
నీ గురించి మా ఊర్లో గొర్రెలు కాసేవాడైన... వాళ్ళ నాన్న గురుంచి పవన్ వ్యాఖ్యలపై సతీష్ రెడ్డి నాన్ స్టాప్ సెటైర్స్
-
Ravi Chandra: విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?
-
Rachamallu : రాసిపెట్టుకోండి..! జరగబోయేది ఇదే
-
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుపతి: వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎస్కే నజీర్ బాషా కిడ్నాప్కు గురయ్యారు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నజీర్ బాషా నెల్లూరు 34 వార్డు కార్పొరేటర్ ఫమిదా తండ్రి.నిన్న వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేటర్ ఫమిదా వైఎస్సార్సీపీలో చేరారు. నిన్న రాత్రి(డిసెంబర్ 12, గురువారం) పథకం ప్రకారమే నజీర్ బాషాను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. వాకాడు పోలీసులకు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేశారు. -
దెబ్బకు జ్వరం పుట్టించాం అధికారం ఉండి క్యాంపు రాజకీయాలు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్ని డైరెక్టర్గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఏ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టారో అదే స్టేషన్ లో... పోలీసులకు వార్నింగ్
-
సీపీ బ్రౌన్ వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని.. తన మాతృ భాష కంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో.. కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు’ అని ప్రశంసలు కురిపిస్తూ పోస్టు చేశారు. భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని, తన మాతృ భాషకంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్ గారు. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన… pic.twitter.com/uwUwlZQfzm— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2025 -
సింగపూర్, జపాన్, జర్మనీ ఎక్కడ.. అమరావతిని చూస్తే రక్తం మరిగిపోతుంది
-
ఒరేయ్ పనికిమాలిన వెధవ.. YSRCP వదిలి టీడీపీలోకి వెళ్లిన MPTC లకు చెప్తున్నా
-
కార్పొరేటర్ రవిచందర్ కిడ్నాప్.. YSRCP ఆందోళన
-
మాధవి రెడ్డికి చెంపపెట్టు.. టీడీపీకి ఎదురుదెబ్బ
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవాను చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కుయుక్తులు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైఎస్సార్సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. కడపలో మరోమారు సత్తా చాటుకున్న వైఎస్సార్సీపీ కడప నగరపాలక సంస్థ మేయర్ను అనైతికంగా తొలగించిన చంద్రబాబు కూటమి సర్కారు.. మేయర్ పదవిని చేజిక్కించుకొనేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్సార్సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్సార్సీపీ సొంతమైంది. కడప మేయర్గా 47వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో, చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కడప మేయర్గా ఉన్న సురేష్బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. కడప మేయర్ పాకా సురేష్ టీడీపీకి ఒకే కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను ఎంపిక చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్ షఫీ బలపర్చారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్రెడ్డి ప్రమాణం చేయించారు. ఏకగ్రీవంగా ఎంపీపీలు వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండల ప్రజాపరిషత్ అ«ధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన శరవణ ఎన్నికయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీకి అభ్యర్థి, బీసీ సామాజికవర్గానికి చెందిన జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిండ్ర, విజయపురంలో దౌర్జన్యమే గెలిచింది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగిన రెండు ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏర్పేడు ఎంపీపీ గీత రాజీనామా, ముసలిపేడు ఎంపీటీసీ రమణమ్మ మృతితో 14 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. వీరిలో పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ కావడంతో ఆమెకే పదవి దక్కాలి. అయితే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి ప్రత్యేక శిబిరంలో దాచారు. గురువారం ఉదయం 11 గంటలకు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. వారు టీడీపీ కండువాలతో ఎన్నికలో పాల్గొన్నారు. పంగూరు ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో మిగిలిన 5 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థి పి.ఆదిలక్ష్మి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు ఎమ్మెల్యే సు«దీర్ రెడ్డి టీడీపీ కండువా కప్పడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి. ఎంపీపీగా గెలవాలంటే ఐదుగురి మద్దతు అవసరమౌతుంది. అధికార పార్టీ అంగబలం, అధికార బలం, దౌర్జన్యం ప్రదర్శించినా రెండు మండలాల్లోనూ నాలుగు ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించారు. విజయపురంలో వైఎస్సార్సీపీ తరఫున మంజు బాలాజి, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీచేశారు. నిండ్రలో వైఎస్సార్సీపీ తరఫున విజేష్, టీడీపీ మద్దతుతో ఇండిపెండెడెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి పోటీ పడ్డారు. అధికారుల చేతివాటంతో లాటరీలో విజయపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్రెడ్డి ఎంపీపీలుగా ఎంపికయ్యారు. నా పేరే వచ్చింది ఎన్నికల అనంతరం విజయపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంజు బాలాజి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించారని, డిప్లో తన పేరే వచ్చిందని, అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్లు చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, కోర్టుకు వెళతానని తెలిపారు. నిండ్ర, విజయపురంలో అధికారుల దుర్మార్గంపై కలెక్టర్కు ఫిర్యాదు నిండ్ర, విజయపురం ఎంపీపీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) కూటమి నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయా మండలాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు గెలిస్తే ఆర్వోలు మరొకరు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. ఎమ్మెల్యే పీఏలు ఎన్నికల కేంద్రాల్లోకి ప్రవేశించారని, అభ్యర్థులను, ఎంపీటీసీలను మాత్రం లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పిల్లల చేత లాటరీ తీయించకూడదని, అయినా ఓ చిన్న పాపకు ముందుగా గుర్తులు చెప్పించి లాటరీ తీయించారని తెలిపారు. బహిరంగంగా నిర్వహించాల్సిన లాటరీ ప్రక్రియను గుట్టుగా చేశారని చెప్పారు. మరొక ఆర్వో ఒకే వ్యక్తి పేరును ఐదు చొప్పున రాసి లాటరీ తీశారని తెలిపారు. ఆర్వోలతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి, ఎంపీపీ ఎన్నికల వీడియోలను శుక్రవారం మధ్యాహ్నం లోగా పంపాలని ఆదేశించారు. బెదిరింపులకు బెదరని కళ్యాణదుర్గం కౌన్సిలర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బెదరలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 11 మంది వైఎస్సార్సీపీ, 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. మిగిలిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారు. ఆస్తులున్నాయి జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. చివరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కింది. దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ స్థానం కైవసం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు కూటమి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురిచేసి, బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని.. ఆమెకే ఎంపీపీ పదవి అప్పగించారు. ఈ ఎన్నికల్లో 9 మంది సభ్యులకు గాను నలుగురే హాజరయ్యారు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలనే నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. వచి్చన వారిలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎన్నిక పూర్తవుతుందనే సరికొత్త నిబంధన తెచి్చ, ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుపొందింది. పోలీసుల అండతో మాచవరం ఎంపీపీ కైవసం పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీని కూడా టీడీపీ దౌర్జన్యంగా గెల్చుకుంది. టీడీపీకి తగిన బలం లేకపోయినా, పోలీసులతో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. వాస్తవంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి ఉన్న బలం నాలుగే. దీంతో గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీల బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి సభ్యుల వివరాలు తెలపాలని ఒత్తిడి తెచ్చారు. చెన్నాయపాలెం ఎంపీటీసీ లక్ష్మిబాయి బంధువు బాలు నాయక్ను దాచేపల్లి సీఐ భాస్కరరావు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బెదిరించినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో బాలు నాయక్ తన బంధువైన ఎంపీటీసీ లక్ష్మీబాయి మద్దతు టీడీపీకి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పిల్లుట్ల –1 ఎంపీటీసీ మంగమ్మ బాయినీ అలాగే బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. మరికొందరిని కూడా బెదిరింపులకు గురి చేసి, టీడీపీ అభ్యర్థి కొక్కెర అంజమ్మను గెలిపించుకున్నారు. -
జోజినగర్ బాధితులకు వైఎస్సార్సీపీ అండ
సాక్షి, అమరావతి: విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిరి్మంచుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజి్రస్టేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామా న్లు బయటకు తీసుకొచ్చే సమయమూ ఇవ్వకుండా నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా ఏమాత్రం కనికరం చూపలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే మా ఇళ్లను నేలమట్టం చేసినట్లు మమ్మల్ని కూడా నేలమట్టం చేస్తామని టీడీపీ నేత సురక శ్రీనివాసరావు బెదిరించారని బాధితురాలు అరుణ వాపోయారు.ఇళ్లు కూల్చేయడంతో చెట్టు కింద ఉంటున్నామని బాధితురాలు తంగా సుబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం కుదువ పెట్టి, పైసాపైసా కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెప్పా రు. శ్రీ లక్ష్మీ రామ కో–ఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారని విజయలక్ష్మి అనే బాధితురాలు మండిపడ్డారు. వైఎస్ జగన్ భరోసాతో ధైర్య మొచ్చిందని బాధితులు లలిత కుమారి, లక్ష్మణ్ తదితరులు అన్నారు. -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
నెల్లూరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కిడ్నాప్
సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే.. నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మేయర్పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది. -
ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: వైవీ
ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
జైల్లో పెట్టుకుంటూ పోతే భయపడే ప్రసక్తే లేదు: YSRCP నేతలు
-
ముద్దనూరు MPP .. YSRCP కైవసం
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అన్యాయంగా కేసులు పెట్టారు
-
భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
‘పోలీసులను అడ్డుపెట్టుకుని మా నేతలను నిర్బంధించారు’
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్భందిస్తున్నారన్నారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెళ్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలు ఉన్నారని ఎస్పీనే చెప్పారనే సంగతిని మాజీ మంత్రి విడదల రజిని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. ప్రతి ఒక్కరి సంగతి తేల్చుతామని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
టీడీపీకి షాక్.. కడప మేయర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. సభ్యులంతా పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి మెజార్టీతో సురేష్ ఎన్నికయ్యారు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. ఇక, కడప మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. కాగా, కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది.వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్గా ఉన్న సురేష్బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబ్దిపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. కానీ, అవేవీ సఫలం కాకపోవడంతో అధికార కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. -
ముద్దనూరు ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం
వైఎస్సార్జిల్లా: జిల్లాలోని ముద్దనూరు ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ముద్దనూరు ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. ముద్దనూరు మండల స్థానానికి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 స్థానాలున్నాయి. ఇందులో వైఎస్సార్సీపీకి 6గురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉన్నారు. దాంతో వైఎస్సార్సీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కూటమి నేతలు ప్రలోభాలకు దిగినప్పటికీ వైఎస్సార్సీపీ తమ సభ్యులకు విప్ జారీ చేయడంతో ఊహించినట్లే ఈ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికకు సంబంధించి పలువురి సభ్యులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభావం ఉందని ఆరోపేణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీకి భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ అనుచరులు తమ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు గురి కాకుండా ఓటేయడంతో వైఎస్సార్సీపీనే ఈ స్థానాన్ని దక్కించుకుంది. విస్సన్నపేట ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీదేఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వైద్యం ప్రైవేటీకరణపై ‘కోటి’ గళాలు!
చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గళాల స్వరంగా మారింది. వైద్యం ప్రైవేటీకరణపై కోటి గళాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఊరూ వాడా ఏకమై కదులుతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ప్రతిఘటన. చంద్రబాబు పాలనపై రణభేరీ అంటే సరిగ్గా సరిపోతుందేమో. కలం కలం కలిసి.. ప్రజా గళంగా మారి..ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్సార్సీపీ కోటి సంకతాల సేకరణకు పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకుంది. అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రేవేటుపరం కాకుండా చూడాలని తమ సంతకంతోనే సమాదానం చెప్పారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా.. లేదా అని ప్రశ్నించడమే కాదు.. కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం.. కోటి సంతకాలు.. కానీ..వైఎస్సార్సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు. కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయినా, జనం నుంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది. దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్తా కోట్లాడి గళాల నిరసనగా రూపాంతరం చెందింది. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా స్వరం.. సంతకాల రూపంలో ఉద్యమించింది. ప్రతిఘటనగా మారి..వైఎస్ జగన్ తన హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి, 5లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.- ఇప్పుడు వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుంది. వైద్య విద్యను అత్యంత కాస్ట్లీగా మార్చాలనే చంద్రబాబు ప్రయత్నాన్నిప్రజా ఉద్యమంతోనే తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ భావించింది. ఆ క్రమంలోనే కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఇది అత్యంత విజయవంతమై జనసంద్రంగా మారింది. అయితే ఈ అంశంపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రజల స్పందనను గవర్నర్ ముందుకే తీసుకుపోనున్నారు వైఎస్ జగన్. ర్యాలీలు, సమావేశాలు..కోటి సంతకాల సేకరణ అనంతరం గ ప్రజా ఉద్యమం పత్రాలను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. నిన్న(బుధవారం, డిసెంబర్ 10వతేదీన) ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా జరిగింది. సుమారు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాకు ఈ ప్రతులు చేరిపోయాయి. 15వ తేదీన విజయవాడకు వీటిని తరలించనున్నారు. ఆపై 18వ తేదీన గవర్నర్ను వైఎస్ జగన్ కలవనున్నారు. మొత్తంగా, "కోటి సంతకాల ఉద్యమం" ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ, బాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటనగా మారింది. బాబు పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజా శక్తి ప్రదర్శనగా మలచింది. గవర్నర్కు సంతకాలు సమర్పించిన తర్వాత, ఈ ఉద్యమం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. -
వీఎంసీ కౌన్సిల్లో ‘మంటలు’!
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి.. పశి్చమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. కమిషనర్కు నోటీసు.. 27వ డివిజన్లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు. తీర్మాన పత్రాల చించివేత.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు తీర్మానాన్ని అడిషనల్ కౌన్సిల్ అజెండా సెక్షన్ 88కే ప్రకారం సభ్యులు సభ మధ్యలో అజెండాలోని 178 అంశంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్పొరేటర్లు సభలో గందరగోళాన్ని సృష్టించేందుకు యతి్నంచారు. తీర్మాన పత్రాలను చించివేశారు. ఈ సమయంలో మాట్లాడుతున్న డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైక్ లాక్కొనేందుకు యతి్నంచారు. టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ డైరెక్షన్లో ఇతర టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. ఆయన చేసిన సైగలతో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఓ అడుగు ముందుకేసి, డెప్యూటీ మేయర్పై దాడి చేసే యత్నం చేశారు. డెప్యూటీ మేయర్ అదే స్థాయిలో ప్రతిఘటించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సైతం ఆమె అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పలుమార్లు అదుపుతప్పి మేయర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంటనే మార్షల్స్ కల్పించుకుని పోడియం వద్దకు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపేశారు. -
‘వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను పోలీసులు కిడ్నాప్ చేశారు’
మాచవరం: మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీకి బలం లేకపోయినా కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రడ్డి ధ్వజమెత్తారు. మాచవరంలో వైఎస్సార్సీపీకే బలం ఉందని, అందుకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారన్నారు. ఈ కిడ్నాప్ వెనుక పోలీసుల హస్తం ఉందని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. దాచేపల్లి సీఐ భాస్కర్.. వైఎస్సార్సీపీ ఎంపీటీలసీలను కిడ్నాప్ చేశారన్నారు. కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారకపోతే గంజాయి కేసు బనాయిస్తామని సీఐ బెదిరింపు చర్యలకు దిగారని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. కాగా, మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు(గురువారం, డిసంబర్ 11వ తేదీ జరుగనుంది. ఇటీవల మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, పోటికి దిగిన టీడీపీ వివాదాలు స్పష్టిస్తోంది. మాచవరం మండలంలె 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో 13 స్థానాల్లో 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులుండగా, కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు. అయితే పోలీసుల సాయంతో ఎంపీపీని గెలుచుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుందని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. అందుకే పోటీకి దిగి అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది. కుట్రలు , కుతంత్రాలు చేస్తూ ఎన్నిక జరగ్గకుండా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. -
కడప మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్!
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పారీ్టలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది. వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయతి్నంచి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యరి్థగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్గా ఉన్న సురేష్బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబి్ధపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ఆ పార్టీ నేతలు కసరత్తు చేసి సఫలీకృతులు కావడంతో మేయర్ ఎన్నిక గురువారం నాడు లాంఛనంగా పూర్తి కానుంది. బలం లేని కారణంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదివరకే ప్రకటించారు. వైఎస్సార్సీపీ అభ్యరి్థగా పాకా సురేష్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.పాకా సురేను గొప్ప ఆధిక్యతతో గెలిపించాలి కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పాకా సురేష్ కుమార్ను కార్పొరేటర్లు అందరూ గొప్ప అధిక్యతతో గెలిపించాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కడపలోని తన నివా సంలో మేయర్ ఎంపికపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరిని మేయర్గా నిలబెట్టాలన్న అంశంపై అందరితో సమాలోచనలు చేసి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం పాకా సురేష్ను వైఎస్సార్సీపీ తరుపున మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతకు ఎంపీపీగా అవకాశం .. ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డా. సు«దీర్రెడ్డిలతో సమాలోచనలు చేశామని ఎంపీ తెలిపారు. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏకాభిప్రాయంతో మేయర్ అభ్యర్థి ఎంపిక: రవీంద్రనాథ్రెడ్డి ఏకాభిప్రాయంతో కడప మేయర్ అభ్యర్థి ఎంపిక చేశామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలో ముగ్గు్గరు మేయర్ పదవి ఆశించారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాకా సురేష్ను ఏక గ్రీవంగా ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని టీడీపీ పాచిక వేసిందని, కార్పొరేటర్ల ఐక్యత ముందు అది పారలేదని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు: పాకా సురేష్ తనను మేయర్ అభ్యరి్థగా ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాకా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందని, ఈ నేపథ్యంలో నా అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను మేయర్గా గెలిపించాలని కార్పొ రేటర్లను కోరుతున్నానని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
-
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
బోరుగడ్డ అనిల్కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్కుమార్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
ఇండిగో క్రెడిట్ డ్రామా… చంద్రబాబు అండ్ కో ప్రయత్నం ఫెయిల్
సాక్షి,అమరావతి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విషయంలో క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రయత్నించిందని, సీన్ రివర్స్ కావడంతో సైలెంటయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి.. ‘బాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పేరుతో చేసింది ఏమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాబు పాలన అంతా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం బాబుకు అలవాటు కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆయనకు తెలిసిన మార్గం.టీటీడీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. టీటీడీలో తప్పు జరిగితే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడు. అనవసరంగా బురద చల్లితే ఆ పాపం ఊరికే పోదు’అని ఆయన హెచ్చరించారు. -
ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్కు YSRCP ఎంపీల ఫిర్యాదు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇండిగో తరహా సంక్షోభమే!
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాంప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. -
కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
-
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్కు గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
లక్ష్యానికి మించి YSRCP కోటి సంతకాల సేకరణ
-
ఇది ఆరంభం మాత్రమే..! చంద్రబాబుకి పెద్దిరెడ్డి వార్నింగ్
-
Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్ ని చూస్తూ.. ఆనందించడమే పవన్ పని!
-
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బుగ్గన మాట్లాడారు. ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని పెంచింది.... తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు. చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్ వన్గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు.. కాగ్ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు. చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. -
జమలపూర్ణమ్మకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవలె అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. -
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
బలం లేకున్నా బరిలో టీడీపీ
మాచవరం: అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. తమకు మెజార్టీ లేకున్నా మాచవరం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. టీడీపీ నాయకుల అరాచకాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల బంధువులను దాచేపల్లి సీఐ స్టేషన్కు పిలిపించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాచవరం మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 11న ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ క్రమంలో మెజారిటీ లేకున్నా టీడీపీ నేతలు ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. వాటిలో 13 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకోగా, టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల జరిగిన పరిణామాలలో వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశునిపాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య పార్టీ ఫిరాయించారు. దీంతో ఫిరాయింపుదారులతో కలిపి టీడీపీ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో గెలుపు అసాధ్యమని గుర్తించిన టీడీపీ నాయకులు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికపై మండల ప్రజానీకంలో ఉత్కంఠ నెలకొంది. న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీసుల అండదండలుమండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సపోర్ట్ లక్ష్మీబాయికి బావ వరుసైన బాలు నాయక్, మల్లవోలు ఎంపీటీసీ సభ్యురాలు చుక్క సువార్త కుమారుడు పెదరాజారావులను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మంగళవారం ఉదయం అక్రమంగా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారంటూ బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ శ్రేణులు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని ఆశ్రయించారు. పోలీసుల తీరును మండల ప్రజలు తప్పుబడుతున్నారు.హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ శ్రేణులుమాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు న్యాయం చేస్తుందని కాసు పేర్కొన్నారు. -
సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలే ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్వైపు వెళుతుంటే.. మనం ఇంకా ఈవీఎంలను పట్టుకుని వేళ్లాడటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 కోట్ల 38 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. రాష్ట్ర చరిత్రలో 2014లోగానీ, 2019లోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి’ అని ఆయన సభ దృష్టికి తెచ్చారు. చార్జింగ్ పెరగడం.. స్లిప్పులు తగులబెట్టడం..‘విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ 99 శాతంగా ఉంది. కానీ పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ, ఎలా పెరుగుతుంది? అని మా మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం, ధ్వంసం చేశాం అని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరేవాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు’ అని మిథున్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం ‘హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం జరిగింది. ఒకేరోజు, ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో.. ఒక బూత్లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ అదే బూత్లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అక్కడ మాకు ఐదుగురు ఏజెంట్లున్నారు. వాళ్ల కుటుంబసభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్లుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడినచోట, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది’ అని చెప్పారు. అమెరికానే బ్యాలెట్ వైపు వెళ్తోందిటెక్నాలజీలో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ వంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారని, అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయని మిథున్రెడ్డి చెప్పారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్కు మళ్లాయని తెలిపారు. ‘నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే అయినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజీని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్రెడ్డి సూచించారు.కేంద్రమంత్రి పెమ్మసానిపై మిథున్రెడ్డి సెటైర్లుఎస్ఐఆర్పై జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతుండగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డుపడ్డారు. దీంతో ‘ఉపాధిహామీ పథకం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కూలీల పరిస్థితులపై నీకు సరైన అవగాహన లేదు. బ్యాలెట్ పేపర్ విషయంపై మాట్లాడుతుండగా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు’ అంటూ మిథున్రెడ్డి ప్రతిఘటించారు. ‘లేదు వచ్చాయి, అయ్యాయి’ అంటూ పెమ్మసాని ఏదో చెప్పబోతుండగా.. ‘ఎలా వచ్చాయి? బస్సులో వచ్చాయా?’ అంటూ మిథున్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపాధిహామీ నిధులపై మిథున్రెడ్డి ప్రస్తావించిన సమయంలో కూటమి ఎంపీలు ఎవరూ నోరు మెదపకపోవడం, పెమ్మసానికి సపోర్ట్గా మాట్లాడకపోవడం గమనార్హం. -
చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, యువత ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడంపై ప్రజా ఉద్యమం ఎగసిపడుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నవంబరు 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా పేర్కొంటున్నారు.వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట స్వచ్ఛందంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాలను డిసెంబర్ 10వ తేదీకి జిల్లా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నారు. అనంతరం 17న కోటి సంతకాలను గవర్నర్కు అందించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.రగిలిన సీమ..ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై రాయలసీమలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సీమలో సుమారు 32 లక్షల మేర సంతకాలను సేకరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, న్యాయవాదులు.. ఇలా అన్ని వర్గాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో తాము టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. కోటి సంతకాల సేకరణలో పాల్గొంటామని, ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మంచి కార్యక్రమమని పేర్కొనడం గమనార్హం.ఇక వర్సిటీల్లో కూడా విద్యార్థులు భారీగా సంతకాల సేకరణలో పాలుపంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 8 వేల సంతకాలు చేయించారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఇందులో భాగస్వాములు అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దీన్ని అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. జేసీ వర్గీయులు దాడులకు తెగబడటంతో వైఎస్సార్సీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ వెరవకుండా సంతకాల కార్యక్రమంలో ప్రజలు భారీగా భాగస్వాములు కావడం బాబు సర్కారు పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చాటి చెబుతోంది.ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున..ఉత్తరాంధ్రలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కేజీహెచ్ మినహా పేదలకు ఇతర వైద్య సంస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అరిలోవలో విమ్స్, శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలోని అరిలోవ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పే ప్రైవేటు సంస్థలకు భూమి అందుబాటులో ఉంచుతూ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి.అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పార్వతీపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రలో వైద్య విప్లవం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున జనాగ్రహం పెల్లుబుకుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు మెడికల్ విద్యతో పాటు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో 18.30 లక్షల మేర సంతకాల సేకరణను పూర్తి చేశారు. అల్లూరి, పార్వతీపురం లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ ఊహకు మించి స్పందన వచ్చింది.కోస్తాలో కన్నెర్ర..నెల్లూరు నుంచి గోదావరి వరకు కోస్తా జిల్లాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదంతొక్కాయి. సుమారు అరకోటి సంతకాల మేరకు కోస్తా జిల్లాల్లోనే సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో మన విద్యార్థులకు ఉచితంగా రావాలి్సన వైద్య సీట్లతోపాటు పేదలకు చేరువలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు దూరం కానున్నాయని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.కుప్పంలోనూ నిరసనలు..కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు తరలివచ్చి మరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో గత రెండు నెలలుగా పాల్గొనడం గమనార్హం. తిరుపతి జిల్లాలో సుమారు 5 లక్షల మేర సంతకాలు సేకరించగా... చిత్తూరు జిల్లాలో 4.73 లక్షల మంది కోటి సంతకాల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 108 గ్రామ సచివాలయాలు ఉండగా ఒక్కో సచివాలయం పరిధిలో వెయ్యి మంది చొప్పున సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.జీవో ఏదంటూ టీడీపీ నేతలు నవ్వుల పాలు..!గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలోనే ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. పులివెందుల, పాడేరు కాలేజీలు ఎన్నికల నాటికే ప్రారంభానికి సిద్ధం కాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించగానే.. అసలు మెడికల్ కాలేజీలు నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి దిగారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు.జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్టోబరు 10వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల భవనాలను సందర్శించి జీవో కాపీని చూపించారు. దీంతో అయ్యన్నపాత్రుడు మిన్నకుండిపోయారు. మరోవైపు పెనుకొండలో మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది? అంటూ మంత్రి సవిత హడావుడి చేసి ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ పెనుకొండలో దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన భవంతులను మీడియాకు చూపించి మంత్రి సవిత అబద్ధాలను ఎండగట్టారు. ఇలా నిస్సిగ్గుగా అబద్ధాలాడి టీడీపీ ప్రజా ప్రతినిధులు అబాసుపాలయ్యారు. -
Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో
-
తిరుపతికి కొత్త రైలు..16వేల కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్
-
టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు
-
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు. మోదీ, నీతీశ్కుమార్లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్, నారా లోకేష్లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు. ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్. అందుకే వైఎస్సార్సీపీ హయాంలో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్- పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?.. ..వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన రాజేంద్రనాధ్(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్ విసిరారు.చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.సీఎం హోదాలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను తానే కొట్టేసుకోవటం పెద్ద నేరం. చంద్రబాబు చేసిన దివాళాకోరు తనం, నీతి మాలిన తనం కంటే ఇంకోటి లేదు. చంద్రబాబుకు దమ్ముంటే కేసును న్యాయబద్దంగా ఎందుకు ఎదుర్కోలేక పోయారు. పరకామని కేసులో తన ఆస్తిని రవికుమార్ టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు చేసిన దోపిడీలతో పోల్చితే రవికుమార్ చేసిన నేరం చిన్నదే. ఇండిగో సంక్షోభం టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తప్పిదమే. పైలెట్లకు రెస్టు ఉండాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమలు చేయాలి. విమానయాన సంస్థల పనితీరును సమీక్షించాలి. కానీ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండిగో సంస్థ విమానాలను పెంచుకుంటున్నంతగా సిబ్బందిని పెంచుకోలేదు. ఆ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు సమీక్ష చేయలేదు?. దీని గురించి ప్రజలు, ప్రయాణీకులు ప్రశ్నిస్తే చంద్రబాబు మా పార్టీపై పడి ఏడుస్తున్నారు. తెలుగువారి పరువే కాదు, మొత్తం దేశం పరువునే పోగొట్టారు. తప్పు చేశారు కాబట్టే అర్నాబ్ గోస్వామి చర్చను బాయ్ కాట్ చేశారు అని పేర్ని నాని అన్నారు. -
‘బాబూ.. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాగించలేదు’
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకోవడం అవివేకం. పానుగంటి చైతన్య చేసిన నేరం ఏంటి.. విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం తప్పా?. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ ఏడాది చిత్తశుద్ధితో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యం వేధిస్తున్నాయి.కళాశాలకు అనుమతించడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా, పరీక్షలకు దూరం చేస్తున్నారు. కోర్సు కంప్లీట్ అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారు. చంద్రబాబు పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ దేవినేని ఆవినాష్
సాక్షి, విజయవాడ: అక్టోబర్ నుండి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ వివరాల ప్రకారం, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంచనాలకు మించి 96 వేల సంతకాలు తూర్పు నియోజకవర్గంలోనే పూర్తయ్యాయి.కూటమి ప్రభుత్వ విధానాలను వైఎస్సార్ సీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేశారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు కోరుకొంటున్న విధంగా పరిపాలన చేయాలి. ఎన్టీఆర్ జిలాల్లో ప్రతి నియోజకవర్గంలో 60వేల పైనే సంతకాలు చేశారు. 18నెలల్లో ప్రజలకు ఉపయోగ పడే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయి. ఈ ప్రభుత్వంలో 8వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు పడలేదు. మా పాలనలో ఒక్క రోజు లేట్ ఐతే నానా రభస చేసే వాళ్ళు. ఇప్పుడు ఎల్లో మీడియాకి కనపడడం లేదా? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చినా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు.అప్పులు తీసుకొని వొచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. సంక్షేమం లేదు..అభివృద్ధి లేదు.. నియోజక వర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకి సేకరించిన సంతకాలు వస్తాయి.15వ తేదీన జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకి సంతకాలు పంపుతాం. 17న రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చిన సంతకాలు గవర్నర్ కి అందజేస్తాం. పిపిపికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని దేవినేని ఆవినాష్ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. -
గోరంట్ల మాధవ్కు మరోసారి విజయవాడ పోలీసుల నోటీసులు
సాక్షి, అనంతపురం: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు మరోసారి విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశంలో మైనర్ బాలికల పేర్లు వెల్లడించారని గోరంట్ల మాధవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయంపై వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై గతంలో ఫిర్యాదు చేశారు. కాగా తన వ్యాఖ్యలపై ఇప్పటికే గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి విజయవాడ పోలీసుల విచారణకు కూడా మాధవ్ హాజరయ్యారు. అయితే తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
కూటమి కర్కశ సర్కారుపై గళమెత్తిన విద్యార్థి దళం (ఫొటోలు)
-
గళమెత్తిన విద్యార్థి దళం
సాక్షి,అమరావతి/తాడేపల్లి రూరల్: కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్íÙప్పులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్పందించలేదు. దీంతో సోమవారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల నుంచి భారీగా తరలివచి్చన విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యాలయం వద్ద నుంచి ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు చేతబట్టి ర్యాలీగా పెట్రోల్ బంక్ మీదుగా సాంఘిక సంక్షేమ కార్యాలయ రోడ్డులోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి విద్యార్థి నేతలను, విద్యార్థులను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బారికేడ్లను నెట్టేసి విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు.‘ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేట్ బయటకు నెట్టేయడం అన్యాయం, విద్యార్థులను వేధించటం తగదు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు తక్షణమే చెల్లించాలి, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి, లేకుంటే విద్యార్థుల సత్తా ఏమిటో సర్కారుకు చూపిస్తాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నినాదాలతో తాడేపల్లి హోరెత్తింది. అనంతరం పోలీసులు ఐదుగురితో కూడిన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని అధికారుల వద్దకు పంపుతామనటంతో విద్యార్థినేతలు, విద్యార్థులు ఒప్పుకోలేదు. ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తాము ఎక్కడికీ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. విద్యార్థి నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు ఆందోళన తీవ్రం కావటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోనల్) ఎ.రవిచంద్రతో పాటు మరికొంతమంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. వారిని తీసుకెళ్లి ముందే సిద్ధంగా ఉంచిన లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిని తెనాలి మార్గంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. చివరికి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. వారి వెంట భారీగా విద్యార్థులు వాహనాల్లో తరలివెళ్లారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చక్కర్లు కొడతారా? అంతకు ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య నేతృత్వంలో గుంటూరు నుంచి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రవిచంద్ర నేతృత్వంలో విజయవాడ వైపు నుంచి విద్యార్థులు బైక్లు, ఇతర వాహనాల్లో భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను ఉద్దేశించి చైతన్య, రవిచంద్ర మాట్లాడారు. దాదాపు ఎనిమిది క్వార్టర్స్ బకాయిలు రూ.7,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇందులో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో విద్యార్థులు కష్టాల్లో ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, నరేందర్ రెడ్డి, బాజీ, రవి తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ధర్నాలో స్టూడెంట్ యూనియన్ నాయకులు నరేంద్రరెడ్డి, గంటి, రవి, పేటేటి నవీన్, వినోద్, కోమల సాయి, రవీంద్రారెడ్డి, సందీప్, రవి, కరీం, కిరణ్, రాజే‹Ù, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్, శ్రీనివాస్, నవీన్, కోమల్ సాయి, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులపై కేసు నమోదు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి విద్యార్థి సంఘ నాయకులు పానుగంటి చైతన్య, నరేంద్రరెడ్డి, అనిల్ కుమార్, రవీంద్ర, రవిచంద్ర విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. వీరిని మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 8 గంటల సమయంలో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు, స్కాలర్íÙప్పులూ మంజూరు చేశారు. ఈ సర్కారు వచ్చాక అసలు చెల్లింపులు నిలిపేసింది. విద్యార్థులను చిత్రహింసలు పెడుతోంది. ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతాం. – పానుగంటి చైతన్య, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పార్ట్ టైం ఉద్యోగాలకు విద్యార్థులు చంద్రబాబు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో కాలేజీల యాజమాన్యాల వేధింపులను విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. హాల్టికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలుచేస్తూ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులుచేయాల్సి వస్తోంది. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
వందేమాతరం స్ఫూర్తిని కాలరాసేలా ఏపీలో పాలన: ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని.. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. సోమవారం లోక్సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా(Vande Mataram debate) ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని.. ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు ఏపీలో రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా పాలన జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కీలకమైన వైద్య రంగాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి . ..ప్రజలను గాలికి వదిలేశారు. ఏపీలో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం ప్రభుత్వాన్నించకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు యదేచ్చగా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇది వందేమాతరం స్ఫూర్తిని కాలరాయడమే అని గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. -
Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
-
18 నెలల్లో ఏపీలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి లేదు: బొత్స
సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు... గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు. -
‘రీల్స్ రామ్మోహన్ చేతకానితనం వల్లే ఈ తిప్పలు’
సాక్షి, శ్రీకాకుళం: ఇండిగో సంక్షోభ నేపథ్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఏపీలోనూ వైఎస్సార్సీపీ రామ్మోహన్ చేతకాని తనం గురించి నిలదీస్తున్నాయి. అటు కేంద్ర మంత్రిగానే కాదు.. ఇటు తన నియోజకవర్గంలోనూ ప్రజలకు మేలు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. విమానాలు రద్దు అవడంతో ప్రజలు ఎయిర్పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్లైన్లు కుప్పకూలాయి. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలి.. రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమస్య వచ్చినప్పుడు మీడియాకు మొఖం చాటు వేస్తె ఎలా? మీ సమాధానం కోసం దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటినా మాట్లాడండి’’ అని తమ్మినేని డిమాండ్ చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవి కుమార్ రామ్మోహన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందింది. కారెక్కినప్పుడు దిగినప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాడు. అహ్మదాబాద్లో ఫ్లయిట్ కూలి 240 మంది చనిపోతే.. అక్కడికి వెళ్లి రీల్ చేస్తారు. అందుకే రామ్మోహన్ నాయుడు రీల్స్ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు. రీల్స్ పై పెట్టిన శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చేతకానితనం కారణంగా దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారింది. కింజరాపు కుటుంబానికి రాజయోగం కల్పించిన శ్రీకాకుళం ప్రజలకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకోచ్చారా?. ఒక్క కేంద్ర సంస్థను అయినా జిల్లాకు తీసుకొచ్చారా? మిమ్మల్ని ఎందుకు గెలిపించారా? అని జిల్లా ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు’’ అని రవికుమార్ అన్నారు. -
జగనన్న మాటగా చెప్తున్నా.. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా
-
యూనివర్సిటీ గేట్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్
-
Chevireddy Mohith: లోకేష్ 100 కు 10 రెట్లు అనుభవిస్తావ్
-
మాట్లాడింది వినవు మళ్ళీ చెత్త ప్రశ్నలు... ఎల్లో మీడియా రిపోర్టర్ కు గుడివాడ కౌంటర్
-
నాడు కొలువుల జాతర.. నేడు నిలువునా కోత
చంద్రబాబు సర్కారు కొలువుదీరింది... కొలువులకు నిలువునా కోత పడింది. ‘ఉపాధి’ మాటే మరుగునపడింది.. పారిశ్రామికీకరణ పట్టాలు తప్పి... జిల్లా ప్రగతి దిశ మార్చుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టగా... చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది. ఉపాధి, ఉద్యోగాలు కరువై జిల్లా తిరోగమనంలో పయనిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: కరువు సీమ కడప గడపలో విద్యార్థులు, నిరుద్యోగులు విద్య, ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకూడదన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి నాంది పలికింది. జిల్లాలో పరిశ్రమలతో పాటు.. ఉన్నత విద్యాసంస్థలు నిర్మించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో భారీపరిశ్రమలు కొలువుదీరాయి. ఇందులో ఒక్క డిక్సన్ కంపెనీలోనే దాదాపు 1300 మంది ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగా, బద్వేలు సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్సంస్థలో దాదాపు 2,078 మంది స్థానికులైన నిరుద్యోగులు అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు, పులివెందుల మెడికల్ కళాశాల, రిమ్స్, మానసిక వైద్యశాల, క్యాన్సర్ హాస్పిటల్స్లో నియామకాల ప్రక్రియ చేపట్టింది. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుతో వైద్యుల నియామకం, సహాయ సిబ్బంది ఏర్పాటుతో సేవలు దగ్గరయ్యా యి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తూ వచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఒకగూటి కిందికి తీసుకువచ్చి వారందరినీ ఆప్కాస్ కింద చేర్చి ఉద్యోగభద్రత కల్పించిన విషయం తెలిసిందే.గ్రామసచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగ విప్లవం.. గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది. వీటి నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక చరిత్ర. ఇక జిల్లాలో 645 సచివాలయాల పరిధిలో 5,400 మంది సచివాలయ కార్యదర్శులుగా కొలువులు సాధించారు. వీటికి అనుబంధంగా సేవలందించేందుకు ప్రతి 50 ఇళ్లకు గ్రామవలంటీర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కార్లో తిరోగమనం...జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తే టీడీపీ సర్కార్ తిరోగమనంలో పడేసింది. పులివెందుల మెడికల్ కళాశాల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024–25 విద్యాసంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను తిరస్కరించి, ఈ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశారు. అప్పట్లో అంగీకరించింటే 2025–26 ఏడాదికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించేవి. తద్వారా పేద ప్రజలు, పేద విద్యార్థుల భవిష్యత్ యోగ్యకరంగా ఉండేది. మెడికల్ కళాశాల అటుంచితే, అందులో ఉన్న ఆధునాతన పరికరాలు సైతం తరలించుకువెళ్లడం మరో విశేషం. కడప అంటే కడుపు మంట చంద్రబాబు సర్కార్కు ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి ఏడాదిన్నర్రగా శూన్యం. మరో వైపు డీఎస్సీ పేరుతో సరికొత్త ప్రచార ఆర్భాటానికి తెరలేపారు. డీఎస్సీ అభ్యర్థులందర్నీ విజయవాడకు పిలిపించి ‘షో’చేశారు. మెరిట్ ప్రాతిపదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్లో 1.25 లక్షల మందికి ఉద్యోగాలు ఏకకాలంలో లభించాయి. నియామకపత్రాలు అందుకొని ఎక్కడివారు అక్కడే బాధ్యతల్లో చేరిపోయారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆచరణలో నిమగ్నం కాగా, నేడు చంద్రబాబు సర్కార్ ఫించన్లు పంపిణీ నుంచి ప్రచార యావే ధ్యేయంగా వ్యవహరిస్తోండడం గమనార్హం. నిరుద్యోగ యువతకు అండగా వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలోని వైవీయూ, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అనేక పోస్టులను భర్తీ చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. – నన్నయ్య,ప్రకాశ్నగర్, కడప నిరుద్యోగులను పట్టించుకోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి మాటే లేకపోగా, అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తున్నామని చెబుతున్నారేగానీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనుచూపు మేరలో కానరావడం లేదు. మొత్తం మీద చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తప్పేలా లేవు. – షేక్ మన్సూర్, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలం -
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై పోలీసులకు ఫిర్యాదు
ఆమదాలవలస: మీడియా సమావేశాల్లో తనపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ పోలీసులను కోరారు. ఆయన ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమదాలవలస పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కూన రవికుమార్పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూన రవి దయాదాక్షిణ్యాల మీద తనకు డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయని చెబుతున్నారని, తనను ఉద్దేశించి ‘నా చెప్పుతో సమానం’ అని వ్యాఖ్యానించారని, వైఎస్సార్సీపీ క్యాడర్ బట్ట కట్టేవారు కాదు, తిండి తినేవారు కాదంటూ ఆగస్టు 18న మీడియా ముఖంగా అనుచితంగా మాట్లాడారని చింతాడ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్ఐకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలకు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. -
చంద్రబాబుకు కొత్త పేరు పెట్టి ఏకిపారేసిన నాగార్జున యాదవ్
-
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్పర్సన్లు, జడ్సీ వైస్ చైర్పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్లు, టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.ఇదీ చదవండి:చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్ -
చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్ మండిపడ్డారు.‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో లేకుండా ఎలా పోయాయి?..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని శివశంకర్ హితవు పలికారు. -
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్ నెట్వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్తో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని నాగార్జున యాదవ్ తెలిపారు. -
యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులకు వైఎస్ జగన్ మేలు చేశారని.. చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు.‘‘తిరుమలలో గొల్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే. తిరుమలలో యాదవులకు వంశపారపర్య హక్కును తిరిగి తీసుకొచ్చింది జగనే. శ్రీకాకుళం చరిత్రలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది వైఎస్ జగనే. విశాఖలో యాదవ మహిళ అని కూడా చూడకుండా మేయర్ పదవి నుంచి దించేశారు’’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి పేర్నినాని
-
‘నార్కో అనాలిసిస్ టెస్ట్కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు. -
‘పౌర విమానయాన శాఖను లోకేష్ రివ్యూ చేయడం ఏంటీ?’
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎన్నడు లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించలేక మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు ఎత్తేశారంటూ మండిపడ్డారు.‘‘మన తెలుగు వాడికి విమానయాన శాఖ మంత్రి పదవి వచ్చిందని సంతోషించాము. దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువును మంత్రి తీశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి క్షమాపణ చెప్పాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్ కాదు.. దేశ ప్రజలు కూడా అదే కోరుతున్నారు. విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదని దేశ ప్రజలు అంటున్నారు...ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇండిగో సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ఎవరు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల్లో లోకేష్ ఒకరు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా.. తండ్రి ఆఖరి చూపులకు వెళ్లలేని పరిస్థితి బిడ్డలకు ఏర్పడింది. నూతన వధూవరులను బంధువులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకొని మిగతా సంస్థలు విపరీతంగా రేట్లు పెంచాయి...విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 30,000 పెట్టీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చి నెత్తి మీద హెల్మెంట్ పెట్టుకొని రీల్స్ తీయడం తప్పితే రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఏం చేశారు.. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా జరగడానికి కారణం వైఎస్ జగన్. ఎల్లో మీడియాలో లోకేష్ను జాకీలు ఎత్తినట్లు నేషనల్ మీడియాలో ఎత్తలని టీడీపీ నేతలు చూశారు. టీవీ-5 సాంబశివరావు దగ్గర జాకీలు ఎత్తినట్లు ఎత్తితే నేషనల్ మీడియా ఊరుకుంటుందా?. మంత్రి రామ్మోహన్ రీల్స్ మానివేసి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి.. టీడీపీ పబ్లిసిటీ పిచ్చి వలన దేశంలో తెలుగు వారి పరువు పోయింది’’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. -
కక్ష సాధింపు.. కాకాణిపై మరో అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి.. జగన్పై విమర్శలా?
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా.. విద్యారంగాన్ని బలోపేతం చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, లోకేశ్ను నిలదీశారు. ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించి.. సెట్టింగ్లు, షూటింగ్లు పెట్టి ప్రత్యేక విమానాలపై వెళుతూ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. పాఠశాల సమావేశాలను సైతం రాజకీయ సభలుగా మార్చేసి వైఎస్ జగన్పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదన్నారు. ఆ బడిని తీర్చిదిద్దింది జగనే ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండగా ఆ పాఠశాలను నిర్మిస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నాడు–నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చుచేసి సెట్టింగ్ వేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్లను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసి తండ్రీకొడుకులు విఫలమయ్యారు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపచేయలేదు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైఎస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా తండ్రీకొడుకులకు లేదు’ అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. -
ఇండిగోతో రామ్మోహన్ కుమ్మక్కు
సాక్షి, అమరావతి: దేశంలో ఇండిగో విమానాల సంక్షోభం, రద్దీ, టికెట్ ధరల పెరుగుదల, భద్రతా లోపాలకు ప్రధాన కారకుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు విమర్శించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్నాయుడు విఫలమయ్యారని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూపూడి ప్రభాకర్రావు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘ఇండిగో విమాన సంస్థతో రామ్మోహన్నాయుడు కుమ్మక్కయ్యారు. దాని ఫలితంగానే ఇప్పుడు సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. డీజీసీఏ దిగి వచ్చేదాకా ఇండిగో మొండిగా వ్యవహరించిందంటే కారణం రామ్మోహన్తో కుమ్మక్కు కావడమే. ఇంత గందరగోళం నెలకొంటే ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ గడుపుతున్నారు. ఆయన విమానయాన శాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ చేసింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో సంస్థ పాటించేలా రామ్మోహన్ చేయలేకపోయారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చింది.’ అని జూపూడి చెప్పారు. కేంద్ర విమానయాన శాఖను లోకేశ్ పర్యవేక్షిస్తాడా? ‘ఇండిగో సంక్షోభంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వార్ రూమ్లో చర్చలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను కూడా లోకేశ్ పర్యవేక్షిస్తున్నాడంటూ టీడీపీ ప్రతినిది వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవితో లోకేశ్కు ఏం సంబంధం? లోకేశ్, రామ్మోహన్లు ఏపీ పరువును తీశారు. ఇండిగో సంస్థ ఒత్తిళ్లకు కేంద్ర మంత్రి పూర్తి తలొగ్గారని దేశవ్యాప్తంగా రామ్మోహన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానం ఎక్కడమంటే భయం, నరకం, అనే స్థాయికి రామ్మోహన్ తీసుకెళ్లాడు. ఇంతటి అసమర్థ మంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు. -
దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన దళిత యువకుడు, వైఎస్సార్సీపీ యూత్ పట్టణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పట్టణ సీఐ గఫూర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈశ్వరరావు వేధిస్తున్నాడంటూ ఆయన భార్య లక్ష్మి పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఈశ్వరరావును పిలిపించిన పోలీసులు.. రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. సీఐ గఫూర్ తనపై భౌతిక దాడి చేశారని, దీంతో తనకు వినికిడి సమస్య తలెత్తిందని, దాడితో పాటు జాతి పేరుతో తనను సీఐ తిట్టారని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టౌన్ సీఐ గఫూర్ను వివరణ కోరగా తాను చేయిచేసుకోలేదని తెలిపారు. ఈశ్వరరావుపై దాడిని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. భార్య, భర్తల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, భౌతికంగా దాడి చేయడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ బూసి వెంకటరావు ఖండించారు. దాడిపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయ భారతికి ఫిర్యాదు చేసినట్లు వెంకటరావు తెలిపారు. -
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్కు నివేదించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్.. గవర్నర్ను కలవనున్నారు.ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైఎస్సార్సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. -
సీబీఐ దర్యాప్తునకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంట ఏహ్యభావమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్ఫుట్ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అసలు ప్రభుత్వం అనేది ఉందా?:రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. జిల్లాలో వరినాట్లు పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులకు పైసా సహాయం లేదు. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు గ్రామాలకు వెళ్లలేదు.ఇవన్నీ చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోంది. తుపాన్ల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పార్టీ చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిల్చింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో 2023లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, చాలా వేగంగా స్పందించాం. రైతులను వెంటనే ఆదుకున్నాం.మా ఎమ్మెల్యే ఆ మాటలు ఫాలో అవుతున్నారు:సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు. ‘సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోండి’ అని ఆయన చెబుతుంటారు. వాటిని మా సర్వేపల్లి ఎమ్మెల్యే గట్టిగా వంట బట్టించుకున్నాడు. అందుకే కష్టనష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచించకుండా, ఎక్కడ దొంగ బిల్లులు పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లడ్ డ్యామేజ్ మరమ్మతుల పేరిట కోట్లు దోచుకుంటున్నారు. రైతుల పేరు చెప్పి గతంలో నీరు–చెట్టు కార్యక్రమంలో ఎలా అయితే దోచుకున్నారో.. ఈరోజు మరమ్మతు పేరిట మళ్లీ అదే చేస్తున్నారు.అరాచకంగా మారిన విజిలెన్స్ విభాగం:ఈరోజు విజిలెన్స్ దర్యాప్తు అన్న దానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతల ఆదేశాలను రాసి పెట్టే కార్యాలయంగా ఇక్కడి విజిలెన్స్ విభాగం తయారైంది. ఒకసారి జిల్లా విజిలెన్స్ అధికారుల కాల్ లిస్టులు బయటపెడితే, మంత్రి, ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి.. వారి ఆదేశాలు అధికారులు ఎలా అమలు చేస్తున్నారనేది బయటపడుతుంది. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు.. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి, వారితో ఫోన్లలో మాట్లాడి, వారి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇదే అత్యంత దారుణం. అరాచకం.దమ్ముంటే బహిరంగ చర్చకు రండి:మీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ మేలు చేయడం లేదు. అదే గత మా వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. విత్తనం మొదలు, పంటల అమ్మకాల వరకు గ్రామాల్లో ఆర్బీకేలు రైతుల కోసం పని చేశాయి. అందుకే మీకు, దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. మీడియా, రైతుల సమక్షంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదాం. జగన్గారి హయాంలో రైతులకు ఎలా సహాయం జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా దోపిడీ జరుగుతోంది.. అన్నదానిపై కూలంకషంగా చర్చిద్దాం. నా నియోజకవర్గం సర్వేపల్లిలోనే చర్చ మొదలు పెడదాం. మరి మీరు అందుకు సిద్ధమా?.విజిలెన్స్ రిపోర్టులపై సీబీఐ విచారణకు సిద్ధమా?:వరద సాయాన్ని అధికార పార్టీ నేతలు దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు. వీటిని సీబీఐ విచారణ పెడితే ఎంత మంది అధికారులు ఇళ్లకు వెళ్తారో, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలుస్తుంది. ఈరోజు ఫాల్స్ విజిలెన్స్ రిపోర్టులు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. విచారణ సంస్థలు కూడా పూర్తిగా రాజకీయ బానిసలయ్యాయి. ఈ దుస్థితి కొనసాగితే సమాజంపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉండి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వ్యవసాయ మంత్రికి లెటర్ రాయడం విడ్డూరంగా ఉంది. ఆయనకు నేరుగా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?. ఏదేమైనా కోట్ల రూపాయల దోపిడిపై సీబీఐ విచారణకు అధికార పార్టీ నేతలు సిద్ధమా?వ్యవసాయ మంత్రి పారిపోతున్నారు:వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం గురించే తెలియదు. ఆయన రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మేం చర్చకు సిద్ధమైతే అచ్చెన్నాయుడు తోక ముడుచుకుని పారిపోయాడు. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు వేదిక, సమయం నిర్ణయిస్తే గత ప్రభుత్వ రైతు సంక్షేమం, ఈ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. కానీ, ఆయన పారిపోతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. -
విద్యారంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పై మండిపడ్డారు.పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు.పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వలన జిల్లా ప్రజలకు ఏం ఉపయోగం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క స్కూల్ తరగతి గది కూడా కట్టలేదు. ఒక్క టేబుల్ కుర్చీ కూడా ఇవ్వలేదు. అందుకే క్లాస్ రూమ్ సెట్ వేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది.ఈ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఏం చేస్తున్నారో చెప్పలేక పోయారు. వైఎస్ జగన్ కట్టించిన స్కూల్లో కార్యక్రమం చేస్తే స్కూల్స్ అభివృద్ధి కనిపిస్తుందని సినిమా సెట్ వేసుకొని వారి దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు.వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పథకం అయినా తెచ్చిందా. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పుష్పశ్రీవాణి పేర్కొంది . -
చాలా బాధాకరం.. అప్పుల బాధతో అరటి రైతు ఆత్మహత్య అనంత వెంకటరామి రెడ్డి ఎమోషనల్
-
అప్పుల బాధతో అరటి రైతు ఆత్మహత్య కుటుంబానికి YSRCP నేతల భరోసా
-
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు డా.బీఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఈ కార్యక్రమానికి కార్యాలయ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నందమూరి లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, జూపూడి ప్రభాకర్, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరైయ్యారు.అంబటి రాంబాబు, మాజీమంత్రి కామెంట్స్..భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.బడుగు, బలహీనవర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. పేద వర్గాలు కొంతమేర అభ్యున్నతి సాధించారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే. అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణం. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.భారత జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది.విజయవాడ నగరం నడిబొడ్డున దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనం అశ్రద్ధకు గురవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అంబేద్కర్ వ్యతిరేక విధానాలను అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంబేద్కర్ లాంటి మహనీయుడిని గౌరవించాల్సిందే.ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసిపి కార్యాలయంలో డా.బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్,చలమాల సత్యనారాయణ.అనంతపురం: గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ లో అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజి ఎంపి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య.ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం చింతలపూడి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు మరియు పలువురు వైసీపీ శ్రేణులు.విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. పాల్గొన్న న్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ,బెల్లందుర్గ , మాజీ ఏపీఐడిసి ఛైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేటర్లు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు.బాపట్ల జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగ రైల్వేస్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త మాజీ డైప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రకాశం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69 వ వర్దంతి సంధర్బంగా ఒంగోలు వైయస్సార్సీపి పార్టీ ఆఫీస్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఒంగోలు వైయస్సార్సీపి ఇంచార్జ్ చుండూరి రవి బాబు, జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్ది.పల్నాడు: నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిచిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.గుంటూరు: మంగళగిరిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ, నాయకులు కార్యకర్తలు -
యాదవులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యాదవ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో 50 కోట్లు విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమిపూజ కూడా నిర్వహించారు.అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూకేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు.వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేశారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయం అని వారు విమర్శిస్తున్నారు.భవనం నిర్మాణం ఆలస్యానికి గురి కాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమినే తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ భవనంకు స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రైవేటు సంస్థలపై పెరుగుతున్న సైబర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో ప్రైవేటు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు, డేటా దొంగతనాలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. 2020–24 మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలపై 5.77 లక్షల సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు. చాట్ జీపీటీ, ఏఐ వాడితే రహస్య సమాచారం లీక్ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చాట్ జీపీటీ, ఏఐ వంటి టూల్స్ వాడటంవల్ల రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రహస్య, సున్నిత సమాచారం దేశం బయటకు చెప్పడం, సురక్షితం కాని ప్లాట్ఫామ్లలో షేర్ చేయడం నిషేధమని తెలిపారు.భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ఇటీవల జరిగిన భారత్–బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పంద సమావేశం (సీఈటీఏ)లో క్రాస్–బోర్డర్ డేటా ప్రవాహాలు, డేటా లోకలైజేషన్ నియమాలను పునఃసమీక్షించే అవకాశాలపై ఒప్పందం జరిగినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద జవాబిచ్చారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవురాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఐఎల్)లోని 32 డివిజన్లనను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు, ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు నిజంకాదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ప్రైవేటీకరణకు ప్రతిపాదనలేవీ లేవని చెప్పారు. రైతులకు సహాయం 2022–23 నుంచి 2024–25 మధ్య ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ద్వారా దాదాపు రూ.609 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర వ్యవసాయ, సంక్షేమశాఖ సహాయమంత్రి రామ్నాథ్ ఠాకూర్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
రక్షణ పరిశ్రమల్ని ఆకర్షించలేని ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణరంగ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించలేకపోతున్నట్లు రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ చెప్పారు. లోక్సభలో శుక్రవారం వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవా బిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లు (కేంద్ర పథకాలు) ప్రారంభించలేదని తెలిపారు. వైద్య పరికరాల ఎగుమతుల్లో వృద్ధి మన దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 2021–22లో 2.9 బిలియన్ డాలర్లుండగా 2024–25లో 4.1 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వైద్యపరికరాల దేశీయ ఉత్పత్తి వృద్ధిరేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఐఆర్ఎస్పై నాలుగే ఫిర్యాదులుగత పదేళ్లలో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) పనితీరులో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆలస్యాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు. -
మా గూడును కూల్చారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను విజయవాడ భవానీపురం జోజినగర్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్ వద్ద అబ్దుల్ మజీద్ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు. కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు... మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్ జగన్ను కలిసిన సమయంలో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. -
కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్రావుకు చెందిన గోడౌన్లో నకిలీ మద్యం డంప్ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి డంప్ను పరిశీలించారు జోగి రమేష్. దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది. -
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు...తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు...వైఎస్ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్లోని ఇంట్లోకి పవన్కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ఏది విధ్వంసం చంద్రబాబూ?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్ను ఆయన నిలదీశారు. 16 నెలల కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐదేళ్లలో 3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు. -
విజయవాడ భవానీపురం నిర్వాసితులకు YSRCP అండ
-
చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు: భూమన
తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు...చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రాణం పోతే మళ్ళి రాదు.. రైతులు చావొద్దు..
-
పల్నాడు ఘోర ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
సాక్షి, తాడేపల్లి: పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు కంటెయినర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న ఐదుగురు బీటెక్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. శైలజానాథ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, అనంతపురం: అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరటి రైతు నాగలింగం (40) ఆత్మహత్య నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతు కుటుంబాన్ని ప్రరామర్శిస్తే తప్పేంటని శైలజానాథ్ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య రైతు నాగలింగం (40) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు రైతు మృతదేహాన్ని పరిశీలించేందుకు జీజీహెచ్ వచ్చేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ సిద్ధమయ్యారు. శైలజానాథ్ వస్తున్న కారణంగా ఉదయం 8 గంటలకే రైతు నాగలింగం మృతదేహాన్ని పోలీసులు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ తక్షణమే జీజీహెచ్కు వెళ్లారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. జీజీహెచ్ బయటే శైలజానాథ్ను అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, శైలజానాథ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శిస్తే తప్పేంటి? అని పోలీసులను ఆయన నిలదీశారు. ఇంత హడావుడిగా నాగలింగం మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. తరలించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇదే సమయంలో జీజీహెచ్కు వచ్చిన శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో ైశైలజానాథ్ మాట్లాడారు. నాగలింగం కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమెకు సూచించారు. అనంతరం, శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య బాధాకరం. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించటం ఏంటి?. రైతులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించకూడదా?. చంద్రబాబు ప్రభుత్వ తీరు అమానవీయం’ అంటూ మండిపడ్డారు. -
వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం. -
వల్లభనేని వంశీ ఎమోషనల్ వీడియో
-
నువ్వు నీ డిప్ప కటింగ్.. ఒకసారి మొఖం అద్దంలో చూసుకో
-
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
తుది ఘట్టానికి కోటి సంతకాల ఉద్యమం: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు.ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల అనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతోపాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు. -
వెర్రితలలు వేస్తోన్న రెడ్బుక్ రాజ్యాంగం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా? మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్లు పెట్టిన పీఏను లోపలేయాలి. –వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.మిథున్ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితిమద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి. కృష్ణమోహన్రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు. వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులుమా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు. చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు. -
సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో సూపర్ సిక్స్ విజయవంతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని.. చంద్రబాబు గోబెల్స్కు టీచర్, మెంటార్ లాంటి వాడని ఎద్దేవా చేశారు.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. అసలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల కింద ఏం చేశారో చెప్పాలని, సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ హిట్టని ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో రైతులు పండించిన చీని, అరటి ఎగుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. 23 వేల టన్నులు ఉన్న అరటి ఎగుమతులను 2023–24 నాటికి 3 లక్షల టన్నులకు తీసుకెళ్లాం. దళారుల బెడద లేకుండా చేశాం. రవాణా ఖర్చులను 40 శాతం మేర తగ్గించాం. ఈ 19 నెలల పాలనలో రైతుల కోసం మీరేం చేశారు? రైతుల కష్టాలు పట్టవా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే నిద్రపోతున్నారా.. అని ప్రశి్నంచారు. మిమ్మల్ని సీఎం చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా.. అంటూ మండిపడ్డారు.వ్యవసాయంపై 62 శాతం మంది ఆధారపడిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సాగును పండుగ చేసి.. రైతులను సంతోష పెడితేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదని, వెనకడుగు వేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలని.. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఉచిత పంటల బీమాకు మంగళంఇటీవల మోంథా తుపాను వచి్చన సమయంలో ఆరీ్టజీఎస్ నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడూ కంప్యూటర్ల ముందు కూర్చొని పెద్ద బిల్డప్ ఇచ్చారు. వీళ్లకు తోడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఎలా బిల్డప్ ఇచ్చాయంటే.. వీరు తుపాను పీకపట్టి డైవర్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాయి. వీళ్లు కాబట్టే తుపానును ఆపగలిగారన్నట్టుగా ఆకాశానికి ఎత్తారు. కానీ, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. తుపాను కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. తుపాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. దాన్ని నాలుగైదు లక్షల ఎకరాలకు కుదించారు. వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. బాబు 19 నెలల పాలనలో ఇప్పటి వరకు 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఆ విపత్తుల కారణంగా రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వం నుంచి 17 విపత్తులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఇవ్వనేలేదు. దీనికి తోడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఉచిత పంటల బీమా కింద రైతు తరఫున కూడా ప్రభుత్వమే ప్రీమియం కట్టి.. పంట నష్టపోయిన రైతులకు రూ.7,400 కోట్ల నుంచి రూ.7,800 కోట్ల మేర బీమా పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు లేకుండా చేయడంతో బీమా పరిహారం రాకుండా పోయింది. రాష్ట్రంలో ఖరీఫ్ సమయంలో 84 లక్షల మంది రైతులు, కౌలు రైతులు పంటలు సాగు చేస్తే.. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? రోజూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నష్టపోయిన రైతులకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో ఆ ఉపన్యాసాల్లో ఎక్కడా చెప్పరు. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది కాకుండానే అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఒకవైపు పెట్టుబడి సాయం దక్కలేదు. మరోవైపు మా ప్రభుత్వంలో సీజన్ ముగిసే సమయానికి అందే ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కనిపించకుండా పోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము రాకుండా పోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఇన్ని కష్టాల మధ్య రైతు సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి చూస్తున్నాం. పోయిన ఏడాది ధాన్యం, పొగాకు, ఉల్లి, టమాట, మామిడి, సజ్జ, చీనీ, మిర్చి.. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర దక్కలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మోంథా తుపానులో నష్టపోయిన రైతుల నుంచి ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు ఎంఎస్పీ ప్రకారం రూ.1,776 రావాలి. అయితే రూ.1,200, రూ.1,300కు ఇస్తారా? అని దళారులు రైతులను అడుగుతున్నారు. ఇంకో పక్క దిత్వా తుపాను పంట కోతల(హార్వెస్టింగ్) సమయంలో వస్తుందని 10రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళ్లాల మీదే ఉందని తెలుసు. పంట కొనకుంటే ధాన్యం తడిచి పోతుందనీ తెలుసు. రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. ధాన్యం కొనకపోతే మరింత నష్టాల్లో కూరుకుపోతారని తెలిసి కూడా చంద్రబాబు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులు వచి్చనప్పుడు ఎలాంటి స్పందన ఉండేదో ప్రజలు ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం మొత్తం పనిచేసేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, ధాన్యం సరఫరాకు లారీలు సమకూరేవి. ధాన్యం కొనుగోలుకు వెనువెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. ధాన్యం సేకరణ, తరలింపునకు మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయ్యేది. వర్షానికన్నా ముందే పంట కొనుగోలు పూర్తి చేసేవాళ్లం. ఇవన్నీ గతంలో జరిగాయి. ఈ రోజున రైతులు ఏమైపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేజీ అరటి పండ్లు అర్ధ రూపాయికొబ్బరి, అరటి, వేరుశనగ పంటలదీ ఇదే పరిస్థితి. ఏ పంటకూ రేట్లు లేవు. కేజీ అరటి అర్ధ రూపాయి అంటున్నారు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? ఇంత ఘోరంగా పాలన సాగుతోంది. అదే మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీంతో రైతులకు దళారుల బెడదల తప్పింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. మా ప్రభుత్వం రాక మునుపు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే 2023–24లో 3 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభించాం. కరెంట్ బిల్లుల ఖర్చు వస్తుందని దానిని మనుగడలో లేకుండా చేయడం దుర్మార్గం.డైవర్ట్ చేయడం కోసమే ‘రైతన్నా.. మీ కోసం’ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారిపోయింది. ఆర్బీకేలు, ఈ–క్రాప్ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. తూతూ మంత్రంగా ఈ–క్రాప్ చేస్తున్నారు. ఒక పొలంలో రైతును నిలబెట్టి, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట సాగు చేశారో ఆర్బీకేకు అనుసంధానం చేసేదే ఈ–క్రాప్. ఆ రైతుకు భవిష్యత్లో గిట్టుబాటు ధర రాకపోయినా, పంట నష్టం వాటిల్లినా ఆదుకునే వ్యవస్థ ఆర్బీకే ద్వారా ఉండేది.ఆర్బీకేల్లో పంటల వారీగా గిట్టుబాటు ధరల పట్టికలు ప్రచురించే వాళ్లం. ఎక్కడైనా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్(క్రియాశీలకం) అయ్యేది. జాయింట్ కలెక్టర్ దృష్టికి సమస్య వెళ్లేది. ఆయన మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ను అప్రమత్తం చేసి పంట కొనుగోలు చేసేవారు. మార్కెట్లో పోటీ సృష్టించేవారు. ఈ క్రమంలో మేం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం దాదాపు రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘రైతన్నా.. మీ కోసం’ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.. అంటూ ఈనాడులో యాడ్ కూడా వేసుకున్నారు. అసలు వీళ్లు రైతుల దగ్గరకు పోయే పరిస్థితే లేదు. పోతే రైతులు తిడతారు, కొడతారు కూడా.. రైతుల దగ్గరకు పోకుండానే కార్యక్రమం విజయవంతం అయినట్టు ఆశ్చర్యకరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలయ్యాయా? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ ఇచ్చారు? ఇలా ఎన్నెన్నో 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ–5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ధాన్యం, ఉల్లి, టమాటా, అరటి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఏపీ’ అన్న తరహాలో ఉంది. హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోంది. – వైఎస్ జగన్➤ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.72 వేలు భృతి ఇవ్వాలి. ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతిగా రూ.72 వేలు చెల్లించారా? ఇది మోసం కాదా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్నికలకు ముందు బాండ్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనేలేదు. మరి సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది?➤ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.18 వేలు.. రెండేళ్లకు ఒక్కరికైనా రూ.36 వేలు ఇచ్చారా? ఇది మోసం కాదా?➤బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు, రెండేళ్లకు రూ.96 వేలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలే. ఇది మోసం కాదా?➤అమ్మ ఒడి పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లాడికి రూ.15 వేలు అన్నారు. తీరా చూస్తే తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదికి వచ్చే సరికి 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. రూ.15 వేలు కాకుండా రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. కొందరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం మోసం కాదా?➤దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. రెండేళ్లకు ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది రెండే. అవీ అందరికి ఇవ్వలేదు. ఇది మోసం కాదా?➤ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఇన్ని 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే కదా? అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా. -
Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ
-
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్లు చేస్తున్నారుబాబు అండ్కో గోబెల్స్ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
అరుణాచలంలో రోజా పూజలు
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, జీసీసీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ గా బద్వేల్ హజీ ఇలియాస్, కో- కన్వీనర్లుగా గోవిందు నాగరాజు (కువైట్), దొండపాటి శశి కిరణ్ (ఖతర్), మహమ్మద్ జిలాని భాష (దుబాయ్) నియమితులయ్యారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
ఈ మూడింటిలో ప్రభుత్వం విఫలం.. చంద్రబాబుపై తమ్మినేని ఫైర్
-
కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ విజయంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధిరావాలని అవినాష్రెడ్డి అన్నారు. కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18 వేలు వంటి పథక పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి టీడీపీ నాయకులకు లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు క్రైంను నమ్ముకున్నారు...పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం’’ అని అవినాష్రెడ్డి చెప్పారు. -
‘బాబూ.. అధికారం శాశ్వతం కాదు.. కేసులున్నాయ్ కదా?’
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడతారని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం కోసం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పడతారు. అధికార దుర్వినియోగంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. పల్నాడులో జంట హత్యల కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని హత్యలు చేసుకున్నాయని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసు ఎందుకు పెట్టారు?. ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నేతని కూడా టీడీపీ రెండో వర్గమే హత్య చేసింది. దోచుకుని, దాచుకునే విషయంలో గొడవలు పడి వారికి వారే హత్యల దాకా వెళ్తున్నారు. అలాంటి కేసుల్లో మా వారిని ఎందుకు ఇరికిస్తున్నారు?జోగి రమేష్ సోదరుల మీద కూడా అలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం బయట పడినప్పుడు జోగి రమేష్ లేడు. ఆ తర్వాత కావాలనే జోగి బ్రదర్స్ మీద అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఒంటినిండా రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుదారి పట్టించి బెయిల్ తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరించటానికి వీల్లేదని బెయిల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు.ఇవన్నీ బయటకు తెలుస్తాయని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రోజుకొక వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. పల్నాడులో చంద్రబాబు హయాంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. వైఎస్సార్, జగన్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. డిప్యూటీ సీఎం సినిమాకు వెయ్యి, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు రూ.500 రేటు పెంచారు. నారా లోకేష్ సినిమా తీస్తే రూ.1500 పెంచుతారు. అధికార దుర్వినియోగం చేయటంలో కూటమి నేతలు ముందున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
రైతన్న కోసం అశోక్ బాబు వినూత్న నిరసన
-
‘పవన్కు ‘పీపీపీ’ పక్కాగా సూట్ అవుతుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని వ్యాఖ్యలు చేశారు. అలాగే, పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయని పార్టీ నేత సతీష్రెడ్డి ఎద్దేవా చేశారు.పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..‘కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి ఇష్టపడి పనిచేయాలి. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18,000, వంటి పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అందుకే పచ్చ పార్టీ నేతలు దాడులు, నేరాలు చేస్తున్నారు.పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితిని అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం అని అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య, నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ అయ్యాయి. చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ఎల్లో మీడియా ద్వారా డబ్బాలు కొట్టుకుంటున్నాడు. పీపీపీ విధానం పవన్ కళ్యాణ్ మాత్రమే వర్తిస్తుంది. పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయి. మహిళలకు ఏడాదికి 18000, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి రైతు భరోసా పంటి పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాడు. జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది!
తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్కు ధైర్యం చెప్పారు. -
చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్! జైలుకు వెళ్లడం పక్కా
-
కూటమి సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా:రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:బంద్కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్ 2న నెల్లూరు బంద్కు టీడీపీ, వైయస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు లేవు.ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్కు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి (మంగళవారం) బంద్ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.


