breaking news
YSRCP
-
Guntur: అంబటిని పరామర్శించిన YSRCP నేతలు
-
మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్ అసహనం
ఏపీ శాసన మండలి అప్డేట్స్..ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారువైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాంసుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నాబైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్లలో బైబిల్ పట్టుకున్నారుమీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదుచంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్ జగన్ది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారునవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు వైఎస్సార్, వైఎస్ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్. దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్ జగన్పై బురద జల్లుతున్నారుఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలిఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.వైద్యానికి వైఎస్సార్, వైఎస్ జగన్ పెద్దపీట వేశారుఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసిందిబిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి శాసనమండలి మీడియా పాయింట్..ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్.. పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారుతప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారుగత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారుప్రభుత్వం మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారుఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?పోర్టుల అనుసంధానం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయిగత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదురేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదనఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికిమంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహంకూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానంమంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులుఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రిసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు సూచించిన చైర్మన్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారునీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారుఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారుమూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్సశాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి. ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి. బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు.. ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు కోర్టు కేసులు క్లియర్ చేయలేదుఎన్ఓసీ తీసుకురాలేదువైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారుఅన్ని అనుమతులు తెచ్చింది జగన్కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారుఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు. నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభంనేడు వ్యవసాయంపై లఘు చర్చశాసనమండలి..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదుగతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించిందితురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదుడయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి -
నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని.. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్ జగన్.. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది’ అని అన్నారు. ఈ క్రమంలోనే నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నేనున్నా.. భయపడకండి..
-
ఏ డెయిరీ తీగ లాగినా బయటపడుతున్న చంద్రబాబు హెరిటేజ్ డొంక
-
‘అన్నదాత సుఖీభవ’లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో రైతులను నిలువునా మోసంచేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద లబ్దిపొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ను ఎగ్గొట్టడమే కాకుండా... రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మాత్రమే చెల్లించింది. మూడో విడత అసలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేసినట్టు ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2023–24లో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద 53.18 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైంది. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు బి.విరూపాక్షి, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాల్లో రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లించగా, శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం రూ.8,862.89 కోట్లు ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. ఒక్కో రైతుకు రూ.30వేలు ఎగనామం ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసే ఎత్తలేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఏడాది అన్నదాత సుఖీభవను అమలు చేశారు. అది కూడా రాష్ట్ర వాటా రూ.14 వేలు, పీఎం కిసాన్ కింద మరో రూ.6 వేలు కలిపి రూ.20 వేలు.. అంటూ చంద్రబాబు మాట మార్చారు. అయితే, గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే 6.32 లక్షల మందికిపైగా రైతులను తగ్గించి అరకొరగా రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు చొప్పున చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మూడో విడత ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వాటా రూ.4,685.84 కోట్లు, కేంద్రం వాటా రూ.4,177.05 కోట్లు కలిపి రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం విస్తుగొలుపుతోంది. -
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
ఈ ప్రభుత్వమే కల్తీ
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కల్తీ సర్వసాధారణంగా మారిందని, ఈ ప్రభుత్వమే కల్తీదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పాలు, నీళ్లు, ఆహారం, మద్యం.. ఇలా అన్నింటా కల్తీ విలయ తాండవం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారన్నారు. 20 నెలల పాలనలో మొత్తం 36 కల్తీ ఘటనలు జరిగితే.. 900 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని, 40 మంది చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సంపాదనపై దృష్టిపెట్టిన చంద్రబాబు పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, ఫలితంగానే కల్తీలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. మాజీ మంత్రులు విడదల రజిని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఏమన్నారంటే.. 20 నెలల్లో 36 ఘటనలు ‘కల్తీ పాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. 2024 జూలైలో తొలిసారి శ్రీకాకుళం కేజీబీవీ హాస్టల్లో డయేరియా ప్రబలినప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. 20 నెలల్లో 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేదలే బలైపోతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సింథటిక్ మిల్క్ తయారీ యూనిట్ వెలుగులోకి వచ్చినా కనీసం పట్టించుకోలేదు. కల్తీ పాల ఘటనను డైవర్ట్ చేసి, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కూలెంట్ లీకేజీ అయిందంటూ కథనాలు అల్లుతోంది. రక్తం, పాల నివేదికలు రాక ముందే ఇలా ఎలా ప్రకటిస్తారు? మీరేమైనా సీసీ కెమెరాలో చూశారా? రాష్ట్రంలో 200 లక్షల లీటర్ల పాలు అనధికారంగా సరఫరా అవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ, ఆ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చింది. అందుకే పాలు, తిండి, నీరు, ఆఖరికి కల్తీ మద్యం.. ఇలా ప్రతిదాన్నీ కల్తీ చేస్తూ దోపిడీ చేసేవారి ఆగడాలు ఎక్కువైపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా డయేరియాతో 900 మంది ఆస్పత్రుల్లో చేరారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైన బాధితులు రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యం నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల ఫీజులతో దోపిడీ చేస్తున్నాయి. రితిక్ అనే బాలుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రిలో రూ.8.50 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి కల్తీ పాల దారుణాలు వెలుగు చూసినా స్పందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. బాధితులకు ఏకంగా డయాలసిస్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఘోరంగా ఉందని అర్థమవుతోంది. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం ఇది. ఏమవుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు చనిపోయారు. ఎంతోమంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందించాలి. ఇప్పటికే ఆస్పత్రులు తీసుకున్న ఫీజులు వెనక్కివ్వాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
‘మీకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారు?’
తాడేపల్లి: కూటమి నేతలకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం ఉందని ఎలా అనుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బరితెగించి మరీ మాట్లాడారని, పవన్ పని గట్టుకుని తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇదంతా చూస్తుంటే దేవుడంటే భయలేకుండా బరితెగించి మాట్లాడమేనని పేర్ని నాని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ క్లియర్గా చెప్పింది. అయినా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ మాట్లాడుతున్నారు. పవన్, లోకేష్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..బందిపోట్లకు మించిన ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు ఉందంటూ ఈరోజు కూడా మాట్లాడారుఇంతకు మించిన బరితెగింపు లేదుతిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు చేశారుచంద్రబాబుకు దేవునిమీద భక్తి, భయం ఏదీ లేదుఅందుకే విజయవాడలో అనేక ఆలయాలను చంద్రబాబు కూల్చారుప్రసిద్ధ కాశీనాయన క్రేత్రంలో సత్రాలను కూల్చింది కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వమేకూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ మంత్రిత్వ శాఖ అధికారులే సత్రాన్ని కూల్చారుపవన్ ఆదేశాలు లేకుండా కూల్చటం సాధ్యం అవుతుందా?సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించలేదా?ఇది నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కాదా?తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే బాధ్యత లేదా?తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిందెవరు?గోదావరి పుష్కరాలలో 29 మంది చావుకు కారణం ఎవరు?తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిందెవరు?ఈ పాపాలన్నీ చేసింది చంద్రబాబేఅలాంటి చంద్రబాబు.. జగన్ మీద విషం కక్కుతారా?రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారుపెంటపాడులో రథాన్ని తగులపెడితే ఎందుకు నిర్మాణం చేయలేదు?అంతర్వేదిలో రథం తగుల పడితే కోటి ఖర్చుతో జగన్ హయాంలో కొత్తది నిర్మించారురామతీర్థంలో రూ.3 కోట్లతో రాతి నిర్మాణంతో ఆలయాన్ని జగనే నిర్మించారుచంద్రబాబు హయాంలో కూలదోసిన విజయవాడ ఆలయాలను కూడా జగనే నిర్మించారుకొన్ని వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను జగనే నిర్మించారుతిరుమలలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానన్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు?చంద్రబాబుకు దమ్ముంటే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయగలరా?గదులు తీసుకోవాలన్నా లంచాలు ముట్టచెప్పాల్సిందేకొండ మీద అవినీతి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారు?జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టు కింద 5,263 పనులు ఆలయాల్లో చేసినమాట నిజం కాదా?రెండో సంతకంతో నియమించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు?తిరుమల నుండి జీఏడీలోకి ఎందుకు పంపారు?జులైలో నెయ్యి శాంపిల్స్ తీసి నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపారుల్యాబు రిపోర్టు ప్రకారం కల్తీ కలిశాయని వెనక్కు పంపారుఅవి రాఘవేంద్ర క్రషర్ దగ్గర పార్క్ చేశారుఆ ట్యాంకర్లను మళ్ళీ వైష్ణవి డెయిరీ పేరుతో కొండ మీదకు పంపారుచంద్రబాబు కూటమి ప్రభుత్వమే ఈ పాపపు పని చేసి, జగన్కు అంటగట్టే ప్రయత్నం చేశారువైష్ణవి, బోలేబాబా డెయిరీలు ఎవరివి?పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరూ బోలేబాబా, వైష్ణవి డెయిరీలకి ఓనర్లుటీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీకి ఉన్న సంబంధం ఏంటి?పొమిల్ జైన్, విపుల్ జైన్ లకు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయిఏఆర్ డెయిరీ ఓనర్ రాజురాజశేఖర్తో చంద్రబాబుకు సంబంధం ఉందా లేదా?దిండిగల్ లో హెరిటేజ్ ఫ్యాక్టరీని కట్టించింది ఎవరో చంద్రబాబుకు గుర్తుందా?జగన్ హయాంలో నిబంధనలు మార్చారంటున్న చంద్రబాబు.. మరి ఇప్పటికీ దాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు?పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పార్థసారథి, ప్రశాంతిరెడ్డి రికమెండేషన్ చేశారువారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నారు2022 లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణలు చేశారుఆ రిపోర్టును పైవారికి పంపకుండా కింద వారు తొక్కి పెట్టారని సీబిఐ చెప్పిందా లేదా?ఆల్ఫా, మాల్ గంగా, ప్రీమియర్ డెయిరీలు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటున్న చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు కొనసాగించారు? -
పులివెందుల చేరుకున్న జగన్
-
బాబు సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణపాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజనికల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.రెయిన్బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారుబాధితులకు అండగా ఉంటాం: తానేటి వనితఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి. -
మరి మీరు అమ్మేది కల్తీనా?.. లోకేష్కు బొత్స కౌంటర్
సాక్షి, అమరావతి: నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వెయ్యిలోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘‘హెరిటేజ్ 750 ఎంఎల్ నెయ్యి రిలయన్స్లో 456కి దొరుకుతుంది. హెరిటేజ్లో లీటర్ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.‘‘హెరిటేజ్ వెబ్సైట్ని ఎందుకు మర్చారో లోకేష్ చెప్పాలి. మొదట ఇందాపూర్ని మ్యాన్ఫాక్చర్ అని చెప్పారు. తర్వాత కో మ్యాన్ఫ్యాక్చర్ అని ఎందుకు మర్చారు? అంటూ బొత్స నిలదీశారు.కాగా, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు. -
నారావారి హోమ్ కు మంత్రి కాదు.. హోమ్ మంత్రివి మంత్రి అనితపై సెటైర్లు
-
కూటమి ఎమ్మెల్యే మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు
-
ఏపీలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయి: వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే 10 శాతం నేరాలు పెరిగాయన్న వరుదు కళ్యాణి.. హోంమంత్రి అనిత ఇంఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు.‘‘గంజాయి లేదని హోంమంత్రి చెబుతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి డమ్ములో వేసి చంపేశారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. 112కి ఫోన్ చేస్తే రావడానికి 25 నిమిషాలు తర్వాత స్పందిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాపాడండని వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. ఆడపిల్లలంటే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. వరుదు కళ్యాణి ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పలేదు.మండలిలో మైకుల సమస్య ఏపీ శాసన మండలిలో మైకుల సమస్య ఏర్పడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రుల సమాధానం చెప్పినప్పుడు మైకులు మ్యూట్లోకి వెళ్తున్నాయి. మైకుల సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ దృష్టికి శానమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు.లా ఉంది.. కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదు: భరత్ ఎమ్మెల్యే భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదన్నారు. కొత్త చట్టాలు ఏయే రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్రం ఓ నివేదిక ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నివేదికలో ఏపీ 36వ స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులపై పెట్టిన శ్రద్ధ పోలీసింగ్పై పెట్టాలి. అలా చేస్తే రాష్ట్రం పరువైనా మిగులుతుందని భరత్ అన్నారు.టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతలపై చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు.ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. గంజాయి మత్తులో మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికను చంపిన వ్యక్తి కూడా గంజాయి మత్తులో చనిపోయారని హోంమంత్రి చెబుతున్నారు. గంజాయి ఏరులై పారుతోందనడానికి ఇదే నిదర్శనం. కిందిస్థాయి నుంచిపై స్థాయి వరకూ పోలీసులు కుమ్మక్కైపోయారు. చినబాబుకి ఎంత పెదబాబుకి ఎంత అని వాటాలు పంచుకుంటున్నారు. మాజీ మంత్రుల ఇంటి పై దాడులు చేస్తే కేసుసులుండవ్. బాధితులపై మాత్రం కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్ దిశా యాప్ను తెచ్చారు. -
‘పాల’కులదే కల్తీ పాపం
రాజమహేంద్రవరం రూరల్: కల్తీ పాల పాపం చంద్రబాబు సర్కారుదేనని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కల్తీపాల వల్ల అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా పరామర్శించారు. అలాగే కల్తీపాల వల్ల మరణించిన కుటుంబాలను వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వారు విలేకరులతో మాట్లాడారు.కల్తీ పాల వల్ల దాదాపు వారం రోజులుగా ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు సర్కారుకు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై, భద్రతపై లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని వారి పనిని వారిని చేసుకోనిస్తే ఇలా ప్రజల ప్రాణాలు పోవని రాజా పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఏ ఒక్క అధికారి ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధితుల ఆస్పత్రుల బిల్లులకే రూ.లక్షలు ఖర్చవుతున్నాయని, రెండేళ్లలోపు చిన్నారి రితిక చికిత్సకు ఇప్పటివరకు రూ.8.50 లక్షలు ఖర్చయిందని రాజా ఆవేదన చెందారు. మృతదేహాల పోస్టుమార్టం, అంత్యక్రియలకు ప్రభుత్వం హడావుడి చేయడం అనుమానాలకు తావిస్తోందని రాజా మండిపడ్డారు.బాధితులకు తమ పార్టీ నాయకుల ద్వారా సాయం అందజేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతగానితనం వల్లనే పాల కల్తీ ఘటన జరిగిందన్నారు. వారం పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులు చేరుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నెలల పిల్లలూ కల్తీ పాల బారిన పడ్డారని, వారికీ డయాలసిస్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లే దని మండిపడ్డారు. తక్షణం సర్కారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం
దేవుడి ప్రసాదంలో కల్తీ అంటూ డెయిరీలను భయపెట్టి సొంత డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న పాల కల్తీపై లేకపోయింది. పాల కల్తీ బయటపడి వారం రోజులవుతున్నా.. వరుసగా ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్ఘాంతపరుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుసుకోవడానికి రాజమహేంద్రవరం పాల కల్తీ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల దుర్ఘటన మరణ మృదంగం మోగిస్తోంది. లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలో చోటుచేసుకుంటున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి రమణి (58) మరణించారు. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా.. అధికారులు మాత్రం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 17 మంది బాధితులు ఒక్కసారిగా మూత్రం ఆగిపోవడం (అనూరియా), వాంతులు, విరేచనాలు కావడం, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మంది కిమ్స్, రెయిన్బో, రవి చైతన్య, సన్స్టార్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్లో ఏడుగురు చికిత్స పొందుతుండగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెయిన్బోలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఐదు నెలల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అభం శుభం తెలియని పసివాడికి చికిత్స అందిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదిత్య ఆస్పత్రిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రవి చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరికొందరు జయ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా.. వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం కల్తీ పాల బాధితులు 19 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మంది మృతి చెందగా.. మరో 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం మొత్తం బాధితులు 17 మందేనని స్పష్టం చేశారు. వీరిలో నలుగురు మృతి చెందారని చెబుతున్నారు. కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజులు పాలల్లో కల్తీని నిర్ధారించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాల వ్యాపారి గణేష్ నుంచి పాలు పోయించుకుంటున్న 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఈ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను వైజ్ఞానిక, పశు సంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపించారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు సైతం పంపించామన్నారు. వెలుగులోకి కీలక విషయాలు కల్తీ పాల కలవరానికి కారణమని భావిస్తున్న పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు తెలిసింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలోని 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్ అనే వ్యాపారి ప్రతిరోజూ పాలు పోస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి కావడంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో రోజూ పాలుపోసే వారితో కలిపి మొత్తం 126 కుటుంబాలకు గణేష్ ఆ రోజు పాలు పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. 16వ తేదీన పోసిన పాలు కొంచెం చేదుగా ఉన్నాయని వినియోగదారులు గణేష్ దృష్టికి తీసుకెళ్లగా.. మరునాటి నుంచి అలా జరగదని అతడు చెప్పడంతో మిన్నకుండిపోయారు. తిరిగి సాధారణంగా ఎప్పుడూ ఉండే రుచే ఉండటంతో వినియోగదారులు పట్టించుకోలేదు. ఆ రోజు గణేష్ నరసాపురం గ్రామ పరిసరాల్లో పాలను సేకరించినట్లు సమాచారం. దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాలు ఎక్కడెక్కడ, ఎవరెవరి నుంచి సేకరించాడనే విషయమై ఆరా తీస్తున్నారు. అనధికార డెయిరీ సీజ్ పాల వ్యాపారి గణేష్ నరసాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని పోలీసులు సీజ్ చేశారు. పాలు సేకరించే పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. వెనిగర్, పాలు, కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు. పాలు, నీళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పశువుల రక్త నమూనాలు సైతం సేకరించారు. కారణాలు బయటకొచ్చిన వెంటనే గణేష్తో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కాలనీల్లో వైద్య బృందాలు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. పాలు వినియోగించిన వారి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అధికారులు 18 బృందాలుగా విడిపోయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కల్తీ పాల బాధితులను, బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్లో పర్యటించి ఏం జరిగిందనే విషయంపై బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరా తీశారు.మా ఇంట్లో ముగ్గురి పరిస్థితి విషమం మా ఇంట్లో నా తల్లి, తండ్రితో పాటు నా కుటుంబ సభ్యులు నలుగురికి కిడ్నీ విఫలమైంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శివరాత్రి నాడు మా పాల వ్యాపారి అందించిన పాలు తీసుకున్న తర్వాత ఈ అనర్థం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత అంటే.. ఈ నెల 22న అందరికీ మూత్రం ఆగిపోయింది. కుటుంబంలో అందరికీ ఒకే సమస్య రావడంతో ఆందోళనకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. – మధు, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంశరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి మా మనవరాలు నాలుగు రోజుల క్రితం పాలు తాగిన వెంటనే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆ పాల వ్యాపారికి మేం ఈ విషయం చెప్పాం. పాలు చేదుగా ఉన్నాయని తెలిపాం. కొత్తగా గేదె ఈనిందని, అందుకే పాల రుచిలో తేడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అతను పాలు పోసిన ఇళ్లలో కిడ్నీ బాధితులు బయటపడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నాం. మా మనవరాలిని ఆస్పత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. – షేక్ సిరాజుద్దీన్, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంమిగతా వారిలోనూ సమస్యలు రావొచ్చు ఈ నెల 14న రాత్రి మూత్ర సమస్యతో నా వద్దకు కొందరు వచ్చారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచినీటి సరఫరాపై అనుమానం కలిగింది. మంచినీటి సరఫరా బాగానే ఉందని మున్సిపల్ అధికారులు స్పష్టంచేయడంతో రోగులు తీసుకున్న ఆహారంపై ఆరా తీయగా పాలు తాగిన తర్వాత ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. ముందుగా బలహీనంగా ఉండే వృద్ధులు, చిన్నారులపై కల్తీ పాలు ప్రభావం చూపించాయి. మిగతా వారిలో కూడా భవిష్యత్లో అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అందుకే ఆ పాలు తాగిన వారందరూ కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శశాంక్, కిడ్నీ వ్యాధుల నిపుణుడు, రాజమహేంద్రవరంఅందని ప్రభుత్వ వైద్యంబాధితులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూత్ర విసర్జన స్తంభించడం, కిడ్నీ సమస్యలు, వాంతులు, విరేచనాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్కు మూడేళ్ల చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లగా తమవద్ద వైద్య సదుపాయాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు లబోదిబోమంటూ తిరిగి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే విధంగా మరో చిన్నారి రితిక్ చికిత్స కోసం ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.8.50 లక్షలకు పైగా ఖర్చయింది. మిగిలిన బాధితులకు సైతం వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. -
‘ఇందాపూర్’పై చర్చించాల్సిందే
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో మండలి ప్రారంభం కాగానే టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, వై.శివరామిరెడ్డి, పీవీవీ సూర్యనారాయణరాజు వాయిదా తీర్మానం ఇచ్చారు.దానిని తిరస్కరించిన చైర్మన్ మోషేన్రాజు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్దే నిలుచుని ఇందాపూర్పై చర్చ జరగాలి.. హెరిటేజ్పై చర్చ జరగాలి... తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి... అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని చర్చకు పట్టుపట్టారు. అదే సమయంలో పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ పోడియం ముందుకు వెళ్లి పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో... ప్రారంభమైన ఏడు నిమిషాలకే చైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.సభ ముగిశాక మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోల్ని చెప్పులతో పట్టుకున్నామని సీసీ ఫుటేజ్ సగం తీసుకొచ్చి నానా హడావుడి చేశారు. బీఏసీ మీటింగ్లో ఫూర్తి ఫుటేజ్ కావాలని కోరాం. అందులో చూస్తే వైఎస్సార్సీపీ సభ్యులు దేవుని ఫొటో పట్టుకున్నప్పుడు చెప్పులు ధరించలేదని స్పష్టంగా ఉంది. చెప్పులు ధరించినట్లుగా ప్రచారం చేస్తున్న దృశ్యాలు లేవు. కాబట్టి ఈ వీడియోల్ని ఎలా మారి్ఫంగ్ చేశారన్నది చర్చించాలని మండలి చైర్మన్ను కోరాం.అలాగే, మండలిలో మేం మాట్లాడేది బయటకి రావడంలేదు. టీడీపీ సభ్యులు మాట్లాడితేనే లైవ్ ఇస్తున్నారు. అసలు మండలిలోని మా ఫొటోలు బయటికెవరు విడుదల చేశారు?’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ కోసం మేము చేస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. బీఏసీ సమావేశం సోమవారం జరిగింది.. ఇందులో ఈనెల 26న మండలిలో చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడితే ఇప్పటివరకూ తప్పించుకున్నారు.సీబీఐపై నమ్మకంలేకే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను వేసింది.. అయితే, న్యాయస్థానాలపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. బీఏసీ భేటీలో మూడు అంశాలపై చర్చ చేపట్టాలని కోరాం. ఇందులో మొదటిది.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, రెండోది.. రైతుల ఇబ్బందులు, మూడోది.. లడ్డూ నెయ్యి. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేశారు.. గిట్టుబాటు ధరలేదు.. బీమా లేదు.. పొగాకు, మిర్చి, మొక్కజొన్న, కోకో, మామిడి రైతులు ఇబ్బందిపడుతున్నారు’ అని బొత్స తెలిపారు. విశాఖలో భూదోపిడీపైనా చర్చిస్తాం.. ‘మండలిలో విద్య, సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చిద్దామన్నారు. అందుకు అంగీకరించాం. వైజాగ్లో గీతం వర్సిటీ పేరు మీద రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న మొన్న పెట్టిన స్టార్టప్ కంపెనీలకు 99 పైసలకే కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపైనా చర్చ కోరాం. విశాఖలో భూములను చంద్రబాబు కుటుంబం ఎలా దోచుకుంటుందో మండలిలో చర్చిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హెరిటేజ్ వెనుక ఉన్న ఇందాపూర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో కేజీ నెయ్యి రూ.560 (జీఎస్టీ అదనం)కి అమ్ముతూ.. టీటీడీకి మాత్రం రూ.658కు సరఫరా చేస్తోంది.దీన్నిబట్టి ప్రజలకు కల్తీనెయ్యి అమ్ముతున్నారని అనుకోవాలా? లేక టీటీడీకి ఎక్కువ ధరకు సరఫరా చేస్తూ శ్రీవారి సొమ్మును దోచుకుంటున్నట్లు అనుకోవాలా? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. టీడీపీ కూటమి నేతలకు, వారి సంస్థలకు ధనార్జన ఆశ లేకపోతే దేవుడికి సరఫరా చేసే నెయ్యి రేటు తగ్గించి ఇవ్వాలి కదా?’ అని ప్రశి్నంచారు. కల్తీ పాలు మరణాలు సర్కారు హత్యలే.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడం, 20 మంది వరకూ ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అర్ధంచేసుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం, దిగువ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడంవల్ల ఈ మరణాలు జరిగాయి. గతంలో కల్తీసారా మరణాలు చూశాం.. కానీ, కల్తీ పాలతో జనం చనిపోవడం ఇప్పుడే వింటున్నాం. అన్ని శాఖల్నీ గాలికొదిలేశారు. పచ్చ మీడియా వాస్తవాలు పక్కనబెట్టి ప్రభుత్వాన్ని మోస్తోంది. రాజమహేంద్రవరంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. కల్తీ చేసిన వారితో పాటు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే భయం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.బాబు దుర్మార్గాలు బయటకొస్తున్నాయి.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచి్చంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హెరిటేజ్కి వీఎస్ఆర్ ఏవియేషన్కు ఉన్న బంధం ఏంటో రోహిత్ పవారే బయటపెట్టారు. దీనికి అధికార పక్షం ఏం సమాధానం చెబుతుంది? హెరిటేజ్ సంస్థ పాలు, పెరుగు వ్యాపారం మాత్రమే చేస్తుందని అందరం అనుకున్నాం. కానీ, హెరిటేజ్ ఫిన్లీజ్ అనే మరో సంస్థ ద్వారా వీఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడులు పెట్టిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు దుర్మార్గాలు ప్రజలకు ఒకొక్కటిగా తెలిసిపోతున్నాయి. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం పైన పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్
-
‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’
గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
తిరుపతి నెయ్యి.. రాజమండ్రి పాల ఘటనపై బొత్స స్ట్రాంగ్ రియాక్షన్
-
‘వీఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్లీజ్ ఉంది’
తాడేపల్లి : వీఎస్ఆర్ వెంచర్స్కు హెరిటేజ్ ఫిన్లీజ్కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్లీజ్ ఉందన్నారాయన. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్వేనన్నారు. ఆ విమానాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్ కొన్నారన్నారు. దాన్ని చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్టుగా లెక్కలు చూపించి వాడబోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. -
ఎడిటింగ్ వీడియోతో లోకేష్ డ్రామా మండలి ఫుటేజ్ కోసం YSRCP డిమాండ్
-
మార్కెట్లో 560కే ఇంద్రపూర్ నెయ్యి టీటీడీకి మాత్రం 658కి ఎలా?
-
‘అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణం’
విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 23వ తేదీ) మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారుపంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బొత్స మరోసారి స్పష్టం చేశారు. బీఏసీలో మూడు అంశాలపై ప్రస్తావించామని, అందులో రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూడా చర్చ జరగాలని కోరామని, కారు చౌకగా భూములు కేటాయింపులపై కూడా చర్చకు పట్టుబట్టునట్టి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం సభ్యలు.. యూనివర్శిటీ పేరుతో విశాఖలో భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వీడియో ఫుజేట్ను మాకు ఇవ్వాలని కోరాంసభలో వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్ చూపించిన ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్ను కోరామన్నారు బొత్స. -
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
‘చంద్రబాబు.. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు’
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అజిత్ పవార్ ప్రమాదం వెనుక భారీ కుట్ర.. నాగార్జున యాదవ్ సంచలన నిజాలు
-
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(మంగళవారం) పులివెందుల చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్లో పాల్గొంటారు. అలాగే, ఎల్లుండి(బుధవారం) వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్కు వైఎస్ జగన్ హాజరు అవతారు. -
‘చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’
సాక్షి, నెల్లూరు : వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద అవగాహనే లేదన్నారు. వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారని ఆరోపించారు.రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వర ప్రదాయిని. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయింది. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది.రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై భవిష్యత్లో చేయాల్సిన పోరాటాల గురించి జిల్లా నేతలతో చర్చించాం. మన నీటిని ఇతర రాష్ట్రాలు వాడుకుంటూ ఉంటే.. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదని చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఈ ప్రాంతం ఏడాదిగా మారుతుంది. లక్షల ఎకరాలు బీడుగా మారుతాయి. రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఏడారి అవ్వడం ఖాయం. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోయి లిఫ్ట్ ఇరిగేషన్ను సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన గొంతులు, భూములు తడిపే ప్రాజెక్ట్. వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారు. మార్చి ఒకటో తేదీన కడపలో ఆరు నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్
-
టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్పై బొత్స ప్రశ్న
శాసన మండలి అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయిప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయిమొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి విడుదల చేయాలిమేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదుప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారుఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదుప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నంప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.దేవాలయంగా భావించే సెక్రటేరియట్కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారుచంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారుదేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారుమండలి ఛైర్మన్ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.బొత్స చిట్చాట్..ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నంఅందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాంమేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారుఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలిమేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాంచంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాంమేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయిసాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారుతిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంమేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదుమాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారుమొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ను కోరాంమేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదుమండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారుశాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరంబీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారుతప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చిందిసభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందిసెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారుఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదుప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలిఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలిఅధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్ను బయటపెట్టండిమాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారుమరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయినేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండిఈ క్షణమే రాజీనామా చేస్తాహౌస్ మొత్తం ప్రొసీడింగ్స్ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందిసభలో ప్రొసీడింగ్స్ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్ను విడుదల చేయండిలేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదుకేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదుదళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందిచంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాంమేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాందేవదేవుడంటే మాకు అమితమైన భక్తితిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబులడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబుమండలిలో మొత్తం ఫుటేజ్ను బయటపెట్టాలిచంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారుఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాంకానీ చర్చ జరగనివ్వడం లేదుఅందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాంపోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదుమేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారుమండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాంకానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారుమాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాందమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..ఏపీలో శాంతిభద్రతలు లేవుప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారుఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదాలడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుందిమండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారుశాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారుమండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదుమా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.టీటీడీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 👉 శాసనమండలి కాసేపు వాయిదా.. టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్సతిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్సఅసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందిదేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.శాసనమండలిలో గందరగోళంచైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలునినాదాలు చేసిన ఇరుపక్షాలుసభలో గందరగోళ పరిస్థితి..సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్శాసన మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. -
అబుల్ కలాం ఆజాద్కు వైఎస్సార్సీపీ ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖా మంత్రిగా దేశానికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. లౌకిక జాతీయవాదాన్ని బలంగా సమర్ధించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్ హయాంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, ఎస్ఈసీ మెంబర్ షేక్ మెహబూబ్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, బొందిలి విభాగం అధ్యక్షుడు సింగ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.సాయిబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి పాల్గొన్నారు. -
‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చిన్నచూపు’
కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీమ ప్రాజెక్టులకు సంబంధించి ఏమి చేశారో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి చంద్రబాబు నిలిపి వేశారని, ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడటం లేదని, సీమకు ద్రోహం చేసేందుకు చంద్రబాబు 20 టీఎంసీల నీటిని తాకట్టు పెట్టారన్నారు. ‘వైఎస్సార్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ మేలు చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీమ ప్రజల కోసం ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చూపుతో సీమలోని ప్రాజెక్టులకు నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకున్నారు.కృష్ణా నదిలో ప్రవాహం లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రోజుకు 6 టిఎంసి నీటిని వాడుకుంటుంది. ఇలాంటి చర్యలు జరగకుండా సీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణానది లో ప్రవాహం లేకుంటే సీమ ఎడారిగా మారుతుంది అలా కాకుండా సీమ ఎత్తిపోతల పథకం వైఎస్ జగన్ తీసుకొచ్చారు. గుండ్రేవుల రిజర్వాయర్ 2029 ఎన్నికల అనంతరం వాటి పూర్తి చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ పాలనలో పులివెందులలో ఎలాంటి మతపరమైన రాజకీయాలు చేయలేదు. ప్రతి గుడికి జగన్ డబ్బులు చెల్లించారు. పులివెందులలోని ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి సిజిఎఫ్ నిధులను కేటాయించారు. చంద్రబాబు ఇప్పటికైనా వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందించాలికూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు పాలన అంతా లడ్డు రాజకీయాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. చంద్రబాబు కుప్పంలో ఎన్ని గుడిలకు నిర్మించారో చెప్పాలి. అలీ బాబా అరడజన్ దొంగ తరహాలో రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలన పూర్తి గా విఫలం చెందింది. రీల్స్ మాత్రమే నారా లోకేష్ పరిమితం అయ్యారు. కానీ పనులు చేయడం లేదు. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని హెచ్చరించారు. -
గుర్తుపెట్టుకో.. చెంపలేసుకొని సారీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
-
వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త రామ్ కుమార్రెడ్డిపై అక్రమ కేసు
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. విద్యుత్ ఛార్జీలపై పెంపుపై చేపట్టిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ అక్రమ కేసుపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పందించారు. ‘2024 డిసెంబర్లో జరిపిన నిరసనకు నేడు నోటీసులు పంపించారు. 2024లో జరిగిన నిరసన ఘటనలో పోలీసులు నాపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు’అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబూ.. ప్రజలు గమనిస్తున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు. -
బాబు పాలనలో అప్పులెన్ని.. ఎవరిది విధ్వంసం?: కుంభా రవిబాబు
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగిందని తెలిపారు. ఎవరిది విధ్వంస పాలనలో ప్రజలు గుర్తించాలని కోరారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా ఉంది. బడ్జెట్, తిరుమల లడ్డూ అంశాలపై చర్చ లేకుండా చేశారు. బడ్జెట్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఆదాయ, వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ఈ బడ్జెట్ అంతా లోపభూయిష్టంగా ఉంది. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు.గతంలో అప్పులపై.. బాబు, పవన్, బీజేపీ అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ వృద్ధిపై తప్పుడు లెక్కలు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా డీఎస్డీపీ ఎలా పెరుగుతుంది. ఆదాయం, వ్యయానికి సంబంధించిన లెక్కలకు ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రూ.10 లక్షల కోట్లు అప్పు అని తప్పుడు ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పు ఎంత? ఎవరిది ఆర్ధిక విధ్వంసం.. ప్రజలు అర్ధం చేసుకోవాలి. వైఎస్ జగన్ పాలనలో 15వేలకు పైగా సచివాలయాలు నిర్మించి.. లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా?. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేయడమే విధ్వంసమా?. 17 మెడికల్ కాలేజీలు తీసుకు రావడం విధ్వంసమా?. తెచ్చిన కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామనడం విధ్వంసమా? ప్రజలే తెలుసుకోవాలి. -
YSRCP Central Office: మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, స్టూడెంట్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు హాజరయ్యారు. -
అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్
-
‘సీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు’
అన్నమయ్య జిల్లా: రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ‘ బడ్జెట్ కేటాయింపుల్లో మహిళలకు, నిరుద్యోగులకు కేటాయింపులు లేవు. 50 ఏళ్లు దాటిన వారికి ఒక్కరికీ పింఛన్ ఇవ్వడం లేదు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా అప్పులు మాత్రం చేస్తూ పోతున్నాడు. ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. దేవుడిపై కూడా రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. ఏడు కొండలు, లడ్డూ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో గురు శిష్యులిద్దరూ దొరికారు. శిష్యుడికి తెలంగాణలో మేలుచేయడం కోసం చంద్రబాబు రాయలసీమను తాకట్టుపెట్టారు. మార్చి 1 వ తేదీన రాయలసీమ సన్నాహక సమావేశం ఉంటుంది. చంద్రబాబు అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని స్పష్టం చేశారు. -
అర్థరాత్రి 50 లక్షల ఓట్లు.. TDP మోసపూరిత విజయం
-
Bengaluru: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. అంబటి కాన్వాయ్కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు.. సెక్షన్ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు.కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. తన కాన్వాయ్ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్ 30, ఇప్పుడు తాను కాన్వాయ్లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. -
చంద్రబాబు కుట్ర తెలిసిపోయింది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని.. అందుకే ఒన్మెన్ కమిటీ వేసి, తనకు కావాల్సినట్టు రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతోందని.. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసి పోయాయన్నారు‘‘ప్రపంచ హిందూ భక్తుల ముందు చంద్రబాబు దోషిగా నిలబడ్డారు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మండలిలో ఇందాపూర్ సంబంధంపై చర్చకు రమ్మంటే టీడీపీ పారిపోయింది. ఇందాపూర్ హెరిటేజ్ సంస్థది కావటం వల్లే టీడీపీ చర్చకు రాలేదు. ఈ విషయాన్ని మేము బయట పెట్టగానే దాన్ని కో-మ్యానిఫెక్చర్ కంపెనీగా మార్చారు. ఆ కంపెనీ కీలక ఉద్యోగిని ఎందుకు తొలగించారో చెప్పాలి. యావత్ ప్రపంచానికి చంద్రబాబు కుట్ర వైఖరి తెలిసిపోయింది’’ అని అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.‘‘తిరుమలలో రెండు కొండలేనంటూ వైఎస్సార్ మీద కూడా అభాండం వేశారు. చివరకు వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు వేసిన సీబిఐ విచారణను కాదని మరో ఏకసభ్య కమిషన్ వేయటం ఏంటి?. తమకు కావాల్సిన రీతిలో సీబిఐ నివేదిక ఇవ్వలేదనే ఈ ఏకసభ్య కమిటీ వేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తోంది. ఏ వ్యవస్థ మీదా చంద్రబాబుకు నమ్మకం లేదు. హోంమంత్రి భాష అత్యంత దారుణం...మండలిలోని సీసీ కెమెరా విజువల్స్ ఎలా బయటకు వెళ్లాయి?. దీనిపై మేము ఛైర్మన్కు ఫిర్యాదు చేశాం. పోడియం దగ్గరకు వెళ్లేటప్పుడు మేము చెప్పులు విడిచి వెళ్లాం. కానీ మేము మా ఛైర్స్ దగ్గర ఉన్నప్పుడు వీడియో మాత్రమే ఎందుకు లీక్ చేశారు?. మొత్తం వీడియో ఎందుకు బయట పెట్టడం లేదు?’’ అంటూ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. -
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
అర్ధరాత్రి ఆత్మలు, దెయ్యాలు ఓట్లు వేశాయా?: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: ఏపీలో ఎన్నికల రోజున అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాష్ట్రవ్యాప్తంగా 30వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తే.. అర్ధరాత్రి ఆత్మలు, దెయ్యాలు వచ్చి ఓట్లు వేశాయా? అని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు.మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా పోల్ అవుతాయి?. వారంలో వీవీ పాట్లు కాల్చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వలేదు. అన్ని అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలి. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. 68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తొలుత ప్రకటించారు. అర్ధరాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా వేల ఓట్లు నమోదు అయ్యాయి.పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత ఏపీ లో 81.86 శాతం నమోదు అయినట్లు ప్రకటించారు. టీడీపీ కూటమి నేతలు అద్భుత విజయం అంటున్నారు. ఇది మోసపూరిత విజయం అని స్పష్టం అవుతోంది. అర్ధరాత్రి అన్ని ఓట్లు ఎవరు వేశారు?. గత సార్వత్రిక ఎన్నికల్లో దెయ్యాలు, ఆత్మలు ఓట్లు వేశాయా?. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేస్తారు. ఏపీ వ్యాప్తంగా 30వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయి. మరి 50 లక్షల ఓట్లు ఎవరు వేశారో సమాధానం చెప్పాలి అని’ డిమాండ్ చేశారు. -
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు తొలగింపుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంబటి మురళీ కృష్ణను టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. అంబటి మురళీకృష్ణ కారుపై దాడికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో టీఎన్ఎస్ ఎఫ్ నేతలు వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీ వీసీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా అధికారులు తలుపులు మూసేశారు.ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు అనుసరిస్తున్న విధానాలు విద్యావేత్తలు, మేధావులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం నాడు వర్సిటీలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు.. నేడు ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న మహానేత పేరును తొలగించి వివాదాలకు తెరలేపారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగ కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుధవారం వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు. వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్ను రప్పించి ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కళాశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించడం దుర్మార్గ చర్య అని వైఎస్సార్సీపీ మండిపడింది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్ సెనేట్ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, నేటి పాలకులు డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగించటం బాధాకరమని వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. -
‘చంద్రబాబు సర్కార్ ఎందుకు తోకముడిచింది?’
సాక్షి, విజయవాడ: ఏపీలో లడ్డూ రాజకీయం నడుస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయానికి వాడుకుందని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి అసత్యాలు, అబద్ధాలు ఆడారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి జంతువుల కొవ్వు లేదు.. కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొందని.. చేసిన తప్పుడు ప్రచారానికి కూటమి నేతలు, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ను హిందువులకు దూరం చేయాలని కుట్రపన్నారు. సీబీఐ రిపోర్టు ఇచ్చినా జగన్పై బురదజల్లడం మానుకోలేదు. సీబీఐ ఛార్జిషీట్ కోర్డులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. మీ కనుసన్నల్లో ఉన్న రిటైర్డ్ అధికారితో ఏకసభ్య కమిషన్ వేస్తే వాస్తవాలను ఎలా ఇస్తుంది’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఏకసభ్య కమిషన్ ఏంచేసింది?. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగితే మీ కమిషన్ ఏంచేసింది?. ఇందాపూర్, బోలేబాబా, హెరిటేజ్పై చర్చకు శాసనమండలిలో వైఎస్సార్సీపీ తీర్మానం ఇచ్చింది. తీర్మానంపై కూటమి ప్రభుత్వం ఎందుకు తోకముడిచిందో సమాధానం చెప్పాలి. జంతువుల కొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ కలిపినట్లు ఏ ఆధారాలతో మాట్లాడారో సమాధానం చెప్పాలి...ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. తిరుపతి లడ్డూ చాలా సున్నితమైన అంశమని అసెంబ్లీలో చెబుతున్నారు. క్యాబినెట్ లో లడ్డూ అంశంపై చర్చించినప్పుడు తెలియదా ఇది సున్నితమైన అంశమని.. ఈ ప్రభుత్వం వేసింది ఏకసభ్య కమిషన్ కాదు తెలుగుదేశం కమిషన్. లడ్డూపై రాజకీయం చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలి. ఏడు కొండలను రెండు కొండలు చేస్తానన్నాడని వైఎస్సార్పై అపవాదులు వేశారు...ఏడుకొండలను కాపాడాలని వైఎస్సార్ 746,747 జీవోలను తెచ్చారు. ఎంతకాలం కూటమి నేతలు దేవుడితో రాజకీయం చేస్తారు. కూటమి 20 నెలల పాలనలో ఏపీ కేంద్రంగా గోమాంసం ఎగుమతి అవుతోంది. విశాఖలో లక్షల కిలోల గో మాంసాన్ని పట్టుకున్నారు. గో మాంసం దొరికితే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఏపీలో గోవులు యథేచ్ఛగా హత్యకు గురవుతుంటే ఏం చేస్తున్నారు?. గోవుల అక్రమ రవాణా జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. గోబెల్స్ మంత్రులంతా వైఎస్సార్సీపీ హిందూ మతానికి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులు ఏ మొహం పెట్టుకుని హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు...దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కొట్టేయడానికి జీవో నెంబర్ 15 తెచ్చారు. గొడుగుపేట ఆలయం భూములు కొట్టేయాలని చూశారు. టెక్కలిలో ఆలయ భూములు కొట్టేయాలని చూశారు. నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్ను తక్షణమే ప్రభుత్వం డిస్మిస్ చేయాలి. సీబీఐ రిపోర్టు బయటికి వచ్చాక టీడీపీ నేతలకు మొహం చెల్లడం లేదు. నిన్న కూటమి మంత్రులతో లోకేష్ బలవంతంగా మాట్లాడించినట్లు తెలుస్తోంది. 21, 22, 23 తేదీల్లో ప్రజలకు, గుళ్లవద్దకు, స్వామీజీల వద్దకు వెళతామంటున్నారు. ఏపీలో ఏ దేవాలయం, స్వామీజీ వద్దకు వెళ్లి మీరు చెప్పగలుగుతారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. కల్తీ జరగకుండానే తిరుపతి లడ్డూని రాజకీయానికి వాడుకున్నారు...ఏ మొహం పెట్టుకుని వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ గురించి చెబుతారు. శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరకు వెళ్లి ఆ స్వామికి ఏం సమాధానం చెబుతారు?. శివరాత్రికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయలేకపోయారని ఆ స్వామి మిమ్మల్ని ప్రశ్నించరా?. కాళహస్తిలో వెండి పడగలను కూటమి నేతలు అమ్ముకుంటున్నారు. తన వెండి పడగలను అమ్ముకుంటున్నారని ఆ స్వామి ప్రశ్నిస్తే ఏ మొహం పెట్టుకుని సమాధానం చెబుతారు?. శివభక్తులపై లాఠీలు ప్రయోగించిన మీరు శ్రీశైల మల్లేశ్వరుడికి ఏం సమాధానం చెబుతారు?. ట్రస్ట్ బోర్డు మెంబర్ భర్త దుర్గగుడి సిబ్బందిని దూషించారు. దుర్గగుడికి ఏ మొహం పెట్టుకుని వెళతారు?..నా క్షేత్రంలో గోవులు చనిపోతే ఏం చేశారని ద్వారకా తిరుమలేశుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు. ఎలుకలు తింటున్న తన ప్రసాదాన్ని భక్తులకు ఇస్తున్నారేంటయ్యా అని అన్నవరం సత్యదేవుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు?. నాశిరకం గోడలు కట్టి భక్తులు చనిపోతే ఏ మొహం పెట్టుకుని నాకు ఫిర్యాదు చేయడానికి వచ్చారయ్యా అని సింహాద్రి అప్పన్న అడిగితే ఏం సమాధానం చెబుతారు?...సినిమా వాల్ పోస్టర్ల పక్కన వెంకటేశ్వరస్వామిని నిలబెట్టడమేంటి?. నేరాలు కట్టడి చేయాల్సిన పోలీసులు టీడీపీ పెట్టిన బ్యానర్లకు కాపలా కాయడమేంటి?. హిందూ ధర్మానికి లెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. వైఎస్ జగన్కి సమాధానం చెప్పే అర్హత, సత్తా టీడీపీ నేతలకు లేదు’’ అని మల్లాది విష్ణు అన్నారు. -
మేకపాటి గౌతమ్ని స్మరించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన మిత్రుడు మేకపాటి గౌతమ్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన స్నేహం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా గుర్తుండిపోతారు’ అంటూ పోస్టు చేశారు. I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. pic.twitter.com/7IQQejf8gS— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
అనపర్తిలో ఆగని కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు ఆగడం లేదు. ఆక్రమణల పేరుతో వైఎస్సార్సీపీ నేతకు చెందిన జీబీఆర్ విద్యాసంస్థల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.సమీపంలోనే దుప్పలపూడి గ్రామంలో మెయిన్ రోడ్డుని ఆక్రమించి ఉన్న ఇతర నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బంధువులకు చెందిన నిర్మాణాలు కావడంతో కూటమినేతల ఒత్తిడితో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బలగాలను మోహరింపజేసి విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. -
ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా
సాక్షి, అమరావతి: శాసన మండలి సమావేశాలు శుక్రవారం కేవలం ఆరు నిమిషాల్లోనే ముగిసినా, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ బంధంపై దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం వెనకాడుతోంది. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ దుష్ప్రచారం చేసి, ఆనక దొరికిపోయిన చంద్రబాబు ఆ అంశం సభలో చర్చకు రాకుండా విఫలయత్నం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన నాలుగున్నర నిమిషాలకే తొలుత వాయిదా పడింది. మధ్యాహ్నం 1.07 గంటలకు తిరిగి ప్రారంభమైన ఒకటిన్నర నిమిషం వ్యవధిలోనే మళ్లీ వాయిదా పడింది. టీటీడీకి నెయ్యి సరఫరా విషయమై హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ మధ్య ఉన్న సంబంధంపై సభలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ నాలుగు రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఆ పార్టీ సభ్యులు ప్ల కార్డులు పదర్శిస్తూ, నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, ఎస్ మంగమ్మలు.. వాయిదా తీర్మానం ఇవ్వగా, ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. మరో సభ్యుడు బలి కళ్యాణ చక్రవరి ‘ఎన్డీడీబీఎస్ సీఏఎల్ఎఫ్ ఛార్జిషీటు రిపోర్టులోని పేజీ నెంబరు 35లో పేర్కొన్న విధంగా తిరుమల లడ్డూను తయారు చేయడానికి వినియోగించిన నెయ్యి గురించి చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం అంశం, హెరిటేజ్కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్ల కార్డులు, శ్రీవారి ఫొటోలు పట్టుకుని చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు కొనసాగించారు.మంత్రి కేశవ్ అసహనంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేవుడి ఫొటోలను ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు రావడంతో చైర్మన్ మోషేన్రాజు సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మంత్రి కేశవ్ తన చేతిలో ఉన్న మైకును విసురుగా టేబుల్పై కొట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లు వేసుకొని వేంకటేశ్వరస్వామి ఫొటో పట్టుకొని నడుస్తున్న చిత్రాన్ని ప్రదర్శిస్తూ పోడియం వద్దకు వచ్చారు. అదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ‘హెరిటేజ్–ఇందాపూర్’పై చర్చించాల్సిందేఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ బంధంపై శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ సభ్యులు శుక్రవారం మండలి ప్రారంభ సమయంలో నిరసనకు దిగారు. ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికారిత సంస్థ భవన్ వద్దకు చేరుకున్న సభ్యులు.. అక్కడి నుంచి బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీగా శాసనమండలికి వెళ్లారు.‘టీటీడీలో హెరిటేజ్ పాత్రపై విచారణ జరపాలి.. హెరిటేజ్ కోసం దైవంపై నిందలా.. సిగ్గు సిగ్గు.. భోలే బాబా వెనుక ఉన్న ఆలీ బాబా చంద్రబాబే.. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ నశించాలి.. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని అపవిత్రం చేస్తూ అవమానించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.. భోలే బాబాను తెచ్చింది హెరిటేజ్ బాబే.. రక్షించు గోవిందా.. గోవింద’ అంటూ నినాదాలు చేస్తూ శాసన మండలిలోకి ప్రవేశించారు. -
‘సీబీఐ రిపోర్ట్ అనుకూలంగా రాలేదు కాబట్టే మరో రాజకీయ ఎత్తుగడ’
తిరుపతి: వేంకటేశ్వరస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని, న్యాయస్థానాలను అవహేళన చేస్తూ ఏకసభ్య కమిషన్ నియమించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ, సిట్ విచారణలు తమ కనుసన్నల్లో జరపలేదని, తాను ఆశించిన విధంగా విచారణ జరగలేదు కాబట్టే.. మళ్లీ ఏకసభ్య కమిషన్ నియమించారని భూమన విమర్శించారు. ‘గులాం చేసే వాళ్లతో ఏకసభ్య కమిషన్ వేయడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సమయంలో ఏకసభ్య కమిషన్ నియమించి ఏం చేశారో మనం చూశాం. ఇప్పుడు మళ్లీ ఏకసభ్య కమిషన్ వేశారు. దీన్ని పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. ఇది ఆశ్చర్యం కల్గిస్తుంది. 45 రోజుల పాటు వన్మేన్ కమిషన్ నియమించారు. రాజకీయ డ్రామా ఆడటానికి కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. 45 రోజల పాటు తాను అనుకున్న మీడియా ద్వారా అసత్య కథనాలు నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు. మమ్మల్ని దోషులుగా ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. వన్మేన్ కమిషన్ చైర్మన్గా చంద్రబాబు మీరే ఉంటే సరిపోతుంది కదా.. ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
-
Jupudi: ఎవడి డబ్బుతో క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళావ్?
-
TDP ఎన్ని కుట్రలు చేసినా ఎంపీపీని కైవసం చేసుకున్న YSRCP
-
ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి చైర్మన్ నోటీసులు జారీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారనే వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి.వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయగా, వారికి తాజాగా నోటీసులు జారీ చేశారు. -
లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్
-
‘పరిపాలన గాలికి వదిలేసి హెలికాప్టర్, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు’
తాడేపల్లి: కూటమి సర్కారు వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ద్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరగడానికే సరిపోతుందని, ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పసిపిల్లపై అఘాయిత్యాల జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు జూపూడి. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది కాస్తా భూమ్రాంగ్ అయ్యి హెరిటేజ్ దగ్గర ఆగిందన్నారు. లడ్డూ విషయంలో తప్పంతా చంద్రబాబుదేనని తేలిపోయిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గాడి తప్పి అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తోంది. చంద్రబాబు పరిపాలన పబ్లిసిటీ పీక్..పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది. కూటమి నేతలు నిత్యం జగన్ నామ స్మరణ, వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు ఎప్పుడు అడిగినా కేసులు, అరెస్టులు, డైవర్షన్ చేస్తున్నారు. కూటమి పాలన గురించి వైఎస్ జగన్ సుదీర్ఘంగా వివరించారు. జగన్ ప్రెస్ మీట్ను ప్రజలు క్షుణ్ణంగా వినాలని, నిజాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో గవర్నెన్స్ ఉందా లేదా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు సమాధానం లేదు.జగన్ను తిట్టడానికే మంత్రులకు శాఖలు కేటాయించారు. గిరిజన పాఠశాలలు, హాస్టల్స్, ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 900 మంది పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థ నాశనమైంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానంపైనే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదే విషయాన్ని పరకాల ప్రభాకర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఒకే అబద్దాన్ని పదే పదే చెబుతూ గ్లోబల్ ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. పరిపాలన గాలికి వదిలేసి హెలికాప్టర్, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు నిత్యం ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతున్నారు. క్రికెట్ మ్యాచ్లు, విదేశీ విహార యాత్రలకు ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తున్నారు. ఎవరి ఖర్చులతో తిరుగుతున్నారు అని అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. 99 పైసలకే భూములు తీసుకున్న వారు స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారా అని ప్రశ్నిస్తున్నాను.ఆకాశంలో విహరించడం మానేసి భూమి మీదకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు షూ వేసుకుని పూజ చేయడం అపచారం కదా?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేశారని.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం తమ సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారన్నారు.‘‘సీబీఐ ఇచ్చిన రిపోర్టులో చాలా విషయాలు బయటికి వచ్చాయని.. హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న ఇందాపూర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. 2015-19 మధ్య కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఇందాపూర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారు. అవే ట్యాంకర్లను దాచి మళ్లీ వినియోగించారు. గోవిందా కూటమి నేతలకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరాం. సభలో చర్చించమని కోరాం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘సభలో టీడీపీ మంత్రులు అవాకులు, చవాకులు మాట్లాడారు. టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదు. కూటమి నేతలకు కావాల్సింది రాజకీయం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చర్చకు రండి. చెప్పులు, బూట్లు వేసుకుని మేం దేవుడి ఫోటోలను పట్టుకుని ఉన్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా మీకు వీలైతే ఆధారాలు చూపించండి. టీడీపీ నేతల వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో మేం ప్రదర్శించిన పేపర్లను నేనే స్వయంగా కలెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టా. చంద్రబాబు లాగా మేం వేంకటేశ్వరస్వామి ఫోటోలను బూట్లు వేసుకుని పట్టుకోలేదు. వాళ్లలాగా మాది నీచబుద్ధి కాదు...మాకు దేవుడంటే ఎంతో విశ్వాసం.. దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది. టీడీపీ నేతలు డైవర్షన్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు టీడీపీ నేతల దుర్భుద్ధిని గమనించాలి. ఇందాపూర్తో హెరిటేజ్కు ఉన్న సంబంధాలపై చర్చకు కోరాం. మేం రెండు ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడాం. ఆ సంస్థల బదులు ఇంత మంది టీడీపీ మంత్రులు మాట్లాడాల్సిన అవసరమేంటి? టీడీపీ మంత్రులంతా ఆ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా?. మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారు. పదేపదే మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుగా లేదా?. మాకు సభ పట్ల గౌరవం ఉంది. మేం సభలో రాజకీయం చేయలేదు..లడ్డూలో జంతువుల కొవ్వు కలిపామని మేం చెప్పలేదు కదా. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ ద్వారా దేవదేవుడి కానుకలను కాజేయాలనేది వారి ఆలోచన. మేం ఎందుకు క్షమాపణ చెప్పాలి. దేవుడి పవిత్రతను మేం ఏనాడూ దెబ్బతీయలేదు. బూట్లు వేసుకుని దేవుడు ఫోటోలు పట్టుకుని పవిత్రత దెబ్బతీసింది వాళ్లు. ఇందాపూర్పై సభలో కచ్చితంగా చర్చించాల్సిందేఏం సమాధానం చెబుతారు?: తోట త్రిమూర్తులుదేవుడిని అవమానించారని ఊగిపోయిన జనసేన, బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకున్నది మీకు కనిపించడం లేదా?. మేం దేవుడి ఫోటోలను సభలో చెప్పులతో పట్టుకున్నట్లు నిరూపించండి. దేవుడి ఫోటోలను చించి, విసిరేశారని మాట్లాడుతున్నారు. మేం ఫోటోలను చించినట్లు రుజువు చేయండి. దేవుడిని రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. దేనికి సభలో మంత్రులు ఊగిపోతున్నారుచర్చకు రమ్మంటే పారిపోతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్డిప్యూటీ సీఎం దుర్గగుడి మెట్లు కడిగారు. కులమతాల మధ్య చిచ్చు రేపేలా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. నాలుగు రోజుల నుంచి చర్చకు రమ్మంటే పారిపోతున్నారు. ఇప్పకైనా సభలో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాంసీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్: తూమాటి మాధవరావుసీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్నటి వరకూ తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఇప్పుడు అన్ని ఆలయాల్లోని ప్రసాదాలపై నిందలు వేస్తున్నారు. కులదైవం అని నీతులు చెప్పే చంద్రబాబు బూట్లు వేసుకుని ధరించి వెంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకున్నారు. మేం దేవుడి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకున్నామని మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తిరుపతి మెట్లు కడిగి క్షమాపణ చెప్పాలి. మేం సభలో చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే కూటమి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా?. అన్నీ భగవంతుడు చూస్తున్నాడు.. కచ్చితంగా శిక్ష అనుభవిస్తారుదమ్ముంటే చర్చకు రావాలి: లేళ్ల అప్పిరెడ్డితిరుపతి లడ్డూ ఎలా తయారు చేశారో చంద్రబాబుని ఎవరు అడిగారు. టీడీపీ కార్యకర్తల మీటింగ్లో తిరుపతి లడ్డూ గురించి చంద్రబాబు మాట్లాడాడు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా? లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్నావ్. లడ్డూలో బాత్ రూమ్ కెమికల్స్ కలిపారన్నావ్. మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి అని మాట్లాడావ్. చంద్రబాబు నీ వయసుకి ఇది తగునా? వైఎస్సార్సీపీపై బురద జల్లడానికి దేవుడిని అడ్డంపెట్టుకోవడానికి సిగ్గులేదా?. సోము వీర్రాజు క్షమాపణ చెప్పమని మమ్నల్ని అడగడం కాదు. చంద్రబాబు, పవన్ను సోము వీర్రాజు క్షమాపణ కోరాలి. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై సభలో చర్చిస్తేనే కోట్లాది మంది భక్తులకు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సభను తప్పుదోవ పట్టించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దమ్ముంటే చర్చకు రావాలిఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి: మొండితోక అరుణ్ కుమార్నాలుగు రోజుల నుంచి సభలో ఇందాపూర్పై చర్చించాలని కోరుతున్నాం. నాలుగు రోజుల నుంచి వాయిదా తీర్మానాన్ని అంగీకరించడం లేదు. మంత్రి లోకేష్ మూడు రోజుల నుంచి సభలో లేడు. ఈ రోజు సభలో హెరిటేజ్ అనే మాట వినగానే లోకేష్ ఊగిపోయాడు. వైఎస్సార్సీపీ హిందువుల వ్యతిరేకి అని లోకేష్ మాట్లాడుతున్నారు. ఏ కల్తీ లేకపోయినా పవన్ దుర్గగుడి మెట్లు కడిగాడు. ఇప్పుడు ఏమైపోయాడయ్యా పవన్ కళ్యాణ్. 42 ఆలయాలు కూల్చిన చంద్రబాబు.. సోము వీర్రాజుకి ఇప్పుడు హిందూ రక్షకుడిగా కనిపిస్తున్నాడా?. ఇదే సెక్రటేరియట్కు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో పూజ చేసింది చంద్రబాబు. ఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి. వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా తలనీలాలు అర్పించారా?కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? వరుదు కళ్యాణిఈరోజు సభలో మంత్రులు సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు?. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి ఫ్లెక్సీలు వేసింది ఎవరు?. చంద్రబాబు, కూటమి నేతలు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీబీఐ రిపోర్టు వచ్చాక బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్, బోలేబాబాకు హెరిటేజ్తో సంబంధం ఉందని మేం చెప్పడం లేదు.వాళ్ల వెబ్సైట్ లోనే చెప్పారు. దేవుడి సొమ్ముని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కాబట్టే భయపడుతున్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి హోంమంత్రి అనితకు ఉందా?. ఇసుక, పశువుల రవాణా వాహనాల వద్ద పీఏలను పెట్టుకుని వసూళ్లు చేసుకునే స్థాయి మీది. ప్రజల్లోకి రావాలంటేనే జగన్ భయపడుతున్నారంటున్నారు. మీకు తెలియకపోతే మీ పోలీసులను అడగండి. వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే జన సముద్రం ఎలా ఉంటుందో?అధికార మదం, దురహంకారం అని సెర్చ్ చేస్తే అనిత పేరు వస్తుంది. వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే టిడిపి, చంద్రబాబు పేరు వస్తుంది. వెన్నుపోటు అని గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరిపేరు వస్తుందో హోంమంత్రి తెలుసుకోవాలి. ఇందాపూర్పై చర్చకు అంగీకరిస్తే మొత్తం అన్నీ తేలుతాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. నెయ్యి టెండర్ల ద్వారా హెరిటేజ్కు లబ్ధి చేకూర్చుకున్నారు కాబట్టే డైవర్షన్ కు తెరతీశారు. మేం చెప్పులు విడిచి కౌన్సిల్లో దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ఇందాపూర్ పై చర్చకు అంగీకరించాలిక్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిలడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేని అవాస్తవాలు ప్రచారం చేశారు. తప్పు చేయనపుడు ఎందుకు చర్చకు భయపడుతున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన మీరు ముందు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా టీడీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి. మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను పట్టుకోలేదు. మీకు వీలైతే ఆధారాలతో నిరూరించాలి. ఇందాపూర్పై కచ్చితంగా చర్చ జరగాల్సిందే. చర్చ జరిగే వరకూ మేం పోరాడుతూనే ఉంటాంచంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుపతి లడ్డూ పై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. చంద్రబాబు చేసిన పాపాన్ని క్షమించి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరాం. మేం చెప్పులు విడిచి దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. టీడీపీ నేతలు చాలా నీతులు చెబుతున్నారు. సభలో బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గతంలో ఏం చేశారో మర్చిపోయినట్లున్నారు. సభకు తాళబొట్లతో వచ్చిన విషయాన్ని లోకేష్కు గుర్తులేదా?. దేవుడి ఫోటోని బూట్లు వేసుకుని పట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. మేం వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకోలేదు. మేం దేవుడి ఫోటోలను చించి విసిరేయలేదు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు.. మీరు. -
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
హెరిటేజ్ ప్రైవేట్ సంస్థ అయినప్పుడు.. మంత్రులెందుకు చించుకుంటున్నారు లాజికతో కొట్టిన బొత్స
-
మదనపల్లి బాలిక ఘటనపై మిథున్ రెడ్డి రియాక్షన్
-
ఏం బెదిరిస్తున్నావా...? నీ కన్నా గట్టిగా అరవగలను... అంబటి Vs పోలీస్
-
తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి
సాక్షి, గుంటూరు: తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. గూండాలు 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు, గూండాలు ఏకమై దారుణంగా ఇంటిపై దాడి చేశారు. ఆ మాట అనడాన్ని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.. నేను బాధపడ్డాను. టీడీపీ నేతలు తిడుతున్నారనే ఉద్దేశంతో మాట అన్నాను. బ్యాచ్లుగా బ్యాచ్లుగా నా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. పోలీసులు సాక్షిగానే నా ఇంటి మీద దాడి చేశారు. నాలుగు గంటల పాటు నా ఇంటి మీద కరాళ నృత్యం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు...నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా అల్లుళ్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కమ్మ సామాజిక వర్గాన్ని నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు?’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు...31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. కానీ చించివేయలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చేయమని పార్టీ పిలుపు ఇచ్చింది. పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు...నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఐదు గంటలకు నా ఇంటివద్దకు పలు నియోజకవర్గాలనుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటల పాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా? ఇది ధర్మమేనా? వైఎస్సార్సీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్పాను...ఇంత దారుణం.. అన్యాయం జరిగితే స్పందించరా? పోలీసులు తీసుకెళ్లి లాకప్లో పెట్టారు. రాత్రి 2గంటలకు స్టేషన్పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్లో కమ్మవారిని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పశ్చాత్తాప పడ్డా. పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడ లేదా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు...నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా. నా కొడకా అంటే అర్థం తెలుసా. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా.. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు. అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా.. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం... ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘చంద్రబాబుకమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు. నేను తగ్గను, చావనైనా చస్తా, తగ్గదేలేదు. నన్ను ఎమిలినేట్ చేయాలని రెడ్బుక్లో రాసుకున్నారట. చంపేస్తే సమాధి అయ్యి సాధిస్తా. పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటే లోకేష్కు వచ్చింది’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. దీనికి ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేశారు. ఇలా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో మూడు ప్రధాన హామీలకు ఈ మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. సున్నా బడ్జెట్. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అంటూ ఏ రకంగా సంబరాలు చేసుకోమని చెబుతాడు? మీరే చెప్పండి. ఇది ధర్మమేనా.. న్యాయమేనా? అలాగే స్త్రీ శక్తి అంటూ ఉచిత బస్సు పథకానికి పేరు పెట్టారు. అమ్మవారు పేరు పెట్టి మోసం చేయగలిగే వ్యక్తి ఈ ప్రంపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. కొత్త వాటికి కనీసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.50 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అదే మా హయాంలో ఆర్నెల్లకోసారి ఏటా జూన్, డిసెంబర్లలో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్లం. కానీ ఈరోజు పరిస్థితి రివర్స్ అయ్యింది. 2014లో చంద్ర బాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 మార్చి నాటికి 66 లక్షల పింఛన్లకు పెంచగలిగాం. కానీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే 66 లక్షల నుంచి 60 లక్షలకు ఆ సంఖ్య తగ్గిపోయింది.చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). ఆయన సృష్టించిన ఈ సంక్షోభం వల్ల ఒక పద్దతి ప్రకారం ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ఈ క్రాప్ లేకుండా పోయింది. పద్దతి ప్రకారం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఉచిత పంటల బీమాను తీసేశారు. ఏ ఒక్క రైతుకూ గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా రైతులను చేయిపట్టి నడిపించాం. ఈ క్రాప్ ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేశాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేవాళ్లం. పైగా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ అర్హుల జాబితాలను ఆర్బీకేలలో ప్రదర్శించే వాళ్లం. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న చంద్రబాబు ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుస్తున్నారా అంటే ఏమీ లేదు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం. మరో వైపు చేస్తున్న అప్పులన్నీ దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్టుగా కాజేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు, మోసాలు కాకూడదన్నారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని చేసి చూపించామని చెప్పారు. కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ మనసా, వాచా, కర్మణా ఇచ్చిన హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘మేనిఫెస్టో అమలులో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరకు గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగేలా చేశాం. కానీ చంద్రబాబు మేనిఫెస్టోకు ఇచ్చే విలువ ఏమిటో తెలుసా? గడిచిన రెండు బడ్జెట్లు, ఈ ఏడాది ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్లో కేటాయింపుల ద్వారా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ ఒక చిత్తు కాగితమే అని రుజువు చేశాడు’ అని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాండ్లు పంచి పెట్టి మరీ వంచించారు » నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్దమనిషి ఇంటింటికి వెళ్లి తానిచ్చిన హామీల అమలు కోసం ఏకంగా బాండ్లు పంచిపెట్టాడు. ప్రతి ఇంటికి ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు గట్టి మరీ చూపించి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని మోసగిస్తున్నాడు. సూపర్ 6.. సూపర్ 7 హామీలతో పాటు మేనిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలను వాళ్ల కరపత్రికలో ఏ విధంగా ప్రకటనలు ఇచ్చుకున్నారో మీరే చూడండి. ఈ మాఫియా ముఠా అంతా కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పడానికి ఈ ప్రకటనలే నిదర్శనం. » ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరిట ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆరి్థక సాయం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, పాఠశాలకు వెళేŠాల్ల పిల్లలున్న తల్లులకు.. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా తానిచ్చిన హామీలకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. (వీడియో ప్రదర్శించి చూపారు). నిత్య మోసగాడు.. నిత్య వంచకుడు » సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను కరపత్రాల రూపంలో పంచి పెట్టడమే కాదు.. తమ భజన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకాలకు ఈ మూడు బడ్జెట్లలో ఏ మేరకు నిధులు కేటాయించారు.. ఏ మేరకు ఖర్చు చేశారో చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా. యువగళం పేరిట ప్రతి నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి కోసం ఈ మూడు బడ్జెట్లలో కించిత్ ప్రస్తావన ఎక్కడైనా ఉందా? » నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి. ఇందుకు ఈ మూడేళ్లలో బడ్జెట్లో రూ.21,600 కోట్లు కేటాయించాలి. కానీ తొలి రెండు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.. ఈ మూడో బడ్జెట్లో ఇచ్చిందీ సున్నా. ఏడాదికి రూ.36 వేలు చొప్పున ఈ మూడేళ్లలో రూ.1.08 లక్షల చొప్పున ప్రతీ నిరుద్యోగికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, చెత్త బుట్టలో వేయడం ఇదేమీ తొలిసారి కాదు.. 1999, 2014 ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కన్పిస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో ఈ హామీతో ఓట్లు వేయించుకోవడం, నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అందుకే యువత పట్ల చంద్రబాబు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. బాండ్లపై ఇదీ వాళ్ల ప్రతిజ్ఞ ఇంటింటికీ పంపిణీ చేసిన బాండ్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు, పైగా ప్రతిజ్ఞ.. ఏమని చేశారో తెలుసా? (మాజీ మంత్రి కురసాల కన్నబాబు చదివి విన్పించారు)బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ.. ‘చంద్రబాబు అనే నేను.. రాష్ట్ర ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్రాభివృద్ధికి, ఉన్నతికి పునరంకితమవుతా’. ‘పవన్ కల్యాణ్ అనే నేను.. రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ–జనసేన పార్టీలు సంయుక్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తాను.’ప్రతి నెలా 25 వేల పింఛన్లు కట్» మిగిలిన పథకాల అమలు తీరు కూడా అరకొరే. ప్రతి నెలా పింఛన్ల పంపిణీనే చూడండి. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లు పెడుతూ ప్రతి నెలా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రతి మీటింగ్కు 25 వేల పింఛన్లు కట్ చేస్తున్నాడు. 2024 ఎన్నికల నాటికి అంటే మార్చి నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా, 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,634 మందికి పింఛన్లు కట్ చేశాడు. » ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఫిబ్రవరిలో ఇచ్చిన పింఛన్లకు ఇచ్చిన సొమ్ము రూ.2,632 కోట్లు. ఈ లెక్కన ఈ ఏడాది బడ్జెట్లో 12 నెలలకు రూ.31,554 కోట్లు కేటాయించాలి కదా.. కానీ కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ లెక్కన ఈ మొత్తం 53,50,115 పింఛన్లకు మాత్రమే సరిపోతుంది. అంటే ఈ ఏడాది మరో 7,45,993 పింఛన్లు కట్ చేయడానికి సిద్దపడినట్లు చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు.తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన » తల్లికి వందనం పథకాన్ని కాస్తా తల్లికి వంచన పథకంగా మార్చేశారు. బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఐఎస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేల చొప్పున రూ.13,112 కోట్లు ఖర్చు అవుతుంది. » 2024–25లో ఈ పథకానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2025–26లో రెండో ఏడాది బడ్జెట్లో రూ.8,349 కోట్లు మాత్రమే కేటాయించారు. పైగా యూడైస్ డేటా ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశాడు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. తాజాగా బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో రూ.9,668 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. కానీ కేటాయించింది మాత్రం రూ.8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా భారీగా పిల్లలకు కోత పడుతుందని చెప్పకనే చెప్పారు. ఉచిత గ్యాస్.. ఉచిత బస్సు అంతా మోసం » కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆరీ్టసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశాడు. » రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. » సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీటికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలెండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలెండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ పేరిట అన్నదాతలకు టోకరా » ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్ (కేంద్రం ఇచ్చేది) కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు. (వీడియో ప్రదర్శించారు). » ఈ లెక్కన 2023లో మా హయాంలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి లెక్కిస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లు కలిపి గతేడాది రూ.40 వేల చొప్పున ఇవ్వాలి. కానీ అప్పుడొక రూ.5 వేలు, అప్పుడొక రూ.5 వేలు చొప్పున రూ.10వేలు ఇచ్చాడు. అంటే రూ.30 వేలు ఎగరగొట్టాడు. » వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మందికి రైతులకు ఇస్తే, చంద్రబాబు హయాంలో 46.85 లక్షల మందికి రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టాడు. పైగా ఈ పథకం కింద రూ.6,309 కోట్లు ఇచ్చేశామని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.21,434 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.4,685 కోట్లు. » అంటే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే రైతులకు ఈ రెండేళ్లకే రూ.16,749 కోట్లు బాకీ పడ్డారు. ప్రతి రైతుకు రూ.30 వేలు బాకాయి పడ్డాడు. కౌలు రైతులకైతే మొండి చేయి చూపించారు. మూడు బడ్జెట్లలో కూడా జీరో. మా హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున కౌలు రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు మూడు బడ్జెట్లలోనూ సున్నా. ఉచిత పంటల బీమాకు మంగళం » చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 17 సార్లు తుపానులు, అల్పపీడనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు పుణ్యమా అని ఉచిత పంటల బీమా పథకం అటకెక్కింది. » పంటల బీమా కోసం 2024–25లో బడ్జెట్లో పెట్టింది రూ.60 లక్షలు.. ఖర్చు చేసింది సున్నా. 2025–26లో రూ.1,023 కోట్లు.. రైతులకు ఇచ్చిన పరిహారం సున్నా. ఈఏడాది బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.250 కోట్లు. » 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో ప్రభుత్వం కట్టాల్సిన రూ.834 కోట్లు ప్రీమియం బకాయిలు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్ల మేర బీమా పరిహారాన్ని నష్టపోయారు. 2023–24 రబీలో ప్రీమియం సొమ్ములు కట్టిందా అంటే అదీలేదు. 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి సుమారు రూ.3,500 కోట్ల మేర రైతులు నష్ట పోయారు. కిందా మీద పడి ప్రీమియం చెల్లించిన రైతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన తమ వాటా ప్రీమియం కట్టకపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. » వైఎస్సార్సీపీ హయాంలో రైతుల తరఫున కూడా ఏటా వారు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఐదేళల్లో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా లబ్ధి చేకూర్చాం. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. 2025–26లో మోంథా, దిత్వా తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేటాయించింది సున్నా. రైతులకు ఇచ్చింది సున్నా. గతేడాది మోంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించారు. మొత్తంగా రూ.900 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ధరల స్థిరీకరణ నిధి పేరిట దగా » చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కిన పాపాన పోలేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,369 కాగా, ప్రతి రైతు.. క్వింటా రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా చేయడమే కాదు.. గన్నీ బ్యాగ్, రవాణ, లేబర్ ద్వారా ప్రతి ఎకరాకు, ప్రతి క్వింటాకు అదనంగా రూ.252 చొప్పున మేలు జరిగేలా చేశాం. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.961 కోట్ల ధాన్యం బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం. » ఈ ప్రభుత్వం దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇప్పుడు శనగకు కనీస మద్దతు ధర రూ.5,875 కాగా, రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు. మా హయాంలో రూ.8 వేల ధర లభించేలా చేసి రైతులకు మేలు చేశాం. » ధరల స్థిరీకరణ నిధి కోసం 2024–25లో రూ.300 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.50.28 కోట్లే. 2025–26లో రూ.300 కోట్లు.. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లలో రూ.340 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఖర్చు చేశారో లేదా ఆ దేవుడికే తెలియాలి. 2026–27 బడ్జెట్లో పెట్టింది రూ.500 కోట్లు.. కానీ మా హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఐదేళ్లలో రూ.7,756 కోట్లు ఖర్చు పెట్టాం. మార్కెట్లో పోటీ తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర దక్కేలా మేలు చేశాం. ఆర్బీకేలు, ఏం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షించే వాళ్లం. చంద్రబాబు సష్టించిన సంక్షోభమే» చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.40 వేలకు గానూ రూ.30 వేలు ఎగ్గొట్టారు. 2025లో చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వమే ప్రకటించింది. నమోదు కానీ మరణాలు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం.» దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు గతంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని మా హయాంలో రూ.7 లక్షలకు పెంచి ఆ రైతు కుటుంబాలకు అండగా నిలిచాం. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంటే.. మరుసటి రోజే కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నేరుగా ఆ రైతు కుటుంబం వద్దకు వెళ్లేవారు. విచారణ జరిపి 48 గంటల్లోనే ఆ కుటుంబం చేతిలో రూ.7 లక్షలు చెక్ పెట్టేవాళ్లు. ఇలా మా హయాంలో 1,323 రైతు కుటుంబాలను ఆదుకున్నాం. అంతేకాదు చంద్రబాబు హయాంలో 474 రైతు కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం మేము ఇచ్చాం.ప్రతి అక్కా చెల్లెమ్మకు రూ.54 వేలు బాకీ » సూపర్ సిక్స్లో మరో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. » వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ప్రతి ఏటా రూ.32,400 కోట్లు చొప్పున బడ్జెట్లో కేటాయించాలి. ఈ పథకం కింద మొదటి రెండు బడ్జెట్లలో ఈ అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది సున్నా. మూడో బడ్జెట్లోనూ ఇచ్చేది సున్నా. మూడేళ్లకు కలిపి అక్కచెల్లెమ్మలకు బాకీపడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ఈ స్కీమ్ కింద ఈ మూడేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు.50 ఏళ్లకే పింఛన్ అంటూ వంచన సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. ప్రతి నెలా రూ.4 వేలంటూ హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వాళ్లకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లవుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో రూ.28,800 కోట్లు కేటాయించాలి. కానీ మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.» ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు. అంటే మూడేళ్లకు రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. -
త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పిల్లల చదువులపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై స్పష్టత లేకుండా చేసి చదువులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక త్రైమాసికం ముగిసిన వెంటనే మరో త్రైమాసికంలో తల్లుల ఖాతాల్లో వేసేవాళ్లం. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో నిధులు విడుదల చేసేవాళ్లం. అయితే 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది.మే 13 పోలింగ్ జరిగింది. అంతే, అక్కడితో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి 9 త్రైమాసికాలకు విద్యా దీవెనకు రూ.6,300 కోట్లు చెల్లించాలి. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. ఎన్నికల పుణ్యంతో అది కూడా ఆగిపోయింది. 2024–2025 ఏప్రిల్ వరకు కలిపి రూ.2,200 కోట్లు వసతి దీవెన చెల్లించాలి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,771 కోట్లు మాత్రమే విడుదల చేశారు.ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోందని మరో రూ.1,200 కోట్లకు బీఆర్వోలు ఇచ్చారు. బీఆర్వో ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీల ఖాతాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పడ్డాయి. అంటే రెండేళ్లలో బాబు ఇచ్చింది రూ.2,071 కోట్లే. ఇంకా రూ.6,428 కోట్లు బాకీ పడ్డారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రూ.35,209 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ⇒ అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ గజం స్థలం కొనడానికి పైసా కేటాయించ లేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. ⇒ పైగా మా హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే, వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నాడు. 2024–25లో రూ.4,012 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.1,548 కోట్లు ఖర్చు చేశారు. 2025–26లో రూ.6,300 కోట్లు (రివైజ్డ్ అంచనాలు) పెడితే రూ.1,928 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు గానీ, వాస్తంగా ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. నాడు–నేడుకు ఉరి ⇒ ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మేము దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే దానికి చంద్రబాబు ఉరి వేశారు. తొలి విడతలో 15,713 స్కూళ్లలో పనులు చేస్తే, రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపు పూర్తి చేసే దశకు తీసుకొచ్చాం. నాడు–నేడుకు రూ.8,524 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని చంద్రబాబు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ⇒ మరో రూ.4–5 వేల కోట్లు ఖర్చు పెడితే నాడు–నేడు పనులు అయిపోతాయి. కానీ, చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మూలన పడేశారు. ఆయన సుపుత్రుడి శాఖలో నాడు–నేడు కోసం 2024–25లో రూ.285 కోట్లు ఖర్చు చేస్తే, 2025–26లో రూ.1,500 కోట్లు కేటాయించి రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు గానీ, ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ, ఐబీ, టోఫెల్ నిలిపివేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, నాడు–నేడు ఎగిరిపోయాయి. సబ్జెక్టు టీచర్ విధానానికి మంగళం పాడేశారు. గోరుముద్ద పిల్లలు తినకుండా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి, నాణ్యత లేని ఆహారం తిని 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారని జాతీయ పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయి. ఇంత దారుణంగా విద్యా రంగాన్ని నడుపుతున్నారు.ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4 వేల కోట్లు వ్యయం చేయాలి. 2024–25, 2025–26 రెండేళ్లకు రూ.8 వేల కోట్లు వెచ్చించాలి్సన చోట చంద్రబాబు 2024–25లో రూ.2,259 కోట్లు, 2025–26లో రివైజ్డ్ అంచనాలు ప్రకారం రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం రూ.2,600 కోట్లే ఇచ్చినట్టు చెబుతోంది. ఇంకా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు పెట్టింది. 2026–27లో రూ.4 వేల కోట్లతో కలిపితే మొత్తం రూ.7,200 కోట్లు ఆర్యోశ్రీకి అవసరం. వీళ్ల బడ్జెట్ చూస్తే పేదలను బతికించేలా కనిపించట్లేదు. 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు (త్రైమాసికానికి రూ.700 కోట్లు) రూ.2,800 కోట్లతో పాటు వచ్చే ఏప్రిల్లో వసతి దీవెనకు రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వ్యయం చేయాలి. దీనికి రూ.6,428 కోట్ల బకాయిలు కలిపితే రూ.10,328 కోట్లు నిధులు కావాల్సి ఉంది. అయితే బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? అసలు చదివే పరిస్థితి ఉంటుందా?వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. ఇదే విషయంపై సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. – వైఎస్ జగన్మహిళలకు రుణ పరపతిలో క్షీణత ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించి ఇవ్వకపోగా.. ఇంతకు ముందు ఇచ్చేది కూడా ఆపేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26,98,931 మందికి రూ.19,189 కోట్లు, ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు, కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4,95,269 మందికి రూ.1,876 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ⇒ స్త్రీలను శక్తిమంతులను చేసేలా వారి సాధికారత కోసం వైఎస్సార్సీపీ హయాంలో చర్యలు చేపట్టాం. మేము అక్కచెల్లెమ్మల బాగు కోసం పరితపించి వారిని నిలబెట్టే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో విచిత్రంగా పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. నాబార్డ్ డేటా చూస్తే.. 2023–24లో మహిళలకు రూ.49,626 కోట్లు పొదుపు రుణాలు ఉంటే, చంద్రబాబు హయాంలో 2025–26 పది నెలల్లో (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. దానికి ముందు ఏడాది 2024–25లో రూ.41 వేలుగా ఉంది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో పరపతి తగ్గిపోతోంది.స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీఉద్యోగులకు పైసా జీతం పెరగలేదు ⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. మూడు బడ్జెట్లు పెట్టినా ఉద్యోగులకు ఒక్క పైసా జీతం పెరగలేదు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చాం. ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ను నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చైర్మన్ను తీసేశారు. ⇒ ఆయన త్వరగా రిపోర్టు ఇస్తే వెంటనే జీతాలు పెంచాలనే భయంతో, ఒకవైపు ఐఆర్ ఇవ్వకుండా మరో వైపున పీఆర్సీ చైర్మన్ తొలగించి, కొత్త పీఆర్సీని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఒకటో తేదీ జీతాల ముచ్చట ఒక నెలతోనే అయిపోయింది. ⇒ జీపీఎఫ్, ఏపీజీఎస్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవుల కింద దాదాపు రూ.35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పడ్డారు. 2024–25లో ఉద్యోగుల జీతాలు రూ.62,806 కోట్లు అయితే, 2025–26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ.61,111 కోట్లు. అంటే జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. కొద్దో గొప్పో ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు. హెచ్ఆర్ఏ 2024–25లో రూ.4,614 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4,600 కోట్లకు తగ్గింది. మెడికల్ రీయింబర్స్మెంట్ రూ.124 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పడిపోయింది. అలవెన్సులు, ఈఎల్, ఎస్టీసీ, ఓవర్టైమ్ అలవెన్స్లు రూ.2,415 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,316 కోట్లకు క్షీణించింది. ఉద్యోగుల బేసిక్ పే రూ.35,671 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35,345 కోట్లుగా మాత్రమే ఉంది. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, అలవెన్స్ చెల్లింపు తదితరాలపై మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. -
అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అవే పచ్చి అబద్ధాలు.. తప్పుడు లెక్కలు.. చంద్రబాబు భజన.. బడ్జెట్ అంతా మోస మే..! అని టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ల ద్వారా రాష్ట్రానికి, ప్రజల కు చంద్రబాబు చేసిన మంచి ఎక్కడా కనిపించద ని.. అంతా మోసమేనని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్, సెవెన్ హామీలను అమలు చేయలేక.. అట్టర్ ప్లాప్ అయినా, సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మోసానికి షర్టు, ఫ్యాంట్ వేస్తే అది చంద్రబాబు. అబద్ధాలకు రెక్కలు కడితే అవి చంద్ర బాబు మాటలు’’ అని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో అంకెల గారడీ, ప్రజలను మోసగిస్తున్న తీరును నిలదీశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పొందుపరిచిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో తప్పుడు లెక్కలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఫ్యాబ్రికేటెడ్ అంకెలతో డప్పు..ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడిచి వంచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. తాను ఇస్తానన్న సూపర్ సిక్స్, సెవెన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి ఎగిరిపోయాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. రాష్ట్ర ప్రగతి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతాయి.. వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కని పిస్తుంది. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ పీక్, ఫెర్మామెన్స్ వీక్. 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు (జీఎస్డీపీ) 11.75 శాతంగా చంద్రబాబు చెప్పుకొస్తారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 9.8% మాత్రమేనని.. దేశం కంటే రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. ఇక 2025–26 రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్రేటు 10.75 శాతంగా తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసుకుంటారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతమేనని.. దేశం కంటే ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందంటూ తన డబ్బా తానే మోగించడం మొద లుపెడతారు. ఫ్యాబ్రికేటెడ్ (మోసపూరిత) అంకెలతో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కనిపిస్తూనే ఉంది. అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటులో ఉంది అంటే.. రాష్ట్రంలోని అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని అర్థం. వ్యవసాయం, తయారీ, సేవలు రంగాలు వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఆ లెక్కలు నిజమే అయితే.. జీఎస్డీపీ ఆ విధంగా పెరిగి ఉంటే అది ప్రజల తలసరి ఆదాయంలో కూడా ప్రతిబింబించాలి కదా? అదే రీతిలో తలసరి ఆదాయం పెరిగి ఉండాలి కదా? తలసరి ఆదాయం నిజంగానే పెరిగి ఉంటే.. తద్వారా ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా పెరిగి ఉండాలి కదా? తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు కూడా పెరిగి ఉండాలి కదా? ఇదంతా ఒక సైకిల్! మరి వాస్తవంగా ఇది జరిగిందా..? అని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి సంవత్సరం 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు. కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే.. 2023–24 వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.93,084 కోట్లతో పోలిస్తే.. పెరుగుదల కేవలం 1.99 శాతం మాత్రమే. అంటే బడ్జెట్లో చంద్రబాబు లెక్కలేసిన రూ.1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక 2025–26లో కూడా వాస్తవంగా రూ.94,937 కోట్లు వచ్చినట్లు కనిపిస్తుంటే.. బడ్జెట్ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.1,27,703 కోట్లుగా చంద్రబాబు చూపించారు. కానీ.. పది నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన డేటా చూస్తే 2025–26లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే వచ్చింది. అదే అంతకుముందు పది నెలల కాలానికి (2024–25) వచ్చింది రూ.72,864 కోట్లు. అంటే.. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. పది నెలల కాలానికి రూ.75,964 కోట్ల ఆదాయం వస్తే.. బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏకంగా రూ.1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వాస్తవాలు చెప్పకుండా.. ఇంకా మోసం చేస్తూ దాన్ని రూ.1,12,349 కోట్లుగా సవరించారు. అంటే.. మిగిలిన రెండు నెలల కాలంలో ఏకంగా రూ.36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025–26లో రాష్ట సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున రూ.7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద రూ.95,000 కోట్లు వస్తే గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27లో రాష్ట్ర సొంత ఆదాయాలు ఏకంగా రూ.1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 45 శాతం పెరుగుదల!! అది సాధ్యమేనా? గత బడ్జెట్లో కూడా ఇలాగే చూపిస్తే వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే. దేశంలో చిట్ట చివరి నుంచి రెండో స్థానం..నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలలు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాలను మా ప్రభుత్వ హయాంలో 2023–24 తొమ్మిది నెలల ఆదాయాలతో పోలిస్తే సగటు వృద్ధిరేటు 1.97 శాతం మాత్రమే. ఈమధ్య కాగ్ 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వృద్ధిని పరిశీలిస్తే సగటున 1.97 శాతంతో మన రాష్ట్రం దేశంలో 23 రాష్ట్రాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బాబు అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా? -
ఉద్యోగులకు భారీ మోసం.. రెండేళ్లుగా జీతాలు పెరగలేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గిందని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.4000 కోట్లు అవసరం. రెండేళ్లలో ఆర్యోగ్రశ్రీకి రూ.3,141 కోట్లు బకాయిలు పడ్డారు. మేము పీఆర్సీ చైర్మన్ను నియమిస్తే.. బాబు తీసేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ఐఆర్, పీఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35వేలు బకాయి పడ్డారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ సూల్స్లో నాడు-నేడుకు చంద్రబాబు ఉరేశారు. స్కూల్స్లో నాడు-నేడు కింద మేము రూ.8,524 కోట్లు ఖర్చు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2024-25లో ఖర్చు చేసింది రూ.285 కోట్లు మాత్రమే. 2025-26లో బాబు ఖర్చు చేసింది రూ.259 కోట్లు మాత్రమే ఉంది. నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించింది.మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నాడు. ఇప్పుడు వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. మా హయాంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.2229 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1876 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత కింద రూ.19,198 కోట్లు ఇచ్చాం. మేము లక్షలాది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.35210 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49,926 కోట్లకు పోతే.. చంద్రబాబు హయాంలో 30,698 కోట్లకు పడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. -
లోకేష్.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. మంత్రి నారా లోకేష్కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్లో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ బడ్జెట్లో తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ కూడా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్. తప్పుడు లెక్కలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నాడు. గ్రోత్ రేట్ పెరిగితే.. తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా?. తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరిగుండాలి కదా?. కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా?. 2024-25లో లక్షా 19వేల 927 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. కానీ, వచ్చిన ఆదాయం 94వేల 937 కోట్లు మాత్రమే. పది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964 కోట్లు. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడీ లెక్కలే. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుంది. చంద్రబాబు మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చేసిందేమిటి?. 2026-27కు లక్షా 37వేల 320 కోట్లు ఆదాయం వస్తుందంటున్నారు. ఇప్పటి కన్నా 45 శాతం అధికంగా చూపిస్తున్నారు. ఇది సాధ్యమా?. స్టేట్ రెవెన్యూ పురోగతిలో ఏపీ 22వ స్థానంలో ఉంది. దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు అసమర్థతకు ఇది నిదర్శనం. ఆదాయంలో కేంద్రం పురోగతి 9.64 శాతం ఉంటే ఏపీ పురోగతి మాత్రం 1.97 శాతం మాత్రమే. జీడీపీ, జీఎస్డీపీపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తగ్గుతున్నాయి. రాష్ట్ర ఆదాయాలు బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
నాయుడు.. మీరు టీటీడీకి ఛైర్మన్.. టీడీపీకి కాదు: బొత్స
సాక్షి, అమరావతి: ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచిందని శాసనమండలి విపక్షనేత, బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారు. తమ ధన దాహం, దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు’’ అంటూ బొత్స మండిపడ్డారు.‘‘మాకు లీగల్ నోటీసులివ్వడం హాస్యాస్పదం. చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. మీ ధనదాహం కోసం.. మీ హెరిటేజ్ స్వలాభం కోసం ఇందాపూర్తో ఉన్న మీ సంబంధాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. మేం చెప్పింది వాస్తవం కాదా.. దేవదేవుడి ప్రసాదంపై ఎన్ని నిందలు వేశారు. ఇది మహాపాపం కాదా?. నిజంగా తప్పు చేస్తే వారి పై చర్యలు తీసుకోండనే మేం కోరుతున్నాం. సుప్రీంకోర్టు కూడా మేం చెప్పిందే చెప్పింది. ఇందాపూర్కు హెరిటేజ్ సంస్థకు ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం తమ ధనదాహం కోసం చంద్రబాబు ఆయన కుటుంబం ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డారు...చంద్రబాబు ఎంత నంగనాచిలా మాట్లాడాడు. చంద్రబాబు, పవన్, కూటమి నేతలు దేవదేవుడిపై నిందలు వేసి మహా పాపం చేశారు. సాక్ష్యాలు ఉంటే చర్చకు రమ్మంటున్నారు. చర్చ చేస్తే సాక్ష్యాలు బయటికి వస్తాయి. టీడీపీ చేస్తున్న మోసానికి టీటీడీ ఛైర్మన్ పత్రికా ప్రకటన ఇవ్వడమేంటి?. ఛైర్మన్ గారు మీరు టీటీడీకి ఛైర్మన్ టీడీపీకి కాదు. మీరు ఇలాంటి ప్రకటనలు చేయాలంటే మీ పదవికి రాజీనామా చేసి మాట్లాడండి. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వివరణలు ఇవ్వడం మానుకోండి. ఇందాపూర్కు హెరిటేజ్కు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇవిగో అచ్చెన్నాయుడు ఆధారాలు చూపిస్తున్నా....మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. మేం చెప్పేది వాస్తవమో అవాస్తవమో హెరిటేజ్ వెబ్సైట్లో చూడమని ప్రజలను కోరుతున్నా. హెరిటేజ్ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. కేరళ ప్రభుత్వం హెరిటేజ్ను బ్యాన్ చేయడమేనా అవార్డు. హర్యానా ప్రభుత్వం లక్ష రూపాయలు ఫైన్ వేయడమేనా రివార్డ్. ఇలాంటి సంస్థకు నేను క్షమాపణ చెప్పాలనడం సిగ్గుచేటు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ జరగాలి.. అదే సమయంలో ఇందాపూర్, తిరుపతి లడ్డూపై చర్చ చేయాలి. నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది..దేవదేవుడి పై నిందలు వేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముందు మీరు చేసిన పనికి తప్పు మాట్లాడామని లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పండి. నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. నేను చంద్రబాబు లాగా అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని కాదు. మేం దేవదేవుడి పవిత్రత గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ధనదాహం గురించి మాట్లాడుతున్నారు. నేను వ్యాపారాలు, షేర్ మార్కెట్ గురించి మాట్లాడలేదు. కేవలం ఏడాది కాలంలో హెరిటేజ్ షేర్ వాల్యూ 300 నుంచి 700 కు ఎలా వెళ్లింది. షేర్ మార్కెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. 2021లో ఈనాడు పత్రిక ఇలాంటి నోటీసు ఇచ్చింది. మూడేళ్లు కిందా మీద పడి నోటీసులు వెనక్కి తీసుకుంది ..మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సంస్థ నోటీసులిచ్చింది. ఈనాడు నోటీసులకే దిక్కులేదు.. చంద్రబాబు ఈ నోటీసులు ఏంచేస్తాయి?చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్తిరుపతి లడ్డూ పై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్తో హెరిటేజ్ సంబంధంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎస్ఐపీబీ ద్వారా హెరిటేజ్ సంస్థకు 295 కోట్ల రూపాయల రాయితీ ప్రకటించింది. 35 ఉద్యోగాల కోసం 300 కోట్ల రాయితీ ఇవ్వడమేంటి?. తక్షణమే హెరిటేజ్కు ఇచ్చిన రాయితీని కేంద్ర క్యాబినెట్ వెనక్కి తీసుకోవాలిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోంది: కల్పలతారెడ్డిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. సభ బయట మంత్రులు చర్చకు సిద్ధమంటున్నారు. మేం కూడా చర్చకు రావాలనే కోరుతున్నాం. కానీ చర్చకు రావడం లేదని కల్పలతారెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు గుట్టు బయటపడటంతోనే చర్చకు రావడం లేదనిపిస్తోంది. లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చింది. ఇందాపూర్ డెయిరీతో సంబంధాలున్నాయని హెరిటేజ్ వెబ్సైట్లో క్లియర్గా ఉంది. హెరిటేజ్కు సంబంధం ఉంది.. కాబట్టే చంద్రబాబు ఇందాపూర్కు నెయ్యి టెండర్లు కట్టబెట్టారు. 300 రూపాయలకు క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చంద్రబాబు, పవన్ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇందాపూర్ కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు మీరు ఒప్పుకుంటున్నారా? మా డిమాండ్ ప్రకారం కచ్చితంగా సభలో ఇందాపూర్పై చర్చించాల్సిందే’’ అని కల్పలతారెడ్డి అన్నారు. -
మాజీ మంత్రి కాకాణితో పోలీసుల దాగుడు మూతలు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పోలీసులు దాగుడు మూతలు ఆడుతున్నారు. మైనర్ మృతి కేసులో విచారించేందుకు ఇంటికి వస్తామంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు. 10 గంటల నుంచి విచారణ నిమిత్తం కాకాణి.. ఇంట్లోనే అందుబాటులో ఉన్నారు. పోలీసులు రాకపోవడంతో రాజకీయ పర్యటన కోసం కాకాణి వెళ్లిపోయారు.కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. బాలిక మృతిపై ప్రశ్నించేందుకు నా పై కేసు పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు పెట్టారు. 14వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు.. చివరలో రావద్దన్నారు. ఇవాళ ఇంటికి వస్తామన్నారు.. ఇప్పటి వరకు రాలేదు.. మేము ఫోన్ చేసినా.. పోలీసులు స్పందించలేదు. బాలిక కుటుంబ సభ్యుల వివరాలు నేను ఎక్కడా బహిర్గతం చేయలేదు...గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టలేదు.. నేను మాట్లాడకపోయినా కేసు కట్టారు. పోలీసులు అక్రమార్కుల మీద నిఘా పెట్టకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టేందుకే పోలీసులు పని చేస్తున్నారు. మా హయాంలో ఓ బాలిక మీద దాడి జరిగితే.. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించి.. కుటుంబాన్ని ఆదుకుంది’ అని కాకాణి గుర్తు చేశారు. -
అప్పుడు లేని యాక్ట్.. ఇప్పుడు వచ్చిందా?: అంబటి తీవ్ర ఆగ్రహం
రాజమండ్రి: గుంటూరు బయల్దేరిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం బయల్దేరిన వెంటనే కాన్వాయ్గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు అంబటి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళతా.. లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళతా’ అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు.. ‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యాక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళుతున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళతా అంటూ హెచ్చరించారు. రాజమండ్రిలో పోలీసుల హైడ్రామారాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకుంటున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేస్తున్నారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. -
నా పెళ్ళాం.. బిడ్డలని తరిమేశారు.. జైలు నుంచి రాగానే అంబటి మాస్ వార్నింగ్..
-
పులిలా బయటకు వచ్చాడు.. విడుదలపై YSRCP నేతల రియాక్షన్
-
మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజాప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి.. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారుఅధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి -
ఎంత రెచ్చిపోతే అంత నాశనమే! TDP మొత్తాన్ని ఏకిపారేసిన బొత్స
-
మండలిలో అప్పుల అసలు లెక్కలు చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు?
-
ఇసుక అక్రమ రవాణా బాబు, లోకేష్ కు ముడుపులు
-
ఇందాపూర్, హెరిటేజ్ ఒక్కటే పాలు, పెరుగే కాదు పాలన కూడా కల్తీ
-
క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి,సాక్షి: క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రైస్తవులకు ఆరాధ్యమైన లెంట్, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఈరోజే ప్రారంభం కావటంపై హర్షం. ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సమానత్వానికి ఇది నిదర్శనం. అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలి. ఉపవాసాలు, ప్రార్ధనలు, దానధర్మాలతో పండుగలను జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. Today marks a beautiful spiritual coincidence as our Christian brothers & sisters begin the holy season of #Lent and our Muslim brothers & sisters begin the sacred month of #Ramadan.May this period of fasting, prayer, and self-reflection bring peace, health, and prosperity to…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2026 -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి ఉన్నారు.అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు.ఈ కేసులో విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో పీటీ వారెంట్ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
లడ్డూ కల్తీ, ఇందాపూర్ డైరీపై చర్చకు YSRCP డిమాండ్
-
తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్ జగన్.. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ రత్నాబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతికి శానమండలి సంతాపం తెలిపింది రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. భోలేబాబా, హెరిటేజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనమండలికి వైఎస్సార్సీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లారు. ఇందాపూర్ డెయిరీ అంశంపై రెండో రోజు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టుపట్టింది.వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఐదు నిముషాల పాటు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు.మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాళ్ళిద్దరు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడో చంద్రబాబు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అని మంత్రి నారా లోకేష్ అనడం హాస్యస్పదం. వాళ్ళిద్దరితో వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్ళు అనడం కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం. ఇందాపూర్ డెయిరీపై మేము చర్చకు పట్టుపడుతున్నాం. మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు. -
శవాల దగ్గర చిల్లర ఏరుకునే వెధవ.. బొత్స గొప్పతనం ఇదిరా..
-
జైల్లో అంబటి పరిస్థితి ఏలా ఉందంటే..
-
ఆ పాపం బాబుదే
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారంతో మంగళవారం శాసన మండలి అట్టుడికింది. హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు కేఆర్జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. ఈ విషయంపై చర్చకు అనుమతించాల్సిందేనని, తద్వారా హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధం బయట పెట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినదించారు. అయినా చైర్మన్ చర్చకు అనుమతించక పోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీటీడీలో హెరిటేజ్ పాత్రపై చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హెరిటేజ్ నెయ్యి, పాలు, పెరుగు అన్నీ కల్తీ కల్తీ.. చంద్రబాబు పాలనా కల్తీ కల్తీ.. గోవిందా.. గోవిందా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ, చైర్మన్ మరో వైపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ.. హెరిటేజ్ వ్యవహారం బయట పడుతుందని సీఎం చంద్రబాబు తన మంత్రులను పంపి డ్రామా ఆడిస్తున్నారని మండిపడ్డారు. ధర పెంచుకునేందుకే దుష్ప్రచారం ‘ఎంతో కాలంగా టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. ఇది హెరిటేజ్ అనుబంధ సంస్థే. మొన్నటి వరకు రూ.300కు అటూ ఇటుగా నెయ్యి సరఫరా చేసింది. అయితే చంద్రబాబు ఇది వరకు ముఖ్యమంత్రి కాక ముందు, ముఖ్యమంత్రి ఆయ్యాక.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్దిష్ట విధానం కొనసాగింది. టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు టెండర్ ఖరారు చేస్తారు. ఇవే సంస్థలు రాష్ట్రంలో పలు ఆలయాలకు కూడా నెయ్యిని సరఫరా చేశాయి. అక్రిడేటెడ్ ల్యాబ్లో సర్టిఫికెట్ పొందాకే టీటీడీకి నెయ్యిని అనుమతిస్తారు. ఇక్కడ మళ్లీ టీటీడీ సొంతంగా ఆ నెయ్యిని పరీక్షిస్తుంది. నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపుతారు. అలా గత చంద్రబాబు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పలుమార్లు వెనక్కు పంపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే అదనుగా తన కుటుంబ సంస్థ హెరిటేజ్ నుంచి ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి ధరను ఏకంగా రెట్టింపు చేయాలని కుట్ర పన్నారు. తద్వారా తన హెరిటేజ్కు, తన సంబందీకులకు, తన అనుబంధ సంస్థలకు లబ్ధి చేకూర్చాలనుకున్నారు. ఇందు కోసం ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పైనే బరితెగించి రాజకీయం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, పందికొవ్వు, బాత్రూమ్లు క్లీన్ చేసే రసాయనాలు వాడారని ఉద్దేశ పూర్వకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల నాణ్యత లేదని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించారు. బండారం బట్టబయలు శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అండ్ కో చేయాల్సినంత దుష్ప్రచారం చేసేసి.. శ్రీవారి డబ్బులు దోచేసేందుకు బరితెగించారు. లడ్డూ సరఫరా ధరను ఏకంగా రెట్టింపు కిలో రూ.600కు పైగా పెంచేశారు. తద్వారా తన కుటుంబం సంస్థ, తన సంబంధీకులు, అనుబంధ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. ఆ లడ్డూ కల్తీ అనే ముద్ర వేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసి.. తను అనుకున్న రీతిలో స్కెచ్ మేరకు ధర పెంచుకోగలిగారు. చంద్రబాబు అంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారనే కోణంలో పలు సంస్థలు, మీడియా, మేధావి వర్గాలు కాస్తా లోతుగా శోధించడంతో నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సంబంధించి పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్దేనని స్పష్టమైంది. దీంతో తన కుట్ర బెడిసి కొట్టడంతో కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ విషయంపై మండలిలో చర్చ జరగాలని, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ సంబంధాల గురించి స్పష్టం చేయాలని మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ పట్టుపట్టింది. ఈ విషయమై చర్చ జరిగితే ప్రజల్లో మరింత చులకన అవుతామని చంద్రబాబు హుటాహుటిన కొందరు మంత్రులను మండలికి పంపారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కె.అచ్చెన్నాయుడు ప్రతి దశలోనూ వైఎస్సార్సీపీ సభ్యులకు అడ్డు తగిలారు. ఇది డ్రామా కాదా? సభ్యుల వాదప్రతివాదనల నేపథ్యంలో చైర్మన్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడటానికి చైర్మన్ మోషేన్రాజు అవకాశం ఇచ్చారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నాకే ఆయనతో మాట్లాడించాలని అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పొడియం వద్ద నుంచి బొత్స వెనక్కు వెళ్లి నిల్చొన్నారు. ఆ తర్వాత బొత్స మాట్లాడే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. తద్వారా సభలో గందరగోళం నెలకొనేలా చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులకు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ అడ్డుకున్నారు. మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమేనని, హెరిటేజ్ వ్యవహారంపై చర్చ జరిగి తీరాల్సిందేనని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కలుగ జేసుకుంటూ.. ‘హెరిటేజ్కు, తిరుపతి లడ్డూకు సంబంధం ఉందని ఒక్క ఆధారం తెమ్మనండి.. అయినా తిరుమల లడ్డూపై ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు’ అని ఎదురు దాడి చేయబోగా.. ‘ఆధారాలు లేకుండా మాట్లాడిందెవరు? ఆధారాలు బయటకు రాకుండా ఇప్పుడు డ్రామాలాడుతోందెవరు?’ అని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని ధనార్జన ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసలు ప్రభుత్వానికి సభ జరిపే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశి్నంచారు. సీఎం చంద్రబాబు ధనార్జన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడైన వేంకటేశ్వరస్వామి లడ్డూపై దుష్ప్రచారం చేశారన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కల్తీ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేశారని చెప్పారు. హెరిటేజ్–ఇందాపూర్ బంధంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, హెరిటేజ్– ఇందాపూర్ డెయిరీ బంధంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో శాసన మండలి చరిత్రలో అరుదైన రికార్డు నెలకొంది. ఎప్పుడులేని విధంగా సభలో తొలిసారి మైక్, సౌండ్ సిస్టమ్ పని చేయలేదు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల మధ్య కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే సభ జరిగింది. గందరగోళం వల్ల నాలుగుసార్లు సభ వాయిదా పడింది. -
‘ఈ నేరాలకు చంద్రబాబు, పవన్లు ఏం సమాధానం చెప్తారు?’
తాడేపల్లి: ఏపీలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. పదే పదే అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి డ్రమ్ములో కక్కేసినా ప్రభుత్వం చోద్యం చూస్తుందోని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు కూడా ఇలాంటి నేరాలకు కారణమన్నారు. హోంమంత్రి అనిత బిల్ గేట్స్తో ఫోటోలు దిగటం మీద చూపే శ్రద్ద నేరాల నిరోధానికి చూపటం లేదని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ఏపీలో రోజుకు 70 నుంచి 80 శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నారా లోకేష్ కొలంబో వెళ్ళి క్రికెట్ చూస్తున్నాడు. హిందూపురంలో బాలకృష్ణ అనుచరుడు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. అనపర్తిలో ఆరో తరగతి బాలిక మీద టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులకు దిగితే నేరస్తుడుకే పోలీసులు వత్తాసు పలికారు. పోలీసులను ఈ ప్రభుత్వం ఎందుకు వాడుకుంటోంది?, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా హోంమంత్రి ఒక్క చోటకు కూడా ఎందుకు పరామర్శకు వెళ్లలేదు?, మదనపల్లె కేసులో నిందితుడి మీద గతంలో కేసులు ఉన్నాయి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కావు కదా?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ నేరాలకు ఏం సమాధానం చెప్తారు?, భవిష్యత్తు మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం అప్పులు తెచ్చింది. దాంతో జనంతో బలవంతంగా తాగిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు ఇక రక్షణ లేనట్టే. కూటమికి ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు చేసేది ఇదేనా?’ అని నిలదీశారు. -
2024 ఏపీ ఎన్నికలపై అనుమానాలు పరకాల ప్రభాకర్ సంచలనం
-
‘కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదు’
కాకినాడ: కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వంగా గీతా. మహా శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ సాక్షిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తిరుమల పవిత్రతను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వంగా గీతా. రాష్ట్ర బడ్జెట్లో సూపర్సిక్స్ పథకాలకు పంగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం.. పథకాలకు నిధులు కేటాయించకుండా గుడ్డి సున్నా చూపించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులక పాల్పడి అక్రమ కేసుల పెట్టడమేనా పరిపాలన అంటే? అని ఆమె నిలదీశారు. -
జేఈఈ టాపర్స్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు -
జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు: అమర్నాథ్
సాక్షి, తూర్పుగోదావరి: అంబటి ఇంటిపై జరిగిన దాడి.. కక్ష పూరిత రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాంబాబును హతమార్చాలని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టారు.. దాడికి పాల్పడినవారు ప్రేరేపించినవారు.. బయట తిరుగుతున్నారు... ఇది రాష్ట్రంలో రాజ్యాంగం’’ అంటూ మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పబ్లిసిటీ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే రాష్ట్రంలో చేస్తున్నారు. బడ్జెట్లో కనీస అవగాహన ఉన్న కూర్పు కూడా లేదు. రాష్ట్ర చరిత్రలో దారుణమైన బడ్జెట్ ఇదే.. అప్పు మాత్రమే కనబడుతుంది. అప్పు తీసుకొచ్చిన సొమ్ము ఏమయిపోయిందో చంద్రబాబుకు, లోకేష్కు తప్ప ఎవరికి తెలియదు’’ అంటూ అమర్నాథ్ మండిపడ్డారు.‘‘గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో రెండు లక్షల 70 వేల కోట్లు డీబీటి కింద పేదల అకౌంట్లో వేశారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇవ్వాలి. సరాసరిన రోజుకు 500 కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఏ ఒక్క రంగానికి సరైన కేటాయింపులు లేవు. యూరియా కోసం రైతుల రోడ్లమీద కొట్టుకుంటున్నారు. 6000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు సిలిండర్లు వంటి ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదు.ఒక్క పథకం అమలు చేయకుండా అంబటి వంటి నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు బిల్ గేట్స్ని కాదు కదా ఎవరు తీసుకొచ్చినా ఏమంటుంది?. జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ఏపీలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది: కరణం ధర్మశ్రీరాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది. చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. కేవలం తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించేందుకే అంబటి రాంబాబును జైలు పాలు చేశారు. బడ్జెట్ బుక్ అంతా వట్టి డొల్ల. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో సమాధి కడతారు -
శాసనమండలిలో YSRCP సభ్యుల ఆందోళన
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గంట ఆలస్యంగా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. 10 గంటలకు ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఆలస్యానికి కారణాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వలేదు.శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది. ఆడబిడ్డ నిధి పేరుతో కూటమి మోసం: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ఆడబిడ్డ నిధిపై మండలిలో తాము ప్రశ్నించామన్నారు. జిల్లా వారీగా ఖర్చుల వివరాలు చెప్పమని అడిగామని తెలిపారు. ప్రభుత్వం మూడు బడ్జెట్లు పెట్టింది. ఇంకా ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉందనే సమాధానం చెబుతోంది. మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీ ఆడబిడ్డ నిధి. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చి మరీ పబ్లిసిటీ చేశారు. ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచారు. కూటమి నేతల మాటలు విని ప్రజలు మోసపోయారు. ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఆడబిడ్డల ముందుకు వెళ్తారు’’ అంటూ వరుదు కల్యాని నిలదీశారు.‘‘ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆడబిడ్డ నిధిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి. ప్రభుత్వానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’’ అని వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. -
మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది
-
కోతలు- వాతలు - కూతలు బాబు బడ్జెట్ పై రాచమల్లు సెటైర్లు
-
KK Raju: ఒరేయ్ కిరాక్ RP.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
-
‘లోకేష్, పవన్ పిల్లలకు కూడా ఇదే భోజనం తినిపించాలి’
తాడేపల్లి : ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలని చంపుతారని ప్రశ్నించారు. బిల్గేట్స్తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలవా చంద్రబాబూ? అని నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్బాబు.. ఏపీలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు పెడుతున్న నాసిరకం భోజనంపై ధ్వజమెత్తారు. ‘ మీ పిల్లలాంటి వారు కాదా మా పిల్లలు?, లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్ఠం ఏంటి?, హాస్టల్స్లో ఉండే వారిని వెలివేసినట్టుగా ప్రభుత్వ పనితీరు ఉంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు బిల్గేట్స్తో హాస్టల్లో భోజనం తినిపించగలరా?, దగ్గర్లో ఉన్న ఏ హాస్టల్లో ఐనాసరే ఆకస్మిక తనిఖీకి తీసుకెళ్ళాలి. మా ప్రభుత్వ హయాంలో రోజుకొక రీతిలో భోజనం పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంటరానితనంతో వ్యవహరిస్తున్నారు. ఏ.కొండూరులో ఎలుకలు కలిచి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. చంద్రబాబుకు పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపు?, ఇది కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించటమే. 900 మంది విద్యార్థులు ఆస్పత్రులు పాలయిన వైనంపై చర్చ కు సిద్దం. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూడటానికి కొలంబో వెళ్లాడా?, ప్రత్యేక విమానాల ఖర్చులో పది శాతం హాస్టల్స్ కి పెట్టినా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. పయ్యావుల కేశవ్ దళిత వ్యతిరేకి.అందుకే బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తన పార్టీకి రెండు కోట్లు ఇచ్చారు సరే..మరి విద్యార్థుల కష్టాలు కనపడటం లేదా?, అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. అక్కడి మొక్కలకు నీరు పోసే దిక్కు లేదు. జగన్ తెచ్చిన డిజిటల్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, గోరుముద్ద పథకం ఏమయ్యాయి?, విద్యార్థుల మరణాలు, ఆస్పత్రుల పాలవటంపై సీఐడీ విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం దిగిపోవాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది’
విజయవాడ: ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు. -
ఇది మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు...నాడు-నేడు స్కీమ్ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు...బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. -
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
బడ్జెట్ ప్రసంగంలో అసత్యాలు చెప్పారు: బుగ్గన
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ఓం నమః శివాయ !#Mahashivratri— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు...బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు..వైఎస్సార్ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?...టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు. -
కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ పచ్చి అబద్ధాలు, కాకిలెక్కలు, ఊహాజనిత సిద్ధాంతాలతో నిండి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల ఆదాయ, వ్యయాల విశ్లేషణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదంటూ తూర్పారబట్టారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ బండారం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్లో పేర్కొనలేదంటూ దెప్పిపొడిచారు. ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన మూడు నెలల్లో ఏకంగా రూ.44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అంటూ నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నా.. వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చిచెప్పారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?‘ అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల నుంచి కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్ తప్ప.. పెర్ఫార్మెన్స్ మాత్రం పూర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీది ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆరి్టఫిషియల్ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. బాధ్యత లేని బడ్జెట్ కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు, రెండూ కలిపి రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఖర్చూ అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉన్న అత్యంత బాధ్యత బడ్జెట్ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడూ అదే ఉంది. అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప.. విశ్లేషణాత్మక వాస్తవాలెక్కడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. చివరకు అప్పు ఎంత ఉందన్నదీ ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నంబర్లు మాదిరిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. మూలధన వ్యయంపైనా అసత్యాలే 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు మాత్రం రూ.80,500 కోట్లు అప్పులు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.20 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025–26లో మూలధన వ్యయం కింద బడ్జెట్లో పెట్టిన అమౌంట్ రూ. 40,635 కోట్లు కాగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు తొమ్మిది నెలలుగా మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్ దాదాపు రూ.14 వేల కోట్లు. ఇప్పుడు కేవలం మూడు నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యమవుతుందా? పైగా రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2024 జూన్ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024–25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్ఫెడ్ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి.. రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనలేదు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్ రూ.12,110 కోట్లు, ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ సంస్థ ద్వారా రూ.1,000 కోట్లు తెచ్చారు, జలజీవన్ మిషన్ కింద రూ.10 వేల కోట్లు అప్పు చేసి.. అవి దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రూ.10 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్డీపీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి తొమ్మిది శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం రెండు శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క? అవినీతి, కక్ష, మోసం, రెడ్బుక్ సహా మీది పది సూత్రాల ప్రణాళిక తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్థికమంత్రి సీఎం గురించి చెబుతున్నది నిజమే. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు నియంత పాలన సాగించారు. అవినీతి, పక్షపాతం, కక్ష, అబద్ధాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీ అనే ఈ పది సూత్రాల ప్రాతిపదికన దుర్మార్గ పాలన సాగిస్తున్నారు. కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్ ఊసే ఎత్తలేదు. 2024 జూన్ నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్ ఎన్క్యాష్మెంట్ 2024 నుంచి లేదు. పోలీసులకు 2024 నుంచి 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ పెండింగ్లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అటకెక్కింది. ఒకటో తారీఖున జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30–07–2024న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఏ ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ప్రజల తరఫున మేం ప్రశి్నస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు.20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం 20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లాంటి ఓ ఆరేడు కూడా సాధించలేదు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలిపి రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ ఉన్నారు. 20 లక్షల మంది 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు పింఛన్ బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20.865 కోట్లు ఎగ్గొట్టారు. సుమారు 6 లక్షలపైచిలుకు ఉన్న కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రూ.6,183 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 24,504.39 కోట్లు ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో.. మా ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చామని అబద్ధాలు చెబుతున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్బీఐ లెక్కలు, లెజిస్లేచర్ లెక్కలు అన్నీ తప్పు చెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే యత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రశ్నకు బదులిచ్చినదాని ప్రకారం మీరు 02–06–2014 నాడు పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.3,06,952 కోట్లకు చేరింది. మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014–19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. -
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు’
విజయవాడ: ఏపీలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ విమర్శించారు. 100 పడకల ఆసుపత్రులను ప్రైవేట్పరం చేసే ఆలోచన లేదని మంత్రి చెబుతుంటే, చంద్రబాబేమో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారన్నారుఉ. పీపీపీ విధానానికి ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసేశామంటున్నారని, పేషెంట్ల వద్ద రుసుము వసూలు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ‘వంద పడకల ఆసుపత్రుల నిర్వహణను పిపిపికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రులను కూడా ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే నీచ సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ‘ ఈ బడ్జెట్ను చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందోనన్న ఆందోళన కనిపిస్తుంది. గత ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 3.42 లక్షల కోట్లు అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగంలో 9.70 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరలు ఇవ్వటం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో ఒక్క గంజాయికి తప్ప మరో పంటకు మద్దతు ధర లేదు. ఉద్యోగుల ప్రస్తావనే లేకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెబుతున్నారు. అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులు ఎన్ని.. తెచ్చిన బకాయిలు ఎలా తీరుస్తారనేది చెప్పలేదు. అన్నీ వర్గాలను విస్మరించి మీరు తెచ్చిన బడ్జెట్ మీ డొల్లతనాన్ని బయటపెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని మండలిలో కడిగేస్తాం’ అని స్పష్టం చేశారు.శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీ బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఇది నారా వారి నకిలీ బడ్జెట్ అంటూ ధ్వజమెత్తారు.‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి నేతల కమిషన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. అప్పుల్లో ఏపీని నెంబర్వన్కు తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. సూపర్ సిక్స్ హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో మొండిచేయి చూపించారు. ఏ వర్గాన్ని ఈ బడ్జెట్ సంతృప్తి పరచలేదు. పేదల కోసం ఏమి చేస్తారో కూడా చెప్పలేకపోయారు’ అని విమర్శించారు. -
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్లోనూ అదే తీరు: వరుదు కల్యాణిఎన్నికల టైంలో ఊరూరా బాండ్లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్కు సంబంధం ఉందా?. మోదీ, పవన్ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..మాయాబజార్ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించారు.30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్ జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందిఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్: కల్పలతా రెడ్డిబడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్: కుంభా రవిబాబుబడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు...బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
మండలిలో 'ఫీజు' మంటలు!
సాక్షి, అమరావతి: ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడేసింది. బాబుగారి అబద్దాల స్కూలులో మాస్టర్ డిగ్రీలు చేసిన మంత్రులిద్దరు ఫీజు బకాయిలపై శాసనమండలిలో నోటికొచ్చిన లెక్కలు చెప్పి అభాసుపాలయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రూ.4వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని మంత్రులు నారా లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించడంతో శాసనమండలిలో కలకలం రేగింది. ఆ ఆరోపణలను వైఎస్సార్సీపీ సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఒక్క క్వార్టర్ (జనవరి–మార్చి) ఫీజు బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షం అడ్డుపడకపోతే అవి కూడా చెల్లించేసేవారమని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేనెలలో ఇవ్వాల్సింది ఎన్నికల ప్రక్రియ వల్ల ఆ క్వార్టర్ ఒక్కటి ఇవ్వలేక పోయామని బొత్స వివరించారు. అధికారులను పిలవండి, దీనిపై సమాధానం చెప్పండి అని ఆయన మంత్రులను నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటుందా అని బొత్స ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ క్వార్టర్ పీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఆ క్వార్టర్లోనే చెల్లించే విధానం ఉందని, ఈ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించని కారణంగా కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎప్పటి లోగా ఆ బకాయిలు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రులు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు బకాయి పెట్టిందంటున్నారని తప్పుపట్టారు. ‘మేం అధికారంలో ఉండగా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆ క్వార్టర్లోనే చెల్లిస్తూ వచ్చాం. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి కేవలం ఒక్క క్వార్టర్ బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఈసీకి లేఖ రాయడం వల్ల చెల్లించలేకపోయాం. ఆ తర్వాత ఏడు క్వార్టర్లతో కలిపి మొత్తం 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. 20 నెలలుగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చదువు దినదినగండంగా మారిపోయింది. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడంలేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయడం లేదు. అన్ని కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది. రూ.6,300 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్ల బకాయిలున్నాయి. ఇపుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు హడావిడిగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని బొత్స వ్యాఖ్యానించారు. ఇవి మూడు క్వార్టర్ల బకాయిలకు సరిపోతాయి అనుకున్నా ఇంకా ఐదు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 6,300 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని, రూ. 700 కోట్లు ఇవ్వగా ఇంకా 5,600 కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు రూ. 3,300 కోట్ల వసతి దీవెన బకాయిలు (ఈ విద్యా సంవత్సరంతో కలిపి) ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ. 8,900 కోట్లు బకాయిలు పెండింగ్ అని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మాత్రమే ఇవ్వడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.రూ. 1,859 కోట్లు జమ చేశాం, ఇప్పుడు రూ. 1,200 కోట్లు: మంత్రులుఅయితే, బొత్స తర్వాత మాట్లాడిన మంత్రులు లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామిలు గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల బకాయిలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి రూ. 1,859.01 కోట్లు విడుదల చేసి విద్యార్థులు లేదా కాలేజీల ఖాతాలో జమ చేశామని.. 2024–25 సంవత్సరానికి సంబందించి ఈ నెల 10న రూ. 12 వేల కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి డోలా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే మంత్రి డోలా అన్నా క్యాంటీన్లపై మాట్లాడే ప్రయత్నం చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిలువరించారు.ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని విశ్వాసం లేదు: బొత్సమంత్రులు లోకేశ్, డోలా చెబుతున్న లెక్కలు తప్పని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాడు–నేడు స్కూళ్లను బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా’ అని నిలదీశారు. ‘‘ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ విద్య మనుగడ సాగిస్తుందని ప్రజలు ఎవరికీ నమ్మకం లేదు. అన్నీ దారుణమైన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిన ఒక క్వార్టర్ తప్ప మా ప్రభుత్వంలో బకాయిలు లేవు. అధికారులను పిలవండి.. సమాధానం చెప్పండి’ అని పట్టుబట్టారు. సభ నుంచి వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదు కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు చెప్పడానికి అదే మార్గమని అన్నారు. ‘ఇలాగైనా న్యాయం చేస్తారని, మీకు జ్ఞానం కలుగుతుందని, భగవంతుడు మంచి జ్ఞానం ఇస్తాడని తప్ప వాకౌట్ చేయడం మా ఫ్యాషన్ కాదు. మీరు చేస్తున్నది విద్యా ద్రోహం. ప్రైవేటు విద్యా విధానంతో పోటీ పడుతున్నామని చెబుతున్నారు, ఈ రెండేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు వచ్చాయి.. ఎన్ని ప్రభుత్వ కాలేజీలు మూసివేశారో తెలియదా? కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ కాలేజీలను మూసివేసి ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తున్నార’ంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.మిగిలిన నాడు–నేడు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? వైఎస్సార్సీపీరాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేస్తోందని, 80 శాతం పైగా నాడు–నేడు పనులు పూర్తయిన నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ బడులకు అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్రెడ్డి మనబడి నాడు–నేడు పనులపై మాట్లాడారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావని, 2020లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని 45,975 ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం నాడు–నేడు ఫేజ్–1లో 15,713 స్కూళ్లలో 14,133 స్కూళ్లను రూ.2,748 కోట్లతోపూర్తి చేశారని, ఫేజ్–2లో 22,311 స్కూళ్లను తీసుకున్నారన్నారు. ఈ స్కూళ్లల్లో 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, ఫేజ్–3లో 14,845 స్కూళ్లలో మైనర్ పనులు చేపట్టారన్నారు. గత ప్రభుత్వంలో రూ.8,524 కోట్లు ఖర్చు పెట్టి అద్భుత సంస్కరణలతో విద్యార్థులకు అవసరమైన 11 సదుపాయాలు కల్పించారన్నారు. ప్రభుత్వం మారడంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేదని, ఇవి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా స్కూళ్లకు విద్యుత్ సదుపాయం, కొన్ని స్కూళ్లకు పెయింటింగ్ వేయలేదని, కోట్లు ఖర్చుపెట్టి కట్టిన స్కూళ్లకు మిగిలిన పనులు పూర్తి చేయకపోతే ఎలా? అని నిలదీశారు. ఈ రెండేళ్లల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, దీంతో విద్యార్థులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడుతో విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని, ఇది దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. చేపట్టిన పనుల్లో దాదాపు 90% పూర్తయ్యాయని మిగిలిన 10 శాతంలో కిటికీలు, విద్యుత్ పనులకు డబ్బులు కూడా ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రెండేళ్లల్లో 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారన్నారు. ఈ ప్రశ్నకు మంత్రి లోకేశ్ జవాబిస్తూ, తమ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు లెర్నింగ్ అవుట్ కమ్పై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. -
చంద్రబాబూ ఇది గుర్తించుకో: చెవిరెడ్డి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్సార్సీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.‘‘ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా?. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని తెచ్చింది. ఇలాంటి సంస్కతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు. ఇక పెట్టుడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడ?. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇలాంటి అక్రమ కేసులు, దాడులు, ఇళ్లు తగలబెడితే భయపడతారనుకోవడం అమాయకత్వం’’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
‘అసెంబ్లీని చంద్రబాబు అబద్ధాలకు వేదికగా మార్చేశారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవాలు చేసినట్లుగా ఉందని ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. ‘ఈ రెండేళ్ళలో సంతృప్తికరమైన అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు. రాష్ట్రంలో పరిస్థితి క్యాష్, సూట్కేసు, రాజేష్, లోకేష్.. అన్నట్టుగా మారింది. సంపద సృష్టిని చంద్రబాబు తన కుటుంబానికి చేసుకుంటున్నారు. మద్యం ఆదాయాలు ప్రభుత్వానికి రావటం లేదు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏఎంఆర్ సంస్థ చెక్పోస్టులు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూములను తమ బినామీలకు దోచి పెడుతున్నారు. గీతం యూనివర్సిటీకి అక్రమంగా ఐదు వేల కోట్ల విలువైన భూములను దోచి పెట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్న చంద్రబాబు ఆ పేర్లు బయట పెట్టాలి. కుప్పానికి నీళ్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి చంద్రబాబు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల మీద పెట్రోలు బాంబులు దాడులు చేశారు’అంటూ ధ్వజమెత్తారు. -
సచ్చిదానంద స్వామీజీకి YSRCP నేతలు నివాళి
-
Maqbool : కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం
-
కాకినాడ YSRCP నేతల గొడవ.. కన్నబాబు క్లారిటీ
-
ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా.. ఆ స్థలం YSRCP దే..
-
మండలిని గట్టిగా వాడుకోండి.. MLCలకు జగన్ దిశానిర్దేశం
-
‘తల్లికి వందనం’పై దద్దరిల్లిన మండలి
సాక్షి, అమరావతి: సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం శాసన మండలి దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ చేత అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్సార్సీపీ సభ్యుడు పి.చంద్రశేఖర్రెడ్డి గణాంకాలతో వివరించారు. తల్లికి వందనం పథకం కింద మొదటి ఏడాది ఒక్క రూపాయి పడలేదని, రెండో ఏడాది పూర్తిగా రూ.15 వేలు ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి, గవర్నర్ చేత మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్లు అవాస్తవాలు చెప్పించారని ఎత్తి చూపారు. అన్నదాత సుఖీభవ కింద ఏ రైతు ఖాతాలో రూ.20,000 జమ చేయకుండానే ఇచ్చేసినట్లు అసత్యాలు వల్లె వేయించారని విమర్శించారు. దీనిపై మంత్రి కొలుసు పార్థసారధి స్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, అర్ధ సత్యాలతో సభను తప్పుదోవ పట్టించొద్దంటూ అడ్డు తగలడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎవరివి అవాస్తవాలో.. ఎవరివి నిజాలో ప్రజలు తెలుసుకుంటారన్నారు. ఇప్పటికీ చాలా కుటుంబాలకు తల్లికి వందనం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదని, ఈ మాటకు తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇది తప్పు అని నిరూపిస్తే క్షమాపణ చెప్పి తన మాటలు వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు. కావాలంటే మీ నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. దీనిపై మంత్రి పార్థసారధి స్పందిస్తూ.. సాంకేతిక కారణాలతో ఒకరిద్దరికి పడకపోవచ్చని, వీటిని తమ దృష్టికి తీసుకువస్తే సరి చేస్తామన్నారు. దమ్ముంటే తప్పు అని నిరూపించండిఒకరిద్దరు కాదు.. 15–18 శాతం మందికి ఇంకా రూ.7 వేల నుంచి రూ.8 వేలు చెల్లించాల్సి ఉందనే మాటకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని బొత్స ప్రతి సవాల్ విసరడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఆధారాలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అన్నదాత సుఖీభవ కూడా పడలేదంటూ తప్పుడు సమాచారం చెపుతున్నారని మంత్రి పార్థసారథి చర్చను పక్కదోవ పట్టించే యత్నం చేశారు. ఇది పెద్దల సభ అని, తాము తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించామని నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెపుతానంటూ బొత్స మరోసారి స్పష్టం చేశారు. తిరిగి చర్చను ప్రారంభించిన చంద్రశేఖర రెడ్డి.. ఒక గ్రామంలోని సచివాలయంలో 21 మందికి తల్లికి వందనం అందలేదని ఫిర్యాదులు చేస్తే, వాటిని పరిశీలించి పరిష్కరించామంటూ చూపిస్తున్నా, ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని లబ్ధిదారులు చెపుతున్నారంటూ ఆధారాలను సభకు సమర్పించారు. దీనిపై రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలుగచేసుకుంటూ.. అధికారుల తప్పు ఉంటే తప్పకుండా వారిని సస్పెండ్ చేస్తామన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, రద్దు చేసినట్లు ప్రకటించి.. వేరే పేరుతో దాన్నే కొనసాగిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి తప్పు పట్టారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చి ఇప్పుడు ఇంటి వద్దకే పౌర సేవలు అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కొత్తగా రెండు జిల్లాలు తీసుకువచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏకంగా ఒకేసారి కొత్తగా 13 జిల్లాలు తీసుకొచ్చారు. తద్వారా ఎవరు విజన్ ఉన్న ముఖ్యమంత్రో ఇట్టే తెలుస్తోంది’ అని చంద్రశేఖర రెడ్డి అన్నారు. -
రూ.5 వేల కోట్ల భూమి ‘గీతం’కు ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడు, ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ ఆక్రమణలోని రూ.5 వేల కోట్లు విలువచేసే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా క్రమబద్ధీకరిస్తారని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సంస్థలకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. లులు, సత్వా, ఉర్సా తదితర కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రాసిచ్చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే కేటాయించిన భూముల వివరాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. ఐదు సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయించినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం తీసుకొచ్చేందుకే ఈ కేటాయింపులు చేశామన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్న లేవనెత్తిన మాధవరావు, వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ఐటీ కంపెనీల పేరుతో విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకు 27 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థకు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఇచ్చేశారు. వాస్తవానికి భూములను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించి.. పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలో ఏపీఐఐసీ ఉంది. కానీ వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకిస్తున్నారు? ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ సంస్థలు మెరుగైన అభివృద్ధి చేస్తాయా? 99 పైసలకే భూములు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చా? ఈ విధానం ఎక్కడైనా ఉందా? ఐటీ పార్కుల అభివృద్ధి నుంచి ఏపీఐఐసీని తప్పిస్తున్నారా? ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని కూడా ప్రైవేటు కంపెనీలకు ఎందుకిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.లోపాయికారీ లావాదేవీలే..విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం, డేటా సెంటర్ అని చెబుతూ లోపాయికారీగా వాళ్లకున్న లావాదేవీలతో, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం అతి కారుచౌకగా భూ కేటాయింపులు చేస్తుందని బొత్స మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా 99 పైసలకు భూములు ఇచ్చుకోవచ్చని మంత్రి చెబుతున్నారు. విశాఖలోని విలీన భూములను 99 పైసలకే ఇస్తున్నారు. ఇందులో పారదర్శకత లేదు. వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. పక్క రాష్ట్రాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. అక్కడ మార్కెట్ ధరలకు భూములు కొంటుంటే ఇక్కడ మాత్రం 99 పైసలకే ఇచ్చేస్తున్నారెందుకు? విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఇప్పుడిది కాదు. 2004లోనే ప్రారంభించాం. అప్పుడు ఆ శాఖ మంత్రిని నేనే. 2014–19 మధ్య మీరేం చేశారో మీ తండ్రి (చంద్రబాబు)ని చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎకో సిస్టం, డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారో వాటిని 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక (విశాఖలో అదాని డేటా సెంటర్) తెచ్చింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ భూ దోపిడీకి, లాలూచీలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల వైఎస్సార్సీపీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో ఐదు సంస్థలకు 99 పైసల చొప్పున భూములు కేటాయించడం వాస్తవం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్కు 22.19 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు 13.29 ఎకరాలు, రహేజా రియల్ ఎస్టేట్కు 27.1 ఎకరాలు, సంవర్ధన మదర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు 3.55 ఎకరాలను 99 పైసలకే ఇచ్చాం. ఎకరం 99 పైసలకు కాదు. ఆయా సంస్థల్లో ఒక్కో సంస్థకు ఇచ్చిన మొత్తం భూమి 99 పైసలే. – శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానంఏడాది క్రితం రిజిస్టరైన సంస్థలకు రూ.వేల కోట్ల భూములా?గత 20 నెలల కాలంలో 99 పైసలకు ఐదు కంపెనీలకు భూములు ఇచ్చినట్టు చెబుతున్నారని, అయితే గత సంవత్సరంలో రిజిస్టర్ అయిన కంపెనీకి కూడా వేల కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారంటూ ఎమ్మెల్సీ మాధవరావు నిలదీశారు. ‘విశాఖ నడిబొడ్డున లులూ సంస్థకు 13.74 ఎకరాలు 99 ఏళ్లకు లీజుకిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్ల భూమిని లీజుకిచ్చారు. ఇంత తక్కువ పెట్టుబడికి ఎంతో విలువైన భూమి ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం రూ.లక్ష కోట్లు పెట్టి టెండర్లు పిలిచి రాజధాని కడుతోంది. అదే 4.15 ఎకరాలకు టెండర్లు పిలిచి భవనం ఎందుకు కట్టడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘ఇంకా పునాది దశలో ఉన్న అమరావతిలో భూముల ధరల కంటే విశాఖలో ఇంకా తక్కువకు ఇస్తున్నారు. వాస్తవానికి మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తక్కువ ధరకు భూములిస్తారు. కానీ విశాఖలో ఎంతో విలువైన భూమిని ఇంత తక్కువకు ఎందుకిస్తున్నారో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడులు జవాబిస్తూ 1994 నుంచి 2004 మధ్య నాటి సీఎం చంద్రబాబు తక్కువ ధరకు హైదరాబాద్లో భూములు కేటాయించబట్టే అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. -
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్ జగన్
ఎన్నికలప్పుడు ఇంటింటికీ ఇచ్చిన హామీలతో కూడిన బాండ్ల గురించి ప్రశ్నించే వారిపై దాడులు, తప్పుడు కేసులు.. అన్ని రంగాలూ తిరోగమనం.. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషూ.. సూట్ కేసూ.. రాజేషు.. లోకేషు..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రజల తరఫున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌన్సిల్ (శాసన మండలి)లో మనకు మంచి సంఖ్యా బలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ‘అందరూ యుద్ధంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా సమర్థవంతంగా పోరాడతారు. మనకు శాసనసభలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్ష నేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా అంతే సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం’ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిలో గట్టిగా నిలదీద్దాంకౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని çసృష్టించి దానికి రెక్కలు కట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిలపై దాడులు కానీ, కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. టీటీడీలో నెయ్యి సరఫరాకు ఒక పక్కా విధానంటీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్ధిష్టమైన పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కు పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కు పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటే, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురద చల్లుతున్నారు. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలే 2014–19 మధ్య కూడా నెయ్యిని సరఫరా చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018లో కూడా నెయ్యి సరఫరా చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.హామీలన్నీ గాలికి..సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ అమలు చేస్తామంటూ ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? దారుణంగా మోసాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పొదుపు సంఘాలన్నీ ఢమాల్ అంటున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషు.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది.’ఈ పాపం చంద్రబాబుదే⇒ లడ్డూ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది.⇒ జూన్ 12న మొదటి ట్యాంకర్ వచ్చింది. ఆ తర్వాత జూన్ 20, 25వ తేదీల్లో, జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయింది. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న వాటిని వెనక్కు పంపించారు.⇒ అయితే అవే ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లను మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారు. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ⇒ వెనక్కు పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే.. జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? ⇒ నిజానికి 2014ృ19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు. అసలు 2014-2019 మధ్య సరఫరా అయిన నెయ్యిపై కూడా విచారణ జరగాలి. ⇒ ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి? ఎవరి హయాంలో టీటీడీ వాటిని అడ్డుకుంది? ఎవరి హయాంలో నెయ్యి శాంపిళ్లు తీసుకున్నారు? వెనక్కు పంపిన ట్యాంకర్లను తిరిగి తీసుకున్నది ఎవరి హయాంలో? ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయి. ఇదంతా సీబీఐ సిట్ చార్జిషీట్లోనే ఉంది. మరి దీన్నంతటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించడం దుర్మార్గం కాదా? -
బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్.. కన్నబాబు ధ్వజం
కాకినాడ: వైఎస్సార్సీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్ను కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెజవాడ సత్యనారాయణతో పాటు మరో పది మందిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని కురసాల తప్పుబట్టారు. తిమ్మాపురం శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు మాత్రం వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడాన్ని కురసాల తీవ్రంగా ఖండించారు. ‘కొందరు పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. వైఎస్సార్సీపీకి కేసులంటే ఎలాంటి భయంలేదు. గత 18 నెలలుగా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం మంచిది కాదు’ అని హెచ్చరించారు. -
వైఫల్యాలపై నిలదీస్తాం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతును వినిపిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో గట్టిగా నిలదీస్తాం. అన్యాయపు పోకడలను గట్టిగా ప్రశ్నిస్తామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.‘‘అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేయటం నుండి మా నేతలపై అక్రమ కేసుల వరకు చర్చిస్తాం. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా హయాంలో నాణ్యత లేని నెయ్యి టాంకర్లను వెనక్కు పంపాం. అవన్నీ పక్కాగా రికార్డులు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే నాణ్యత లేని నెయ్యి వచ్చినట్టు సీబిఐ కూడా చెప్పింది. వీటన్నిటి పై మండలిలో గట్టిగా ప్రశ్నిస్తాం..సగటు హిందువు వినటానికి కూడా భయపడేలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చంద్రబాబు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల విలువైన భూములను తమవారికి దోచి పెడుతున్నారు. గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారు. వీటన్నిటిపై మండలిలో చర్చిస్తాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
-
చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ కీలక సమావేశం
-
బాబూ.. రెవెన్యూ రికార్డులు చూడు.. వాస్తవం ఇదే: దొంతిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు కలెక్టర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
సాక్షి,తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.మండలిలో బలం ఉంది కాబట్టి..:కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది.లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు.చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న, పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి.ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్షీట్లో కూడా రాసింది.వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు.2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం.. స్కామ్ల మయం:మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్.’. ఇది బాగా వినిపిస్తోంది.ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని వైఎస్ జగన్ వివరించారు. -
బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి పార్థసారధి
సాక్షి, విజయవాడ: తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ.. ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారధి ఎదురుదాడికి దిగారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా? అంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80 శాతం మందికి పైగా విద్యార్థులకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఇచ్చారని.. రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన మాటలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించండి. నేను చెప్పింది వాస్తవమోకాదో మీ అధికారులతో విచారణ చేయించండి. తప్పు నాదైతే సభకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం’’ అంటూ బొత్స సవాల్ విసిరారు.తానూ 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. మీరు మాకు సభా సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదని బొత్స పేర్కొన్నారు. బొత్స ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి కొలుసు పార్ధసారధి నీళ్లు నమిలారు. బొత్సపై మంత్రి ఎదురుదాడికి దిగారు.సభ అనంతరం బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల్లో రెండు అంశాల పై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలుకే ఇవ్వడం పై ప్రశ్నించామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖలో ఐటీని అభివృద్ధి చేశాం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలుకే భూములిస్తానంటోంది.. ఎందుకు కంపెనీలతో లాలూచీ పడి భూములివ్వాలంటూ బొత్స ప్రశ్నించారు.వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చింది. సీఎం కుటుంబ సభ్యులు 5 వేల కోట్ల భూములు కబ్జా చేశారు. 5 వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని గీతం సంస్థ చెబుతోంది. వేల కోట్ల భూములు కబ్జా చేయడమేంటి?. పెన్షన్లపై ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగంపై అధికారపార్టీ సభ్యులు డబ్బాలు కొట్టారు. ప్రతీ ఒక్కరికీ 15 వేలు తల్లికం వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందరికీ ఇచ్చారా అని ప్రశ్నిస్తే సమాధానం లేదుతల్లికివందనం డబ్బులో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. చాలామంది ఖాతాల్లో ఏడెనిమిది వేలే జమ అయ్యాయి. మేం చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపిస్తే మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పా. మేం వేసిన ప్రశ్నకు అడ్డగోలుగా మంత్రి సమాధానం చెబుతున్నారు. 15 ఏళ్లు నేను కూడా మంత్రిగా చేశా. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు చేతనైతే మీ అధికారులతో ఎంక్వైరీ చేయించండి. మేం చెప్పింది అసత్యమని నిరూపించండి. ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలి.ప్రతిపక్షం చెప్పిన విషయాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తదా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ శాసనమండలి సమావేశంలో మాటలతో రఫ్ఫాడించిన బొత్స
-
Varudu : విశాఖ భూములను 99 పైసలకు వాళ్లకి ఎలా ఇస్తారు..?
-
BR నాయుడు నెయ్యి కుంభకోణం..! నాగార్జున యాదవ్ సంచలన ఆరోపణలు
-
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న.. లోకేష్ ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో భూములను కారుచౌకగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి లోకేశ్ విరుచుకుపడ్డారు. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున భూములు ఎన్ని కంపెనీలకిచ్చారని అడగడమే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పాపమైపోయింది. లోకేశ్కు తోడుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరుపేరులేని ఉర్సా కంపెనీకి తాము స్థలాలు ఇవ్వనేలేదని బుకాయించే ప్రయత్నం చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు? అని ప్రశ్నించారు. అలాగే...‘‘ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.మూడు వేల కోట్ల విలులైన భూమిని 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా?. విశాఖలోని ఓ విద్యాసంస్థ రూ.ఐదు వేల కోట్ల విలువైన భూములను తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము రూ.వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెబుతోంది. రూ.వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించకోవచ్చా?’’ అని నిలదీశారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారు. కానీ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములిస్తున్నారు. ఏపీఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు’’ అని ప్రశ్నించారు.అవును.. 99 పైసలకే భూములిచ్చాం.. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కేపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ... ‘‘151 సీట్లు ఉన్న మీకు 11 వచ్చాయి’’ అంటూ ఓవరాక్షన్కు దిగారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందే. వైజాగ్లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గీతంకి భూములు కేటాయింపులకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని బయటకు వచ్చారు. -
జోగి రమేష్ కు కన్నబాబు పరామర్శ
-
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ సమావేశం
-
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్ పల్లి) వైఎస్సార్సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్ జగన్కు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు వివరించారు. కేఎన్పల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్ జగన్ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్రెడ్డి, మోహన్రెడ్డి (వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు) ఉన్నారు. -
‘ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం’
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా కథనాలు కూర్పుగా గవర్నర్ ప్రసంగం ఉందని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో వచ్చే కథనాలనే పుస్తకంగా అచ్చేసి ఆయనతో చదివించారేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ప్రసంగమంతా చూస్తుంటే భ్రమలు, అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలే కనిపిస్తాయని వివరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు పాలనలో అడుగడుగునా వింత పోకడలే తప్ప విషయం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతోందని, సభలో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకూడదనే భయంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చెప్పారు.ప్రతిపక్ష హోదా విషయంలో గవర్నర్ చొరవచూపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 164 మంది సభ్యులున్న కూటమికి 11 మంది వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు రావడానికి వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అట్టర్ ఫ్లాప్ సినిమాకి కలెక్షన్ల వర్షం అన్నట్టుందికూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5, ఏబీయన్లలో వస్తున్న కథనాలను వింటున్నట్టు, చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలనే పుస్తకంగా అచ్చేసి గవర్నర్తో చదివించారేమోనని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఊసే లేదు. అవే అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలు, ఏదో జరిగిపోతుందన్న భ్రమలు.. ఇవి మాత్రమే కాకుండా నిత్యం ఎల్లో మీడియాలో కనిపించే వైఎస్సార్సీపీ మీద ఏడుపులు, పెడబొబ్బలు.. స్థూలంగా గవర్నర్ ప్రసంగం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసిందని ప్రెస్మీట్ పెట్టి చెప్పుకున్నట్టుగా ఉంది.20 నెలల్లో రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసి పతనం వైపున రాష్ట్రాన్ని నడిపిస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్టు గవర్నర్ తో చెప్పించడం హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి వరకు చేసేందేమీ లేదు. ఈరోజు ఏం చేస్తాడో తెలియదు.. కానీ ఏరో స్పేస్ సిటీ, ఎలక్ర్టానిక్ సిటీ, క్వాంటం సిటీల పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. ఎవరో చేసిన హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్ను ఇప్పటికీ తన గొప్పగానే చెప్పుకుంటున్నాడు.ఇళ్లు లేవు, పింఛన్లు లేవు, మహిళలకు రక్షణ లేదుపునర్నిర్మాణం, అభ్యుదయం, అభివృద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా విధ్వంస పాలన అంటూ వైయస్సార్సీపీ మీద నెపం నెట్టడం దౌర్భాగ్యం. గత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు పెట్టి దిగిపోతే ఐదేళ్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా నడిపించారు. రూపాయి అవినీతి లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. సంపద సృష్టిస్తానని ప్రజలకు నమ్మబలికి 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం.. సంపద సృష్టించడం పక్కనపెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి శ్రీలంక హీనంగా మార్చేశాడు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ. 3.36 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 20 నెలలకే రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీల ఏర్పాటు పేరుతో విశాఖలో భూముల పంపకం తప్పించి చంద్రబాబు చేసింది శూన్యం.చేసిన తప్పులు, హామీలు అమలు చేయలేని చేతకానితనాన్ని, జరుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆఖరుకి కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని వివాదాల్లోకి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు. కూటమి నాయకుల దారుణాలను ప్రశ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేశారు. శాంతిభద్రతల పతనం జరుగుతుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ఊసే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశంలోని అత్యున్నత స్థానం నుంచి అట్టడుగు స్థాయికి పడిపోతే గవర్నర్ ప్రస్తావించలేదు. ఒక్క పింఛన్ కొత్తగా ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు తొలగించారు. ఒక్క ఇంటి స్థలం మంజూరు చేయకపోయినా ఇంటి నిర్మాణాలు ఆపేశారు.ఫీజు రీయింబర్స్ బకాయిలు క్లియర్ చేయకపోయినా, ఆరోగ్యశ్రీతో వైద్యం అందకపోయినా, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోయినా.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న బడాయి మాటలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. ట్రూఅప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు రెండింతలు పెంచేసి దోచుకుంటున్నారు. శ్రీశైలం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భక్తుల మీద లాఠీ చార్జీ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగారు. ఆస్తుల కోసం ఆలయాల నేలమట్టం జరుగుతోంది.సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన నాయకుల పాలనలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా గవర్నర్ ప్రస్తావన ఎక్కడా లేదు. వక్ఫ్ భూములు, ఆలయాలకు చెందిన ఎండోమెంట్ భూములు కాజేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావనే కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న ప్రతిపక్షం మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సభలో సమయం ఇవ్వాలి కదాఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అత్యాచారాలు రాజ్యమేలుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ.. ఆరు కోట్ల ప్రజలందరి తరఫున 175 నియోజకవర్గాల సమస్యలను సభలో బలంగా వినిపించాలంటే అసెంబ్లీలో సమయం కావాలి కదా. సమయాన్ని కేటాయించకుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా? దీనిపై గవర్నర్కి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా గొంతు వినిపించకపోతే అమాయకులకు న్యాయం జరిగేది ఎలా?వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా? గవర్నర్ దీనిపై స్పందిస్తారని ఆశించినా ఫలితం కనిపించలేదు. పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకుంటుంటే చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టేశాడు. వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు రాకూడదని, చర్చకు వస్తే ప్రజలకు సమాధానం చెప్పే దమ్ములేక వైయస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి వెనకడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ హెచ్చరించినట్టుగానే దోచుకో పంచుకో తినుకో లాంటి పాలన నడుస్తోంది.జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలుఅసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని బలంగా నిలదీయాలని ఉంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడిపోతోంది. దీనిపై గవర్నర్ గారు కూడా చొరవ చూపించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ఇప్పటికే గవర్నర్కి వినతిపత్రం ఇచ్చినా చర్యలు కనిపించలేదు. అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప, నిర్మాణం జరగడం లేదు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు విలువైన భూములు బినామీలకు రాసిచ్చేస్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. -
రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు
-
ప్లకార్డులతో జగన్ నిరసన
-
దేవుడితో పెట్టుకున్నోడెవడూ బతకడు చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త


