YSRCP
-
ఓటర్ లిస్ట్పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా అని భూమన చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో కొందరు నా ఇంటి ముట్టడికి వచ్చారు. ఒబెరాయ్ హోటల్కు స్థలం ఇస్తే సాధవులు ఎందుకు ఖండించలేదు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత. బీఆర్ నాయుడు నీ బెదిరింపులకు నేను భయపడను. దాడులకు భయపడే వాడిని కాదు.. భయపెట్టేవాడిని. తిరుమలతో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా’ అని తెలిపారు.బీఆర్ నాయుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు. బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు.సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నా ఇంటి ముట్టడికి కొంత మంది వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాధువులు అయిపోరు. బీఆర్ నాయుడు అక్రమాలను నేను ప్రశ్నిస్తున్నానే కారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువులు, జగత్ కిలాడీలు, టీడీపీ కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీ నాయకుడు నారాయణ రావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నించారు. 20 టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణ రావు. సన్యాసి ముసుగులో నా ఇంటి ముట్టడికి సిద్ధపడ్డారు. బీఆర్ నాయుడు తొత్తులుగా వాళ్లంతా నా ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. బీఆర్ నాయుడు.. కాషాయం ముసుగులో ఇలాంటి సన్యాసులను నాపైకి పంపిస్తున్నాడు. బీఆర్ నాయుడు కాదు బీఆర్ కాముడు. ఈ దొంగ స్వామీజీలు కాదు నాకు చెప్పాల్సింది. జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాళం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతిలు చెబితే నేను వింటాను’ అని అన్నారు. -
రెచ్చిపోయిన పొన్నూరు CI.. YSRCP నేత అశోక్ బాబుని ఎత్తుకెళ్ళి
-
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం
సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.మధ్యాహ్నం రేపల్లె ఇన్ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు. -
‘వెన్నుపోటు పార్టీ.. ప్రజలపై పన్నుపోటు’
సాక్షి, తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంధన ధరలను భారీగా పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని.. ప్రజాపాలనలో ఘోర వైఫల్యం చెందారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందన్న అప్పిరెడ్డి.. ఇంధన ధరల పెంపుపై తమ నాయకులు అడిగిన ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పలేక పోయారన్నారు.‘‘ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించటం కూడా చేతగాని వారు కూటమి నేతలు. పెట్రోలుపై రూ.31లు ట్యాక్స్ వేసింది చంద్రబాబు కాదా?. డీజిల్ మీద 22 రూపాయలు ట్యాక్స్ వేసిందీ చంద్రబాబే. చివరికి అమరావతి పేరుతో మరో రూ.4 ట్యాక్స్ వేయలేదా?. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తే జగన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే జగన్ ప్రభుత్వం ప్రజల మీద వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు..మరి చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఎందుకు చేయటం లేదు?. అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉండదా?. రూ.3,400 కోట్ల భారం ప్రజల మీద వేయటం సిగ్గుచేటు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన చంద్రబాబూ?. అమరావతి అద్దాలకు పెట్టే ఖర్చు ప్రజల బాగు కోసం పెట్టలేరా?. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంధన ధరలను తగ్గించాలి...టీడీపీ డీఎన్ఏనే వెన్నుపోటు. రైతుల నుండి అన్ని వర్గాలనూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్సీపీ ప్రజల పార్టీ. వివేకా హత్య జరిగింది చంద్రబాబు పాలనలోనే. చంద్రబాబుదే గొడ్డలి పార్టీ. పొరుగు రాష్ట్రాలను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
‘వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు’
తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానమే లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలే చేశారని, చంద్రబాబు మాదిరి ఎప్పుడూ హత్యా రాజకీయాలు జగన్ చేయలేదన్నారు జూపూడి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేమో పిల్లల్ని కని సంపద సృష్టించండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఈ రెండేళ్లలో జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపారు. చంద్రబాబు మాత్రం ప్రజలను వదిలేసి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవటం మానేశారు. జగన్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళు ఎలా గెలిచారో పరకాల ప్రభాకర్ను అడిగితే చెప్తారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారు..కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో అచ్చెన్నాయుడు ఆయన సొంత పార్టీ గురించి ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రజలకి ఇచ్చిన మానిఫెస్టో అమలు చేయమని చెప్పటం తప్పా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు జగన్ అబద్ధాల కోరు అవుతారా ?, జగన్ క్యారెక్టర్ను దెబ్బతీయటం కోసం అనేక కథలు అల్లటం మీకు అలవాటు. జగన్ సూచించిన మావిగన్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వ పెద్దల గుండెలు జారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు. -
అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
గుంటూరు: పొన్నూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళీకి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. మొక్కజొన్న రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు పోలీసులు. ఇదిలా ఉంచితే, రెండు రోజుల క్రితం మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ చేశారు. బుధవారం(మే 20వ తేదీ) ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి బుధవారం ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. -
మా అంత శుద్ధపూసలు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు సిగ్గుగా లేదా..
-
అమరావతిలో బాబు లూటీ
సాక్షి, అమరావతి: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలన్నీ దొంగ మాటలని తేలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికే అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అమరావతిలో స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ (రక్తపోటు) పెరుగుతోంది’ అంటూ మండిపడ్డారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబు తన స్కాముల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్) మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ‘అమరావతి అయితే సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలి. అదే మావిగన్ అయితే మొదటి రోజు నుంచే ఫలితాలు వస్తాయని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి.. ప్రజలందరూ ఇదే కరెక్టని, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయడం ధర్మం కాదంటుంటే.. సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో బీపీ పెరిగి నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులతో సహా అబద్ధాలాడుతూ, బూతులు తిట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా చంద్రబాబును మావిగన్పై స్పందన కోరండి.. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే.. మీపై బ్లాస్ట్ కాకపోతే చూడండి’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, అంచనా వ్యయం పెంపు, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం.. తద్వారా చోటుచేసుకున్న భారీ స్కామ్లను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ‘ప్రజలు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతు వినిపించడానికి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు. ఈ కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. రెండేళ్లుగా బాబు పరిపాలనలో తీరు ఇదే. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుసూ్తనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. పొరపాటున చంద్రబాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగిపోవచ్చు. మావిగన్ అంటే చాలు బాబుకు అంతగా బీపీ పెరుగుతోంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనేది దొంగ మాటేచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా ఉండేలా వ్యవహరిస్తున్నారు. లక్షల ఎకరాల్లో అమరావతి నిర్మాణం పేరిట కేవలం రోడ్లు, డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమ కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలు దొంగ మాటలుగా తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, తెస్తున్న (కమిట్) అప్పులు రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే బాబుకు రక్తపోటు (బీపీ) వస్తోంది.మావిగన్ అంటే ఉలికిపాటు.. రక్తపోటురాష్ట్రానికి ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్), ఏపీ పరిస్థితులను పూర్తిగా మనస్సులో పెట్టుకుని మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించాం. మచిలీపట్నం–విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ–గుంటూరు మరో 40 కిలో మీటర్లు హైవే వెంట అద్భుత రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ హయంలో నిర్మాణం తలపెట్టిన పోర్టు శరవేగంగా నడుస్తోంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం కనిపిస్తోంది. 3 రైల్వే స్టేషన్లు, 4 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 35–40 లక్షల జనాభా ఉంది. అదే అమరావతి అయితే.. అంతా సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లుసెక్రటేరియట్ బిల్డింగ్లకు మాత్రమే రూ.10,665 కోట్లు అవుతుందా? ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఇవి కాకుండా కొత్త అసెంబ్లీ కోసం 11.21 లక్షల ఎస్ఎఫ్టీలో నిర్మాణానికి రూ.1,947 కోట్ల ఖర్చు తేల్చారు. అంటే ఎస్ఎఫ్టీ రూ.17,356 పడింది. కొత్త హైకోర్టుకు 20.32 లక్షల ఎస్ఎఫ్టీలో పాక్షికంగా రూ.1,480 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇది పూర్తయ్యే సరికి ఏ స్థాయికి రేట్లు పెరుగుతాయో తెలీదు. ఇలా 5 సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి.. ఏడు బిల్డింగుల కోసం ఏకంగా రూ.14,092 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లా?అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్కు ఈ ఏడాది ఫిబ్రవరి 5న లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ, అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కిలోమీటరుకు రూ.69 కోట్లు ఖర్చయితే.. చంద్రబాబు అమరావతిలోని సీడ్ యాక్సెస్ నుంచి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్కు కిలోమీటర్కు రూ.189 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు.⇒ చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు. ⇒ ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి.⇒ ప్రజలంతా మావిగన్కు మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు.. తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు⇒ గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, అదే కాంట్రాక్టర్లకు టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతుల్లో తిరిగి టెండర్లు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర రకరకాల పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు.⇒ అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. ⇒ రాజధానిలో చంద్రబాబు తన మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినామీలకు రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? -వైఎస్ జగన్ అమరావతిలో ప్లాట్ల స్కామ్చంద్రబాబు తన మనుషులకు, ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినావీులకు అమరావతిలోని రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు దిక్కులేదని రైతులు అంటుంటే.. ఇవి సరిపోవని మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రైతులు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. మేం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ, ఆధారాలతో సహా స్కాములను బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే బిల్డప్ ఇచ్చి.. ఒక కథ అల్లుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒక పెద్ద మాఫియా ముఠా. వీళ్లు ఏమనుకుంటే దానిపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దొంగ సాక్ష్యాలతో వీళ్ల అధికారులతోనే కేసులు పెట్టిస్తున్నారు.ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందేవెలగపూడి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అందుబాటులో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. దీనికి శాశ్వత సెక్రటేరియట్ అని కొత్తగా నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు. 2018లో ఇవే ఐదు టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ (చదరపు అడుగు) బిల్డప్ ఏరియాతో నిర్మాణాలకు రూ.2,271 కోట్లతో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ లెక్కన ఒక ఎస్ఎఫ్టీకి సుమారుగా రూ.4,350 అవుతుంది. ఇది 2018 రేట్ల ప్రకారం చాలా ఎక్కువ. కానీ, ఇవే బిల్డింగులకు గతంలో ఇచ్చిన పనుల టెండర్లను రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడా గతంలో ఉన్న కాంట్రాక్టర్లే వచ్చారు. అవే కంపెనీలకు, అవే పనులు దక్కాయి. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది.⇒ ఐదు బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ భవనాల ఆవరణలోనే డ్రెయినేజీ, నీళ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,053 కోట్లు.. లిఫ్టులు, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా బిల్డింగ్లకు అదనంగా అద్దాలు వేసేందుకు (గ్లాస్ ఫిట్టింగ్) రూ.2,540 కోట్లకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. ఒక్కోపనికి ఒక్కో కాంట్రాక్టర్ కాదు. అన్నీ వాళ్లకే ఇచ్చారు. ⇒ ఈ ఐదు బిల్డింగులకు డిజైన్ కోసం మరో రూ.401 కోట్లతో కలిపి మొత్తం రూ.10,665 కోట్లు ఖర్చు అవుతుంది. 52,20,496 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్టీకి రూ.20,427 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఫర్నీచర్, ఇంటీరియర్ సమకూర్చే సరికి ఎస్ఎఫ్టీకి రూ.30–40 వేలు అవుతుందేమో. ఇక్కడ భవనాల నిర్మాణానికి ఇసుక ఫ్రీ. పైగా ప్రభుత్వం జీఎస్టీ, ఎంఈఆర్ఐటీ, డీఎంఎఫ్, ఎన్ఏసీ చార్జీలు రీయింబర్స్ చేస్తోంది. వీటి మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతోంది.⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు. తెలంగాణలో కేసీఆర్ 28 ఎకరాల్లో సచివాలయం నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో కట్టారు. అలా చూసినా ఎస్ఎఫ్టీకి రూ.6 వేలు పడింది. ఇక్కడ ఎస్ఎఫ్టీ రూ.20,420.. హంగులతో కలిపితే రూ.30–40 వేలు అవుతుందంటే ఎవరికైనా కళ్లు చెదురుతాయి.అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్!చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ గట్టి కౌంటర్రాష్ట్రంలో ఓ వైపు పాలన అత్యంత దారుణంగా ఉంటే చంద్రబాబు మరోవైపు తన కొడుకుతో ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ అంటూ బహిరంగ సభల్లో బాలకృష్ణ డైలాగ్లు కొట్టిస్తున్నాడు’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వీటికి బదులుగా ఆయన ‘అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్’ అంటూ మీడియా సమావేశంలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ప్రజలకు ద్రోహం చేయడం.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం.. ప్రజలను వాడుకుని వదిలేయడం మీ క్యారెక్టర్.. ఆరు నూరైనా ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ పనులు చేసి చూపించడం మా స్టయిల్.. పబ్లిసిటీ, క్రెడిట్ చోరీ చేయడం మీ స్టయిల్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వీటన్నింటిని నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. ⇒ ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర.. రెండేళ్లయ్యేసరికి మేం చేసిన అప్పులకంటే ఎక్కువగా రూ.3.40 లక్షల కోట్ల అప్పులు చేయడం, మా హయాంలో చేసిన పథకాలన్నీ రద్దుచేయడం, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు బుట్టదాఖలు చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. తెలుసుకో. -
పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే
సాక్షి, అమరావతి: పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ సోది కబుర్లేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు చెప్పే మాటలు ఆయన కొడుకు, దత్తపుత్రుడు వినరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం ఉన్నాయి. గన్నవరం, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి చూస్తే 3 విమానాలు, 3 చాపర్లు కన్పిస్తాయి. ఇంధన పొదుపు పేరిట వాళ్లు చెప్పేవన్నీ సోది కబుర్లే. ఇవేమీ వాళ్లకు వర్తించవు. ఆ సోది వినమని ప్రజల చెవిలో పువ్వులు పెడతారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఏదైతే విత్తుతామో అవే పండుతాయి. మీరు ఈ పొద్దున ఏం చేస్తున్నారో రేప్పొద్దున ఇవన్నీ వాళ్లకు చుట్టుకుంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి, చంద్రబాబుపై భయంతోనో ఆయన చెప్పినట్టు చేయకండి. వీటన్నిటిపై విచారణలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులపై విచారణ జరుగుతుంది. ఆ తప్పులు చేసిన అధికారులందర్ని చట్టం ముందు నిలబెడతాం. రిటైరైనా, సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి తీసుకొస్తాం. గవర్నెన్స్లో ఉన్నవాళ్లు కచ్చి తంగా వేసే ప్రతి అడుగు రేప్పొద్దున అదే తమకు చుట్టుకుంటే ఎలా అనేది ఆలోచన చేయాలి. అడుగులు వేయాలి. ఇప్పుడు దేవుడిచ్చి న అవకాశం ప్రజలకు మంచి చేయమని చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ స్థానాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలే తప్ప కక్ష తీర్చుకునేందుకు, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూడటం దుర్మార్గం. అందుకే పోలీసులకు కూడా చెబుతున్నా రేప్పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు’ అని స్పష్టం చేశారు. ఎవరి నోటినుంచైనా అవే మాటలు వస్తాయిపవన్కళ్యాణ్ హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లారని, జగన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘అది ఆయన(అమిత్షా) చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశారు. జగన్ను చూశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నారు. జగన్ చేసిన పాలన చూశారు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటినుంచి అయినా ఇవే మాటలు వస్తాయి’ అని స్పష్టం చేశారు. ‘తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేయడంతో అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా’ అని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉంటుందిగానీ జగన్కు ఎలా ఉంటుంది’ అని అన్నారు. -
హామీలకు వెన్నుపోటు
చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. సున్నా వడ్డీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నాపట్టించుకునే నాథుడు లేడు. విద్యా దీవెన, వసతి దీవెన రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు. అన్ని రంగాలు తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ఫలాన మంచి చేశానని ప్రజలకు చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల పనితీరు (ప్రోగ్రెస్ రిపోర్టు) చూస్తే.. ఒకే ఒక్కటి కని్పస్తుంది. అదే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. ఈ రెండేళ్ల చంద్రబాబు పరిపాలనను గమనిస్తే కనిపించే నిజమిది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారని దెప్పిపొడిచారు. ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నారని.. ఇలాంటి దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంతా అస్తవ్యస్తం.. కష్టాల్లో ప్రజలు ఓ వైపు మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలుగా మిగిలాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోయాం. సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ ముందుకెళ్లాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి నెలకొంది. ఆసరా, చేయూత కథ దేవుడెరుగు.. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి మొన్న డిసెంబర్ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. ఈ పరిస్థితిలో ఈ పెద్దమనిషి చెంపలేసుకుని కనీసం ఇప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధర కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?పెట్రోల్, డీజిల్ ధరలు బాదింది బాబే ‘అయ్యా చంద్రబాబూ.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్. వీటి ధర తగ్గిస్తామని వీళ్లు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా? 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి. (పీపీటీలో పెట్రోల్, డీజిల్ రేట్లు చూపించారు) చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. (చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాల వీడియో చూపారు) మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది? » ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నావు. రెండేళ్లయి పోయింది. ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు? 50 ఏళ్లకే పెన్షన్ లేదు » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నావు. అదీ జూన్ 2024 నుంచి. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.రైతుల నడ్డి విరిచారు రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులకు మా హయాంలో రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు అందులో 7 లక్షల మందికి కోత కోశాడు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి చివరికి వచ్చిన తర్వాత చివర్లో మోదీ∙వాళ్లు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ–క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఉచిత బస్సు.. తుస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మేము ప్రభుత్వంలో విలీనం చేసిన 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు.. భూములతో సహా. భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు. అతీగతిలేని విద్యాదీవెన.. వసతిదీవెన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5,820 కోట్లు. విద్యా దీవెన కింద 9 త్రైమాసికాలకు క్వార్టర్కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు. ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1,770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలున్నాయి. వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1,100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1,100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1,100 కోట్లు.. ఇప్పటికే రూ.2,200 కోట్లు బాకీ. రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు. అమ్మ ఒడి మరో మోసం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇదీ అమ్మ ఒడి పరిస్థితి. గ్యాస్ కూడా లేదు గ్యాస్ సిలెండర్ల పరిస్థితీ అంతే. ఇప్పటికి 9 ఉచిత సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంత వరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్ డ్రాస్టిక్గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొరలో కూడా అన్యాయం. కొత్త పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేలు కట్ మా హయాంలో ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయించాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. వాటిని చంద్రబాబు తగ్గించేస్తున్నారు. ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్ చేశారు.సంక్షోభంలోనూ స్కామ్పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? ఇక్కడా స్కామే చేశాడు. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర జనం బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంచి మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ప్రజలను ఇక్కట్లపాలు చేశాడు. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ ఇవ్వండంటూ బీపీసీఎల్, ఐవోసీ తదితర ఆయిల్ కంపెనీలకు లెటర్ (లేఖను చూపుతూ) రాశాడు. మీ ఎన్డీయే కూటమిలో సభ్యుడు చంద్రబాబు ఇలా అడుగుతున్నాడు.. మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు. అక్కడి నుంచి మోదీ షంటుకున్నారు. దానిపై కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ తిరిగి లేఖ రాసింది. నీకు బుద్దీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ? దేశంలో పెట్రోలు, డీజిల్ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటే, బల్క్ డీజిల్ కొంటే రేటెక్కువ అని చెప్పి.. కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో డీజిల్ పోయమని ఎలా అడుగుతున్నావు అని కేంద్రం లేఖ రాసింది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? తద్వారా ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా.. ఈ ముఖ్యమంత్రి తప్ప! నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్ లో వాళ్లు డీజిల్ కొంటే లీటర్ రూ.155 అవుతుందని, రీటెయిల్ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్ బంకుల్లో పోయమని నువ్వు లేఖ ఎలా రాశావు? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్ సిక్స్ అయినా అంతే, సూపర్ సెవెన్ అయినా అంతే. ఇదే పరిస్థితే. (పీపీటీలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చూపించారు)ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లుచంద్రబాబు ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్ అనే విధానం కూడా తీసుకువచ్చాం. ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్ను దేశం అంతా కాపీ కొడుతోంది. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఈ జూన్ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్. అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్ను కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే రికమండేషన్స్ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి. అందుకే పీఆర్సీ వేయడం లేదు. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ 5 పెండింగ్. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్ లీవ్ను స్ప్లిట్ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు. మరోవైపు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్. 15 నెలలు టీఏలు పెండింగ్. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు... ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.అప్పుడు సంపద సృష్టిస్తానని.. ఇప్పుడు పిల్లలే సంపద అంటావా?» సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు. వీటి కథ దేవుడెరుగు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలు ఏమైనాయి స్వామీ? ముందు వీటి గురించి ఆలోచించు. ఆ తర్వాత మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుందని ప్రజలు మొత్తుకుంటున్నారు.» ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదైతే చెబుతాడో.. దాన్ని ఆయన పాటించాలి కదా.. కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా.. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా! వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. వాళ్లు ఇంగ్లిష్ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.» ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతుంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. » మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైనపరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేవు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దైన్యంఅసలు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్ ఒక పిరియడ్గా పెడితే, దాన్ని తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి. నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే.. ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలకు ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తోంది. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్లు, అంగన్ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి. ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి.. పీహెచ్సీల దగ్గర నుంచి.. హాస్పిటల్స్ను రిఫార్మ్ ద్వారా సంస్కరించి.. జీరో వేకెన్సీ పాలసీ తీసుకువచ్చి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్లలో ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2,500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు కానీ, మెడికల్ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు. పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనేపథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి.ఆరోగ్యశ్రీ నిర్వీర్యంఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 కోట్లు బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. చంద్రబాబు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. లోన్ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా, మాకు లోన్ ఇప్పించడమేంటి స్వామీ.. పైగా దానికి 8 శాతం వడ్డీ కట్ట్టడమేంటీ.. అని నెట్వర్క్ ఆస్పత్రులు లబోదిబోమంటూ బోర్డు తిప్పేస్తున్నాయి. -
ప్రశ్నించే వారికి సంకెళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంటెంట్ కన్పించకుండా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్ఆర్ఐ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్ (ట్విటర్)కు, ఫేస్బుక్, యూ ట్యూబ్ హెడ్క్వార్టర్కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్ యాజమాన్యానికి కుప్పం ఇన్స్పెక్టర్ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.పోలీసులు ఎక్కడ?రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్ బాటిల్స్లో ఒక బాటిల్æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్ రెస్పాన్స్బిలిటీస్) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. -
ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?
రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీపై, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగి పోయేంతగా బీపీ పెరుగుతోంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం మామూలైపోయింది. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. తప్పుడు కేసులు.. దొంగ సాక్ష్యాలు కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మా పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానందరెడ్డి, మా మామ రవీంద్రనాథ్రెడ్డిపై బురద జల్లుతున్నారు. జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని దస్తగిరి భార్య మీడియా ఎదుట చెప్పింది. తామెవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పని చేస్తున్న నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పింది. ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉన్నారు.చనిపోతే బాధ పడాల్సింది మా వాళ్లే. అయినా సరే చంద్రబాబు తన రాజకీయాల కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు కుట్రలతో దిగజారుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 అందరూ కలిసి ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెబుతారు. పెద్దపెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లో ఉన్నాయి. గతంలో వేరే రకంగా ఇచ్చి న స్టేట్మెంట్లను తీసుకుని, ఇప్పుడు చంద్రబాబు బృందం చెప్పిన కల్పిత కథల చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దొంగ సాక్ష్యాలను సృష్టిస్తారు. కొంత మందిని కేసులో ఇరికిస్తారు. అరెస్ట్ చేస్తారు. ఓ వైపు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంటే, మా వాళ్ల మీదే కేసులు బనాయించి, ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికించి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఇవే. తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తారు. ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అయినా సరే, కళాశాలలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్ట్లుగా ఉన్న పిల్లలైనా సరే, వైఎస్సార్సీపీకి మద్దతుదారులైనా సరే, వైఎస్సార్సీపీ నాయకులైనా సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఇదే స్క్రిప్ట్. చంద్రబాబు లాయర్.. దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూథ్రాయే మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? వైఎస్సార్సీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం జమ్మలమడుగులో ప్రచారం చేసి వచ్చిన రోజే హత్యకు గురయ్యారు. పైగా తానే వివేకానంద రెడ్డిని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనే విచ్చలవిడిగా మాట్లాడిన దస్తగిరి అనే ఈ వ్యక్తి, మా చిన్నాన్నను చంపిన వ్యక్తి. ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా. ఎవరిదయ్యా చంద్రబాబూ క్రిమినల్ బ్రెయిన్? రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఇదే కదా.. ఈ కేసులో జరుగుతోంది. చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతున్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం పోయి చంద్రబాబు ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడ లేదా? ఎవరివయ్యా శవ రాజకీయాలు అని అడుగుతున్నా. సొంత కూతురిని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత మామను, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొని, ఆయన చనిపోయేలా చేసింది ఎవరయ్యా? చంద్రబాబు కాదా? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతున్నా. వంగవీటి హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే వంగవీటి మోహనరంగారావు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో «నిరాహార దీక్ష చేస్తుంటే.. అర్ధరాత్రి అత్యంత పాశవికంగా నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాదా? ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య అప్పట్లో మంత్రి, చంద్రబాబుకు సహచరుడు. ఆయన రాసిన పుస్తకంలో ఈ ఘటన ఎలా జరిగింది.. చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో రాశారు. మోహన రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే. హత్యా రాజకీయాలు ఎవరివో.. కుట్ర రాజకీయాలు ఎవరివో.. శవ రాజకీయాలు ఎవరివో ప్రజలకు తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్పై దాడి కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన లాడ్జిలో శవంగా మారాడు. అతని జేబులో దొరికిన లెటర్లో తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి రూ.30 వేలు ఇచ్చారని రాసి ఉంది. ఎన్టీఆర్పై దాడి కోసమే ఈ డబ్బులు ఇచ్చారా? అదే నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. మరొక ఉదాహరణ..పింగళి దశరథరామ్. ఈయన ఒక ప్రముఖ జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఎవరివి హత్యా రాజకీయాలు.. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు.. ఎవరివయ్యా శవ రాజకీయాలు? అబద్ధాలు.. దొంగ కేసులు.. తప్పుడు సాక్ష్యాలుఎప్పుడు ఏ ఘటన జరిగినా, వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు డైవర్షన్ చేసేందుకు కొత్త టాపిక్ను, కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకొస్తారు. దానికి రెక్కలు కడతారు. ఇష్టమొచ్చి నట్టుగా మాట్లాడతారు. ఇంకొక విస్తుగొలిపే విషయం.. రెండ్రోజుల క్రితం ఈనాడులో చూశాను. నకిలీ మద్యం కేసులో 89 మంది సాక్షులట.. జోగి రమేష్ పేరు చెప్పారట! ఈ కల్తీ మద్యం ఘటన జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్లకు, పోలీసుల మధ్య లావాదేవీల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకొచ్చింది. చంద్రబాబు హయాంలో కొనసాగుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు.. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్ల తర్వాత బయట పడిన విషయాలివి. తంబళ్లపల్లిలో చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన సన్నిహితుల పీఏల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తే.. పోలీసులు రైడ్ చేస్తే అడ్డంగా దొరికి పోయారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. చేసింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అభ్యరి్థ. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పైనే బనాయించారు. నిజంగా మనుషుల్లో మానవత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఒక అబద్ధానికి రెక్కలు గట్టి ఇష్టమొచ్చి నట్టుగా ఇరికించేస్తున్నారు. జోగి రమేష్ను బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఓ తప్పుడు కేసులో 83 రోజులు జైలులో పెట్టారు. బెయిల్పై బయటకొస్తే ఇంటిపై యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించారు. ఆ దాడి చేసిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ రోజు చార్జిషీట్ ఫైల్ చేసారట.. 89 మంది సాక్షులట. జోగిరమేష్ పేరు చెప్పారట. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. అమ్మేది చంద్రబాబు మాఫియా ముఠా బెల్టు షాపులు. ఇవన్నీ పోలీసులకు తెలుసు. బెల్టుషాపులు నడుపుతున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, ప్రతీ ఐదు బాటి ల్స్కు ఒక బాటిల్ కల్తీ అని అందరికీ తెలుసు. అయినా అటువైపు పోలీసులు, అధికారులు కన్నెత్తి చూడరు. అంబటి మురళీపైనే తప్పుడు కేసులు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన ఘటన. భావి సమాజం ఖండించాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చూస్తే రూ.2,400. కానీ రూ.1,400, రూ.1,600కు మించి ధర రావడం లేదు. అందుకే ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. ఆ గోదాము ఉన్నది మా పార్టీకి చెందిన అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనది అదే ఊరు. ఆయన కూడా కాపు నాయకుడే. కానీ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబు పోలీసులను పంపుతారు. గోడౌన్పై రైడ్ చేయిస్తారు. ఆ గోడౌన్కు వైఎస్సార్సీపీ జెండాలు కట్టిస్తారు. అభాండాలు వేసి, అబద్ధాలు చెప్పించి మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ను సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. రేటు లేక దాచుకుంటే సీజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెస్పీ ఇచ్చి కొంటామంటే ఎందుకు దాచుకుంటారు? ఏం తప్పు చేశారని గోడౌన్ సీజ్ చేశారు? ఆ రైతులకు ఈ రోజు పంట లేదు. చేతిలో డబ్బుల్లేవు. వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులు ఆ గోడౌన్ను చూడడానికి వెళ్తే అడ్డగిస్తున్నారు. జంగిల్ రాజ్ కాకపోతే ఏమిటిది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాంచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో మేము ముగ్గురిని కోల్పోయాం. మా తాత, మా నాన్న, మా చిన్నాన్న బలైపోయారు. మేము బాధితులం. కానీ మా పైనే చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపారు. కేవలం మా నాన్న రాజశేఖరరెడ్డిని పులివెందులలో కట్టడి చేయాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యాలయంలో దాచిపెట్టి జైలుకు పంపకుండా రక్షించింది వీళ్లు కాదా? అధికార దుర్వినియోగం చేసింది వీళ్లు కాదా? ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా. మా నాన్న విషయంలోనూ అంతే. నాన్న చనిపోక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ మాటలన్న 2–3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.వీటినేమంటారు?» కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మృతుడు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతున్నా, మా వాళ్ల మీదే కేసులు బనాయించారు. » మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన 1999 ఎన్న్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా? » మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?» మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?» మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా.» చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?» ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపలేదా? » ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? » సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరు? » వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.» మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? » జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ఈ ఘటనలోనూ వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. » నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడింది మీ పార్టీ లీడర్. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పై ఎలా పెట్టారు?» రెండేళ్లుగా కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు.. ఊరూరా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులుబాబు నైజాన్ని దగ్గుబాటి, హరిరామజోగయ్య ఏనాడో చెప్పారుఇదే పెద్దమనిషి చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని అనేక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బస్సులు తగలపెట్టకపోతే ధర్నాలు కావట! నేను కాదు అన్నది ఈ మాటలు.. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి చెప్పిన మాటలు. తాను రాసిన పుస్తకంలో చంద్రబాబు కుట్రలు, రాక్షస రాజకీయాల గురించి వివరించారు. హరిరామజోగయ్య కూడా చంద్రబాబు ఏ రకంగా కుట్రలు చేస్తాడు.. ఎలాంటి రాక్షస రాజకీయాలు చేస్తాడో సవివరంగా తన పుస్తకంలో రాశాడు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేము. గర్వంగా చెబుతున్నాను నేను ఈ మాటలు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్లు బతికి ఉండేవాళ్లా? మా తాతని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది.. అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే మాకు రాజకీయాలు ఎలా చేయాలో మా నాన్న నేర్పించారు. చంద్రబాబు మాదిరి హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది చంద్రబాబుకు, మాకు మ«ధ్య ఉన్న వ్యత్యాసం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో.. ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుకు 77 ఏళ్ల వయస్సు. బహుశా ఇవి చివరి ఎన్నికలనుకుంటున్నా. ఎన్నికలొచ్చేసరికి మీకు (చంద్రబాబు) 80 ఏళ్లు. ఈ వయసులో కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. ఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో గమనించండి. వినుకొండలో 2024 జూలై 24న వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపించే కార్యక్రమాన్ని ఎలా ప్రోత్సహించారో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. (రెండేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేసిన ఉదంతాలను ఆధారాలతో సహా వివరించారు) చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రకంగా హత్యలు చేయిస్తున్నాడో? కుట్రలు చేస్తున్నాడో? శవ రాజకీయాలు చేస్తున్నాడో? అందరికీ తెలుసు. ఎవరిది గొడ్డలి పార్టీయో? గొడ్డలి పట్టుకొని ఎంత దారుణంగా హత్యలు చేయిస్తా ఉన్నాడో చెప్పేందుకు ఇవి నిదర్శనాలు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ సాగుతోంది. హత్యా రాజకీయాల మధ్య దారుణమైన పాలన సాగుతోంది. చంద్రబాబు హత్యా రాజకీయాలకు సాక్ష్యాలు ఇవిగో... -
మీరు వైఎస్సార్సీపీ వాళ్లు.. ఉపాధి పని ఇవ్వం!
పిఠాపురం: రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఉపాధి పనుల కల్పనలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ పలువురికి పని కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జనసేన నేతలు అడ్డుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మీరు వైఎస్సార్సీపీకి చెందినవారు. కాబట్టి మీకు ఉపాధి పనులు కల్పించేది లేదు’ అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి వీరబాబు గురువారం ఐదుగురు మేట్లకు (గ్రూప్ లీడర్లు) పని కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నాడు. తనకు జనసేన నేతల నుంచి ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాకంపై ఐదుగురు మేట్ల కింద పనిచేసే దాదాపు 250 మంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకంలో రాజకీయాలు ఏంటంటూ వందలాది మంది కార్మికులు పనిప్రదేశం వద్దే తీవ్ర ఆందోళన చేపట్టారు. దుర్గాడ గ్రామంలో గత 15 సంవత్సరాల కాలంలో ఉపాధి పథకంలో ఎన్నడూ ఇటువంటి దారుణమైన రాజకీయం చూడలేదని, ఉపాధి హామీలో రాజకీయం చేసిన వ్యక్తులు ఎవరో బయటపెట్టాలని కూలీలు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఉదయం ఐదున్నర గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న ఉపాధి కూలీలు 11 గంటల వరకు ఎండలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు అధికారులతో మాట్లాడారు. దీంతో గొల్లప్రోలు ఎంపీడీవో సెలెట్ రాజు కార్మికులు ఆందోళన చేస్తున్న చోటుకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఎంపీడీవో.. ఎట్టకేలకు లాగిన్ నిలిపివేసిన మేట్లకు లాగిన్ పునరుద్ధరించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ వీరబాబు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 15 రోజులు పనికి వస్తే కేవలం వారం రోజులకే నమోదు చేస్తున్నాడు. తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి మాత్రం పనికి రాకపోయినా హాజరు నమోదు చేస్తున్నాడు. రాజకీయ దురుద్దేశంతోనే తమ ఉపాధి మేట్ల లాగిన్లు నిలిపివేశాడు. జనసేన నాయకులతో చేతులు కలిపి ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్నాడు. – ఉపాధి కూలీల ఆవేదన ఉపాధి కూలీలతో రాజకీయం చేస్తే ఊరుకోం పొట్టకూటి కోసం మండుటెండలో కష్టపడుతున్న నిరుపేదలపై రాజకీయం చేయడం పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే చూస్తున్నాం. పేదల పొట్ట కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడంతోపాటు దుర్గాడలో రాజకీయం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇటువంటి ఘటన జరిగితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. – వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ -
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be sameప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be sameవిద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be sameఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be sameబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. -
బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. -
సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు.సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా లాంటి హెడ్ క్వార్టర్స్కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు. -
బాబు అమరావతి స్కాం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే...!
-
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్స్టార్ హోటల్స్కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు
-
ఈ మధ్యన బీపీ ఎక్కువైంది.. గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తుంది బాబుపై జగన్ సెటైర్లు
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబుకి బీపీ పెరుగుతోందిఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజల బాగోగులను గాలికి వదిలేశారుఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారురాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారురెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలిఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందిచంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుతప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందిమావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టంఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారుచంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందిఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారుస్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారుఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారుఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారుస్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారుప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందిరాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాంరాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాంఅమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలిమావిగన్లో అన్నీ ఉన్నాయిప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారుఅది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారుతాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారుఅమరావతిలో విచ్చలవిడి దోపిడీనేరూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారుమళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారుకొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారుభవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారుఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందివాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాటఫైవ్స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందితెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారుమన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారుఅమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయికిలోమీటర్ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పిందిఅమరావతిలో కిలో మీటర్ ఖర్చు రూ.53 కోట్లు అవుతోందిఅమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందిచంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారుసామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారుఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనేవీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోందిచంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారుజాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పిందిటాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారువైఎస్సార్సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారుకల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారుచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులంమా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారుమా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారుమా నాన్న రాజశేఖర్రెడ్డి విషయంలోనూ అదే జరిగిందిఅసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారుతర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారుఅవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండిమా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉందిమా చిన్నాన్న వివేకాను అవినాష్ చంపించాడంటూ ప్రచారం చేశారుఅవినాష్ కోసం వివేకా కృషి చేశారుఅలాంటి వివేకాను అవినాష్ చంపించారని బురద చల్లారుచంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడుఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్.. చంద్రబాబు లాయర్ అయిన లూథ్రానేక్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలినందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చేయలేదా?ఎవరిది గన్ కల్చరో చెప్పాలిఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మన్ను బండరాయితో కొట్టి చంపారుహరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారుఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలిరాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారుపేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారుఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేఎన్డీఆర్పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడుతనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికిందిమల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదుచంద్రబాబుది రాక్షస రాజకీయంవిజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్రామ్ దారుణ హత్యకు గురయ్యారుఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయిబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారుచంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారుమాది విలువలతో కూడిన రాజకీయంచంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాంమా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?జగన్ నైజానికి ఇదే నిదర్శనంచంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదుచంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలుఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?స్కామ్ వాళ్లది.. కేసు మా నేతపైనజంగిల్రాజ్లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయిఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ వాళ్లను దారుణంగా చంపారువినుకొండలో రషీధ్ను నడిరోడ్డుపై నరికి చంపారుచంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారుబాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారుఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగిందికానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారుటీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారుచేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్ పై పెట్టారుతప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారుబెయిల్పై బయటకు వస్తే యాసిడ్ బాటిల్స్ దాడి చేశారుదాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారుకల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారుమామిళ్లపల్లిలో తప్పు వాళ్లదేమామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారుకాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్లో పంట నిలవ చేసుకున్నారుమామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసుఅయినా గోడౌన్ అంబటి మురళిదని ప్రచారం చేశారుగోడౌన్లోనూ వైఎస్సార్సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారుఅక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారుగోడౌన్ను కూడా సీజ్ చేశారుగిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్లో ఎందుకు పెట్టుకుంటారు?పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారుమహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారుఏపీలో సోషల్ మీడియా సెన్సార్ఏపీలో సోషల్ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారుప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదుప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ను కనపడకుండా చేస్తున్నారుసోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారుకార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారుఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు పంపిస్తున్నారుచంద్రబాబు పెట్రో మాయఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అన్నారుపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు, అలాగే డీజిల్పై 22.5 శాతం వ్యాట్తో అదనంగా 4 రూపాయిలు పెంచారుకోవిడ్లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్ సెస్ కింద మేం పెంచింది రూపాయి మాత్రమేకానీ, వైఎస్సార్సీపీ హయాంలో పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారుఅప్పట్లో బాబు, లోకేష్, పవన్లు పొలిటికల్ డ్రామా చేశారుఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు ప్రకటించారుటీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉందిరెండేళ్లైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదుగత నెలలో బంకుల వద్ద బారులు తీరారుఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారుఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్ల్లో ఇప్పించాలని కోరారుచంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపిందిరిటైల్ బంకుల్లో ఎలా డీజిల్ అడుగుతారని చెప్పిందిఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారుహామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారుఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలిపెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గించాల్సిందే మినిమమ్ డ్యూటీ మరిచిన పోలీసులుపొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారువాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారుఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారుఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోందిరాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదువ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారుపోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారుమా హయాంలో దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహంచంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసంఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారుసూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా తేలాయిమా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారుపొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉందిపంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్ఫుట్ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్ లేదుమొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారుకేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలిఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారునిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారుఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారుఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు12 డిపోలను ప్రైవేట్పరం చేశారుఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తెస్తారంటఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారుభవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదుమా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాంబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారుఅమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారుహామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారుగ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారుఉద్యోగులను దారుణంగా మోసం చేశారుమా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదుసంతానమే సంపదట.. మరి లోకేష్ సంగతేంటి?ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారురూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారుసూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారుచంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్కు ఒక్కడే కొడుకుబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదాప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలటవాళ్లు మంచి చదువుకోకూడదటఇదేం దిక్కుమాలిన ఆలోచన?విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదుపిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించాఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితిసరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారువ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గంకుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలియస్ లోకేస్.. బోత్ ఆర్ నాట్ సేమ్బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ సినిమా డైలాగులు కొడుతున్నాడుఅవును.. బోత్ ఆర్ నాట్ సేమ్వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీదిప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాదిప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్పనులు చేసి చూపించడం మా స్టైల్.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాదిరెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీదివిద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాంఅందుకే బోత్ ఆర్ నాట్ సేమ్వైఎస్సార్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..ప్రజాస్వామ్యంలో ఏది ఇస్తావో అల్టిమేట్గా అదే తిరిగి వస్తుందిప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నాచంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దురేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుందితప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాంసప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందన -
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్ మెన్ తొలగింపు
-
కలెక్టర్ కి చెప్పండి.. టీడీపీ మట్టి దందాను బట్టబయలు చేసిన YSRCP
-
అధికారంలోకి రాగానే.. రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం, విగ్రహం ఏర్పాటుపై వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాష్ట్ర రాజధానిలో ప్రకాశం స్మృతివనం, శాసనసభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తప్పక పరిశీలించి.. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్కు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ.క్రిష్ణమాచారి, సీహెచ్.శ్రీనివాసరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అలాగే ప్రకాశం పంతులుకు నివాళులర్పిస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం (గురువారం) 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ జరగనుంది. ఈ ప్రెస్మీట్లో వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై స్పందించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
YSR శిష్యులం భయపెడితే భయపడతామా?
-
కష్టపడి స్పూన్ తో చేపలు తింటున్న బాబు.. చంద్రబాబు పులిహోర
-
గో డౌన్ నీ సొమ్మా...! ధూళిపాళ్ల నరేంద్రపై అంబటి మురళి
-
బాబు.. ఇదేంపాలన మహిళలంటే అంత చులకనా?
-
జగన్ జోలికి వస్తే.. ఖబడ్డార్.. కూటమికి జూపూడి డెడ్ లైన్
-
నన్ను భయపెట్టే మగడు ఇంకా పుట్టలేదు..! అరెస్ట్ పై స్టాంగ్ రియాక్షన్
-
‘బాబూ.. మత్స్యకారులకే చేపల కూర నేర్పిస్తున్నావా?’
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేతలు కురుసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనే దిక్కులేదు అని ఘాటు విమర్శలు చేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా, దవులూరి దొరబాబు, గిరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన వదిలేసి చంద్రబాబు అమరావతి కాంట్రాక్టర్లే ధ్యేయంగా ఈవెంట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అని మహిళలను అవమానపరుస్తున్నారు. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా మాట్లాడుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చేపల పులుసు ఎలా వండాలో మత్స్యకారులకే చంద్రబాబు నేర్పించిన ఈవెంట్ చూశాం’ అని ఎద్దేవా చేశారు.కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘మత్స్యకారులకు సేవా? మత్యకారులకు శాపమా?. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హర్బర్ కథ ఏం చేశారో మొన్ననే చూశాం. చంద్రబాబు మళ్ళీ అక్కడికే వెళ్ళి చేపల పులుసు వండుతారు. తెలుగు వెన్నుపోటు పార్టీ.. మత్య్సకారుల నుండి రైతుల వరకు వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఒక్క పక్క.. కొడుకు ఒక పక్కన పొదుపు మీరు చేయండి. దుబారా మేము చేస్తామని డ్రామాలు చేస్తున్నారు. ఒకాయన సైకిల్ తొక్కుతాడు.. ఐదారు కెమెరాలు వాహనాలపై నడుస్తాయి. చంద్రబాబు డ్రామాలు ఏంటో అందరికీ తెలుసు’ అని మండిపడ్డారు -
జూపూడి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
-
సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీతారామశాస్త్రికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. నేడు సిరివెన్నెల… pic.twitter.com/w8E8r9jm4U— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
సరిహద్దుల్లో ఉన్న వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు
-
అరెస్ట్ పై జూపూడి రియాక్షన్
-
ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని వైఎస్ జగన్ కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు. ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన… pic.twitter.com/4esnkiGBRP— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
అక్రమ కేసులు పెట్టడమే ఆయన డ్యూటీ
సాక్షి, ప్రకాశం: దర్శి ఎస్సై మురళి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రైవేటు సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులను నిత్యం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారికి సకల మర్యాదలు చేస్తూ వారు చెప్పిందే వేదంలా పని చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుపై సోమవారం దర్శిపట్టణంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనకు ఆటోలు ఇచ్చారంటూ రెండు ఆటోల అద్దాలను పగులగొట్టడం వివాదాస్పదంగా మారింది. ఆది నుంచీ వివాదాస్పదమే.. టీడీపీ నేతలతో క్రికెట్ బెట్టింగ్లను వేయించి వాటిని ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న వారిని పిలిపించి కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్రాజు దర్శికి ప్రత్యేక టీంను పంపి క్రికెట్ బెట్టింగ్లు వేసే టీంను పట్టుకున్నారు. అయితే అందులో ప్రధాన నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ ఎస్సై, సీఐలు వారిని దేశం దాటించారన్న అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వ్యక్తమయ్యాయి. దీంతో ఎస్సైని కొన్ని రోజులు విధుల నుంచి పక్కన పెట్టి ఇక్కడ ఇన్చార్జ్ ఎస్సైని కూడా నియమించారు. పారిపోయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను ఇప్పటికీ పట్టుకున్న పాపానపోలేదు. బొద్దుకూరపాడు, ఎర్రోబనపల్లి, చలివేంద్ర కొండ శివారుల్లో పెద్ద మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహించి సీఐతో కలిసి భారీ మొత్తంలో నెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నుంచి వెళ్లే అక్రమ ఇసుక, అక్రమ రేషన్ బియ్యం తరలింపును ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు చెల్లించి తెచ్చుకునే వారి ఇసుక లారీని గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులు ధ్వంసం చేయగా సంబంధిత యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు కట్టారు. ఆ తరువాత ఆ ఎఫ్ఐఆర్ ను మాయం చేసి యజమానిని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ స్థానంలో మరో కేసు కట్టినట్లు సమాచారం. ఇది ఒక ఎత్తైయితే వైఎస్సార్ సీపీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పుడు దురుసుగా ప్రవర్తించడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం తరుచూ జరుగుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఫ్లెక్సీలు కట్టుకున్నా వివాదాలు సృష్టించి వారిపై కేసులు పెడతామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారని తెలిసింది. గతంలో గణేష్ నిమజ్జనాన్ని కూడా రాజకీయం చేసి చలివేంద్రలో గ్రామస్తుల ఇళ్లపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా వారిని లాఠీతో చావబాదారు. అర్ధరాత్రి వరకు మహిళలను పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆ తరువాత ఇంటికి పంపారు. అయినా ఈ ఎస్సై పై అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ఫ్లెక్సీలు కట్టేవాళ్లను బెదిరించడం, ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీలు కడితే టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి చావబాదడం చేస్తున్న ఎస్సై తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల బొట్లపాలెం గ్రామంలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలను కొట్టగా వైఎస్సార్ సీపీ నేత పైనే కేసులు పెట్టి గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించి భయబ్రాంతులకు గురి చేశారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో డీజే సౌడ్తో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలు చేశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. గొట్టిపాటికి దాసోహం: టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీకి దాసోహం చేయడానికే పోలీస్ ఉద్యోగంలో చేరారన్నట్లు వ్యవహరిస్తున్న ఈ ఎస్సై తీరు వివాదాస్పదంగా మారింది. మండలంలో ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు కాన్వాయ్ పెట్టుకుని ఈ ఎస్సై ప్రత్యక్షమవుతారు. ఆమె బర్త్డే పారీ్టలకు, ఆమె చేస్తున్న ప్రైవేటు కార్యక్రమాలకు స్టేషన్లో డ్యూటీ కూడా మానుకుని ఆమె వెంటే పోలీస్ జీపుతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా కాన్వాయ్గా తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని టీడీపీ ఇన్చార్జ్ అయిన ఆమె కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దర్శికి వస్తున్నారంటే పోలీస్ కాన్వాయ్ పెట్టి ఆమె వెంట ఉండి తీసుకొస్తారు. టీడీపీ కార్యక్రమాలను దగ్గరుండి ఆమెకు సెక్యూరిటీ ఇస్తుంటారు. ప్రభుత్వ వాహనాలతో ప్రైవేటు వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో మరీ దుర్మార్గంగా వ్యవహరించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి ఈ ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. న్యాయం చేయాలని కోరిన మొక్కజొన్న రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాడులు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ అంటోంది. అదే సమయంలో.. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇస్తోంది. చలో మామిళ్లపల్లిని నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలు రైతుల్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ కుట్రలు చేస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఇవాళ జూపూడి ప్రభాకర్లను రైతుల్ని కలవనీయకుండా అడ్డుకుంది. -
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేశారని మంత్రి టీజీ భరత్.. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మంత్రి భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘జువ్వలదిన్నె ప్రైవేటీకరణ ఆపేస్తామని స్పష్టంగా చెప్పాలి’
శ్రీకాకుళం: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ ఆపేస్తామని సీఎం చంద్రబాబు సూటిగా చెప్పకుండా ఫేక్ ప్రచారం నమ్మవద్దని చెప్పి ఇప్పటికీ మత్స్యకారులను అయోమయంలోకి నెట్టేశాడని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైఎస్ జగన్కు వచ్చిన ప్రజా స్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందన్నారు.నెల్లూరులో టీడీపీ పనైపోయిందని డిసైడ్ అయ్యాడు కాబట్టే శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన మహానాడును నెల్లూరుకి మార్చేశాడని అన్నారు. అయినా విధి విచిత్రం కారణంగా చివరికి అది కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు మత్స్యకారులకు కొత్తగా చేస్తున్నది ఏమీ లేకపోగా, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల రూపంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను ప్రైవేటీకరణ పేరుతో తన బినామీలకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రెండేళ్లలో చేసిందేమీ లేక, ఏమీ చెప్పుకోలేక జగన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, చంద్రబాబు పాలన రాష్ట్రానికి గొడ్డలిపెట్టులా మారిందని, రెండేళ్లలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...2024-25 మత్స్యకార సేవలో బకాయిలు ఎప్పుడిస్తారు?వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా పేరుతో ప్రతి ఏటా దాదాపు 1.20లక్షల కుటుంబాలకు ఏటా రూ.10 వేలు చొప్పునఆర్థిక సాయం జరిగింది. ఎన్యుమరేషన్ దగ్గర నుంచి సాయం లబ్ధిదారుల అకౌంట్లో జమయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ప్రతి మత్స్యకార కుటుంబానికి ఠంఛన్గా వేట నిషేధ సమయంలో జమ చేసేవాళ్లం. ఎక్కడా పైసా కూడా అవినీతికి తావులేకుండా డీబీటీ పద్ధతిలో నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మత్స్యకార సేవలో పేరుతో ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి 2024-25 సంవత్సరానికి పూర్తిగా ఎగనామం పెట్టాడు. డీజిల్ సబ్సిడీ పేరుతో కూడా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. లీటర్కి రూ.6 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. 2014-19 మధ్య బ్యాక్ ఎండ్ సబ్సిడీ పేరుతో మత్స్యకారులు వినియోగించుకున్న తర్వాత ఆ అమౌంట్ని జమ చేస్తామని చెప్పారు. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆ పెండింగ్ బిల్లులను చెల్లించడమే కాకుండా మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి సంబంధించి కార్డులు ఇవ్వడం జరిగింది. డీజిల్ కొన్నప్పుడే నేరుగా ఆ సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమయ్యే విధానానికి శ్రీకారం చుట్టాం. మోటార్ బోట్లకు నెలకు 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్లకు 3 వేల లీటర్ల చొప్పున లీటర్కి రూ.9లు సబ్సిడీ విధానం తీసుకొచ్చాం. 2014-19 వరకు ఉన్న రూ.6 ల సబ్సిడీని రూ.9లకు పెంచి అందజేశాం. పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను చూసి ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటోంది.చేసిందేమీ లేక తిట్టడమే పనిగా పెట్టుకున్నారు..రెండేళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీలేక వైఎస్ జగన్ గారిని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమయం, సందర్భం, వేదికతో సంబంధం లేకుండా నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. నోరెత్తితో గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నాడు. నిజానికి రాష్ట్రానికి చంద్రబాబే గొడ్డలి వేటు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు తన రెండేళ్ల పాలనతో తీవ్రంగా వంచించాడు. ఏ వర్గమూ కూటమి పాలనలో సంతోషంగా లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వ్యాపారులు, వృద్ధులు.. ఏ వర్గం చూసినా చంద్రబాబు గొడ్డలి వేటుకి రోదిస్తూనే ఉన్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ వంటి సహజ వనరులు దోపిడీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్నట్టుగా గతంలో ఎక్కడా జరగలేదు. ఇవన్నీ మాట్లాడితే చంద్రబాబుకి వణుకు. తన రాజకీయ జీవితంలో కనీసం ఒక్క పోర్టు, ఒక్క ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టని చంద్రబాబుకి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటుపరం చేసే హక్కు ఎవరిచ్చారు? వైఎస్ జగన్ గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణానికి శ్రీకారం చుడితే, ఆ పనులను ఎక్కడికక్కడే ఆపేసిన విషనరీ చంద్రబాబు. మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ గారు సంపద సృష్టిస్తే, చంద్రబాబు ఆ సంపదను తన బినామీలకు రాసివ్వడానికి పూనుకున్నాడు. వైఎస్ జగన్ గారు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సందర్శించి హెచ్చరించబట్టే ప్రైవేటీకరణపై చంద్రబాబు వెనకడుగు వేశాడు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడమే ఈ ప్రభుత్వ విధానం. రాబోయే తరాలకు చంద్రబాబు ఏమీ మిగల్చడం లేదు. ప్రజల్లో వీటిపై చర్చ జరగకుండా చూడాలనేది చంద్రబాబు లక్ష్యం. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే వైఎస్ జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మత్స్యకారులకు సంపద సృష్టించడం విధ్వంసమా? వాటిని ప్రైవేటుకి దారాదత్తం చేయడం విధ్వంసమా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబే రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి విధ్వంసం వైపు విజయవంతంగా తీసుకెళ్తున్నాడు.జువ్వలదిన్నెలో జగన్ పిలుపుతో చంద్రబాబులో వణుకుజువ్వలదిన్నెలో వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు చంద్రబాబుకి వణుకు పుట్టిస్తోంది. అందుకే శ్రీకాకుళంలో పెట్టాల్సిన మహానాడుని నెల్లూరుకి మార్చేశాడు. వైఎస్ జగన్ వచ్చినప్పుడు మత్స్యకారుల్లో ఉన్న ఉత్సాహం నేడు చంద్రబాబు వచ్చినప్పుడు వారిలో కనిపించడం లేదు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తోపాటు రాష్ట్రంలోని ఇతర పోర్టులు, హార్బర్ల విషయంలో చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారనుకుంటే నేరుగా చెప్పకుండా, ఫేక్ ప్రచారాలు నమ్మవద్దని పిలుపునివ్వడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి. బీచ్ రోడ్డులో సోలార్ ల్యాంప్ లు ప్రారంభించి సాగర మాల ప్రాజెక్టును ప్రారంభించానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అబద్ధాలు చెబుతున్నాడు. స్టీల్ బెంచీలు, సోలార్ ల్యాంప్లు వేసి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం కేంద్ర మంత్రిగా ఆయనకు తగదు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన పెట్రో కెమికల్ రిఫైనరీ ప్రాజెక్టను సాధించుకురావాలి. సిమెంట్ రోడ్ల శంకుస్ధాపనలు చేయడం కేంద్రమంత్రి చేయాల్సిన పనా? అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. -
ఏపీకి ముగ్గురు సీఎంలు
-
నీ అయ్యా జాగీరా..? ధూళిపాళ్ల కు ఇచ్చిపడేసిన దాసరి రాము
-
పెళ్లి చేసుకోవాలన్నా అనుమతి తీసుకోవాలేమో..: అవినాశ్ రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని సైతం రాజకీయాలోకి లాగుతూ కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు. బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో మంగళవారం అవినాశ్ రెడ్డి మాట్లాడారు.‘‘బోడపాడు గ్రామంలో గత వారం రోజులుగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామంలోని వైసీపీ నాయకులను వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పు కుంటున్నారు. దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని కూటమి నాయకులు గ్రహించాలి.చివరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న వాటిని కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణం. రాబోయే రోజులో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాలేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు. గ్రామంలో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకుంటున్నారు.కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయమా అంటూ ప్రజలు ఛీ కొడుతున్నారు. దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరం. భవిష్యత్తులో ప్రతిదానికి కూటమి నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది’’ అని అవినాశ్ రెడ్డి చెప్పారు. -
మీరేమో ఒకర్ని కనాలి.. పేదలను ముగ్గురిని కనమని చెప్తారా..?
-
నిమ్మల రామానాయుడి సైకిల్ పై వెళ్తే కెమెరామెన్ మాత్రం కార్ లో
-
రౌడీయిజం ఎక్కువైందని వచ్చా.. బైరెడ్డి ఎంత హాట్ అంటే... దిమ్మతిరిగే సమాధానం
-
నీతులు చెప్పే ముందు నువ్వు పాటించు బాబుపై లక్ష్మీ పార్వతి ఫైర్
-
YSRCP గెలుస్తుంది అని చెప్పిన నిమ్మల
-
నటి పూనం కౌర్ ట్వీట్ పై లక్ష్మీ పార్వతి సంచలన రియాక్షన్
-
పిల్లల్ని కనండి ప్యాకేజీ ఇస్తాం.. ముందు లోకేష్ తో మొదలు పెట్టండి!
-
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
-
ఇంకెంత పెరగాలి బాబుగారూ?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ98.63, డీజిల్ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ111.36(హైదరాబాద్), డీజిల్ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్ రూ.104.66, డీజిల్ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్కు సూచిస్తున్నారు.తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్ ₹112.96, డీజిల్ ₹100.32 -
‘పెట్రో’ ధరల మంట.. భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పెట్రో బాదుడుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనల్లో పార్టీ శ్రేణులతో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలతో కలిసి ఆ నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, పార్టీ నేతలు... కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మన వద్దే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా కూటమి నేతలు బెదిరించినా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్ని వర్గాల ప్రజలు పెట్రో బాదుడుపై కదంతొక్కడంతో వైఎస్సార్సీపీ ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇంత భారీగా స్పందన రావడం చంద్రబాబు సర్కార్లో వణుకు పుట్టించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ సీఎం చంద్రబాబు అనేక సార్లు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్రతోపాటు ఎన్నికల ప్రచారంలోనూ తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ వాగ్దానం చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఇది జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. కదంతొక్కిన జనం పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల పెంపుపై ఎన్టీఆర్,కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన హోరెత్తించింది. మండే ఎండలోనూ వేలాదిగా ప్రజానీకం కదంతొక్కుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. బైక్లను ఎండ్ల బండ్లపై ఉంచి తాళ్లతో లాగుతూ, సైకిల్ తొక్కుతూ, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉమ్మడి వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. పులివెందులలో బొలెరో వాహనానికి తాళ్లు కట్టి నిరసన తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికాయి. తణుకులో ఎడ్ల బండ్లు, గుర్రపు స్వారీలతో, ఏలూరులో గ్యాస్ బండలతో నిరసన తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో ఆటోలను తాళ్లతో లాగుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో తోపుడు రిక్షాలపై మోటార్ సైకిళ్లను ఉంచి వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ, రిక్షా తొక్కుతూ, ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గాడిదను మోటర్ బైకులా అలంకరించి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. -
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా..!
-
పెట్రో బాదుడుపై పోరుబాట
-
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
-
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
-
వాడెవడు నా మీద కేసు పెట్టడానికి పేర్ని నాని ఉగ్రరూపం
-
నన్ను లేపేస్తారా..! దమ్మున్నోడు రండ్రా... సిద్ధార్థ్ రెడ్డి గూస్ బంప్స్ కామెంట్స్
-
ఇప్పుడు మీ నాన్నగారు.. చేతకాని, పనికి మాలిన వాడు అని చెప్పండి
-
SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది: సజ్జల
తాడేపల్లి : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎస్ఐఆర్(SIR) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఎల్ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు) లు ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఈ సర్ ప్రక్రియ అత్యంత కీలకం. బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓల మధ్య సమన్వయం ఉండాలి.. బీఎల్ఏలకు వెంటనే శిక్షణ తరగతులు ఇవ్వాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలి. ఓటర్లను కూడా చైతన్యపరచాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్లు, సీనియర్ నేతలు, ఇన్ఛార్జ్లు నిరంతర పర్యవేక్షణ చేయాలి. సమర్థంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఉంటుంది.. -
నీ నాయనను తిట్టినోణ్ణి వదిలేసి.. నన్ను రౌడీ అంటావా..?
-
లోకేష్... ఇప్పుడు దిగు సెల్పీలు విడదల రజిని మాస్ ర్యాగింగ్
-
పక్కకు తప్పుకోండి.. జోగి రమేష్ను అడ్డుకున్న పోలీసులు
-
దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే.. మొద్దు నిద్రలో చంద్రబాబు..
-
పిల్లల్ని కనడానికి వేలం పాటనా..? లోకేష్ కు ఎందుకు చెప్పలేదు
-
నీ కొడుకును నలుగురు బిడ్డల్ని కనమను
-
ఏంటి ఈ చిల్లర వేషాలు.. భరత్ గారు మీ వయసెంత? సిద్దార్థ్ సీరియస్
-
మంత్రికి ఆస్కార్ గ్యారంటీ.. యాక్టింగ్ ఇరగదీస్తున్నాడుగా..
-
జోగి రమేష్ అరెస్ట్
-
తమిళనాడు కంటే APలో ₹10 ఎక్కువ దేశంలోనే అత్యధికం
-
పెట్రోల్ పై YSRCP పోరుబాట.. ఆటోకి తాడు కట్టి వినూత్న నిరసన..
-
లాఠీలు.. తూటాలకు భయపడం.. శవంతో జక్కంపూడి వార్నింగ్
-
మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి జోగి రమేశ్ చేపట్టిన మామిళ్లపల్లి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. అధికారులు సీజ్ చేసిన గోడౌన్ను పరిశీలించేందుకు, రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొక్కజొన్న రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో సర్కార్ కూటమి కుట్రలకు దిగింది. -
పనికిమాలిన సన్నాసులు.. కూటమి ప్రభుత్వం పై జోగి రమేష్ ఫైర్
-
పెట్రో బాదుడుపై YSRCP పోరుబాట
-
పెట్రో ధరల పెంపుపై నిరసన జ్వాలలు
వైఎస్సార్సీపీ నిరసనల అప్డేట్స్.. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి.. అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.విజయవాడ పశ్చిమలో వెలంపల్లి నిరసనవిజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాధరపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మర్చిపోయారని విమర్శించారు.విజయవాడలో దేవినేని అవినాష్ వినూత్న నిరసనఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై బైక్లను ఎక్కించి నిరసన వ్యక్తం చేసిన దేవినేని అవినాష్.. ఎడ్లబండి లాగుతూ “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి” అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లాలో దేవభక్తుని చక్రవర్తి పాదయాత్రకృష్ణాజిల్లాలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇంధనం వాడకం తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వడం చేతకాని ప్రభుత్వ లక్షణమని విమర్శించారు.నెల్లూరులో కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి రిక్షా ర్యాలీనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. “పెట్రోల్ బంక్ దగ్గర సెల్ఫీలు దిగిన లోకేష్.. ఇప్పుడు ప్రజల బాధలు చూడాలి” అంటూ కాకాణి విమర్శించారు.బొబ్బిలి, విజయనగరంలో వినతిపత్రాలువిజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కైకలూరులో దూలం నాగేశ్వరరావు నిరసనఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపుతున్నారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురామ్ ఆధ్వర్యంలో ఆందోళనతాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.పెందుర్తిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ నిరసనవిశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.గుడివాడలో పోలీసుల అడ్డంకులుగుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడుము విరిగిపోయిందని నేతలు మండిపడ్డారు.అనంతపురంలో భారీ ర్యాలీఅనంతపురంలో లలిత కళాపరిషత్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతోందని నేతలు ఆరోపించారు.రైల్వే కోడూరులో దున్నపోతుతో నిరసనపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను ఎనుములకు కట్టేసి లాగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కొత్తపేటలో వినూత్న నిరసనపెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వరకు ఒక రిక్షాపై మోటార్ సైకిల్ను ఎక్కించి, స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్రెడ్డి నిరసనపాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని కాటసాని రాంభూపాల్రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్టేట్ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పెద్దపాడు శ్రీధర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ.. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పాల్గొన్నారు.ఉదయగిరిలో వినూత్న నిరసన పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఎద్దుల బండి నడుపుతూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.సైకిల్ తొక్కుతూ పేర్ని కిట్టు వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిక్షా తొక్కుతూ, ఎడ్ల బండిపై కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ ధర్నా రాష్ట్రంలో పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం సర్పవరం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేతకాదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారా?” అంటూ మండిపడ్డారు.ఒంగోలులో శాంతియుత నిరసన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కసుకుర్తి అదెన్న, కటారి శంకర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.గుడివాడలో ఆర్డీఓకు వినతిపత్రంరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పేయ్యల ఆదాము, పొట్లూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అడబాల అప్పారావు, కలపాల కిరణ్, జోషీ, చుండూరు శేఖర్, పిన్నమనేని రాఘవేందర్రావు, దేశిరెడ్డి రామ్మోహన్రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంట శీను, ఆడప హర్ష, వన్నెం రెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు.పెనుకొండలో నిరసన ర్యాలీపెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాదయాత్రకోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కడపలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.పత్తికొండలో తాడుతో ఆటో లాగిన శ్రీదేవికర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. రైతులు పాత వ్యవసాయ పద్ధతులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లతో ర్యాలీనంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. మోటార్ బైక్లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు.ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో నిరసనలుశ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి ర్యాలీఅన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనతిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.విశాఖలో ఎడ్లబండిపై కేకే రాజువిశాఖలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు.పులివెందులలో బొలెరోకు తాళ్లు కట్టి నిరసనపులివెందులలో వైఎస్సార్సీపీ నాయకులు బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీజమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ర్యాలీరాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: బొత్సచీపురుపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అమలాపురంలో వైఎస్సార్సీపీ నిరసన అమలాపురం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, జున్నూరి రామారావు, కటకంశెట్టి ఆదిత్య, కుడిపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజాకుమారి, రెడ్డి సత్య నాగేంద్రమణి, కుడిపూడి భరత్, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, ఖాదర్, సత్యం కాపు, అంబికా శ్రీను, జానా గణేష్, కేత భానుతేజ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీమార్కాపురం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యర్రగొండపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రాజాంలో వినూత్న నిరసన.. విజయనగరం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారు వాహనాన్ని పడుకోబెట్టి దానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అద్దంకిలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనఅద్దంకి పట్టణంలోని 20వ వార్డులో గల పెట్రోల్ బంకు వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘గుద్దుడే గుద్దుడు’ పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి, పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పలమనేరులో వైఎస్సార్సీపీ భారీ ధర్నాపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు సిల్క్ ఫామ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరులో భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ప్రొద్దుటూరులో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు అధికంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వినూత్నంగా ఆటో నడుపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సింగనమలలో వైఎస్సార్సీపీ భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సింగనమల మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ సూచనలతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రారంభమై తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, కొర్రపాడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మండపేటలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీతూర్పుగోదావరి జిల్లా మండపేటలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.మంగళగిరిలో వైఎస్సార్సీపీ భారీ నిరసనగుంటూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.జి.మాడుగులలో ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు నిరసన అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కుడా సురేష్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిర్మ పండన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తాడిపత్రిలో నిరసనతాడిపత్రి మాజీ శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తాడిపత్రిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు.మండపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా మండపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగు దేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోనే అత్యధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తోందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి పిలుపుతో, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు గారి సూచనల మేరకు పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.పెట్రో ధరల పెంపుపై మడకశిరలో ధర్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మడకశిర స్థానిక నాయకులు ఎస్.ఎల్. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైయస్ఆర్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో..రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉరవకొండలో నియోజకవర్గ సమన్వయకర్త& మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వినుత్నంగా ట్రాక్టర్ లాగి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.రాయదుర్గం:వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు...పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథరెడ్డి, ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాయదుర్గం పాత బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తూ తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు.రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్న ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి, వాసంశెట్టి గంగాధర రావు, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, హసీనా, షేక్ నిజామ్, బూడిద శరత్కుమార్, అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై.. నేడు వైఎస్సార్సీపీ నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచి్చనప్పటికీ.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించి.. తక్షణమే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. బాబు, లోకేశ్ హామీని అమలు చేయాలి.. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోగా మరింతగా పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఈ ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింతగా భారమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలి. వైఎస్సార్సీపీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని పార్టీ నేతలు భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. వైఎస్సార్సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండండి.. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. బూత్ను ఒక యూనిట్గా తీసుకుని మైక్రో లెవల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రతి బూత్లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) నియామకం అత్యంత కీలకం. వీలైనంత త్వరగా వీరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతీ ఓటు విలువైనది. ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి,తాడేపల్లి: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్, పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రజలపై భారీ భారం మోపారు’అని అన్నారు.పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవితం మరింత భారంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టి, అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. -
పవన్ కల్యాణ్పై పేర్ని నాని సెటైర్లు
కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలేనని ఎద్దేవా చేశారు. పవన్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనుకుంటున్నారని చెప్పారు.కృష్ణా జిల్లాలో పేర్నినాని ఆదివారం మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కల్లబొల్లి కబుర్లతో నమ్మించాలని చూస్తున్నాడు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనే భావనలోనే పవన్ మీటింగ్ సాగింది. పవన్ మాటలకు పొంతన లేదు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎన్ని అసత్యాలు మాట్లాడారో మర్చిపోయారా? అప్పట్లో 175 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలే. రాష్ట్రం బాగు కోసం కూటమిలో చేరానంటాడు.జనసేన కార్యకర్తల బాధలను చూస్తూ సహించనంటాడు. బందరులో లంచాలు ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లారు పవన్? కనీసం కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి బుద్దిలేదా అని అడిగారా? ఎంతమంది జనసేన కార్యకర్తలను తంతున్నారో మీకు తెలుసా? జనసేన కార్యకర్తల బాధలు పగోడికి కూడా వద్దు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేసొస్తే 95 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు. ఏపీలో మీరు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చినోళ్లలో గెలిచిన వారు ఎవరు... ఏరోజైనా మీ పార్టీ జెండా మోశారా? చంద్రబాబు జనసేన అని మెడలో వేసిన వాళ్లకే కదా మీరు సీట్లిచ్చింది? సీజ్ ద షిప్ అని నాలుగైదు రోజులు కూడా ఆపలేకపోయారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అని నాలుగు రోజులు కూడా ఆపలేకపోయామని మీరే ఒప్పు కుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే రోడ్డు మ్యాప్ వచ్చిందన్నారు. 2020లోనే ఇప్పటం సభలో ఓట్లు చీలనివ్వనని చెప్పింది మీరే’’ అని చెప్పారు. -
బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్..?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు..వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్ జగన్ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది...తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?..కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ నేత యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామ వైఎస్సార్సీపీ సీనియర్ నేత యలమర్తి రామకృష్ణ గతవారం జరిగన రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఈ నేపథ్యంలో యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
‘ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం’
సాక్షి, నరసాపురం: ఆక్వా సిండికేట్ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ సిండికేట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి కారణం కూడా సిండికేట్ ముఠాను నడిపించేది చంద్రబాబు బంధువుల కావడం వల్లనే అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు.నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన విద్యుత్, డీజిల్ ధరలతో రైతులు అల్లాడిపోతుంటే కొత్తగా ఫీడు ధరలు పెంచి, 100 కౌంట్ రొయ్యల ధరలను ఏకంగా రూ.25 తగ్గిస్తే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్సన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్ రూ.250 పలుకుతుంటే, దానికి రైతుకి రూ.350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.సిండికేట్ ముఠాకి లబ్ధి చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగానే మంత్రి అచ్చెన్నాయుడు అప్సడా సమావేశానికి డుమ్మా కొట్టాడని, మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెంచిన ధరలకే ఫీడు అమ్మకాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఫీడు వ్యాపారులు డీలర్లకు అవసరమైన మేర ఫీడు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళితే రైతుల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అప్సడాతో సంబంధం లేకుండా ఎలా పెంచుతారు?:కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఫిబ్రవరిలోనే ఫీడు ధరలు టన్నుకు రూ.4 వేలు పెంచగా, ఇప్పుడు మళ్లీ మరో రూ.12 వేలు పెంచేశారు. ఫీడ్, సీడ్ రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా వైఎస్సార్సీపీ హయాంలో అప్సడా ద్వారానే జరిగేది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో అప్సడాలో రైతులు, ఎగుమతుదారులు, ప్రభుత్వం, పీడు యాజమాన్యం సభ్యులుగా ఉండి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. కానీ నేడు సిండికేట్ ముఠా అప్సడాతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకొంది. ఫీడు ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది.ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సిండికేట్ ముఠాకి పెత్తనం అప్పగించేసింది. కాబట్టే నిన్న (శుక్రవారం) జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు గైర్జాజరయ్యారు. ఫీడు ధరలను ప్రభుత్వం పెంచిందా, తగ్గించిందా తెలియని పరిస్థితి నెలకొంది. ఫీడ్ వ్యాపారులు మాత్రం పెంచిన ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. సరిపోయినంత ఫీడు డీలర్లకు ఇవ్వకుండా కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో ఫీడు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.100 కౌంట్ ధర రూ.25 తగ్గించేశారు:గత వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్సీపీ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు సహకారం అందించడం జరిగింది. ఫీడు ధరలు మూడుసార్లు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించడం జరిగింది. కానీ నేడు సీఎం చంద్రబాబు నుంచి కూటమి నాయకులు ఎవరూ రైతుల పక్షాన ఉండటం లేదు. ఫీడు వ్యాపారులే ఎగుమతుదారులుగా కూడా వ్యవహరిస్తూ మొన్నటి వరకు రూ.275 వరకు ఉన్న 100 కౌంట్ ధరను ఇప్పుడు ఏకంగా రూ.25 తగ్గించేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో రూ.10 తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఎక్స్పోర్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే చాలు ధరలు తగ్గిపోతాయన్న భయం ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఒకపక్క ఫీడు ధరలు పెంచుతూ ఇంకోపక్క కౌంట్ ధరలు తగ్గిస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఫీడు ధరలు పెరిగితే వైయస్ జగన్ లంచాలు వెళ్లాయని ప్రచారం చేసేవారు. ఇప్పుడు లోకేష్ ఎంత లంచం తీసుకున్నాడో కూటమి నాయకులు చెప్పాలి. ఫీడు యాజమాన్యాలు చంద్రబాబుకి బంధువులు కాబట్టే వారి లబ్ధి కోసం రైతులను గాలికొదిలేశారు.చంద్రబాబు బంధువులదే సిండికేట్ ముఠా:ఆక్వా ఇండస్ట్రీస్కి సబ్సిడీ ధరకు కరెంట్ అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీతో మాట్లాడి ఫిష్ మీల్ ఇతర దేశాలకు ఎగుమతులు కాకుండా స్థానికంగా ఉపయోగపడేలా ఒప్పించాలి. అంతేకానీ రైతులు నిండా మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్స్పోర్టర్కి, సీడు, ఫీడు యాజమాన్యంపై భారం పడితే అంతిమంగా ఆ నష్టం ఆక్వా రైతు మీదే పడుతోంది.సిండికేట్ నాయకులు చంద్రబాబుకి బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వారికి కొమ్ముకాస్తూ వైయస్ జగన్ గారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అప్సడా చట్టానికి తిలోదకాలిస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు ఫీడు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సోయా ధర తగ్గినప్పుడు ఒక్కసారి కూడా ఫీడు ధరలు తగ్గించిన పాపానపోలేదు. మొత్తం మీద ఆక్వా సంక్షోభానికి సీఎం చంద్రబాబే కారణం అవుతున్నారు. అప్సడా ద్వారా వైయస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సీడు, ఫీడు ధరలు పెంచకుండా రైతులను ఆదుకోవడం జరిగింది.కొత్తగా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ విద్యుత్ ఇవ్వలేదు:వైఎస్సార్సీపీ హయాంలో 55 వేల కనెక్షన్లకు సబ్సిడీ ధరకు కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ ధరకు కరెంట్ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సిండికేట్ ముఠా ప్రభుత్వానికి తెలియకుండా ఫీడు ధరలు పది రూపాయలు పెంచింది. రేపు రూ.5 లు తగ్గించి, అది కూడా ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే రొయ్యల రైతులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా సహించబోమని, కాదని మొండిగా వ్యవహరిస్తే ఆక్వా రైతుల పక్షాన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. -
‘ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని ప్రతీ ప్రాజెక్ట్ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతేనన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యమని అప్పలరాజు విమర్శించారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రాకు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చెత్త సంపద కేంద్రం ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా? అని ప్రశ్నించారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడోసారి జిల్లాకు వచ్చారు. ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టటం నేర్పించారు. రెండోసారి బుడగట్ల పాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయాడు. మూడోసారి పర్యటనలోచెత్త సంపద కేంద్రం తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. మీకు శ్రీకాకుళం జిల్లా అంటే ఇంత చిన్న చూపా. పిల్లలు భారం కాదు....వాళ్లే మీ సంపద అంటున్నారు. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. మీ అబ్బాయికి ఆ సలహా ఇవ్వండి. మీరెందుకు ఒక్కరితో ఆగిపోయారు. ఇద్దరిని, ముగ్గురిని ఎందుకు కనలేదు. నేటి చంద్రబాబు టీడీపీకి ఒకప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. వైఎస్సార్ ఆశయ సాధన కోసం, ప్రజలకు సేవ చేయాలనే ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైఎస్సార్సీపీ. మా పార్టీతో మీ పార్టీకి పోలికా?’ అని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర గుంటూరులో ఉంది. ఇది మన ఏపీ ఘనత. ఆ రోజు పెట్రోల్ ధర ఎక్కువ ఉంటే జగన్ వైఫల్యం అట. ఈరోజు పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబుకు సంబంధం లేదట. పెట్రోల్ పై రాష్ట్రంలో అదనంగా రూ 4 వ్యాట్ వేసారు. దాన్ని తగ్గించండి. అమరావతి కోసం డీజిల్ తరలిస్తే ఎంతగా కొరత వచ్చిందో చూసాం...కేంద్ర అలా కుదరదని చివాట్లు పెడితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో అంతులేని అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు. స్కూల్స్ కోసం దాతల నుండి విరాళాలు అడుగుతున్నారు. అతని కుమారుడే విద్యాశాఖ మంత్రి. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. రీ సర్వే వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆ రోజు ఏం మాట్లాడారు. మీ భూములు లాక్కుంటారు, మేం వచ్చిన వెంటనే రీ సర్వే రద్దు చేస్తాం మిమ్మల్ని బెదిరించడానికే జగన్ రీ సర్వే చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా?రీ సర్వేలో అసలు మీ పాత్ర ఏంటి? ఒక్క ఎక్విప్ మెంట్ అయిన మీరు కొన్నారా?, రీ సర్వే ఘనతను వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి మాట్లాడుతున్నారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంలో ఎవరు ఎక్కువ రోల్ చేసారు చంద్రబాబు చెప్పాలి. మీరు మాట్లాడే ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే.నేరేడు బ్యారేజ్ పై ట్రిబ్యునల్ తీర్పు 2021 లో జగన్ అధికారంలో ఉండగా వచ్చింది. నేరేడు బ్యారేజ్ పై ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఘనత జగన్ది. అందులో మీ ఘనత ఏముంది. అందులో నీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు పాత్ర ఏంటి. గెజిట్ నోటిఫికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మీరు నాలుగుసార్లు సీఎంగా చేసిన సమయంలో ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా.. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు చెప్పoడి’ అని సవాల్ చేశారు. -
ఏపీ ఆర్థిక పరిస్థితిపై YS జగన్ ఆందోళన
-
సంక్షోభంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన
-
పెట్రోల్ ధరలపై ఎన్నికల ముందు వీడియో చూపిస్తూ.. చీటర్... జైల్లో వేయాలి..?
-
చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, అవినీతి వలనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ ట్వీట్ చేశారు. ‘‘అభివృద్దిలో దూసుకుపోతున్నామంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చటానికే అభివృద్ది, సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలు చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డీఎస్డీపీ వృద్దిరేటు 10.75శాతం నమోదయిందంటున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వపు సొంత పన్ను ఆదాయాలు 3.22 శాతం తగ్గిపోయాయి. ఏదైనా రాష్ట్రం అభివృద్ది చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. కానీ ఏపీలో 3.22 శాతం తగ్గటం అంటే అర్థం ఏంటి?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయాలు రూ. 85,922.23 కోట్లు. ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో కనీసం 8 శాతం సాధారణ వృద్ధి నమోదై ఉంటే, ఈ ఏడాదికి రూ. 1,00,219.69 కోట్లకు చేరుకోవాలి. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే. మరి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?. గతేడాది ఏపీఎండీసీ ద్వారా సమీకరించిన రూ.9 వేల కోట్ల ద్వారా కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వపు విధానాలు, అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. ..జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు కూడా 5 శాతం కూడా పెరగలేదు. ఎక్సైజ్ ఆదాయాలు కూడా 8.20 శాతం తగ్గాయి. కూటమి ప్రభుత్వం మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటీకరించింది. విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమలను ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ ఆదాయం పెరగకపోగా, తగ్గటానికి కారణం అవినీతి, అక్రమాలే. సేల్ ట్యాక్సుల ఆదాయం ఈ రెండేళ్లలో పెరగకపోగా, ఇంకా తగ్గిపోయాయి. మొత్తం మీద రాష్ట్ర స్వంత పన్ను ఆదాయాలు 3.22 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State.On one hand Mr. Chandrababu… pic.twitter.com/jyQe6sUJVv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2026 -
కాకినాడ రోడ్డుప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అధికం: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి.. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఏపీలోనే ఉందని.. ప్రజల మీద రోజుకు రూ.10 కోట్ల భారం వేయటం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.ఏపీతో పోల్చితే తెలంగాణ లో 3, తమిళనాడు 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ. ఏపీలో మాత్రం టాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. ధరలు తగ్గించకపోగా కార్లు, బైకుల మీద ప్రయాణం చేయొద్దంటూ నీతులు చెప్తారా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతినెలా ఈవెంట్లు చేస్తూ మరింత వృథా చేస్తున్నారు’’ అని వెల్లంపల్లి నిలదీశారు.‘‘పెట్రోలు, డీజిల్పై టాక్స్లు ఎందుకు తగ్గించటం లేదు?. చంద్రబాబు నీతి కబుర్లు ఆపి, టాక్సులు తగ్గించాలి. లీటరు పెట్రోలు మీద 28లు ప్రభుత్వానికి వస్తాయని లోకేష్ ఆనాడు చెప్పారు. అందులో సగం తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారు. ప్రజల మీద ఈ బాదుడు ఆపకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
టీడీపీ నేతల దారుణ కామెంట్లు ఉగ్రరూపం దాల్చిన YSRCP మహిళ నేతలు
-
కుక్కలాగా.. గుంట నక్క లాగా పడి ఉంటా.. సిగ్గులేకుండా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
-
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ అడ్డంగా దొరికిపోయిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడి కొనసాగుతోందని ఆరోపించారు. సెక్యూరిటీ అడిట్ లేని పాత సాఫ్ట్వేర్నే టీటీడీ కొనసాగిస్తోందని మండిపడ్డారు. టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను స్వయంగా శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే లభించలేదు. ఉదయం 9 గంటలు ఒక నిమిషానికే 800 టికెట్ల జారీ పూర్తి అయినట్లు చూపిస్తోంది. ఉదయం 8.50 నుంచి టికెట్ల కోసం సిద్ధంగా ఉంటే 9.01 నిమిషాలకే టికెట్ల అమ్మకాలు పూర్తి అయినట్లు ఆన్లైన్లో చూపించింది. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమాత్రం లెక్కలేని తనంతో టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు.ఎస్ఈడీ టికెట్ల జారీకి ఆటో ఫిల్లింగ్ విధానం లేదు. చంద్రబాబు అనుమతితో ఈ దోపిడి జరుగుతోందని అనుకోవాలి. టీటీడీ పెద్దలు బరితెగించారు, దోపిడి చేస్తున్నారు. టీటీడీ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజుకు 40 లక్షలు రూపాయలు అవినీతి శ్రీవాణి టికెట్ల ద్వారా జరుగుతోంది. బ్లాక్లో టికెట్లను అమ్మే వారి ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. సామాన్యులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. రూ.300 టికెట్లను మూడు వేలకు బ్లాక్లో అమ్ముతున్నారు.రోజుకు ఐదువేల బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిలో రెండు వేల టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 5 నుంచి 8వేల వరకు అమ్ముతున్నారు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తాం. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కాం ద్వారా 48 కోట్ల అవినీతి జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెంట్లు ద్వారా అమ్ముతున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. హైందవ పెద్దలు దీనిపై వెంటనే స్పందించాలి కోరుకుంటున్నా అని కోరారు. -
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూలం
-
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.. కుప్పలు..కుప్పలుగా పెరిగిపోతున్న అప్పు
-
‘ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’
తాడేపల్లి: ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, శైలజానాథ్లు పరిశీలించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్కు అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో స్టీల్ బ్రిడ్జ్ గర్డర్ ఒరిగింది. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అనడానికి ఇదొక నిదర్శమన్నారు. పూటకో మాట చెప్తున్నారు..బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు పూటకో మాట చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఉదయం తప్పులేదన్నారు, సాయంత్రానికి తప్పు జరిగినట్టు ప్రకటించారన్నారు. ‘రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి పేరుతో విజయవాడను ఓల్డ్ సిటీగా మార్చేశారు. అప్పులు తెచ్చి అమరావతి అవసరమా?, అప్పులు ఆపండి, చిన్న బ్రిడ్జి నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే ఇక అమరావతి ఎప్పటికి అవుతుంది?, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’ అని ధ్వజమెత్తారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఆర్నెళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి ఇంకా పూర్తవలేదు. ఈలోపు కొంత కుంగిపోయింది. పనులు ఆపేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వారధి దగ్గర కలుపుతామన్నారు. మరి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు?, అంటే ప్లానింగ్ లోపం ఉన్నట్టా?, కొండవీటి వాగు మీద బ్రిడ్జి పూర్తి కాకుండానే బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు?, కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా పనులు చేయటం వలనే బ్రిడ్జి కుంగింది. బకింగ్హామ్ కెనాల్ జలరవాణాకు సంబంధించినది. దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే చాలా పర్మిషన్ లు కావాలి. ఏం పర్మిషన్ లు తీసుకుని బ్రిడ్జి కడుతున్నారు?, అధికారం ఉందని ఇష్టానుసారం బ్రిడ్జిలు కడతారా?, చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’ అని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.టీడీపీ వైఎస్సార్సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్ జగన్ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
ఎంపీ గురుమూర్తి వినతి.. రైతులకు కేంద్రం తీపి కబురు
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు. -
సైకిల్ తొక్కిన భూమన
-
టీడీపీ ఖాకీచకంపై..కర్నూలులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ (ఫొటోలు)
-
ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి బాబూ!?
సాక్షి, అమరావతి/పొన్నూరు: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్పై దాడి దుర్మార్గపు చర్య అని, పైగా బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో రైతులకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, బాధిత రైతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్ని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు కలిశారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరాచకాలు, దాడులను, వారు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న కేసులను వివరించారు. అంతేకాకుండా మొక్కజొన్నకు ధర లేకపోవడంతో రైతులుగా తాము పంట నిల్వ చేసుకున్న గోడౌన్పై టీడీపీ గూండాలు దాడి చేయడం, రాడ్లతో గోడౌన్ తాళాలు పగలగొట్టి అరాచకానికి పాల్పడటం, అడ్డుకున్న తమపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు రైతులు వివరించారు.పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రోద్బలంతో 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు మామిళ్లపల్లిలో చేసిన విధ్వంసం ఫొటోలు, వీడియోలు వైఎస్ జగన్కు గోడౌన్ యజమాని సోదా సముద్రయ్య, పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, ఇతర రైతులు చూపించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, లీగల్ సెల్ న్యాయ సహాయం అందిస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ‘మోపిదేవి’
సాక్షి, అమరావతి : ‘ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ–అప్సడా)కి తెలీకుండా, దాని అంగీకారం లేకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?’ అంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ వైఎస్ జగన్ గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే..కమీషన్ల కోసం లాలూచీ కాదా?..‘‘చంద్రబాబుగారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటినీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే అప్సడాకు తెలీకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీ వాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతిపరులవేనన్నది అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు. సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకొచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి చైర్మన్గా అప్సడా అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటుచేస్తే మీరు వచ్చాక ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్ కరెంటును కేవలం రూ.1.5తో వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యంచేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబు గారూ.. ఆక్వా ఫీడ్ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం’’. -
జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్
-
YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్
-
మోపిదేవికి జగన్ హామీ..
-
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు
-
వైఎస్సార్సీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు
తాడేపల్లి: రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మోపిదేవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. అందర్నీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. చేరికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ హృదయపూర్వక అభినందనలు* అని పేర్కొన్నారు. -
రామోజీ చనిపోతే కేసులు ఎత్తేయాలా?
-
TTD టిక్కెట్ల స్కామ్ 48 కోట్లు దోచేశారు
-
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ:శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.టీటీడీ ద్వంద్వ వైఖరి:ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
వైఎస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
సాక్షి,తాడేపల్లి: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే, దానిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై కూడా దాడులు జరిపారు. ఈ దాడిలో మామిళ్లపల్లి రైతులు గాయపడ్డారు. తర్వాత తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడి ఘటనను బాధిత రైతులు వైఎస్ జగన్కు వివరించారు. ‘దాడి చేసి తిరిగి మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ‘రైతుల గోడౌన్పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా?. బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం’ అని హామీ ఇచ్చారు. -
అన్న నీ వయసు ఏంటీ నా వయసేంటి.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పే..
-
‘జగన్ అంటే.. బాబు సర్కార్కు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమరావతి అద్దాలకు రూ.2500 కోట్లు అని ఈనాడులో వచ్చిన వార్త గురించి ప్రస్తావించినా కేసులు, బీఆర్ నాయుడు రాసలీలలు గురించి ప్రశ్నిస్తే కేసులు, కర్నూలు బస్సు దహనం గురించి మాట్లాడినా కేసులే, శాంతిభద్రతల కోసం పని చేయాల్సిన పోలీసులను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అధికారాన్ని ఉపయోగించి రూల్స్కు విరుద్దంగా పని చేస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. కోర్టులు చేయాల్సిన పనులను కూడా పోలీసులే చేస్తారా?. అసభ్యకరమైన పోస్టులు ఉంటే ఆ పోస్టులను తొలగించాలి. కానీ ఏకంగా ఖాతాలనే తొలగించమనే హక్కు ఎవరిచ్చారు?. వైఎస్సార్సీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్ను తొలగించాలని ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రూల్స్కు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?. చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయటం దుర్మార్గం.‘‘ప్రజా సమస్యలను ప్రశ్నించినా ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. వైఎస్సార్సీపీ ఇన్స్ట్రాగ్రామ్ని పోలీసుల ద్వారా తొలగించారు. 27,443 హింసాత్మక నేరాలు ఏపీలో జరగడం దారుణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా కొరవడ్డాయి. వైఎస్ జగన్ని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. సరైన పరిపాలన చేస్తే ఆ భయం ఉండదు. తాము చేస్తున్న దోపిడీ, అవినీతిలను బయటపెడుతున్నందునే ప్రభుత్వానికి భయం. కేసులు ఎదుర్కోవటం మాకు కొత్త కాదు. కొంతమంది కార్యకర్తలను హత్యలు చేశారు. మా వారిపై దాడులు చేసి, మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులందరి పేర్లూ డిజిటల్ బుక్లో నమోదు చేశాం. వారిపై కచ్చితంగా చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. -
ఫుల్ ఫ్రస్టేషన్ లో అడ్డంగా దొరికిపోయిన దూళిపాళ్ల నరేంద్ర
-
వైఎస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశ ఎన్నికల చరిత్రలో 5.45 లక్షల భారీ మెజార్టీతో ప్రభంజనం సృష్టించి బుధవారంతో 15 ఏళ్లు పూర్తయింది. 2011లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, కడప ఎంపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ స్థాపించిన రెండు నెలల్లోనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ ఎన్నికల ఫలితాలు 2011 మే 13న వెలువడ్డాయి. కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో నాయకుడిగా దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 5.8 లక్షల ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే ఉన్నారు. 2014–19 మధ్య రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరు సాగించారు. 2019 ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’చేపట్టి నాటి చంద్రబాబు రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేలా ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మరోమారు దేశ రాజకీయాలను షేక్ చేశారు. 2019–24 మధ్య నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుతో పాటు, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో వైఎస్ జగన్ సంచలన గెలుపునకు 15 ఏళ్లు పూర్తవ్వడంతో బుధవారం సోషల్ మీడియా మారుమోగిపోయింది. వైఎస్ జగన్ అభిమానులు రికార్డు విజయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు హోరెత్తించారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. -
తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్ జగన్ని కలిసిన పూడి శ్రీహరి
సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్ జగన్తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్ జగన్కు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్
-
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆక్వా రైతులకు అన్యాయం.. పచ్చ చొక్కాలకే లాభం! చంద్రబాబు పై కాకాని ఫైర్
-
రైతుల ఉసురు పోసుకుంటున్న... కూటమి ప్రభుత్వ పతనం తప్పదు
-
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
మీ కులమైతే చాలు.. ఏమైనా చేస్తారా..?
-
జగనే రైట్ అన్నది కూటమి కూడా గుర్తిస్తోంది!
ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యాయత్నం
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎస్వీ మోహన్రెడ్డి పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
-
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విజువల్స్
-
రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్సీపీ పిలుపు
సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్స్టర్గా మారారంటూ మండిపడ్డారు.‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.ఇవాళ (మంగళవారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
అమరావతిలో బాబు మ్యాజిక్ ఎవడి సొమ్ము ఎవడికి దానం
-
భాగ్యలక్ష్మి బంపర్ లాటరీలా.. అమరావతి లాటరీ మాయాజాలం
-
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
వైఎస్ జగన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హనుమాన్. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపారబలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హనుమాన్. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2026 -
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. -
ఒక్క వర్గానికి కూడా మేలు జరగడం లేదు
-
‘ఏపీలో అద్దాలు.. అబద్ధాల కథే నడుపుతున్నారు’
కాకినాడ: చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు.. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తురన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వారి సొంత ఎజెండా తప్పా మరొకటి లేదని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలకు,ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఈ రాష్ట్రంలో లేదు. అభిప్రాయాలు చెబితే వారి మీద కేసులు పెడుతున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియాను వారి ఆధీనంలో పెట్టుకుంది. సోషల్ మీడియా ను కంట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయ్యడానికి ఒక గ్రూప్ పని చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ను ప్రభావితం చెయ్యడానికి పోలీసులతో ఒక అడుగు ముందు వెయ్యడానికి ప్రభుత్వం పని చేస్తోంది. ఆయా ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అధికార పార్టీ కి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. భాధితులను కాపాడాల్సిన పోలీసులు. .వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయిస్తున్నారు. మాజీ సిఎం జగన్ పిఆర్వో శ్రీహరి పై రెండు కేసులు పెట్టి..హైకోర్టు లో బెయిల్ రాకుండా ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను విచారణ నిమిత్తం పిలిచారు. టీడీపీ హ్యాండిల్ నుండి వైఎస్సార్సీపీ బృందంపై బురద చల్లుతారు. ఆర్టికల్ 19 1a క్రింద ప్రశ్నించే హక్కు ఉంది. అమరావతి లో అవినీతిని ప్రశ్నించారని ఎక్స్ ట్వీటర్కు ఫిర్యాదు చేసి ఆ వీడియోను తీయించేశారు. శ్రీకాళహస్తి లో సౌకర్యాలు లేవని ఒక మహిళ మాట్లాడిన వీడియోను జగనన్న కనెక్ట్స్ నుండి తీయించమని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి లో అవినీతిని ప్రజలు ఎత్తి చూపితే సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో అద్దాలు..అబద్దాలే కధ జరుగుతున్నాయి. అమరావతి లో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు.కేంద్ర గ్రాంట్ కోసం ఒక విభాగాన్ని ఎందుకు పెట్టలేదు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ను ఎందుకు వాడుకోవడం లేదు.మేము వీటి కోసం అడిగితే...మీరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్టీకీ ఆరోగ్యశ్రీ లో వైద్యం అందడం లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో మందులు లేవు. ఈ రోజుకు పండిన ధాన్యం కొనలేని పరిస్థితి లో ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రజా గ్రహం ఉవ్వెత్తున లేస్తూవుంటే...దానిని అగణతొక్కుతున్నారు.ఎంతకాలం గ్లోబెల్స్ ప్రచారంలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన ఒక్కోక్క వాస్తవం బయటపడుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి సహయం చెయ్యడం లేదు’ అని మండిపడ్డారు. -
మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి.. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..
-
మేకపాటి స్థాయి కరివేపాకు లాంటిది! ఉదయగిరిలో హీటెక్కిన రాజకీయం
-
కాళహస్తిలో అధికారుల అరాచకం.. ప్రశ్నించిన పాపానికి మహిళపై...
-
గాంధీ గారి చేతిలో బీర్ బాటిల్ పెట్టడం ఏంటండీ


