YSRCP
-
దళితులు, YSRCP సానుభూతిపరులపై దాడులు పెరిగిపోయాయి: మోహన్ రెడ్డి
-
కార్యకర్త కుటుంబానికి వైఎస్ జగన్ అండ
-
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి
-
‘ప్రజాదరణ కల్గిన నేత కాబట్టే టార్గెట్ చేసి విషం చిమ్ముతున్నారు’
తిరుపతి వైఎస్సార్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)పై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.డి.పట్టాభూములు,ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.‘ఈ కేసు విషయంలో డీజీపీని మదనపల్లెకు పంపించి మరీ విచారణ జరిపించారు. నివేదిక ఇచ్చారు. ఈనాడు మళ్లీ బురద చల్లడానికే ఈ వార్తలు ప్రచురిస్తున్నారు. ఫైల్స్ దహనం కేసులో ఏ సంబంధం లేకపోయినా పనికట్టుకుని ఇరికించాలని చూస్తోంది. ప్రజాధరణ కల్గిన నాయకుడు కనుక ఆయన్ని బద్నాం చేయాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ(YSRCP)ని బలహీన పర్చాలని కుట్రలు చేస్తున్నారు.ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు అందరికీ తెలుసు. ఎన్ని విచారణలు చేసినా, చేయించినా ఏ తప్పు చేయలేదన్నదే తేలుతుంది’ అని భూమన స్పష్టం చేశారు. -
మొక్కవోని ధైర్యం.. వైఎస్ జగన్ నాయకత్వం: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలోకి చేరారు. శైలజానాథ్తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు.వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని.. మరో వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా, పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యా రంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.‘‘ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని.. రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని శైలజానాథ్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం. ప్రజల పక్షాన పోరాడుతాం. మొక్కవోని ధైర్యంతో పని చేసే నాయకత్వం జగన్ది. అందుకే ఆయన నేతృత్వంలో పని చేసేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు.చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది: అనంత వెంకట్రామిరెడ్డిఈ రోజు శైలజానాథ్ మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అనేక మంది మా పార్టీలోకి వస్తున్నారు.రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తానని చంద్రబాబు చెబుతున్నది శుద్ద అబద్దం. చంద్రబాబు 1996లో ఆ పనులకు శంకుస్ధాపన చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. కానీ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు అందించారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు. జగన్ సీఎంగా రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా రాయలసీమకు మళ్లీ అన్యాయం చేస్తోంది.ఇదీ చదవండి: సీఎం రమేష్కు ఇక్కడేం పని.. ఎమ్మెల్యే ఆది ఆగ్రహం -
మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలు హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కుదేలైపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్యను వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చేర్చారని.. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన కృషి చేశారన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారు. ఎన్నికల్లో రకరకాల హామీలిచ్చి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఏమైపోయిందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ఏడు నెలల కాలంలో లక్షా 46 వేల కోట్ల రూపాయల అప్పుచేసి రికార్డు సృష్టించారు. మమ్మల్ని విమర్శించి.. మాపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రతీ మంగళవారాన్ని అప్పులవారంగా మార్చేశారు.. దీనికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి’’ అని మల్లాది విష్ణు నిలదీశారు.‘‘వైఎస్ జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. టీడీపీ మంత్రులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచారు.. యూజర్ ఛార్జీలు పెంచారు.. పన్నుల భారం మోపారు. ప్రజల నుంచి డబ్బులు పిండి సంపద సృష్టి అని చెప్పుకుంటున్నారు. ఒక్క మంత్రి కూడా సరిగా పనిచేయడం లేదని నిన్నటి ర్యాంకులను చూస్తేనే అర్ధమవుతోంది’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.‘‘లక్షా 46 వేల కోట్లు అప్పుచేసి ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు’’ అని విష్ణు ధ్వజమెత్తారు. -
శైలజానాథ్ పార్టీలో చేరడంపై అనంత వెంకట్రామిరెడ్డి రియాక్షన్
-
టీడీపీ అరాచకాలపై పోరాటం చేస్తా ..
-
కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వా జగన్ గురించి మాట్లాడేది
-
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ పార్టీలో శైలజానాథ్
-
ఏపీలో ఆర్థిక విధ్వంసం.. బాబు ‘మార్క్’ పాలన ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ తమ సంపద కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం సంపద సృష్టించకపోగా.. తన మనుషులకు ఆస్తులను అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, పోర్టులు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్.. రూ.1.45 లక్షల కోట్లు అప్పులు చేసింది.అయితే.. ఆస్తులు అమ్మి, అప్పులు చేసిన సొమ్మంతా ఏమౌతుందని ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఆస్తుల అమ్మకమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్నీ కూడా కూటమి సర్కార్ అమలు చేయడం లేదు. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే లక్షల కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు.ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డైరీ, క్యాలెండర్ను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్ ఎఫైర్స్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు సుదర్శన్ రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, కాసా జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు
వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ కార్పొరేటర్లే లక్ష్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అన్నీ అనుమతులతో వైఎస్సార్సీపీ కార్పోరేటర్ నడుపుతున్న వాటర్ప్లాంట్ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 26వ డివిజన్ కార్పోరేటర్ త్యాగరాజు వాటర్ ప్లాంట్ను కూలగొట్టాలని అధికారల్ని పురమాయించారు ఎమ్మెల్యే మాదవీ రెడ్డి.తాము వాటర్ ప్లాంట్ నడపడానికి అన్ని అనుమతులు ఉన్నాయని చూపినా అధికారులు మాత్రం కూలగొట్టేందుకే యత్నిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశాలున్నాయంటూ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మున్సిపల్ ిసిబ్బంది సిద్ధమైన క్రమంలో ఆ డివిజన్లోని ్స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపునకు దిగితే సహించేది లేదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అన్నీ అనుమతులు ఉన్న వాటర్ ప్లాంట్ను ఎలా కూలగొడతారని కూటమి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ వాటర్ ప్లాంట్ కూలుస్తున్నారన్న సమాచారం అందుకున్న మేయర్ సురేష్ బాబు అక్కడకు చేరుకున్నారు. ఏ అధికారంతో వాటర్ ప్లాంట్, ఇళ్లను కూలుస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో దీనికి అన్ని పట్టాలు మంజూరు అయ్యాయని మేయర్ స్పష్టం చేశారు. ఇది రాజకీయ కక్ష పూరిత చర్య అని. నోటీసులు కూడా లేకుండా తొలగింపునకు ఎలా వచ్చారని అక్కడ ఉన్న అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమలగా, ఇక్కడ నుంచి అధికారులు వెళ్లే వరకూ కదిలేది లేదని మేయర్ సురేష్ బాబు తేల్చిచెప్పారు. -
ఇక నుంచి ఈ జగన్ ప్రతి కార్యకర్త చెయ్యి పట్టుకునే ఉంటాడు
-
అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు.. జగన్ అదిరిపోయే సమాధానం
-
ముద్రగడ ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్
-
‘జగన్ రాజకీయాన్ని టీడీపీవాళ్లే మెచ్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలనపై, సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై, అలాగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీతచంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాంఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారుఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారుసూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారుఔహామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారుఅమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైందిఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?అప్పుల్లో రికార్డు బద్ధలు9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లుఅమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారుమార్క్ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పుఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పుమొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారుఅన్ని అప్పులు చేసినా.. బటన్లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయిపథకాలన్నీ ఆగిపోయి.. గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయిమత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయిపిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయిందిఉద్యోగాల్లేవ్ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవువలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారుబేవరేజెస్లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారుపీఆర్సీ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించారుఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయిఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలిఆర్థిక విధ్వంసం అంటే ఇదే.. ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాంరామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాంపది పిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టాంరెండు హార్బర్లను మా హయాంలోనే ప్రారంభించాం. మరో హార్బర్ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్గా ప్రారంభించాం కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాంబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారుమెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులువీటన్నింటిని ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నారు.. ఇది పెద్ద స్కాంజీఎల్ఐ, జీపీఎఫ్కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారుఆర్థిక విధ్వంసం అంటే ఇదేచంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేఇందుకోసం స్కామ్లు చేస్తున్నారుసంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందిఇసుక స్కాంలు జరుగుతున్నాయిమా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారుప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారుఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసిందిపైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ను చంద్రబాబు తిడతారు ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలేప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్లు నడిపిస్తున్నారుపెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయిపెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారంఅలా అయితేనే వ్యాపారాలే నడిచేదిరివర్స్ టెండరింగ్ రద్దు చేశారుకాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్ల పేరుతో అన్యాయాలకు తెర తీశారుప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందిఇంక ఆదాయం ఎందుకొస్తది?ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదురాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందిఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదుకారణం.. రెడ్బుక్ రాజ్యాంగంప్రశ్నించేవారిని వేధిస్తున్నారుసంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారుఅన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారుమోసాల్లో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటినటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారుపరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడురాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడునటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయనచంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పాపులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నాఅయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారుస్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారుఅందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుందిఎవరి హయాంలో ఏం జరిగిందంటే.. 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారురాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారువైఎస్సార్సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాంకాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణమా హయాంలోనే కోవిడ్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయిచంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లుమా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లుసోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందిమా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాంబాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉందిమా హయాంలో 2023-2024 నాటికి.. పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాంచంద్రబాబు దిగిపోయేనాటికి.. జీడీపీ కంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉందిమా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాంఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలిరాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలిఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరుచంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది అప్పుల గురించి పరిశీలిస్తే.. చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలేఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారుమా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారురూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారుఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారుగవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది(రూ.10 లక్షల కోట్లు)శ్వేత పత్రాల సమయంలో మళ్లీ లెక్కలు మారాయి(రూ.12 లక్షల కోట్లు)చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్లో ప్రవేశపెట్టారుబడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి14 లక్షల కోట్ల నుంచి మొదలై.. చివరకు 6 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయారుచివరకు.. బడ్జెట్లో అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని చంద్రబాబు ఒప్పుకున్నారుఅలాంటప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది?చంద్రబాబు హయాంలో రూ.31 వేల కోట్ల అదనపు అప్పులు చేశారుమా హయాంలో రూ.17 వేల కోట్ల అప్పుల భారం తగ్గించాంజూన్ డిసెంబర్ మధ్య ఆదాయం రూ.50 వేల కోట్లుఈ నెలల్లో 0.51 నెగెటివ్ గ్రోత్ వచ్చిందిచంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారుజీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది?బాబు బిల్డప్కు ఈనాడు బాకాఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయనకేం కొత్త కాదుతప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటే దావోస్ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారుఏవోవో కంపెనీలు వస్తున్నాయంటూ ప్రకటనలు ఇచ్చారుఆయన బిల్డప్లకు.. ఈనాడు మామూలు ఎలివేషన్లు ఇవ్వదుఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు ఆడమని చెప్పరునిజాయితీగా బతకమని చెప్తారుచంద్రబాబు తన కొడుకు దగ్గరి నుంచి మొదలుపెడితే పార్టీలో ఉన్న అందరికీ.. అందరికీ అబద్ధాలు ఆడమని, వెన్నుపోటు పొడవమని చెబుతుంటారు దావోస్లో ఒక్క ఎంవోయూ కుదర్చుకోలేదుపరిశ్రమలు ఇక్కడికి వద్దామనుకుంటే .. పెట్టుబడిదారులను భయపెట్టి, కేసులు పెట్టి.. బెదరగొట్టి.. వెళ్లిపోయేలా చేశారుపక్క రాష్ట్రాలు వాళ్లతో ఎంవోయూలు చేసుకున్నారుపరిశ్రమలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?జిందాల్ లాంటి వ్యక్తులను భయపడితే.. వాళ్లు మరో 10 మందికి చెప్పరా?పైగా మా హయాంలో చేసిన ఒప్పందాలను.. ఇప్పుడు తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు12 మంది ఎంపీలున్న బీహార్.. బడ్జెట్లో ఎన్నో సాధించుకుందిబడ్జెట్లో ఏపీకి ఏం సాధించారు?కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది ఏదీ లేదుకేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఏం సాధించుకోకపోగా.. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారుచంద్రబాబు పలుకుబడి ఏపాటిదో ఇక్కడే అర్థమవుతోందిఇది విధ్వంసం కాదా?చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావుఇది విధ్వంసం కాదా?పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి ఆపేశారుస్కూళ్లలో నాడు నేడు పనులు ఆపేశారుఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేస్తున్నారుట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆపేశారువసతి దీవెనను ఆపేసి, విద్యా దీవెన అరకోరగా అమలు చేయడం.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం కాదా?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు.. ఇది విధ్వంసం కాదా?చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం.. విధ్వంసం కాదా?అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందించిన సంక్షేమ పథకాలు ఆపేయడం.. విధ్వంసం కాదా?ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం .. విధ్వంసం కాదా?ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకోవడంరాష్ట్ర ఆదాయం కాకుండా.. తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా?రెడ్బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?ప్రశ్నిస్తే దాడులు చేయడం.. విధ్వంసం కాదా?ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరుపతిలో.. ఉప ఎన్నికల టైంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందిఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారుఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారుచివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారుఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేమా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాంటీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలిహ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారుఅధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గంహిందూపురంలో జరిగింది చూశాం చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నికల జరిగిందిఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలినందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారుఅలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఆరోజులు త్వరలోనే..జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారుఅవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయిచొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిప్రజలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందిలిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?రాష్ట్రంలో లేని పరిస్థితులు.. ఉన్నట్లు చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారుప్రజా సమస్యలు చెప్పేందుకు చట్ట సభల్లో సమయం ఇవ్వడం లేదు.. అందుకే మీడియా ముందుకు రావాల్సి వస్తోందివైఎస్సార్సీపీ 2.0 పాలన.. కార్యకర్తలకు భరోసా ఇస్తుందని మళ్లీ చెబుతున్నా‘పెద్ద’రెడ్డి.. అంటూ ఈనాడు కథనాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్.. ఆయన తండ్రిది ఏ శాఖ?.. లిక్కర్కేసుతో వాళ్లకేం సంబంధం?ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? మద్యం రేట్లు మేం పెంచామా?మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?రేట్లుఉ పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకి మాముళ్లు ఇస్తారా?నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు?నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీతో రెండున్నర లక్షల కోట్ల రూపాయాలు సంక్షేమానికి ఖర్చు చేశాకమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరు ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లు చేస్తోంది ఇప్పుడువిశ్వసనీయత ఉండాలి.. అది ఎవరికైనా!రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలిఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలిబయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలిభయపడో, ప్రలోభాలకు లొంగోలేకుంటే రాజీపడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటి?రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందివిశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందిలంచాలు లేకుండా ప్రజలకు సంక్షమ పథకాలు అందించాందేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ నిలబడిందిస్పీకర్ కోర్టుకు స్పందించడం లేదుఅసెంబ్లీ సమావేశాలను మేం బహిష్కరించలేదుకోర్టుకు వెళ్లాంస్పీకర్ ఎందుకనో కోర్టుకు స్పందించడం లేదుఅన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలిఅసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలిజిల్లా పర్యటనల గురించి.. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది జిల్లాల పర్యటనలకు ఇంకా టైం ఉంది ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా! -
నేడు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన కార్యకర్త చేసిన దాడికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, దూలం నాగేశ్వరరావు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు బుధవారం కాకినాడ జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.ఆయనకు, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్రగడ గిరి బాబుకు సంఘీభావం తెలిపారు. వారు విలేకర్లతో మాట్లాడుతూ, ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమాన్ని నడిపి, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడి అని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి గంజాయి తాగాడా.. మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది తర్వాత విషయమన్నారు. తాను జనసేన మనిషేనని, ఆ పార్టీ జెండా మోశానని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి ముద్రగడ ఇంటి పైకి వచ్చి రచ్చ చేయడమే కాకుండా.. మళ్లీ ఉదయం వచ్చి ఇదంతా తానే చేశానని చెప్పడాన్ని చూస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. నిందితుడి ఫోన్ డేటా ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు. దాడులపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
AP HC: ఈ కేసు మాకో గుణపాఠం
సాక్షి, అమరావతి : నెల్లూరులో వైఎస్సార్సీపీ నేత కె.బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో ఆ నగర మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భవనం విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప, రాతపూర్వక ఆదేశాలు కాదని, అందువల్లే భవనం కూల్చివేశామన్న కమిషనర్ వాదన హైకోర్టును ఒకింత షాక్కి గురి చేసింది. ఈ కేసు తమకో గుణపాఠమని హైకోర్టు తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయబోమని, మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని, ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిట్ పిటిషన్లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామంటూ నెల్లూరు మునిసిపల్ అధికారులు ఇచి్చన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబం«దీకులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. గత నెల 22న ఈ వ్యాజ్యం విచారణకు రాగా, తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ కార్పొరేషన్ను న్యాయమూర్తి ఆదేశించారు.విచారణను గత నెల 24కి వాయిదా వేశారు. అయితే, 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల 27న ఆ భవనాన్ని కూల్చేశారు. 29న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, భవనం కూల్చివేత ఫొటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది సురేందర్రెడ్డి కోర్టుకు సమర్పించారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చిoది. సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దంటూ 22న కోర్టు మౌఖికంగానే ఆదేశించి, విచారణను 24కి వాయిదా వేసిందన్నారు. 23, 24 తేదీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, 27న కూల్చివేశామని చెప్పారు. పిటిషనర్ల తరపున సురేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 24న పిటిషన్ విచారణకు రానందున నిర్మాణాలను తొలగించేందుకు 3నెలల సమయం కోరామని, ఆ మేర అఫిడవిట్ వేస్తామని కూడా చెప్పామని వివరించారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. 24 వరకే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారే తప్ప, రాతపూర్వక ఆదేశాలివ్వలేదని తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు, ప్రజా సంబంధ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.రాష్ట్రంలో కూటమి పాలనలో అంతా అరాచకం సాగుతోంది. 9 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. సూపర్ సిక్స్ సహా హామీల అమల్లోనూ చంద్రబాబు సర్కార్ విఫలమైంది. కూటమి నేతల ఆగడాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోంది.విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుందని.. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామన్నారు. ‘‘ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ! -
టీడీపీ బీసీ వ్యతిరేక పార్టీ: వేణు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20 శాతం కేటాయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10 శాతం మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని అన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:గీత కార్మికులకు చంద్రబాబు మోసం:మద్యం పాలసీలో భాగంగా ఎన్నికలకు ముందు కల్లుగీత సొసైటీలకు 20 «శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిందాన్ని విస్మరించి కేవలం 10 శాతం దుకాణాలను మాత్రమే గీత కార్మికులకు కేటాయిస్తూ తాజాగా జీఓ జారీ చేశారు. ఇది బీసీలను అన్యాయం చేయడం, మోసం చేయడం కాదా? ఆ 10 శాతం దుకాణాలు కూడా సక్రమంగా మద్యం విక్రయాలు లేని చోట్ల, దుకాణాలకు నష్టాలు వస్తున్న చోట్లను ఎంపిక చేసీ గీత కులాలకు అంటగడుతున్నారు. మద్యం విక్రయాల్లో మార్కెట్ బాగున్న చోట్ల దుకాణాలను కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ౖMðవసం చేసుకున్నారు.బీసీల పట్ల టీడీపీ చిన్నచూపు:కల్లుగీత సొసైటీల్లో పని చేస్తున్న గీత కార్మికులకు కల్లు విక్రయాలు తగ్గిపోయి, ఉపాధి కొరవడుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించేందుకే మద్యం దుకాణాలను కేటాయిస్తున్నామని చెబుతున్నారు. అటువంటప్పుడు మద్యం పాలసీని ప్రకటించి, దుకాణాలకు టెండర్లు పిలిచిన సందర్భంలోనే గీత కార్మికులకు ఎందుకు దుకాణాలను కేటాయించలేదు? దీనికి ఆరు నెలల సమయం కావాల్సి వచ్చిందా? మాచర్లలో లైసెన్స్ కోసం ఒక కల్లుగీత కార్మికుడు వెడుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు గురి చేసిన సంగతి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించారు.దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. మద్యం దుకాణాల నుంచి పైవాళ్లకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. మద్యం దుకాణాలకు వేలం కోసం దరఖాస్తు చేసే సమయం నుంచి వారికి కేటాయింపులు జరిగితే స్థానిక ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటాలు ఇవ్వాలి. బెల్ట్ షాప్లు నిర్వహించుకునేందుకు దగ్గర ఉండి వేలం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఇప్పుడు లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారిపైన కూడా దౌర్జన్యాలకు పాల్పడటం బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిన్నచూపుకు నిదర్శనం.బీసీ రిజర్వేషన్లపైనా పచ్చి అబద్దాలు:స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, ఆ సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. 2019లో సీఎం అయిన శ్రీ వైయస్ జగన్, బీసీలకు అదే 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు తన అనుయాయుడు సుధాకర్ రెడ్డి చేత పిల్ వేయించి రిజర్వేషన్లు దక్కుండా కుట్రలు చేయడం వల్ల 24 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అదే చంద్రబాబు బీసీలకు మేలు చేసే నేతగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది. చంద్రబాబు బీసీల విషయంలో చెబుతున్న ప్రతిమాటా ఒక అబద్దమే.జాకీ మీడియా తప్పుడు కథనం:చంద్రబాబు అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ప్రతికలో బీసీలపై వైసీపీ కత్తి’ అనే శీర్షికన ఒక వార్తను ప్రచురించారు. తెలుగుదేశం పాలనలో బీసీలపై ఎంత నీచంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తమ సమస్యలను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు వివరించేందుకు ఆనాడు సచివాలయంకు వెళ్ళిన నాయీబ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను అని, మత్స్యకారులు వెడితే వారిని తోలు తీస్తాను అని చంద్రబాబు హెచ్చరించిన సంగతి రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. -
విజయవాడ కార్పొరేటర్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం (ఫొటోలు)