breaking news
YSRCP
-
లోకేష్ పర్యటన తర్వాతే.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హత్యకు కుట్ర..
-
అఖిలప్రియ సవాల్.. టీడీపీ ఆఫీస్ వద్ద బిజేంద్ర రెడ్డి!
-
శవాలు మాయం.. ఏపీలో మరో వ్యక్తి మిస్సింగ్.. మళ్లీ లాకప్ డెత్..?
-
ఎప్పటికీ చెరిగిపోని YSR గుర్తులు మా శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉన్నాయి
-
శ్రీకాకుళం జనసేనకు బిగ్ షాక్.. YSRCPలోకి పవన్ వీరాభిమాని
-
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు గదులు: భూమన
తిరుపతి: టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ భద్రత, విజిలెన్స్ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని విమర్శించారు. అగోడ (Agoda) యాప్లో టీటీడీ వసతి గదులు విక్రయానికి పెట్టారని ఆరోపించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా గదులను అధిక ధరలకు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. రూ.1,000 నుంచి రూ.1,800 వరకు ఉండే గదులను రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.‘‘ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వికాస్ నిలయం, వకుళమాత గెస్ట్ హౌస్ల పేర్లు అన్లైన్ విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని గదులను రూ.14,500, రూ.18,180, రూ.20,700 ధరలకు ఆఫర్ చేశారు. నో స్మోకింగ్ రూమ్స్ పేరుతో కూడా ఆన్లైన్లో ప్రకటనలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాప్లో టీటీడీ వసతులు కనిపించడం ఆందోళనకరం’’ అని తెలిపారు.అగోడ యాప్కు సంబంధించి భూమన వీడియో ఆధారాలను విడుదల చేశారు. టీటీడీ లోపాలను ఎత్తిచూపితే తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇలాంటి అంశాలను గుర్తించడంలో టీటీడీ భద్రతా విభాగం విఫలమైంది. నవనీతమ్మ వ్యవహారంపై సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. నవనీతమ్మ పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన ప్రకటనల్లో భిన్న సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై సీసీటీవీ ఫుటేజ్ను బహిర్గతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు నకిలీ యాప్ల ద్వారా మోసపోతుంటే చర్యలు ఎందుకు లేవు? వృద్ధురాలి అంశంపై చూపిన చొరవను నకిలీ యాప్ల నియంత్రణపై చూపాలి. మా హయాంలో 48 నకిలీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేసి మూసివేయించాం’’ అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. -
టెట్లో వీళ్లూ పాస్ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్ జగన్
తాడేపల్లి: టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్లో స్పందిస్తూ.. ‘‘20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు?’’ అని నిలదీశారు.టీచర్లకు మానసిక ఒత్తిడి టీచర్లందరికీ టెట్ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కానీ, చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి’’ అని చెప్పారు. .@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2026 -
BR నాయుడు బ్రోకర్, ABN RK లోఫర్.. రావణ్ వివాదంపై కొడాలి నాని సంచలన కామెంట్స్
-
ప్రపంచం గర్వించదగ్గ మహానేత వైఎస్సార్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగంల్లి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలు కోట్ల మంది జీవితాల్లో మార్పు తెచ్చాయన్నారు. ఏ పథకం తెచ్చినా ఎంతమందికి మేలు చేకూరుతుందని ఆలోచించేవారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు జరగటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్సార్ది. వైఎస్సార్ పాదయాత్రతో మనిషే మారిపోయారు. అధికారంలో ఉన్న ప్రతిక్షణం జనం గురించే ఆలోచించారు..అధికారం అనేది ఒక సేవ అని ఆలోచించే వారు. తండ్రికి మించిన పట్టుదలతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. ఎన్నో విషమ పరీక్షలు ఎదుర్కొని జనం కోసం జగన్ నిలబడ్డారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర చేశారు. ఆ కుటుంబాలకు ఆర్ధికంగానూ అండగా నిలిచారు. ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి మేలు చేసిన వ్యక్తి జగన్. చంద్రబాబు పాలనలో ప్రజల జీవితాలు చీకటి మయంగా మారాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్ పాలన వస్తుందిరాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ పాలన. పోలీసులను అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నారు. అమరావతి, అవినీతి అనే పేరు వినిపిస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా తొలగిస్తున్నారు. ఇంత బరితెగింపును చూసి దేశ ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి విషపు పాలనకు ప్రజలు చరమగీతం పాడే టైం దగ్గరలోనే ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
నీ కొడుకు సింగిల్ సీటు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. చంద్రబాబుకు సవాల్
-
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
ఆ లాక్కెళ్లడం ఏంటండీ.. అరెస్ట్ప శృంగారపాటి సందీప్ రియాక్షన్
-
నేడు వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వినర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వినర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్, త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వినర్ భరత్, విక్టోరియా కన్వినర్ కృష్ణా రెడ్డి, సహ కన్వినర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిషేక్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
తెరమీద చంద్రబాబు, పవన్.. తెర వెనుక ఆయన: పేర్ని నాని
బందరు: హోంగార్డుల సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు.‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెరమీద కనిపిస్తారు. తెర వెనుక లోకేశ్ ఉంటారు. హోంగార్డుల జీతం నెలకు రూ.21 వేలు. హోంగార్డులకు రూ.18 వేలు ఉండే జీతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.21 వేలకు పెంచారు. నెలకు రెండు రోజుల సెలవుతో హోంగార్డులకు రూ.21 వేల జీతం ఇచ్చారు. కానిస్టేబుళ్లు నిర్వహించే విధులనే హోంగార్డులు నిర్వహించాలి. హోంగార్డులు ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు’’ అని పేర్ని నాని చెప్పారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వివరించారు.బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు భారీ ఎత్తున యువత తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయం వద్ద బారులు తీరారు.ప్రజల నుంచి వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్ జగన్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయులువైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.కాగా, రేపు(జులై 8, బుధవారం) ఉదయం వైఎస్ జగన్.. పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. -
"ఉపము"ని ప్రశ్నిస్తే "ఉపా" కేసు... మీలాంటి రాజకీయ హిందువులందరినీ...
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్
-
నేడు, రేపు వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 8న బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. -
ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..
-
సాయికృష్ణ ఫ్యామిలీకి వైఎస్సార్సీపీ రూ.20 లక్షల సాయం అందజేత
తాడేపల్లి: సాయికృష్ణ కుటుంబాన్ని సోమవారం వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేశ్, అడపా శేషు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... ‘‘సాయికృష్ణను చంపేయటంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అందుకే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నాం. తల్లి విజయలక్ష్మికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశాం. సాయికృష్ణ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఇంకా చాలామంది దోషులు ఉన్నారు. జగన్ పరామర్శించటానికి వెళ్లేదాకా కేసు కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత సీఐ నాగరాజుని అరెస్టు చేశారేగానీ, ఆయన మొబైల్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మొబైల్ తీసుకుని విచారణ చేస్తే నాగరాజు ఎవరితో మాట్లాడో తెలుస్తుంది? పీఎస్ లో సీసీ కెమెరా ఫుటేజీ ఎవరు మాయం చేశారు? కానిస్టేబుల్ ఫోన్లను లోతుగా విచారించాలి. ఆర్థిక సమస్యల కారణంగా కానిస్టేబుళ్లు ఫోన్లు అమ్ముకున్నారని సిట్ చెప్తోంది. సిట్ ఎవరిని కాపాడటానికి ఇలా చేస్తోంది? సాయికృష్ణ మీద కేసులు ఉంటే చంపేస్తారా? అనేదే మా ప్రశ్న. సాయకృష్ణ కుటుంబం మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టులో వేసినందుకు ఇంకా ఒత్తిడి చేస్తున్నారు. సాయికృష్ణను చంపేయటంపై మేము పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. ఇది ఆ ఒక్క కుటుంబ సమస్యకాదు, సమాజ సమస్య. ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తూ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోంది’’ అని చెప్పారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘‘సాయికృష్ణ తల్లికి ఆర్థిక సాయం చేసేందుకు వచ్చాం. సాయికృష్ణ రౌడీ పీటర్ అయితే చంపేస్తారా? ముద్దాయి అయితే బూడిద కూడా ఇవ్వకుండా చేస్తారా? ఈ కేసులో సీఐ నాగరాజు ఒక్కడినే బలి చేయటం కరెక్టు కాదు. సీపీ సహా ఇతర అధికారులను కేసు నుంచి ఎందుకు తప్పిస్తున్నారు? సిట్ పూర్తిస్థాయి విచారణ చేయటం లేదు. పై అధికారుల ప్రమేయం లేకుండా ఈ దారుణం జరుగుతుందా?’’ అని అడిగారు. -
బీచ్ షాక్స్ పై గళం ఎత్తిన YSRCP మహిళా నేతలు
-
శృంగరపాటి సందీప్ అరెస్ట్.. కారణం ఏంటి?
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్ అక్రమ అరెస్ట్
గుంటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ అక్రమ అరెస్ట్ అయ్యారు. తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్గేట్ వద్ద శృంగారపాటి సందీప్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సందీప్ను కారు దింపి బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను సందీప్ ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. 15 రోజుల నుంచి పోలీసులు సందీప్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ రావాలని సందీప్ను తుళ్లూరు పోలీసులు వేధిస్తున్నారు. ఆయన ఇంట్లోలేని సమయంలో పోలీసులు ఇంటికి వెళ్లి అతడిని అరెస్ట్ చేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. సందీప్ను పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రావణికి జైలులో ప్రాణహాని.. కారుమూరి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్
-
TDP ఆఫీసుల్లో టీ, కాఫీకి బదులు బీర్లు, మద్యం ఇస్తారా!
-
చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీవాళ్ళు బూతులు తిడితే కేసులు ఉండవా?
-
ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: అంబటి
సాక్షి, గుంటూరు: రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని.. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని వరుస అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘యూట్యూబర్ ప్రశ్న రావణ్, జర్నలిస్టు కేవీఆర్ మా పార్టీకి చెందినవారు కాకపోయినా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తున్నాం. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం చట్టవిరుద్ధం. ప్రశ్న రావణ్పై ఐదుసార్లు అరెస్ట్, బెయిల్, మళ్లీ అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం...రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు యూఏపీఏ కేసు పెట్టడం న్యాయవ్యవస్థకే సవాల్. ఉగ్రవాదులపై ఉపయోగించే చట్టాన్ని ఓ యూట్యూబర్పై ప్రయోగించడం దారుణం. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైఎస్సార్సీపీ లీగల్ సపోర్ట్ అందిస్తుంది. సాయి కృష్ణ, కాంతికుమార్, ప్రశ్న రావణ్, కేవీఆర్.. ఎవరు మా పార్టీ వాళ్లు కాకపోయినా అన్యాయానికి వ్యతిరేకంగా నిలుస్తాం.బాధితులనే నిందితులుగా మార్చే ధోరణిని వైఎస్సార్సీపీ సహించదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే యూఏపీఏ.. అధికారాన్ని పొగిడితే రక్షణ అనే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సమస్యలను వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. మమ్మల్ని దూషించే వారిపై చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులా?. జనవరి 31న నా ఇంటిపై జరిగిన దాడిపై నిందితుల అరెస్టు కోరుతూ ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇస్తాం. ఈ దుర్మార్గమైన పాలనను ప్రజలు గమనించి తగిన తీర్పు ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు.. అంబటి సంచలన ప్రెస్ మీట్
-
రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు, ఎల్లుండి(మంగళ,బుధ) పర్యటించనున్నారు. ఆయన రేపు(మంగళవారం) ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. -
బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్సీపీ
సాక్షి,విశాఖ: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘బీచ్ షాక్స్’ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వైజాగ్తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. బీచ్ రోడ్ అంతటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనకు పార్టీ అగ్రశ్రేణి నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ర్యాలీలో వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, పార్టీ నేత కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్వయంగా పాల్గొని మహిళలకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ.. గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి, పవిత్రమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే, ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా? అని ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిని పణంగా పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. -
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తిరుపతి జిల్లా: బూతు ఎమ్మెల్యే మాకొద్దని పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. పులివర్తి నాని బూతు మాటలు, రోత పనులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారు. నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వైఖరి నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట వైఎస్సార్సీపీ చంద్రగిరి ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడును బూతులు తిట్టిన ఎమ్మెల్యే నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
పవన్ కళ్యాణ్కు ఆ రూల్ వర్తించదా?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్రం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్లో ఉన్నవారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగేది. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావు లేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని బెదిరించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్దం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ఆధారసహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక పార్టీపరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్కే ఈ పవర్ ఉంటుందా.మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోం మంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఒక జీఓ ఇవ్వవలసిన అవసరం లేదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీసు శాఖలో ఉన్నాయి. సైబర్ క్రైమ్కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా ఫర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్దితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కాని ఆయన చెబుతున్నదానికి, ఆచరిస్తున్నదానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలనో, సోషల్ మీడియావారినో భయపెట్టే యత్నంగా కాకుండా, జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీవారు, లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది.పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపిపిస్తుంది. నిజంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికి దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్కావళిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుని, అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేయడం మంచిదే. తమ నిర్ణయాలతో విబేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కాని ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్కు పౌరులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఓ వారం, పది రోజుల క్రితమే కదా! వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ, తొక్కి నార తీస్తా అని పవన్ అన్నారు! మరి అవి వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా? రావా? అన్నదానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా అని అడుగుతున్నారు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకాని, పవన్ కాని ఎన్నడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది వాక్ స్వాతంత్రం కిందే వస్తుందా? అధికారంలో ఉంటే ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చెల్లుతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి ఒక ఫ్రొఫెసర్ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడినప్పుడు పవన్ కళ్యాణ్ మందలించి ఉండాల్సిందే. ఈ మద్యనే జగన్ను కూడా దూషించితే, పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే. అందులో రాజీ లేదు. కాని అదేదో ఒక పార్టీకి సంబంధించినంతవరకే కాదు కదా! మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైఎస్సార్సీపీ మహిళా నేతలు పలువురిని దూషిస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన వారు పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉంటే, ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది.ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషణ చేయకపోయినా ఆయనపైన, మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నిరకాల దూషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి కదా! వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్టు చేస్తున్నారే. వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే! కక్ష కట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారే! చంద్రబాబు పదే, పదే వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడాన్ని పవన్ సమర్థిస్తారా?హింసకు తావు లేదని అన్నారు. అది నిజమే. కాని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్దం అని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అనలేకపోయారే! విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూలకుండీలతో దాడులు చేశారు. అప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికి తెలిసిందే కదా! రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా, మందలించి ఉంటే పవన్ నిబద్దతగా ఉన్నారని అంతా ఒప్పుకునే వారు కదా! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాదితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు పవన్పై ఒక నమ్మకం ఏర్పడేది కదా! జనసేన నేత ఒకరు నడిరోడ్డుపై పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకం అని ఖండించి, చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏమి చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా! సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై పవన్ స్పందించాలి కదా.30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే! రాష్ట్ర అప్పులపై పది నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ చేసిన అసత్య ప్రచారం గురించి ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయే! అయినా అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడేవారు.నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్దమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలతో పాటు తాను గత పదేళ్లుగా ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్దతి అనిపించేదేమో! పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా!ఒక వైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచాకాలు సాగుతుంటే, వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌరుల హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా? లేక ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ అణచివేత చర్యల కోసం... ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసినా అరెస్టులు లేవు.. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం.. వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడి చేయించడం.. పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం..! ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలన్నారు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి.. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి..! అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు.. జంగిల్ రాజ్ కాదు.. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి.. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హితవు పలికారు. ‘హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్..’ అంటూ ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ..! రాజకీయ అణచివేత చర్యల కోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తులో వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?⇒ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?⇒ ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 5, 2026⇒ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్.. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో తాత్సారం చేసి వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే.. నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.⇒ సాయికృష్ణ లాకప్డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాలు లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు.. ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరి తెగింపునకు కట్టడి లేదు.⇒ వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారూ.., మీరు, పవన్కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి. హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’’. -
ఫారాలెక్కడ ‘సర్’
ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బీఎల్ఏను కలవాలని మా బీఎల్వో చెబుతున్నాడు. మా ఇంటికి ఇంత వరకు బీఎల్వోనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బీఎల్ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తిచేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి. – ఎ.కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రబో అని ఓటర్లు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం అంకెల్లో వందశాతాలు చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలామంది బీఎల్వోలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బీఎల్వోల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లలో ఎవరికి ఫారాలు ఇవ్వాలి? ఎవరిని మినహాయించాలనేది టీడీపీ నాయకులే బీఎల్వోలకు నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఫారాలు ఇప్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన ఓటర్లకు ఓట్లు లేకుండా చేయాలన్న కుట్రతో పాటు పనిలో పనిగా దొంగఓట్లు చేర్పించే దుర్మార్గానికి కూడా అక్కడక్కడా పసుపు చొక్కా నాయకులు పూనుకుంటున్నారు. ఓటర్లకు రెండు ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఫారం వారికే తిరిగి ఇవ్వాలన్న పద్ధతిని బీఎల్వోలు ఎక్కడా పాటించడం లేదు. నిరక్షరాస్యులైన ఓటర్లకు వివరాలు నింపడంలో సాయపడాల్సిన బీఎల్ఓలు చాలామంది ఆ పనిని గాలికి వదిలేశారు. దాంతో చాలాచోట్ల ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్నా ఇంకా ఫారాలు అందలేదు.. అందిన ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా జరగలేదు.. ఈ నేపథ్యంలో సర్ గడువు పొడిగించాలని, అవకతవకలన్నీ సరిచేయాలని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్ జరుగుతున్న తీరిలా ఉంది... దొంగ ఓట్లు చేర్చే కుట్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలస వెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మక్కై అక్కడ 76 ఓట్లున్నట్లుగా చూపుతున్నారు. దొంగఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం కర్నూలు జిల్లాలో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. ఎక్కడో ఒకచోట కూర్చుంటున్నారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఓటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఆదోనిలో టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం. ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకోవలసిందే. కర్నూలులోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బీఎల్వోలు కూర్చుంటున్నారు. జిల్లాలో వలస వెళ్లిన కూలీల ఫారాలన్నీ అందుబాటులో లేకుండా చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించడానికి సర్వం సిద్ధం చేశారు. ‘సర్’ ప్రక్రియలో పసుపు యానిమేటర్లు అనంతపురం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో, డిజిటలైజేషన్ ప్రక్రియలో వెలుగు యానిమేటర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఓ అధికారి ఆదేశాలతోనే యానిమేటర్లు ఈ పనిలోకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం వెలుగు యానిమేటర్లందరూ అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా.. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందా లేక ప్రతిపక్షాలకు చెందిన ఫారాలు గల్లంతవుతాయా అన్నా అనుమానాలున్నాయి. ఎన్యూమరేషన్ జిరాక్స్లు ఎందుకు ‘తమ్ముడూ’? కళ్యాణదుర్గంలోని 70, 71 పోలింగ్ కేంద్రాల వద్ద ఓ టీడీపీ కార్యకర్త ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్స్లు తీసుకుంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు. తాను బీఎల్వోనని, గతంలో ఇక్కడి బీఎల్వో సరిగా పనిచేయకపోవడంతో తనను నియమించారని చెప్పి తప్పించుకోబోయాడు. గట్టిగా నిలదీయడంతో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకురావలసిందిగా స్థానిక టీడీపీ నేత డిష్ మురళి చెప్పాడని బయటపెట్టాడు. అంటే ఆ ఫారాలన్నీ పరిశీలించి ఏవేవి తీసేయాలో చెప్పేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రన్న మాట. బీఎల్వోలను పిలిపించేలోపు ఆ కార్యకర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వరా? శ్రీకాకుళం జిల్లాలో 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీకాకుళం నగరంలోని చాలా ఏరియాల్లోకి అసలు బీఎల్వోలు అడుగేపెట్టలేదు. జిల్లాలో చాలాచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇంటిలో ఐదుగురు ఓటర్లుంటే ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికీ మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి మాయమయ్యారు. చాలాచోట్ల అక్నాలెడ్జ్మెంట్లా ఉంచాల్సిన ఫారాన్ని కూడా బీఎల్వోలు తీసుకెళ్లిపోతున్నారు. రెండు ఫారాలు వాళ్లే తీసుకుపోతే మనకు ఇక ఆధారమేమి ఉంటుందని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 36వ డివిజన్లో ఒక ఇంట్లో 8మంది ఓటర్లు ఉంటే ముగ్గురికి, చెన్నారెడ్డి కాలనీలో ముగ్గురు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేశారు. సర్వం గందరగోళం.. సర్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సర్ ప్రక్రియ సర్వం గందరగోళంగా తయారయ్యింది. శని, ఆదివారాలలో బీఎల్వోలు బూత్లలో అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించినా ఎక్కడా బీఎల్వోలు కనిపించలేదు. చాలా చోట్ల బూత్లకు తాళాలేసి ఉన్నాయి. తెరిచి ఉన్న బూత్లలో సిబ్బంది ఎవరూ లేరు. ⇒ తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరించడం లేదు. రాజమండ్రి నగరంలో నేటికీ 25 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ జరిగింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడం తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. సర్వర్లు మొరాయించడం వంటి కారణాల వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ ఈనెల 14వ తేది నాటికి పూర్తి కాదని, గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. విశాఖ తూర్పు, ఉత్తర, గాజువాక, చోడవరం, పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల్లో బీఎల్వోల కోసం ప్రజలు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందలేదు ⇒ చిత్తూరు నగరంలోని 32వార్డు సచివాలయంలో పనిచేసే బీఎల్వోలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నంద్యాల విశ్వనగర్ టీడీపీ కార్యాలయంలో సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఎల్వో, అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్⇒ పల్నాడు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం లేదు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో బూత్ నంబర్లు 286, 287 పరిధిలో 22 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నూజెండ్ల మండల ఎంఆర్ఓకు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చాలాచోట్ల బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని ఫారాలు పూర్తి చేస్తున్నారు. ⇒ బాపట్ల జిల్లాలోనూ చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. మార్టూరులోని 21, 22, 23 వార్డులలో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను బీఎల్వోలు మినహాయించారు. కానీ ‘సాక్షి’లో కథనం రావడంతో బీఎల్వోలు హడావిడిగా శని, ఆదివారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే పర్చూరు, చీరాల నియోజకవర్గాలలోనూ వందలాదిమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు తమకు ఫారాలు అందలేదని చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోనూ ఫారాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి మళ్లీ తెస్తామని బీఎల్వోలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కలెక్టర్ మాత్రం జిల్లాలో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని చెబుతున్నారు.నంద్యాల 6వ వార్డులో టీడీపీ నాయకుడితో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరం 80వ బూత్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. దీంతో వారు దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో 800మంది వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తుండటంపై ఫారాలు అందనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సరిగా జరగడం లేదు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలతో కుమ్మక్కై ఫారాలను వారి చేతికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరి మున్సిపాలిటీ 10వ వార్డులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జీడీ నెల్లూరు పరిధిలోని గంగమాంబపురంలో ఫారాలన్నీ టీడీపీ నేతలకు బీఎల్వోలు అప్పగించగా, వారు తమకు అనుకూలమైన ఓటర్ల వివరాలను మాత్రమే ఆన్లైన్ చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు 92 బూత్లో సల్మా భాను అనే బీఎల్వో 600కి పైగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా బూత్ల్లో పర్యటిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై నిలదీస్తే ఆ బీఎల్వో దురుసుగా సమాధానం చెప్పారు. ఓట్ల తొలగింపుపై నూజండ్ల తహసీల్దార్ రమేష్కుమార్కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం ఫారాలివ్వడానికి బీఎల్వోలు ఎవరూ ఇళ్లకు రావడం లేదు. సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఫోన్ చేస్తే సచివాలయానికో, మరో ప్రాంతానికో రమ్మని చెబుతారు. వెళ్లినా అక్కడ ఉండడం లేదు. రోజువారీ పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగటం మా వల్ల కావడం లేదు. మేం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా ప్రాంతానికి వచ్చి ఫారాలు అందజేయాలని కోరుతున్నాం. – బాబు, పాలసముద్రం మండలం, చిత్తూరు జిల్లావృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు సర్ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ, స్వీకరణ చేయాలి. అయితే మా పంచాయతీలో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదు. సచివాలయానికి రావాలని ఓటర్లకు చెబుతున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లలేక, వ్యయప్రయాసలకోర్చి అక్కడవరకూ వెళ్లినా అక్కడ ఎదురు చూడలేక చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. – జమాల్, మాజీ సర్పంచ్, సింగవరం పంచాయతీ, అనంతపురం జిల్లాఐదుసార్లు ఓటు వేశాను.. ఇప్పుడు ఓటు లేదంటున్నారు మేం కనిగిరి బీసీ కాలనీలో ఉంటున్నాం. మా ఇంట్లో 9 మంది ఓటర్లం ఉన్నాం. మా స్వగ్రామం మార్కాపురం మండలం మేకలవారిపల్లి గ్రామం. నేను సుమారు 35 ఏళ్ల క్రితం కనిగిరికి వచ్చాను. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుసార్లు ఓటు వేశాం. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డును రెండుసార్లు పొందాను. అన్ని ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని వెళ్లి బీఎల్వో ఆంజనేయులును కలిశాను. 2002 జాబితాలో నీ పేరు కనిపించడం లేదు. మీ నాన్న, మీ బంధువుల ఆధారాలు తీసుకుని రా.. లేదంటే.. నీ ఓటు ఫారంను రిజక్ట్ చేస్తాను అని బీఎల్వో చెప్తున్నాడు. మీ నాన్న ఓటు వివరాలు, బూత్ నంబర్ కని్పంచలేదని బీఎల్వో దబాయిస్తున్నాడు. ఎన్నికల అధికారులు నాకు న్యాయం చేయాలి. – చల్లా ఏడుకొండలు, కనిగిరి, మార్కాపురం జిల్లాఓటరు లిస్టులో పేరు లేదంటున్నారు నాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. కానీ ఇçప్పుడు బీఎల్వో ఓటరు లిస్టులో నా పేరు లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వేస్తున్న ఓటు లేదంటే ఎలా? ఫారం పూర్తిచేసి ఇచ్చినా డిజిటలైజేషన్ కాలేదు. పక్క గ్రామంలో కూడా ఓటరు లిస్టులో పేరు కోసం వెతికించా. అక్కడా కనిపించలేదంటున్నారు. ఊరూరా తిరిగే ఓపిక లేదు. ఒంటరి వృద్ధురాలిని. నా ఓటు తీసేయడానికే లిస్టులో లేదంటున్నారా? అసలు నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? – కురబ రమణమ్మ, చేనేతనగర్, కురబలకోట మండలం, అన్నమయ్య జిల్లాఫారం నింపడానికి బీఎల్వో సాయం చేయడం లేదు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. బీఎల్వోలు ఎవరూ సాయం చేయడం లేదు. తండ్రి పేరుతో పాటు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు అడుగుతున్నారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో ఆ వివరాలు ఎలా నింపాలో అర్థంగాక నింపడం లేదు. 2002 ఓటరు జాబితా వివరాలు నింపాలంటే ఆ లిస్ట్ ఎక్కుడుందో తెలియడం లేదు. – భీమన వీరబాబు, క్వారీ మార్కెట్, బూత్ నంబర్ 30, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాఫారాలు ఇవ్వకుండా ఆన్లైన్ చేసేశామంటున్నారు సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్కు రెండు ఫారాలు ఇచ్చి వాటిని నింపిన తర్వాత ఒకటి ఓటర్ దగ్గర ఉంచి ఇంకొకటి బీఎల్వో తీసుకొని ఆన్లైన్ చేయాలి. అప్పుడే ఆ ఓటర్ ఎన్యూమరేషన్లో పాల్గొన్నట్లు అవుతుంది. రేపు ఓటు గల్లంతైతే ఓటరు అడగడానికి వీలు కలుగుతుంది. ఓటరు దగ్గర ఫారం లేకపోతే తన ఓటు గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది? మైలవరం నియోజకవర్గంలో చాలా బూత్లలో ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా వివరాలు తీసుకొని ఆన్లైన్ చేసేశామని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చూడాలి. – వేములకొండ విష్ణు, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా -
గల్లంతైన మత్స్యకారులలో ఒక్కరి ఆచూకే లభించింది: బొత్స
విశాఖ: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతు కావడం బాధాకరమని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో.. కేవలం ఒక్కరి ఆచూకీ మాత్రమే లభించిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ని కనుగొనాలని అన్నారు. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాగా, వైఎస్సార్సీపీ నేతల బృందం ఆదివారం ఫిషింగ్ హార్బర్కు వెళ్లి పరిశీలించింది. బాధిత మత్స్యకార కుటుంబాలను విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైసీపీ నేతలు పరామర్శించారు.ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ‘‘గల్లంతయిన వారికోసం ప్రభుత్వం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా చేయాలి. సమాచారం అందిన వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే మత్స్యకారుల ఆచూకీ దొరికేది. బాధిత మత్స్యకార కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని మత్స్యకారులు చెబుతున్నారు’’ అని తెలిపారు. -
‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’
సాక్షి, తాడేపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘ఎస్ఐఆర్ ప్రక్రియలో వైఎస్సార్సీపీకి ఇబ్బందులు కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. అధికారులకు మంత్రులు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు’’ అని తెలిపారు. కాగితాల మీద రాసుకుంటే సరిపోతుందా?సర్ ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ జరుగుతోందని లేళ్ల అప్పరెడ్డి అన్నారు. ‘‘బీఎల్వోలపై టీడీపీ నేతల బెదిరింపులు పెరిగాయి. చివరికి ఉన్నతాధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గటం దుర్మార్గం. ఎన్యుమనరేషన్ ఫారాలు ఇప్పటికీ చాలామందికి అందలేదు. కానీ 99.11% ఫారాలను పంపిణీ చేశామని ఎన్నికల కమీషన్ చెబుతోంది. కాగితాల మీద లెక్కలు రాసుకుంటే సరిపోతుందా? ప్రజల సందేహాలను ఎన్నికల కమిషన్ ఎందుకు నివృత్తి చేయటం లేదు? ఎన్యుమనేరేషన్ ఫారాలు టీడీపీ ఏజంట్ల దగ్గరే ఉంటున్నాయి. ఈ విషయాలపై ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. మంత్రి నారాయణ SIR సమీక్షలో పాల్గొనటంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పని చేస్తోంది? డిజిటలైజేషన్ ప్రక్రియ 48% మాత్రమే పూర్తయిందని ఎన్నికల సంఘం చెప్తోంది. మిగతా 9 రోజుల్లో 52% డిజిటైజేషన్ ఎలా పూర్తవుతుంది?తమకు అనుకూలంగా పని చేయాలంటూ బీఎల్వోలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. బెదిరింపులు తట్టుకోలేక నరసరావుపేటలో ఒక బీఎల్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. సర్ కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలి. గడువును మరో నెల పెంచాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాము. అసలు సర్ ప్రక్రియ ఇంకా జనానికి అర్థం కాలేదు. ప్రజల్లో చైతన్యం తేవటంలో ఎన్నికల కమిషన్ విఫలం అయింది. హడావుడిగా కార్యక్రమాన్ని ముగించేందుకు ఎన్నికల సంఘం చూస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని చెప్పారు. -
చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్న పవన్...! గవర్నర్ తో చర్చలు..
-
జర్నలిస్టులు ప్రశ్నిస్తే కక్ష సాధింపులెందుకు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం, పాలనను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఇందుకు నిదర్శమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మండిపడ్డారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తద్వారా మహిళల్ని చంద్రబాబు కించపర్చారని ఆయన ఆక్షేపించారు. మీడియా సమావేశంలో బొత్స ఇంకేమన్నారంటే..ప్రశ్నించిన వారిపై కూటమి సర్కార్ కక్షసాధింపులుఅసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపులకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లాకప్ డెత్ లు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో జనం నరకం అనుభవిస్తున్నారు. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. యూరియా దొరకని పరిస్ధితులు ఉన్నాయి.ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వ్యక్తుల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, అసలు హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారు. జరిగిపోయిన వాటికే మళ్లీ మళ్లీ శంకు స్థాపనలు, భూమిపూజలు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యల్ని మాత్రం గాలికొదిలేశారు. రెండేళ్ల పాలన దాటిపోయింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేశామని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా ? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో శంఖుస్ధాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మళ్లీ భూమిపూజలు చేస్తున్నారు.రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారుఎంతసేపూ వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకం అమలు చేయలేదు. ఈ డబ్బంతా ఎటు పోయిందో తెలియదు. మహిళల్ని బస్సులు ఎక్కించారు కానీ సున్నా వడ్డీలు మాత్రం ఎగ్గొట్టారు. ఆ బస్సులు సైతం స్ధానికంగా తిరగడానికి మాత్రమే, దూర ప్రాంతాలకు కాదు. కేంద్ర విద్యా మంత్రి స్కూళ్లకు వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి ప్రశంసించారంటే కారణం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే.కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా స్కూల్ కిట్లే ఇవ్వలేదు. అమరావతిలో అవినీతి జరుగుతోంది, మావిగనే మా విధానం అని మా నాయకుడు వైఎస్ జగన్ చెప్పారు. అది నిజం. రాజధాని అంటే హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఎన్ని లక్షల చదరపు మీటర్లో ఉందో చూడండి. అంత పెద్ద రాజధాని. అమరావతి మాత్రం గీత గీసుకుని కూర్చున్నట్లుంది. అందుకే మావిగన్ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు.మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించే తీరిక లేదా?గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందంటే మేం అంతా సంతోష పడ్డాం. కానీ ఇప్పుడు ఆమె రాష్ట్రానికి వస్తే స్వాగతం చెప్పకపోవడానికి ముఖ్యమంత్రి వెళ్లకపోవడం మహిళల్ని కించపర్చడం కాదా? రాష్ట్రపతిని స్వాగతించి వెళ్లిపోవచ్చు కదా. గవర్నర్, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం కచ్చితంగా వెళ్లాలి. ఆరోగ్యం బాగోలేకపోతే అది వేరు. కానీ రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు వెళ్లలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడి ఉపముఖ్యమంత్రి మీటింగ్లో ఉన్నారు.రాజ్యాంగ పదవిలో ఉన్న వారు వచ్చినప్పుడు గౌరవించాలన్న మర్యాద కూడా లేదు. వీళ్లు రాష్ట్రం గురించి, న్యాయం, ధర్మం గురించి, గౌరవాల గురించి బాధపడిపోతూ ఉంటారు. పాలన గాలికొదిలేసి ఎంతసేపూ కక్షసాధింపులకు దిగుతున్నారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోవాలి కానీ భావప్రకటన స్వేచ్ఛనే కాలరాస్తామంటే ఎలా ? అవే మాటలు మనం మాట్లాడితే ఒప్పు, ఇతరులు మాట్లాడితే తప్పంటే ఎలా ? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి? గవర్నర్ పదవే ఆయనకు చివరిది. రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవం ఎందుకు తగ్గించుకుంటున్నారు? చంద్రబాబు విశాఖలో సింగపూర్ టౌన్ షిప్ను అక్కడి మీ పార్ట్నర్స్తో కడతారా లేక అక్కడి ప్రభుత్వంతో కడతారా చెప్పాలి. గతంలో అమరావతిలో సింగపూర్ సహకారంతో ఏదో చేస్తానన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రభుత్వాన్ని అడిగితే మాకూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు సింగపూర్ టౌన్ షిప్ ఎవరి సహకారంతో చేపడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నమోదు 36 శాతం దాటలేదు కాబట్టి, గడువు మరో నెల పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. -
రావణ్ ను చంపే కుట్ర.. ఆ ఎమ్మెల్యేకు బందరులో ఏం పని..
-
54 వేల ఓట్లు తొలగించారు... SIR పేరుతో బాబు కుట్ర
-
‘సాయికృష్ణ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’
విజయవాడ: సాయికృష్ణ లాకప్డెత్ కేసు విజయవాడలో జరిగిన సర్కారీ హత్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలంటే సీబీఐ ఎంక్వయిరీ ఒక్కటే మార్గమన్నారు. సిట్ విచారణ, మేజిస్టీరియల్ విచారణ రెండూ కూడా కంటి తుడుపు చర్యలేనన్నారు. అందుచేత సీబీఐతో విచారణ చేయిస్తే దీని వెనుక ఎవరున్నారో బయటకొస్తుందన్నారు మల్లాది విష్ణు.‘ప్రభుత్వం బహిరంగంగా మేజిస్టీరియల్ విచారణకు వైఎస్సార్సీపీ నేతలం హాజరయ్యాం. మాకు అనుమానాలు, అభ్యంతరాలు అన్నీ వినతి పత్రం ఇచ్చాం సీబీఐ ఎంక్వయిరీ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది’ అని పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ.. ‘ మెజిస్ట్రేరియల్ ఎంక్వయిరీలో మా అభిప్రాయం చెప్పాం. ప్రభుత్వం దొడ్డి దారిన నాగరాజుని బాధ్యుడును చేస్తూ ముగిస్తారని అభిప్రాయం ఉంది. దీని వెనక ఇంకెంతమంది ఉన్నారు బయటికి తీయాలి. వీడియో ఫుటేజ్ని బయటకు తీయాలి. స్టేషన్లోనే కాదు మిగతాన్ని ప్రాంతాలకు సిసి పుటిజ్ వెలిగితేయాలి.మార్కాపురం నుండి విజయవాడ వచ్చేవరకు సీసీ ఫుటేజ్ తీయాలి. నాగరాజుకు సీపీ ఆదేశాలు ఇచ్చారా? సీపీకి డిజిపి ఆదేశాలు ఇచ్చారా? డీజీపీకి సీఎం ఆదేశాలు ఇచ్చారా? తెలియజేయాలి. క్రాంతికుమార్ దాంట్లో ఏ చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. కామెంట్లు చేశారని, యూట్యూబ్ అని స్టేషన్లో పెట్టి స్టేషన్లో తిప్పుతున్నారు. తమ సొంత సామాజిక వర్గం లో యువకుడు చనిపోతే డీసీఎం ఎందుకు మాట్లాడలేదు. సాయి కృష్ణ కేసిన పవన్ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది ఈ చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు మానవ హక్కులకు సంబంధించిన విషయం’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కేసులో మాకున్న అనుమానాలు, అభిప్రాయాలను వినతి పత్రంలో తెలియజేశాం. లాకప్ డెత్ చేయడమే కాదు.. డెడ్ బాడీ మాయం చేశారు. ఈ కేసును భూస్థాపితం చేయడానికి అనేక చర్యలు తీసుకొన్నారు. మే 28వ సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే దాని కూడా పట్టించుకోలేదు జగన్ వచ్చిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. జగన్ రాకపోతే కేస్ కూడా రిజిస్టర్ చేసేవారు కాదు. హేబియస్ కార్పస్ లో వెతుకుతున్నామని పోలీసుల చెప్పారు. పోలీసులు చట్టంతో చెలగాటం అడుగుతున్నారు. నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్ సెల్ ఫోన్స్ నాగపూర్ లో అమ్ముకొన్నామని కబుర్లు చెపుతున్నారు. సెల్ ఫోన్స్ దొరికితే అన్ని దొరుకుతాయాని వేరే కథ రాస్తున్నారు.వాస్తవాలు బయటకి రాకుండా నాగరాజు ని ఇరికించి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయాలి.. ఈ కేసు సీబీఐతో విచారణ జరపాలనేది వైఎస్సార్సీపీ డిమాండ్’ అని స్పష్టం చేశారు. -
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
-
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్
-
రెండు సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రశ్నించవా..? పోలీసులనే జనసేన నాయకులు కొడితే..
-
రావణ్ ని మాకు అప్పగించండి.. నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన నేతలు హల్ చల్
-
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య వర్ధంతి. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘గుండెల నిండా దేశభక్తిని నింపుకుని.. మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అని పోస్టు చేశారు. త్రివర్ణ పతాకం.. ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి జాతీయ పతాక రూపశిల్పి మహనీయుడు పింగళి వెంకయ్య గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నింపిన నాయకుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/mOawlt5YGf— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2026 -
సాయికృష్ణ ను జైల్లో చంపినట్లే... ప్రశ్న రావణ్ ను కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్..!
-
కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యు స్టీల్ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభించటం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. మా ప్రభుత్వ హయాంలో జేఎస్ డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవటానికి కీలకమైన పునాదులు వేశాం. పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించాం. నీటి కేటాయింపులూ మా హయాంలోనే చేశాం. భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌళిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా అందించాం. అలాగే ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాం. ఆ కారణంగానే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలాయి. కానీ దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయిHeartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for… pic.twitter.com/pI0CJVhV7e— YS Jagan Mohan Reddy (@ysjagan) July 3, 2026 ..ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు ఆలస్యమయింది. ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావటం సంతోషకరం. కడప ప్రజలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కడప నా సొంత జిల్లా కావటంతో ఈ ప్రాజెక్టుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా అక్కడి యువతకు మంచి భవిష్యత్తు లభించాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా నిరంతరం కొనసాగే ప్రక్రియ..ఇప్పటికే జరిగిన పనులను కొనసాగిస్తూ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఏ ప్రభుత్వానికైనా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, కడపతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి. పారిశ్రామికాభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఫలాలను అందించడంలో జేఎస్డబ్ల్యూకు సంపూర్ణ విజయం చేకూరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అవినీతి, స్కామ్లకు చంద్రబాబు బ్లూప్రింట్ తయారుచేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్రానికి గుదిబండ.. స్కామ్లు చేయడానికే అమరావతి పెట్టారు. అమరావతిలో పెట్టే నిధుల్లో 10 శాతం మావిగన్లో పెట్టినా ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు.మావిగన్పై వైఎస్ జగన్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని అన్న చంద్రబాబు ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. రాజధానికి ప్రభుత్వ భూమి ఉంటే మంచిదని వైఎస్ జగన్ అన్నారు. అమరావతి నేల రాజధానికి పనికిరాదని గతంలో చాలా మంది చెప్పారు. అమరావతి నేల కుంగిపోతుంది.. ఇది ప్రమాదకరం. అమరావతి పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడైనా సమాధానం ఇస్తున్నారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘మావిగన్లో తక్షణ అభివృద్ధికి అవకాశం ఉంది. అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్రం మోయలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో లే అవుట్లు కూడా అభివృద్ధి చేయడం లేదు. లే అవుట్లు అభివృద్ధి చేయలేకపోతే రైతుల పరిస్థితి ఏంటీ?. అమరావతి కోసం అప్పు తెచ్చిన రూ.47 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు, మచిలీపట్నం పోర్టు, హంద్రీనీవా కాలువ పూర్తి చేయొచ్చు. పాఠశాలలు దేవాలయాలు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయి?. ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్లో ఎవరుంటున్నారు?. చదరపు అడుగుకు రూ. 20 వేల ఖర్చు ఏంటీ? ఎక్కడైనా ఉందా?. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు.. భయపెడుతున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతికి, మావిగన్కు మధ్య తేడా ఇదే..‘‘మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అమరావతికి, మావిగన్కు మధ్య తేడా ఏంటో వైఎస్ జగన్ పలుమార్లు చెప్పారు. దాని గురించే మరోసారి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి అసాధ్యమైనదని, దాంట్లో 10 శాతంతో మావిగన్ అవుతుందని చెప్పారు. మావిగన్ ఆలోచనతో చంద్రబాబుకు పడరానిచోట దెబ్బ పడుతోంది. మావిగన్ అనగానే.. గుంటూరు, విజయవాడ కూడా మావిగన్లో భాగమేనని చంద్రబాబు అంటున్నారు. అమరావతికోసం చంద్రబాబు పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయా?. కానీ మావిగన్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయి. ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుంది’’ అని సజ్జల వివరించారు.మరి మాటలు మార్చింది ఎవరు?‘‘ప్రభుత్వ భూమి అయితే రాజధానికి బెటర్ అని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ అందుబాటులో రాజధాని ఉంటుందని ఆరోజు అన్నారు. అమరావతిలో అవినీతి, దోపిడీ, ఆర్థిక భారం.. ఈ అంశాలన్నీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల డబ్బును వృథా చేయొద్దన్నందుకు వైఎస్ జగన్పై పడుతున్నారు. మాట మార్చింది వైఎస్ జగన్ కాదు.. కూటమి నాయకులే. మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికీ చోటు ఉంది. అమరావతి ప్రాధాన్యతను తగ్గించలేదు. లెజిస్లేచర్ క్యాపిటల్గా ఆ ప్రతిపాదనలో చోటు ఉంది. పైగా రైతులకు మేలు చేసింది వైఎస్ జగనే. ..వైజాగ్ను గ్రోత్ ఇంజిన్గా మార్చాలనుకున్నారు. మరి కంపెనీలు వైజాగ్నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాయి?. రాజధాని విషయంలో స్థిరత్వం లేనిది చంద్రబాబుకే. కేవలం అవినీతి కోసమే అమరావతిని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతి అవినీతికి బ్లూ ప్రింట్. ఇది రాష్ట్రానికి తీరని నష్టం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఖర్చులు బాధ్యతారాహిత్యం. రాష్ట్రం పట్ల స్పృహలేని వారు మాత్రమే ఇలా చేస్తారు. చంద్రబాబు రాత్రికి రాత్రే మాటలు మారుస్తున్నారు. చంద్రబాబు గతంలో టెంపరరీ రాజధాని అన్నారు, ఇప్పుడు మున్సిపాల్టీ అంటున్నారు. అమరావతి మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు. స్వయంగా కామెంట్ చేశారు. ..అమరావతి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదని గతంలో అన్న పవన్కళ్యాణ్. భూములు ఇవ్వకపోతే లాక్కోవద్దని గతంలో అన్న పవన్కళ్యాణ్. కర్నూలు రాజధాని అంటూ గతంలో ప్రకటన చేసిన పవన్కళ్యాణ్. రాజధాని అరిగిపోయిన రికార్డంటూ కామెంట్ చేసిన సోము వీర్రాజు. వైజాగ్ను అభివృద్ధి చేయాలన్న సోము వీర్రాజు. అన్ని సదుపాయాలూ వైజాగ్లో ఉన్నాయంటూ గతంలో కామెంట్ చేసిన సోము వీర్రాజు. రూ.1500 కోట్లు ఇస్తే కారిపోయిన బిల్డింగులు కట్టారన్న సోము వీర్రాజు. అమరావతి ఉత్తుత్తి అమరావతిగా మిగిలిపోనుందా అంటూ మాట్లాడిన జీవీఎల్. వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలన్న జీవీఎల్. గ్రాఫిక్స్, బొమ్మలకే అమరావతిని పరిమితం చేశారన్న పురందేశ్వరి. కూటమి నాయకులు అన్న మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్లే చేసి చూపించారు.అమరావతి ఖర్చులు, అప్పులు, ప్రజలపై భారం‘‘అమరావతిలో వర్టికల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. భూమి ఉన్నప్పుడు వర్టికల్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు?. రూపాయి అయ్యే చోట వంద రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?. ఆ డిజైన్లకు ఎంత డబ్బు పెట్టినా అవుతుందా?. ఏ పనీ చేయకపోయినా రూ.47 వేల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.60 వేల కోట్ల పనులు అప్పగించేశారు. ఈ రూ.47 వేల కోట్లతో పోర్టులు, రాయలసీమ లిఫ్ట్, మెడికల్ కాలేజీలు, వెలిగొండ నిర్వాసితుల సమస్య, పోలవరం నిర్వాసితుల సమస్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్.. ఇవన్నీ కూడా పూర్తి చేయవచ్చు...చంద్రబాబుకు ఏది ప్రాధాన్యతో తెలియని పరిస్థితి ఉంది. లక్ష కోట్లకు ఏటా రూ.8 వేల కోట్ల వడ్డీ కట్టాలి. రెండేళ్లలో చంద్రబాబు రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.10 వేల కోట్లతో రాజధాని పూర్తి చేస్తే ఎవరు అడుగుతారు?. కానీ ప్రజల సొమ్మును ఇష్టానుసారం పోస్తున్నారు. హెరిటేజ్ అమ్మి కడుతుంటే ఎవ్వరూ అడగరు. వేల, లక్షల కోట్లు పెట్టి ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు కట్టారా?. బర్మా మిలటరీ నియంతలు కట్టిన నేపిడా కూడా ఘోస్ట్సిటీగా మారిపోయింది...అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అవుతుందో చంద్రబాబు చెప్పగలరా?. అమరావతిలో ప్రభుత్వ భవనాల నుంచి ఆదాయం వస్తుందా?. ప్రజలకు పెద్ద భ్రమలను కల్పించే మెకానిజం చంద్రబాబుకు ఉంది. విజయవాడలో ఎయిర్పోర్ట్ పనులను ఎందుకు ముందుకు జరగనీయడంలేదు?. మచిలీపట్నం పోర్టును ఎందుకు పూర్తి చేయడంలేదు?. ఇవన్నీ వదిలేసి, డబ్బంతా అమరావతికి డైవర్ట్ చేస్తున్నారు. భారం అంతా ప్రజలమీద వేస్తున్నారు, ఆదాయాలన్నీ ప్రైవేటు వారికి ఇస్తున్నారు...రైతుల ప్రయోజనాలను కూడా చంద్రబాబు కాపాడ్డంలేదు. ఇప్పటివరకూ రోడ్లు కూడా వేయడంలేదు. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే వెళ్లగొట్టారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని కచ్చితంగా ప్రశ్నిస్తాం. రైతుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తాం. కలిసి వచ్చేవాళ్లందరినీ కలుపుకుంటాం. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అమరావతిలో విపరీతంగా దోచుకుంటున్నారు. మట్టి మాఫియా చేస్తున్నారు, కొండలను కరిగించేస్తున్నారు. ఇలాంటి దోపిడీ చేస్తున్నవారే మొన్న వైఎస్సార్సీపీ బృందాన్ని అడ్డుకున్నారు. అమరావతి గురించి ప్రస్తావించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రశ్నిస్తే, దాడులు చేస్తున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నలు వేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు...రాష్ట్రంలో ప్రజల వాయిస్ను మేం వినిపిస్తున్నాం. ఆ హక్కును చంద్రబాబుగారు ఎలా కాదంటారు?. చంద్రబాబును ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండాలి. ప్రజా సంబంధిత అంశాలనే మేం ప్రస్తావిస్తున్నాం. మావిగన్ మా పార్టీకి నష్టం చేస్తుందనే అనేవాళ్లు కూడా ఉన్నారు. మేం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడడం లేదు. రాష్ట్రానికి నష్టం తెచ్చే అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తాం. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు ఏ కామెంట్ చేసినా వాటికే తగులుతాయి. వీళ్లు పెద్ద ఫేక్ సైన్యాన్ని నడుపుతున్నారు. అసభ్యంగా మాట్లాడ్డంలో వారి తర్వాతే. “కొడకల్లారా..” అంటూ గతంలో తిట్టారు. వారి మాటలను వారే వీడియోల ద్వారా చూడొచ్చు. చంద్రబాబు కూటమి నాయకుల దుర్మార్గాలు మితిమీరుతున్నాయి...కడప స్టీల్ప్లాంట్కు 2023లో వైయస్.జగన్ శంకుస్థాపన చేశారు. మేం వేసిన రోడ్లమీదనే వాళ్లు ఇవాళ ప్రయాణించారు. స్టీల్ప్లాంట్కు అవసరమైన ఇన్ఫ్రా పనులు వేగంగా నడిచాయి. అమరావతి పనులకంటే వేగంగా అక్కడ జరిగాయి. వాటిని ఒప్పుకునే నైతికత చంద్రబాబుకు లేదు. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వారు లేరు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కూడా తానే మొదలుపెట్టానంటాడు. జత్వానే కేసును అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ కేసును అడ్డుపెట్టుకుని ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కక్షసాధిస్తున్నారు. వైఎస్ జగన్ పాలన కొనసాగి ఉంటే దాదాపు స్టీల్ప్లాంట్ నిర్మాణం ఇవ్వాళ్టికి కొలిక్కి వచ్చేది. గతంలో బ్రహ్మణి స్టీల్ప్లాంట్ను అడ్డుకున్నాడు. రాయలసీమలో స్టీల్ప్లాంట్ రావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. రాయలసీమకే కాదు, చంద్రగిరి, కుప్పంకూ మంచి జరగడం ఆయనకు ఇష్టంలేదు. రాయలసీమ లిఫ్ట్ను ఆపేసి, ఇవాళ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. దోపిడీ కోసమే అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
ఖబడ్దార్ లోకేష్.. టిప్పర్ తో నన్ను లేపేద్దాం అనుకున్నావా..? తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
-
జంగిల్ రాజ్తో డిఫెన్స్లో చంద్రబాబు!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిలలాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా! అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం..హే రామ్.. సేవ్ ఆంధ్ర! రాష్ట్రంలో జంగిల్ పాలన, 18 నెలల సీసీ టీవీ పుటేజి తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో! జీవించి ఉంటే ఎన్టీఆర్పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో!, రాజకీయ స్వార్ధంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి? మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్కు కట్టుబడి ఉంటాం.. ఎన్నికల మానిఫెస్టోలో పెడతాం! బాబు పాలన అంటే మోసం గ్యారంటీ!... ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో, ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు.హే రామ్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్న మాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, సీసీ టీవీ ఫుటేజీ గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డిటైల్డ్గా ప్రస్తావించారు.చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఆదారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి, దహనం చేసి, బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని ఆయన అన్నారు. తాను వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరే బాధ్యుడైన సర్కిల్ ఇన్ స్పెక్టర్పై చర్య తీసుకోవడం ఆరంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 18 నెలల సీసీ టీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో, డీజీపీ ఆఫీస్లో బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు.పోలీస్ కమిషనర్ను రక్షించడానికి డీజీపీ, ఈయనను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ, కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్టేషన్ వస్తుందని అని అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా! ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవి ఫుటేజీ మాయం, రౌడీషీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా? అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే యత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్కు తగునా అన్న ప్రశ్న వస్తుంది.జగన్ను తాను అనుకుంటే ఒక్క నిమిషంలో అరెస్టు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం అర్దవంతంగా లేదని చెప్పాలి. ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలువరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం వారితో గొడవజరుగుతున్న తీరును జగన్ వివరించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు లేదు.అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం వేదిస్తున్న తీరుపై జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయిజం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాదితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి రూ.20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా? అని ఆయన అడిగారు. అమరావతికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజ్గా మారిందని ఆయన అన్నారు.ఎన్టీ.రామారావు బతికి ఉంటే, గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవ చేశారు. నిజంగానే ఈ రెండేళ్లలో విపక్ష వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన, ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చిందన్న విమర్శలు జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓట్లు కోల్పోతే పేదలకు స్కీముల పరిస్థితి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు.అమరావతి విషయంలో జగన్ విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్గా ఉన్న మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, అదంతా అవినీతి అవుతుందా? అవ్వదా అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారు.నాడు మూడు ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావవిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే ఆయన అన్నారు. అమరావతికి, మావిగన్కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చెప్పలేకపోతున్నారు. తొలుత ఏభై వేల ఎకరాలు సేకరించడం, మళ్లీ మరో ఏభై వేల ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి సిద్దం అవడం, ఇప్పటికే సుమారు ఏభైవేల కోట్ల అప్పు చేయడం, ఇతర హామీలను అమలు చేయకపోవడం వంటివాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్.. సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈ దారుణాల వెనుక 'పెద్ద కుట్ర'
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర రాజధానిలో ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. ఒకటి లాకప్డెత్, మరొకటి బలవన్మరణం. ఈ మరణాల వెనుక పెద్ద కుట్ర ఉంది. పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్గా మారి హత్యలు చేస్తున్నారు. సీఐ నుంచి సీఎం వరకూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు.’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ గురువారం పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న బాధితుని ఇంటికి వెళ్లిన జగన్, క్రాంతికుమార్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్ను ఏ విధంగా వేధించారనేది జగన్కు బాధిత కుటుంబం వివరించింది. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పిన జగన్, ఆ ఇంటి వద్దనే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందని ఈ సందర్భంగా జగన్ అన్నారు. క్రాంతికుమార్ కుటుంబం కడు పేదరికంలో ఉందని, ఒక అమాయకుణ్ని వేధించి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిగజారిన పోలీస్ వ్యవస్థకు ఈ సంఘటన నిదర్శనమని, ఇంత జరిగినా, ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకా జగన్ ఏమన్నారంటే.. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రాష్ట్రంలో దిగజారిన పోలీస్ వ్యవస్థ ‘‘క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి, ఆ కుటుంబాన్ని చూస్తే హృదయవిదారకమైన పరిస్థితి కనిపిస్తోంది. క్రాంతి కుమార్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి, తండ్రి, నాయనమ్మ..ఇలా అందరూ కలిసి ఈ చిన్న ఇంటిలో పేదరికంలో బతుకుతున్నారు. వారి కుటుంబాన్ని ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. ఎనిమిదేళ్లుగా టాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్నాడు క్రాంతి కుమార్. అతనిపై ఎలాంటి కేసులు లేవు. అంతకు ముందు చిన్నా చితకా కేసులు ఉన్నా అవన్నీ కొట్టివేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్ను రోజూ పోలీస్ స్టేషన్కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నిండా నలభై ఏళ్లు కూడా లేని అలాంటి వ్యక్తిని ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు రోజూ స్టేషన్కు రమ్మని పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్ తన మరణ వాంగ్మూలం (సెల్ఫీ వీడియో రికార్డింగ్)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయకూడని పనులు చేయించారని ఆ వీడియోలో తన గోడును చెప్పుకున్నాడు. వాళ్లను వాళ్లు కాపాడుకుంటున్నారు ఇదంతా రాజధాని ప్రాంతం విజయవాడలో జరిగింది. చంద్రబాబు పక్కనే ఉంటారు. కళ్లదుటే సీపీ, డీజీపీ, హోం మంత్రి, ముఖ్యమంత్రి ఆఫీసులున్నాయి. తన కొడుకు ఆత్మహత్య తర్వాత, ఆ వీడియోను ఆయన తండ్రి సీపీకి చూపినా, పట్టించుకోలేదు. ఏ చర్యా తీసుకోలేదు. మరి తప్పు చేసిన వారిని ఎందుకు రక్షిస్తున్నారు. క్లియర్కట్గా రాజధానిలో ఒక రాకెట్ నడిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సీఐ నాగరాజుని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం చంద్రబాబు కాపాడుతున్నారు. ఎవరు పడితే వారు సీసీ ఫుటేజ్ తీసేయొచ్చా? కృష్ణలంక పొలీస్ స్టేషన్లో పరిధిలో ఒక నెల వ్యవధిలో రెండు మరణాలు జరిగాయి. ఒకటి లాకప్డెత్. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ కూడా లేదు. పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయింది. ఒక రిమాండ్ రిపోర్టులో మే 1 నుంచి జూన్ 1 వరకు ఒక నెల రోజుల ఫుటేజ్ లేదన్నారు. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్ లేదన్నారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్ తీసేయొచ్చా. మరి బ్యాకప్ ఉండదా?. అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు న్యాయం జరిగేలా అండగా నిలబడతాం ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా బాధితులకు మా పార్టీ తరపున అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతాం’’ అని జగన్ స్పష్టం చేశారు.‘సిండికేట్’ మర్డర్లు రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా భావించే విజయవాడ నడి»ొడ్డున ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. అది కూడా పోలీసుల వేధింపుల వల్ల. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్సయిందని అడగండి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరెస్టయిన సీఐ తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు. అంటే ఈ సంఘటనల వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అర్థం అవుతోంది. సీపీకి ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారు. నేను బాధితుల పక్షాన నిలబడటం వల్ల కనీసం 46 రోజుల తరువాతయినా దారుణాలు బయటకు వచ్చాయి. లేదంటే మరుగున పడేసేవారు. పోలీసుల సాయంతో సిండికేట్గా మర్డర్లు చేస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. -
న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులా?
ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నిరుపేద యాదవ గొర్రెల కాపరులపై జరిగిన దారుణ హత్యాయత్నాన్ని నిరసిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని యాదవ సంఘాలు అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఈదుముడి గ్రామంలో గొర్రెల కాపరుల తలలు పగలగొట్టి, కులం పేరుతో దూషించిన అరాచక శక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో పంపించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. బాధితుల పక్షాన నిలబడి గొంతెత్తిన నాగార్జున యాదవ్ గారిపై కేసు నమోదు చేయడం ఈ రాష్ట్రంలో నడుస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. ప్రభుత్వ తప్పులను ఎండగడితే నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు కాక శ్రీనివాస్ అనే వ్యక్తితో కూటమి ప్రభుత్వం కావాలనే ఈ తప్పుడు ఫిర్యాదు చేయించింది.‘నడిరోడ్డుపై రక్తం చిందించిన యాదవ బిడ్డల ప్రాణాల కంటే, కులం పేరుతో జరిగిన అవమానం కంటే ఈ ప్రభుత్వానికి తమ 'ఇమేజ్' ముఖ్యం అయిపోయిందా?డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ శేషగిరిరావు వంటి అధికారులు చట్టాన్ని తమ సామాజిక వర్గం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, పాలకుల బానిసలుగా మారి విపక్ష నేతలపై అక్రమ కేసులు రాస్తున్నారు.ఓట్ల కోసం బీసీలు, యాదవులు కావాలి కానీ.. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? మీ అహంకార కుల రాజకీయాలకు యాదవ సమాజం చరమగీతం పాడటం ఖాయం.యనమల నాగార్జున యాదవ్పై పెట్టింది కేవలం ఒక వ్యక్తిపై కేసు కాదు.. ఇది న్యాయం కోసం గొంతెత్తిన మొత్తం యాదవ, బీసీ సామాజిక వర్గంపై పెట్టిన కేసుగా భావిస్తున్నాం’ అని యాదవ సంఘాలు స్పష్టం చేశాయి.26 నెలల్లో నాపై పెట్టిన అక్రమ కేసులు 12: నాగార్జున యాదవ్‘ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నిరుపేద యాదవ గొర్రెల కాపరులపై టీడీపీ నాయకులు కులం పేరుతో అత్యంత హేయంగా దూషించి, గడ్డపారలు, రాడ్లతో ప్రాణాంతకంగా దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు.ఒక బాధ్యతగల బీసీ బిడ్డగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా.. మా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేను, పలు బీసీ, యాదవ సంఘాలతో కలిసి ఆ అమాయక బాధితుల పక్షాన నిలబడ్డాము. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపి, స్వయంగా కలెక్టర్ గారిని కలిసి న్యాయం చేయమని వినతిపత్రం ఇచ్చాను.నిరుపేదలపై జరిగిన దారుణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే.. గద్దపారలతో సాటి మనుషుల తలలు పగలగొట్టిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో పంపించి, బాధితుల కోసం గొంతెత్తిన నాపై ఎదురు కేసులు పెట్టించడం దుర్మార్గం కాకపోతే ఇంకేంటి?, శాంతిభద్రతలను కాపాడాల్సిన కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి, కూటమి పార్టీల నాయకులకు ప్రైవేట్ సైన్యంగా, ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 26 నెలల కాలంలో నాపై పెట్టిన అక్రమ కేసులు ఏకంగా 12కు చేరాయి!‘2024 కంటే ముందు నాపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా లేదు. నారా లోకేష్ . తప్పుడు కేసులు, అర్థం లేని బెదిరింపులు, అర్థరాత్రి అరెస్టులతో వైఎస్ జగన్ గారి సైనికులను, ఆయన కోట్లాది మంది అభిమానులను ఆపడం మీ తరం కాదని మీరెప్పుడు తెలుసుకుంటారో పాపం!, మాపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని కుట్రలు చేసినా జగనన్న పక్షాన నిలబడి మీ అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. ఏదేమైనా.. మా జగనన్న కోసం, సామాన్యుల న్యాయం కోసం తగ్గేదేలే!’అని స్సష్టం చేశారు. -
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ
-
నా హత్యకు పరిటాల సునీత కుట్ర: తోపుదుర్తి
అనంతపురం: వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయన్నారు. తనను చంపేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబు కుట్ర పన్నారని అన్నారు.శింగనమల వద్ద తన వాహనాన్ని ఢీకొని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, తన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందన్నారు. తన వాహనం పైకి దూసుకొచ్చింది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కు చెందిన టిప్పర్ అని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాకు గన్ మెన్లు తొలగించారని అన్నారు. శత్రువుల నుంచి ప్రాణహాని ఉంది కనుకే నాకు పదేళ్లుగా గన్ మెన్ల సౌకర్యం ఉందని, తన సోదరుడు తోపుదుర్తి రాజా పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. హత్యలు చేయించడం, అక్రమ కేసులు బనాయించటమే మంత్రి నారా లోకేష్ నైజమా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రికి భయం ఎందుకో?
సాలూరు రూరల్: సాటి గిరిజన మహిళ అని కూడా చూడకుండా ప్రతిపక్ష పార్టీ ముద్రవేసి ఉద్యోగంలో నుంచి తీసివేయించినా మంత్రి సంధ్యారాణికి మంట చల్లారలేదా? అంటే అవుననే సమాధానం గిరిజనం నుంచి వినిపిస్తోంది. బాధిత మహిళ తనను ఎక్కడ నిలదీ స్తుందోనన్న భయంతో పోలీసుల సాయంతో ఆమెను గృహ నిర్బంధం చేయించడం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని అన్నంరాజువలస పంచా యతీ చెరుకుపల్లి గ్రామంలో నివాసముంటున్న గాదిపల్లి ప్రశాంతి ఇంటిని బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముట్టారు. అంతేకాకుండా ఆమెను మీరు ఇంట్లోనే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ఈ విషయమై అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? ఏంజరుగుతుందో తెలియని ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నంరాజువలస గ్రామంలో గిరిజన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి బుధవారం హాజరయ్యారు. అయితే సమావేశంలో మంత్రిని ఎక్కడ ప్రశాంతి ప్రశ్నిస్తుందోననే అనుమానంతో ముందస్తుగా పోలీసులతో గృహ నిర్బంధం చేశారని స్పష్టమవుతోంది. దీనికి కారణం గతంలో కేజీబీవీలో ప్రిన్సిపాల్గా పనిచేసిన ప్రశాంతిని కనీసం పీటీజీ మహిళ అని చూడకుండా మంత్రి సంధ్యారాణి ఉద్యోగంలోంచి తీసేయించారు. కారణం చిన్నదే అయినా కేవలం ఆమెకు గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సూచన మేరకు వచ్చిన ఉద్యోగం అన్న అక్కసుతో పూర్తిగా విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె మంత్రి, అ«ధికారుల చుట్టూ తిరిగినా కనికరించలేదు. దీంతో విసిగిపోయిన ఆమె ప్రస్తుతం పోటీ పరీక్షలకు చదువుకుంటోంది. ఇలాంటి సమయంలో అసలు గతం మరిచిపోయి తన పని తాను చేసుకుంటున్న ఆమెను అకస్మాత్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేసి మానసిక వేదనకు గురిచేశారని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఊరంతా వైఎస్సార్సీపీ అభిమానులే అన్నం రాజువలస పంచాయతీ ప్రజలంతా వైఎస్సార్సీపీ అభిమానులే. నేను ఎంత చేసినా నాకు ఓటు వేయరని మంత్రి సంధ్యారాణి అన్నా రు. బుధవారం అన్నం రాజువలస గ్రామంలో గిరి జన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నంరాజువల గ్రామస్తులు పూర్తిగా వైఎస్సార్సీపీకి చెందిన వారన్నారు. రాజన్నదొర ఈ గ్రామానికి ఏంచేశారో చెప్పాలన్నారు. మీకు అన్ని విధాలా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మానసికంగా కుంగిపోయానునేను ఎంఏ బీఈడీ చదివాను. 2019లో కేజీబీవీ ప్రిన్సిపాల్గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో గజపతినగరంలో చేరాను. 2022వ సంవత్సరంలో కరాసువలస కేజీబీవీకి బదిలీపై వచ్చాను. 2025 ఏప్రిల్ 9న మంత్రి సంధ్యారాణి పాఠశాల పరిశీలనకు వచ్చినప్పుడు పిల్లలకు వండిన వంటలు మెనూ ప్రకారం లేవని తనతో పాటు నలుగురు వంట ఆయాలను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పలుమార్లు మంత్రి సంధ్యారాణి వద్దకు వెళ్లి ఉద్యోగం తిరిగి ఇప్పించండని వేడుకున్నాం. మీరు వైఎస్సార్సీపీకి చెందిన వారని, ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సెల్లో పలుమార్లు ఆర్జీ పెట్టాను అయినా అధికారులు స్పందించలేదు. కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగ బాధ్యతలో పడి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా పోలీసులు అకస్మాత్తుగా వచ్చి ఇంటి ముందు కుర్చీ లు వేసుకుని కూర్చోవడంతో కొంత సమయం అర్థం కాలేదు. చివర కు మంత్రి సంధ్యారాణి నా ఉద్యో గం తీసేసిన విషయంలో ఎక్కడ నిలదీస్తానో అనే భయంతో పోలీసులను కాపలా ఉంచారని అర్థమైంది. సాటి గిరిజన మహిళ అని చూడకుండా నాపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సంధ్యారాణి ఇంకా నన్ను వెంటాడుతుంటే భయమేస్తోంది. – గాదిపల్లి ప్రశాంతి చెరుకుపల్లి గ్రామం అన్నంరాజువలస పంచాయతీ -
Watch Live: క్రాంతి కుమార్ ఇంటికి వైఎస్ జగన్
-
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్ఫుల్గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జర్నలిస్ట్ KVR ని చూపించండి అంటే... సీఐ తన సొంత ప్రాపర్టీలా ఫీల్ అయిపోతున్నాడు
-
పతనం ఖాయమనే ‘సర్’లో కుట్రలు
స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్లో వారికి పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా.. వేయరా.. అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయం కాదు. - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: చంద్రబాబు తన పతనం ఖాయమని నిశ్చయించుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాటా్లడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫామ్స్ జారీ చేయకుండానే ఇచ్చేసినట్టు రాసేసుకోవాలని చంద్రబాబు ఆర్డీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారని మండిపడ్డారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించలేదనే సాకుతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే కుట్రకు తెరలేపుతున్నారన్నారు. అసలీ మనిషికి మానవత్వం ఉందా.. అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్లో పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా? వేయరా? అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయమా? ఓట్లు తొలగించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇందు కోసం మై టీడీపీ యాప్ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈఆర్వో హోదాలో ఉన్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్.. మంత్రి నారాయణతో చర్చించిన ఆడియో బయటకు వచ్చింది. ఇలా నేరుగా మంత్రులు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు. అధికారులు దగ్గరుండి దుర్మార్గాలు చేస్తుంటే వ్యవస్థలు ఎలా బాగుపడతాయి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
హే రామ్..సేవ్ ఆంధ్ర
‘‘సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.’’‘‘సాయికృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్లను చిన్న చిన్నోళ్లకు పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ’’‘‘18 నెలల సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యం? ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడమేమిటి? ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే... కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు?’’ ‘‘అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439.’’ ‘‘రెండేళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది.’’‘‘జంగిల్ రాజ్ అంటే బిహార్లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా వారిని నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టిన ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టం) పక్కకు పోయి మొత్తం ‘రూల్ ఆఫ్ ఫియర్’(భయం) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఇక్కడ జంగిల్రాజ్ పాలన సాగుతోంది.’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎత్తిచూపారు. సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడతాయని అన్నారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’’ అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ఆయుధంగా మార్చుకుని.. వ్యవస్థలను దిగజార్చి సాగిస్తున్న భీతావహపాలనను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది.. ‘‘రెండేళ్ల క్రితం వరకు ఏ ఇంట్లో అయినా.. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే? చట్టం, న్యాయం (రూల్ ఆఫ్ లా) పక్కకు పోయి భయం(రూల్ ఆఫ్ ఫియర్) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.... ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయివ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే. రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పింది. పాలించే వారిలో భయమనేది పోయింది. మనం మనుషులమేనన్న సంగతి మరిచిపోయి, ఒక మనిíÙని మనం ఏం చేసినా అడిగే వాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పు కాదా? విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్ అనే అబ్బాయి వీడియో చేసి మరణవాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం సంతకవిటికి చెందిన కళావతి కేసు రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దంపడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిíÙని దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసి, చివరికి శవం కూడా మాయం చేసి ఆ శవం ఎక్కడ ఉందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు కూడా బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగింది. ఇది రాజధానిలో.. చంద్రబాబు ఇంటికి ఆమడదూరంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోయిన ఘటన ఇది. ఒక్కొక్కటిగా ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి కోసం ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ ఎదురు దాడి చేయడమే కాకుండా.. తమకు తానా తందానా అనే ఎల్లో మీడియాలో ఇదే మాదిరిగా రాతలురాయిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ఫోర్స్ పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు అప్పగించిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? ఈ ఘటన మే 6వతేదీన జరిగింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు ఇదే విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. కానీ సీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?మరో ఘటనలో దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చావుకు కారణం ఇదే కృష్ణ లంక పోలీస్ స్టేషన్, ఇదే సీఐ కారణమని చెబుతూ మరణవాంగ్మూలం ఇచ్చిన ఘటన కూడా ఇదే సీపీ పరిధిలో జరిగినా సీపీ, డీజీపీలు ఏం చేస్తున్నారు? క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? తనకొడుకు సాయి కృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకుంటే విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణవాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్ల్లో కూడా చిన్న చిన్నోళ్లను పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ఇంతగా బరితెగించి సీఐ నుంచి డీజీపీ వరకు అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును కవరప్ చేస్తున్నారని అడుగుతున్నా ? అసలు ఈ ఘటన ఇంత పెద్దది కాకపోయినా, జగన్ వెళ్లకపోయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేది కాదు.. పూర్తిగా కవరప్ చేసేవారు. ప్రశ్నిస్తే ఎన్టీఆర్ను కూడా రౌడీషీటర్ అనే వారు.. నిజంగా విలన్లను ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. కానీ చంద్రబాబు రూపంలో ఇక్కడే మన కళ్లెదుటే మనకు విలన్లు కన్పిస్తున్నారు. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు రౌడీషీటర్లట..రౌడీలను పెట్టుకుంది నువ్వు. దాడి చేసింది, కొట్టించింది, కారు అద్దాలు పగలు కొట్టింది నువ్వు. తిరిగి మా వాళ్లను రౌడీలంటావా? నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే.. చంద్రబాబును ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండి ఉంటే.. ఆయన్ని కూడా రౌడీషీటర్ అనే వారు. ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే. చంద్రబాబును ప్రశ్నిస్తే రౌడీషీటర్ అంటారు. చంద్రబాబు పాలనలో ఎవరికైనా ఎక్కడైనా రక్షణ ఉంటుందా? అని అడుగుతా ఉన్నా. వీడియోలలో.. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్.. ధ్వంసమైన కారు.. రాయి పట్టుకుని ఉన్న టీడీపీ నేతలు పెంచలయ్య, మట్టిమాఫియా నేత నాగరాజు.. టీడీపీ గూండాలను దాడికి పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ.. కనిపిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారు. కారు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్కు దెబ్బలు తగిలాయి. మా వాళ్ల మీద ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్ బోర్డరా? కొంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటి వరకు మా వాళ్లు పెట్టిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదు. ఏ తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేయలేదు.. నిజంగా రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూములు ఎందుకయ్యా అని ఆ రైతులు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు తమ బినామీలకు, నాయకులకు ఆ భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. నీ స్వార్థం కోసం భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా? అని రైతులు నిలదీస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టనర్ అధికారిక ప్రకటన చేయగలరా?అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్ర పూరితంగా సీసీ ఫుటేజ్, శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లోమీడియాలో అక్షరం ముక్క రాయరు. పైగా తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తారు. రౌడీ షీటర్కు సపోర్ట్ చేస్తారా అంటూ ఎదురుదాడి చేస్తారు. ఈ టాపిక్ను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగా తెరపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతుల్లో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని దొంగ కేసులు పెడతామని, చంపుతామని, శవాలు మాయం చేస్తామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? అని చంద్రబాబును, ఆయన పార్టనర్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కవరప్లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్ను వెనకేసుకొస్తారా అని ఎదురు దాడి చేశారు. జనం ఎప్పుడైతే ఛీ కొట్టడం మొదలు పెట్టారో వెంటనే యూ టర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను సెక్రటేరియట్కు పిలిపించుకుని పక్కన కూర్చో పెట్టుకొని చేయి పట్టుకుని న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. ఏకంగా 46 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.నేను వెళ్లాకే అరెస్టులునేను వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్లు ప్రారంభించారు. 46 రోజుల పాటు ఈ కేసును ఎందుకు తొక్కిపెట్టారు, అసలు ఏం జరిగింది? దీనికి వెనుక ఉన్న పెద్దల మీద చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిపైన లేదా అని అడుగుతున్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ చంద్రబాబులో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కన్పించలేదు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే.. సాగుతున్న దర్యాప్తును ఒక్కసారి గమనిస్తే కేసును నిర్వీర్యం చేసేందుకు, పైవాళ్లను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సహా చాలా స్పష్టంగా కన్పిస్తుంది.18 నెలలుగా సీసీ ఫుటేజ్ లేదంటున్నారు.. ఇంకెన్ని హత్యలు జరిగాయోమోసపూరిత కుట్ర ఎంత లోతుగా ఉందో మరో ఉదాహరణ... కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్లు ఫైల్ చేసిన మొదటి రిమాండ్ రిపోర్టులో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వీడియో ఫుటేజ్ లేదని రాశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల రిమాండ్ రిపోర్టులో 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రాస్తారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యమని అడుగుతున్నా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడానికి ఎలా కుదురుతుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే.. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు? ఒకచోట డిలీట్ చేస్తే మరొక చోటైనా ఉంటుంది కదా? సీపీ, డీజీపీ కార్యాలయాల్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. స్టేషన్లో ఫుటేజ్లో లేదంటున్నారు. విజయవాడలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేస్లలో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఏమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా సాయికృష్ణ శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో? ఏం చేశారో కనుక్కోవచ్చు కదా.. కానీ సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నాం. మ్యాట్రిక్ సిస్టమ్, క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుందని తెలిసినా దాన్ని సిట్ ఎందుకు స్వాదీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. సీఐతో పాటు సంబంధిత పోలీస్ బాసుల ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయడంలేదు? ఆశ్చర్యమేమిటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుళ్ల ఫోన్లు నాగపూర్లో అమ్మేశారని చెబుతున్నారు. మనిషిని చంపేశారు. శవాన్ని కన్పించకుండా చేశారు. వీడియో ఫుటేజ్ మాయం చేశారు. ఫోన్లు నాగపూర్లో అమ్మేశారు. రాజధాని ప్రాంతంలోనే సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మానవ హక్కులకు విలువ లేదా? యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు..చంద్రబాబు పాలనలో వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్లు ఈ విధంగా కుమ్మక్కవడం కొత్తేమీ కాదు. ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజ్ మాయంతో సహా ఆధారాలు నాశనంచేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, న్యాయ స్థానాలను పక్కదోవపట్టించడం, చివరకు కొన్ని కేసుల్లో పోలీసులే స్వయంగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టి మరీ కేసులు పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. రెండేళ్లుగా రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో చూశాం. ఒకర్ని పిన్ పాయింట్గా గుర్తించడం, వాళ్లను బలవంతంగా కేసుల్లో ఇరికించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా నైతికత, విలువలు లేకుండా పోయాయి. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగిల్ రాజ్ అనక ఇంకేమనాలి. జంగిల్ రాజ్ అంటే బిహార్లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుల బృందం ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరిగిందో మనమంతా చూశాం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రాజధాని ప్రాంత రైతులు పడుతున్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు..రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా బాధితులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నేతలనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెడుతున్న ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఇదే మీటింగ్ హాలులో ఇటీవలే రాజధాని గ్రామాలకు చెందిన రైతులు నన్ను కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు ఒక కమిటీని, లీగల్ టీమ్ను ఏర్పాటు చేశాం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు చూపుతాం.. మీరు రండి అని రైతులు అడిగితేనే మా పార్టీ బృందం అక్కడకు వెళ్లింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్ల అద్దాలు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మళ్లీ తిరిగి మా వాళ్లే దాడులు చేసినట్టుగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. భూములివ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరిట వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం, ఇంకా దారుణంగా కొండవీటి వాగును వీరి భూముల్లోకి మళ్లించి వాళ్ల భూములు చుట్టూ నీళ్లు నింపేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు భూములు వదిలేసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది.అమరావతిలో ప్రతీ పనిలోనూ దోపిడీయే..అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పక్కన తెలంగాణ సెక్రటేరియట్ 10 లక్షల ఎస్ఎఫ్టీలకు మించి లేదు. ఇది దోపిడీ కాదా ? అని అడుగుతున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ నగరం తీసుకున్నా 5స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. చివరికి జాతీయ రహదారి నిర్మాణం కిలోమీటర్కు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అమరావతిలో ఎంతో తెలుసా ? కిలోమీటర్కు సగటున రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి చేస్తున్న అన్యాయం, మోసం, అమరావతి పేరిట చేస్తున్న దోపిడీ బయటకు రాకూడదనే ఈ దాడులకు పాల్పడుతున్నారు. -
నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు పారేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని చెప్పుతో కొడతానంటూ దూషణకు దిగారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు. కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది. అప్పటిలోగా వైఎస్సార్సీపీ నేతలకు సినిమా చూపిస్తా’’ అంటూ ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు దిగారు.ఇవాళ జిందాల్ స్టీల్ సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన జిందాల్ స్టీల్కు మళ్ళీ శంకుస్థాపనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ హయాంలోనే భూమి పూజ పూర్తయి, పనులు కూడా ప్రారంభమైన జిందాల్ స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడటాన్ని ప్రజల ముందు ఉంచడానికి వైఎస్సార్సీపీ చలో జిందాల్ కార్యక్రమం తలపెట్టింది. ఈ సందర్భంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆదినారాయణరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. -
తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి తప్పిన ప్రమాదం
సాక్షి, అనంతపురం: రాప్తాడు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా టిప్పర్ దూసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనాన్ని టిప్పర్ స్వల్పంగా ఢీకొంది. శింగనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్గా గుర్తించారు. ఘటనను ఎస్పీ దృష్టికి తోపుదుర్తి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎవర్ని మోసం చేయడానికి బాబు మళ్లీ భూమి పూజ చేస్తున్నాడు?
-
జమ్మలమడుగులో టెన్షన్ ... టెన్షన్
-
ప్రైవేట్ చేతుల్లోకి ఆర్టీసీ భూములు
-
YSRCP నేతలను అరెస్ట్ చెయ్యొద్దు... హై కోర్టు క్లారిటీ
-
NTR బతికుంటే ఆయన్ని కూడా.. బాబు ఎలాంటి వాడో జగన్ మాటల్లో
-
సాయికృష్ణ కేసులో నీకెందుకంత ఆసక్తి? డీజీపీని ఎందుకు కాపాడుతున్నావ్? గుట్టు విప్పిన జగన్!
-
సమాధానం చెప్పడం చేతకానప్పుడు ఛాలెంజ్ లు ఎందుకు?
-
లైవ్ లో ఫోటోలు.. వీడియోలు చూపిస్తూ జగన్ ఫైర్
-
నేను అమరావతికి వెళ్లలేక కాదు వెళ్తే జరిగేది ఇది అందుకే... బాబుని ఇచ్చిపడేసిన జగన్
-
540 మంది చనిపోతే చలించని బాబు రెండు కాడెద్దులు చనిపోతే మాత్రం... జగన్ సెటైర్లు నవ్వులే నవ్వులు
-
అసలు నువ్వు ముఖ్య మంత్రివేనా..??
-
అమరావతి రైతులు కాదు. టీడీపీ గూండాలు ఇవిగో సాక్ష్యాలు
-
విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఎక్కడా నైతిక విలువల్లేవ్.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. జంగిల్రాజ్ అంటే ఎక్కడో బిహార్లో లేదు.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు పాలన రూపంలో కనిపిస్తోంది’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గత 18 నెలలుగా వరుసగా కొనసాగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనమని అన్నారాయన. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు జంగిల్రాజ్పై ధ్వజమెత్తారు. బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్ టీంను ఏర్పాటు చేశాం. రైతుల ఆహ్వానం మేరకు వాళ్లు అక్కడ పర్యటించబోయారు. అయితే.. టీడీపీ గూండాలు వాళ్లను అడ్డుకుని దాడులు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు భౌతిక దాడులు చేశారు. దాడిలో ఓ కానిస్టేబుల్కు సైతం గాయాలయ్యాయి. టీడీపీ గూండాలే ఆ దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి.(లోకేష్తో దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు దిగిన ఫొటోలను వైఎస్ జగన్ ప్రదర్శించారు..) ఆశ్చర్యకరంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ అల్లర్లలో ఒక్క టీడీపీ నేతను అరెస్ట్ చేయలేదని.. చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమని జగన్ అన్నారు. బాధితులకే నిందలు మోపడం, వారిపైనే కేసులు పెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.భూమి ఇవ్వని రైతులను భూసేకరణపేరుతో వేధిస్తున్నారు. కొడవీటి వాగును బలవంతంగా రైతుల పొలాల్లోకి తరలించారు. రాజధాని ప్రాంత రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇంకా భూముల అవసరం ఏముంది?. భూములు లాక్కుని ఎందుకు వెళ్లగొడుతున్నారని రైతులు అడుగుతున్నారు?. రైతులు పడే అవస్థలు బయటకు రావొద్దనే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. రైతులకే కాదు.. ఆయన పాలనలో ఎవరికీ రక్షణ లేదు. పశ్నిస్తే రౌడీ షీటర్లు అని ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్ బతికే ఉంటే.. ఆయనకు ప్రశ్నించే సమయం ఉండి ఉంటే.. ఆయన్ని కూడా చంద్రబాబు రౌడీ షీటర్ అనేవారేమో. విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు. వైఎస్ జగన్ అన్నారు. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతల అడ్డగింత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలను పోలీసులు ముందుకు కదలనివ్వలేదు.ఈ క్రమంలో పోలీసులు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇక, స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం కచ్చితంగా జిందాల్ స్టీల్స్ పరిశీలించి తీరుతామని చెబుతున్నారు. -
రేపు ఉదయం విజయవాడకు వైఎస్ జగన్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(గురువారం) ఉదయం విజయవాడులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పేరపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, క్రాంతి కుమార్ ఇటీవల సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి, చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. SIR పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ జరుగుతోందన్నారు. హే రామ్.. సేవ్ ఆంధ్రా అని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..కూటమి ప్రభుత్వం రాక ముందు ఏపీలో ప్రజా సంక్షేమం గురించే చర్చ జరిగేది.మా హయాంలో సంక్షేమం గురించి చర్చ జరిగింది.చంద్రబాబు వచ్చాక రెడ్బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోంది.రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయింది.పోలీసు స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి.బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్ల మీదనే అంతటా చర్చ జరుగుతోంది.న్యాయం, ధర్మం గాడితప్పి వ్యవస్థ దిగజారిపోయింది.ఏపీలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోంది.చంద్రబాబు దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు.కూటమి గుప్పిట్లో వ్యవస్థలు.. సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి ఘటనలు..రాష్ట్రంలో భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయి.జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారు.చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.ఎవరూ ఏం చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.కస్టడీలోనే చంపి మృతదేహం కూడా మాయం చేశారు.కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వలేదు.చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలో ఈ ఘటన జరిగింది.రాష్ట్ర ప్రజలు నెవ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయి.చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదట.ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేయిస్తారు.క్రిమినల్స్కు మద్దతిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. ఎల్లో మీడియా తందానా..రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా?.సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అన్నారు.రౌడీషీటర్ని వెనకేసుకుని వస్తారా అన్నారు.ప్రజల నుంచి ఛీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు.46 రోజులు సాయికృష్ణ కేసును తొక్కిపెట్టారు.బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా?.సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే అంతా తెలుస్తుంది.పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.చంద్రబాబు, ఆయన పార్ట్నర్ను సూటిగా ప్రశ్నిస్తున్నా.రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా?? సీపీ, డీజీపీ బాధ్యులు కారా?సీఐని సీపీ కాపాడుతాడు.. సీపీని డీజీపీ కాపాడుతాడు..డీజీపీని చంద్రబాబు కాపాడుతారు.సీపీ ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ఫోర్స్ కృష్ణలంక పీఎస్లో సాయికృష్ణను అప్పగించింది.సాయికృష్ణ బంధువులు డీజీపీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగితే సీపీ పట్టించుకోలేదు.ఈ ఘటనలన్నీ దిగజారిపోతున్న వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.కన్న కొడుకు కోసం ఒక తల్లి పడే వేదనకు విలువ లేదు.జగన్ వెళ్లిన నాలుగు రోజులకు గానీ అరెస్ట్లు జరగలేదు.చిన్నచిన్న వాళ్లను అరెస్ట్చేశారు.జగన్ వెళ్లకపోయి ఉంటే సాయికృష్ణ కేసే ఉండేది కాదు.క్రాంతి కుమార్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.మరో తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.మే ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి వరకు సీసీ ఫుటేజ్ లేదట.18 నెలలుగా సీసీ ఫుటేజ్ తొలగించినట్టు కానిస్టేబుల్ అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.18 నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో?.సీఐ, సీపీ, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులను చేయవద్దు?.ఈ కేసులో చంద్రబాబుకు ఉన్న ఇంట్రస్ట్ ఏంటి?.నేరాన్ని కప్పిపెట్టిన సీపీ, డీజీపీ బాధ్యులు కారా?. డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?..పీఎస్లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ ఫుటేజ్ ఏమైంది?.డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?.విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీ ఫుటేజ్ ఏమైంది?.మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు కదా?.సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు?.క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుంది.క్లౌడ్ సర్వర్లలో ఫుటేజ్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.పోలీసు బాస్ల కాల్ రికార్డులు పరిశీలించారా? లేదా?.కానిస్టేబుల్స్ ఫోన్లు నాగ్పూర్లో అమ్మారని పేర్కొన్నారు.విజయవాడలో సామన్యుడి పరిస్థితి ఏంటి?.హెడ్క్వార్టర్లలోనే ఇలా పరిస్థితి ఉంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఏంటి?మానవ హక్కులకు విలువ ఎక్కడుంది?.కోర్టులను తప్పుదోవ పట్టించడం చంద్రబాబకు అలవాటే. ఆంధ్రలోనే జంగిల్రాజ్..బాధితులే నిందితులా?.చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు.రైతుల కోరిక మేరకు అమరావతిలో మా పార్టీ నేతలు పర్యటించారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెడుతున్నారు.రాజధాని రైతులంతా ఇటీవల నన్ను కలిశారు.మా పార్టీ నేతలపై హత్యాయత్నం చేశారు.మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలపై దాడులు చేశారు.చంద్రబాబు చేసే దారుణాలపై ప్రశ్నించడం తప్పా?.భూమి ఇవ్వని రైతులను భూసేకరణ పేరుతో వేధిస్తున్నారు.భూమి ఇవ్వని రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్నారు.రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు.కొండవీటి వాగు నీటికి పొలాల్లోకి బలవంతంగా మళ్లించారు.విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉన్నారు.అమరావతిలో రైతుల తరఫున నిలబడితే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు.మా పార్టీ నేతలపైనే దాడి చేసి, మాపైనే కేసులు పెడుతున్నారు.రైతులకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నేతలంతా రౌడీషీటర్లా?.పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు.రెండేళ్లుగా రెడ్బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.జంగిల్ రాజ్ ఎక్కడో బీహార్లో లేదు.. ఆంధ్రాలోనే కనిపిస్తోంది.కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ..చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా రౌడీషీటర్ల ముద్ర వేస్తారు.ఎన్టీఆర్ ఉండి బాబును ప్రశ్నించినా రౌడీషీటర్ ముద్ర వేసేవారు.ఉండవల్లిలో దాడులు చేసింది టీడీపీ నేతలే.పోలీసుల సమక్షంలోనే రాడ్లతో దాడులు చేశారు.తప్పులు చేసేది మీరు.. కేసులు మాత్రం మాపై పెడుతున్నారు.దాడులు చేసిన ఒక్క టీడీపీ నేతను కూడా అరెస్ట్ చేయలేదు.రాజధాని రైతులు ఏం తప్పు చేశారు.అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు.ఇంకా భూములు ఎందుకు అని రైతులు అడుగుతున్నారు.బాబు బినామీలకు కట్టబెట్టడానికే మళ్లీ భూసేకరణ.కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు రూ.4645గా నిర్ణయించింది.అదే చంద్రబాబు మాత్రం సెక్రటేరియట్ కోసం రూ.20439 ఖర్చు చేస్తున్నారు.కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు పాలన.. మోసం గ్యారంటీ..ఇన్పుట్ సబ్సిడీకి చంద్రబాబు మంగళం పాడారు.ఉచిత పంటల బీమా కింద రూ.3500 కోట్ల బకాయిలు పెట్టారు.రైతులకు చేసిన మోసాలే.. బాబు గ్యారంటీలుగా కనిపిస్తున్నాయి.వరుసగా రెండో ఏడాది పొగాకు ధరలు పడిపోయాయి.మా హయాంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్లం.పొగాకు రైతులకు మా హయాంలో భరోసా ఉండేది.రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు సమస్యలే కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టవు.రైతుల ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే.మా హయాంలో మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం.ఆర్బీకే పరిధిలోనే రైతులు సమస్యలను పరిష్కరించే వాళ్లం.మా హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండేది.ఉచిత పంటల బీమా పూర్తిగా రద్దు చేశారు.పొగాకు రైతులను ఆదుకున్నామని ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు.రాష్ట్ర పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు.చంద్రబాబు చేసేది అవినీతి, దోపిడీ, రెడ్బుక్రాష్ట్రంలో ఆక్వా రంగం కుదేలైంది.మేము ఆక్వా రంగంలో చట్టం తెచ్చి రైతులను ఆదుకున్నాం.అసలు చంద్రబాబు పాలన చేస్తున్నాడా? లేదా?:మా ప్రభుత్వం ఒక చట్టంచేసి, సీఎం ఛైర్మన్గా “APSADA అప్సడా’ ఏర్పాటు చేస్తే ఫీడు, సీడుసహా, ఆక్వా కొనుగోలు ధరలను రెగ్యులేట్ చేశాంఅలాంటిది అప్సడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే,చట్టాన్ని బేఖాతరు చేస్తూ కంపెనీలన్నీ కూడా కార్టెల్ కింద తయారయ్యాయి.ఏప్రిల్ ఒక దఫా, జూన్లో మరో దఫా మొత్తం కిలోకు ఫీడ్ ధర రూ.14 -16ల వరకూ ధరలు పెంచారు.మరోవైపు ఈ కార్టెల్ సిండికేట్ వల్ల, ఫీడ్ ధరలు ఓవైపు, మరోవైపు రేట్లు చూస్తే,పంట చేతికి వచ్చే సమయానికి రేట్లు క్రాష్ చేస్తున్నారు. 100 కౌంట్ రొయ్యలు రూ.270 నుంచి రూ.220- 240 మధ్య పడిపోయాయి.రైతుల తీవ్ర ఆందోళనలు, వారికి మద్దతుగా పోరాటాలు చేస్తామన్న మన పార్టీ నుంచి హెచ్చరికల నేపథ్యంలోకిలోకు రూ.4లు తగ్గిస్తామంటూ హడావిడి చేశారు.తన ఎల్లోమీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు.తీరాచూస్తే తగ్గింది కేవలం రూ.2లు.వాళ్లు పెంచింది రూ.14-16లు.తగ్గింది కేవలం రూ.2లు. పెంచింది ఎక్కడ? తగ్గించింది ఎక్కడ?.మామిడి రైతులకు అన్యాయం..గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం మన కళ్లముందే చూశాం.పంట అంతా అయిపోయాక చివర్లో రైతులకు కిలోకు రూ.12లు ఇస్తామన్నారు.రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం, రూ.8లు కంపెనీలు.కానీ ఏ కంపెనీ కూడా రూ.8లు రేటు ఇవ్వలేదు.రూ.4-5లతో సరిపెట్టాయి.ఇవ్వాళ్టికీ రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయలేదు.రైతులు రోడ్డెక్కడంతోపాటు, వారికి మద్దతుగా నేను కూడా బంగారుపాళ్యం వెళ్లి, అక్కడ పరిస్థితులను స్వయంగా చూశానుమళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది:ఒక కిలో మామిడికి రైతులు పెట్టే పెట్టుబడి సుమారు రూ.15లు అయితే,ఇవాళ తోతాపురి మామిడిని దారుణంగా కిలో సుమారుగా రూ.5లకు కొనుగోలు చేస్తున్నారు.ధరలు పతనం కావడంతో పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం గత ఏడాదిలానేఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంది.1.3లక్షల టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు కిలో రూ.17.50ల చొప్పున ధర నిర్ణయిస్తూ,MIS కింద, PDPS కింద కొనుగోలుకు కేంద్రం ముందుకు వచ్చింది.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్ 24న లేఖరాస్తే,జూన్ 25న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చింది.మరి చంద్రబాబు ముందుగా ఆపని ఎందుకు చేయలేదు?మన రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడం లేదని చంద్రబాబుకు తెలుసు. అయినా నిద్ర లేవలేదు. కుమారస్వామి పార్టీలానే ఈయనా కేంద్రంలో భాగస్వామి. ఈయనకీ కేంద్రంలో మంత్రులున్నారు.అక్కడ కుమారస్వామి జూన్ 24 లేఖరాసిన తర్వాత, కేంద్రం స్పందించడం, ఇది మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రావడం జరిగింది.చంద్రబాబు తీరిగ్గా జూన్ 28న లేఖ రాశారు.ఇది రాష్ట్రంలో రైతుల మీద చంద్రబాబుకు ఉన్న ధ్యాస. ఆ రాసిన లేఖలో కూడా రైతులకు మేలుచేసే దిశగా దృష్టిపెట్టలేదు.కర్ణాటకలో రైతునుంచి కొనుగోలు చేసే మామిడికి కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.17.50లు నిర్ణయిస్తే,ఆ ధర ఇక్కడ కూడా ఇవ్వమని అడగకపోగా, కిలోకు రూ.4లు ఇస్తామని, ఆడబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు.చంద్రబాబు తన వారైన గల్లాఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీరికే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తాడు. SIR పేరుతో ఓట్ల తొలగింపు..బీచ్లను కూడా చంద్రబాబు వదలడం లేదు.బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా?.బీచ్లకు కుటుంబం అంతా కలిసి వెళ్లగలరా?.ఎస్ఐఆర్ పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్టు తొలగించే కుట్ర జరుగుతోంది.ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఇచ్చేసినట్టు రాస్తున్నారు.చంద్రబాబుకు మానవతం ఉందా?.స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.పేదవాడి ఓట్లు తొలగిస్తే సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి?.సిటిజన్షిప్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు.ఈఆర్వో హోదాలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగం.ఓట్ల తొలగింపుపై అధికారులతో మంత్రులు మాట్లాడుతున్నారు. హే రామ్.. సేవ్ ఆంధ్రా..కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారు.బడుగు, బలహీనవర్గాలను కించపరిస్తే సీఎం ఏం చేస్తున్నారు??రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? లేదా?.రిజర్వేషన్లపై బాలకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తుంది.మతం, రిజర్వేషన్కు ముడిపెట్టడం సరికాదని తీర్మానం చేశాం.స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.హే రామ్.. సేవ్ ఆంధ్రా..బాలకృష్ణన్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం.దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఏంటి?.బాబూ.. చేతనైతే మంచి చెయ్.. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. -
మేకప్ మంత్రి అని అన్నది మీ టీడీపీనే.. అనితను చెడుగుడు ఆడుకున్న శ్యామల, నాగమల్లీశ్వరి
-
మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి
కార్వేటి నగరం/కాణిపాకం: మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట పోరుబాట చేపట్టింది. రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారు. భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ గంగాధర నెల్లూరు, చిత్తూరు, చంద్రగిరి సమన్వయకర్తలు కృపాలక్ష్మి, విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ర్యాలీగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.గంటన్నర పాటు కదలకుండా రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడంతో వారు ధర్నా చేస్తున్న నేతలు, రైతులపై పడ్డారు. భూమనను లాక్కెళ్లిపోయి, ఆ తర్వాత విడిచిపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన నిలిస్తే పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. కిలోకు రూ.15 ఇచ్చేంతవరకు పోరాటం: భూమన ‘ఇంత తక్కువ ధరలతో బతకలేకపోతున్నాం.. లాభాలు వద్దు, కనీసం పెట్టుబడి వరకైనా కిలో రూ.15 ఇస్తేనే బతుకుతాం’ అంటూ మామిడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల ఎదుట గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కనీసం మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి అని చెప్పారు. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఒకే ఒక్క ఉత్తరం రాస్తే, కేంద్ర ప్రభుత్వం గత నెల 25నే మొదటి విడతగా ఆ రాష్ట్రంలో 1.30 లక్షల టన్నుల తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున కొంటామని ప్రకటించిందన్నారు.మన రాష్ట్రంలో చంద్రబాబు మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఫ్యాక్టరీ యజమానులకు తొత్తుగా మారిన ముఖ్యమంత్రి వారి దోపిడీకి అండగా నిలబడ్డారన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న మామిడి రైతులను పోలీసు బలగాలతో నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీల కుమ్మక్కుతో దాదాపు 2 లక్షల టన్నుల పంటను రైతులు కనీసం ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తేలేకపోవడంతో ఆ పంటంతా తోటల్లోనే రాలిపోయిందన్నారు.ఎంతో శ్రమకోర్చి ఫ్యాక్టరీల వద్దకు లోడ్లు తెచి్చన రైతులకు వారం రోజులైనా లోపలికి పంపకుండా యజమానులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీల దౌర్జన్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం తట్టుకోలేక మొన్న ఒక రైతు జ్యూస్ ఫ్యాక్టరీ ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కిలో రూ.15 ఇచ్చేంతవరకు వైఎస్సార్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని, చంద్రబాబు రైతుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను దోపిడీ చేస్తోంది..ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కూలదోసే ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కలి్పంచకుండా రైతులను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడ మద్దతు ధర కోసం రైతులు ఇక్కడ ఉంచిన 500 ట్రాక్టర్ల లోడును రాత్రికి రాత్రే పోలీసులు ఎలా మాయం చేశారని ప్రశ్నించారు. ఏం జరిగిందో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పొట్టగొట్టేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్ కన్నా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఏకమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వాటిని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.’ అని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో ‘కూటమి పాలనలో శాంతిభద్రతలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని కూటమి నేతల అరాచకాలు, దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు పెట్టి ప్రజలకు వివరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే అరాచకాలు రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్, రిటైర్డ్ ఏఎస్పీ జల్లా రాజేశ్వరరెడ్డి, సామాజిక ఉద్యమకారిణి వసుంధర, న్యాయవాదులు కేవీఎం రజిని, ఒగ్గు గవాస్కర్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్రెడ్డి, అధికార ప్రతినిధులు రవికుమార్, బండి పుణ్యశీల తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. కసబ్ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్ను కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి ట్రయల్ నిర్వహించి శిక్ష వేశారు. కానీ, విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి దహనం చేశారు. మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానని స్పష్టంగా సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి సాయికృష్ణ లాకప్డెత్, పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలి. టీడీపీ, జనసేన నేతలు ఎన్ని దారుణాలు చేసినా కేసులు పెట్టరా? లాయర్ శ్రీనివాస్ ఇంటిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే బాధితుడైన శ్రీనివాస్ పైనే పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. అమరావతిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడినా, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ దళిత ప్రిన్సిపాల్ను వేధిస్తే ఈ రోజుకీ కేసు నమోదు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదు. డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసినా కేసు లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీకి కొమ్ముకాసే కీలు»ొమ్మలుగా మారిపోయారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ బతికి ఉంది కాబట్టే దేశంలో సామాన్యుల మనుగడ సాధ్యమవుతోంది.ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారుఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఆందోళన తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ (అమరావతి) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లాకు చెందిన ఏపీ జేఏసీలోని వివిధ శాఖల సంఘాల నాయకులు, ఉద్యోగులతో మంగళవారం జరిగిన సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నేటికీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా నియమించాల్సిన పీఆర్సీ కమిషన్ను నియమించలేదని చెప్పారు. అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకూ ఒకసారి పెరగాల్సిన డీఏలు గత రెండేళ్లుగా పెంచలేదని, అసలు ఆ ప్రకటనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలపైనా ప్రభుత్వం ఎలాంటి చర్చలూ చేయడం లేదని విమర్శించారు. ఉద్యమానికి సిద్ధం: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు దశలవారీ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమాలకు జేఏసీ సమావేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల పదో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జేఏసీ జిల్లా నాయకత్వాలు ఆర్డీవోలకు, ఎమ్మెల్యేలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం సూచించింది. ఈ నెల 12న శ్రీకాకుళం, 21న అనంతపురం జిల్లాలో సాధారణ ఉద్యోగులను సమాయాత్తం చేసేందుకు ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేస్తున్నామని సమావేశం స్పష్టం చేసింది. త్వరలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సభలు నిర్వహిస్తామని సమావేశం ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సమావేశంలో రాష్ట్ర మహిళా జేఏసీ చైర్పర్సన్ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి, రాష్ట్ర జేఏసీ నాయకుడు వీఎస్ దివాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోకా ప్రకాష్తో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, డివిజన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా డీఏ, ఐఆర్ ఇవ్వలేదని, ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాల్సి ఉన్నా వాటి విషయం చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాకినాడలోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యల సాధనకోసం సాగించే పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. -
‘చంద్రబాబుది దుర్మార్గమైన పాలన’
విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాల, అమానుషాలు, దాడులు, వివక్ష, వెలివేతలు కోకొల్లలుగా సాగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోందని మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలపై ఈరోజు(మంగళవారం, జూన్ 30వ తేదీ) విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేరుగ మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోంది. పరిపాలనలో తన., మన బేధాలు పాటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలన దుర్మార్గమైన పాలన. ముద్దాయిలుగా ఉన్న నేతలతో కలిసి పాలన చేస్తున్నారు. దళిత ప్రిన్సిపాల్ ను వేధించిన కూన రవికుమార్ పై ఇప్పటి వరకూ నో కేస్. విజయనగరం జిల్లాలో ఎస్సీలు, బీసీల పై దాడులు చేస్తే నో కేస్. విశాఖ జిల్లాలో మహిళను వివస్త్రగా మార్చితే ఎమ్మెల్యే పై నో కేస్. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో దళితులను వెలివేస్తే నో కేస్. కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రిన్సిపల్ ను చెంపదెబ్బ కొడితే నో కేస్. రాజమండ్రిలో సాగర్ అనే దళిత యువకుడిని బట్టలిప్పి నిలబెడితే నో కేస్. సాయికృష్ణ , క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం చేయాలి. దళిత మహిళ హోంమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తోంది’ అని పేర్కొన్నారు. -
దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా..: పెద్దిరెడ్డి
తిరుపతి: దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో తాము వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి మల్లన్న కొండ మీద మైనింగ్ అనుమతులు రద్దు చేయించామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అనుమతులన్నీ నిలిపేశామని చెప్పారు. 2015లో చంద్రబాబు స్వయంగా లైసెన్సులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా దేవాలయాల ఆస్తులపై కన్ను వేస్తారని ఆరోపించారు.తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘మల్లయ్య కొండలో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. టీడీపీ పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు? గతంలో కాలిబాట కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఆలయ జీర్ణోద్ధరణ చేసి, రోడ్లు వేసి, విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. 2022లో ఎర్రకొండలో మైనింగ్ కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు. అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదు అని నిర్ణయించాం, పూర్తి గా నిలిపివేశాం. కానీ మేం ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి, ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధు కొండ, శివపురం లో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది.సాధు కొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుంచి జియోమైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వంతో అనేకమార్లు సంప్రదింపులు జరిపింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మళ్లీ జియో మైసూర్ సంస్థ అనేక లేఖలు ప్రభుత్వానికి రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగితే ప్రజలతో పాటుగా తాను వ్యతిరేకిస్తాను అని స్వయంగా అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణ కుమారి కి చెప్పారు. ఈ విషయం నేను చెప్పట్లేదు….. స్వయంగా గల్లా అరుణ కుమారి ఈ అంశాన్ని ఆమె పుస్తకంలో రాసుకున్నారు. 2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్.... అంటే ఖనిజాలు గుర్తించేందుకు లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచింది. ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్ కు ప్రిఫర్ బిడ్డర్ కింద 900 హెక్టార్లలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎల్.సి జారీ ఎలా చేశారు? శివపురంలో 626 హెక్టార్లలో మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27, సెప్టెంబర్ 4న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వమే’’ అని చెప్పారు.దొంగే ‘దొంగ దొంగ..’ అన్నట్లు ఉంది.. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మైనింగ్ కు పూనుకుని మాపై విమర్శలు చేస్తుందని పెద్దిరెడ్డి విమర్శించారు . ‘‘తిరుమల 7 కొండలు లానే మల్లయ్య కొండ మూడు కొండలు పవిత్రమైనవి. మల్లయ్య కొండ జోలికి వెళితే భక్తులు ఊరుకోరు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్రం మంత్రి ఉన్నా అక్కడ మామిడికి 17 రూపాయల మద్దతు ధర ఉంది. చంద్రబాబుకు రైతులు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడమే జరుగుతుంది’’ అని విమర్శించారు. -
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
-
‘ఇది ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది’
విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యాధరపురం డిపో కూల్చివేత కేవలం ఒక డిపో కూల్చివేత కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది అని వారు పేర్కొన్నారు. ఈ-బస్సుల పేరుతో విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆక్షేపించారు.ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు విజయవాడ నగరంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి ప్రభుత్వ తీరును ఖండించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు ఇదే నిదర్శనం: వెలంపల్లి30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆర్టీసీ భవిష్యత్తుపై ఉద్యోగులను, ప్రజలను సంప్రదించకుండా విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణం. విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ భూములను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీసీ ఆస్తులు, భూములు, డిపోలు పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగాలి, ఉద్యోగాలు కూడా ఆర్టీసీ పరిధిలోనే ఉండాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనావైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది" అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఖరీదైన ఆర్టీసీ స్థలాలపై కూటమి నేతల కన్ను: దేవినేని అవినాష్,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గతంలో లూలు మాల్ కోసం విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఖరీదైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోంది. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యాధరపురంతో ఆగకుండా రాష్ట్రంలోని మరో 11 డిపోల భూములను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోంది.ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టి పోరాడతాం" అనివైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మల్లాది విష్ణుఇసుక, మట్టి, కొండల తర్వాత ఇప్పుడు విలువైన ఆర్టీసీ భూములపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను లక్ష్యంగా ఎంచుకున్నారు. వైయస్ జగన్ హయాంలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించారు. కానీ నేడు ఆర్టీసీని బలోపేతం చేయాల్సింది పోయి రూ.6 వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను బినామీలకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ చర్యలనువైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యాధరపురం డిపో స్థలంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం" అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!
-
అందులో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉంది: వంగవీటి నరేంద్ర
తాడేపల్లి: ఆర్థిక నేరం చేసిన కంపెనీ వ్యవహారంలో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును సైతం నీరు గార్చారని తెలిపారు. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీగా డీల్ మాట్లాడుకున్నారని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. 1,500 మంది బాధితుల ఫిర్యాదును ఒకటే ఫిర్యాదుగా మార్చి కేసును నీరుగార్చారని తెలిపారు. ‘‘సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును తేలిగ్గా ముగించేలా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా డబ్బు డిపాజిట్లు చేయించుకున్న మార్గదర్శి, అగ్రిగోల్డు కేసులను కూడా సీబీఐ, ఈడీ విచారించాయి. మరి అద్వైక కేసులో ఎలాంటి విచారణలు జరగకుండా చేసిందెవరు? బెజవాడ పోలీస్ బాస్ వైట్ కాలర్ రౌడీలు, గూండాలుగా మారిపోయారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులోనూ ఆయన ఎందుకు నోరు మెదపలేదు? సీసీ కెమెరా ఫుటేజీ ఏమైందో ఎందుకు చెప్పటం లేదు?’’ అని వంగవీటి నరేంద్ర నిలదీశారు. -
పోలీసుల ఓవర్ యాక్షన్ భూమనను ఈడ్చి పడేశారు
-
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్తోనే, లాకప్ డెత్లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మేము దాడులు చేయలేదు.. ఉండవల్లి రైతుల కీలక వ్యాఖ్యలు
-
మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడీ నెల్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మామిడి రైతులకు మద్దతుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా తరలించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతల పట్టు నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. మామిడి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. మామిడి రైతులకు కిలో మద్దతు ధర 17 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.‘‘పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం లక్ష 30 వేల టన్నులు తోతపూరి మామిడి కిలో 17.50 రూపాయలు చొప్పున కొనుగోలుకు అంగీకరించింది. చంద్రబాబుకు రైతులు పట్ల చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ పాలనలో తోతపురి మామిడి పంట 25 రూపాయలు ఏ రోజు తగ్గింది లేదు. గత ఏడాది మామిడి రైతులు పక్షాన వైఎస్ జగన్ పోరాటం చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రైతులకు కిలో 17.50 రూపాయలు తీసుకురావాలి. మామిడి రైతులకు మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ భూమన పేర్కొన్నారు. -
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
రాళ్లు విసిరిన వారిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం!
-
జనసేన ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ డిప్యూటీ సీఎం
సాక్షి, కడప: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై అనుచిత వాఖ్యలు చేసిన పంతం నానాజీపై మాజీ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని సదరు ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
సాయి కృష్ణ కేసుకు కొత్త మలుపు.. అంబటి సంచలన లేఖ వైరల్!
-
జేసీపై విశ్వేశ్వరరెడ్డి షాకింగ్ కామెంట్స్.. చూస్తేనే నవ్వొస్తుంది!
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి..
-
బాధితులే నిందితులా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన అచ్చోసిన పచ్చమూకలు ప్రజాస్వామ్యానికి పాడెకట్టి రోజుకో ఊరులో ఊరేగిస్తున్నాయి. ఎర్రబుక్కు సాక్షిగా రెండేళ్లుగా సాగుతున్న నారా మార్కు నరమేధం మధ్యయుగాల నాటి ఆటవిక పాలనకు అద్దం పడుతోంది. ప్రజలపైనా, ప్రజాస్వామికవాదులపైనా, ప్రతిపక్షాలపైనా యథేచ్చగా దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వ్యవస్థలను తోలుబొమ్మలు చేసి ఆడిస్తూ రాష్ట్రాన్ని నారా‘కాష్టం’గా మార్చేస్తున్నారు. అధికారమదంతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను నానా రకాలుగా హింసిస్తారు.. తిడతారు.. కొడతారు.. దారికాచి దాడులు చేస్తారు.. ఆస్తులు ధ్వంసం చేస్తారు.. బాధితులు లబోదిబో మంటూ పోలీసు స్టేషన్లకెళితే.. అప్పటికే అక్కడ పచ్చమూకలే తిష్టవేసుకునుంటాయి.. ఎదురు కేసులు సిద్ధంగా ఉంటాయి.. వ్యవస్థలన్నిటినీ దారుణంగా దిగజార్చేయడంతో అరాచకం రాజ్యమేలుతోంది.. స్థూలంగా ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. రాజధానిలో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై దుర్మార్గంగా దాడి చేశారు.. కార్లు ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కూడా.. కానీ విచిత్రంగా దాడికి గురైన వారిపైనే పోలీసులు ఆదివారం కేసులు పెట్టారు. దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఏ చెత్తబుట్టలో పదేశారో ఎవరికీ తెలియదు..పోలీసుల సాక్షిగా బరితెగించిన టీడీపీ గూండాలు..మట్టి, ఇసుక మెక్కి మదమెక్కిన రౌడీ మూకలు మద్యం సేవించి మరీ పట్టపగలు పోలీసుల సాక్షిగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడడం టీవీ చానళ్లు చూశాయి.. సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి.. రాళ్లు రువ్విన రౌడీలను, కర్రసాము చేసిన కసాయిలను, గుడ్లు విసిరిన గూండాలను ప్రజలు చూశారు. పోలీసులు చూశారు. అయినా దాడికి గురైనవాళ్లపై కేసులు నమోదయ్యాయి. పెనుమాక రైతుల విజ్ఞప్తి మేరకు ఆ మార్గంలో వెళుతున్న రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై పట్టపగలు రాళ్లు, కర్రలతో హత్యాయత్నానికి దిగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కానీ దాడిచేసినవారిది తప్పు కాదంట.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అమరావతికి వెళ్లడమే తప్పట. వారికి ఏం పని? ఎందుకు వెళ్లారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేక పాలస్తీనా– ఇజ్రాయిల్ సరిహద్దులోని గాజా ప్రాంతంలో ఉందా అని సగటు పౌరుడికి సందేహం రాకమానదు.. అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? లేక రాష్ట్రప్రభుత్వం నుంచి పచ్చమూకల నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే ‘నేను తెలంగాణ ఎందుకు రాకూడదు.. రావడమే కాదు రాజకీయం కూడా చేస్తా’నంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్లో చిందులు వేయడం అందరూ చూశారు. మరి పవన్ కల్యాణ్ ‘హైదరాబాద్ హమారా’ అనవచ్చు గానీ.. వైఎస్సార్సీపీ నాయకులు అమరావతిలో తిరగడం తప్పెలా అవుతుంది. దారిని పోతున్న మమ్మల్ని అడ్డుకుని, దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం ఏం న్యాయమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేం పిలిస్తేనే వాళ్లు వస్తున్నారు అని పెనుమాక రైతులు కూడా చెబుతున్నారు. ఇవేవీ చంద్రబాబు బధిర సర్కారు చెవికెక్కడం లేదు.దాడికి గురైన వారిపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..సిఆర్డిఎ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై శనివారం ఉండవల్లి సెంటర్లో జరిగిన దాడిలో నిందితులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నా వారిని అరెస్టు చేయకపోగా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పెనుమాక రైతుల కోరిక మేరకు వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. కార్యకర్తలు ముందస్తు వ్యూహంతో అడ్డుకోవడం, వారిపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వరరావు కార్లను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షునితో పాటు లోకేష్ కోటరీలోని వ్యక్తులే స్వయంగా ఈ దాడులకు నేతృత్వం వహించారు. మహిళలతో కోడి గుడ్లు వేయించారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఇతర నేతలపై దాడికి దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. టీఎన్టీయూసీ నేత రాయపూడి కిరణ్బాబు విసిరిన రాయి పోలీసు కానిస్టేబుల్కు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంత జరిగినా తాడేపల్లి పోలీసులకు చీమ కుట్టినట్లు లేదు. పైగా తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్కు పిలిపించుకుని రెండు మూడు సార్లు ఫిర్యాదును మార్చి చివరకు పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం అనే మహిళా నాయకురాలితో ఫిర్యాదు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఇదీ తప్పుడు కేసు...పోలీసులు నమోదు చేసిన క్రైం నెంబర్ 412/2026 ప్రకారం శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఉండవల్లి గ్రామంలోని అమ్మ హోటల్ సెంటర్ వద్ద మాణిక్యంతో పాటు జంగాల భవాని తదితర మహిళలు ఉండగా, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లెళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల నారాయణ (మూర్తి), మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు కార్లలో అక్కడికి చేరుకుని అమరావతి రాజధాని, రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, వారిని ప్రశ్నించిన ప్రజలపై బెదిరించడంతో పాటు తనను, రాయపూడి కిరణ్బాబును కులం పేరుతో అవమానించారని, కొందరు నిందితులు చేతులు, కాళ్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై బీఎన్ఎస్ సెక్షన్లు 189(2), 115(2), 118(1), 131, 351(2), 79 , 190తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 2015లోని 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి దాడులు చేసింది, కోడిగుడ్లు విసిరింది తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకులే. కానిస్టేబుల్పై రాయితో దాడిచేసి గాయపరిచిన రాయపూడి కిరణ్బాబును కేసు నుంచి తప్పించేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. తమపైనే దాడి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య (ఫైల్) వైఎస్సార్సీపీ నాయకులపై సీఐ ఫిర్యాదు.. కేసు..తెలుగుదేశం పార్టీ పెద్దల డైరెక్షన్కు అనుగుణంగా... వారు తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారు.. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు..... ఆయన స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసి 413/2026 కింద కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య తదితరులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్లలో పెనుమాక గ్రామం వైపు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఉండవల్లి సాయిబాబా ఆలయం సమీపంలో వారిని అడ్డుకున్నారని, అదే సమయంలో టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని అమరావతి రాజధానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ చట్టం సెక్షన్లు 30, 30–ఏ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అనుమతి లేకుండా ముందుకు వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఇతరులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అంబటి రాంబాబుకు వర్తించే పోలీసు సెక్షన్ 30, 30–ఎ తెలుగుదేశం నాయకులకు ఎందుకు వర్తించడం లేదో పోలీసులే చెప్పాలి. ఉదయం నుంచి వంద మందికి పైగా మోహరించి రోడ్డుపై బైఠాయించినా వారిని అదుపులోకి తీసుకోలేదు. వారికి కాపలాగా నిలబడ్డారు. వారు వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లతో దాడులు చేస్తున్నా వారిని అదుపులోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ప్రయత్నించారు. దీన్ని వారించడానికి వచ్చిన అంబటి రాంబాబును కూడా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మద్య తోపులాట జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని సీఐ బీఎన్ఎస్ 223, 132, 3(5),పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్లు 30, 30–ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు తమపై హత్యయత్నం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ను బయటపెట్టడం లేదు. ఆదివారం ఎమ్మెల్సీ మేకతోటి ఆరుణ్కుమార్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడి వీడియోలు, సీసీ ఫుటేజ్, విడియోలు, ఫోటోలు అందచేశారు.మాజీ మంత్రులపై గతంలోనూ ఎదురుకేసులుతిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం శ్రేణులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిలపై దాడులకు పాల్పడటమే కాకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టారు.. గుంటూరు నగరం గోరంట్ల వద్ద తెలుగుదేశం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడికి ప్రయత్నించడమే కాకుండా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతని ఇంటిపై, కార్యాలయం పై దాడి చేశారు. ఏడు గంటలసేపు విధ్వంసం సృష్టించారు. తిరిగి అంబటి రాంబాబును ఆరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైలులో ఉంచారు. దాడి చేసిన వారికి 41 నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పైగా అతనిపైనే తిరిగి కేసు పెట్టారు. తిరుపతి లడ్డు వ్యవహారం పై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడదల రజిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరుగుతుండగానే ఆలయం ముందుకు వచ్చి బరితెగించిన టీడీపీ గూండాలు హల్చల్ చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న విడదల రజిని పై దాడి కి యత్నించారు. కారును అడ్డుకుని, ముందుకు కదలనివ్వకుండా చేసిన టీడీపీ గూండాలు. కారుపై చేతులతో గుద్దుతూ, దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఆమె పైనే తిరిగి కేసు పెట్టారు. -
కమిషనర్ 'సర్'కొత్త ఊడిగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నెల్లూరు నియోజకవర్గంలో గాడి తప్పుతోంది. నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏకంగా సరికొత్త టీడీపీ నేత అవతారం ఎత్తారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. టీడీపీకి మేలు చేసేలా మంత్రి నారాయణ కనుసన్నల్లో పచ్చ కండువా కప్పుకుని సర్ ప్రోగ్రామ్ను పార్టీ వ్యవహారంగా మార్చేశారు. బీఎల్ఓల సమీక్షకూ మంత్రి నారాయణను ఆహ్వానించడమే కాకుండా ఏకంగా టీడీపీకి చెందిన బీఎల్ఏలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మై టీడీపీ యాప్ను పొగడ్తలతో ముంచెత్తడం కలకలం రేపింది. టీడీపీ బీఎల్ఏ కాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి కనుసన్నల్లోనే.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషనర్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకంగా టీడీపీ అధికారిక కార్యాలయంగా మార్చేశారు. టీడీపీ బీఎల్ఏలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీ బీఎల్ఏల టెలికాన్ఫరెన్స్లోకి లాగిన్ అయి వారితో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించాల్సిన బీఎల్ఓల సమీక్షలకు ఇటీవల మంత్రి నారాయణతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్లను ఆహ్వానించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా కమిషనర్ నందన్కు షోకాజు నోటీసు జారీ చేశారు. అయినా కమిషనర్ తీరు మారలేదు. ఆయన నోటీసును లెక్కచేయలేదు. ఏకంగా టీడీపీ బీఎల్ఏల సమీక్షలో పాల్గొని మై టీడీపీ యాప్ బహు బాగు అంటూ కితాబిచ్చారు. ఆ యాప్ను తాము ఫాలో అవుతున్నామని, ఓట్లు తొలగించేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీడీపీ కార్యకర్త డ్యూటీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారాయణ అండదండలు ఉండడంతోనే కమిషనర్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఆదేశాలూ పాటించడం లేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. మై టీడీపీ యాప్లో ఓటర్ వ్యక్తిగత సమాచారం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ బీఎల్ఏలు మై టీడీపీ యాప్లోకి లోడ్ చేస్తున్నారు. ఓటర్ వ్యక్తిగత సమాచారం చోరీకి కమిషనర్ ఆదేశాలతో బీఎల్ఓలే సహకరిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తోంది. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక -
పథకం ప్రకారమే హత్యాయత్నం
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తిరిగి బాధితులనే ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న (నిన్న) ఉండవల్లి వద్ద తనపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, ఫొటోలు, ఇతర సాక్ష్యాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ రోజు (ఆదివారం) ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ బాధితులపైనే నిందలు వేయడం విచారకరమన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాజధాని రైతుల ఆహ్వానం మేరకే వెళ్లాంఆయన మాట్లాడుతూ..రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలతో సీఐకి ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే నిందలు వేయడం బాధాకరం. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. అని అన్నారు.దాడి చేసింది టీడీపీ నాయకులేమాపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ నాయకులే. నా కారుపై రాయి విసిరింది టీడీపీ యువజన అధ్యక్షుడు రాయపాటి కిరణ్, భౌతిక దాడికి పాల్పడింది టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ. అమరావతికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకం. దాడిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. మా ఫిర్యాదును స్వీకరించకపోతే ప్రైవేట్ కేసు వేయడానికైనా వెనుకాడం.ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాంఈ దాడి ఘటనను ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ఈ సీఐని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుపరుస్తాం. మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తాం. నేను ప్రజాప్రతినిధిని, రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తిని. రాజధానికి వెళ్లే హక్కు నాకు లేదా? మీరు రావద్దని చెప్పినా వచ్చారని సీఐ మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ అన్నారు. -
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
-
‘చంద్రబాబుకు అమరాతి ట్రిపుల్ ఏటీఎం’
గుంటూరు: చంద్రబాబు అమరావతి ట్రిపుల్ ఏటీఎంలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు రూ.47వేల కోట్లు అప్పు చేశారు. రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గూండాల దుశ్చర్య రాష్ట్రమంతా చూసింది. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్నివేధిస్తున్నారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఏమైనా పాకిస్థానా?!.పోలీసులు, టీడీపీ దుష్టశక్తులు దాడికి బాధ్యత వహించాలి. టీడీపీ గూండాల చేతుల్లో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చెబితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు బయపడతారని అనుకుంటారా?.భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు వైఎస్ జగన్ కలిశారు. రైతులకోసం మేం వస్తే రాళ్ళు, కోడిగుడ్లతో టీడీపీకి చెందిన వాళ్లు దాడికి దిగారు. మేం బాధితులమైతే మాపైనే కేసులు పెట్టారు.బాధితులే నిందితున్నారు.నా ఇంటిపై దాడి జరిగింది... నాపైనే కేసు పెట్టారు.మీరు దౌర్జన్యం చేస్తే భయపడతామా... రైతులకోసం పోరాడతాం.మూడు పంటలు పండే భూములు తీసుకోవాలనుకుంటున్నారు. అమరావతి వ్యవహారంలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. చదరపు అడుగు నిర్మాణానికి 20వేలు ఇస్తున్నారు.ఉండవల్లి,పెనుమాక, కురగల్లు, యర్రబాలెం రైతులు మేం రమ్మంటేనే వచ్చామని చెప్పారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసుకు గాయమైతే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఎందుకింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని రిమాండ్ కు పంపించాలని పెద్ద కేసులు పెడుతున్నారు.సాయికృష్ణ లాకప్ డెత్ అంతులేని కథ.సిట్ విచారణ చేసి సీఐ నాగరాజును అరెస్టు చేశారు.రిమాండ్ రిపోర్టు చూస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి.సీసీ ఫుటేజ్ కనిపించడంలేదన్నారు.చంపడంతోపాటు సాక్షాధారాలు లేకుండా చేశారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైతే కమాండ్ కంట్రోల్ రూం, డీజీపీ ఆఫీసులో ఉండదా. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ ఘటనపై కలవాలని సిట్ చీఫ్ రవిప్రకాష్ను కోరాం.సిట్ దర్యాప్తు లోపభూఇష్టంగా జరుగుతుందని సిట్ అధికారికి ఫిర్యాదు చేశాను.సీఐ నాగరాజును బలిచెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. నాగరాజుతోపాటు అనేకమంది పైస్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. సీఐ నాగరాజు సాయికృష్ణను చంపడానికి కారణం ఏంటో సిట్ చెప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఒక్కటే చెబుతున్నా. యుద్ధంలో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. సాయికృష్ణ బాడీ అప్పగించకుండా బూడిద చెయ్యడం మానవత్వమేనా. విజయలక్ష్మి ఉసురు మీకు తగులుతుంది’ అని హెచ్చరించారు. -
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
-
నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఎవడికి ఉపయోగం... అనితపై కాకాని పూజిత సీరియస్
-
జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. నువ్వు 'OG' లో స్టెప్పులు వేస్తున్నావా..?
-
నువ్వు, నీ బలుపు... లక్ తో డిప్యూటీ సీఎం అయ్యావ్.. తగ్గించుకుంటే మంచిది..!
-
టీడీపీకి ఏజెంట్గా కమిషనర్
నెల్లూరు(అర్బన్): టీడీపీకి నెల్లూరు కమిషనర్ నందన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగాన్ని ధిక్కరించి కార్పొరేషన్ కార్యాలయంలో బీఎల్వోలతో మంత్రి నారాయణ సమీక్ష జరిగేలా చూశారని.. ఇలాంటి వ్యక్తిపై వేటేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలతో సమీక్షను కమిషనర్తో కలిసి మంత్రి ఈ నెల 22న జరిపిన నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కమిషనర్పై చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలపాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రాన్ని కాకాణి, పర్వతరెడ్డి తదితరులు శనివారం అందజేశారు. ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్ను ఇచ్చారు. కమిషనర్కు షోకాజ్ నోటీసులను కలెక్టర్ జారీ చేశారని, ఆయన వివరణ కోసం చూస్తున్నామని డీఆర్వో చెప్పగా, దీనికి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ఆధారాలను సమర్పించినా, చర్యలు చేపట్టకుండా నాన్చడం తగదని సూచించారు. ఈ విషయమై ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘం సీఈఓకు తమ పార్టీ రాష్ట్ర నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 24న ఫిర్యాదు చేశారని చెప్పారు. అవగాహన లేకపోవడం సిగ్గుచేటు ఎన్నికల విధుల్లో రాజకీయ పారీ్టల జోక్యం ఏ రోజూ ఉండదని కాకాణి పేర్కొన్నారు. దీనిపై మంత్రి నారాయణకు అవగాహన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఎల్వోలతో సమీక్ష జరిపేందుకు ఈయనకు ఏ హక్కు ఉందో చెప్పాలని ప్రశ్నించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో సర్కు సంబంధించిన ఫారాలను తమ పారీ్టకి చెందిన మహిళా ప్రతినిధికివ్వాలని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించడం దారుణమన్నారు. ఆ ఫారాలను సదరు నేత సేవ్ చేసుకున్నాకే బీఎల్వోలకు ఇవ్వాలని పేర్కొనడం ఎక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో అనర్హులను ఓటర్లుగా చేరుస్తూ.. అర్హులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కమిషనర్ సహకరిస్తున్నారని మండిపడ్డారు. వదిలే ప్రసక్తే లేదు మంత్రి అండదండలతో చెలరేగిపోతున్న నందన్ను తాము వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2029లో చట్టబద్ధంగా ఆయన సంగతి తేలుస్తామని తెలిపారు. ఒక వేళ రాజీనామా చేసి నారాయణ కళాశాలలో ఉద్యోగిగా చేరినా వదిలే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. కమిషనర్పై ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కేసులకు భయపడేది లేదనీ.. ఎన్నైనా పెట్టుకోమనీ.. ప్రక్రియ పారదర్శకంగా జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఓట్లు తొలగించే కుట్ర టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈ తరుణంలో వ్యవస్థలను ఉపయోగించుకొని సాధారణ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఓటేయని వారి ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే మంత్రి బరితెగించి బీఎల్వోలతో సమీక్షను జరిపారని విమర్శించారు. ఇందులో కమిషనర్ జోక్యం చేసుకొని.. మై టీడీపీ యాప్ను ఫాలో కావాలని.. ఫారాలను త్వరగా తీసుకొని బీఎల్వోలతో ఆన్లైన్ చేయించాలని సూచించారని తెలిపారు. కమిషనర్కు చిత్తశుద్ధి ఉంటే అన్ని పారీ్టల బీఎల్ఏలతో సమావేశాన్ని జరిపి, అందరికీ సరైన సలహాలివ్వాలని సూచించారు. అలా కాకుండా టీడీపీకి చెందిన ఓట్లనే త్వరగా ఆన్లైన్ చేయించేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచారు. మై టీడీపీ యాప్లో ఆ పార్టీ వారితో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల సమాచారం మొత్తం ఉందన్నారు. దీని ప్రాతిపదికన కమిషనర్ చెప్పారంటే ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు పూనుకోవడమేనని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రక్రియ నెల్లూరు, నెల్లూరు రూరల్లో మరీ ఎక్కువగా ఉందని, దీన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొణిదెల సుధీర్, కార్పొరేటర్ శ్రీకాంత్రెడ్డి, మైనార్టీ విభా గ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్, వెంకటశేషయ్య, కా ర్పొరేటర్లు కామాక్షి, గుంజి విజయలక్ష్మి, డివిజన్ల ఇన్చార్జీలు సుబ్బారెడ్డి, శ్రీధర్, శరత్, జయరామిరెడ్డి, అబ్దు ల్ మస్తాన్, సందీప్, మస్తాన్, పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమా?.. గూండాల రాజ్యమా? బాబును నిలదీసిన జగన్
-
మాజీ ప్రధాని పీవీకి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/60LJh7XOLM— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2026 -
వైఎస్సార్సీపీ నేతలపై అట్రాసిటీ కేసు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పీఎస్లో మరో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.టీడీపీ నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు.ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. -
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యం’
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 16 ఏళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదని, ఇప్పుడు ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.వెలిగొండ ప్రాజెక్టుకు నిజమైన ప్రాణం పోసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ అని, జలయజ్ఞం ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక టన్నెల్ పనులను పూర్తి చేసి 2024లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిందన్నారు. వెలిగొండ చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని, నిర్వాసితుల సమస్యలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రెస్మీట్లో ఆయన ఏమన్నారంటే..16 ఏళ్లలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చువెలిగొండ ప్రాజెక్టు పర్యటనలో సీఎం చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆయన పర్యటన ‘సిద్ధడు అద్దంకి వచ్చాడు, వెళ్లాడు’ అన్న సామెతలా మారింది. 1983లో ఎన్టీఆర్ వెలిగొండ గురించి ఆలోచించారని చెబుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్, తన పాలనలో కలిపి 16 ఏళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టుకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అనుమతులు, డీపీఆర్లు, నిర్మాణ పనుల్లో ఏ ముందడుగు వేయలేదు. వెలిగొండకు నిజంగా ప్రాణం పోసింది మహానేత వైఎస్సారే. ఇప్పుడు ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తున్నారు.వెలిగొండ పేరు చెబితే వైఎస్సార్ గుర్తొస్తారు2004లో మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. 43.5 టీఎంసీల నీటి నిల్వ, మూడు జలాశయాల నిర్మాణం ద్వారా 15 లక్షల మందికి తాగునీరు, 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప ప్రణాళిక రూపొందించి రూ.8 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి పనులు ముందుకు తీసుకెళ్లారు. అప్పటి వరకు శంకుస్థాపనలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు. అందుకే వెలిగొండ పేరు చెబితే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్సారే.2024లోనే వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారువైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో, అందులో రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, కీలక టన్నెల్ పనులు పూర్తి చేసి 2024లో వెలిగొండ తొలి టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 39 కిలోమీటర్ల రెండు టన్నెల్లలో చంద్రబాబు హయాంలో పూర్తయింది కేవలం నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే. ఈ ప్రాజెక్టుపై ప్రేమ ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రెండేళ్లలో కనీసం రూ.1000 కోట్లు ఇచ్చి ఉండాలి. కానీ రూ.900 కోట్లు ఇస్తామని ప్రకటించి కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారు.7,350 కుటుంబాలతో పాటు మరో 2,500 కుటుంబాలు ఆర్అండ్ఆర్ కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా వెలిగొండ పేరుతో డ్రామాలు చేయడం సరికాదు. చంద్రబాబు నోరు తెరిస్తే చాలు నాలుగోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు. కానీ వెలిగొండ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయని ఆయనకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.డ్రామాలు మానేసి నిధులు విడుదల చేయాలిగత పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు జూలైలో నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? రెండేళ్లలో వెలిగొండకు ఎంత నిధులు కేటాయించారో ప్రజలకు చెప్పాలి. 2014–2019 మధ్య అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు?. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారు. అందుకే వెలిగొండ విషయంలో ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు జరుగుతున్నాయి.ఎన్టీఆర్ చేయలేకపోయిన పనిని తానే చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అవసరమైన అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం ఐదు కాల్వలు, మూడు జలాశయాలు, మూడు ఆనకట్టలను నిర్మించి వెలిగొండకు రూపం ఇచ్చారు. ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబును పశ్చిమ ప్రాంత టీడీపీ నాయకులే ప్రశ్నించాలి.రైతుల ముసుగులో టీడీపీ గూండాల దాడివైఎస్సార్సీపీ క్రిమినల్ పార్టీ అని విమర్శించే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు. అమరావతిలో రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. హోంమంత్రి అనిత పచ్చ అద్దాలు తీసి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులే ఈ దాడులకు పాల్పడ్డాయి.వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. టీ-5 కాల్వ పనులు పూర్తి చేయకుండానే లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అమరావతి, వెలిగొండ అంశాల్లో జరుగుతున్న అన్యాయాలను వైఎస్సార్సీపీ ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది" అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్
-
కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్
-
ఎక్కడా తగ్గేదే లేదు.. ప్రాణత్యాగానికైనా మేము రెడీ..
-
జగన్ను కలిసిన రైతులే వారి టార్గెట్: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల నుంచి భూములు లాక్కుంటోంది. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. ఉండవల్లిలో దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్బంగా తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఇది అన్యాయమని అమరావతి రైతులు జగన్కు చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటోంది. రైతుల భూముల్లో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నారని తెలిపారు.రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ ఈరోజు అమరావతికి వెళ్లింది. అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని బాటు, లోకేష్ కుట్రలు చేశారు. అమరావతి అప్పులు, దోపిడీ, అవినీతి బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోంది. గూండాలు, రౌడీలను కావాలనే దాడికి తీసుకువచ్చారు. దాడి చేసిన వారు ఏ స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. జగన్కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర. జగన్ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది. మేము వెళ్తే అక్కడ జరిగే దోపిడీ, రైతుల సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయని భయపడ్డారు. కుట్ర పన్ని ఉండవల్లి సెంటర్లో అడ్డుకుని దాడి చేశారు. మమ్మల్ని అడ్డుకున్న వారు రాజధానికి భూములు ఇవ్వలేదు. పాలకొల్లు సత్యం అనే వ్యక్తి గూండాలను తెచ్చారు. క్వారీల్లో పనిచేసే వారిని తెచ్చి మద్యం తాగించి దాడి చేశారు. తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మరి పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదు?. కానీ రౌడీ మూకలను మాపైకి పంపాడు. డీఎస్పీ వచ్చి మరింత రెచ్చగొట్టి దాడి చేయించాడు. మాపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?..మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది?. కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో అందరికీ తెలుసు?. రైతుల విజ్ఞప్తితోనే వైఎస్ జగన్ పరిరక్షణ కమిటీ వేశారు. క్షేత్ర స్థాయితో పరిశీలించమని రైతులు కోరారు. రైతుల సమస్యలపై మేము పెనుమాక వెళ్తుంటే అడ్డుకున్నారు. మాది గొడ్డలి పార్టీ అయితే.. మేం తన్నులు తింటామా?. గొడ్డలి పార్టీ ఎవరిదో చంద్రబాబు చెప్పాలి. పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?.. గుండాల పక్షాన ఉన్నారా?. రాష్ట్రంలో కూటమి పాలన దుర్మార్గంగా ఉంది. మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే బండరాళ్లతో దాడి చేశారు.మాపైనే దాడి చేసి.. మళ్లీ మామీదే కేసులు పెడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. మాపై దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా.? మమ్మల్ని అడ్డుకుంది రైతులు కాదు.. టీడీపీ గూండాలే. నారా లోకేష్ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయి. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు మమ్మల్ని అడ్డుకున్నారు. టీడీపీ గూండాల దాడులను మేము లెక్కచేయం. దాడులను ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాం. చంద్రబాబు గొడ్డలిని లోకేష్ చేతిలో పెట్టారు. లోకేష్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు చేస్తున్నారు. ఎవరెంత అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతాం. ప్రజా రాజధాని ఎలా అవుతుంది..మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలోకి మేము వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. అక్కడ జరిగేది అంతా అక్రమాలు, అవినీతే. రైతులకు అండగా వెళ్తే దాడులు చేస్తారా?. మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి దుర్మార్గం జరగలేదు. పోలీసుల సాక్షిగా కార్లు ధ్వంసం చేశారు. మాపై రాళ్లదాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలు రాష్ట్రంలో లేవనటానికి ఈ సంఘటనే నిదర్శనం. టెర్రర్ సృష్టించే అమరావతి.. ప్రజా రాజధాని ఎలా అవుతుంది’ అని మండిపడ్డారు. టీడీపీ గూండాల ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. అమరావతిని బాబు తన బినామీలకు అప్పజెప్పాడు. ఈరోజు జరిగిన దాడిలో టీడీపీ మాఫియాదే కీలకపాత్ర. రైతు పరిరక్షణ కమిటీ అంటే ఎందుకంత భయపడుతున్నారు? అమరావతికి ఫౌండేషన్ పడినప్పటి నుంచి అన్నీ దుర్మార్గాలే’ అని మండిపడ్డారు. విధ్వంసాలకు మేము భయపడం..ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దేశం ఛీ కొడుతోంది. నిత్యం అరాచకాలు, లాకప్ డెత్లు జరుగుతున్నాయి. ఇవ్వాళ్టి ఘటనపై మేధావులు ఆలోచించాలి. ఎక్కడో మారుమూలన కాదు, రాష్ట్ర నడిబొడ్డున మాపై దాడి చేశారు. మేము వస్తే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?. దాడులు, విధ్వంసాలకు మేము భయపడం. మా పార్టీ పేరులోనే రైతులు ఉన్నారు. చంద్రబాబుకు జ్ఞానం, బుద్ది కలగాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇంటికి దగ్గరే మాపై దాడి జరిగింది. మా నేతలు, లీగల్ సభ్యులపై దాడి చేశారు. ఇదేనా చంద్రబాబూ.. నీ పాలన? అని ప్రశ్నించారు.దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘టీడీపీ గూండాలు చిల్లర వ్యక్తులను పోగేసి దాడులు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు, దాడులకు మేము భయపడం. రైతులు భయపడాల్సిన పనిలేదు, వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. -
ఎవడ్రా వాడు.. పోలీసులపై అంబటి ఆగ్రహం
-
‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న వేలాది మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 'స్మార్ట్ కిచెన్స్' పేరుతో పార్టీ అనుచరుల పొట్టలు నింపుతూ, దాదాపు 85 వేల మంది మహిళలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారాయన.ఈ మేరకు శనివారం 'ఎక్స్' వేదికగా వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వారి ఉపాధిని ఒక్కసారిగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.మధ్యాహ్న భోజన కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంకా మెరుగైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోకుండా, స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారినే తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2026మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని, వారికి అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బకాయిపడ్డ రెండు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే వేలాది పేద మహిళల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జగన్ కోరారు. -
నడిరోడ్డుపై YSRCP నాయకులపై 300 మంది టీడీపీ గుండాల దాడి!
-
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?
-
ఏది తల్లీ నాటి సురక్షిత పాలన! తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ‘తిప్పలే’క చతికిల
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి. ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి న తల్లులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించడం లేదు. దీంతో పసికందులతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లో అష్టకష్టాలు పడుతూ బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా 2019 ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం 279 అరకొర వాహనాలతోనే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నడిపింది. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి అప్పట్లో ఉండేది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్తరించింది. ఏసీ కార్లను సేవల కోసం సమకూర్చడమే కాకుండా తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం పెట్టారు. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల్లో ఒక్కసారి పురోగతి నమోదైంది. 2023లో ఏకంగా 2,16,256కు సేవలు పెరిగాయి. అంటే రోజుకు సగటున 600 మంది బాలితలు సేవలు పొందారు. ఇదిలా ఉండగా 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పరిస్థితులు తారుమారయ్యాయి. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా ఏటా సేవలు పెరగాల్సి ఉండగా, తగ్గుముఖం పడుతున్నాయి. 2023లో 2.16 లక్షల సేవలు నమోదవ్వగా, 2024లో 1.86 లక్షలకు పడిపోయాయి. 2025లో మరో 15 వేల మేర తగ్గి 1.71 వేల మందికే సేవలు అందాయి. ఈ లెక్కన పరిశీలిస్తే 2023లో రోజుకు 600 మందికి సేవలు అందగా, 2025లో 469కి ఆ సంఖ్య దిగజారింది. 2023లో జనవరి నుంచి మే మధ్య నెలకు 16 వేల నుంచి 19 వేల సేవలు ప్రభుత్వం అందించింది. ఇప్పుడు నెలకు 14వేల లోపు మాత్రమే సేవలు అందుతున్నాయని తెలుస్తోంది. రూ. వందల నుంచి రూ. వేలల్లో భారం చంద్రబాబు ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గాలికి వదిలేయడంతో నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అనంతరం ఇళ్లకు కనిష్టంగా రూ.500 నుంచి దూరాన్ని బట్టి రూ. వేలల్లో సైతం బాలింతల కుటుంబ సభ్యులు ఖర్చు చేయాల్సి వస్తోంది. బాబు అధికారం చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా బాలింతలకు ఇచ్చే రూ. 5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపేశారు. దీనికి తోడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్నీ నిర్లక్ష్యం చేయడంతో నిరుపేదలపై ఆర్థిక భారం పడుతోంది. గత ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరించేది. ఇప్పుడా ప్రత్యేక శ్రద్ధ లేకుండా పోయిందని బాలింతలు, గర్భిణులు మండిపడుతున్నారు. నాడు సురక్షిత ఆలంబన 2022 జూన్ ఒకటో తేదీన విజయవాడ రైల్వే స్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ంది. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం అదేనెల 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ కడప జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కిలోమీటర్ల మేర ప్రయాణం. తల్లీబిడ్డ రైలు, బస్సుల్లో వెళ్లడం కష్టంతో కూడుకున్న విషయం. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో అమీనా ఆమె బిడ్డను వైఎస్ జగన్ ప్రభుత్వం క్షేమంగా ఇంటికి చేర్చింది. నేడు నరకయాతన అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం మత్స్యపురం గ్రామానికి చెందిన చెందిన సుమిత్ర ఈ ఏడాది ఏప్రిల్ 19న కేజీహెచ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లీబిడ్డను ఇంటికి చేర్చడం కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం సమకూర్చాలని కేజీహెచ్ అధికారులను కోరారు. వాహనాలు అందుబాటులో లేవని, ఓ రోజు వేచి ఉండాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక అష్టకష్టాలు పడి ఆర్డీసీ బస్టాండ్కు, అక్కడి నుంచి బస్లో మత్స్యపురానికి రోజుల బిడ్డతో బాలింత సుమిత్రను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వెళ్లారు. నాడు వైఎస్ జగన్ సంక్షేమ శకానికి, నేడు చంద్రబాబు చీకటి పాలనకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. -
జగన్ విజన్ భేష్.. జగన్ మార్క్ ముద్ర
-
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
-
నేను గాంధీని కాదు.. ఒకటిస్తే రెండిస్తా!.. బోడే ప్రసాద్కు దేవభక్తుని చక్రవర్తి మాస్ వార్నింగ్!
-
అంబటి కేసులో ఇద్దరు CIలకు నోటీసులు.. రెచ్చిపోతున్న ఖాకీలు
-
బాబు మార్క్ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!
అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్సీపీ ది కుట్ర అవుతుందా?విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్గా, టెక్నికల్గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్కు తీసుకువెళితే దళిత డాక్టర్ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది
-
తాడిపత్రి కేశవ రెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
-
గుర్తుపెట్టుకో బోడె... నా పైనే దాడి చేయించావ్.. దేవభక్తుని చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్
-
వైఎస్సార్సీపీ దీక్ష.. జేసీ కుట్ర.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి హింసాత్మక రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తాడిపత్రికి తరలిరావాలని ఆయన కోరారు.ఈ నేపథ్యంలో.. అనంతపురం అర్బన్, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి బయలుదేరారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతోంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. -
అక్కచెల్లెమ్మలకు మరో మోసం
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన సర్కార్ తుంగలో తొక్కి.. అక్కచెల్లెమ్మకు మరో మోసం చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్హెచ్జీలకు రుణాలు ఇవ్వడం అత్యంత కీలకమని, మహిళలకు రుణాలు ఇస్తే.. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రుణాలు తగ్గించడం, వడ్డీ రాయితీ ఇవ్వక పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గడమే అందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ–జనసేన కూటమి ఇచ్చిన హామీలు.. వడ్డీ లేని రుణాలకు బడ్జెట్లో కేటాయించినా నిధులు ఇవ్వకపోవడం.. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండటాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. ఎస్ఎల్బీసీ, బడ్జెట్ ప్రతులు, ఎన్నికల మేనిఫెస్టోను జత చేస్తూ గురువా రం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తోంది ‘‘స్వయం సహాయక సంఘాలకు(ఎస్హెచ్జీ) రుణాలు ఇవ్వడం అత్యంత కీలకం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. మహిళలకు ఇచ్చే రుణాలు పెరిగితే ఉత్పాదకత పెట్టుబడులు పెరుగుతాయి. ఇది ఎస్హెచ్జీల ఆదాయాన్ని పెంచే సామర్థ్యాన్ని బలోపేతం చేసి, వాటి ఆర్థిక సుస్థిరతకు దోహద పడుతుంది. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతే పెట్టుబడులు తగ్గి.. తద్వారా ఆదాయాలు తగ్గి.. ఫలితంగా వినియోగం కూడా తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్హెచ్జీలకు రుణాల వృద్ధిని ప్రోత్సహించడానికి ఆ రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వడం అత్యంత కీలకం. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వడ్డీ రాయితీ ద్వారానే ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళలకు రూ.4,969 కోట్లు ప్రత్యక్ష మద్దతు అందించింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఆసరా’, ‘చేయూత’ వంటి కార్యక్రమాల ద్వారా ఎస్హెచ్జీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అపారమైన మద్దతును అందించింది. ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుతామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి. చంద్రబాబు పాలనలో గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ కింద ఏటా రూ.100 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో చెప్పినా, తుదకు ఇచ్చింది సున్నానే , పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఈ రెండేళ్లలో ఏమీ ఇవ్వని చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.6,000 కోట్లు ఎప్పటిలాగే అధికారం చేపట్టిన తర్వాత, టీడీపీ కూటమి ఇచ్చిన హామీని విస్మరించి అక్కచెల్లెమ్మలను మోసం చేసింది. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ రాయితీ ఇవ్వడం పక్కనపెడితే.. ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ కార్యక్రమానికి కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. 2024–25లో వడ్డీ రాయితీ కింద విడుదల చేసిన మొత్తం ‘సున్నా’. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది మాత్రం ‘సున్నా’. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయించినా, ఇప్పటికి విడుదల చేసింది ‘సున్నా’నే. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.6,00,000 అప్పు ఉందని భావించినా.. టీడీపీ హామీకి అనుగుణంగా వడ్డీ రాయితీ మొత్తం రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ రాయితీ కింద ఎగ్గొట్టిన మొత్తం రూ..6,000 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019–24 మధ్య ఎస్హెచ్జీలకు రుణ వృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మద్దతు ఇవ్వక పోవడం వల్ల రుణ వృద్ధి తగ్గిపోతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీలకు రూ.49,626 కోట్ల రుణాలు ఇస్తే.. అవి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.41,105 కోట్లకు పడిపోయాయి. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.16,505 కోట్ల నుంచి 2024లో ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.49,626 కోట్లకు పెరిగిన స్వయం సహాయక సంఘాల రుణాలు.. ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో రూ.41,105 కోట్లకు తగ్గిన రుణాలు -
పోరంకిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై దారికాచి దాడికి యత్నించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు చక్రవర్తి వస్తుండగా.. పోరంకి వద్ద భారీగా మోహరించిన టీడీపీ గూండాలు.. చక్రవర్తి కారును అడ్డుకున్నారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు.టీడీపీ గూండాలు చుట్టుముట్టడంతో కారు దిగిన చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్రవర్తిని తరలిస్తున్న పోలీసు వ్యాన్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చిబూతులతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. -
త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మొహర్రం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక అని ఆయన తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని గుర్తు చేశారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడతాయని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. -
దేవభక్తుని చక్రవర్తి విడుదల
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా ఎంపీ గురుమూర్తికి సమాధానమిచ్చారు.ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని నైలెట్కు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిందని, ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిని సమాచార సాంకేతిక, సైబర్ భద్రతా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేసిన ఎంపీ, ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే తిరుపతి యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, శిక్షణ అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. -
సోమశిల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతల చలో సోమశిల సందర్శనకు పోలీసులు ఆటంకం సృష్టించారు. పార్టీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారనే సమాచారంతో సోమశిల ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. అనంతరం, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు గేట్లు దూకి ప్రాజెక్ట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు తీరు, కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన
-
టీడీపీ గేమ్లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
అభిమాన జడి.. గుండెల్లో గుడి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా భూమయ్యగారిపల్లెలో అభిమాన జనం పోటెత్తారు. తమ ఇష్ట దైవం గట్టు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రారంబోత్సవంలో అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నారనే విషయం తెలుసుకొని ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్కు అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జలాభిషేకం, కలశ స్థాపన, సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరికీ నరసింహ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. అంతకు ముందు వేముల జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు వైఎస్ జగన్కు భారీ గజ మాలతో ఘన స్వాగతం పలికారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహ స్వామికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తున్న వైఎస్ జగన్ అనంతరం వైఎస్ జగన్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీరామిరెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఇదే గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యుడు బయపురెడ్డి ఇంటికి వెళ్లి.. కాసేపు గడిపి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం భూమయ్యగారి పల్లెలో 92 ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణమ్మ వైఎస్ జగన్ వద్దకు వచ్చి బుగ్గలు తడిమి, తలపై చేతులు వేసి ఎంతో అప్యాయంగా ఆదరించింది. మరో వృద్ధురాలు తోటలో కోసుకొచ్చిన మల్లెపూలను వైఎస్ జగన్ చేతుల్లో పోసింది. అవే మల్లెపూలు తిరిగి ఆయన ఆమె వడిలో వేశారు. వైఎస్ జగన్ పట్ల వృద్ధులకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు ఈ ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మనవరాలు.. పల్లవి, నరేష్ దంపతుల కుమార్తెకు ‘దైవిక’గా నామకరణం చేశారు. అంబకపల్లెకు చెందిన భాస్కరరెడ్డి, భార్గవి దంపతుల కుమారుడు జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకొని పలక (స్లేట్)పై అక్షరాలు రాయించారు. పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లేశ్వరరెడ్డి అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్ జగన్.. ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందులకు తిరుగు ప్రయాణంలో తన కాన్వాయ్ వెనుక అంబులెన్సు వస్తుండటాన్ని గమనించి.. వెంటనే తన వాహన శ్రేణిని రోడ్డు పక్కన ఆపించి, అంబులెన్స్కు దారిచ్చారు. పులివెందుల అభివృద్ధిలో మరో ముందడుగు పులివెందుల పట్టణం 31వ వార్డులోని వైఎస్సార్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్లను బుధవారం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యర్రగుడిపల్లె వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ధైర్యంగా ఉండండి బుధవారం వైఎస్ జగన్ను వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, చంద్రబాబు కూటమి ప్రభుత్వ బాధితులు, ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాబోయే మూడేళ్లు విశేషంగా కృషి చేయాలని సూచించారు. ఎవరూ అ«ధైర్య పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, అనంతపురం జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, పులివెందుల పట్టణ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డి, కదిరి ఇన్చార్జి మక్బుల్బాషా, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, పార్టీ నేతలు రాజోలి వీరారెడ్డి, వేల్పుల రాము, సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. -
దిశ మీటింగ్లో పోలీసులపై ఎంపీ పుట్టా మహేశ్ అసహనం
ఏలూరు జిల్లా: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై దిశ మీటింగ్లో ఎంపీ పుట్టా మహేశ్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేసి, భారీగా చలాన్లు వేస్తున్నారంటూ ఎస్పీని ప్రశ్నించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాలలో ఈ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయని పుట్టా మహేశ్ చెప్పారు. తనకు రోజూ వచ్చే కాల్స్లో 30 కాల్స్ ఇవేనని వాపోయారు. పల్లెల్లో కార్యకర్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేసుల కారణంగా మండల స్థాయి నాయకులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పల్లెల్లో ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు పోతాయని అవగాహన ప్రోగ్రాం చేద్దామని ఎంపీతో ఎస్పీ తెలిపారు. -
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
కాన్వాయ్ ఆపేసి.. అంబులెన్స్కి దారిచ్చి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబులెన్స్కు దారిచ్చి.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందుల మార్గమధ్యలో ఘటన జరిగింది. అభిమానులతో మాట్లాడుతున్న సందర్భంలో 108 సైరన్ విన్న వైఎస్ జగన్.. వెంటనే తన కాన్వాయ్ని పక్కకు ఆపి అంబులెన్స్కు దారిచ్చారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అభిమానులు రోడ్డు క్లియర్ చేశారు.పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ కంటే ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన సాగింది. ఉదయం 9 గంటలకు భూమయ్యగారిపల్లె లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమయ్యగారిపల్లెలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వైఎస్ జగన్తో సెల్ఫీల కోసం అభిమానులు ఉర్రూతలూగారు. ప్రతి ఒక్కరి వద్ద ఆగి సెల్ఫీలు తీసుకున్న వైఎస్ జగన్.. పేరుపేరునా పలకరించారు. 12 గంటలకు పులివెందుల చేరుకోవాల్సిన వైఎస్ జగన్ సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. బాకరాపేటలో ఓ చిన్నారికి ఓనమాలు దిద్దించిన వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు. -
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు


