breaking news
YSRCP
-
జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే
-
మన ఖాతాలో వేసేద్దాం..
సాక్షి, అమరావతి: ఏమార్చి.. పేరు మార్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మ ఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకూ అదే తీరు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా పేరు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పులు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిదే. దేశ చరిత్రలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకే నోటిపికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. సచివాలయ వ్యవస్థపై దేశ వ్యాప్త ప్రశంసలుకరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు చేదోడువాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏకంగా వలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని.. వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగి పోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత మోంథా తుపానును గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ.. ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు.‘అమ్మ ఒడి’ విషయంలోనూ అంతే.. » తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించే సమయంలో అది మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిందంటూ గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికే పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులే ఎలుగెత్తిచాటారు. » వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేసిన పథకాల పేర్లు మార్చారు. మరి కొన్ని రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషి వల్ల విశాఖపట్నంలో గూగుల్తో కలిసి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ నడుం బిగించింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ తన వల్లే విశాఖకు వచ్చి ందంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించి, ఏడు కాలేజీలను అప్పట్లోనే పూర్తి చేశారు. తరగతులు కూడా ప్రాంభమయ్యాయి. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగిస్తూ అదే తన ఘనతగా చెప్పుకుంటుండటం కొసమెరుపు. -
యువతే లీడర్: వైఎస్ జగన్
ఇది సోషల్ మీడియా యుగం.. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే.. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది.. వారెలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది.. ఆ ప్రభుత్వం.. మీరు సిట్ అంటే సిట్! స్టాండ్ అంటే స్టాండ్! దటీజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయాయి. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘భావితరానికి మీరే దిక్సూచి.. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువతేనని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోవైఎస్ జగన్ ఏమన్నారంటే.. తులసి మొక్కల్లా ఎదగాలి.. ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. భావి తరానికి దిక్సూచీ కాబోతున్నారు. బహుశా ఒకటి, రెండు టరమ్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. మీరంతా సోషల్ మీడియాను అత్యధికంగా అనుసరించేవారు, దాన్ని నడిపించేవారు, 90 కి.మీ. వేగంతో ప్రయాణించే మనసు ఉన్నవారే! రాజకీయాలు ఎలా ఉండాలంటే.. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా, యువతరం మనవైపు చూసేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్, గుణాలు కనిపించినప్పుడే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం. సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు.. విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు ముందుకు వేస్తే.. దేశాలలో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే.. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అంత శక్తిసామర్థ్యాలు ఉన్నవారు యువకులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.. ఏం జరుగుతోంది..? అనేది మనమంతా చూడాల్సి ఉంది. రాష్ట్రం బాగుండాలని అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక యువకుడు గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ మనస్సాక్షినే అడగండి. ఏదైనా రాత్రికి రాత్రే జరగదు. ఒక నాయకుడు ప్రణాళికాబద్ధంగా ఒక అడుగు వేస్తే.. ఆ విత్తనం చెట్టుగా కావడానికి, విజన్ ట్రాన్స్లేట్ కావడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు. ఇదే మాదిరిగా ఉంటాం. మనం లీడర్లుగా కాబోతున్నప్పుడు.. అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మన మనసులో మెదలాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మరి విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? గత 18 నెలలుగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? అనే తేడాను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మన హయాంలోనే ఆ అడుగులు.. యువకులుగా మన పాత్ర కీలకమన్నది గుర్తు పెట్టుకోవాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసీచూడనట్లు వదిలేశామంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన హయాంలోనే అని గర్వంగా చెప్పగలను. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి? వారు భావితరంతో పోటీపడి నిలబడటమే కాకుండా విజయం సాధించాలనే ఆలోచన చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఆ ఆలోచన చేయగలిగిన వాడే.. లీడర్ విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడూ వారి గురించి ఆలోచన చేయడు. కానీ వారే రేప్పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిన వారు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అవుతారు. అలాంటి అడుగులు పడింది వైఎస్సార్సీపీ హయాంలోనే అని గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదట అడుగులు.. ఇంగ్లిష్ మీడియం వైపు పడ్డాయి. ఎవరైనా నారాయణ.. శ్రీచైతన్య.. వంటి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్లాలి? మన గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు అలా లేవు? అవి ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూళ్లే.. గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు పేదవాడి జీవితం బాగు పడుతుందని భావించి మొట్టమొదటి విత్తనం అక్కడ నుంచి పడింది. అందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. 3వ తరగతి నుంచే ఒక పీరియడ్గా టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పిల్లవాడి చేతికి పుస్తకాలతోపాటు తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాం. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ల కంటే గొప్పగా అడుగులు వేయించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈనే కాదు.. ఏకంగా ఐబీని కూడా తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పరిచయం చేశాం. జెనీవా నుంచి ఐబీ టీమ్ వచ్చి మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. 2025లో ఫస్ట్ క్లాస్.. 2026లో సెకండ్ క్లాస్.. 2027లో థర్డ్ క్లాస్.. ఇలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఐబీలో రాసే విధంగా జెనీవా నుంచి వచ్చిన ఐబీ బృందం మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. ఎందుకివన్నీ జరిగాయంటే.. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు ఇవ్వగలిగితే ఆంధ్రా కాదు.. ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు.. మన పిల్లల చదువులు అక్కడి నుంచి మొదలవుతున్నాయా? లేదా? అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే విద్యా వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాం. ఉన్నత విద్యలో విప్లవం.. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడుతో శ్రీకారం చుట్టి.. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించాం. 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాం. ఈ మార్పులను ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాం. తొలిసారిగా ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మన చదువుల్లో లేనిది ఏమిటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏమిటి? అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడున్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు? డిగ్రీ అనేది ఇక్కడ నామ్కేవాస్తే చదువుగా ఎందుకు ఉంది? అక్కడి డిగ్రీకి విలువ ఎందుకు ఉంది? అనే విషయంపై అసెస్ చేసి ఎడెక్స్ను తీసుకొచ్చాం. ప్రముఖ ‘ఐవీ లీగ్’ కాలేజీలు, స్టాన్ఫర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద యూనివర్సీటీల డిగ్రీలను మన కోర్సులో భాగం చేస్తూ.. సర్టిఫికెట్లు కూడా వారి దగ్గరి నుంచే వచ్చే విధంగా.. క్రెడిట్లు కూడా వారే ఇచ్చేలా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలను ఆన్లైన్ కరికులమ్లో భాగం చేశాం. డిగ్రీలో నాణ్యతను పెంపొందిస్తూ తొలిసారి తప్పనిసరి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.16,800 కోట్లు ఇచ్చాం.. కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మెరుగుపరుస్తూ ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రిజి్రస్టేషన్ చేయించాం. మనం అధికారంలోకి రాకముందు 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజి్రస్టేషన్ ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437కి తీసుకెళ్లాం. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదని, అప్పులపాలు కాకూడదని తాపత్రయపడుతూ మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పథకం కిందనే రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే దానికి సంబంధించిన ఫీజులు క్రమం తప్పకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు రెండు విడతల్లో ఇచ్చాం. ఏటా రూ.1,100 కోట్లు ఏప్రిల్లో ఇచ్చేలా అడుగులు పడ్డాయి. ఒక్క వసతి దీవెన కింద మొత్తం రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఇలా పిల్లలు గొప్ప చదువులు చదవాలని భావిస్తూ ఉన్నత విద్యా రంగంలో విద్యాదీవెన, వసతి దీవెన కింద రెండు పథకాల కోసం ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దీనివల్ల పేద, మధ్య విద్యార్థులు ఎవరూ ఫీజులు కట్టలేక చదువులు మానేయాల్సిన పరిస్థితులు రాకుండా అడుగులు పడ్డాయి. 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలిచంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. తటస్థులను కూడా కూడగట్టి నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు షాక్ తిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే స్థాయిలో నిర్వహించాలి. డిసెంబరులో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి. 18 నెలలుగా అంతా తిరోగమనం..ఈ రోజు ఏం జరుగుతోంది? గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఉన్నత విద్యా రంగం పరిస్థితి చూస్తే.. పిల్లలు బాగా చదివితే వాళ్లెక్కడ గొప్పవారు అవుతారనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సెపె్టంబరు చివరి వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే! గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దాన్ని ఆపించాడు. ఎన్నికల తరువాతైనా చంద్రబాబు ఇవ్వాలి కదా? అక్కడి నుంచి ఫీజులకు బ్రేక్ పడింది. ఇప్పటికి ఏడు త్రైమాసికాలు. డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. ఏకంగా దాదాపు రూ.4,900 కోట్లు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లలో రూ.2,200 కోట్లు బకాయి పెట్టారు. రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్సార్సీపీ నాయకత్వం తీసుకోకపోతే చదువులు మానేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అంటే . మీ అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో ఎంతమంది చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గుతున్నారు. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం. స్వయం ఉపాధికి ప్రోత్సాహం..నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లో (స్వయం ఉపాధి రంగం) వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశగానే ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టై అప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికిపైగా మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వ్యవసాయం దండగ కాదు.. పండగరాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి వ్యవసాయం దండగ అనే మాటలు వస్తే.. మేం పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్న ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించాం. రైతులకు ఏ విపత్తు, ఆపద వచ్చినా వెంటనే ఆదుకున్నాం. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు మాత్రమే ఉంటే, కోవిడ్ ఉన్నప్పటికీ మన హయాంలో మరో 4 కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం. అందులో మూడు ప్రభుత్వ రంగంలోనివే. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టు మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి. నాడే అదానీ డేటా సెంటర్..మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ హయాంలోనే లేఖ కూడా రాశాం. అవన్నీ జరిగాయి, మనం చేశాం కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్ వస్తోంది. విశాఖ అభివృద్ధికి అడుగులు వేశాం కాబట్టే గూగుల్ వస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందుకోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. విత్తనం వేయకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మేం ఎన్ని ఉద్యోగాలిచ్చామో మీ లెక్కలే చెబుతున్నాయి..వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన కళ్లెదుటే కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం. దేశంలో 61 శాతం స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత ఉంటే, మన హయాంలో ఏపీలో అది కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అలా 17 వేల మందిని నియమించాం. పాఠశాల విద్యలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వలంటీర్లు. ఆప్కాస్లో మరో లక్ష మంది, 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లో, రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు కల్పించాం. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగాం. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చి భరోసా కల్పించి నిలబెట్టాం. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలది చాలా కీలక పాత్ర. వీటిలో పెట్టుబడి తక్కువే అయినా ఉద్యోగాలు ఎక్కువ. అదే పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించగలిగాం. ఇవి మనం చెప్పే లెక్కలు కాదు. వాళ్లు తయారు చేసుకున్న సామాజిక సర్వే నివేదికలో చూపించిన లెక్కలే ఇవన్నీ! మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం..చంద్రబాబు చేస్తున్న మరో దారుణమైన పని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందో ఆలోచన చేశారా? ప్రభుత్వం వాటిని నిర్వహించకుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పేదలు దోపిడీకి గురవుతారు. దీనికి చెక్ పడాలంటే ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే స్థానికంగా సూపర్ స్పెషాలిటీ సేవలు టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా అందుబాటులోకి వస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మెడికోస్, నర్సింగ్ విద్యార్థులు వీరంతా అక్కడే పని చేస్తారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేరువలో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తాయో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగిపోతుంది. 50 కి.మీ. లోపే పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పేదలకు, మధ్య తరగతికి ఒకవైపు మంచి చేస్తూ మరోవైపు ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లుగా మారి మన ప్రాంతంలోనే సేవలు కూడా అందిస్తారు. మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో తరగతులు కూడా మొదలై మూడు బ్యాచ్లు జరిగాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని అడ్డుపడి చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు అవసరం. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1,000 కోట్లు మాత్రమే వెచ్చించాలి. కానీ ఆ మనిíÙకి మనసు రాదు.. అది కూడా ఖర్చు చేయకుండా ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. ఆయన పెట్టపోతే పోయే..! మేం వచ్చిన తరువాత చేసుకుంటాం. కానీ ఇలా స్కామ్లు చేస్తూ అమ్మడం ఏమిటి? ఈ స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిని నిలదీయడం యువత నుంచే మొదలు కావాలి!! ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయాల పేరు మార్పుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. క్రెడిట్ చోరీ కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజన్ యూనిట్గా మారుస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.వైఎస్ జగన్ విజన్ని తన విజన్గా పేరు మార్పు చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని అద్భుత వ్యవస్థను తీసుకువచ్చారు. పారదర్శకమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తెచ్చారు.లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగులను వైఎస్ జగన్ నియమించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకి చంద్రబాబు.. పేరు మార్పుకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్ని చోరీ కోసం సీఎం చంద్రబాబు తంటాలు పడుతున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్ -
YSRCP విద్యార్ధి విభాగం లీడర్లతో వైఎస్ జగన్ సమావేశం
-
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.ప్రపంచంతో పోటీ పడాలి.. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్లను తీర్చిదిద్దాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.6,200 కోట్లు బకాయిలు.. మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్తో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ తీసుకు వచ్చాంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్మెంట్ పెండింగ్లో పెట్టారు. ఫీజు రియిబంర్స్మెంట్లో రూ.4,200 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశాం. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.చంద్రబాబు చేసిందేంటి?. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్సీపీ. అదానీ-గూగుల్కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్లో ఫీజు రియింబర్స్మెంట్పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. -
ఆదినారాయణ రెడ్డికి రాచమల్లు దిమ్మతిరిగే కౌంటర్
-
‘2027లో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు.సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాదయాత్ర సాహసోపేత నిర్ణయం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున దేశ రాజకీయ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చేసింది. తన పాదయాత్ర ద్వారా అడుగడుగునా అన్ని వర్గాల వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి పాలనలోనూ దిక్సూచిగా నిలిచారు.మళ్లీ జగన్ ప్రజా పాలన వస్తుంది: మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను, ఆకాంక్షలను దగ్గర్నుంచి చూసిన పార్టీ అర్టీ అధ్యక్షులు వైయస్ జగన్, వాటికి పరిష్కారాలను వెతుకుతూ ఆసాంతం ముందుకుసాగారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రజా పాలన వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మాజీ మంత్రి పేర్ని నాని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్, నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, వేధింపులు, కేసులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 2,516 గ్రామాల ప్రజలను పలకరించి వారి ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. ఆప్యాయమైన తన పలకరింపు, చిరునవ్వుతో ప్రతి గుండెను తాకారు.చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, లాయర్లు, వృత్తి పనులు చేసుకునే కార్మికులు, కౌలు రైతులు.. ఇలా అన్ని వర్గాలను పలకరించి అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలను విని తానొస్తే ఏం చేయబోయేది వివరించారు. 124 బహిరంగ సభల ద్వారా పాదయాత్రలో తాను చూసిన అంశాలను, తన అనుభవాలను వివరించడంతోపాటు ప్రజాభిలాషకు అనుగుణంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూ వచ్చారు. 55 ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కుల వృత్తులను బతికించడానికి ఏం చేయాలనే దానిపై కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.వైద్య విప్లవం తెచ్చిన ఘనత జగన్దే..సింగిల్గా పోటీ చేసి 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో తన పాలన ద్వారా చూపించారు. సమాజంలో వెనుకబాటుకు కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించి రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకునే క్రమంలో అప్పులపాలై కుటుంబాలు చితికిపోవడమో లేదా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మార్చాలని వైద్య విప్లవం తీసుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయాలని తపించి తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుంది.ఢిల్లీలో నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం 800 స్కూల్స్ను పదేళ్లలో మార్చి చూపిస్తే, వైఎస్ జగన్ హయాంలో (కరోనాతో రెండేళ్లు పోయినా) మూడేళ్లలో 16 వేల పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం రికమండేషన్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారంటే ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులను నాశనం చేశారు. ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ధన దాహంతో ప్రైవేటుపరం చేస్తున్నాడు. వైద్య విద్య చదవాలన్న పేదవిద్యార్థుల ఆశలకు గండి కొట్టాడు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పెత్తందారీ విధానాలతో పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలను బలితీసుకుంటున్నది చంద్రబాబే..మోంథా తుపాన్తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు వెళితే.. ఎవర్నీ చంపకుండా రావాలంటూ నారా లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభలు, పబ్లిసిటీ స్టంట్ల ద్వార అమాయకుల ప్రాణాలను బలి పెట్టే లక్షణం చంద్రబాబుదని మర్చిపోయినట్టున్నాడు. ఎన్నిలకు ముందు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఏడుగురు, గుంటూరు సభలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నాడు. గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదలను బలితీసుకున్నాడు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి దేవుడ్ని చూడ్డానికి వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సింహాచలం గుడిలో గోడ కూలి ఏడుగురు, తిరుపతిలో 9 మంది చనిపోయారు. ఏకాదశి రోజున కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీన్ని ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల శాఖను నిర్వహించే చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోలేదు. చేతకానివారు, అవినీతిపరులు, తప్పుడు ఆలోచనలు ఉన్నవారు అధికారంలో ఉంటే ప్రజలకు శాపాలుగా మారతాయని చెప్పడానికి ఈ వరుస దుర్ఘటనలే ఉదాహరణలు.వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేశ్.. మోంథా తుపాన్తో రైతులు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన మాత్రం ముంబైలో కుటుంబంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. నేనే గెలిపించానని ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు అల్లాడిపోతుంటే అమిత్షా కొడుకుతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం గొప్ప అనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో 2027 నుంచి మళ్లీ మరోసారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. మళ్లీ ప్రజలందర్నీ నేరుగా పలకరించి అక్కున చేర్చుకుంటారు. -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం
-
ప్రజా సంకల్పం.. జగన్ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తి
-
వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు అయ్యింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బాధలను విన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ భరోసా ఇచ్చారు.నాడు వైఎస్ జగన్ పాదయాత్ర 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా వైఎస్ జగన్ ప్రయాణం చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,648 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ భారీ విజయం సాధించారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. LIVE: వైయస్ జగన్ గారి ప్రజాసంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ https://t.co/Q4Bl6pxlp3— YSR Congress Party (@YSRCParty) November 6, 2025 -
YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
-
నేడు YSRCP విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
సాక్షి, కోనసీమ జిల్లా: మాజీ మంత్రి, రాజోలు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. ఆయాన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు.. గొల్లపల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాజోలులో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అమలాపురం కిమ్స్కు తరలించి ఆయనకు వైద్యం అందించారు. -
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025 -
Satish Kumar: భారతమ్మ గొప్పతనం ఏంటో చూపిస్తా? ఆదినారాయణ రెడ్డికి గూబపగిలేలా కౌంటర్
-
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్రెడ్డి సవాల్ విసిరారు. -
వైఎస్ఆర్ సీపీ నేత కైలే అనిల్ కుమార్ పై కేసు
-
వైఎస్ జగన్ పర్యటన సక్సెస్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు.జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.అడ్డుకున్న పోలీసులు.. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్పోస్టులు పెట్టి... వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్యాక్షన్ చేశారు. కనీసం బైక్లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
బాబు బూటకపు హామీలు.. రైతులను నట్టేట ముంచుతున్నారు
-
వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను పోలీసులు, ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు.‘‘వైఎస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను రాకుండా ఆపలేరు. కృష్ణాజిల్లాలో ఒక్క మంత్రిగాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని.. జిల్లా మంత్రిగాని ఒక్క ఎమ్మెల్యే గాని... రైతులకు జరిగిన నష్టాన్ని పొలంలోకి వచ్చి చూడలేదు. ఎల్లో మీడియాలో రావడానికి పొలంలో ఫోటోలకు పోజులు మాత్రమే ఇస్తారు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్కు అడుగడుగునా ఘన స్వాగతం (ఫొటోలు)
-
రైతులకు అన్యాయం జరిగితే మరో పోరాటానికి సిద్ధం: వైఎస్ జగన్
కృష్ణా జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారిపొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు.04-11-20254: 30 PMఅనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..విపత్తులు వస్తే రైతులను పట్టించుకోరా?ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందివిపత్తులు వచ్చినా రైతులను పట్టించుకోని పరిస్థితి మోంథా తపానుతో అత్యధికంగా వరిపంట నష్టం జరిగిందిగింజలు పాలు పోసుకునే సమయంలో దెబ్బతింది4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న , అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయికూటమి పాలనలో రైతుల పంటలకు ఇన్సూరెన్స్ లేదు18 నెలల కూటమి పాలనలో 16 విపత్తుల వచ్చాయిఅన్నదాత సుఖీభవ పేరతో రైతులను మోసం చేశారురూ. 40 వేలు ఇవ్వాల్సింది కేవలం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చారుమా హయాంలో రైతులకు భరోసా ఉండేదిజగనన్న ఉన్నాడనే భరోసా రైతులకు ఉండేదిప్రతీ రైతును ఆర్బీకేలు చేయిపట్టుకొని నడిపించాయిప్రతీ ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉండేవాడుమా హయాంలో ఈ-క్రాప్ నమోదు చేసేవాళ్లంఈ క్రాప్తో ప్రతిరైతుకు న్యాయం జరిగేదిపంట కొనుగోలుకు కాంపిటేషన్ క్రియేట్ చేశాంరూ. 7,800 కోట్లతో పంటలకు గిట్టబాటు ధర ఉండేలా చేశాంరూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం85 లక్షల మంది రైతులకు మేం ప్రీమియం చెల్లించాంఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది ఉచిత పంటల బీమా తీసేయడం దారుణం కాదాఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ కోసం అధికారులు రాలేదుఒక్క రోజులోనే ఎన్యమురేషన్, ఆడిట్ అయిపోయిందిచంద్రబాబు తప్పిదం వల్లే..చంద్రబాబూ.. నీ తప్పిదం వల్లే రైతులకు ఉచిత పంట బీమా లేకుండా పోయిందిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారుఆ బకాయిలను వెంటనే రైతులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడ్ని డిమాండ్ చేస్తున్నాంఏ రాష్ట్రంలో అయినా రైతు కన్నీర పెడితే మంచిది కాదురైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోంరైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ తరుఫున పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాకృష్ణా జిల్లా :మోంథా తుఫానుకు కారణంగా నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలన బాధిత రైతులకు వైఎస్ జగన్ ఓదార్పుతుపాను దెబ్బకు తడిసిన కంకులను వైఎస్ జగన్కు చూపించిన రైతులు పంట నష్టం అంచనా వేయలేదంటూ రైతుల ఆవేదన 18నెలల కాలంలో ఇన్పుట్ సబ్సీడీ రాలేదన్న రైతులు రామరాజుపాలెం చేరుకున్న వైఎస్ జగన్ పంటపొలాలను పరిశీలించనున్న వైఎస్ జగన్పంటపొలాలను సందర్శించే చోట పోలీసుల పేరుతో వెలిసిన ఫ్లెక్సీలుజనం వెనక్కి వెళ్లిపోవాలంటూ హుకుంజగన్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపేసిన పోలీసులుచెక్ పోస్టు పెట్టి బైకులు, కార్లు నిలిపివేతరైతులను కూడా తరిమేస్తున్న పోలీసులు మూడున్నర గంటలు ఆలస్యంగా జగన్ పర్యటనకృష్ణా జిల్లా గూడూరు చేరుకున్న వైఎస్ జగన్గూడూరుకు ఉదయం 11:30 గంటలకు రావాల్సి ఉన్నా మూడున్నర గంటలు ఆలస్యంవిజయవాడ నుండే రోడ్డు పొడవునా జగన్ స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు, కార్యకర్తలుదారి మధ్యలో ప్రతిచోటా జగన్కు ఘన స్వాగతందారి పొడవునా జగన్కు తమ కష్టాలు చెప్తున్న రైతులుతుపాను దెబ్బకు తడిచిన వరి కంకులు, కుళ్లిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్కు చూపిస్తూ భోరుమన్న రైతులుబాధిత రైతులను ఓదార్చిన జగన్గూడూరు చేరుకున్న వైఎస్ జగన్కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్గూడురు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన మహిళలు,రైతులుదారి పొడవునా వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతంరోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు, రైతులుతరకటూరు చేరుకున్న వైఎస్ జగన్పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్తరకటూరు చేరుకున్న జగన్నిడమోలులో వైఎస్ జగన్నిడుమోలు చేరుకున్న వైఎస్ జగన్రోడ్డుకు ఇరువైపులా భారీగా నిల్చున్న రైతులుఎండ తీవ్రతలోనూ జగన్ కోసం వేచి ఉన్న రైతులుకృష్ణా జిల్లాలో వైఎస్ జగన్కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ కోసం దారి పొడవునా ఎదురు చూస్తున్న అభిమానులుఈడుపుగల్లులో వైఎస్ జగన్ను కలిసిన మహిళా రైతులునష్టపోయినవ అరటి, వరి పంటను వైఎస్ జగన్ చూపించిన రైతులువరి కంకులను పరిశీలించిన వైఎస్ జగన్మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలుమచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టిన పోలీసులుబారికేడ్లు పెట్టడంతో పొలాల మధ్య నుంచి వస్తున్న రైతులుపామర్రు: 14వ మైలురాయి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంపామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్గోపువానిపాలెం చేరుకున్న వైఎస్ జగన్గజమాలలతో జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలుభారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులుదారి పొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంమచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్రైతులు, వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులుపోలీసుల తీరుపై పేర్ని కిట్టు ఆగ్రహంగండిగుంట చేరుకున్న వైఎస్ జగన్పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికిన మహిళలుఆకునూరు సెంటర్ కి చేరుకున్న వైఎస్ జగన్జగన్ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్న కల్లుగీత కార్మికులునెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆటంకాలుజగన్తో వస్తున్న వాహనాలను నిలిపేస్తున్న పోలీసులుచెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాల దారి మళ్లింపుజగన్ కాన్వాయ్ తప్ప మిగతా వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులునెప్పల్లి సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంగోసాల సెంటర్లో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుతమకు జరిగిన నష్టంపై జగన్కు వినతి పత్రాలు సమర్పించిన అన్నదాతలుఈడుపుగల్లులో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుకంకిపాడు మండలం, నెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆంక్షలువాహనాలు మచిలీపట్నం వైపు వెళ్లకుండా బారికేడ్లుడ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులుతాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారుబైక్ల తాళాలు లాక్కొని జగన్ను చూసేందుకు వెళ్లకుండా ఆంక్షలు వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నానిఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరురైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదువ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?పెనమలూరు సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్భారీ బైకు ర్యాలీతో స్వాగతం పలికిన యూత్తాడిగడపలో పోలీసుల అత్యుత్సాహంబైక్లపై వస్తున్న యువతను అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్తో పాటు వెళ్లకుండా అడ్డంకులుజగన్ను రైతులు కలవకుండా భారీగా పోలీసుల మోహరింపురోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులుపామర్రు: బల్లిపర్రుకు భారీగా చేరుకుంటున్న రైతులురైతులను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకుంటునన్న పోలీసులుకైలే అనిల్కుమార్తో పమిడిముక్కల సీఐ వాగ్వాదంరోడ్డు మీద ఉండొద్దంటూ పోలీసుల ఆంక్షలువిజయవాడ పడమట చేరుకున్న వైఎస్ జగన్గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న మహిళలుభారీగా తరలి వచ్చిన కార్యకర్తలుపూలు చల్లుతూ ఘన స్వాగతంకృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలనబాధిత రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్వైఎస్ జగన్ను కలవకుండా రైతులపై ఆంక్షలుజనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరింపువైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేసిన పోలీసులునేడు కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులుకేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలుద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలువైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులుమాజీ ఎమ్మెల్యే లు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో బెదిరింపులు -
టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో టేపుతో రాష్ట్రంలో టీడీపీ నేతల మద్యం దందా మరోసారి బట్టబయలైందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు మద్యం సిండికేట్ వ్యవహారంలో ఆడియోతో రెడ్ హ్యాండెడ్గా దొరికాడని తెలిపారు. భరత్రామ్ సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్కో షాపునకు రూ.1.40 లక్షల చొప్పున ఎమ్మెల్యేకి మామూలివ్వాలంటూ టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ ఫోనులో మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చేసిందన్నారు. కిలపర్తి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అత్యంత సన్నిహితుడని తెలిపారు.టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రికే చెందిన మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఎవరికెంత ముట్టజెప్పాలో మద్యం షాపుల యజమానులకు చెప్పిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. ఇలా టీడీపీ ప్రజాప్రతినిధులు అనుచరుల ద్వారా ఏమాత్రం సిగ్గు లేకుండా, విచ్చలవిడిగా మద్యం దందా సాగిస్తున్నారని తెలిపారు.కిలపర్తి శ్రీను ఆడియో ఏఐ సృష్టి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నెపం నెట్టేస్తున్నారని, కూటమి నేతల మద్యం దందా ప్రజలందరికీ తెలిసిందేనని, వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలే మద్యం దందా నడుపుతున్నారని. నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టం చేశారు. మద్యం వ్యవహారంలో అనుచరులతో నేరుగా దొరికినా సిటీ ఎమ్మెల్యేను ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించదని ప్రశి్నంచారు. చంద్రబాబుకు, లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే వాసును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు.భక్తులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలిరాష్ట్రంలో భక్తులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆలయాల్లో భక్తులు మృత్యువాత పడుతున్నా రక్షణ కల్పించలేని ప్రభుత్వం దేనికుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తుల మరణానికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి, సింహాచలం చందనోత్సవం నాడు కూడా భక్తులు చనిపోయారని, ఈ ఘటనలన్నింటికీ చంద్రబాబు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు.గత గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరంలో 29 మంది చనిపోవడానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పారు. ఆయన ప్రచార పిచ్చికి 29 మందిని బలి తీసుకున్నారని తెలిపారు. కాశీబుగ్గ ఆలయ నిర్మాణదారుపై కేసు పెట్టారని, గతంలో తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. సింహాచలం ఘటనలో ఆ క్షేత్ర వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో, వారి దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి పెద్దలు అరెస్టు చేశారన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ప్రభుత్వం వద్ద ఉన్న సాక్ష్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. -
అమెరికాలో కూతురి పెళ్లి.. అంబటి రాంబాబు స్పందన
-
చేవెళ్ల ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం, బాధాకరమని.. తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్
-
మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: వరల్డ్ కప్లో మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీంవర్క్, వారి ఆత్మవిశ్వాసం దేశాన్ని గర్వపడేలా చేసింది. వరల్డ్కప్ను అందుకుంది. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు. The Indian women’s cricket team has scripted history at the DY Patil Stadium in Navi Mumbai, winning the World Cup after a thrilling match.The teamwork, confidence, and passion they have shown made the entire nation proud.It's great to see that a Kadapa girl, Sricharani, is… pic.twitter.com/Cw1tdFdvB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2025 -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?. -
జోగి రమేష్ అక్రమ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్లో బలవంతంగా ఎక్కించి, విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రమేష్ ను అరెస్ట్ చేయొద్దని ఆందోళన జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్.. నారా వారి సారా రాజ్యం నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర∙వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన జోగి రమేష్ను అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ ఆరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, ఉప్పాల రాము, తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ జి.శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జి.శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రాత్రి జోగి రమేష్ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు. చంద్రబాబు పిచ్చకి పరాకాష్ట – జోగి రమేష్ , మాజీ మంత్రి చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడని 20 రోజులుగా చెబుతున్నాను. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. జోగి సోదరుల ఇళ్లల్లో క్లూస్ టీమ్ తనిఖీ జోగి రమేష్ , జోగి రాముల అరెస్ట్ అనంతరం వారి నివాసాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్ బృందాల్లోని సభ్యులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీసీ టీవీ పుటేజీలు, హార్డ్ డిస్్కలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు పరిశీలించారు. పలు ఎల్రక్టానిక్స్ వస్తువులను రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి వారితోపాటు తీసుకెళ్లారు. బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకే అక్రమ అరెస్టుజోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబునాయుడు, లోకేశ్ మాపై కక్షగట్టారు. ఒక బీసీ నాయకుడు నా ఇంటి దగ్గరకు రావడమేంటని కక్ష పెంచుకొని నా భర్త జోగి రమేష్ను అణిచివేయాలని చూస్తున్నారు’ అని ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు అనంతరం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో తన కొడుకు జోగి రాజీవ్ను, ఇప్పుడు తన భర్త జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పించేందుకే తన భర్త.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లారన్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన భర్త కారుపై దాడి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ సంఘటనను చంద్రబాబు ఇంటి మీద దాడిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేశ్లు పరిపాలన గాలికొదిలేసి తమ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడుకు మనస్సాక్షి అనేది ఉంటే కొంచెం అయినా ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అణిచివేసేందుకు పూనుకున్నారని ఆమె మండిపడ్డారు. హక్కులను కాలరాస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులు తమ ఇంటి వద్ద ప్రవర్తించిన తీరు భయాందోళన కలిగించిందని జోగి శకుంతలమ్మ చెప్పారు. నిద్రపోతున్న సమయంలో ఇంటి మీదకు వచ్చి.. డోర్లు కొట్టి.. భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. డోర్లు తెరవకపోతే పగలకొడతాం అని వాచ్మెన్ను బెదిరించారన్నారు. తాను నిర్దోషి అని తన భర్త కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు.తన భర్త మీద ఎవరైతే నకిలీ మద్యం కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటామన్నారు. కానీ, ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ సభ్యులను ఈ రకంగా హింస పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తన భర్త జోగి రమేష్ , మరిది జోగి రాము కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని శాసనమండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకు.. రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు ఎలాంటి పొంతన కనిపించడంలేదని వారు ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట సంఘటనపై ఆదివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులంతా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్లు మజ్జి శ్రీనివాస్, పిరియా విజయ, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కొర్ల భారతి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, ఇతర అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంచేయాలి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ఘోరం జరిగింది. ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పునైనా పరిహారం అందజేయాలి. కాశీబుగ్గ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఓ ప్రధాన పత్రికలో పోలీసుల వైఫల్యం అంటూ రాశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నా ఎందుకు బందోబస్తును ఏర్పాటు చేయలేదు – బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత రూల్బుక్పై శ్రద్ధ లేదా?దేవాలయాల పరిరక్షణ గాలికొదిలేశారు. రెడ్బుక్ రాజ్యాంగం తప్ప రూల్బుక్పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. నిర్లక్ష్యం, వైఫల్యాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలో ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ చేతకానితనం. చంద్రబాబు తుపాను కట్టడి చర్యలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే తప్పుకోవాలి. కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి, జనార్ధన్ను ఎందుకు అరెస్టుచేయడంలేదు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై ఎలాగోలా కేసు కట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. కేవలం ఆలయం సంఘటనను డైవర్ట్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ భక్తులకు భద్రత కల్పించలేకపోతున్నారు..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంతో పాటు జంట పట్టణాల్లో పోలీసుల మోహరింపు, కట్టడి చర్యలు చూస్తుంటే ఇదే శ్రద్ధ ముందే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనిపిస్తోంది. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పాలన గాలికొదిలేశారు..రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, పాలన గాలికొదిలేశారనడానికి కాశీబుగ్గ తొక్కిసలాటే ఉదాహరణ. తిరుపతి సంఘటనలో కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం సింహాచలం సంఘటనతో కూడా చలనం కలగలేదు. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్తో పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్తఎందరిపై కేసు కట్టారు?కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. ఆలయ ధర్మకర్త పండాను అరెస్టుచేయాలని చూస్తున్నారు. అయితే, గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో అక్కడ ధర్మకర్తల్లో ఎంతమందిని అరెస్టుచేశారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీమంత్రి -
కాశీబుగ్గ ఆలయ ఘటనపై... న్యాయ విచారణ జరిపించాలి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరసామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతిచెందిన వారికి వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ‘ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలియజేయడం, లేదంటే ఖండించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ‘తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాశీబుగ్గ దేవాలయం ఏప్రిల్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రతి శనివారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తున్నారు. కార్తీక ఏకాదశి కాబట్టి నిన్న(శనివారం) భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ ఘటనకు ముఖ్యమంతి, మంత్రులు, అధికారులు... ఎవరు బాధ్యత వహిస్తారు’ అని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు పేరుతో పలాయనం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే కూటమి ప్రభుత్వం ‘అది ప్రైవేట్ గుడి’ అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి ప్రైవేట్ ఆలయాల్లో సైతం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భక్తుల భద్రతకు పట్టిష్ట చర్యలు చేపట్టిందని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం పది నెలల వ్యవధిలో తిరుపతి.. సింహాచలం.. వరుస దుర్ఘటనల అనంతరం తాజాగా కాశీబుగ్గ విషాదం. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, భద్రతా చర్యల విషయంలో తన వైఫల్యాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాటప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో క్యూలైన్లో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ముక్కోటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కారు లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సింహాచలం దుర్ఘటనపై ‘సమగ్ర నివేదిక’ ఊసేలేదుసింహాచలం శ్రీవరహ లక్ష్మీనరసింహ ఆలయంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 30న మెట్ల మార్గంలో క్యూలైన్లో వెళుతున్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. తిరుపతి ఘటన తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు. దుర్ఘటన జరిగిన రోజున ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించి, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 72 గంటల్లో కమిటీ అందజేసిన ప్రాథమిక నివేదిక మేరకు ప్రభుత్వం ‘తూ తూ మంత్రం చర్యలతో’ సరిపెట్టిందని విమర్శలు అప్పుడే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికి ఆరు నెలలు గడిచినప్పటికీ, దుర్ఘటనపై 30 రోజుల్లో సమర్పించాల్సిన సమగ్ర నివేదిక అంశం ఊసే లేకుండా పోయిందని దేవదాయ శాఖలో చర్చ జరుగుతోంది. ముందు ఎక్కడాలేని హడావుడి.. ఆపై గప్చుప్!సింహాచలం చందనోత్సవం కార్యక్రమాల పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వం ముందస్తుగా చేసిన హడావుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి.. గతంలో ఎప్పుడూలేని తీరుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తామే ప్రతి పనిని క్షుణంగా పరిశీలించామని ప్రకటించింది. దుర్ఘటనకు 15 రోజుల ముందు ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్చార్జి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30న దుర్ఘటన జరిగిన తర్వాత మంత్రుల కమిటీ సభ్యులెవరూ బాధ్యత తీసుకోకపోవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పెద్దలు సైతం తమ మంత్రివర్గ సహచరులను ఈ ఘటనలో బాధ్యులు చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ 72 గంటల్లో నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయన్న విమర్శలు వచ్చాయి.ప్రైవేటు దేవాలయాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధఅప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ అధికారులతో 2021 సెప్టెంబరు 27వ తేదీన నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ వద్ద నమోదు కాకుండా కొంత మంది (ప్రైవేట్) ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయాల్లో భద్రతకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తుతం అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటే ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే గుళ్లలో భద్రతకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆలయాల్లో కూడా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల మాదిరే సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రైవేట్ ట్రస్టీలకు దేవదాయశాఖ నోటీసులు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ సమీక్ష వివరాలను 2021 అక్టోబరు 8 మినిట్ రూపంలో అప్పటి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ రాష్ట్ర స్థాయిలో హోం శాఖతో పాటు రెవెన్యూ, ఇతర శాఖాధిపతులకు సైతం మెమో ద్వారా తెలియజేశారు. అప్పటి సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలతోపాటు పలు ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే దాదాపు 9,500 ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు హోం, రెవెన్యూ శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టిష్ట భద్రత చర్యలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. -
కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం
ఏ పల్లెకెళ్లినా ఒకటే దృశ్యాలు.. ఏ రైతును కదిలించినా ఒకటే వేదన. వరి మొదలుకొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మొలలోతు ముంపులో నానుతున్నాయి. వరికంకులు నేలనంటి కుళ్లిపోతున్నాయి. వరిచేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. పత్తి, మొక్కజొన్న, లంక గ్రామాల్లో సాగుచేసిన అరటి, బొప్పాయి, పసుపు తోటలు నేలకూలి రైతుల ఆశలను చిదిమేశాయి. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన కూటమి సర్కారు వారిపై కనికరం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. కర్కశంగా వారిని గాలికొదిలేసింది. పంట నష్టనమోదు మొక్కుబడిగా చేస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరును అటకెక్కించింది. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.ఐదువేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తుపాను మిగిల్చిన తీరని నష్టంతో రైతులు తీవ్ర వేదనతో ఉంటే సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి లండన్ టూర్కు వెళ్లడం, ఆయన తనయుడు నారా లోకేశ్ సతీమణితో కలిసి క్రికెట్ మ్యాచ్కంటూ ముంబై వెళ్లడంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కనీస కనికరం, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి దుష్టపాలనపై ధ్వజమెత్తుతోంది.ఈయన పేరు వళ్లుం మురళీకృష్ణ. ఊరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాగుపూడి. ఈయనకు సొంతంగా రెండెకరాలుండగా, కౌలుకు మరో 8 ఎకరాలు తీసుకొని ఖరీఫ్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుతో కలుపుకుంటే ఎకరాకు రూ.60వేలకుపైగా ఖర్చయింది. ఆరుగాలం కంటిపాపలా సాకిన పంట ఏపుగా పెరిగింది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మోంథా తుపాను అతని ఆశలను అంతమొందించింది. పంటను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు రెల్లుపురుగు పంటను తినేస్తుంది. ఎకరాకు 25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీనిని కోయడానికి ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలి. వచ్చినదంతా కౌలుకే పోతోంది. పెట్టుబడి కూడా రాకపోగా ఇంకా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం మిగులుతుందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో రాదో అనే అయోమయం నెలకొందని, బీమా కూడా చేయించుకోలేదని, పది ఎకరాలకు కలిపి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈయన పేరు యార్లపాటి సత్తిపండు.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈ రైతు ఆరెకరాల 75 సెంట్లు కౌలుకు తీసుకొని పీఎల్ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల నుంచి నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. సర్కారు కౌలు కార్డు ఇవ్వలేదు.. పెట్టుబడి సాయం రాలేదు. తుపాను వల్ల కురిసిన వర్షంతో ధాన్యం గింజలు పొల్లు కింద రాలి పోతున్నాయి. ఊకైపోతున్నాయి. 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 16 బస్తాలు కౌలుకు ఇవ్వాలి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. దీంతో సత్తిపాండు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. (పంపాన వరప్రసాదరావు) ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి : ఇప్పటికే ఏడాదిన్నరగా వరుస విపత్తులతో అల్లాడుతున్న రైతులపై ఇప్పుడు మోంథా తుపాను విరుచుకుపడి పంటలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 25 బస్తాలూ రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా పెట్టిన పెట్టుబడులూ రాకపోగా, ఇప్పుడు తడిచిన పంట కోతకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలసాయంపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వ సాయమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా.. ఆ దాఖలాలు కానరావడం లేదు. సర్కారు వారిపై కనీస కనికరం చూపడం లేదు. బాధ్యత లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఏ జిల్లాకు వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కర్షకుల కన్నీటి గాధలు గుండెలను పిండేస్తున్నాయి. అన్నదాతల దీనస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే రైతుల్లో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో నూటికి 70–80 శాతం మంది వారే. మోంథా తుపాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్లెదుటే పంట కుళ్లిపోతుంటే వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుపాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. వరి కౌలు రైతులు ఎకరాకు 16–20 బస్తాలు భూ యజమానికి ఇచ్చు కోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి రూ.40వేలు కిస్తీ కట్టాల్సిందే. ఏడాదిన్నరగా కౌలు కార్డుల్లేక.. పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలకు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న వీరంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల వద్ద రూ.2, రూ.3 వడ్డీలకు అప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రతి కౌలు రైతుకూ రూ.3లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికే ఎకరాకు సగటున రూ.35 వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని కుమిలిపోతున్నారు. కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు.. వరిని యంత్రాలతో కోస్తే కానీ ఉన్న కొద్దిపాటి పంట చేతికొచ్చే పరిస్థితిలేదు. అయితే యంత్రాలతో ఎకరా కోతకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3 వేల నుంచి రూ.4వేలు యంత్రాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనికి ఎంత చూసుకున్నా.. ఎకరాకు రూ.15వేలు అదనంగా ఖర్చయ్యేలా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇంతా కష్టపడి తీరా కోసి ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దాంట్లో 17 బస్తాలు కౌలుగా భూ యజమానికే ఇవ్వాలి. ఇక మాకు మిగిలేది ఏమిటంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటంతా తడిసి ముద్దవడంతో అధిక తేమశాతంతోపాటు రంగుమారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి గింజలకు మొలకలొచ్చేశాయి. మరొక వైపు రెల్ల పురుగు నేలనంటిన దుబ్బులును కొరికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట దేవుడెరుగు కొనేవారుండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా.. కనీసం భూ యజమానికి కీస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు.అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహంతుపాను వేళ ప్రభుత్వం ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని, కనీసం పంట నష్టం అంచనాల కోసం తమ పొలాల వైపునకు అధికారులు రావడం లేదని, రైతు సేవా కేంద్రాలకు వెళ్తే రాస్తాంలే అంటూ సమాధానాలు చెబుతున్నారని దువ్వకు చెందిన అప్పారావు అనే కౌలు రైతు సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు తాము పెట్టుబడిని సైతం కోల్పోతున్నామని వరి రైతులు, తాము లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతున్నామని అరటి తదితర వాణిజ్య పంటల రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోక పోతే తమకు అ«ధోగతే అని, వ్యవసాయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో నాడు అడుగడుగునా అండగా..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. 2023 డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాను సమయంలో ఇదేరీతిలో పంటలు ముంపునకు గురైన వేళ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) సిబ్బంది రైతులతో కలిసి పంట చేలల్లోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడంతోపాటు నష్ట పరిహార నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టారు. ముంపునకు గురైన పంటలను ఎలా రక్షించుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. అప్పటి వైఎస్ జగన్ సర్కారు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వేగంగా చెల్లించడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆఖరికి తడిచిన, రంగు మారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పొలాలవైపు కన్నెత్తి చూడడం లేదు. కిందిస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పంటనష్ట అంచనాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడేందుకు సర్కారు కుటిలయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోలుకూ డ్రామాలు ఆడుతోంది.ఇంకా నీటి ముంపులోనే లక్షలాది ఎకరాలు తుపాను తీరం దాటి నాలుగు రోజులు గడిచినా లక్షలాది ఎకరాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు, అనిగండ్ల పాడు, మాగొల్లు, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా ఏటూరు, తోటరావుల పాడు, చింతలపాడు, ఏలూరు జిల్లా ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, జగన్నాధపురం, మిలట్రీ మాధవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెనికేరు,, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, అంబాజీపేట మండలం గంగలకుర్రు, కాకినాడ జిల్లా కరప, వేళంగి తదితర గ్రామాల్లో పంట చేలు నేటికీ ముంపునీటిలోనే ఉన్నాయి. రావులపాలెం మండలం ఈతకోట, పి. గన్నవరం, మామిడి కుదురు మండలాల్లో పలు గ్రామాల్లో నేలకొరిగిన అరటితోటలు సైతం ముంపునీటిలో ఉన్నాయి. రైతాంగ కష్టాలు వదిలి షికార్లు దుర్మార్గం మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇన్పుట్ సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఇతర ప్రాంతాలకు షికార్లకు వెళ్లడం దుర్మార్గం. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? మోంథా తుపాను దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి కూటమి నేతలు రాష్ట్రాన్ని వదిలి షికార్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసం. ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏపీ కౌలురైతుల సంఘం రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలకుల టూర్లు తుపాను బారిన పడి తీవ్రంగా నష్టపోయి రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి సీఎం టూర్లు చేయడం ఏమిటి? తుపాను నష్టాన్ని తక్కువగా చూపేందుకు సర్కారు యత్నిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా సి. కె. దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాలలో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి. మఠం మండలాలలో జరిగిన పంట నష్టం గురించి అధికారులు చూసిన పాపాన పోలేదు. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. – జీఎస్ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఏపీ రైతు సంఘం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి రైతులను కూటమి ప్రభుత్వ పెద్దలు గాలికొదిలారు. రాష్ట్రంలో ఈ–పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పంటనష్ట నమోదు మొక్కుబడిగా సాగుతోంది. ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షగా ఉంది. దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధరకు సర్కారే కొనాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ, కౌలురైతుల సంఘం 25 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదు మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగానే సాగు చేస్తున్నాం., మరో 15 రోజుల్లో కోతకోసే వాళ్లం. ఇంతలోనే మోంథా తుపాను ముంచేసింది. వంద బస్తాలు అవ్వాల్సింది. ఎకరాకు 25 బస్తాలకు మించి పంట దిగుబడి వచ్చేటట్టు లేదు. – గండికోట నాగయ్య, కాగుపాడు, ఏలూరు జిల్లా పెట్టుబడి కూడా రాని దుస్థితి పెట్టుబడి వస్తాదో రాదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎకరంన్నరలో స్వర్ణ సాగు చేశా. మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదురు చూశాం. మోంథా తుపాను మా ఆశలను నాశనం చేసింది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. కనీసం పెట్టుబడి కూడా మిగలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – దొడ్డి మోహనరావు, కౌలురైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా -
కూటమి నేతల వేధింపులు భరించలేక చచ్చిపోతున్నా
బైరెడ్డిపల్లె: ‘నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశా.. వైఎస్సార్సీపీ నాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా... అదేమన్నా తప్పా..? ఇంతమాత్రానికే నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా... ఇక నేను భరించలేను. చచ్చిపోతున్నా...’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు(42) సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికుల కథనం మేరకు... పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, అతని సోదరుడికి మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. అయితే శ్రీనివాసులును పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్ష కట్టి పోలీస్స్టేషన్కు పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్లే తాను చనిపోతున్నానని వెల్లడించాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులును తొలుత బైరెడ్డిపల్లె పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఏమార్చే తంత్రం.. పక్కా కుతంత్రం
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్లో జోగి రమేశ్ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు. చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు. ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం. మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది. -
కాశీబుగ్గ ఘటన.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
-
అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా:కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం.తూర్పుగోదావరి జిల్లా.కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీరాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్కర్నూలు జిల్లా: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరణించిన తొమ్మిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలంటూ 33వ వార్డులో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు కాశీబుగ్గ లో జరిగిన ప్రమాద ఘటన అయ్యప్పస్వామి భక్తులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి అదోని భిమాస్ సర్కిల్ లో బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైఎస్ఆర్సిపి నాయకులు క్యాండిల్ లతో నిరసన..కాశిబుగ్గ లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి మౌనం పాటించిన వైఎస్ఆర్సిపి నాయకులు..అనంతపురం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు. పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీంకాకినాడ జిల్లాకాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని జగ్గంపేటలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని తుని లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.పశ్చిమగోదావరి జిల్లా:భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన శ్రీకాకుళం :కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంకాక్షిస్తూ క్యాండిల్స్తో నిరసనహాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైఎస్సార్సీపీ నేతలువిశాఖ: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సిపి నేతలు క్యాండిల్ ర్యాలీ.జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ.భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన వైఎస్ఆర్ సీపీ నేతలు. -
తాడిపత్రిలో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
అనంతపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈరోజు(ఆదివారం, నవంబర్ 2వ తేదీ) తాడిపత్రిలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇక్కడ చేయొద్దంటూ టీడీపీకి చెందిన జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు సైతం దిగారు. జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా తాడిపత్రిలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు అడ్డుకోవడమే కాకుండా దాడులకు దిగారు. ఇక్కడకు ఎవరూ రావొద్దంటూ నిరంకుశ పాలనను గుర్తు చేసిన జేసీ వర్గీయులు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట ప్రమాదం.. బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: బొత్స
సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స నిలదీశారు.‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరిసీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.. రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు. -
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్..
-
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్ట్
-
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
జోగి రమేష్ అరెస్ట్ అప్డేట్స్.. 6వ అడిషనల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రిలో జోగి రమేష్, రాముకు వైద్య పరీక్షలు పూర్తి, ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమైన జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవివైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులుపోలీసులు, ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్జోగి రమేష్కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలువైఎస్ఆర్సిపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుకాసేపట్లో జోగి రమేష్కు వైద్య పరీక్షలుజీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలుజోగి రమేష్ ఇంట్లో ముగిసిన సోదాలు..ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ముగిసిన APFSL EVIDENCE RESPONSE TEAM సోదాలుసీసీ కెమెరాలు , ల్యాప్ టాప్లు పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలుజోగి రమేష్ మొబైల్స్, ఆయన సతీమణి ఫోన్, ఇద్దరు కుమారులకు చెందిన ల్యాప్ ట్యాప్లు, సీసీకెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనంజోగి రమేష్ ఇంట్లో తనిఖీల అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి వెళ్లిన తనిఖీల బృందంజోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..విజయవాడ..మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులుజోగి రమేష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపుజోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.జోగి రమేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనజోగి రమేష్ అరెస్ట్..మాజీ మంత్రి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులుఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. జోగి రమేష్ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టింది.👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
కాశీబుగ్గ తొక్కిసలాట.. పలాస ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట బాబు సర్కార్ వైఫల్యమే: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని.. భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు హిందూ ధర్మ వ్యతిరేకి.. ఆయన పాలనలోనే వరుసగా ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.‘‘కాశీబుగ్గ ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్ ఆలయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఎప్పుడూ లేని అపచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు చనిపోయారు. సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. చంద్రబాబుకు హిందూ ఆలయాల మీద ఏనాడూ ప్రేమ లేదు. తన పబ్లిసిటీ కోసం తప్ప ఆలయాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదు. గోదావరి పుష్కరాలలో 29 మంది మృతికి కారణమయ్యారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనే వారికి లేదు...చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?. ఆలయాలు నిర్మించటం తప్పు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. ఏ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేయలేరా?. ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటానికే పోలీసులను వాడుకుంటారా?. ప్రైవేటు వ్యక్తులు ఆలయాలు కట్టటం తప్పా?..విజయవాడలో ప్రయివేటు వ్యక్తుల ఉత్సవాలకు పోలీసుల బందోబస్తు నిర్వహిస్తారా?. అదే ఆలయాల దగ్గర మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయరా?. మా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చాలామంది భక్తులను కాపాడారు. సీపీఆర్ చేసి రక్షించారు. హోంమంత్రి అనితకు పోలీసు వ్యవస్థ మీద ఏమాత్రం పట్టు లేదు. ఆమె ఎంతసేపటికీ మా పార్టీ వారిపై దూషణలు చేయటానికే పరిమితం అయ్యారు. గోశాలలో ఆవులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు...చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదేనా ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్న భక్తి?. చంద్రబాబు విజయవాడలో ఆలయాలను కూల్చి మున్సిపాలిటీ చెత్తలారీలో విగ్రహాలను తీసుకెళ్లారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సినిమా షూటింగ్ లో ఉన్నారు?. జరిగిన తప్పుపై ఎందుకు మాట్లాడటం లేదు?. ఆలయాలపై రాజకీయ కుట్రలు మానుకోవాలి. తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేసిన చరిత్ర టీడీపీది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. -
కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి.... తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలోనూ దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన వల్ల ఇప్పటిదాకా 10 మంది మరణించారని తెలుస్తోంది. ఈ 18 నెలలకాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అని జగన్ పేర్కొన్నారు. -
కాశీబుగ్గ క్షతగాత్రులకు సీదిరి వైద్యం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు. -
ప్రైవేట్ పరం చేస్తే... కమీషన్లు వస్తాయని మంత్రి సవితకు ఉషశ్రీ చరణ్ కౌంటర్
-
మంత్రి అచ్చెన్నాయుడుకు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?. ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
బాబుది చారిత్రక తప్పిదం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. .. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్ ఖాతాలో కోరారాయన. పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025 భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
మిథున్ రెడ్డికి ఐరాసలో అరుదైన గౌరవం
-
పీకలు కోసేస్తాం.. లోకేష్ అనుచరుల బెదిరింపులు
-
ఐరాసలో మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఆయన తాజాగా ప్రసంగించారు(Mithun Reddy UN Speech). న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రసంగాన్ని పోస్ట్ చేసింది.అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన భారత ప్రతినిధిగా మాట్లాడారు. పైరసీ, సాయిధ దోపిడి నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ అభ్యంతరాలను మిథున్రెడ్డి తెలియజేశారు. ఆయన ప్రసంగం.. ‘‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు మా దేశం కట్టుబడి ఉంది. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాం#IndiaAtUNHon’ble MP @MithunReddyYSRC delivered 🇮🇳’s statement on Report of the work of International Law Commission in the Sixth Committee. He highlighted India’s reservations on draft provision concerning Immunity of State Officials. Underscored the use of new… pic.twitter.com/urrgNyM2pM— India at UN, NY (@IndiaUNNewYork) October 31, 2025.. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. వ్యక్తిగత మానవ హక్కులు, న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం. అలాగే.. .. పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి. ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి.. స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠినమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’’ అని మిథున్రెడ్డి అన్నారు. -
బాబు మామూలోడు కాదు.. తుఫాన్ ను ఏపీకి తప్పించి.. తెలంగాణకు మళ్లించిన ధీరుడు..!
-
కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ
సాక్షి,తాడేపల్లి: తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డు పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు, ప్రజలు కూడా క్షమించరని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఆసత్య ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్ధాన్ని ఆశ్రయిస్తే... సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను ఇప్పటికీ చంద్రబాబు బదులివ్వలేదని అంబటి స్పష్టం చేశారు. కేవలం వైఎస్సార్ర్సీపీ నేతలపై కక్ష సాధింపు కోసం దేవుడిని కూడా వాడుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు.. పర్చేజింగ్ కమిటీలో ఉన్న కొలుసు పార్ధసారధి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు సభ్యులుగా ఉన్నా.. ఎల్లో మీడియా వారి పేర్లు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్..గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాలని తండ్రీకొడుకులు వేదన రాష్ట్రంలో ఉంటే... వీటిని ఏదో ఒక విధంగా చంద్రబాబు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే చిన్నప్పన్న అరెస్టు. ఈ అరెస్టు ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన వైవీ సుబ్బారెడ్డి మీద బురజ జల్లే కార్యక్రమం ఉధృతం చేస్తున్నారు. సిట్ను నడిపిస్తున్న ఎల్లో మీడియాలో కధనాలు చూస్తే... సుబ్బారెడ్డి గారెపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు చేష్టల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూవులు తీవ్రంగా బాధపడుతున్నారు.సుప్రీం ప్రశ్నలకూ బదులివ్వని చంద్రబాబు..చంద్రబాబు తిరుపతి లడ్డూలో పంది, పశు కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్న అసత్యమైన ఆరోపణ చేశారు. అది కోట్లాది మంది భక్తులు తిన్నారని కూడా చెప్పాడు. ఇది ఆధారాల్లేని అపవాదు. దీని మీద వైయస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు వై వీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనేకమైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెబుతారు అని అడిగింది. అంతే కాకుండా లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందా ? లేదా? తేల్చండి అని కూడా చెప్పింది. మరోవైపు అప్పటి ఈవో శ్యామలరావు మాట్లాడుతూ నెయ్యిని ఎన్ డీ బీ ల్యాబ్ కు పంపించాం. వారు వనస్పతిలాంటిది కలిసిందని సర్టిఫై చేస్తూ... కింద ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు. పశువులు తినే మేత, టైమింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది.. అని రాసిన డిస్ క్లైమర్ కూడా మీడియాకు చదివి వినిపించారు. ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి తిరిగి పంపించామని చెప్పారు. చంద్రబాబు గారు మాత్రం కేవలం రాజకీయ దురద్దేశ్యంతో ఆ నెయ్యి వాడారని... కల్తీ జరిగిందని చెప్పారు. ఈవో ఒక మాట, చంద్రబాబు మరో మాట ఎలా చెబుతారు? ఎన్ డీ బీ ల్యాబ్ ఒక్కటే ఉందా? సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మొత్తంగా నెయ్యిలో కల్తీ కలిసిందా ? లేదా? అన్నది తేల్చండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే సుబ్బారెడ్డి గారి దగ్గర 8 సంవత్సరాలు క్రితం పీఏ గా పనిచేసిన చిన్నప్పన్నను ఈ ఏడాది మే 31న విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. జూన్ 6న సిట్ ఎదుట చిన్నప్ప హాజరైతే...విచారణ అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేసి.. విచారణ పేరుతో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను బలవంతం చేశారు, నేను చెప్పలేదు స్పష్టం చేశారు. 8 సంవత్సరాల క్రితం పనిచేసిన చిన్నప్పన్నను ఆ రోజు అరెస్టు చేయకుండా 4 నెలల తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాను.దేవుడి పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపునేను ఇవాళ చంద్రబాబు, సిట్ అధికారులు, ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నాను. చిన్నప్పన్న కేవలం సుబ్బారెడ్డి గారి దగ్గర మాత్రమే పనిచేయలేదు.. ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దగ్గర కూడా పీఏగా పనిచేశారు. వారి గురించి సిట్, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడ్డం లేదు. అంటే వాళ్లు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ల గురించి రాయడం లేదా? అంటే మీ టార్గెట్ కేవలం వైయస్.జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేనా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్ధసారధి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ సభ్యులే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు వారి ప్రస్తావన ఎందుకు తేవడం లేదు? చిన్నప్పన్న వాళ్ల దగ్గర కూడా పనిచేసినా సుబ్బారెడ్డి పేరే వస్తుంది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పర్చేజింగ్ కమిటీలో న్న వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి... వారిని విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదన్నట్టు దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కిలో రూ.320కు ఆవునెయ్యి కొంటున్నారు. కల్తీ కాకపోతే అంత తక్కువ ధరకు వస్తుందా? స్వచ్చమైన నెయ్యి అయితే రూ.3వేలు అవుతుందని కూడా ప్రచారం చేశారు. ఈనాడు అయితే స్వచ్ఛమైన నెయ్యి కేజీ రూ.1000 నుంచి రూ.1600 ఖరీదు చేస్తుంది. రూ.320 కు కొన్నారంటే అది కల్తీ నెయ్యి తేల్చిపారేశారు. నేను టీటీడీ బోర్డును ప్రశ్నిస్తున్నాను.. ఇప్పుడు కేజీ నెయ్యి రూ.3వేలకు కొంటున్నారా? రూ.1600 కు కొంటున్నారా? కనీసం రూ.1000కు కొంటున్నారా? రూ.320 కంటే ఎక్కువ, రూ.1000 కన్నా తక్కువకు కొంటున్నారు. మీరు చెప్పిన వాదన ప్రకారం ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మమంటారా? సమాధానం చెప్పాలి.మీ కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం..2014-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ కేజీ నెయ్యి రూ.276లకే కొనుగోలు చేసింది. అది మాత్రం స్వచ్చమైన నెయ్యి. ఆయన దిగిపోగానే రూ.320 కి కేజీ నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి, అందులో జంతుకొవ్వు కలిసిందంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడిన చంద్రబాబు భ్రష్టు పట్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుప్రీం కోర్టు అడిగిన స్పష్టమైన ప్రశ్నలకు చంద్రబాబు ఈ రోజు వరకూ సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారు. కేవలం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకుని వైయస్సార్సీపీ మీద రాజకీయ కక్ష సాధించాలని చంద్రబాబునాయుడు దుర్మార్గమైన పాప కార్యం చేస్తున్నారు. పీఏ చిన్నప్పన్న దగ్గర ఒక్క రూపాయి పట్టుకున్నది లేదు. కానీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని మీరు చేసే నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాము.కల్తీ లిక్కర్ కేసులో నిందితులైన మీ పార్టీ నేతలు ఎక్కడ ?మా పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. చాలా రకాలుగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేసి .. కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారెకి చెందిన ప్రైవేటు వ్యాపారులే కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీమద్యం తయారీలో అతిపెద్ద నిందితుడు, ఆ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం సమన్వయకర్త జయచంద్రారెడ్డి మాత్రం పోలీసులుకు దొరకడు. ఆయన బావమరిది గిరిచంద్రారెడ్డి, పీఏ రాజేష్ లు కూడా దొరకరు. ఎందుకంటే వాళ్లు దొరికితే వాస్తవాలన్నీ బయటపడతాయి. దాన్ని కూడా వైయస్సార్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లాడని జోగి రమేష్ పై కక్ష కట్టి.... బెయిల్ రాకుండా నెలల తరబడి జైల్లో పెట్టాలని చూస్తున్నారు.కేవలం వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలోని సిట్ పనిచేస్తోంది. మీ కక్ష సాధింపు చర్యలకు చివరకు దైవాన్ని కూడా అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గమని అంబటి ఆక్షేపించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను ఆపకపోతే ఆ దేవ దేవుడి మిమ్మల్ని క్షమించడని, జరుగుతున్నదాన్ని గమనిస్తున్న ప్రజలు కూడా మిమ్నల్ని క్షమించరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన పెర్ని కిట్టు
-
Kakani: నీకెందుకు అంత తొందర.. ఎగిరెగిరి పడకు రా.. చంద్రబాబుపై కాకాణి అదిరిపోయే సెటైర్లు
-
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’
సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్లో ఉన్న జనార్ధన్రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. -
ఎంఎస్రాజు వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
కష్టాల్లో ఉన్న రైతులను బెదిరిస్తున్నారు.. ఇదెక్కడి ప్రభుత్వం
-
సీతక్కా.. టీ కావాలా? కాఫీ కావాలా?
-
రైతుకు భరోసా ఏదీ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరికీ అభినందనలు మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలి మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఇది ‘మ్యాన్ మేడ్ కెలామిటీ’ చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ జీరో ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో 16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్నా అర్థం ఉంటుంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు రాష్ట్రంలో ఈ–క్రాప్ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్ మేడ్ కెలామిటీ. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్, చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. -
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: శైలజానాథ్
-
హిందూపురంలో కల్తీ మద్యం తాగి... MLA బాలకృష్ణకు దీపికా అదిరిపోయే కౌంటర్
-
Kasu Mahesh Reddy: ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి
-
ముగిసిన వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు.బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు.ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
సమీక్ష పేరుతో బాబు,లోకేష్ లు ఆర్భాటాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విడదల రజిని
-
మొంథా ఎఫెక్ట్.. రంగంలోకి YS జగన్
-
పార్టీ నేతలతో వైఎస్ జగన్ జూమ్ మీటింగ్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, అక్టోబర్ 30వ తేదీ) పార్టీ నేతలతో జూమ్ మీటింగ్లో పాల్గొనున్నారు. మోంథా తుపానుకు సంబంధించి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. మోంథా తుపాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించనున్నారు వైఎస్ జగన్. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు వైఎస్ జగన్.తుపాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఈ కాన్ఫరెన్స్లో వివరించనున్నారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను తెలియజేయనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు .జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా, మోంథా తుపాను నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు గడచిన మూడు నాలుగు రోజులుగా చురుగ్గా పనిచేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో చొరవచూపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు బాసటగా నిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుపాను మిగిల్చిన నష్టాన్ని స్వయంగా చూసి, బాధితులకు భరోసా ఇచ్చారు. -
అక్రమ కేసులో జైలు నుండి విడుదల అయిన గిద్దలూరు YSRCP నేతకు పరామర్శ
-
బాబుకు సోషల్ మీడియా భయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా పెద్ద సవాలే విసురుతోంది. ఆడిటర్లు, ఎడిటర్లు అవసరం లేని ఈ మీడియా ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని కూడా ఆయన హూంకరించారు. పాపం... ఈ క్రమంలో ఆయన తన గతాన్ని మరచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని జగన్, ఆయన కుటుంబాన్ని ఎంతగా రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. మంత్రులగా ఉన్న రోజా, అంబటి రాంబాబులపై కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం విచ్చలవిడి వ్యాఖ్యలు... కథనాలు వండి వార్చిన విషయం మరీ అంత పాత సంగతైతే కాదు. విపక్షంలో ఉన్నప్పుడు కాని, ప్రస్తుతం అధికారం వచ్చాక కాని, తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుంటారు. ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్దాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేశాయి. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, మీడియా స్వేచ్చను అరికడతారా అంటూ నానా యాగీ చేసేవారు. ఏపీ రూ.14 లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మద్యంలో 30 వేల మంది చనిపోయారని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటారని.. ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా, తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు. అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ఒకపక్క లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయిండం చూస్తూనే ఉన్నాం. ఎటూ అధికారం ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్సార్సీపీ వారిపై ఎంత నీచంగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు. అదే వైఎస్సార్సీపీ సానుభూతి పరులెవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దాదాపు 1200 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు గారు.. సోషల్ మీడియాను గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే.. దాన్ని మీ పార్టీతోనే మొదలుపెట్టడం మేలవుతుంది. నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది. వైఎస్ జగన్, కుటుంబం, అంబటి రాంబాబు, రోజా వంటి వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంత మందిపై కేసులు పెట్టారు మీరు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా? మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ టిక్కెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా? అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. కూటమి నేతల తీరుతెన్నులకు ఇవి నమూనాలు మాత్రమే. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు కాని వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని, వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి, ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరు ఏమీ పోస్టులు పెట్టుకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నిర్మించింది కనుకే ఇప్పుడీ సోషల్ మీడియా భయం చుట్టుకున్నట్లుంది. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అని అన్నారు. ఏమిటి దీనర్థం? ఆ స్వేచ్చ ప్రజలకు మేలు చేయడానికా? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళుతున్న సోషల్ మీడియాని అణచి వేసేందుకా? ఇప్పటికే ఏపీలో పోలీసులు ఎక్కడా లేని విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, మరో వైపు అధికార కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాష్టికాలకు పాల్పడినా పట్టించుకోక పోవడం పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి సైతం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిందంటూ ఆధారం లేని ఆరోపణ చేసి వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి, అయోధ్యకు కల్తీ లడ్డూలు సరఫరా అయ్యాయని రెచ్చిపోయి మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఇది ఫేక్ ప్రచారం అవుతుందా? లేక వాస్తవాల ప్రచారం అవుతుందా అన్నదానిపై ఈ ఏడాదికాలంలో ఎన్నడైనా వివరణ ఇచ్చారా? విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు చంద్రబాబు, లోకేశ్లు ఎలాంటి వార్నింగ్ లైనా ఇవ్వవచ్చు. అధికారంలోకి రాగానే ప్రత్యర్ధి పార్టీవారు మాట్లాడితే అది రాజకీయ కుట్ర, శాంతియుత వాతావరణం చెడగొట్టడం అవుతుంది. ప్రతి ఉపన్యాసంలోను కొన్ని పాయింట్లు రాసుకుంటారు. వాటిని ఒక జాబితా ప్రకారం వల్లె వేస్తుంటారు. ఒక ఉదాహరణ చూడండి..'గుంటూరులో కారు కింద వ్యక్తి పడిపోతే పొదల్లో పారేసి వెళ్లిపోయారు.పోలీసులు అంబులెన్స్ లో తీసుకువెళ్లి రక్షించే యత్నం చేస్తే వారే చంపేశారని చెప్పించే పరిస్థితికి దిగజారారు.." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఆయన ఇలా మాట్లాడితే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు వాస్తవం తెలియదా! అయినా సరే! ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది.ఇంతకుముందు టర్మ్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం ఘట్టం చిత్రీకరించేందుకు సాధారణ భక్తులను నిలిపివేసినందున అది జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజి మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉండగా కందుకూరు సభలో, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి మరో 11 మంది మృతి చెందారు.అదంతా పోలీసుల వైఫల్యం అని వారిపై నెట్టేశారు. తన వైపు ఎంత తప్పు ఉన్నా కప్పిపుచ్చుకోవడంలో ఎంత నేర్పరితనం ఉందో, ఆయా సందర్భాలలో తన రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో అంతకన్నా అధికంగా నేర్పరితనం చంద్రబాబుకు ఉందని ఎక్కువ మంది భావిస్తుంటారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు, పలుచోట్ల నకిలీ మద్యం డంప్ లు దొరకలేదా? వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చాక, అక్కడ ఏ మద్యం సరఫరా అవుతోందో ఎవరైనా చెప్పగలుగుతున్నారా?ఎక్సైజ్ అధికారులే పలు చోట్ల ఇలాంటి మద్యాన్ని పట్టుకున్నారు కదా? అయినా నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్యం పాలు కాలేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది తాగుబోతులకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది? ఆయన చేసే వాదన సరైనదే అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని ఏ ఆధారాలతో ఎలా చెప్పగలిగారు. 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఎన్నికల ప్రణాళికలో ఎలా రాయగలిగారు.అది తప్పు కాదా?ఇప్పుడు ఆధార సహితంగా నకిలీ మద్యం దొరికినా ఎవరి ఆరోగ్యం చెడలేదని , ఎవరూ మరణించలేదని జనం నమ్మాలని,దీని గురించి ఎవరూ ప్రశ్నించకూడదన్నది ఆయన ఉద్దేశం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనకోటి త్రిక‘రణ’శుద్ధి
సాక్షి,అమరావతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఊపందుకుంది. కోటి సంతకాల సేకరణ శరవేగంగా సాగుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జోరువాన కురుస్తున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రణన్నినాదాన్ని పూరించారు. అనేక చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సర్కారు తీరుపై గళమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించకుంటే పోరాటం ఉద్ధృతమవుతుందని గర్జించారు.గత ప్రభుత్వంలో వైఎస్ జగన్జిల్లాకు ఒకటి చొప్పున 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు. రూ.లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను కూటమి పెద్దలు అతి తక్కువ ధరకు తమ అస్మదీయులకు సింగిల్ టెండర్లోనే కట్టబెట్టడం అన్యాయమని గర్హించారు. వైద్య విద్యను వ్యాపారంచేయొద్దని, ఇది కేవలం సంతకం కాదు.. కోటి గుండెల నిరసన అంటూ హెచ్చరించారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. భట్టువానిపల్లి గ్రామస్తులు సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. » బాపట్ల జిల్లా చుండూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, నాయకులు సంతకాలు సేకరించారు. » ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయరాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. » పార్వతీపురం 14వ వార్డులోని బైపాస్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. » ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. » కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట నరసింహం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. » కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం, సంతకాల సేకరణ చేపట్టారు. » కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. » ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. -
Koti Santhakala: టీడీపీ వాళ్లే.. ఎక్కువ సంతకాలు పెడుతున్నారు
-
ఐక్యరాజ్య సమితి సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ: 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. యూఎన్ సమావేశాల కోసం ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో మిథున్రెడ్డి పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్లో మహాత్మా గాంధీ విగ్రహానికి మిథున్రెడ్డి నివాళులర్పించారు. మిథున్రెడ్డితో పాటు ఎంపీల బృందం సమావేశాల్లో పాల్గొననుంది.ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో మిథున్రెడ్డి.. భారత వాణి బలంగా వినిపించనున్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ఎంపీలు రెండు బృందాలుగా హాజరవుతున్నారు. ఒక్కో బృందంలో 15 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఎంపీల బృందం పాల్గొననుంది. -
చంద్రబాబూ, లోకేశ్ ప్రమాణానికి మీరు సిద్ధమా?
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేశ్ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కోఎనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.‘బెజవాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబుతున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు ‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు -
గ్రీన్చానెల్ ద్వారా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
నరసరావుపేట: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్చానెల్ ఏర్పాటుచేసి దాని ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్లు చొప్పున కేటాయించాలని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమాఖ్య ప్రతినిధులతో ఆ శాఖ మంత్రి చర్చలు జరిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్లను మరుగుపర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నీరుగాస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆరోగ్యశ్రీ అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారానే లభించిందని, తద్వారా అనేకమంది పేదలు ప్రాణాలు దక్కించుకున్నారని గుర్తుచేశారు. గోపిరెడ్డి ఏమన్నారంటే.. నెట్వర్క్ ఆస్పత్రులనుచర్చలకు పిలవడం లేదు.. ఏ ప్రభుత్వం వచి్చనా ఆరోగ్యశ్రీని తీసివేసే ధైర్యం చేయట్లేదంటే ఈ పథకం ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవాలి. వైఎస్సార్ హయాంలో 1,700 జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందజేస్తే వైఎస్ జగన్ పాలనలో 3,007 జబ్బులను ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యనూ 900 నుంచి రెండు వేలకు పెంచి పరిమితిని కూడా రూ.5 లక్షల రూ.25 లక్షలకు పెంచారు. వైఎస్సార్, జగన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్న అక్కసుతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్విర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టింది.దీనివల్ల మొన్నటి దాకా 9వేల ఆపరేషన్లు జరిగితే ఆ సంఖ్య ఇప్పుడు మూడువేలకు తగ్గింది. అవి కూడా ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లోనే జరుగుతున్నాయి. 18 రోజుల నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె చేస్తుంటే ఆ ప్రతినిధులను చర్చలకు కూడా పిలవడంలేదు. 104, 108 సేవలను గతంలో అరబిందో, జీవికే లాంటి సంస్థలు నిర్వహించాయి. ఇప్పుడీ సేవలను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని టీడీపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుని కంపెనీకి కట్టబెట్టి ఆ వ్యవస్థనూ భ్రష్టుపట్టిస్తున్నారు. ఏడాదిన్నరలో రూ.2 లక్షల కోట్లు అప్పుచేసిన ఈ ప్రభుత్వం ఆ డబ్బును ప్రజారోగ్యం మీద ఎందుకు ఖర్చుచేయడంలేదు.? -
తిరువూరులో రోడ్ల పరిస్థితి.. రోడ్డుపై పడుకుని YSRCP నేత నిరసన
-
‘కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరేశ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు.కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కూడా మద్యమే కారణం. వైఎస్ జగన్ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు.కానీ చంద్రబాబు అలా కాదు యాభై ఇళ్లకు ఒక మద్యం బెల్టు షాపును పెట్టారు. ఎవరిది సంక్షేమ పాలనో, ఎవరిది సంక్షోభ పాలనలో జనానికి తెలిసిందిచంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయనీ, ఉద్యోగాలు వస్తాయని భావించారు. తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయి. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన సంస్కరణలను క్లోజ్ చేసి, ఊరూరా మద్యం షాపులు పెట్టారు. ఏ ఊర్లోకి వెళ్లినా బెల్టుషాపుల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది.మద్యం దందా ఏపీలో వ్యవస్తీకృతం అయింది. నేరగాళ్లకు ప్రభుత్వమే మంచి అవకాశం కల్పిస్తోంది. కర్నూలు బస్సు దగ్ధం వెనుక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణం. బస్సు ప్రమాదం వెనుక కారణాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మద్యం వలనే ప్రమాదం జరిగిందన్నది వాస్తవం కాదా?. హైవే పక్కన మద్యం దుకాణాలు ఉన్న సంగతి తెలీదా?.లక్ష్మీపురంలోని మద్యం బెల్టు షాపు సీసీ పుటేజీని ఎందుకు బయట పెట్టటం లేదు?.ఆ ఊర్లో ఏకంగా మూడు బెల్టు షాపులు ఉన్నమాట వాస్తవం కాదా?.క్యూ ఆర్ కోడ్ ఉందని చెప్పిన ప్రభుత్వం బైకర్ కొనుగోలు చేసిన మద్యానికి స్కాన్ చేశారా?. ఏపీలో లక్షన్నర మద్యం బెల్టుషాపులు ఉన్నాయి.ఈ బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.తప్పు చేసినా తప్పించుకోవటం చంద్రబాబుకు అలవాటే. రాష్ట్రంలో మహిళలు-చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా మద్యమే కారణం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ మద్యం విచ్చలవిడి తనంపై ఎందుకు మాట్లాడరు? అరోగ్యశ్రీ నిలిపివేత, మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ, కల్తీ ఆహారంతో ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు?. మద్యం వద్దు, మెడికల్ కాలేజీలే ముద్దు అని జనం అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. -
టీడీపీకి చుక్కలే... జగన్ 2.0పై అవినాష్ రెడ్డి
-
దుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం
-
బైరెడ్డి క్రేజ్.. దద్దరిల్లిన కోనసీమ
-
తాడిపత్రి యువకుడికి గూగుల్లో రూ.2.25 కోట్ల వార్షిక వేతనం
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. చదువు పూర్తికాగానే ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్లో కొలువు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్రెడ్డి, అంబిక దంపతుల కుమారుడు సాత్విక్రెడ్డి న్యూయార్క్లోని స్టో్కన్ బ్రోక్ వర్సీటీలో ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతడు కాలిఫోరి్నయాలోని గూగుల్లో రూ.2.25 కోట్లతో కొలువు సంపాదించాడు. దీంతో పట్టణంలోని పలువురు ప్రముఖులు సాతి్వక్రెడ్డిని ఫోన్లో అభినందించారు. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్ను అదుపులోకి తీసుకున్నారు.వినయ్పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్లో ఉన్న వినయ్ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
అదే కర్నూలు బస్సు ప్రమాదానికి మూల కారణం: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఏపీకి‘మోంథా’ముప్పు.. పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేశారు.మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు. -
మీ బెల్ట్ షాప్స్ కారణంగా అమాయకులు బస్సులో కాలి బూడిద అయ్యారు
-
చంద్రబాబుకు రైతులంటే పగ: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదంటూ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలన్నచిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.చంద్రబాబుకు రైతులంటే పగ.. వారి గోడును పట్టించుకునే పరిస్థితిలో లేడు. రైతుల సమస్యలను గాలికొదిలేసి తండ్రీకొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు, లోకేష్ హేళనగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబే అంగీకరించారు’’ అని కాకాణి గుర్తు చేశారు.‘‘తుపాను నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, హెచ్చరికలు లేవు. వరి నాట్లు వేసిన తరువాత యూరియా కొరత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరో వైపు లక్ష ఎకరాలలో నెల్లూరు, కర్నూలు, ఒంగోలులో నీట మునిగిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖా మంత్రి పనిచేస్తున్నాడా?. రైతుల కష్టాలపై ఏమాత్రం అయినా స్పందన ఉందా?...ఇప్పటికే మామిడి రైతులు, పత్తి రైతులు భారీగా నష్టపోయారు. తాజా వర్షాలతో 50 వేల ఎకరాల పంట నష్టపోయారు. మొక్కజొన్న రైతులు ఎకరానికి 12 వేల రూపాయలు మేర నష్టపోయారు. కృష్ణ, గోదావరి డెల్టాలలో తుపాన్ నేపథ్యంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది. పంట నష్టం పై ఎక్కడా నష్టపరిహారం లేదు. చంద్రబాబుకు రైతు అంటే పట్టదు.. వ్యవసాయం అంటే గిట్టదు. చంద్రబాబు ఇప్పటి వరకు రైతులపై ఒక్క సమీక్ష నిర్వహణ లేదు. టమోటా రైతులు, ఉల్లి రైతులను హేళనగా మాట్లాడే పరిస్థితి... వైఎస్ జగన్ హయాంలో ఏనాడు అయినా యూరియా కోసం రైతు కష్టపడ్డ పరిస్థితులు లేవు. రైతుల కోసం జగన్ నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. చంద్రబాబు ఏనాడు సీఎం అయినా రాష్ట్రం దుర్భిక్షం... రైతాంగానికి తీరని నష్టం. అన్నదాత సుఖీభవ సాక్షిగా రైతులకు 20 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు కేవలం ఐదు వేలు ఇచ్చి మోసం చేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి దళారీల లబ్ధి కోసం పనిచేస్తాడు తప్ప రైతుల కోసం కాదు. రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వడం, దానికి కార్డులు పంచడం హాస్యాస్పదం. యూరియా విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. యూరియా కోసం రేషన్లాగా కార్డులు పంచిన చరిత్ర హీనుగా చంద్రబాబు నిలిచిపోతాడు. రైతులకు అవసరం మేర యూరియా పంపిణీ చేయాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. -
పవన్ కళ్యాణ్ సిగ్గుపడు.. జగన్ గొప్పతనం గురించి మీ అన్నను అడుగు చెప్తాడు
-
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ఒక ప్రెసిడెంట్ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్ప్రసాద్ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవైపు శాంతిభద్రతలు నిర్వీర్యమయ్యాయి.. మరో వైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను ప్రజలెవ్వరూ చూసి ఉండరు. ఈ ప్రభుత్వంలో జనానికి జ్వరాలు వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు, లా అండర్ ఆర్డర్ లేదంటే.. మరొక మంత్రి నేనేమైనా లాఠీ పట్టుకోవాలా? తుపాకీ పట్టుకోవాలా? అని మండిపడతారు. అన్ని సమస్యలూ మా శాఖలోనే వచ్చేశాయి, మేమే చేయలేకపోతున్నామని మరొక మంత్రి అంటాడు.డబ్బుల్లేవు... మేం మెడికల్ కాలేజీలు ఎలా కట్టాలి? అని మరొక మంత్రి మాట్లాడతాడు. మంత్రులే ఇలా మాట్లాడితే ఇక ప్రజల సమస్యలను కింది స్థాయిలో పట్టించుకునే వారు ఎవరూ? ఎవరికైనా బాధ్యత అనేది ఉందా? మంత్రులు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఇవి వారి మాటలుగా మనం చూడాల్సిన అవసరంలేదు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంటర్నెల్గా ఏం మాట్లాడుతున్నాడో… ఆ మాటలే వీరి నోటినుంచి కూడా వస్తున్నాయి. ఇలా వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు.వ్యవస్థలను సర్వ నాశనం చేశారుఒక వైపు పీహెచ్సీ డాక్టర్ల ఆందోళనతో గ్రామస్థాయిలో వైద్య సేవలు కుటుంపడ్డాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ బకాయిలతో, నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు నిలిపివేయడంతో పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఇంకోవైపు ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు విలేజ్ క్లినిక్స్ను నిర్వీర్యం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన ఒక్క ఆరోగ్య రంగంలోనే ప్రస్తుతం ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించాల్సిన మంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. హేళనగా మాట్లాడుతున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. కాని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాత్రం శ్రద్ధచూడంలేదు. మరి ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉండడానికి అర్హులా? మంత్రికి పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు. మరి ఎవరికి పడతాయి ఈ సమస్యలు? దీన్ని పరిపాలన అంటామా? దీన్ని ప్రభుత్వం అంటామా? లేక వల్లకాడు అంటామా? పౌరుల ప్రాణాలు రక్షించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? అలాంటి పనికిమాలిన ప్రభుత్వంగా మార్చిన ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను ఏమంటారు?రాష్ట్రంలో అరాచకాలకు రెడ్బుక్ రాజ్యాంగంతో దన్నురెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి… పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి, వీధికో రౌడీని, అరాచకవాదిని తయారు చేశారు. మొన్న తునిలో ఘటన చూసినా.. మరో చోట చూసినా.. దీనికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్సే. ఇందులో ఎవరో ఒకర్ని పట్టుకుని, లేపేసి, ఖబడ్దార్ అంటూ ప్రచారంచేసుకుని, చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న పేకాట శిబిరాలు, సివిల్ పంచాయతీలపై డిప్యూటీ సీఎం నేరుగా డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో దీనికి నిదర్శనం.పైగా ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమ ప్రాంతంలో పేకాట సర్వసాధారణమే అంటూ సమర్థించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ షాపుల అభివృద్ధి తప్ప మరేమీ జరగలేదు. నేరుగా మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, వాటిని అడ్డుకోలేకపోతున్నారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. సీఎంగా చంద్రబాబు తల ఎక్కడపెట్టుకోవాలి? ఇదేనా గవర్నెన్స్ అంటే? మీ అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారుమరోవైపు తిరువూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని, ఇసుక ఎత్తుకు పోతున్నారని, డబ్బులు పంచి కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఏకంగా పెద్ద అవినీతి బాగోతం బయటపెట్టారు. తన అసెంబ్లీ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ సాక్ష్యాలు చూపించాడు. ఇంత బాగోతం బయటపెట్టినా… ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఉంది. మరి అంతటి అవినీతి ప్రభుత్వ కొనసాగాల్సిన అవసరం ఉందా? వీళ్లు పరిపాలించడానికి అర్హులేనా?విదేశాల్లో జల్సాలు... ప్రజా సమస్యలు గాలికి..రాష్ట్ర ముఖ్యమంత్రి విమాన మెక్కి దుబాయ్ పోతారు. మరొక షాడో సీఎం నారా లోకష్ విమానమెక్కి సూటు, బూటు వేసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతాడు. ఇంకొకరు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సినిమాలు ఆయనవి. సీఎం, డిఫ్యాక్టో సీఎంలు వారంలో రెండు రోజులు కనిపించరు. ఇక డిప్యూటీ సీఎం అయితే వారంలో రెండు రోజులుకూడా విజయవాడలో ఉండేది కష్టమే. ఒకవేళ ఉన్నా.. ఉదయం వచ్చి.. మళ్లీ సాయంత్రానికల్లా జంప్. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపేతీరు. ఇదేనా పరిపాలన. అసలు ప్రజలంటే మీకు గౌరవం ఉదా? ప్రజాసమస్యల పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా?భారీ వర్షాలపై వ్యవసాయశాఖను అప్రమత్తం చేసే పరిస్థితే లేదుభారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ చివరది దశకు వచ్చిన వరి దెబ్బతింది. పత్తిరైతులు నిండా మునిగారు. ఉల్లిరైతులు ఏడుస్తున్నారు. ఇలా ప్రతి చోటా ఇవే ఇబ్బందులు. రబీ సీజన్కు విత్తన సరఫరాపై ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోవైపు ప్రతివారం అల్పపీడనమో, వాయుగుండమో వస్తోంది, ఇంకోవైపు తుపాను రాబోతోంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఏంచేస్తోంది? అసలు వ్యవసాయశాఖ మంత్రి పనిచేస్తున్నారా?లంచాల కోసం మధ్యవర్తిత్వం చేయలేదని, తన కింది అధికారులను బదిలీచేయడం మినహా చేసింది ఏముంది? జనాభాలో 60 శాతం మంది ఆధారపడి ఉన్న ఈ రంగం మీద ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదంటే, అసలు వ్యవసాయం తన బాధ్యత కాదన్నట్టుగా చంద్రబాబు, ఆయన మంత్రులు బిహేవ్ చేస్తుంటే.. ఇక కిందనున్న అధికారులు ఏం పనిచేస్తారు? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి మీరేం చేస్తారు?రైతులను నిలువునా దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?చంద్రబాబు తానేదో పెద్ద విజనరీనంటూ, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకుంటూ గతంలో మేం అమలు చేసిన అన్ని విధానాలన్నింటినీ ఆపేశారు. ఉచిత పంటల బీమా రద్దుచేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంటరుణాలు నిలిపేశారు. ఆయన కొత్తగా ఏమీ చేయడం లేదు సరికదా… సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల గొంతు కోశారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇవన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే. ఏరోజైనా ఏ రైతు కుటుంబాన్నానైనా పరామర్శించారా? ఒక్క రూపాయి పరిహారం ఇచ్చారా? అసలు మీది ప్రభుత్వమేనా? ఫీజురియింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఫీజులు కట్టుకోలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు అంటు రోగాలతో చనిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య 5 లక్షల తగ్గింది. ఇన్న సమస్యలు పెట్టుకుని, ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, వారిని ఆదుకోవాల్సింది పోయి.. ఇంత దారుణంగా పరిపాలన చేస్తారా?రాష్ట్రంలో ఎనీటైం మద్యంకర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కారణమైన బైక్ ను నడిపిన యువకుడు ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలోని బెల్ట్ షాప్లో అర్థరాత్రి మద్యం సేవించి, బైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు బెల్ట్షాప్ల్లో మద్యం విక్రయాలు జరుపుతుండటం వల్ల నేడు ఒక భయంకరమైన ప్రమాదానికి కారణమైందనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి, గ్రామ గ్రామానికి బెల్ట్షాప్లకు సప్లై చేస్తున్నారు. నకిలీ మద్యం గుప్పిట్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏపీలో ఏ సమయంలో అయినా మద్యం లభించే పరిస్థితిని కల్పించారు. -
క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరే: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు...2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్సీ లైన్కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే.. బాబు సర్కార్పై విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజిని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు..ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు.Andhra's Lifeline is being utilized by the TDP to enrich themselves!The 108 ambulance & 104 medical services were made available to save lives. It is quite unfortunate to learn that, the TDP Government is misusing the facility for generating financial gains for their party.… pic.twitter.com/BLGtQ9Kr48— Rajini Vidadala (@VidadalaRajini) October 25, 2025 -
Bus Fire: 50 లక్షలు ఇవ్వాల్సిందే.. అంజాద్ బాషా రియాక్షన్
-
ఇదండి బాబు మార్కు మోసం!
రాజకీయ పార్టీలకు మాటకు కట్టుబడే లక్షణం.. నిబద్ధత, ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం. లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహస్తుడన్న పేరు ఇప్పటికే సంపాదించి ఉండటం ఇందుకు కారణం.ఇప్పుడీ ప్రస్తావన మరోసారి ఎందుకొచ్చిందంటే.. టీడీపీతోపాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటన్న చర్చ వచ్చినందుకు! అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ వస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని, బకాయిలు చిటికెలో తీర్చేస్తామని ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గద్దెనెక్కిన 16 నెలల తరువాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కథలు చెబుతున్నారు. ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు రూ.34వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ముక్తాయించారు. సహజంగానే దీనిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది.2019లో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నెరవేర్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ ఇవి వృథా అని ఎన్నడూ చెప్పలేదు. తొలగిస్తామని కూడా అనలేదు. పైగా వలంటీర్లకు జగన్ ఇస్తున్న రూ.5వేలు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడేమో దానిని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. ఇది పక్కా మోసమే కదా?.వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే, చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్ధికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్లో రూ.లక్ష కోట్ల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు! అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకాని వాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు?. రైతులకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులెత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా!. జగన్ రైతులకు రూ.13,500 చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దానిని అమలు చేశారు. అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు?. జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా!.2014 టర్మ్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి యత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు. జగన్ టైమ్ లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం ఐఆర్ ఇచ్చి, తదుపరి 23 శాతం పీఆర్సీ ఇస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారే! చంద్రబాబు చెబుతున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్లు అవుతుందా?. తాను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా? ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి కదా!. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి కదా! నాలుగు డీఏ బకాయిలకు ఒకటే ఎందుకు ఇచ్చారు?.పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిన మాట నిజం కాదా? ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులను అదనపు రాయితీలు ఇచ్చి మరీ అక్కడకు తరలించారే. వారానికి ఐదు రోజుల పని చేయండని చెప్పారే. హైదరాబాద్లో భవనాలు వదులుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలను విజయవాడ, గుంటూరులలో తీసుకున్నారే. ఇదేమి ప్రభుత్వంపై భారం పడలేదా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా!. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నారా? లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారే! అది మంచి హామీనా?. ఆర్టీసీని ముంచే హామీనా?. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఏం కాదా?. అదే జగన్ చేస్తే నాశనం అయినట్లా? ఇదేం అన్యాయం.ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదానీ, రైడెన్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా రూ.22వేల కోట్ల ప్రజా ధనాన్ని తేలికగా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శకు మీరెచ్చే జవాబు ఏమిటి?. వేల కోట్ల లాభాలలో ఉన్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, ఉర్సా, లూలూ వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా?. గూగుల్ తదితర కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక ఆ కంపెనీలలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందా అన్న సందేహాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తే పరిస్థితి తెచ్చారే!.జగన్ టైమ్లో అప్పులు తేవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు తాను 16 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారో ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? డీబీటీ విధానం అంటే నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేయడం తప్పని చెబుతున్న చంద్రబాబు తాను అదే పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వెల్లడించాలి కదా!. అసలు ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాలలో ఉందని, తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని, తాను రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ప్రకటించారే. జగన్ ఎక్కడా అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు.పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను మార్చేయాలన్న భావనతో చంద్రబాబు సర్కార్ ఉందా? ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్, అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం అందుకున్నారా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ఒక ప్రెసిడెంట్ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్ప్రసాద్ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
తిరుపతిలో హైటెన్షన్ YSRCP కార్పొరేటర్పై దాడి
-
నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్పై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ (interactive Voice Response System) కాల్స్పై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.IVRS కాల్స్ ఒక ఆటోమేటెడ్ టెలిఫోన్ సిస్టమ్, ఇది కాల్ చేసిన వ్యక్తికి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను వినిపిస్తూ, వారి ఎంపికల ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ సంబంధిత విభాగానికి కాల్ను ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. తనకు నకిలీ మద్యం కేసు అంటగట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్ కుట్రకు తెరలేపిందని జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి.. కర్నూలు బస్సు ఘటనపై YSRCP నేతలు
-
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్ జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అదానీ ప్రాజెక్టుకు గూగుల్ విస్తరణ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపు! గూగుల్ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా (క్లిప్ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. నోయిడాలోని అదానీ డేటా సెంటర్లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్కు పునాది వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. డేటా సెంటర్ నిర్మించేది అదానీ సంస్థే.. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్ కో ఇటీవల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్పడం మొదలు పెడితే.. బ్యాక్గ్రౌండ్లో వైఎస్సార్సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్సీపీ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్కు బీజం పడినప్పుడే.. గూగుల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్.. డేటా సెంటర్లో అతి ముఖ్యమైన విషయం.. సింగపూర్, విశాఖ మధ్య సబ్ సీ కేబుల్ (సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్ లైన్ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు. 190 ఎకరాలు కేటాయింపు.. వైఎస్సార్సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్ నోడల్ పాయింట్గా ఉంటుంది. డేటా సెంటర్తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్ తయారవుతుంది. తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం. క్రెడిట్ చోరీల్లో బాబు పీక్..! చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబుది సేమ్ స్టోరీ. మాదాపూర్లో సైబర్ టవర్స్.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్.జనార్థన్రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. ⇒ 2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపాటు చంద్రబాబుకి, హైదరాబాద్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్. ⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్ కడితే.. హైటెక్ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్ 19న పూర్తి చేశారు. ⇒ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే 23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే. ⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్పోర్ట్స్ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది. ⇒ వైఎస్సార్ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14లో ఐటీ ఎక్స్పోర్టులు రూ.57 వేల కోట్లకు చేరాయి. కానీ, చంద్రబాబు హైదరాబాద్ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్ రెండు టెర్మ్లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్ ఐటీలో టాప్లోకి వెళ్లింది. ⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.అభివృద్ధికి విజన్ ఉండాలి.. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్మెంట్ ఇప్పించాం. అదీ విజన్ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం. గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫెల్ క్లాస్లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్అండ్ఆర్కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే 3 బ్యాచ్లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం. ⇒ సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ తీసుకొచ్చాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్ స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించాం. ⇒ రుషికొండ హై ఎండ్ టూరిజం రిసార్ట్ నిర్మించాం. అదొక మాన్యుమెంట్ బిల్డింగ్. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం! బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్‘‘డేటా సెంటర్ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్, వాటర్ గజిలింగ్ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్తోపాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. -
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు. -
నాన్స్టాప్ ఉతుకుడు.. సరిపోయిందా బాబూ?
సాక్షి,తాడేపల్లి: ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్ అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుమ్మెత్తిపోశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ డాటర్ సెంటర్కు బీజం వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డాటా సెంటర్ ఇది. వేరే వాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు..అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డాటా సెంటర్పై వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి. మద్యం ఇకపై అమ్మేటప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసలు ఆ షాప్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి. అవి చంద్రబాబు చేతుల్లోనే కదా? అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు కాదా?. మరి అలాంటప్పుడు ఎవరు స్కాన్ చేసేది?.అంటూ మద్యం అమ్మకాలు,కల్తీ మద్యంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన,వైఎస్సార్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ వైఎస్ జగన్ను స్పందన కోరారు. అందుకు వైఎస్ జగన్ ఏమన్నారంటే? ఈ లింక్ క్లిక్ చేయండిఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నాంటూ దుయ్యబట్టారు. ఇలా ఉద్యోగుల్నే కాదు రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు చేస్తున్న మోసాల్ని వైఎస్ జగన్ కళ్లకు కట్టినట్లు చూపించారు. చంద్రబాబు మోసాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండిహైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బిల్డప్ ఇస్తారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారింది. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం. ‘ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ అంటూ హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ను బయటపెడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో సంవత్సరాలతో సహా వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి తీరుతెన్నులపై వైఎస్ జగన్ ఏమన్నారో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. -
ఉద్యోగులపై బాబు డ్రామా.. టీడీపీ వికృత ఆనందం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులనూ మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. డైవర్ట్ చేస్తూ దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారు. అది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు). డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు. దీనికే దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదు. ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం. ఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.ఇది కూడా చదవండి: గూగుల్ డేటా సెంటర్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. అరచేతిలో వైకుంఠం..ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు. టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు. ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. మొత్తం రూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు. ఒక్క నెల ఇచ్చారంతే. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదు. అప్పుడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో. ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. అంతా తిరోగమనే కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్సంక్షేమం నిల్.. స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయి. కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారు. మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. -
హైదరాబాద్ అభివృద్ధిలో బాబుకు సంబంధమే లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.2004లో వైఎస్సార్ ఓఆర్ఆర్ ఫేజ్-1 ప్రారంభించారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్ హయాంలోనే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 5650 కోట్లు. అదే వైఎస్సార్ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగింది. కానీ, ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు. -
Google Data Center: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోంది. వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. గూగుల్ డేటా సెంటర్ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు. -
ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు. ఎల్లో మీడియా బిల్డప్పులు..ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం..అసలు జనార్దన్రావు ఎవరు?. జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారురేపల్లే పేకాట కింగ్..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం. లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?. క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం. లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్’ అని విమర్శించారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదుక్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాంకోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్ వైజాగ్కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారుహైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్ సిటీహైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచే హైదరాబాద్లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగిందిక్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకందీనికి వైఎస్సార్సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్ సర్కార్కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు వైజాగ్లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందివైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్ గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణంలిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్ అసలు జనార్దన్రావు ఎవరు?జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్ పెట్టి నడిపించాంఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవుక్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్ కావాల్సిన అంశంలిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు జనార్దన్రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్గా క్రైమ్చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్రూమ్లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారుప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా.. -
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
కొత్త సీసాలో పాత కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసుల కుట్రలకు సంబంధించి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును ‘సిట్’ కొనసాగిస్తోందన్న వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు..? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటి?.. ఈ అక్రమ కేసులకు ఏం విలువ ఉంటుంది..? అని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం బాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్లేనన్నది తేటతెల్లమవుతోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కారు ఇంతగా బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతోంది. చంద్రబాబు సర్కారు భేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం.. వైఎస్సార్ సీపీపై బురద చల్లాలని యత్నించి భంగపడటం.. నకిలీ మద్యం కేసులో కూటమి సర్కారు అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెదిరించి.. దారికి తెచ్చుకుని..బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ రెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్ను గతంలోనే టీడీపీ వీరవిధేయ సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను సిట్ అధికారులు బెదిరించారు. అందుకు వారిద్దరూ మొదట్లో సమ్మతించ లేదు. అంతేకాదు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని తమని పోలీసులు బెదిరిస్తున్నారని వాసుదేవరెడ్డి న్యాయస్థానంలో మూడు సార్లు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయినా సరే సిట్ అధికారులు వారిని వెంటాడి వేధించారు. డెప్యుటేషన్ ముగిసినా సరే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా వేధించారు. అంతేకాదు ఆయన్ని మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి బెంబేలెత్తించారు. దీంతో సిట్ అధికారుల కుట్రలకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం గమనార్హం. కేవలం వారిద్దరి అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేశారు. ఆ కుట్రలన్నీ న్యాయస్థానం విచారణలో ఒక్కొక్కటిగా బెడిసికొట్టాయి. దాంతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం నమోదు చేసింది అక్రమ కేసేనన్నది స్పష్టమవుతోంది. ముందస్తు బెయిల్ పన్నాగం తాము బెదిరించి లొంగదీసుకున్న వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను సిట్ అధికారులు ఇప్పటివరకు అరెస్టు చేయ లేదన్నది తెలిసిందే. ఈ ఏడాది జూలైలో వారిద్దరితో ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని పిటిషన్ వేయించాలని భావించారు. అందుకోసం వారిద్దరినీ కొందరు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. కాగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ పిటిషన్లను న్యాయస్థాన వర్గాలు పరిశీలించాయి. అప్రూవర్లుగా మారాలంటే ముందు అరెస్టు కావాలి... న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాలని వారిద్దరికి స్పష్టం చేశాయి. జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటూనో... తరువాత ఎప్పుడో బెయిల్పై విడుదల అయిన తరువాత మాతమ్రే అప్రూవర్ పిటిషన్ను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నది నిబంధన అని స్పష్టం చేశాయి. అంతేగానీ కేసులో నిందితులుగా ఉన్నవారు కనీసం అరెస్టు కాకుండా... జైలుకు వెళ్లకుండా అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ దాఖలు చేయడం కుదరదని చెప్పడతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ కంగుతిన్నారు. అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో సిట్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది. అబద్ధపు వాంగ్మూలాల కుట్రేఈ తాజా పరిణామాలు ఓ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలు చేశారని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్టైంది. రెడ్బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూరిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడ్డామని బయటపెట్టుకుంది. సిట్ నమోదు చేసిన 161, 164 వాంగ్మూలాలన్నీ కట్టుకథలేనన్నది స్పష్టమైంది. మిథున్ రెడ్డిపై కుట్ర విఫలం ఈ అక్రమ కేసులో ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వ కుట్రలు చివరికి విఫలమయ్యాయి. డికార్ట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సంస్థకు రూ.5 కోట్లు వచ్చాయనే నెపంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాగా తమ నిర్మాణ సంస్థ లో సబ్ కాంట్రాక్టు చేసేందుకు డిపాజిట్గా రూ.5 కోట్లు చెల్లించారని... కోవిడ్ పరిస్థితుల్లో ఆ సబ్ కాంట్రాక్టు చేయలేకపోవడంతో తాము ఆ మొత్తాన్ని ఆ కంపెనీకి తిరిగి చెల్లించామని మిథున్రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఇక ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మిథున్రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేరు. అలాంటప్పుడు ఇక మద్యం వ్యవహారాలతో వారికి ఏం సంబంధం ఉంటుంది? ‘‘ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ అని ఈ కేసులో మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ఏసీబీ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం. న్యాయస్థానం ప్రశ్నలకు సిట్ తెల్లమొహం ఇక ఈ కేసులో సిట్ కుట్రపూరితంగానే నిరాధార ఆరోపణలతో చార్జ్షీట్లు దాఖలు చేసిందన్నది వెల్లడైంది. మొదటి చార్జ్షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించి న్యాయస్థానం లేవనెత్తిన 21 అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిపై సిట్ అక్రమ కేసు నమోదు చేసిందని తేటతెల్లమైంది. సిట్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. సోదాల ముసుగులో.. ఇక ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ బరితెగించి వేధింపులకు పాల్పడింది. ప్రధానంగా సోదాల పేరుతో కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి తదితరుల నివాసాల్లో సోదాల పేరుతో హైడ్రామాకు తెరతీసింది. సోదాల పేరుతో తామే అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ అధికారులు పన్నాగం పన్నారు. ఒకరి నివాసంలో సోదాలతో ఏదో సమాచారం లభించిందని చెప్పి మరొకరి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. లేని ఆధారాలు సృష్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు. జడ్జిపై లూథ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు ఇక ఈ అక్రమ కేసులో అడ్డగోలుగా వాదించేందుకు యత్నించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ న్యాయస్థానం మండిపడింది. అక్రమంగా అరెస్టు చేసిన నిందితులకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదన్న కోర్టు ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కౌంటర్ అఫిడవిట్లోని అంశాలను చదువుతూ పక్కదారి పట్టించేందుకు యత్నించడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సిద్ధార్థ్ లూథ్రా ఏకంగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి. ఆ జడ్జిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని హైకోర్టులో వ్యాఖ్యానించడం విభ్రాంతి కలిగించింది. న్యాయస్థానాలనే బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడటంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత బరితెగించి మద్యం దోపిడీ2024లో అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి మద్యం దోపిడీకి తెగిస్తోంది. అందుకోసమే ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి 3,336 ప్రైవేటు మద్య దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది. వాటికి అనుబంధంగా 3,336 పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చింది. 540 బార్లను టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. త్వరలో మరో 300 బార్లు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇక ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే రూ.20 అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. ఏకంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు బరితెగించింది. టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులుగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేశారు. మూడోవంతు నకిలీ మద్యం అమ్మకాలతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదేళ్లలో రూ.45వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియా చెలరేగిపోతోంది. మద్యం కుట్రదారు చంద్రబాబే.. ఇప్పటికీ బెయిల్పైనే ఉన్న బాబు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో ఏకంగా రూ.25వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పైనే ఉన్నారన్నది అసలు నిజం. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వీగిన కుట్రలు...రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్ర.... ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామేరెడ్బుక్ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. ఇక అసలు విషయం ఏమింటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ws hanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు కూడా. లేకపోతే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బందిపడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది.మానసిక రోగి సత్య ప్రసాద్..!కాగా ఈ అక్రమ కేసులో వెల్లడైన ఓ కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్య ప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డా.ఎండ్లూరి ప్రభాకర్, పి.విజయ పద్మ ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్య ప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వారిద్దరూ ప్రిస్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యంగా లేని సత్య ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్య ప్రసాద్తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారు. కానీ సత్య ప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడటం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది. బెడిసికొట్టిన రూ.11కోట్ల జప్తు కుట్ర ఇక లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డి ఫాం హౌస్లో రూ.11కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు డ్రామాకు తెరతీశారు. కాగా ఆ నగదు తనది కాదని...దీనిపై విచారించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది. దాంతో సిట్ అధికారులు ఆ రూ.11 కోట్ల నగదును అర్ధరాత్రి బ్యాంకులో జమ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఇక ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వెంకటేష్ నాయుడు పాత వీడియోను తెరపైకి తీసుకొచ్చి అది మద్యం డబ్బులేనంటూ ప్రచారం చేశారు.గన్మెన్పైనే థర్డ్ డిగ్రీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఆయనకు వెంటనే జీతం పెంచి మరీ ప్రమోషన్ కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్నేహితుడు వెంకటేశనాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో వెంకటేశ్నాయుడును అరెస్టు చేశారు. ఆయన పాత్రను నిరూపించే ఆధారాల్లేవు‘‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు..’’ ‘‘ఈ కేసులో మిథున్రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ ‘‘నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్ను తిరస్కరించలేం..’’ – మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో ఏసీబీ కోర్టుడీఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు రాజ్యాంగ విరుద్ధం‘‘ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేల్చి చెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది...’’ ‘‘ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట, రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని సుప్రీం చెప్పింది’’ ‘‘ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...’’ ‘‘చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందే గానీ నిందితులను కాదు. సీఆర్పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు..’’ – ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సర్కారు మెడలు వంచుతాం
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శైలజానాథ్, చెల్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జల చెప్పారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలసి గవర్నర్కి అందజేస్తారని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావి తరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. కోటి సంతకాల ప్రతులు నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్ 24న కేంద్ర కార్యాలయానికి చేరతాయి. వైఎస్సార్సీపీ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి.. వైఎస్సార్సీపీ దిగిపోయే నాటికి 7 కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేశాం. మరో 3 కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురంలో 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పనికాదు. కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? ఒకపక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతూ, తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతాయి? చంద్రబాబు చెబుతున్న పీపీపీ మోడల్ వల్ల భూమి, భవనాలు వినియోగించుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకొంటే పేదలు వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు? -
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత?: గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు
-
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో నకిలీ మద్యం, మహిళలు, చిన్నారులపై వరుస అఘాయిత్యాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. -
‘అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : అబద్ధానికి అధికారం ఇస్తే అది కూటమి ప్రభుత్వమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బోగస్ మాటలతో జనాన్ని మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆయన చెప్పేవి నిజమా? అబద్దమా? అని జనం కూడా చర్చించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కానీ మాపార్టీ పైకి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైరస్ కంటే ప్రమాదకరంగా టీడీపీ మారింది. తుని, రాజమండ్రిలో మైనర్ బాలికలపై జరిగిన సంఘటనలు దారుణం’ అని కూటమి పాలనపై మండిపడ్డారు.ఇదీ చదవండి:మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు.. -
రాజయ్యపేటకు చేరుకున్న YSRCP నేతలు... పోరాటానికి ఎంతవరకైనా సిద్ధం
-
అమిత్షాకు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో..‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. Warmest birthday greetings to the Honorable Union Home Minister, Shri Amit Shah Ji. I wish him good health and a fulfilling long life.@AmitShah— YS Jagan Mohan Reddy (@ysjagan) October 22, 2025 -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి.... పరిశ్రమలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు. త్వరలో జగన్ రాక.. ‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్పై..రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు. -
MPTC కిడ్నాప్ అయినా పట్టించుకోని ఆదోని రూరల్ పోలీసులు
-
మోసపోయాం.. జగనే న్యాయం చేయాలి: రాజయ్యపేట మత్స్యకారులు
రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్సీపీ నేతల మద్దతు.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..మత్స్యకారులు వారికి జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్కు వివరించారు.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాము..ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి..ప్రజల ప్రాణాలు తియ్యడానికి కాదు.ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి?.ఎన్నికలకు ముందు క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని అనిత చెప్పారుఅనితకు ఇది న్యాయమా?.ప్రజల పక్షాన ఉంటాం..బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు కానివ్వం.రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు..మేము ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా?రాజయ్యపేట గ్రామస్తుల ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారు.వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు.కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు మేము బాధ్యత వహిస్తాం.వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మీ మీద కేసులన్నీ తొలగిస్తారు..మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది.మీతో పాటు మేము పోరాటం చేస్తాం..మీకు అండగా మేముంటాం.తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు..మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం. కురసాల కన్నబాబు కామెంట్స్..ఎన్నికలకు ముందు అనిత ఎన్నో హామీలు ఇచ్చారు.బల్క్ డ్రగ్ పార్కు వలన క్యాన్సర్ వస్తుందని చెప్పారు..చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తు ఉండవు.పేదల పక్షాన వైఎస్ జగన్ నిలుస్తారు.కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఎత్తేస్తారు.చంద్రబాబు పెద్దల పక్షం.. వైఎస్ జగన్ పేదల పక్షం.రాజయ్యపేట రాకుండా అనేక ఆంక్షలు పెట్టారు..ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు..పోలీసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమనండి.వైఎస్ జగన్ సీఎం అయ్యాక కేసులన్నీ ఎత్తివేస్తారు.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది.వైఎస్ జగన్ ఆదేశం మేరకు మీ దగ్గరికి వచ్చాము.రాజకీయం కోసం రాలేదు.మీకు సంఘీభావం తెలపడానికి వచ్చాము.మీ గ్రామంలోకి మీరు రావడానికి గతంలో ఎన్నడైనా ఆధార కార్డులు చూపించారా?.వందల ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నారు..కొన్ని రోజుల పోతే పాస్పోర్ట్ అడుగుతారుబల్క్ డ్రగ్ పార్క్కు వైఎస్సార్సీపీ వ్యతిరేకంఅనితను నమ్మి మోసపోయాం: రాజయ్యపేట మత్స్యకారులుమత్స్యకారుల ఆవేదన..వైఎస్సార్సీపీ నేతలతో మత్స్యకారులు.నమ్మించి అనిత మోసం చేసింది.బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.మా ఊరి ఆడపిల్ల అని చెప్పింది.అనిత నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాము.మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి.మాకు జగనే న్యాయం చేయాలి.కూటమి వల్ల న్యాయం జరగదు.బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.మా ప్రాణాల పోయినా పర్వాలేదు.బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వము. వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం..రాజయ్యపేట చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులుమత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు.మత్స్యకారులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, కేకే రాజు, పార్టీ నాయకులు.వైఎస్సార్సీపీ నేతలకు తమ సమస్యలను విన్నవించుకున్న మత్స్యకారులు.మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ.నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ని కలిసిన మత్స్యకారులు.ఉద్యమంలో పాల్గొని మత్స్యకారులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు.👉పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తాయని, చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న తమ పొట్ట కొడతాయని, తమ ఆవేదన అర్థం చేసుకోమని నెల రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తొలి నుంచీ పార్టీ స్థానిక నేతలు ఆందోళనకారులకు మద్దతునిస్తుండగా.. అగ్ర నేతలు సైతం గ్రామానికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు.👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు బుధవారం ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. కాసేపట్లో వైఎస్సార్సీపీ నేతలు రాజయ్యపేటకు చేరుకోనున్నారు. కాగా, బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 39 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వారి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలుపనున్నారు. మరోవైపు.. రాజయ్యపేటలో పోలీసుల పహారా కొనసాగుతోంది. -
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఆయన ఆదివారం నుంచి కనిపించడం లేదు. బుధవారం ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నాగభూషణం కిడ్నాప్ కావడంతో తన భర్తను కూటమి నాయకులే కిడ్నాప్ చేశారంటూ అతడి భార్య విజయలక్ష్మి ఆదోని తాలూకా పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కూటమి నాయకుడు శ్రీనివాస ఆచారి ఆదివారం రాత్రి 7 గంటలకు తన భర్తను కారులో తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదని తెలిపారు. ఈ విషయమై శ్రీనివాస ఆచారిని అడిగితే ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు.. అంటూ మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీనివాస ఆచారి ఇంటివద్దకు వెళ్లి గట్టిగా నిలదీస్తే తమపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అని బెదిరించారని తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు తన భర్త ఆచూకీ లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రలోభాలు, కిడ్నాప్ ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులపై ప్రలోభాల వల విసరటమేగాక కిడ్నాప్కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. మండలంలో 29 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మూడుస్థానాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 26 ఎంపీటీసీ స్థానాల్లో 24 వైఎస్సార్సీపీ గెల్చుకుంది. కపటి ఎంపీటీసీ సభ్యురాలు బడాయి దానమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దానమ్మ, ఆమె భర్త పంపాపతి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదోని సబ్కలెక్టర్కు మెమొరాండం ఇచ్చారు. సబ్కలెక్టర్ ఈనెల 22వ తేదీకి నోటీసు జారీచేశారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని నిలబెట్టుకోవాలని దానమ్మ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎలాగైనా ఈ పదవిని నిలబెట్టుకోవాలని దానమ్మ భర్త పంపాపతి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ముగ్గురికి డబ్బు వల విసిరి, నాగభూషణంరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కూటమి నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఆఖరికి అవిశ్వాస తీర్మానం నెగ్గేంత సంఖ్యాబలం వైఎస్సార్సీపీకే ఉంటుందని భావిస్తున్నారు. -
ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘మీరూ.. మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా..? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ఇవన్నీ వెలగని దీపాలే కదా... 1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి.. 2. ప్రతి అక్కచెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000.. 3. 50 ఏళ్లకే పెన్షన్.. నెల నెలా రూ.4 వేలు... 4. పీఎం కిసాన్ కాకుండా, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట.. 5. ఎంతమంది పిల్లలున్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000 6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు 7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం..ం 8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు.. ⇒ ఇవన్నీ.. వెలగని దీపాలో ంలేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా.. లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? ⇒ వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా! ⇒ మా పాలనలో 2019–24 మధ్యం ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు! -
గన్నవరంలో పోలీసుల అత్యుత్సాహం
కృష్ణాజిల్లా: జిల్లాలోని గన్నవరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టినరోజు వేడుకలకు కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటే... ఆ వేడుకల్ని పోలీసుల అడ్డుకున్నారు. డీజే వాహనానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని స్టేషన్కు తరలించారు. చివరక కేక్ కటింగ్కు అనుమతి లేదని పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వంశీ బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్కు తరలించారు. -
‘ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం’
నెల్లూరు: ఒకపక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటోందని, మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డీఏ కూడా మోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు. ఆ అరియర్స్ని కూడా రిటైర్మంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్, రూ. 34 వేల కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఇచ్చిన ఒక్క డీఏ కూడా మోసమేఉద్యోగులను ఉద్ధరించేసినట్టుగా రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. ఉద్యోగులకు డీఏ ధమాకా, దీపావళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికల్లకు ఇచ్చిన హామీలు పక్కడపెడితే వారికి హక్కుగా దక్కాల్సినవే ఇవ్వకుండా ఒక డీఏ రిలీజ్ చేసి వారికి బిక్షం వేస్తున్నట్టు మట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం దీపావళికి ముందు నేరుగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడంతో ఈసారి ఉద్యోగుల హామీలన్నీ నెరవేరుస్తారని అనుకున్నారు. నాలుగు డీఏలు ఇవ్వడంతోపాటు పీఆర్సీ కమిషన్ వేస్తారు, పెండింగ్ అరియర్స్ రిలీజ్ చేస్తారని, 30 శాతం ఐఆర్ ఇస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ తీరా చూస్తే సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి ఒకే ఒక్క డీఏ ఇచ్చేయడం చూసి ఉద్యోగులంతా నివ్వెరపోయారు. పీఆర్సీ కమిషన్ పైగానీ, ఐఆర్ పైగానీ, పెండింగ్ అరియర్స్ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలించాడు. ఇచ్చిన డీఏలోనూ ఉద్యోగులకు జరిగిన మోసమే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ అయిదేళ్ళ పాలనలో 11 డీఏలువైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలలో ఆర్నెళ్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ ను కూడా రిలీజ్ చేసి మొత్తం 11 డీఏలు ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాలుగు డీఏలు పెండింగ్ పెడితే అందులో ఒక డీఏ ఇస్తున్నట్టు చంద్రబాబు డీఏల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. 2024 లో జనవరి, జూన్ తోపాటు 2025 జనవరి జూన్ నెలల డీఏలు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబే చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన డీఏలను కూడా జగన్ ఖాతాలో వేసి తప్పించుకోవాలని చూడటం హేయం. వైఎస్సార్సీపీ హయాంలో ఒక డీఏ పెండింగ్ లో ఉండటానికి కూడా కారణం కేంద్ర ప్రభుత్వ జాప్యమే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్రాలు ప్రకటించడం అనేది ఆనవాయితీ. ఆ ప్రకారం కేంద్రం జనవరి 2024లో రిలీజ్ చేయాల్సిన డీఏను మార్చి 6న ప్రకటించడంతో ఆ వెంటనే మార్చి 11న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రకటించలేకపోయాం. 2024 జనవరి డీఏను ఇప్పుడు ప్రకటించారు. దానికి సంబంధించి డీఏ అరియర్స్ ని కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామనడం దారుణం. చంద్రబాబు తప్ప దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చెప్పడం చూడలేదు. పైగా ఈ అమౌంట్ను పీఎఫ్ అకౌంట్ లో కూడా జమ చేస్తామని చెప్పకపోవడం దుర్మార్గం. ఇప్పుడు ఎంత బకాయి ఉందో ఆ మొత్తమే వడ్డీ కూడా లేకుండా 30 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడం ఉద్యోగులను దారుణంగా వంచించడమే. చంద్రబాబు తీసుకొస్తున్న ఇలాంటి కొత్త సంస్కృతితో ఉద్యోగుల జీవితాలు ఏమైపోతాయో ఆలోచించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల డీఏల గురించి ఏమీ ప్రస్తావించడం లేదు.పీఆర్సీ కమిషన్ ఊసే లేదుపీఆర్సీ కమిషన్ కాల పరిమితి ముగిసి ఇప్పటికే రెండేళ్ళ మూడు నెలలు గడిచిపోయింది. అయినా కొత్త పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కోసం వేసిన కమిషన్ను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, కమిషనర్ చైర్మన్తో రాజీనామా చేయించారు. తరువాత ఈరోజుకీ పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా చంద్రబాబుకి మనసు రావడం లేదు. ఈరోజు పీఆర్సీ కమిషన్ వేసినా దాని నివేదిక వచ్చి అమలు చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉద్యోగుల సంఘాల మీటింగ్లో పీఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పకుండా తప్పించుకోవడం దుర్మార్గం కాదా? పీఆర్సీ వేయనప్పుడు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ రెండేళ్ళ మూడు నెలల కాలంలో ఐఆర్ కూడా ఇవ్వని దారుణ పరిస్థితిని చంద్రబాబు నేతృత్వంలో ఉద్యోగులు ఎదుర్కుంటున్నారు. కోవిడ్ వంటి పరిస్థితులున్నా సాకులు చెప్పి తప్పించుకోకుండా ఆరోజున వైఎస్ జగన్ 23 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల పక్షాన నిలిచారు. 27 శాతం ఇస్తామని చెప్పి 23 శాతమే ఇచ్చారని, ఇది రివర్స్ పీఆర్సీ అని ఆరోజున, ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు సహా కూటమి నాయకులు ప్రచారం చేసుకున్నారు. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని హేళన చేసి మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు. కనీసం కమిటీ కూడా వేయకపోగా వైఎస్ జగన్ హయాంలో వేసిన కమిటీతో కుట్రపూరితంగా రాజీనామా చేయించారు.రూ.34 వేల కోట్లకు ఉద్యోగుల బకాయిలుస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు గెలిచిన వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశాడు. ఆ రూ.22 వేల కోట్లు దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు, తీరా గెలిచాక వాటి ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రంలో రూ.22 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పాడు. మొన్నటి ప్రెస్మీట్లో రూ.34 వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెబుతున్నాడు. బకాయిలు చెల్లిస్తానని చెప్పి, ఏకంగా రూ. 12 వేల కోట్లు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇది మోసం కాదా? రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే వెంటనే చెల్లిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం 2027-28 లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వారిని వేధించడమే. పింఛన్ పై ఆధారపడి జీవించే వృద్ధులను కూడా వేధించడం న్యాయమా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కర్నాటక, తమిళనాడుతో పోల్చి చూపించి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగుల జీతాలు తగ్గించుకోవాలని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నాడు. సీఎం, డిప్యూటీ సీఏం, మంత్రులు చేస్తున్న దుబారాను తగ్గిస్తే, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. వాలంటీర్లకు జీతాలు పెంచుతానని చెప్పి, వారిని రోడ్డు పాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీకు అనవసరంగా జీతాలిస్తున్నామని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి అనడం సరికాదు. పోలీసులకు 4 సరెండర్ లీవ్లకు గానూ ఒక్కదానికే అనుమతి ఇస్తూ, రెండు నెలల తరువాత రూ.105 కోట్లు విడుదల చేస్తాను అని చెప్పడం దారుణం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు సీఎంగా వైయస్ జగన్ దానిని ప్రభుత్వపరం చేస్తే, దానిపైనా సీఎం చంద్రబాబు వక్రబాష్యం చెబుతున్నాడు. ఆర్టీసిని కాపాడాలనే ఉద్దేశమే ఆయనకు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’ -
‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’
కాకినాడ: 2019 నుంచి 2024 కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తే.. దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దీనినే క్రెడిట్ చోరీ అంటారు.. చంద్రబాబు అని కురసాల ఎద్దేవా చేశారు. ‘గత మరచిపోయిన చంద్రబాబు.. అన్నీ తానే చేశాను అంటున్నారు.వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమీ ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరుస్తే నిజం చెప్పకుండా తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ,డేటా సెంటర్,పోర్టు లను తామే కొబ్బరి కొట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ చేయ్యలేదు. *సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకున్నారు. *దీనికి వంత పాడుతున్న ఎల్లో మీడియా.. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్గా నియమించారు.ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ్యమని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమీటి నాయకులను గృహనిర్భం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి... అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని హమీ ఇచ్చారు చంద్రబాబు. సెజ్ కోసమే భూసేకరణ ముఖ్యం.. గ్రామలు ఎలా పోయిన పర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి. 158 జీవో ద్వారా స్ధానికులకు 78% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయ్యండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు.వాటిలో ఇంకా ఉన్న కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు ఇప్పించారు. జిఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మసానాలు,చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబుకు లేదు. సెజ్ లో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్. కార్పోరేట్ కంపెనీలు అంటే...జీ హుజీర్ అంటూ చంద్రబాబు సాగిలపడిపోతాడు’ అని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు.విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. -
పోలీసుల వైఫల్యంతోనే నూకరాజు హత్య: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
సాక్షి, నర్సీపట్నం: కొయ్యూరు వైఎస్సార్సీపీ జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పరామర్శించారు. పోలీసుల వైఫల్యంతోనే జడ్పీటీసీ నూకరాజు హత్య జరిగిందని.. నూకరాజు హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని విశ్వేశ్వరరాజు అన్నారు. గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.ఆసుపత్రి వద్ద జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోస్ట్మార్టం చేయనివ్వమంటున్న కుటుంబ సభ్యులు.. హత్యకు ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారుకాగా, జడ్పీటీసీ వారా నూకరాజు మృతదేహాన్ని నిన్న(సోమవారం) నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్చురి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టుల మొబైళ్లను లాక్కున్నారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు చిందులు తొక్కారు. మొబైల్ లాక్కొని వీడియోలు డిలీట్ చేసిన తర్వాత తిరిగి అప్పగించారు -
YSRCP ZPTC దారుణ హత్య
-
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ దారుణ హత్య
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ హత్యకు గురయ్యారు. జెడ్పీటీసీ వారం నూకరాజును దుండుగులు హత్య చేశారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ దారుణం జరిగింది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు.నూకరాజు హత్యకు పోలీసులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకరాజుకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. గతంలో కూడా నూకరాజుపై హత్యాయత్నం జరిగిందని.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నూకరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు. -
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్ 20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
రీల్స్ చేసుకో.. నీకు రాజకీయాలెందుకు?
-
రెచ్చిపోయిన జేసీ అనుచరులు.. YSRCP నేతపై కర్రలతో దాడి
-
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ గూండాగిరి
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్కళ్యాణే
కందుకూరు/పెదకాకాని/గుంటూరు మెడికల్ : కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసులో మొదటి ముద్దాయి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అవుతారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు కాపులను టీడీపీకి ఓట్లు వేసేలా ప్రోత్సహించి.. చివరికి టీడీపీ అధికారంలోకి రాగానే అదే కాపులను ఘోరంగా చంపుతుంటే కనీసం ప్రశి్నంచలేని స్థితిలో పవన్కళ్యాణ్ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా ఆదేశాలిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్రలు వేర్వేరుగా పరామర్శించారు. అలాగే, ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్నాయుడు, బాబాయి కుమారుడు భార్గవ్నాయుడులను గుంటూరు ఉదయ్ ఆస్పత్రిలో జక్కంపూడితో పాటు, అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కాపులను హత్యచేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా హత్యతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై ఎలాంటి భాషను ఉపయోగించి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. తాజాగా ఈ నెల 2న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. పవన్కళ్యాణ్కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా.. అని ప్రశ్నించారు. ఏం చేసినా పైనుంచి కాపాడే ఓ అధికార వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే హరిచంద్రప్రసాద్ లాంటి మృగాలు రెచి్చపోతున్నాయన్నారు. హత్యకేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, కూటమి పెద్దల అండదండలతో వారిని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నిందితులకు శిక్ష పడేవరకు బాధితుల తరఫున పోరాడతామని వారు స్పష్టం చేశారు. -
‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా వచ్చేది మన ప్రభుత్వమే’
కృష్ణాజిల్లా: దళితులతో చంద్రబాబుకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్టర అధ్యక్షుల టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆనాడే ఆయనతో దళితులకు సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈరోజ( ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన టీజీఆర్ సుధాకర్ బాబు.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. వచ్చేది మన ప్రభుత్వమే ... ఎవరికీ భయపడొద్దు. 2027లో ఎన్నికలొచ్చినా... 2029లో ఎన్నికలొచ్చినా వచ్చేది మనమే. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్రెడ్డి. టిడిపి నేతలు రౌడీయిజంతో వచ్చినా ...రాజకీయంతో వచ్చినా.. జగన్ కోసం గుండె చూపించి నిలబడదాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుతో దళితులకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయి. దళిత కుటుంబంలో పుట్టిన నన్ను యువజన కాంగ్రెస్ నాయకుడిగా చేసిన వ్యక్తి వైఎస్సార్. దళితులను రాజకీయంగా చైతన్య పరిచిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. దళితులకు జగన్ ఐదు మంత్రిపదవులిచ్చారు. చంద్రబాబు మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి మాత్రమే ఇచ్చారు. టిడిపిలో ఉండి చంద్రబాబుకోసం తబలా వాయించే దళిత నాయకులకు సిగ్గుందా. దళితుల కుటుంబాల్లో చంద్రబాబు పండుగ లేకుండా చేశారు. కల్తీ మద్యం తయారు చేసి..అమ్మేది టిడిపి వాళ్లు. ఆ మద్యం తాగి చనిపోయేది మా దళితులుకల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రతీ ఒక్కరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఒక్క డీఏ ప్రకటించి పండగ చేసుకోమంటున్నారు’
కాకినాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను డీఏ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ పేరుతో ప్రచారం సాగిందని, అయితే చివరకు ఒక్క డీఏని ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని కురసాల మండిపడ్డారు. ‘ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క డిఎ ప్రకటించారు. దీంతో పండుగ చేసుకోమంటున్నారు.లెక్కప్రకారం నాలుగు డీఏలు ఇవ్వాలి,. ఒక్కసారి క్షేత్ర స్ధాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో మోసం చేసి ముంచేశాడు. ఫీజు రియింబర్మెంట్ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేశాడు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు-నేడును చంద్రబాబు నీరుగార్చేశారు. వారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నా...వారితో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాడం లేదు. చంద్రబాబు మారేడేమో అని ఉద్యోగులు అనుకున్నారు. ఉద్యోగుల డిఎ విషయంలో పెద్ద హైడ్రామా చేసే ప్రభుత్వం ఏదీ ఉండదేమో.. 16 నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మసిబూసి మారేడు కాయ చేసి రాష్ట్రంలో ఏదో గొప్పగా జరిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఓపిఎస్ నే అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏలాంటి అలవెన్సులు,బకాయిలు చెల్లించారు.పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు..ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు. ఆబ్కాస్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్ధలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.’ అని కురసాల తెలిపారు.ఇదీ చదవండి:‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
లక్ష్మీనాయుడు హత్య దారుణం
కందుకూరు: తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు (25) హత్య దారుణమని, అతడి ఇద్దరు సోదరులు కాళ్లు, చేతులు విరిగి శాశ్వత అంగ వైకల్యం కలిగే స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు కుటుంబంతో మాట్లాడాక అతడి హత్యకు అసలు కారణాలు తెలుస్తున్నాయని చెప్పారు. కమ్మ వర్గానికి చెందిన కాకర్ల హరిచంద్రప్రసాద్ ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళిక ప్రకారం క్రూరంగా లక్ష్మీనాయుడు ప్రాణాలు తీశాడని పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో శనివారం లక్ష్మీనాయుడు కుటుంబాన్ని త్రిమూర్తులు పరామర్శించారు. లక్ష్మీనాయుడు భార్య సుజాతతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. సుజాతతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడాలని ఆయనకు వారం రోజులు సమయం ఇస్తున్నామని చెప్పారు. తర్వాత ఎటువంటి విచారణ చేయాలో నిర్ణయం తీసుకోవాలన్నారు. పవన్ స్పందించకపోతే బాధిత కుటుంబంతో కలిసి అసలు ఏం జరిగిందో పూర్తిగా వెల్లడిస్తామని చెప్పారు. ‘‘లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే జరిగిన ఘటనను తొలుత యాక్సిడెంట్గా చెప్పారు. తర్వాత క్రూరంగా చంపారని అన్నారు. సుజాతకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. కానీ, ఇది కాపు జాతి సిగ్గుపడేలా జరిగిన హత్య అని గుర్తుంచుకోవాలి. కులానికి ఇంతటి దారుణ అన్యాయం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలనేది మా ఉద్దేశం’’ అని త్రిమూర్తులు వివరించారు. మున్ముందు ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునేందుకు రాష్ట్రంలోని కాపు జాతి సిద్ధంగా ఉందన్నారు. ప్రతి కాపు హృదయాన్ని కదిలించి... లక్ష్మీనాయుడు కుటుంబానికి భరోసా కల్పిస్తామని చెప్పారు. కాపు వర్గానికి చెందినవారు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని వివరించారు.దురహంకారంతో వేధించాడు‘‘దారకానిపాడులో లక్ష్మీనాయుడును మెజార్టీ అయిన హరిచంద్రప్రసాద్ చిన్నచూపు చూశాడు. వేధించాడు. చివరకు దారుణ హత్యకు ఒడిగట్టాడు. తమ వర్గానికి చెందినవారి ప్రభుత్వం ఉందనే ధీమా, ఆధిపత్య భావన దీనికి కారణం’’ అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. జ్యుడీషియల్ లేదా నిజాయతీపరుడైన ఐపీఎస్ అధికారితో స్వతంత్ర విచారణ జరిపించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మీనాయుడు భార్యపై హరిచంద్రప్రసాద్ కన్నేసి దుర్బుద్ధితో వేధించాడని, ఎదిరించలేక వారు నాలుగు నెలలు నలిగిపోయారని అన్నారు. లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవనాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్ను ప్రశ్నించిన మరునాడే హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. నిందితుడికి ఉరి లేదా ఇంకేదైనా కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు.


