YSRCP
-
ఏబీఎన్పై జాతీయ మహిళా కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్.. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధుల్ని అగౌరవ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆమె ఓ లేఖ రాశారు.తమ పార్టీ నేతలతో పాటు మహిళల్ని కించ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో వరుదు కళ్యాణి ఇంకా ఏం పేర్కొన్నారంటే..మీడియా స్వేచ్ఛ పేరుతో ఏబీఎన్ వ్యక్తిత్వ హననంఏబీఎన్ ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యం తమ ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ వీడియో లింక్ : https://youtu.be/nF_9828F18c సహా, అత్యంత అపకీర్తికరమైన, అవమానకరమైన, తప్పుదారి పట్టించే, అనైతిక విషయాలను ప్రసారం చేసినందుకు సంబంధించి తక్షణ జోక్యం, తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇందులో అన్నీ అవాస్తవాలతో పాటు దురుద్దేశపూర్వక, హానికరమైన విషయాలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఇది నిష్పక్షపాత పాత్రికేయ కథనం కాదు. ద్వేషం, హేళన, పక్షపాతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నింపేందుకు ఉద్దేశించిన పక్షపాతపూరిత, ఏకపక్ష కథనమే.వైఎస్సార్సీపీ నేతలపై దారుణ వ్యాఖ్యలుఏబీఎన్లో ప్రసారమైన ఈ కథనంలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం మధ్య ముఖ్యంగా,యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువుకు భంగం కలిగించే భాషను వాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను, మద్దతుదారులను వెన్నెముక లేని వారిగా అభివర్ణించింది. అంతేకాక వారు తమ నాయకుడికి ఆపాదించిన అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలను కూడా గుడ్డిగా నమ్ముతారని అనుకునే విధంగా పలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా చేసింది.రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలు మీ భార్యలు కాదని చెప్పితే, మీరు గుడ్డిగా విశ్వసిస్తారు, అంతేకాదు మీ సొంత భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి, పెళ్లి సంబంధాలకు కూడా చూసుకుంటారు, ఇలాంటి నాయకులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితం, తీవ్ర అభ్యంతరకరం. ప్రజల దృష్టిలో వైఎస్సార్సీపీ నేతల ప్రతిష్టను పలుచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.కనీస బాధ్యత లేని పాత్రికేయంఈ వివాదాస్పద కథనంలో ఏబీఎన్.. వైఎస్సార్సీపీ నేతల్ని తెలివి, హేతుబద్దత, బుద్దీ జ్ఞానం లేని వారిగా చిత్రీకరించింది. అలాగే మా పార్టీ విధానాల్ని పిచ్చి ప్రతిపాదనలు అంటూ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. ఈ కథనంలో యాంకర్ మరింత ముందుకు వెళ్లి తమ పార్టీ నేతల్ని పిచ్చి వాళ్ల సమూహంగా కూడా అభివర్ణించడం దారుణం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన, పరువు నష్టం కలిగించే కథనమే అవుతుంది. ఈ వ్యాఖ్యలకు ఏ విధమైన వాస్తవ ఆధారాలు లేవు. లేదా ధృవీకరించబడిన మూలాలు కూడా లేవు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా సాధారణీకరించి, కేవలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా వండి వార్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో వాడిన భాష కూడా అత్యంత అసభ్యంగా ఉంది. పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక మర్యాదా ప్రమాణాలను కూడా ఉల్లంఘించింది.ఏబీఎన్ కథనం కేబుల్, టెలివిజన్ చట్టం ఉల్లంఘనేఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కథనం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ (నియంత్రణ) చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్ ను పూర్తిగా ఉల్లంఘించింది. ఆ కోడ్ ప్రకారం అగౌరవ, తప్పుడు, అర్థసత్యాలైన విషయాలను ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా నిషిద్దం. ఎందుకంటే ఇది ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేది, తప్పుదారి పట్టించేదిగా ఉంది. అలాగే నిర్లక్ష్యంగా వండి వార్చడంతో పాటు ద్వేషం కలిగించేలా దీన్ని రూపొందించారు. వాస్తవాలను ధృవీకరించకపోవడం, సమతుల్య అభిప్రాయాలు ఇవ్వకపోవడం, లేదా ప్రతిస్పందనకు అవకాశం కల్పించకపోవడం మీడియా బాధ్యత, నైతిక ప్రమాణాల తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. అలాగే ఏబీఎన్ సంస్థ సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లోపించిందని అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యేందుకు అవకాశం లభించింది.తక్షణం ఏబీఎన్ పై కఠిన చర్యలు తీసుకోండిఈ కంటెంట్ డిజిటల్ వేదికలపై కొనసాగుతూ అందుబాటులో ఉండటం వల్ల తమ పార్టీకీ, అధినేత జగన్కు జరిగిన నష్టం మరింత పెరుగుతోంది. ఎందుకంటే ఇది విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండి వారికి పరువుకు భంగం కలిగించేలా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుంది. అలాగే మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై చట్టప్రకారం తగిన చర్యలు ప్రారంభించాలి.అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో ప్రోగ్రామ్ కోడ, పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడాల్సిన అసరం ఉంది. ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఛైర్ పర్సన్ ను కోరుతున్నాం. న్యాయం, నిష్పాక్షికత, వ్యక్తులు, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఆదేశాలను కూడా జారీ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విజ్ఞప్తి చేశారు. -
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమర్థించడం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు కావని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని చెప్పారు.రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ సూచించిన మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే రాధాకృష్ణతో కుట్రలు చేయించారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసే కుట్రవీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైఎస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైఎస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని కూటమి నాయకులకు అర్థమైపోయింది. దాన్నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే ప్లాన్ ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో ఎవరైనా వైఎస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అయితే వారిపై అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసి మావిగన్ అనే పేరెత్తకుండా చేయాలనే పథకం ప్రకారం కుట్ర చేశారు.అవే మాటలను మీకు అన్వయించుకోండిప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు లేదా? వైఎస్ జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? జగనన్న కళ్లలో ఆనందం కోసం వైయస్సార్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారని చెబుతున్న నారా లోకేష్, ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చినందుకా?ఇదేనా భువనేశ్వరి.. లోకేష్కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు. ఆమెకు పదవి ఇచ్చింది జగన్ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టినప్పుడు సై అన్నారు. మోదీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వచ్చి న వ్యాఖ్యలు కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల సమర్థింపుతో కావాలని చేసిన కుట్రేనని తేలిపోయింది.వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్ జగన్ ఆధారాలతో సహా వెలికితీయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తావించిన మావిగన్ మోడల్తో చంద్రబాబు వేల కోట్ల అవినీతి ఆశలు కుప్పకూలిపోయాయి. వాటి నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలు చేస్తున్నారు. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు -
నా భార్యను పక్కన కూర్చోపెట్టుకుని చెప్తున్నా... ABN రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ రాచమల్లు
-
చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం
-
‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్రెడ్డి అన్నారు.‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్, జగన్ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. -
చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఫైర్ (ఫోటోలు)
-
మీ అందరికి మాటిస్తున్నా... ABN రాధాకృష్ణకు జగన్ మాస్ వార్నింగ్
-
పిచ్చి కూతలపై ప్రజా పోరాటం
-
YSRCP నేతలతో వైఎస్ జగన్ @తాడేపల్లి
-
అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు
-
భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..
-
నువ్వు రోడ్డు మీదకు వస్తే చెప్పు తీసుకొని కొడతాం... మహిళలు వార్నింగ్
-
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
మహిళలను రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు: అంబటి
గుంటూరు: ఏబీఎన్ ఆఫీసుల వద్ద నిరసనలు చేస్తే అడ్డుకుంటారా? అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. అయితే, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.‘నా ఇంటిని రౌడీ మూకలు ముట్టడిస్తే నో పోలీస్. మా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే పోలీసులు ఆపలేదు. సందులో ఏబీఎన్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపితే లాఠీఛార్జ్ చేస్తారా? మహిళలను ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’ అని అంబటి రాంబాబు అన్నారు.కాగా, గుంటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసన తెలిపారు. ఆ సమయంలో మాజీ మంత్రి అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏబీఎన్ ఆఫీస్ ఎదుట అంబటి రాంబాబు, పార్టీ నేతలు బైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పోలీసుల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి: గుడివాడ అమర్నాథ్
విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టామని అన్నారు. విశాఖలో ఇవాళ ఆయన నిరసనలో పాల్గొని మాట్లాడారు.‘దేశంలో అతిపెద్ద స్కాం అమరావతి. మావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్. అమరావతిలో 4 వేల రూపాయల ఖర్చు అయ్యే భవనాల చదరపు అడుగు నిర్మాణానికిరూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్. కొత్త పలుకు కాదు చెత్త పలుకు. మేము మీలాగా తప్పులు పనులు చేసి పదవులు పొందలేదు. నీ గురించి నీతోటి జర్నలిస్టులను అడిగితే చెబుతారు. జర్నలిస్ట్ స్థాయి నుంచి కంపెనీకి అధిపతివి ఎలా అయ్యావు? ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు, నువ్వు పెన్నుపోటు పొడిచావు’ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘రాధాకృష్ణవి నీచమైన రాతలు. రాధాకృష్ణ పాపం పండింది. అందుకే ఇలాంటి రాతలు రాశాడు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాబు, లోకేష్ మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నాడు. రాధాకృష్ణ రాతలు చూసి చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో మహిళలకు క్షమాపణ చెబుతూ వార్త రాయాలి’ అని అన్నారు.మావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు రాశారని చెప్పారు. రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని తెలిపారు. జర్నలిజం విలువలను రాధాకృష కాలరాశారని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలిపారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మావిగన్ పంచ్తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
ABN రాధాకృష్ణ వ్యాఖ్యలపై YSRCP నిరసన
-
రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన రోత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం, ఏప్రిల్ 8) కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట వైఎస్సార్సీపీ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. మహిళలను ఉద్దేశించి పైశాచిక కామెంట్స్ చేసిన రాధాకృష్ణ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ఆందోళనలు.. అప్డేట్స్వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుఅనంతపురం ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్ద ఉద్రిక్తతనిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుపోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదంఅక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలుబహిరంగంగా క్షమాపణలు చెప్పాలి: దేవినేని అవినాష్రోత పత్రిక, రోత ఛానెల్ ఏబీఎన్లో రాధాకృష్ణ మహిళలను కించ పరిచాడురాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అమరావతిలో అవినీతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు రాధాకృష్ణ దుర్భాషలాడితే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏమైపోయారుస్కీమ్లు, స్కామ్లతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారుప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మావిగన్ను జగన్ ప్రతిపాదించారుగుంటూరులో పోలీసుల దౌర్జన్యంఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనమాజీ మంత్రి అంబటిని అడ్డుకున్న పోలీసులుఏబీఎన్ ఆఫీస్ ఎదుట బైఠాయించిన అంబటి, పార్టీ నేతలువైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై జులుంపోలీసుల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం నెల్లూరు ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనమాజీ మంత్రి కాకాణి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనవైసీపీ నేతల ఇంట్లోని మహిళలపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణABN రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆగ్రహంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకురాధాకృష్ణపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిరాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టాము రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకుదేశంలో అతిపెద్ద స్కాం అమరావతిమావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు..: కేకే రాజురాధాకృష్ణపై విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహంమావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ట కు చేరుకుందిజర్నలిజం విలువలను రాధాకృష్ణ కాలరాశారు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారురాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలిట్రాఫిక్ను మళ్లించి మరీ పోలీసుల రక్షణవైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఆందోళనలు ఏబీఎన్ ఆఫీసు వద్ద ఆందోళన చేసేందుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తల అరెస్ట్ఏబీఎన్ కార్యాలయానికి మూడంచెల భద్రతఇప్పటికే ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుఆంధ్రజ్యోతి కోసం ట్రాఫిక్ను మళ్లించిన పోలీసులుపాఠశాలలకు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులునగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలుపాత బస్టాండ్కు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులుశాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులురాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వైఎస్సార్సీపీ శాంతియుత నిరసన నిరసనలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, ఉమ్మడిగి శాఖ జిల్లా నాయకులువైఎస్సార్సీపీ నిరసనపై పోలీసుల జులుంనిరసన కోసం వేసిన టెంటును తీసివేసిన పోలీసులుశాంతియుత ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే నాయకులను అడ్డుకుంటున్న పోలీసులుఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులను, అనకాపల్లి జిల్లా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ నేతలుఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్భారీగా మోహరించిన పోలీసులుఅన్నమయ్య జిల్లాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళనవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ ఆధ్వర్యంలో నిరసనఅంబేద్కర్ విగ్రహ వద్దకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం భారీగా మోహరించిన పోలీసులు ఆంజాద్ బాషా హౌజ్ అరెస్ట్వైఎస్సార్సీపీ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలువైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకుల హౌస్ అరెస్టులుమాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద మోహరించిన పోలీసులుఅంజాద్ బాషా ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుమాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్నేడు కడపలోని ABN కార్యాలయం ఎదుట నిరసనకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శ్రేణులుఈ నిరసనలకు హాజరు కావద్దంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంవిజయవాడ ఏబీఎన్ ఆఫీస్ వద్ద.. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ఏబీఎన్ కార్యాలయం వద్ద ఆందోళనకి సిద్దమైన వైఎస్సార్సీపీఏబీఎన్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు..ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లే రహదారులలో బారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులునిరసన తెలిపి తీరతామంటున్న వైఎస్సార్సీపీ నేతలుమహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ, విలువలు దిగజార్చేలా ఉన్నాయని చెప్పారు. మహిళలను ఆయన అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసు ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నేడు ఏపీలోనూ శాంతియుత నిరసనలు తెలపనున్నారు. -
వావి వరుస లేని ఒక కుక్క రాథాకృష్ణ.. నాగార్జున యాదవ్ సంచలన వార్నింగ్
-
మేము టిఫిన్ చేస్తుంటే ఆ CI వచ్చి.. నా గొంతు పట్టుకుని.. తాటిపర్తి సంచలన నిజాలు
-
బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గపు మాటలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మరోసారి స్పందించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గంగా మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడింది తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్లు సమర్థిస్తారా?. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. కూటమి నేతలే మహిళల్ని వేధిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తే.. బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఎస్పీ ఆఫీసులోకి ఎమ్మెల్యే చొరబడడం ఏంటి?. దానికి చంద్రబాబు పంచాయితీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధించిన కూన రవిపై చర్యలేవి?. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్పై చర్యలేవి?. మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారు?. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో ఆడుకుంటే చర్యలు లేవు. పైగా చంద్రబాబు ఆయన్ని తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..
-
ప్రశ్నించానని పోలీసులు రిమాండ్కు పంపారు
సాక్షి, అమరావతి: తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించిన తనను పామర్రు సీఐ శుభాకర్, ఎస్ఐ భాస్కర్ పోలీస్స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్లో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి ఫిర్యాదు చేశానని, ఆయన తన అర్జీని పోలీసులకు అప్పగించగా.. వారు తనపై సెక్షన్ 307 కింద రివర్స్ కేసు పెట్టి రిమాండ్కు పంపారని వాపోయారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చానని చెప్పారు. మంగళవారం ఆమె తన తల్లిదండ్రులు ఆరోగ్యం, జుజ్జువరపు చిన్ని, బాబాయి యాకోబుతో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు గణేష్ కోసం పోలీసులు తన కుటుంబంపై ఇంత దారుణంగా వ్యవహరించారని వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్సార్సీపీలో ఉత్సాహంగా పని చేస్తున్నామనే కక్షతో తన బాబాయి యాకోబు ఇంటిని టీడీపీ నేత గణేష్ తగల బెట్టించాడని, తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని చెప్పారు. సుప్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు పార్టీ ఇన్చార్జ్ కైలే అనిల్ కుమార్కు సూచించారు. పామర్రు సీఐ శుభాకర్, ఎస్ఐ భాస్కర్పై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్సార్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్లు మద్దతు ఇవ్వడం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
రాధాకృష్ణా.. ఖబడ్దార్
విలువలన్నీ విడిచేసి.. బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సాగిస్తున్న ‘చెత్తపలుకు’పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఇలాంటి రోతరాతలు రాధాకృష్ణకు కొత్త కాదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి ప్రధానకార్యాలయం వద్ద కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోతరాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛకిందకు ఎలా వస్తుందని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తమ మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో మహిళలను కించ పరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వైఎస్సార్సీపీ నాయకులు నిరసన తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావు.. చెత్త పలుకులు అంటూ ఊరూరా ర్యాలీలు చేశారు. రాధాకృష్ణా ఖబడ్దార్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజం అని నినాదాలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతులను పలుచోట్ల మంటల్లో వేసి తగలబెట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులకు నిప్పుపెట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేశ్, హోం మంత్రి అనిత ఏబీఎన్పై, రాధాకృష్ణపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. పైగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై విష ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ ఏబీఎన్ రాధాకృష్ణను గట్టిగా హెచ్చరించారు. ఛీటర్ రాతలకు భయపడే ప్రశ్నే లేదు హైదరాబాద్ ఫిలింనగర్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్రోకరిజంపై ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ వద్ద బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసివేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయనిమచ్చగా నిలుస్తాయన్నారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను అవమానించారు. గడ్డి తిని ఈ వ్యాఖ్యలు చేశారా? రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఆయనది ఒకే ఎజెండా. రాధాకృష్ణ ఒక ఛీటర్.. ఆయన రాతలకు భయపడే ప్రశ్నే లేదు’ అని మండిపడ్డారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు టి.విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రమేష్ యాదవ్, భరత్, పి.రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, ఇజ్రాయిల్, కావూరి శ్రీనివాస్, సురేష్, చంద్రశేఖర్రెడ్డి, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ కూకట్పల్లిలో వైఎస్సార్ అభిమానులు ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు మనసులో ఉన్నదే రాధాకృష్ణ రాస్తున్నారు చంద్రబాబునాయుడు మనసులో ఏముందో రాధాకృష్ణ అదే రాస్తున్నారు. నిత్యం వైఎస్సార్సీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే మహిళలను కించపరిచేలా రాతలు రాశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. కుట్రలతో వైఎస్సార్సీపీ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం సరికాదు. – కాకాణి గోవర్దన్రెడ్డి, మాజీ మంత్రి ఇది వేశ్యా రాజకీయం ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో వేశ్యా రాజకీయం చేస్తున్నారు. బూతు పత్రికను పెట్టుకుని చెడు రాతలు రాస్తూ వైఎస్సార్సీపీ కుటుంబంపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే తెలుగు ప్రజలు తరిమికొడతారు. బూతు భాషపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. – జోగి రమేష్, మాజీ మంత్రి రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి ఏబీఎన్ రాధాకృష్ణకు కుల గజ్జి పట్టి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కంట్లో పడాలని మహిళలను కించపరుస్తున్నారు. పక్క రాష్ట్రంలో తల దాచుకుని.. అక్కడొక పార్టీ, ఇక్కడొక పార్టీతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు, రాతలు దుర్మార్గం ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. రాధాకృష్ణ అనే వ్యక్తి విలేకరిగా ఉంటూ అనేక తప్పుడు కార్యక్రమాలు, వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. బూతు పత్రికలు, ఛానల్లు నడపడం సమంజసమా? – అంబటి రాంబాబు, మాజీ మంత్రి రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు ఏబీఎన్ రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు. దేవుడి లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించావు. నీ బిల్డింగ్లో ఎన్నో పాపకార్యాలు చేశావు. ఇప్పుడు వైఎస్సార్సీపీ మహిళల పట్ల విపరీత వ్యాఖ్యలు చేస్తున్నావు. నీ కుటుంబం ఏమిటి? నీ భార్య, నీ కూతురు పరిస్థితి ఏమిటి? ఒకసారి వారి గురించి కూడా రాయి. నీ పాపం పండింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. – నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్సీపీ నాయకురాలు అవి చెత్త పలుకులుకొత్త పలుకు పేరిట చెత్త పలుకులు రాస్తున్న రాధాకృష్ణ జర్నలిజపు విలువలకు పాతరేశారు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఇలాంటి రాతలు రాయడం దౌర్భాగ్యం. దీనిని ఎవరూ హర్షించరు. వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోడానికి కారణమైందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని, ఇది భవిష్యత్లో అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు. అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్ జగన్ ప్రతిపాదించారని చెప్పారు. 80 ఏళ్లయినా ఇంకా వలసలేనా? ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏనాడైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు. -
దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తిరిగి తనపై కేసులు నమోదు చేశారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ,ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.కూటమి ప్రభుత్వంలో తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాలను సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు జగన్కు వివరించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని జగన్ మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కైలే అనిల్కుమార్కు సూచించారు.పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అన్నారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో సుప్రియ,ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మహిళలని చూడకుండా... దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
-
నీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు... గుర్తుపెట్టుకో.. YSRCP మహిళలు వార్నింగ్
-
abn ఆఫీస్ వద్ద టెన్షన్ .. టెన్షన్ (ఫోటోలు)
-
రాధాకృష్ణ.. పిచ్చి కూతలు, రాతలు రాస్తే తగలబెట్టేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు. ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్ చేశారు. -
ఏబీఎన్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముట్టడించారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ వద్దకు చేరుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓవరాక్షన్కు దిగారు.ఏబీఎస్ ఆఫీసు బయట శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ పోలీసు.. చంద్రశేఖర్ గొంతు పట్టుకుని ఆయనను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే, పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసేసే విధంగా ప్రవర్తించారు. దీంతో, పోలీసుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజం. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?. ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక చీటర్’ అంటూ మండిపడ్డారు. బూతులు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలేసి.. వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గొంతు పట్టుకున్న పోలీస్🚨హైదరాబాద్లో ఏబీఎన్ ఆఫీస్ను ముట్టడించిన వైయస్ఆర్సీపీ నేతలు.. నియంత్రించే క్రమంలో హద్దులు దాటిన పోలీసులు#BanABNSaveAP#SadistChandraBabu pic.twitter.com/4jc2705E2g— YSR Congress Party (@YSRCParty) April 7, 2026 -
నీకు సిగ్గుందా... రాధాకృష్ణపై మహిళా నాయకురాలు విరుచుకుపడ్డారు
-
ఆంధ్రా బ్రోకర్.. నీ ABN ముందు ఉన్నాం మగాడివైతే బయటకు రా
-
క్షమాపణ చెప్తావా.. గంగలో దూకుతావా. ABN రాధాకృష్ణపై రెచ్చిపోయిన అంబటి
-
నువ్వు అన్నం తింటున్నావా.. లేక.. దమ్ముంటే బయటికి రా.. YSRCP నేతల ఆగ్రహం
-
LIVE : ABN ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్..
-
మావిగన్ ప్రతిపాదనపై వణికిపోతున్న ఎల్లో మీడియా
-
ఏబీఎన్ ఆఫీసును ముట్టడించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును ముట్టడించింది. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు నిరసనకు దిగారు.ధర్నాలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మార్గాని భరత్, కారుమూరి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని చెప్పారు. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక చీటర్’ అని అన్నారు. -
రాష్ట్రానికి చీడలా రాధాకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా! ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి. -
రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు
-
కేంద్రానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
తాడేపల్లి: తమ నేతలను కించపరిచేలా ఏబీఎన్ అల్లిన కథనాలపై వైఎస్సార్సీపీ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏబీఎన్ కథనాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖలు రాశారు ఎమ్మెల్సీ లేళ్ల. అభ్యంతరకర కథనం ప్రసారం చేసిన చానల్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ నేతలను కించపరిచేలా..సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం ప్రసారం చేశారన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఏబిఎన్ వ్యవహరించిందంటూ ఫిర్యాదు చేశారు. ఇది అత్యంత అనైతిక చర్య అనీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
బాబుకు MAVIGUN వణుకు... రాధాకృష్ణకు ఇచ్చిపడేసిన రాచమల్లు
-
‘ఇది రాష్ట్రంలోని ప్రతి మహిళకు జరిగిన అవమానం’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదనను ప్రజలు హర్షిస్తున్నారని అర్థం కావడంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘మావిగన్ ప్రతిపాదనను ప్రజల నుంచి తప్పించడం చేతకాక ఇక పచ్చ మీడియాను రంగంలోకి దించారు. చంద్రబాబుకు శిఖండి మాదిరిగా ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రిక రంగంలోకి దిగింది. రాధాకృష్ణ చేస్తుంది జర్నలిజం కాదు... బ్రోకరిజం. వీకెండ్ కామెంట్స్ పేరుతో రాధాకృష్ణ తీరు అత్యంత దారుణంగా మారింది. మేము వెన్నెముక లేని మనుషులమని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల పట్ల నీచంగా, అనుచితంగా మాట్లాడారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అవమానం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమే. రాధాకృష్ణ... నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా.. నీలా మేం మాట్లాడితే? కానీ, మేం అంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడలేం. చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ జర్నలిజం అంటావా? ప్రజలు చంద్రబాబు ఎంతటి నీతి బాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో గమనించాలి. కేవలం జగన్ మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా?మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. రూ.2 లక్షల కోట్లు పెట్టి, ఆచరణలో సాధ్యంకాని భ్రమరావతిని ఊహించుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం. కేవలం రూ.20 వేల కోట్లతో ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతోందని ఆచరణ సాధ్యమైన ప్రతిపాదన చేశారు. దానికే కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు. నీచాతినీచంగా టీడీపీ మూకలు ట్రోలింగ్ చేయిస్తూ వికృతానందం పొందుతున్నాయి. మంత్రులు, చోటా మోటా నాయకులు అయిపోయిన తర్వాత పచ్చ మీడియాను రంగంలోకి దించారు. కండకావరంతో, కొవ్వెక్కి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడినా శాంతియుతంగా నిరసన తెలపండని వైఎస్ జగన్ మాకు చెప్పారు’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. -
‘వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు’
నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ పూర్తిగా దిగజారిపోయారు. ఏబీఎన్ రాధాకృష్ణ చెత్త రాతలపై మహిళలు ఛీ కొడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్కు భయం వేస్తోంది. మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జడలు విప్పి రాక్షస విన్యాసాలు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మావిగన్’పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైందని కాకాణి గోవర్ధన్డ్డి అన్నారు. ‘ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోంది. మావిగన్ చర్చను అడ్డుకోవడానికి ఏబీఎన్ రాధాకృష్ణ క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషిస్తేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరుగుతుందని చంద్రబాబు టార్గెట్ పెట్టారు. అవినీతి చేసినా పర్లేదు కానీ.. వైఎస్ జగన్ను తిట్టడమే కూటమి ఎమ్మెల్యేల లక్ష్యం. రాధాకృష్ణ తన ‘చెత్తపలుకు’లో అత్యంత దిగజారి వైఎస్సార్సీపీ నేతలపై విషం చిమ్మారు. ఎవరూ మాట్లాడలేని చండాలమైన భాషను రాధాకృష్ణ వాడుతున్నారు.రాధాకృష్ణ జీవితమంతా అవినీతి మయం.. ఆయనలో ఎక్కడా నీతి అనేది కనిపించదు. సొంత జీవితంలో అనైతిక సంబంధాలు పెట్టుకున్న రాధాకృష్ణ.. మా ఇంటి మహిళల గురించి మాట్లాడతారా? చంద్రబాబుకు బ్రోకరిజం చేసిన రాధాకృష్ణకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు.రాజకీయ విమర్శల పేరుతో మహిళలను అవమానించడం అత్యంత నీచమైన ప్రవర్తన. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ వంద శాతం బ్రోకరిజం నడిపిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సిగ్గు శరం లేకుండా దళారీ పనులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం’ అని అన్నారు. -
నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్
-
నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి
గుంటూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోహర్, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి. -
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.‘‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. -
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులా?: మేరుగ నాగార్జున
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
జగ్జీవన్ రామ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు.కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను… pic.twitter.com/jE9De9LbIL— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2026 -
టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడు
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని, ఆయనను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని ధ్వజమెత్తాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. సాక్షి,అమరావతి(సాక్షి, నెట్వర్క్): రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. టీటీడీ చైర్మన్గా ఆయన అనర్హుడని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ల తీరుపై మండిపడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలనూ చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్పీపీ మండిపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని .. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పవిత్ర క్షేత్ర బాధ్యత అందరి బాధ్యతని, హైందవ ధర్మానికి క్యాన్సర్లా ప్రమాదకారిగా పరిణవిుంచిన బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. కృష్ణాజిల్లా పామర్రులోని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ⇒ గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు, మంగళగిరి, తాడికొండ నియోజవకర్గాల్లోనూ నాయకులు, కార్యకర్తలు గుడుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, గూడురు నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని నాయకులు నినదించారు. ⇒ ప్రకాశం జిల్లా దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, అద్దంకి, కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు తదితర నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు పూజలు చేశారు. బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ⇒ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేతలు నిర్వహించారు. బీఆర్నాయుడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ⇒ ఏలూరు జిల్లా కైకలూరు, దెందులూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్ సీపీ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని నినదించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ పవిత్రత కోసం ప్రార్థించారు. ⇒ ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబైనా ఆయనను తొలగించాలని నినదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ⇒ ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. హైందవ ధర్మానికి నాయుడు ప్రమాదకారి అని నినదించారు. ఆలయల్లో పూజలు చేశారు. తిరుపతి తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడని నినదించారు. టెంకాయలు కొట్టి చంద్రబాబు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకున్నారు. ⇒ ఉమ్మడి అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆలయాల్లో పూజలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ నాయకురాలిపై హత్యాయత్నం
పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్రెడ్డితో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్ సైకిల్పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు ‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్రెడ్డిని నిలదీశారు. -
వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ
-
ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం
-
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు
-
20 ఏళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని అమరావతికీ ఇదే పరిస్థితి..
-
‘రాజీనామా చేయ్.. బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: టీటీడీ ఛైర్మన్ నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిను తొలగించాలంటూ నిరసన చేపట్టారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంంలో కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు.బీఆర్ నాయుడు వచ్చాక అనేక వివాదాలు, అపశ్రుతులు జరిగాయని.. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ నాయుడు వ్యవహరించారన్న భూమన.. బీఆర్ నాయుడిని తొలగించకపోతే మరింత ఉధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా కొనసాగించడం చంద్రబాబు చేతగానితనం అంటూ మండిపడ్డారు. లడ్డూ గురించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మహిళను 30 ఏళ్లుగా బీఆర్ నాయుడు చిత్రహింసలకు గురిచేశాడు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ వ్యక్తిగత విషయాలు బీఅర్ నాయుడు బయటపెడతారని భయపడుతున్నారా?...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు. బీఅర్ నాయుడిపై ఎందుకు స్పందించలేదు. నెయ్యి విషయంలో ఏమి లేకపోయినా మెట్లు కడిగావ్. మరి ఇప్పుడు బీఅర్ నాయుడు విషయంలో ఎలాంటి ప్రోక్షణ చేస్తావ్. లడ్డూ గురించి సీఎం చంద్రబాబు పచ్చి అబద్దపు మాటలు చెప్పారు. చివరికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏంలేదని తేలింది. ఇప్పటికైన చంద్రబాబు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
BR నాయుడు రాజీనామా చేయడం లేదా..? చంద్రబాబు చెప్పడం లేదా..
-
కామ నాయుడును కాపాడుతున్న చంద్రబాబు నాయుడు, BR నాయుడుని తొలగించాలని YSRCP పూజలు
-
ఉద్రిక్తత.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న టీడీపీ నేతలు
సాక్షి, ఏలూరు జిల్లా: కలపర్రు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఛైర్మన్ను పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అబ్బయ్య చౌదరిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. -
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ మండిపడుతోంది.వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ నాయుడిని టీడీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు.చంద్రబాబు సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణుబీఆర్ నాయుడు ఛైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలపై అపచారాలు జరుగుతున్నాయి. టీడీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ఏమొహం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని తిరుపతిలో పూజలు చేస్తారు. కళంకితమైన వ్యక్తితో కలిసి ఎలా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు. అసలు చంద్రబాబుకు నైతికత ఉందా?. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా తీసుకోవద్దని ఓ మహిళ లేఖ రాసింది. కానీ అవేమీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.పటమట వెంకటేశ్వరస్వామి ఆలయంలో..టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు.తిరుపతి: టీటీడీ చైర్మన్ వైఖరి పట్ల హిందూ సమాజం సిగ్గు పడుతోందని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంఛార్జి భూమన అభినయ్రెడ్డి అన్నారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉంటూ.. ఆయన చరిత్ర ఇంత పరమ నికృష్ట మైందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత తిరుమల సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, శ్రీరామ నవమి వేడుకల్లో సీఎం తో పాటు టీటీడీ చైర్మన్ పాల్గొనడం సిగ్గుచేటు.చిత్తూరు జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు. కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘ బీఆర్ నాయుడు రాసలీలలు బయట పడిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గు చేటు. సీఎం చంద్రబాబు వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉన్నామని అంటున్నారే కానీ నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఎలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము’ అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణితో కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిబీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారుచంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీఆర్ నాయుడిని తొలగించాలి- కాకాణి పూజిత నెల్లూరు జిల్లా, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్రెడ్డి.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణికి వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన, ఆలయ అర్చకులు, స్థానికులుకాకాణి కామెంట్స్నైతిక విలువలు లేని బీఆర్ నాయుడికి పవిత్ర పదవి ఇవ్వడం సరికాదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అనైతిక కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయిచంద్రబాబు మహిళల పై ఎవరైనా చెయ్యి వేస్తే, అదే ఆఖరి రోజు అవుతుందని చెబుతూనే ఉన్నాడు-మా ప్రభుత్వం వస్తే మహిళల వైపు చూడడానికే భయపడతారని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికాడుఇప్పుడు ఇన్నీ అరాచకాలు జరుగుతున్నా నోరు మెదపరేమి వైఎస్ జగన్ పాలనలోనే మహిళలు రక్షణ పొందారు పార్వతీపురం, మన్యం జిల్లా: టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు అపవిత్రం చేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ధ్వజం. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్గుంటూరు: బీఆర్ నాయుడు పదవి నుంచి దిగిపోవాల్సిందే: అంబటి రాంబాబువెంకటేశ్వరస్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు -
నడిరోడ్డుపై ఒక అమ్మాయిని మీ జనసేన నేత కర్రతో కొడుతుంటే.. పవన్ పై YSRCP నేతలు ఫైర్
-
రాజ్యసభలో గొంతు నొక్కేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ సమయం కేటాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఆచరణ సాధ్యం కాని రీతిలో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నందున అక్కడ జరుగుతున్న అవినీతిని, లోపభూయిష్టమైన బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన పక్షపాత వైఖరిపై ఆయన పార్టీ లోక్సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్రెడ్డి, ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ చైర్మన్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను వివరించారు. సభలో జరిగిన వివక్ష, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న ప్రజాధనం లూటీని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సమయం కేటాయింపులో పక్షపాతం రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఏడుగురు సభ్యులు ఉంటే.. చర్చలో పాల్గొనేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చి మైక్ కట్ చేశారని చెప్పారు. సభలో పార్టీల బలాన్ని బట్టి కాకుండా పక్షపాత ధోరణితో సమయం కేటాయించారన్నారు. వాస్తవానికి తమ బలానికి 20 నిమిషాల సమయం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అదే సమయంలో సభలో కేవలం ఇద్దరు సభ్యులున్న టీడీపీకి ఏకంగా 15 నిమిషాలకు పైగా మాట్లాడే అవకాశం కల్పించారని తెలిపారు. తమకన్నా చిన్న పార్టీలైన టీడీపీ, బీఆర్ఎస్లకు ఎక్కువ సమయం ఇచ్చారని, బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం దక్కిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కడమేనని విమర్శించారు. సమయం కేటాయింపులో ప్రదర్శించిన పక్షపాత ధోరణి పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యసభ చైర్మన్ స్థానానికి ఇది తగదని పేర్కొన్నారు. అడుగుల లెక్కన ప్రజాధనం లూటీ చంద్రబాబు భ్రమలు కల్పించడాన్ని తప్పుపడుతూ ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ముందుగా ఆ రైతులకు ఎలా న్యాయం చేస్తారో బిల్లులో పొందుపరచాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణానికి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారని, ఇదంతా ప్రజాధనాన్ని లూటీ చేయడమేనని విమర్శించారు. కోల్కతా వంటి మహానగరమే 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఎన్నివేల ఎకరాల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. పూర్తి ప్రసంగ పాఠాన్ని రికార్డుల్లోకి తీసుకోవాలి రాజ్యసభలో చర్చ సందర్భంగా తమకు తగినంత సమయం ఇవ్వనందున, అడ్డుకోవడం వల్ల సభలో చదవలేకపోయిన తమ పూర్తి ప్రసంగ పాఠాన్ని సభ రికార్డుల్లో (టేబుల్పై) ఉంచేందుకు అనుమతించాలని కోరారు. తాము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారని, తాము ఎక్కడ నుంచి మాట్లాడటం ఆపేశామో.. అక్కడ నుంచి తమ ప్రసంగాన్ని రికార్డుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం తాము చేసిన ఫిర్యాదుపై సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. కెమెరా ప్రొసీడింగ్స్, అమరావతి అవినీతిపై త్వరలో జరిగే సమావేశాల్లో మరోసారి గట్టిగా నిలదీస్తామని చెప్పారు. ఆ కెమెరా ఫోకస్లపై విచారణ జరగాలి సభా కార్యకలాపాలు ముగుస్తున్న సమయంలో సందర్శకుల గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులపైకి పదేపదే కెమెరా ఫోకస్ వెళ్లడం యాదృచ్ఛికం కాదని వైవీ సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు ఉందని, ఆ ఫొటోలను పత్రికల్లో వేసుకుని ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కెమెరా ఫోకస్ వ్యవహారంపై అధికారిక విచారణ జరపాలని చైర్మన్ను కోరినట్లు చెప్పారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన సమయం కేటాయింపు వెనుక ఉన్న పరిస్థితులపై కూడా విచారణకు ఆదేశించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన పెద్దల సభలో ఇలాంటి పరిణామాలు సభ నిర్వహణపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్యాలరీ ఫొటోల దురి్వనియోగానికి సంబంధించిన పత్రికా క్లిప్పింగ్, తన ప్రసంగపాఠం కాపీలను చైర్మన్కు ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. కాగ్ ఆడిట్ చేయాలి.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి: గొల్ల బాబూరావు డిమాండ్ వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ... రాజధాని ఏర్పాటు అనేది తమ పరిధిలో లేదని గతంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా తెలిపిందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని విస్మరించిన సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం అమరావతికి చట్టం చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. 2014 నుంచి చట్టం చేయాలని గుర్తు రాలేదా అంటూ చంద్రబాబును నిలదీశారు. అప్పుడు అమరావతిపై లేని ప్రేమ ఇప్పుడెందుకు సడెన్గా వచ్చిందంటూ ప్రశ్నించారు. పేదల నుంచి ఐదువేల ఎకరాల అసైన్డ్ భూములను తీసుకున్నారని, వారికి తిరిగి ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పేదలకు ఐదు శాతం ల్యాండ్ పంపిణీ చేయాలని అమరావతి యాక్ట్లో ఉందని చెప్పారు. ప్రస్తుతం వారికి ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని కోరారు. అమరావతిని బూచిగా చూపించి మిగతా ప్రాంతాలను పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ భారీ అవినీతిపై కాగ్ ఆడిట్ చేయాలని, దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ముగ్గురొచ్చి తంబిరెడ్డిని కిడ్నాప్ చేశారు’
తిరుపతి: తుమ్మలగుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంబిరెడ్డిని ముగ్గురొచ్చి కిడ్నాప్ చేశారని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తెలిపారు. ‘31న రాత్రి ముగ్గురొచ్చి తంబిరెడ్డిని గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులను అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టులో కేసు వేశాం. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇలా చేయడం దారుణం. .60 సంవత్సరాల వయస్సులో ఉన్న తంబిరెడ్డిని ఇలా కిడ్నాప్ చేయడం దారునం. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని తెలిపారుకారులో బలవంతంగా తీసుకెళ్లారు‘నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పలు పోలీస్ స్టేషన్లలో తిప్పారు. ఫేస్బుక్లో పోస్టుకు కామెంట్ పెట్టినందుకే అరెస్ట్ చేశారు. పోస్ట్ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశనించారు. -
‘వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’
తాడేపల్లి : తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఈ రోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. రాజధానిపై మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది..‘రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు గ్రోత్ కారిడార్గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా మారుతున్నాయి. వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సజ్జల సూచించారు.ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి..ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ‘ పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది. త్వరలో వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ పెంచాలి’ అని పేర్కొన్నారు. -
అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు. మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు. -
సీఐ పరమేశ్వర్ ఏం పీక్కుంటారో పీక్కోండని అనొచ్చా..?
-
ఉప రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
ఢిల్లీ: ఉప రాష్ట్రపతిని వైఎస్సార్సీపీ ఎంపీలు కలిశారు. సీపీ రాధాకృష్ణన్ను వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. నిన్న( ఏప్రిల్ 2, గురువారం) అమరావతి బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు.పార్లమెంట్లో తమ గొంతు నొక్కడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీకి ఐదు నిమిషాలు కేటాయించగా.. ఇద్దరు సభ్యులు ఉన్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం పట్ల వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారు. చంద్రబాబు భూ దోపీడీకి పాల్పడుతున్నారు. 50 వేల ఎకరాలు భూమి కావాలని బంగారు పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన బాబు.. ఇప్పటికి 80 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు అయినా పడుతుంది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. 47 వేల కోట్లు రాజధానికి అప్పు చేశారు.. ఇప్పటికి 13 వేల కోట్లు అప్పుచేశారు.భవన నిర్మాణం చదరపు అడుగు 4 వేలు ఉంటే 14 వేలు ఖర్చు చేస్తూన్నారు.. 22 నెలల్లో 3 లక్షల 41 వేల కోట్లు ఇప్పటివరకు ప్రజల పేరుతో అప్పు చేశారు. అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం. చంద్రబాబు ఉన్నన్నిరోజులు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరు’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
-
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
సాక్షి, అమరావతి/టాస్క్ ఫోర్స్: తిరుపతిలో కలకలం రేపిన వైఎస్సార్సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విధానాన్ని ‘‘హైడ్ అండ్ సీక్’’ ఆటతో పోలి్చంది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు తేదీని దాచిపెట్టి నిన్ననే అరెస్టు చేశాం.. అంటారా? అంటూ తంబిరెడ్డి అరెస్ట్ విషయంలో ప్రశి్నంచింది. ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే.. కేసులు పెట్టి అరెస్ట్లు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, 60 ఏళ్ళ వృద్ధుడు తంబి రెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి , జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం.. ఆయన అరెస్ట్పై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తంబిరెడ్డి విడుదల.. పోలీసులకే మంచిది ‘తంబిరెడ్డిని విడుదల చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌఖికంగా ఈ విషయాన్ని చెబుతున్నాం. తంబిరెడ్డిని విడుదల చేయడం పోలీసులకే మంచిది. ఏం జరిగిందన్న దానిపై చాలా స్పష్టత ఉంది. ఇలాంటి విషయాల్లో మొండిగా వెళితే ఇబ్బంది పడేది పోలీసులే. పిటిషనర్ వాదనలు తన తండ్రి తంబిరెడ్డిని గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని , ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నితిన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, ‘పోలీసులు తంబిరెడ్డి ని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై తాము తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. హైకోర్టులో తాము ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత గుంటూరు అరండల్ పేట పోలీసులు ఫోన్ చేసి తంబి రెడ్డిని సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్ట్ చేశామని పిటిషనర్ నితిన్ రెడ్డికి చెప్పారు. సోషల్ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షే ఉన్నప్పటికీ, పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని వివరించారు. వివరాలను తెలపడానికి సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశించినా మారని పోలీసుల తీరు తంబిరెడ్డి అరెస్టును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి, విడుదల చేయాలని చెప్పినా.. గుంటూరు పోలీసుల తీరు మారలేదు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి, రిమాండ్ను తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన వద్దకు నిందితుడిని తీసుకురావడం పట్ల సదరు న్యాయమూర్తి పోలీసులను మందలించినట్టు సమాచారం. -
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
పట్నంబజారు/నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకొచ్చారు. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థంకాక కుటుంబ సభ్యులు తిరుపతిలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతడి జాడకోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందిన తంబిరెడ్డి తుమ్మలగుంట గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మార్చి 31న మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తిరుపతిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద ఉండగా కొందరు వ్యక్తులు తంబిరెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లిపోయారు. అదే రోజు రాత్రి గుంటూరు తీసుకొచి్చ.. అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థం కాక కుటుంబ సభ్యులు తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. రిమాండ్ తిరస్కరణతంబిరెడ్డి జాడ తెలియని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ లీగల్ విభాగం సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అవ్వడంతో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు లాలాపేట స్టేషన్కు చేరుకుని అధికారులతో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత తంబిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. 2024లో టీడీపీ కూటమి నాయకులపైన, తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, కిరాక్ ఆరీ్పలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ టీడీపీ సోషల్ మీడియా కు చెందిన పానకాల లక్ష్మీహేమంత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంబిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. మొత్తం ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది చెప్పకుండా రహస్యంగా ఉంచారు. పోలీసులు తంబిరెడ్డిని తీవ్ర వేధింపులకు గురిచేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీ నాయకుడనే కారణంగా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తంబిరెడ్డిని గురువా రం రాత్రి గుంటూరు శ్యామలానగర్లోని నాలుగో అదన పు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శోభారాణి వద్ద హాజరుపరిచారు. రిమాండ్ను తిరస్కరిస్తూ 41ఏ నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. -
ఎల్ఓసీ పేరుతో సజ్జల భార్గవ్రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎల్ఓసీ పేరుతో పిటిషనర్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తాము ప్రాథమిక హక్కులను కాపాడుతామని స్పష్టం చేసింది. ధిక్కార స్వరాలను సహించేదే లేదు.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ, సీఐడీ సహా పలు జిల్లాల ఎస్పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్.. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ ఎస్పీ మినహా మరెవరూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ కోరింది ఎవరు? ఎందుకు కోరారు? ఏ కేసులో కోరారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే, ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు. డీజీపీనే కౌంటర్ వేయనప్పుడు.. ఎస్పీలు ఎలా వేస్తారు? అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ జస్టిస్ దేవానంద్ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్ వేయలేదని, అలాంటప్పుడు ఎస్పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సీఐడీ ఎస్పీ ప్రతివాదిగా ఉంటే, సీఐడీ ఇన్స్పెక్టర్ కౌంటర్లు దాఖలు చేయడాన్ని సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. భార్గవ్రెడ్డికి ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను, రాష్ట్ర డీజీపీ, సీఐడీ ఎస్పీ, విజయవాడ, పల్నాడు, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తూ.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే, డీజీపీతో సహా ఎస్పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. పరస్పర విరుద్ధ వైఖరులపై అసంతృప్తి విచారణ సమయంలో భార్గవ్రెడ్డి తరఫు న్యాయవాది యల్లారెడ్డి స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లో భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అలా అయితే ఎవరు కోరితే ఎల్ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయను ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరితేనే భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిన్నింటినీ కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచుతామని చెప్పారు. అయితే ఎల్ఓసీ జారీ చేయాలని తామెవ్వరినీ కోరలేదని ఎస్పీ తరఫు న్యాయవాది, అలాగే సీఐడీ అదనపు డీజీ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరులపై జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇలాంటి నాటకాలు ఆడతారనే అందరి కౌంటర్లకు ఆదేశించామని పేర్కొన్నారు. అధికారుల ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచి్చందన్న న్యాయమూర్తి, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని స్పష్టం చేశారు. -
అందరి నోట 'మావిగన్ మాటే'
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. రాజధాని సంగతి దేవుడెరుగు.. 12 ఏళ్లలో కనీసం రోడ్లయినా వేయలేని పరిస్థితులలో రోడ్లు, కరెంటు, నీటివసతి, డ్రైనేజీ లకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రోడ్లు కూడా లేవు. మరో 20 ఏళ్లలో కూడా పూర్తి చేసే పరిస్థితులు లేవు. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేయనక్కరలేదని ఆర్థికవేత్తలంటున్నారు. అందులో 10శాతం చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు. అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బీ మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెబుతున్న నేపథ్యంలో రాజధానికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడమంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిల్లాడుతున్నారు..సూ్కళ్లు, హాస్పిటల్స్ను పట్టించుకునే నాథుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణసాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే..రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి.. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలని.. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లె వేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో రైతుల నుంచి 44,676.64 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మరో 50 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే రూ.47,387 కోట్లు. రాజధానిలో నివాస స్థలం చదరపు గజం రూ.50 వేల చొప్పున పలుకుతోందని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. రాజధాని ప్రధాన ప్రాంతం(కోర్ కేపిటల్ ఏరియా)లో అంటే రాజధాని నడిబొడ్డున.. వెలగపూడిలో సచివాలయం సమీపంలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను(25 వేల చదరపు గజాలు) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న మంగళగిరి సబ్ రిజిష్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోనే నివాసం నిర్మిస్తున్నారు. ఈలెక్కన గజం ధర రూ.7,500 చొప్పున కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఎకరం ధర రూ.3.63 కోట్లే. దీన్ని బట్టి చూస్తే.. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసే రూ.2 లక్షల కోట్లను వడ్డీతో కలిసి చెల్లించాలంటే ఎన్ని వేల ఎకరాలను విక్రయించాల్సి ఉంటుంది..మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలం..మచిలీపట్నం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడ ఆరు వరుసల జాతీయ రహదారి.. విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 20 లక్షలు.. గుంటూరు చుట్టుపక్కల 10 లక్షలు.. మచిలీపట్నం చుట్టుపక్కల 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని, వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్కు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.. (చంద్రబాబు సమీకరించిన భూముల్లో సదుపాయాల కోసం అంచనా వేసిన రూ. 2 లక్షల కోట్లలో ఇది కేవలం 10శాతమే) ఆ పదేళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచిచూడక్కరలేకుండా.. ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు.స్కామ్ల కోసం భ్రమలు కల్పిస్తారా?రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల కాంట్రాక్టు విలువను పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు. పైగా ఇసుక ఉచితం. కూతవేటు దూరంలో పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇసుక కొనుగోలు చేసి.. జీఎస్టీ వంటి పన్నులు చెల్లిస్తూ ఫైవ్ స్టార్ సదుపాయాలతో.. ఇటాలియన్ మార్బుల్స్తో చదరపు అడుగు కేవలం రూ.4,500కే నిర్మిస్తున్నారని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆరు వరసల జాతీయ రహదారి కిమీకు సగటున రూ.20 కోట్లకు నిర్మిస్తుంటే.. అమరావతిలో అదే రోడ్లకు రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణం సమీప భవిష్యత్తులో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ.. స్కామ్ల కోసం అమరావతికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చెందడానికే వందేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు సర్కారే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండటం గమనార్హం.మావిగన్ ప్రతిపాదన ఓ అద్భుతంరాష్ట్ర రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధి విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచన అద్భుతం. రాష్ట్ర రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కీలక ప్రభావం చూపుతుంది. కనీస వనరులు లేని ప్రాంతంలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి చేయటం సాధ్యం కాని పని. అదే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ రాజధాని ప్రాంతంగా ఆలోచిస్తే జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ప్రాంతాలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటుంది. పోర్టు ద్వారా నిత్యం వస్తు రవాణా సాగుతుంది. ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యం దక్కుతుంది. – నర్రా రమేష్బాబు, రియల్ వ్యాపారి, కంకిపాడు, కృష్ణాజిల్లాతీర ప్రాంత రాజధానులే మహానగరాలుగా ఎదిగాయిసముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రాజధాని నగరాలే మెట్రో నగరాలుగా అభివద్ధి చెందాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా పలు జాతీయ రహదారుల కలయికతో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న నౌకాశ్రయం, విజయవాడ విమానాశ్రయం జాతీయ రహదారులు ఈ ప్రాంతం పెద్ద నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జగన్ ముందుచూపుతో ప్రకటించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూలంగా స్పందించి అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. – బందెల డేవిడ్ థామస్ నోబుల్, రైల్వే సలహా మండలి సభ్యుడు, మచిలీటప్నంమావిగన్తో సమన్యాయంరాజధాని లేని రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ సమన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను కలుపుతూ రాజధానిగా ప్రకటించడం వలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేకుండా పరిపాలన సాగించవచ్చు. రాష్ట్రానికి మధ్య ప్రాంతం కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. – జి.శాంతమూర్తి, ఇంటిలెక్చు్యవల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరురాష్ట్రానికి సరైన రాజధాని మావిగన్మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ జాతీయ రహదారితో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రాజధానికి భూములు ఇచ్చి, తీవ్ర నిర్వేదంతో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రతిపాదిత మావిగన్ను రాజధానిగా విస్తరించేందుకు లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు -
అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు
-
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
నువ్వు పేదల గుండెల్లో దింపిన గునపం నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా
-
గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
సాక్షి, తాడేపల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు....మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Christ’s crucifixion stands as the ultimate example of love, compassion, and sacrifice. On this Good Friday, let us pause to reflect, look within, and renew our values, guided by His simple yet profound teaching: to love one another as we love ourselves.#GoodFriday— YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2026వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలువైఎస్ జగన్ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
‘అసెంబ్లీలో చంద్రబాబు తుగ్లక్ తీర్మానం చేశారు’
హైదరాబాద్: అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్ తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 2వ తేదీ) హైదరాబాద్లోని ప్రెస్క్లబ్ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్వీ సతీష్రెడ్డి. ‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు..అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్రెడ్డి. ‘చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. -
జగన్ పై కోపంతో ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు
-
‘వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్రెడ్డి వివరించారు.‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు...వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది...అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్రెడ్డి దుయ్యబట్టారు. -
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా...అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్ను మీడియాకు విడుదల చేయండి...బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు. ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కర్నూల్ను జ్యూడీషియల్ క్యాపిటల్గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేశారు. -
రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. రాజ్యసభ జీరో అవర్లో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. 33 ఏళ్ల సర్వీస్కే కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రత ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా ఉద్యోగులు నాలుగేళ్ల ముందుగానే సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారని సుభాష్ చంద్రబోస్ వివరించారు.‘‘ఇప్పటికే పే రివిజన్ కమిషన్ బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టారు. డీఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేలకోట్ల రూపాయలు చెల్లించడం లేదు. పెన్షన్ సెటిల్మెంట్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లపాటు వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అలవికాని సర్వే టార్గెట్లు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు’’ అని సుభాష్ చంద్రబోస్ తెలిపారు.‘‘గత వైఎస్సార్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 కు పెంచాం. పీఆర్సీని అమలు చేశాం. డీఏ పెంచి బకాయిలను క్లియర్ చేశాం. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అన్ని రకాల సహకారం అందించాం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్స్ అమలయేలా చర్యలు తీసుకోవాలి’’ అని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. -
ఆఫ్ నాలెడ్జ్ సవితమ్మ ఇక్కడ ఫూల్స్ ఎవరూ లేరు
-
బొత్సకు అంబటి రాంబాబు పరామర్శ
-
భ్రమలు కల్పిస్తూ.. రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నావ్
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ (MAVIGUN) అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా? ⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు. ⇒ కేవలం జగన్ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!⇒ వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్ 2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?⇒ కేపిటల్గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్అండ్టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్సీసీ. ఇప్పుడూ వాళ్లే.⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఎస్ఎఫ్టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్ఎఫ్టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్ఎఫ్టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్ఎఫ్టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్ను దాటేశాం.. కేసీఆర్ నంబర్కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి. -
ఈడుపుగల్లులో అధికారుల చర్యలపై వివాదం
సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది. దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు. వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. -
లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి
-
‘టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’
సాక్షి,విజయవాడ: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వం తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న (శనివారం) వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు అసాంఘిక , అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులైనా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ ఛైర్మన్ ఎంత నిష్టగా ఉండాలి. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా?. లేదంటే చంద్రబాబు చెబితే బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకూ ఒత్తిడి తెస్తాం. టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు కొనసాగడాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతోందన్నారు. -
అమరావతి కుంభకోణం పై POINT to POINT సంచలన నిజాలతో జగన్
-
హైకోర్టు, సచివాలయం అసెంబ్లీ, కేవలం డిజైన్స్ కోసమే 401 కోట్లు.. ఏంది సామీ ఇదంతా..!
-
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు. -
మీ కుటుంబాల అడ్రస్ చెప్పమంటావా.. బాబు, పవన్, లోకేష్ కు ఇచ్చిపడేసిన జగన్
-
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
అడ్వాన్సుల పేరుతో 8 వేల కోట్లు సర్వనాశం చేశాడు..
-
మీ కుటుంబాలు అన్నీ ఎక్కడున్నాయో నన్ను చెప్పమంటావా చంద్రబాబు వైఎస్ జగన్ షాకింగ్ నిజాలు
-
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మీ మంత్రులే చెప్పారు.. ఇప్పుడేమో డ్రామాలు
-
LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అని వైఎస్ జగన్ అడిగారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా మూడు ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు.శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?.అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు. చదరపు అడుగుకు 11వేల నుంచి 14వేలు అవుతుందని చెబుతున్నారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు?. రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్లో చర్చ లేదు. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపెడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో గూండా రాజ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అండతో పాలకులు గూండా రాజ్యం నడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులను దీటుగా ఎదుర్కొందామని, వైఎస్సార్సీపీ కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నం గురించి వైఎస్ జగన్కు వివరించారు.అలాగే చర్లగుడిపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన బీసీ సామాజికవర్గానికి(పద్మశాలి) చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావును ఫిబ్రవరిలో టీడీపీ గూండాలు హత్య చేశారని వారి కుటుంబసభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. వైఎస్సార్సీపీ కేడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, ఆకూరి వెంకటరెడ్డి, కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వేముల చలమయ్య, జంజనం తిరుపతి రావు, సైదయ్య, చెన్నారెడ్డి, షేక్ ఇమాం వలీ తదితరులున్నారు.భగవాన్ మహావీర్కు జగన్ ఘన నివాళిసాక్షి, అమరావతి: భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, ఏఎస్ఆర్ జేఎస్టీ సెక్రటరీ కుందన్ గాం«దీ, కరస్పాండెంట్ ప్రవీణ్ ఫౌలాముతా, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మహావీర్ మార్గం సదా ఆచరణీయం.. ‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం.. అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్. ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. మంగళవారం జైనుల ఆధ్యాతి్మక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన పలు అంశాలపై మాట్లాడనున్నారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, ఏప్రిల్ 1వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్లో ఆయన మాట్లాడనున్నారు.ఏపీలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
వైఎస్ జగన్ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు
-
‘మీరు రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని..’
కాకినాడ: ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్మెన్గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద గన్మెన్గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్మెన్ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని రాయాలని సవాల్ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్ను కూడా ప్రచురించాలని చాలెంజ్ చేశారు. ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. -
‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’
సాక్షి,అన్నమయ్య: భవిష్యత్లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్గా ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.వైఎస్సార్సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఓటరు లిస్టుపై అప్రమత్తంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు: వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా బలోపేతం అయ్యేలా ముందుకు వెళ్లాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి హింసించారని చెప్పారు.గుంటూరులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ లిస్టు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనకు అనుకూలమైన ఓట్లను తీసివేసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసి, ఎంత హింసించినా మన కార్యకర్తలు నాయకులు ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ధైర్యంగా నిలబడిన ప్రతి నాయకుడికి, పార్టీ కార్యకర్తకు అభినందనలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. కూటమి నాయకుల దాడులకు బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు.కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించాలి. గత ఏడాది రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. వైఎస్ జగనన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకున్నాం.రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. 2028 కల్లా రాజధాని పూర్తయితే ఇంకా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు? రాజధాని తీర్మానం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా ఆడింది. ఇదో రకమైన డైవర్షన్ పాలిటిక్స్. రాజధాని పేరుతో మొదట్లో 50 వేల ఎకరాలకు పైగా భూమిని తీసుకున్నారు. రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను ఎక్కడ అభివృద్ధి చేశారు? అమరావతిలో రోడ్లు ఎక్కడ పూర్తి చేశారు? ఇవేమీ జరగకుండానే మరోసారి 50వేల ఎకరాలు రెండో దశలో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? అమరావతి పేరుతో టెండర్లు పిలిచి ఏటీఎంలా వాడుకున్నారు. అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.. దానికోసమే అసెంబ్లీలో తీర్మానం’ అని చెప్పారు. -
ఎమ్మిగనూరులో టెన్షన్.. టెన్షన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు.ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహవీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) ఘనంగా నిర్వహించారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.‘‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ (సెక్రటరీ, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ ఫౌలాముతా (కరస్పాండెంట్, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.#MahavirJayanti pic.twitter.com/2Z5deOnCA1— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2026 -
వీటి ధరలు దారుణంగా పడిపోయాయి: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ (మార్చి 31) వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో పర్యటించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే రేటు రూ.1400కి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోనూ వెంటనే ఏర్పాటు చేయాలి. అరటి ధర కూడా దారుణంగా పడిపోయింది. టన్నుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కూడా రావడం లేదు. ఇరాన్ యుద్ధం, ముంబై మార్కెట్లో అరటి అధికంగా రావడంతో ధర దారుణంగా పడిపోయింది. అరటి పంటను కనీసం టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేల ధర వచ్చేలా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతోంది. రేపు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు సమస్యను తీసుకువెళ్లాలి, మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి’ అని అన్నారు. -
YSRCP జెండా రెపరెపలు.. హిమాలయ శిఖరమంత జగన్ అభిమానం
-
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం
-
లంచాలు కాదు.. ఇంటికెళ్లి అన్నం తినండి..పేర్ని నాని ఉగ్రరూపం
-
తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ప్రసాదరావు స్ట్రాంగ్ వార్నింగ్
-
బాబు ఆలోచన విధానమే దోపిడీ మేం వస్తే మీకేంటి ఇబ్బంది..
-
నీకెందుకు ఈ బ్రతుకు ..!
-
ఏందీ నువ్ కాల్చేది దీవాలి పటాసా.. అచ్చెన్నాయుడుకు సీదిరి అప్పలరాజు వార్నింగ్
-
చలో మూలపేట పోర్ట్ లో రెడ్డి శాంతి ప్రసంగం
-
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
చలో మూలపేట.. YSRCP బహిరంగ సభ
-
YSRCP చలో మూలపేట
-
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.మూలపేట పోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ
-
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప..అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.అమరావతికి న్యాయం చేసింది జగన్...అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్కళ్యాణ్కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ తీర్మానం పెడితే జగన్ ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. -
బాబు కుట్రలో భాగమే.. కార్టూన్ బరితెగింపు
సాక్షి, అమరావతి: విలువల వలువలు ఏనాడో విడిచేసిన ఈనాడు పత్రిక.. చంద్రబాబు ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధమని మరోమారు రుజువు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడానికి తహతహలాడే ఎల్లో మీడియా.. రాజధాని ముసుగులో మరోమారు దిగజారింది. రాజధాని అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసే రీతిలో ఓ దిగజారుడు కార్టూన్ను ఈనాడు పత్రిక శనివారం ప్రచురించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మార్కు పాత్రికేయ కుతంత్రానికి తెగబడింది. ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసం అనేక దిగజారుడు కార్టూన్లను ప్రచురించిన ఈనాడు పత్రిక అలాంటి దిగజారుడు కార్టూన్తో శనివారం పసుపు విషాన్ని పత్రికలో చిమ్మింది. ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్ చూసి ఆ పత్రిక పాఠకులే కాదు తెలుగు పాఠకులంతా ఛీత్కరించినట్లు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన నిరసనలే నిదర్శనం. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రాజధాని కట్టలేకే కార్టూన్ కుట్రలు రాజధాని నిర్మాణంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దుష్ప్రచార కుట్రకు తెగబడింది. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అనే అవాస్తవాన్ని పదే పదే ప్రచారం చేయాలన్న కుతంత్రంలో భాగంగానే ఈనాడు ఈ కార్టూన్ను ప్రచురించింది. దురుద్దేశపూరితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్టూన్ ప్రచురించింది. వైఎస్ జగన్గానీ వైఎస్సార్సీపీ గానీ రాజధానిగా అమరావతిని ఏనాడూ వ్యతిరేకించనే లేదు. మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు రాజకీయ కుట్రకు కొమ్ముకాసేందుకే 2019–24 వరకు ఈనాడు పత్రికతోపాటు పచ్చ మీడియా అంతా గగ్గోలు పెట్టి దుష్ప్రచారం సాగించింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజధానిగా అమరావతిని వైఎస్సార్సీపీ వ్యతిరేకించలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలనే డిమాండ్ చేస్తోంది. కానీ దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని అమరావతి నిర్మాణంలో ఎటువంటి కదలికా లేదు. రూ.20వేల కోట్లకుపైగా అప్పులు చేసినా సరే రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించి అవినీతికి పాల్పడుతోంది. టీడీపీ దోపిడీకి అమరావతి కామధేనువుగా మారిందన్నది స్పష్టమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపించేందుకే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోంది. రాజధాని నిర్మాణానికి 30ఏళ్లు పడుతుందని చెబుతోంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా వందేళ్లు పడుతుందని ఏకంగా బ్రిజేష్ కుమార్ కమిటీకి చంద్రబాబు ప్రభుత్వం నివేదించడం గమనార్హం. అంటే మాస్టర్ప్లాన్లో పేర్కొన్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం తమ తరం కాదని చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో అమరావతి పేరిట రెండో దశ, మూడో దశ భూసేకరణ పేరుతో చేస్తున్న హడావుడితో అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ‘అమరావతిపై అసెంబ్లీ తీర్మానం’పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. అదే అదనుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో సిండికేట్ ఈ దుష్ప్రచారానికి తెగబడింది. ఎన్టీఆర్పైనా దిగజారుడు కార్టూన్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయిన ఈనాడు పత్రిక ఆనాడు కూడా ఇలాంటి దిగజారుడు కార్టూన్లనే ప్రచురించింది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజూ కార్టూన్లు ప్రచురించింది. ‘ఆయనకు తెలివి లేదు... రోజూ గంటకు మించి ఆలోచించ లేరు... ఒంటిపై బట్టలు కూడా సరిగా వేసుకోలేరు’ అనే రీతిలో దిగజారుడు కార్టూన్లు ప్రచురించడం గమనార్హం. ఎన్టీ రామారావు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్లు పాత్రికేయ ప్రమాణాలను అథఃపాతాళానికి దిగజార్చాయి. ఆ దంపతులు ఇద్దర్నీ కించపరుస్తూ ప్రతి రోజు కార్టూన్లు ప్రచురించి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకువచ్చే దుష్ప్రచార కుట్రను బరితెగించి సాగించింది. కార్టూన్లలో ముఖ్యమంత్రిని ఏకంగా అర్ధనగ్నంగా చూపిస్తూ ఈనాడు పత్రిక తన కుట్రను పతాకస్థాయికి తీసుకువెళ్లింది. ఆ విధంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కేవలం 9 నెలల్లోనే భారీ కుట్రకు తెగబడ్డారు. అనంతరం 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి కుట్రకు సహకరించిన ఈనాడు రామోజీరావుకు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. ఎన్టీరామారావు ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించింది. తద్వారా రామోజీ ఫిల్మ్సిటీ వ్యాపార ప్రయోజనాలకు సహకరించింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అసైన్డ్ భూముల ఆక్రమణ తదితర అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ఆనాడు ఎన్టీరామారావు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన నాటి ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇవ్వడం గమనార్హం. పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈనాడు పత్రిక కార్టూన్ ప్రచురించడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈనాడు ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈనాడు పత్రికపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
నెల్లూరు రూరల్: రైతులను మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వరి కోతలకు ముందు పుట్టి ధాన్యం (845 కేజీలు) ధర రూ.22 వేలు ఉందని అధికారులు చెబితే.. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం ధరల పతనం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ పార్టీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివుని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాకాణి మాట్లాడుతూ.. మిల్లర్లు చేస్తున్న దోపిడీలో అధికారులు, మంత్రులు, పాలకులు వాటాలు పంచుకుంటున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లాలో రబీ సీజన్లో 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంటే.. కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు టార్గెట్ ఇవ్వడం చూస్తే.. రైతులను ఏ విధంగా మోసం చేస్తోందో అర్థమవుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2.5 శాతం మాత్రమే ధాన్యం కొంటున్నారని, మిగిలిన 97. 5 శాతం దళారులు, మిల్లర్లు దోచుకుపోతున్నారన్నారు. తేమ పేరిట 90 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు నిబంధనల ప్రకారం 17 శాతం కంటే ఒక శాతం అధికంగా తేమ ఉంటే క్వింటాల్కు ఒక కేజీ లెక్కన తరుగు కింద అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. పుట్టికి 90 కేజీల అదనపు తరుగు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన గన్నీ బ్యాగులు అందజేసి, అన్ని సదుపాయాలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు రూ.500 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.24 వేలు ధర వస్తే.. అది జగన్మోహన్రెడ్డి గొప్పతనం కాదని, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగాయని టీడీపీ నేతలు, పచ్చమీడియా దు్రష్పచారం చేశాయన్నారు. ఈ రోజు ధరలు పడిపోతుంటే ఇరాన్ యుద్ధం వల్ల అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఈనాడు పత్రికపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఈనాడు పత్రికపై పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురించారని.. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా’
సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్ చేశారు.‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్ జగన్కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
కష్టాల్లో కుటుంబ పోషణ.. విశాఖలో చిన్న వ్యాపారుల ఆవేదన
-
‘ ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్కు పంపాలి’
రాజమహేంద్రవరం: దళితుల గురించి దళిత సంఘాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్ఫైల్ ఇవ్వడానికి సీఐ బాజీలాల్ నిరాకరించారు. దాంతో వైఎస్సార్సీపీ నేతలు, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఐ తీరును మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. దీనిలో భాగంగా మీడియాతో భరత్ మాట్లాడుతూ.. ‘ దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆడియోలో ఆదిరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ జరగాలని డిమాండ్ చేశాం. ఆడియోలో అప్పారావు ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్కు పంపాలి. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలి. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గంటసేపు వాగ్వాదం చేస్తే అకనాలెడ్జిమెంట్ కాఫీఇచ్చారు’ అని స్పష్టం చేశారు. -
సుప్రియా కేసు.. పోలీసులకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి.. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పేర్ని నాని సవాల్ విసిరారు.మాజీ మంత్రి పేర్నినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రియను మేం జైలులో పరామర్శించాం. బాధితురాలు చెప్పిన విషయాలపై నేను మీడియాతో మాట్లాడాను. పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఎలా సుప్రియపై దాడి చేశారో చెప్పాను. బాధితురాలకి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక అశరీరవాణి విడుదల చేశారు. ప్రకటన పంపించడాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ సంతకం లేకుండా ప్రకటన ఇచ్చారు. ఎవరో ఒకరు సంతకం పెట్టి ప్రకటన ఇవ్వాల్సింది. పోలీసులు సుప్రియపై దాడి చేయలేదని అశరీరవాణి ప్రకటనలో చెబుతున్నారు. సుప్రియ శరీరం పై ఎలాంటి రక్త గాయాలు లేవని వైద్యులు చెప్పారట. 108 సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు లేవని సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. పోలీసులు అంతా చెడ్డవారని నేను చెప్పడం లేదు. దుర్మార్గంగా వ్యవహరించే వారి పేర్లనే మేం చెబుతున్నాం.రాజకీయ నాయకుడు లెటర్ ఇస్తే కానీ కేసులు కట్టే పరిస్థితి లేదు. 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్ కు వెళ్లారు. 21వ తేదీన స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ను మీడియాకు విడుదల చేయండి. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా. నేను మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకుంటా.. పోలీసు సిబ్బందికి క్షమాపణ చెబుతాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. రేపు 11:30 గంటల లోపు మీరు ఆధారాలను బయటపెట్టండి. సుప్రియ సోదరుడు తేజ దొంగతనం చేస్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలున్నాయంటున్నారు. తేజకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టండి. పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారింది. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసి పోలీసులు లక్షా 60 వేలు వసూలు చేశారని సమాచారంమూడు నక్షత్రాలు ఉన్న అధికారి ఏలూరు నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడా లేదా?. కైలే అనిల్తో మాట్లాడమని ఏలూరుకు చెందిన ఓ మిత్రుడు నన్ను అడిగారు. అనిల్ కుమార్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి. డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు. నాకు కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలుసుకోవాలి. పోలీసులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి సామాన్యులకు ఉంటుందా?. ఆసుపత్రికి తీసుకెళ్లనని 108 సిబ్బంది ఎప్పుడైనా లిఖితపూర్వకంగా రాసివ్వడం చూశామా. కానీ సుప్రియ కేసులో 108 సిబ్బంది రాసిచ్చారు అని అన్నారు. -
‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశి్నస్తూ డీపీఆర్ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేలి్చచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకైనా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది.డబుల్ డెక్కర్తో ‘డబుల్’ భారంవిశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మారి్పడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
నోరు అదుపులో పెట్టుకో.. నువ్వు ఒక నీచ నికృష్టుడివి
-
చిత్త కార్తె కుక్కలాగా మహిళలపై ఎగబడుతున్న చర్యలు తీసుకోరా?
-
రాధా మనోహర్ పిచ్చి వాగుడు మానుకో.. కొండా రాజీవ్ ఉగ్రరూపం


