breaking news
YSRCP
-
‘‘మార్గదర్శి బకాయిలను రామోజీ వారసులు చెల్లించాల్సిందే’’
తాడేపల్లి: రామోజీ రావు రాజకీయ నాయకుడు కాదు కానీ, టీడీపీని నడిపించిన వ్యక్తని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. రామోజీకి చెందిన మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. మార్గదర్శి బకాయిలను ఆయన వారసులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. రామోజీ ఆర్ధికనేరగాడని, ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశాక రామోజీ కొన్ని టీవీ ఛానళ్లను అమ్మేశారని అంబటి రాంబాబు చెప్పారు. ఆ డబ్బును డిపాజిట్దారులకు అందించారని తెలిపారు. ఆర్బీఐని కూడా మేనేజ్ చేశారని, అందుకే మార్గదర్శి గురించి ఇక మేము పట్టించుకోమంటూ ఉండవల్లికి లేఖ రాసిందని చెప్పారు. ఉండవల్లి సొంతంగా కేసును వాదించారని అన్నారు. 20 ఏళ్లుగా ఆయన మార్గదర్శిపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మార్గదర్శి చిట్స్ కూడా తప్పుదారిలో నడుస్తోందని చెప్పారు. రామోజీ బతికినంతకాలం చంద్రబాబుకు సేవ చేశారని అన్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు. ఎన్టీఆర్ను అవినీతి పరుడనీ చిత్రీకరించారని తెలిపారు. అందుకే ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం సొంత ఖర్చుతో సంతాప సభలు పెట్టిందని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రశ్నించామని గ్రూప్ 1ని తెరమీదకు తెచ్చారని తెలిపారు. రెండింటిపై సీబీఐ విచారణ జరిపించాలంటే చంద్రబాబు, లోకేశ్ పారిపోయారని అన్నారు.ఉద్యోగాలు రాక రోడ్డున పడిన వారితో ర్యాలీ చేయించగలరా? అని అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పరీక్ష పేపర్ లీక్ కాలేదనీ, అంతా సక్రమంగా జరిగిందని వారితో చెప్పించగలరా? పవన్ కల్యాణ్ కేబినెట్ మీటింగ్లకు ఎందుకు వెళ్లటంతో ఆయనే చెప్పాలి. అనారోగ్యంతో రావటంలేదని జనసేన వాళ్లు అంటున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఆరోగ్యకర వాతావరణం దెబ్బ తిన్నదని కొందరు అంటున్నారు’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో బొత్స సత్యనారాయణ
-
టీడీపీలో చేరలేదని... YSRCP సర్పంచ్ ఇల్లు కూల్చివేత..
-
బాబూ.. లోకేష్ను కాపాడే ప్రయత్నమా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపలేదు. తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.ఇది కూడా చదవండి: తగ్గితే నెగ్గుకురాలేం.. జనసేనలో కొత్త ఆందోళనఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు. -
పోలీసుల వేధింపులకు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పిడుగురాళ్ల/మాచవరం: ఓ కేసులో రాజీకి రావాలంటూ ఎస్ఐ పెడుతున్న వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతనిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాలు.. 2023లో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన బొంత గురవయ్యకు చెందిన పొలంలోకి టీడీపీకి చెందిన నంబుల వెంకటాద్రి, నంబుల గంగాధర్, యెనుముల గోపిలకు చెందిన గొర్రెలు వెళ్లాయి. దీంతో గొర్రెలను పొలంలోకి ఎందుకు దింపారంటూ వెంకటాద్రి, గంగాధర్, గోపిలను గురవయ్య ప్రశ్నించగా వారు గురవయ్యపై దాడిచేశారు. అప్పట్లో గురవయ్య మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురవయ్యని ఊరు నుంచి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు హుకుం జారీచేశారు. దీంతో గురవయ్య ఏడాదిన్నరగా పక్క గ్రామాల్లో ఉంటున్నాడు. ఇటీవల గురవయ్య తండ్రి చనిపోవడంతో కొత్తగణేశునిపాడు గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు చల్లగుండ్ల భిక్షమయ్య, నంబుల గంగాద్రి, నంబుల సింగరయ్య, చల్లగుండ్ల శ్రీకాంత్, నన్నపనేని గంగ ప్రసాద్.. గురవయ్య వద్దకు వచ్చి ‘నువ్వు కేసు రాజీ చేసుకోవాలి’.. అని బెదిరించారు. అలాగే, నెలరోజుల కిందట గురవయ్యను మాచవరం ఎస్ఐ పవన్కుమార్ పోలీస్స్టేషన్కు పిలిపించి కేసు రాజీ చేసుకోవాల్సిందేనని, చేసుకోకపోతే నీపై ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీదని బెదిరించారు. అయినా గురవయ్య కేసు రాజీచేసుకోలేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే కానిస్టేబుల్ను కొత్తగణేశునిపాడు గ్రామానికి పంపించి కేసు నిమిత్తం గురవయ్యను తీసుకెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. గురవయ్య తమ్ముడు ప్రసాద్, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్స్టేషన్కు వెళ్లారు. అయితే, ఎస్ఐ పవన్కుమార్ ప్రసాద్ను ఉద్దేశించి.. ‘నువ్వు, మీ అన్నయ్య వైఎస్సార్సీపీలో తిరుగుతారంట కదా, కేసులు ఎందుకు రాజీ చేసుకోరురా’.. అంటూ అసభ్యపదజాలంతో దూషించి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మరోవైపు.. శుక్రవారం రాత్రి స్టేషన్లో ఎస్ఐ పవన్కుమార్ గురవయ్యను తిట్టి, కొట్టి కేసు రాజీ చేసుకోకపోతే మరిన్ని కేసులు పెడతామని బెదిరించి పూచీకత్తుపై ఇంటికి పంపించేశారు. దీంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఎలుకల మందు తిన్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురవయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.ఎస్ఐ, టీడీపీ వాళ్లూ బెదిరించారు.. కేసు రాజీ చేసుకోవాల్సిందేనని ఎస్ఐ పవన్కుమార్ బెదిరించాడు. రోజు పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి.. కేసు రాజీ చేసుకోవాల్సిందేనని దుర్భాషలాడాడు. అలాగే, వైఎస్సార్సీపీ వెంట తిరిగిన మీరు మాపై కేసులు పెడతారా.. ఎందుకు రాజీకి రారో చూస్తాం.. గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ టీడీపీ నాయకులూ బెదిరించారు. వీటన్నింటితో గురవయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. – రమాదేవి, గురవయ్య భార్య.. ప్రసాద్, గురవయ్య తమ్ముడు ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు.. గురవయ్యను కేసు నిమిత్తం పోలీసుస్టేషన్కు పిలిపించిన మాట వాస్తవమే. అతనిని శుక్రవారం పిలిపించి విచారణ అనంతరం 41(ఏ) నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించాం. ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. చికిత్స అనంతరం చట్ట ప్రకారం అతనిపై దర్యాపు చేపడతాం. ఆయన రాజీకి అంగీకరించలేదు. అతని నుంచి ఫిర్యాదు అందితే దానిపైనా దర్యాప్తు చేస్తాం. – మహేశ్వరరావు, గురజాల డీఎస్పీ -
స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
తిరుపతి మంగళం: తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేశ్ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రెడిసన్ బ్లూ (ఫైవ్ స్టార్), సీఆర్ఆర్ హాస్పిటాలిటీ (ఫైవ్ స్టార్), ఎసెన్షియల్ (త్రీ స్టార్) హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. 9 నెలల క్రితమే ఏర్పడిన సీఆర్ఆర్ హాస్పిటాలిటీకి తిరుచానూరు సమీపంలోని దామినేడులో 1.71 ఎకరాల ప్రైవేట్ స్థలంలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు,ఐదేళ్ల ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ సంస్థకు హోటల్ రంగంలో అనుభవం, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు లేవని చెప్పారు. అనుమతుల వెనకున్న వ్యక్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే తిరుచానూరు సమీపంలో 21ఎకరాల టూరిజం భూమిని ఎకరాకు రూ.90 లక్షల చొప్పున 2 సంస్థలకు కేటాయించారని, ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.4.5 కోట్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరకే అప్పగించారన్నారు. రూ.వందల కోట్ల కమీషన్ల కోసం చంద్రబాబు, లోకేశ్ బరితెగించి, ఇష్టానుసారంగా అనుమతులివ్వడందారుణమన్నారు. స్టార్ హోటళ్ల పేరుతో భూ కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
‘మాజీ సర్పంచ్ను టార్గెట్ చేసి ఇంటిని కూల్చేస్తారా?’
తణుకు(ప.గో. జిల్లా): ఏపీలో నియంత పాలన కొనసాగుతోందనడానికి తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని కూల్చేయడం మరొక ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. కక్షతోనే ఆమె ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) తణుకు నియోజకవర్గం అయింతపూడిలో కూటమి నేతలు కూల్చేసిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని పరిశీలించడానికి వైఎస్సార్సీపీ నేతలు వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి తదితరులు వెళ్లారు. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు.‘మాజీ సర్పంచ్ లావణ్యను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ టార్గెట్ చేశారు. కక్షతో ఆమె ఇంటిని కూల్చేశారు. తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉందో అర్థమవుతుంది. హిట్లర్, గడాఫీ కన్నా దారుణంగా టిడిపి నాయకుల పాలన ఉంది. టీడీపీ కండువా వేసుకోలేదని వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారని వీరిపై కక్ష గట్టారు. ఇది కూటమి ప్రభుత్వమా కూల్చివేతల ప్రభుత్వమా...?, మహిళ అని కూడా చూడకుండా లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారు..ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు బుల్డోజర్ సర్కార్. అసలు మనం ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా’ అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయితంపూడి మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మహిళపై ఎందుకింత కక్ష. ఇల్లు కూల్చడమే కాకుండా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడతారా....?, ఫ్లెక్సీల కోసం ఏకంగా సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. తణుకులో వైఎస్సార్సీపీకి మద్దతు పెరుగుతుందని ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి ఇల్లు కూల్చేశారు. ఇళ్లలో ఎవరు ఉన్నారు.. ఏంటి అనేది ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా?, వైఎస్సార్సీపీ వారి ఇళ్లను కూల్చి వేయించడం దారుణం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు. ఇదీ చదవండి:గుంటూరులో టీడీపీ నేతల గూండాగిరి -
‘పరిశ్రమలను భయపెట్టి తరిమేస్తున్నారు’
తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి వేధింపులు, కప్పం డిమాండ్ల వల్లే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వరుసపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరులో ఏర్పాటు కావాల్సిన టాటా పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లిపోయిందని, రూ.3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో ఏర్పాటు కావాల్సిన వెబ్సోల్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్కు వెళ్లిపోయిందని అన్నారు. ఈ సంస్థలు ఎందుకు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అయితే ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయో, ఏ పరిశ్రమలు ఏర్పాటయ్యాయో, 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని పుత్తా శివశంకర్ సవాల్ చేశారు. పూర్తి వివరాలు ఇవ్వలేకపోతే కనీసం 10 శాతం ఉద్యోగాల వివరాలైనా వెల్లడించాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...భూముల రద్దు.. కంపెనీల వెళ్లగొట్టింపుగత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను తరిమేసింది. అనంతపురం జిల్లాలో జిన్ఫ్రా ప్రెసిడెన్స్, అనకాపల్లిలో జూపిటర్ ప్రాజెక్టు భూములను కూడా రద్దు చేసి వేల మంది ఉపాధికి గండికొట్టారు. మరోవైపు రాయలసీమలో అల్ట్రాటెక్, దాల్మియా, భారతీ తదితర సిమెంట్ పరిశ్రమల వద్ద టీడీపీ నేతలు ట్రాన్స్పోర్ట్, బూడిద కాంట్రాక్టుల కోసం తీవ్ర బెదిరింపులకు పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.సిమెంట్ కంపెనీలకు తీవ్ర వేధింపులురాయలసీమ ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమలు, థర్మల్ ప్రాజెక్టులపై కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు బూడిద, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల కోసం అల్ట్రాటెక్, దాల్మియా, వికాట్, శ్రీచక్ర తదితర సిమెంట్ పరిశ్రమలను తీవ్రంగా వేధిస్తున్నాయి. కలెక్టర్ను సైతం లెక్కచేయకుండా, తాము చెప్పిన రేటుకే రవాణా ఇవ్వాలని, లేదంటే కప్పం కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇక భారతీ సిమెంట్స్ పై కక్ష సాధింపులో భాగంగా ఆ కంపెనీని మూసివేసేందుకు ప్రయత్నించారు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పతనంకోవిడ్ కష్టకాలంలోనూ వైఎస్ జగన్ గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్గా ఉన్న ఏపీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిదో స్థానానికి పడిపోవడమే రాష్ట్ర దుస్థితికి నిదర్శనం. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు తెచ్చామని గోబెల్స్ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. దమ్ముంటే కనీసం 10 శాతం ఉద్యోగుల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను.రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టి రూ.9 వేల కోట్ల అప్పులు తెచ్చినందుకు ఏపీఎండీసీకి అసోచాం అవార్డు రావడం హాస్యాస్పదం. ఇదంతా కేవలం కార్పొరేట్ లాబీయింగే. దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం మరింత సిగ్గుచేటు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చేసిన అప్పుల కంటే, కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలోనే అత్యధికంగా అప్పులు చేసింది. అప్పులు తేవడంలో వీరికి మరో అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి:‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’ -
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్కుమార్ ప్రశ్నించారు. -
‘తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పెట్టండి’
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైఎస్సార్సీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతో ఓ కమిటీ వేయండి. తాడిపత్రిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలి. తాడిపత్రి పోలీసు స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు?. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు పెడితే సరిపోతుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని గ్యాంగ్ స్టర్లా తయారు చేశారు. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలంటే జేసీ అనుమతి కావాలా?. తాడిపత్రిలో పోలీసుల ప్రేక్షక పాత్ర దేనికి సంకేతం?.ఇది కూడా చదవండి: వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్లీ అప్పు.. గోవా లిక్కర్ కేసులో జేసీ తయారు చేసిన మార్ఫింగ్ ఫొటోలపై చర్యలు తీసుకోరా?. జేసీ అరాచకాలపై కలెక్టర్, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీకి వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జేసీపై ఉన్న కేసులన్నీ జేసీ ట్రావెల్స్ చీటింగ్, క్రిమినల్ కేసులే. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల అన్నారు.ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, అసెంబ్లీ పరిశీలకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు నెలాఖరు వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.గత నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సూచించారు.17.29 లక్షల అనుమానాస్పద ఓట్లపై అప్రమత్తంగా ఉండాలిఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. ఇదే సమయంలో చిరునామా మార్పులు, ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను కూడా అవసరాన్ని బట్టి సమర్పించాలని సూచించారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల తెలిపారు.డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంఒకే పేరుకు లేదా ఇతర వివరాలకు దగ్గరగా ఉన్న ఓటర్లు వాస్తవంగా ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అనే అంశాన్ని బీఎల్ఏలు స్థానికంగా నిర్ధారించాలని సూచించారు. తమకు చెందిన ఓటు అయితే దాన్ని కొనసాగించేలా, తమకు సంబంధం లేని లేదా డూప్లికేట్గా గుర్తించిన ఓటుపై అవసరమైన అభ్యంతరం దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఎల్ఏల ద్వారా వచ్చిన సమాచారాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు సమీకరించి సంబంధిత ఈఆర్ఓలకు సమర్పించాలని, సమర్పించిన ప్రతిసారీ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో అభ్యంతరాలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రసీదులు, ఇతర పత్రాలు ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.బయట ఉన్న ఓటర్లతో సమన్వయం అవసరంక్లస్టర్ ఇన్చార్జీలు, కంట్రోల్ రూమ్లు, టాస్క్ఫోర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ పరిశీలకుల సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్కు సంబంధించిన అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపైనా వచ్చిన జాబితాలను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలను సమిష్టిగా సమర్పించాలని చెప్పారు. ఆగస్టు 27, 28 తేదీల నాటికి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసి, నెలాఖరు చివరి రెండు రోజుల్లో తుది పరిశీలనకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆగస్టు 30 తర్వాత అవకాశాలు పరిమితమవుతాయని, అందువల్ల ప్రస్తుతం ఉన్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, ఆ అవకాశాన్ని బీఎల్ఏలు వినియోగించుకుని ఓటర్ల జాబితా, దరఖాస్తులు, నోటీసులు, సవరణల వివరాలను పరిశీలించాలని సూచించారు. బయట ఉన్న ఓటర్లకు సంబంధించిన అంశాల్లో వారికి అందుబాటులో ఉన్న విధానాలపై అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. సర్ ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయడం ద్వారా అర్హులైన ఓటర్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు భవిష్యత్ ఓటర్ల జాబితా సవరణల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల సన్నద్ధతపై 25న వైఎస్ జగన్ దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజులు పార్టీకి చెందిన సిబ్బంది, సహాయకులు, నియోజకవర్గ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి స్పష్టమైన టార్గెట్లు కేటాయించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. -
‘రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని.. ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పాలకుల మొద్దునిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..సీమపై చంద్రబాబుది మొదటి నుంచీ కక్షపూరిత వైఖరే..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం రిజర్వాయర్లో దాదాపు 185 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ 90 శాతం నిండి పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కానీ దానిపై ఆధారపడిన రాయలసీమ రిజర్వాయర్లన్నీ సగానికి పైగా ఎండిపోయి ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సింది పోయి, పంటలు వేసుకోవద్దని బాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు.రైతులను వ్యవసాయానికి, భూములకు దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు?. శ్రీశైలం నిండితే దిగువన ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, ఔకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, చిత్రావతి ప్రాజెక్టులు ఎందుకు నిండటం లేదు? 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 4 నుంచి 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? సీమ ప్రాజెక్టులను ఎండగడతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మాట ఇచ్చారా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు అయితే.. కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. 850 అడుగులు దాటిన తర్వాత కనీసం 30 నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబుగతంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును తలపెట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టును చంద్రబాబు.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నిలిపివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే రోజుకు 80 వేల క్యూసెక్కుల వరద నీటిని ఒడిసిపట్టి సీమ ప్రాజెక్టులన్నింటినీ క్షణాల్లో నింపేవాళ్లం. అలాంటి మహోన్నత ప్రాజెక్టును గతంలో 'బురద నీళ్లు' అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైయస్.జగన్ ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించి రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టారు.ఆల్మట్టి, అప్పర్ భద్రలపై ఎందుకు మౌనం?కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రోజుకోసారి జపం చేసే చంద్రబాబు.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్రకు 25 టీఎంసీల నీరు ఆగిపోయి ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? పులిచింతల పరివాహక ప్రాంత రైతుల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబుకు నీళ్ల మీద, రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.24న 'పోతిరెడ్డిపాడు' వద్ద మహా పోరాటం..ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని శైలజనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతు విభాగాలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడును పూర్తి సామర్థ్యంతో, హంద్రీ-నీవాను పూర్తి సామర్థ్యంతో నడిపించి రాయలసీమ ప్రాజెక్టులను నింపాలని.. 6,300 క్యూసెక్కుల హంద్రీ-నీవా సామర్థ్యాన్ని తగ్గించి 3,800 క్యూసెక్కులకు పరిమితం చేయడం ఎందుకని నిలదీశారు.దీనిపై రైతులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. తక్షణమే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శైలజానాధ్ హెచ్చరించారు. -
‘డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఆక్షేపించారు.ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అంతా డైవర్షన్ పాలిటిక్స్:డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో గ్రూప్-1 అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు కదా.. వాటిపై సీబీఐ విచారణకు మేము సిద్ధం. మరి మీ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి అరాచకాలు పెరిగిపోతుంటే, యువత తప్పుదోవ పడుతుంటే దానిపై మాట్లాడకుండా ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు?న్యాయం కోసం శాంతియుతంగా వీల్చైర్లో యాత్ర చేస్తున్న సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు హింసించారు? ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడి హిట్ అండ్ రన్ ఘటనపైనా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలను ఏదో సాధించినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీకి సవాల్:వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ట్రయల్ జరగాలి అంటుంటే.. ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సీబీఐ విచారణ జరిగింది. కేసు కోర్టుల పరిధిలో ఉంది. నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి. ట్రయల్ జరగడానికి మీకు అభ్యంతరం ఏమిటి?చంద్రబాబుకి సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాయే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి తరఫున కూడా వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బుతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ, కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విచారణ జరపండి.. ట్రయల్ జరపండి.. నిజాలు ప్రజల ముందుకు రానివ్వండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సుగాలి ప్రీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసైనా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ నేరేటివ్, డైవర్షన్ రాజకీయాలు మానండి. వ్యవస్థలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా విచారణ జరగనివ్వండి. మీ మీడియా శక్తితో ఎంత ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు. వివేకానంద రెడ్డి మా మనిషి. దివంగత వైఎస్సార్ సోదరుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు. ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలి. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి. విచారణ జరగాలి. నిజం ప్రజల ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
-
హైదరాబాద్లో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీలు.. అభిమానుల కోలాహలం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిర్పోర్టు వద్ద వేచి చేస్తున్నారు.మరికాసేపట్లో వైఎస్ జగన్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో బేగంపేట్ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ శ్రేణుల రాకతో ఎయిర్పోర్టు పరిసర రోడ్లు జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ను చూసేందుకు, స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది.Hearty welcome @ysjagan Anna 🔥🔥🔥 pic.twitter.com/IQvz55shwJ— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) August 21, 2026మరోవైపు.. వైఎస్సార్సీపీ అభిమానులు హైదరాబాద్లో భారీ స్థాయిలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్పై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫొటోలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. YSJAGAN Telangana Hyderabad Visit Draws AttentionYS Jagan is set to arrive in Hyderabad today. Large welcome posters and cutouts have appeared across the city, including a striking @ysjagan @KCRBRSPresident – @KTRBRS display arranged by BRS leader Chirra Ravinder Yadav pic.twitter.com/o2X6BuiKMl— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026 -
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సాక్షి, గుంటూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఇన్నాళ్లుగా సీబీఐ విచారణలో కనిపించని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు పీఎంఎల్ఏ పేరిట హఠాత్తుగా రంగంలోకి రావడంపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాలు కూటమి ప్రభుత్వం వారి కొత్త డైవర్షన్ డ్రామా అంటూ మండిపడుతోంది.వివేకా హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్లో రెండు, కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో.. మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ కేసులో హవాలా మనీ కోణం తెరపైకి రావడం పలు అనుమాలకు తావిస్తోంది.ఇంతకాలం ఈడీ ఎక్కడ?2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ 2020 నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. తాజాగా మూడో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం.. ఇకపై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తిచేసినట్లు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ దశలో తదుపరి దర్యాప్తుపై జోక్యం చేసుకోలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా ప్రశ్నలకు తావిస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని చెబుతున్న సమయంలో.. కొత్తగా ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది? ఇంతకాలం ఈడీ పేరు ఎక్కడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా సోదాలు ఎందుకు? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తోంది.డీఎస్సీ వివాదం.. అవినీతి ఆరోపణల వేడిఇదే సమయంలో.. ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారం సహా పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. డీఎస్సీలో అవకతవకలు జరగడం.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని పరోక్షంగా ఒప్పుకోవడం.. మండలిలో చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టడం.. భయపడి కూటమి ప్రభుత్వం పారిపోవడం తెలిసిందే. అటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కుంభకోణాన్ని బయటపెట్టి.. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ను ఏకీపారేశారు. 2018 గ్రూప్-1 విషయంలో తాము సీబీఐ విచారణకు సిద్ధమని, డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివేకా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘డైవర్షన్ డ్రామా’నేఈడీ సోదాల వెనుక కేంద్ర దర్యాప్తు అవసరం కంటే రాజకీయ ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు దీని వెనుక ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.‘‘కూటమి ప్రభుత్వ తప్పులను, అవినీతి ఆరోపణలను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు దిగుతుంది. గత రెండేళ్లలో ఏపీలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు కూడా ఇంతే’’ అని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మొత్తానికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్లు చెబుతున్న వేళ.. అదే కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామాకు తెరలేపినట్లైంది. -
నేడు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. -
చర్చల్లేవ్.. ఆమోదాలే
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు. అయితే, డీఎస్సీ అంశంపై చర్చ లేకుండానే నాలుగు రోజుల శాసనమండలి సమావేశాలు ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రమేష్యాదవ్, ఇషాక్బాషా డీఎస్సీ–2025 నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు ప్రకటించగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా చైర్మన్ పోడియం ముందుకు చేరుకుని డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చను చేపట్టాలని కోరారు. అయితే, ప్రశ్నోత్తరాల కార్యక్రమమే కొనసాగుతుండడంతో పోడియం ముందు, పోడియంపైన చైర్మన్ కుర్చీని చుట్టిముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, డీఎస్సీపై సభలో చర్చ చేయకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది, వెంటనే చర్చకు అనుమతించాలి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. చైర్మన్ మోషేన్రాజు ఆందోళన చేస్తున్న సభ్యులను వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనను కొనసాగించారు. సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియంపై చైర్మన్ కుర్చీకి రెండువైపులా నిలబడి నినాదాలు చేశారు. చైర్మన్ ముఖానికి అడ్డంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగిస్తుండటంతో 10.21 గంటల సమయంలో సభను తాత్కాలిక విరామ వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. సభ్యుల ఆందోళన కొనసాగిన ఆ 20 నిమిషాల సమయంలోనే మంత్రులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఐదు ప్రశ్నలకు జవాబిచ్చారు.నేలపై కూర్చుని ఆందోళన కొనసాగింపుసభ విరామ వాయిదా పడిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ముందు కూర్చుని ఆందోళన కొనసాగించారు. ‘చర్చకు రాకుండా విద్యాశాఖ మంత్రి పారిపోతున్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి. వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు ప్రభుత్వం’ అంటూ నినాదాలు కొనసాగించారు. 11.45 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభం కాగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో చైర్మన్ మోషేన్రాజు ప్రమాణం చేయించారు. అనంతరం బిల్లులపై చర్చను చేపడుతున్నట్టు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి పోడియం వద్దకు చేరుకుని డీఎస్సీపై చర్చను చేపట్టాలంటూ ఆందోళనను కొనసాగించారు. సభ్యులు పలు సందర్భాల్లో చైర్మన్కు దండం పెడూతూ డీఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతించాలని కోరడం గమనార్హం. కాగా, ఆందోళనల మధ్యనే దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే నాలుగు బిల్లులపై చర్చ కొనసాగి, ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్ కుర్చీ చుట్టూ నిలబడి ప్లకార్డులతో ఆందోళన కొనసాగిస్తుండటంతో 12 గంటల సమయంలో సభను రెండోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అనంతరం 12.42 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్యనే మధ్యాహ్నం ఒంటిగంటలోపు మరో 8 బిల్లులపై చర్చ చేపట్టిన చైర్మన్ ఆ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టు ప్రకటించారు. తర్వాత మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన ‘ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) అమెండ్మెంట్ యాక్ట్పై తీర్మానం ప్రవేశపెట్టి సభ్యుల ఆందోళన, గందరగోళ పరిస్థితుల మధ్య సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ‘షేమ్.. షేమ్. డీఎస్సీ చర్చనుంచి పారిపోయిన ప్రభుత్వం.. సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు కొనసాగించారు. అదే సభ నిరవధిక వాయిదాకు గుర్తుగా ‘జనగణమన..’ గీతం ప్రారంభం కావడంతో ఎక్కడివారు అక్కడే మౌనంగా నిలబడి గీతాలాపన చేశారు.లోకేశ్ రాజీనామా చేయాలిడీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతికబాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బయట సర్కిల్ నుంచి గురువారం ప్రదర్శనగా వారు ‘మండలి’కి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సిగ్గు సిగ్గు, వెన్నుపోటు పార్టీకి సిగ్గు శరము లేదు, ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.. పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు ఇస్తారా సిగ్గు సిగ్గు.. జీఓ నెం.4, 47లపై సీబీఐ విచారణ జరపాలి.. అంటూ వారు నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మండలిలో చర్చించాలని.. తక్షణమే సీబీఐ విచారణ జరపాలంటూ ప్లకార్డు, పెద్ద బ్యానర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు. -
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారని అన్నారు. సాక్షాత్తూ పోలీసుల కారులోనే గంజాయి పట్టుబడిందని, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఎస్పీ, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి కిందిస్థాయి వారిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని చెప్పారు. అమరావతిలో కొత్తగా వారు చేసిందేమీలేదని, ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరే మళ్లీ టెంట్లు వేసి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.రోజంతా చర్చిద్దామన్నాం..డీఎస్సీలో అక్రమాలు, గ్రూప్ – 1 అంశాలపై సభలో రోజంతా చర్చిద్దామని, అవసరమైతే మరో రెండు రోజులు సభను పొడిగించాలని తాము డిమాండ్ చేస్తే పారిపోయారని, పైగా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని బొత్స తెలిపారు. బయటకొచ్చి మాత్రం ప్రతిపక్షంపై బురదజల్లుతూ డాంబికాలు పలుకుతారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా 1.30 లక్షల సచివాలయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో 10,300కు పైగా టీచర్ పోస్టుల భర్తీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1998 డీఎస్సీలో మిగిలిపోయిన 5,887 మందికి, 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. 2019 స్పెషల్ డీఎస్సీ ద్వారా 521 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేజీబీవీల్లో 1,250 మంది క్వాలిఫైడ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించామని, ట్రిపుల్ ఐటీలో 450 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మొత్తంగా ఉపాధ్యాయ రంగంలో 10,300కు పైగా ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అలాగే 2024 ఫిబ్రవరి 12న 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటించామని, ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. మరి వైఎస్సార్సీపీ హయాంలో 16 వేల పోస్టులు ఇవ్వలేదని ఎలా చెబుతున్నారని, దీంట్లో ఏది అబద్ధమో సభలో నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు.విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారుపేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, జగనన్న గోరుముద్ద లాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారని బొత్స చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ లేకుండా కఠిన చట్టాలు తెచ్చామన్నారు. ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, లక్షలాది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల వైపు నెడుతున్నారని చెప్పారు. సగం మంది తల్లులకు అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ మోసాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో’నే తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
గ్రూప్–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా
పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్కు సూటిగా వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్ చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్–1 నియామకాలను ఆధారాలతో వైఎస్ జగన్ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్ వివరాలను ఫోన్ నంబర్తో సహా ప్రదర్శించిన వైఎస్ జగన్ ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ. మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టంమా హయాంలో జరిగిన గ్రూప్–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైంది. బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్ నంబర్ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదుబాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా. -
కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు, ముత్యాలమ్మ బోటును రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇండియన్ నేవీ ఇండియన్ పోస్ట్ గార్డ్ సంయుక్తంగా మత్స్యకారులని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.మత్స్యకారుల చివర మొబైల్ సిగ్నల్ని ట్రాక్ చేయాలి. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని బోటు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిందా లేదా అనేది తెలుసుకోవాలి. గాలింపు చర్యల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు మూడో తేదీన ఓడలరేవు నుంచి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులని , బోట్లని కనుగొనలేకపోయాయి. తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. బోటు ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా మునిగిపోవడం, లేదంటే అంతర్జాతీయ జలాల్లో కి ప్రవేశించి ఉండవచ్చని జిల్లా కలెక్టర్ అంటున్నారు. -
వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు.నూతన వధూవరులు వర్షితరెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. -
రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (21 ఆగస్టు, శుక్రవారం) హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
-
వైఎస్ జగన్ని కలిసిన మెడికో ప్రియాంక పేరెంట్స్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు గురువారం కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన విషయమై వైఎస్ జగన్కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.తమ కుమార్తెను తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైఎస్ జగన్ సముదాయించి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ వైఎస్ జగన్ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. -
అవినీతి, అక్రమాల కోసమే డీఎస్సీలో శాప్ జోక్యం చేసుకుంది
-
‘అందుకే చంద్రబాబు సర్కార్ తోకముడిచింది’
సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలున్నాయనే మేం విచారణ జరిపించాలని కోరాం. మార్కెట్లో వస్తువుల్లా ఉద్యోగాలు అమ్ముకున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవం.. అందుకే ప్రభుత్వం తోకముడిచింది’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘డీఎస్సీతో పాటు గ్రూప్-1 పైన కూడా సీబీఐ విచారణ జరిపించండి. 1998 డీఎస్సీలో 5887 మందికి ఉద్యోగాలిచ్చింది మేమే. 2008 డీఎస్సీలో 2193 మందికి ఉద్యోగాలిచ్చింది కూడా మేమే. 2019లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలిచ్చాం. 1250 మంది కేజీబీవీ టీచర్లకు ఉద్యోగాలు కల్పించాం. మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకుని అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయినట్లు డాంబికం ఎందుకు?. ఈ ప్రభుత్వం పనైపోయింది. రెండేళ్లలోనే ప్రభుత్వం మోసం తెలిసిపోయింది..మాట్లాడితే సవాళ్లు విసురుతారు.. చర్చకు రమ్మంటే రారు. ప్రజల సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సభలో చర్చించాలని కోరాం. మీలా ప్రతిదీ రాజకీయ కోణంలో మేం చూడలేం. మా ఇంటికొస్తే మీరు ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అనేలా ఉంది ప్రభుత్వం తీరు. రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు?. విద్యావ్యవస్థలో లోపం ఉంది కాబట్టే ప్రైవేట్కు తరలిపోయారు...విద్యావ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్ జగన్. నాడు నేడు పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చింది వైఎస్ జగన్. ఐబీ వంటి సిలబస్లు పెట్టి విద్యా ప్రమాణాలు పెంచింది వైఎస్ జగన్. జగన్ గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాం. వైఎస్ జగన్ అమ్మ ఒడిని సక్రమంగా అమలు చేశారు’’ అని బొత్స వివరించారు. -
కేసుల వెనుక కుట్ర ఇదే... చింతాడ రవి సంచలన వ్యాఖ్యలు
-
APలో స్థానిక ఎన్నికల సమరానికి సై అంటున్న YSRCP
-
మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం
-
ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. 👉ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా.. 👉పది బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదంచర్చకు రాకుండా తప్పించుకున్న కూటమి..డీఎస్సీ అక్రమాలపై చర్చకు రాని ప్రభుత్వంనాలుగు రోజుల పాటు డీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పోరాటంనాలుగు రోజులు డీఎస్సీపై చర్చకు భయపడ్డ ప్రభుత్వంప్రతిపక్షం లేని అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రభుత్వంప్రతిపక్షం ఉన్న మండలిలో చర్చ కు భయపడ్డ ప్రభుత్వంఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఉధృతంశాసన మండలి వాయిదా పడినా ఆందోళన కొనసాగింపుమండలిలో నేల మీద కూర్చుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీలుడీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని ఆందోళననారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనశాసనమండలిలో వైఎశాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్డీఎస్సీపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుపోడియం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు స్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కామెంట్స్..డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదుతప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారుస్పోర్ట్స్ కోటా వారికి పరీక్ష లేకుండా ఉద్యోగమిచ్చామని మంత్రి లోకేష్ చెబుతున్నారుటెట్ నుంచి మినహాయించి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి అడిగినందుకు టీచర్లను సస్పెండ్ చేశారుతక్షణమే టీచర్లపై సస్పెన్షన్ ఎత్తేయాలిడీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలిఎమ్మెల్సీ మధుసూధన్ కామెంట్స్..2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% శాతానికి పెంచారుడీఎస్సీకి ముందు ఒక జీవో.. తర్వాత ఒక జీవో తెచ్చారు.జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారుడీఎస్సీలో ఉద్యోగాల కోసం లక్షల్లో బేరసారాలు జరిగాయిఎందుకు డీఎస్సీపై విచారణకు భయపడుతున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్..గతంలో ఎన్నడూ ఇలాంటి సమావేశాలు జరగలేదుడీఎస్సీపై విచారణ చేయించాలంటే భయపడి పారిపోతున్నారు.ర్యాలీగా మండలికి ఎమ్మెల్సీలు..ర్యాలీగా మండలికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమెడలో నల్ల కండువాలు ధరించి నిరసనమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలుడీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్డీఎస్సీపై విచారణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శనమంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, డీఎస్సీపై మాట్లాడారు.వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే గింజుకున్నారు. తప్పు ఒప్పుకోవడం లేదు.తప్పులను ప్రతిపక్షం ఎత్తుచూపుతున్నదని చంద్రబాబుకు భయంఅసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ బ్యాటింగ్ చేస్తున్నారు.ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రశ్నపత్రం తయారీ ఎస్సీఈఆర్టీ బాద్యతరెండూ ఒకే వ్యక్తి చేతిలోపెడితే పారదర్శకత ఉంటుందా?ఇక్కడే స్కామ్కు బీజం పడింది.ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?స్వయంగా లోకేష్ సభలో అంగీకరించారు.ఏపీ డీఎస్సీ నియామాక చరిత్రలో ఎప్పుడు ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు అప్పగించలేదుపేపర్ తయారీ విభాగంలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది.ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ పేరు ఉందిఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?వెరిఫికేషన్లో నవీన్ పేరు లేదని ఉద్యోగం ఇవ్వలేదటఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు?సెకెండ్ వెరిఫికేషన్ లిస్టులో కూడా నవీన్ పేరు తొలగించారు.సర్టిఫికెట్ వెరిఫికేష్కు నవీన్ ఎలా వస్తాడు?డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా ఎంఎల్సీలు స్తంభింపచేశారు.కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు. మేం లేవనెత్తిన కీలక అంశంకూడా ఇదే. అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడు.ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.చదువు చెప్పేవారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా?డీఎస్సీ నియామకం తర్వాత ఇచ్చిన జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారుపీవీ సింధు పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ అబద్ధాలుచరిత్రలో లేనివిధంగా పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు.మెడల్స్ కాదు కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చేశారు.గతంలో డీఎస్సీ క్వాలిఫై అయితేనే ఉద్యోగం వచ్చేది.జీవోలు ఇచ్చే స్థాయికి స్కాం వెళ్లింది.372 మందికి ఉద్యోగాలిచ్చిన జీవోలను రద్దు చేశారు.మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?డీఎస్ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి.డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీచేశామనికూడా ఒప్పుకున్నారు.దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామ్మూలుగా లేవు.స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట?ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా, కొడుకులు ఇద్దరికే తప్ప, ఎవరికైనా సాధ్యం అవుతుందా?పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేష్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా?పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పీవీ సింధులా ఎంతమందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా?తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నాడు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ - ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు.ఒకవైపు సింధు పేరుచెప్పి, మరోవైపు వీళ్ల అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి - అంటే, చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్టీ కేండిడేట్ దుర్గయ్యకు కూడా, కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారు. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే: వైఎస్ జగన్‘నీట్’ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాధర్మేంద్ర ప్రధాన్కు ఒక నీతి.. బాబు కుమారునికి మరొక నీతా?కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారుడుబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పోలీసుల వ్యవహరంమేం నిర్వహించిన ఎపీపీఎస్సీలో లీకేజీ జరగలేదు.స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్టుగా, ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో, పేరు చూపకుండా, కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆకేసును ఎందుకు నిర్వీర్యం చేశారు. మరి చంద్రబాబు, లోకేష్లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డీఎస్సీ అభ్యర్థికి స్పోర్ట్స్కోటాలో పోస్టు ఇప్పిస్తామని రూ.14లక్షలు తీసుకున్నారు.రిఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రిఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్టు వచ్చింది, కాని, ఈ అమ్మాయికి పోస్టు రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టుకోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు.గత ఏడాది నవంబర్ 11న, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.అంటే డీఎస్సీ విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడవి అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదలిలేయాలని, తండ్రికొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్టుగా, దాన్ని పోలీసులు పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్కోటా వరకూ, ఆపై బేరసారాల వరకూ ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు.అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. మేం ఎవరికీ అనుకూలంగా జీవోలు తీసుకురాలేదుకొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశంనిజాలను ఎవరూ దాచలేరు.. బయట పెట్టాల్సిందేఅప్పట్లో కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్కు వెళ్లాం.మార్కుల ఆధారంగా 165 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కొంతమంది కోర్టుకు వెళ్లడంతో డిజిట్ వాల్యుయేషన్ను పరిగణలోకి తీసుకోలేదు.మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. మరింత దిగజారిపోయి 2018- ఏపీపీఎస్సీ గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు.అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి, డీఎస్సీ మాదిరిగా పేపర్ లీకేజీ అప్పుడు జరగలేదు.ఇప్పటి డీఎస్సీ మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ లేదా ఇతర ఉద్యోగులు ఎవ్వరికీ ర్యాంకులు రాలేదు. ఎవ్వరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షలే లేకుండా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియో, వీడియో ఆధారాల్లాంటివి బయటకు రాలేదు.బయటకు వస్తున్నదల్లా చంద్రబాబు ఆక్రోశం. కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్లో ఒక సిట్ వేశాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టులో గవర్నమెంటు అడ్వకేట్లు సైతం అఫడవిట్ ఫైల్ చేశారు. ఇది ఓవైపు జరుగుతుండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. సిట్లో ఉండేది ఎవరు? చంద్రబాబుగారి కింద పనిచేసే వారే.బురదజల్లడంకోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు.గ్రూప్-1 వాల్యూషన్కు సంబంధించి హాయ్ల్యాండ్లో ఏదో జరిగిపోయిందని, అదే పనిగా, ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. హాయ్లాండ్లో ఎలాంటి ఎవాల్యూషన్ జరగలేదని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి.చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్ 15న, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే విషయాన్ని రాశారు.మరి ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు?గ్రూప్ -1పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.బాబు హయాంలోని ఏపీపీఎస్సీ ఫలితాలు బయటపెట్టగలారా?ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు వచ్చాయో, రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా?.. చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: వైఎస్ జగన్ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం.2018 గ్రూప్ -1, 2025 డిఎస్సీ విచారణకు రెడీ.. సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకుని అడుగుతున్నాం.. చంద్రబాబు, లోకేష్కు వైఎస్ జగన్ సవాల్ మేం ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్లను చంద్రబాబు పెండింగ్లో పెట్టాడు. మరో రెండింటిని రద్దు చేశాడు. ఇదీ నిరుద్యోగుల మీదున్న ప్రేమ.చంద్రబాబూ…మేం సవాల్ విసురుతున్నాం. మేం అడుగుతున్నట్టుగా DSC-2025పైనే కాదు, 2018 గ్రూప్-1 నోటిఫికేషన్మీదా, సీబీఐ ఎంక్వైరీ వేయండి. మేం రెడీ. చంద్రబాబు రెడీనా?తప్పు చేయలేదు కాబట్టి, మేం రెడీగా ఉన్నాం. చంద్రబాబు రెడీ అయితే వెంటనే సీబీఐ దర్యాప్తుకు లెటర్ రాయాలి. -
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బరితెగింపు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. ఓ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పెద్దారెడ్డి అనుచరుడిగా కుట్ర చేస్తూ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.వివరాల మేరకు.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో 400 బాటిళ్ల గోవా లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచురుడిగా చూపించేందుకు పచ్చ నేతలు కుట్రకు తెరలేపారు. నిందితుడు.. పెద్దారెడ్డి పక్కనే ఉన్నట్టుగా జేసీ వర్గీయులు ఫొటో క్రియేట్ చేశారు. అనంతరం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అయితే, పచ్చ నేతల కుట్రలకు వైఎస్సార్సీపీ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త స్థానంలో మరో వ్యక్తి ఫోటో మార్ఫింగ్ చేసి.. పెద్దారెడ్డిపై దుష్ప్రచారం చేసినట్టు ఆధారాలు చూపించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేతల మార్ఫింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
లోకేష్ కాదు 'లీకేష్'! ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా..
-
వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ– 2025లో జరిగిన అక్రమాలు, అవినీతిపై శానసమండలిలో చర్చించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. శాసనసభలో డీఎస్సీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బల్లలు చరిపించుకున్న వారు మండలిలో చర్చకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మందికి సంబంధించిన అంశంపై మండలిలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం అందజేస్తున్నా తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలతో హాజరయ్యారు. అంతకముందు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీఎస్సీపై చర్చకు రాని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం డౌన్ డౌన్, మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. -
డీఎస్సీ నియామకాల నిగ్గు తేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, బేరసారాలపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా మూడోరోజు బుధవారం కూడా శాసనమండలిలో పట్టుబట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు నిగ్గుతేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే.. అంటూ ఆందోళన కొనసాగించారు. నల్లజెండాలు మెడలో వేసుకొని చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ–2025 నిర్వహణ, నియామకాలపై చర్చ కోరుతూ సభ్యులు టి.కల్పలత, ఎం.వి.రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్రెడ్డి ఉదయం వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు అనుమతించాలంటూ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు అనుమతించడం కుదరదంటూ చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ అక్రమాలపై చర్చకు వెంటనే అనుమతించాలని నినాదాలు చేస్తూ పోడియంపైన చైర్మన్ వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం కింద ఉన్న పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ నినాదాలు కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి.. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వమే ప్రొసీజర్స్ ఫాలో కావాలి కదా: చైర్మన్ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ పోడియంపైకి వచి్చన సభ్యులపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్రాజును కోరారు. ‘వాళ్లను కిందకు రమ్మనండి. మీరు చెప్పాలి. అది ప్రొసీజర్..’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. ‘మీరు మంత్రి. స్పీకర్గా కూడా చేసి ఉన్నారు. మీరు పదేపదే సభను అర్డర్లో పెట్టమంటున్నారు. తప్పులేదు. చర్యలు తీసుకోమంటున్నారు. కానీ చర్యలు తీసుకోమన్నప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉందో ప్రభుత్వపరంగా ఫాలో అవండి. అంతేతప్ప మీరు పదేపదే చైర్ను పెద్దస్వరంతో.. ఏదో చేయలేకపోతున్నారు అనడం సరికాదు. మీకు అన్ని రూల్స్ తెలుసు. చర్యలు ఏం తీసుకోవాలో, రూల్స్ ఫాలో అవండి’ అంటూ సూచించారు. మంత్రి నాదెండ్ల, చైర్మన్ల మధ్య ఈ చర్చ జరిగే సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రస్వరంతో నినాదాలు కొనసాగించడంతో కేవలం పది నిమిషాలకే సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్కు మంత్రులు పాఠాలు చెప్పడం సరికాదు: బొత్స సత్యనారాయణ తిరిగి 11 గంటల సమయంలో సభ ప్రారంభమైన తరువాత మంత్రి నాదెండ్ల, మండలి చైర్మన్ మధ్య జరిగిన సంభాషణ మరోసారి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘సభలో నిబంధనలు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే రకంగా వర్తిస్తాయి. చిన్న అలసత్వం ఏదైనా జరిగితే మీకు చెప్పవచ్చు కానీ, మీకు హితబోధ చేయడం సరికాదు. దురదృష్టకరం. మంత్రి వైఖరి చాలాసార్లు చూశా. సభ్యుల ఆవేదన కూడ చైర్మన్ పరిశీలించాలి. మా డిమాండ్ ఒక్కటే.. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాలని. కానీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం బయట మాత్రం ప్రతిచోట చర్చకు మేం సిద్ధమేనని చెబుతోంది. చర్చ జరపమనే మేం అడుగుతున్నాం. కానీ చైర్మన్కు పాఠాలు చెప్పడాన్ని ఖండిస్తున్నాం. మంత్రులే భాషను తూలనాడుతున్నారు. మేం తప్పుగా మాట్లాడితే చూపించండి’ అని బొత్స పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. తరువాత మరోసారి వాయిదా పడి తిరిగి 12.45 గంటలకు ప్రారంభమైన సభ పదినిమిషాల వ్యవధిలోనే గురువారానికి వాయిదా పడింది. -
మోసాలపై చర్చ మొదలైంది
‘‘ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఉంది. ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా ఒక్క మనిషి మాత్రమే. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’’ ‘‘చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు.’’ ‘‘నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసిన మోసాలపైనా చర్చ సాగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు అయినా సరే. ప్రజలైనా సరే. ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి. ఆ పార్టీకి ప్రజలే ఆ నామకరణం చేశారు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గెలుపు తధ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న వైఎస్ జగన్.. ఆ దిశలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించి.. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చే దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చాడు. నేను అలా కాదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున.. నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తా అన్నాడు. అంతటితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి, అమూల్, ఐటీసి, రిలయన్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలతో టైఅప్ చేయించి, ప్రతి మహిళను తాను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తే.. జగన్ ఏటా కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే, 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడ రూ.18,750. ఎక్కడ రూ.48 వేలు. అంటే దాదాపు మూడు రెట్లు. ఇంకా అంతటితో ఆగలా. 18 ఏళ్లు నిండిన ఏ మహిళకైనా నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామన్నారు. అలా నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని ప్రచారం చేశారు. అది ఆడబిడ్డ నిధి అంట!. ఇంకా భుజాన కండువా వేసుకుని ఎవరైనా రైతు కనిపిస్తే ఏమన్నాడు?. జగన్ ఇచ్చేది ఏటా రూ.13,500 మాత్రమే కదా, నేను వస్తే రూ.26 వేల చొప్పున ఇస్తామన్నారు. మళ్లీ ఎవరైనా యువకుడు కనిపిస్తే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అన్నాడు. అదే నిరుద్యోగ భృతి. అలా అప్పుడు జగన్ ఇచ్చేవాటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. బాండ్లు, సంతకాలతో పచ్చి మోసం ఇంటింటికి పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను పంపాడు. తన ఫోటో, సంతకంతో ఒక బాండ్ తయారు చేసి, ప్రతి ఇంటికి ఇవ్వడం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారమ్మా? వాళ్లకు ఏటా రూ.18 వేలు. మీ ఇంట్లో 50 ఏళ్లు నిండిన మీ అత్తమ్మ ఉందా? నీకు రూ.48 వేలు. సినిమా రిలీజ్ జూన్, 2024. అని బాండ్లు ప్రతి ఇంటికీ పంపారు. ఇంకా ప్రమాణం. ‘నేను పవన్ కళ్యాణ్. మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం’ అని చెప్పి, ఇద్దరూ బాండ్ల మీద సంతకాలు చేశారు. అవేవీ అమలు కాలేదు కాబట్టి, ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా. అధిక ధరలకు పీపీఏలు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ఇచ్చేయడం, కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం. అమరావతిలో చూస్తే చదరపు కట్టడానికి ఏకంగా రూ.20 వేలు వ్యయం. అదే హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ కట్టినా చదరపు అడుగుకు రూ.4,500. ఇంకా మహా అయితే రూ.5 వేలు వ్యయం. మరి ఇక్కడ అమరావతిలో ఇసుక ఉచితం. ఇంకా పలు రాయితీలు. అయినా చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు అంటున్నారు. లూటీ ఏ స్థాయిలో జరుగుతోందో ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు పీపీపీ పేరుతో దోచేయడం. ఆస్పత్రి సేవలు, తాగునీరు, ఆర్టీసీ, చివరకు చెత్త ఎత్తడం కూడా అంతా పీపీపీ. అంటే ఇక మీదట మొత్తం ప్రైవేట్ వాళ్ళకే. అంటే లంచాలు తీసుకోవడం. అన్నీ అమ్మేయడం. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి అంటే అర్ధం ప్రభుత్వ ఆస్తులన్నీ శనక్కాయలు, పప్పుబెల్లాలకి అమ్మేయడం. విద్యార్థులకూ వెన్నుపోటు రాష్ట్రంలో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేవు. మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1100 కోట్లు. మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన 2024 జనవరి–మార్రి త్రైమాసికం నుంచి ఇవ్వలేదు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. అంటే మొత్తం రూ.9,100 కోట్లు బాకీ. అది వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1700 కోట్లు. మరోసారి రూ.1100 కోట్లు. అంటే ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షలు తగ్గారు. అక్కచెల్లెమ్మలకూ వంచన అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు లేదు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల సంగతి దేవుడెరుగు. ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు ఉంటే, మన హయాంలో వాటి పరపతి పెంచడంతో, ఆ రుణ పరిమితి రూ.49 వేల కోట్లకు చేరింది. ఇంకా ఆ అక్కచెల్లెమ్మలకు మనం చేయూత ఇచ్చాం. ఆసరా ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగింది. దీంతో రుణ పరిమితి రూ.20 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు చేరింది. అలా మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు రూ.49 వేల కోట్ల నుంచి ఈ రోజు రూ.39 వేల కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో వ్యవసాయం.. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి. 53 శాతం వర్షం లోటు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్నా, ఎక్కడా వరికి బదులు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా ఈయనే దగ్గరుండి కత్తిరించాడు. ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఆర్బికేలను నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం సున్నా. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ లేకుండా ఉన్నారంటే, శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 878 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఫుల్ డ్రా అంటే 44 వేల క్యూసెక్స్. పక్కన తెలంగాణ పవర్ హౌస్ నుంచి పవర్ జనరేషన్ కోసం రిజర్వాయర్లో 800 అడుగుల నుంచే పంప్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి.. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు మొత్తం పంటలంతా నష్టపోతున్నారు. రైతులందరూ 40 శాతం పెట్టుబడి పెట్టి నారుమళ్ళు వేసి ఫెర్టిలైజర్స్ చల్లారు. ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు.. మరోవైపు నీళ్లు ఇవ్వలేను అంటాడు.రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..ఎన్నికలు జరిగి చూస్తుండగానే మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కళ్ళు మూసుకొని, తెరిచే సరికి ఇంకో సంవత్సరం దాటితే, ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. కళ్ళు మూసుకొని, తిరిగి తెరిచేసరికి ఈ రెండేళ్లు ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే, మూడో ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. మామూలుగా ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా మూడో ఏడాదిలో వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పాలనలో అది ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. దీనినిబట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం.చంద్రబాబు పాలనకు–మన పాలనకు తేడా ఏమిటంటే...ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం పూర్తి చేసిన ఏకైక పార్టీ.. ఈ రాష్ట్రంలో.. బహుశా దేశంలో ఏదైనా ఉంది అంటే, అది వైఎస్సార్సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్లి, మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా కూడా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసే వాళ్లం. అలా పక్కాగా బటన్ నొక్కిన పరిపాలన ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ.. అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నగదు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు, ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి, పథకాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండడం. ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్లు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు జరగడం, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, మూడవ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ డిజిటలైజ్ కావడం, ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియంతో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ అమలు చేసిన గోరుముద్ద.. ఆ స్థాయిలో సమీక్ష చేసిన సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలువిద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు విద్యా రంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ మాత్రమే కాదు.. ఏకంగా ఐబి సిలబస్. ఐబి వాళ్ళని తీసుకొచ్చి, మన రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయిస్తూ, 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా, 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ, 2035 నాటికి ఐబి సిలబస్. అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 2035 లో రాసేట్టుగా అడుగులు పడిన పరిస్థితి అంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. మనం రాక మునుపు ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ఇంకా పథకంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. నాడు–నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మొదటిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనం ఇచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతే తొలిసారిగా ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ). ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ఒక 104 అంబులెన్స్ సర్వీస్. పీహెచ్సీలో ప్రతి డాక్టర్కు ఆ మండలంలో నాలుగైదు గ్రామాలు కేటాయించి, ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ 104 సర్వీస్లో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. వైద్య సేవల కోసం తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లే డాక్టర్, అక్కడి విలేజ్ క్లినిక్ను ఉపయోగించేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అలా డాక్టర్లను గ్రామాలకు పంపించిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. సాధారణంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే దొరికేట్లుగా చేసి పరిస్థితి కూడా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం కానీ.. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయాలు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట తొలిసారిగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఆ ఆర్బీకే పరిధిలోని గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాప్. ఆర్బీకేలోనే ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. తాను అగ్రికల్చరల్ అసిస్టెంట్గా రైతు చేయి పట్టుకుని నడిపించడం. ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటకు ఆర్బీకేలో బోర్డు పెట్టి పంటలకు గిట్టుబాటు ధరలు ప్రదర్శించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ గ్రామంలో వెంటనే ఆర్బికే అసిస్టెంట్, సీఎం–యాప్ ద్వారా అంటే..‘కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ఆ సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ ఫెడ్, వెంటనే జోక్యం చేసుకునే వారు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, ఆ గ్రామంలో ఆ పంట కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు కనిపించే విధంగా గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎప్పుడూ చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందే సచివాలయం. మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పని చేస్తూ, చిక్కటి చిరునవ్వుతో సేవలు. మన గ్రామంలోనే 60 ఇళ్లకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్లి సహాయం అందించే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. లంచాలు లేకుండా ప్రభుత్వ సాయం, ఎప్పుడైనా జరిగిందంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది⇒ రాష్ట్రం నివ్వెరపోయే ఘటన. మొన్న అద్దంకిలో జరిగింది. ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. చూస్తే, కారులో ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడందరూ చుట్టుముట్టి కారు డిక్కీ ఓపెన్ చేస్తే, గంజాయి, మద్యం, పెద్ద ఎత్తున డబ్బులు, పోలీస్ యూనిఫార్మ్ కనిపించాయి. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒక సీఐ అక్కడికి వచ్చాడు. అక్కడ స్థానికులు ఆ యాక్సిడెంట్ను వీడియో తీస్తుంటే, కేసు పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఎస్ఐలను ఘటనా స్థలి నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ కారు. అయినా ఇంతవరకు కేసు లేదు. ప్రజలు కూడా మర్చిపోయేలా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో చెప్పడానికి మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ ప్రియాంక. పీజీ మెడికల్ స్టూడెంట్. మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. తాగిన మైకంలో మత్తులో అది మరి గంజాయా లేకపోతే మద్యమా ఏమో గాని ఆ మత్తులో కారుతో గుద్దడం, ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టారు? కనీసం సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే, వైఎస్సార్సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే, ప్రజలు వైఎస్సార్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగని పరిస్థితి. ⇒ మరోవైపున చూస్తే, దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? డాక్టర్ అప్పలరాజు కేసు. పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్. కారు కాదు. తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు. 18 ఏళ్ల పిల్లోడు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108 కి ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడిన ఆ గొర్రెలకాపరికి సీపీఆర్ కూడా చేశాడు. అలా ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ, అదే అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏమిటి? ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతో రెండు మూడు సార్లు గుద్ది, ఆపకుండా వెళ్ళిపోతే, చిన్న చిన్న సెక్షన్లతో కేసు. ⇒ మొన్న తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా. ఏదో కొన్ని కార్టన్లు కాదు. లారీలకు లారీల లోడ్. అంతకు ముందు తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, ములకలచెరువులో ఏకంగా లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కుటీర పరిశ్రమ పెట్టి, వాళ్ల బెల్ట్ షాపులకు పంపిణీ చేసి అమ్మించారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్.ఆ పర్మిట్ రూమ్ల్లో లూజ్గా మందు అమ్మకాలు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.ఎవరైనా చంద్రబాబుని ఎన్నికల హామీలపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు. అక్రమ కేసులు, అరెస్టులు, రొటీన్గా సాగుతున్నాయని, అవి ఏ స్థాయికి చేరాయంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ గాడి తప్పుతుందని జగన్ అన్నారు. స్థానిక సమరానికి సై!స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్గా ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. మీ జగనన్న సపోర్ట్గా ఉంటాడు.’’ అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దురి్వనియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే. చివరగా, వేణుఅన్న మీ అందరికీ పరిచయస్తుడే. మంచి లీడరు. అందుకే ఆయన్ను గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు. -
నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారనీ.. తిరిగి తమమీదే కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్కు బీసీలు ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వచ్చే ఎన్నికల్లో బాబు కూసాలు కదలడం గ్యారంటీ
-
కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: తన కుమార్తె రాజకీయ ప్రవేశంపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేస్తుందని బొత్స వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స.. ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడించారు.కాగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించిందని.. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న బొత్స.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది. సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి. 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటూ పార్టీకి లేదు. ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది’’ అంటూ బొత్స మండిపడ్డారు. -
YS జగన్ పాదయాత్రపై బిగ్ అప్డేట్!
-
విజయం మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే..
-
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
మార్గాని భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
నోరు అదుపులో పెట్టుకో దద్దమ్మ... దమ్ముంటే లోకేష్ తో రాజీనామా చేయించు..
-
వైఎస్సార్సీపీలో చేరికలు.. కక్షతో మార్గాని భరత్ అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి 36వ డివిజన్లో టీడీపీ నుంచి పలువురు కార్యకర్తలను వైఎస్సార్సీపీలో చేర్చుకునే కార్యక్రమానికి భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వస్తున్న భరత్, మాజీ ఎంపీ సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో వైఎస్సార్సీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. భరత్ అరెస్ట్తో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజమండ్రి 36వ డివిజన్లో ఉద్రిక్తత కొనసాగింది. -
రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. -
ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మాధవరావు
-
ఇంత అహంకారమా?.. మండలి పరిణామాలపై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార కూటమి సభ్యులు, మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై చర్చకు పట్టుబడుతుండగా.. సమాధానం చెప్పలేక మంత్రులు అసహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. చివరకు సభను ఎలా నిర్వహించాలో చైర్మన్కే సూచనలు చేసే స్థాయికి మంత్రుల తీరు వెళ్లిందని ధ్వజమెత్తారు.బుధవారం శాసన మండలిలో.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చినా చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఒక్కరికే కాకుండా అందరికీ సమానంగా వర్తించాలని బొత్స పేర్కొన్నారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..వైఎస్సార్సీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి మంత్రులు గట్టిగా మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయడం సరికాదని బొత్స అన్నారు. సభలో మంత్రుల తీరు చూస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం స్పష్టమవుతోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు.చైర్మన్నే ఆదేశిస్తారా?సభను నిర్వహించే విషయంలో మంత్రులు చైర్మన్ కొయ్యే మోషేనురాజుపై అసహనం వ్యక్తం చేయడాన్ని బొత్స తప్పుబట్టారు. “మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా?” అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పార్థసారథి వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై చైర్మన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని బొత్స తెలిపారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ మంత్రులకు స్పష్టం చేయడం.. అధికార పక్షం వ్యవహారశైలికి అద్దం పడుతోందన్నారు.చైర్మన్ సీటును గౌరవించాలిచైర్మన్ స్థానాన్ని మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని బొత్స హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలిని తాను చాలాసార్లు గమనించానని.. ఆయన చైర్మన్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రొసీజర్ బుక్ తీసుకొచ్చి తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాదెండ్ల సమర్థించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. పొరపాటు జరిగితే చెప్పాలి కానీ.. చైర్మన్కే హితబోధ చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.కూటమి ఎమ్మెల్సీల తీరుపైనా..మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కూటమి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని కూడా బొత్స తప్పుబట్టారు. సభలో అధికార పార్టీ సభ్యులు లేకపోవడం సరికాదని, ఇది శాసనసభా సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అన్నారు. డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలు తెలిపారు.“మండలిలో వెన్నుపోటు పార్టీ నేతల తీరు బాధాకరం. ఆ పార్టీ వైఖరి మరోసారి బయటపడింది. అధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవపరిచారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో అధికార పక్షం లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర చరిత్రలో ఎన్నాడూ ఇలా జరగలేదు” అని బొత్స విమర్శించారు. ‘‘అధికార పక్షానికి అహంకరం పనికి కాదు. డిప్యూటీ చైర్మన్కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నీతులు చెప్పడమేనా? పాటించడం తెలియదా?. కూటమి సభ్యులు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు’’ మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందిప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని బొత్స స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంతో పాటు అన్ని ప్రజా సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార పక్షం ఇప్పటికైనా అహంకార వైఖరిని విడనాడి ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్సీపీ మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.మాధవరావు డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్ను చైర్పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు పాటించాలి’ అని చురకలు అంటించారు. -
మూడో రోజూ పారిపోయిన కూటమి
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో అసెంబ్లీ మూడోరోజు సమావేశాల మూడో రోజూ కూడా దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరణతో ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారుఅప్డేట్స్మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణమూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించింది..బయట మేకపోతు గంబీర్యం ప్రదర్శిస్తుంది.డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వ స్పందించడం లేదురాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయంకి తెర తీస్తోందిడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయిందిసభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటు పార్టీకి లేదు..ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుందిరూల్ బుక్స్, చట్టాలు, సంప్రదాయాలు ఎక్కడ వున్నాయి?మేము చెప్పింది మీరు చేయండి అని మాత్రమే కూటమి అంటుంది.. ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తుంది..సభా సంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర మాకు అవసరం ఎందుకు ఇచ్చావ్ దేవుడా? అని సభ్యులు బాధ పడుతున్నారు..పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు.. ఆచరించాలి.రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకొంటున్నారు.. వీళ్లా? మనకు నాయకులు..బీసీలకు జగన్ 50శాతం అమలు చేశారు..బీసీ లకు రిజర్వేషన్ పై కోర్ట్ కి వెళ్ళింది వెన్నుపోటూ పార్టీ నేతలు..డీఎస్సీ మీద జీవో ఎందుకు మార్చమని చెప్పాడు.. అమ్ముకోవడానికి కదా?14 నుండి 19 వరకు ఎంతమంది బీసీ లకు చంద్రబాబు పదవులు ఇచ్చారో రేపు మాట్లాడతా..మంత్రి నాదెండ్ల మనోహర్ ఏకంగా చైర్మన్నే డిక్టేట్ చేస్తారుసభలో చర్చించిదే మండలి లో చర్చించమని అడుగుతున్నాం..ప్రజలు తెలిసో తెలియకో అధికారం ఇచ్చారు.. మాకు నచ్చినట్లు చేస్తాంటే కుదరదు..సభను పొడిగించామని కోరుతున్నాం..గ్రూప్ 1 పరీక్ష పై చర్చమని, ఎంక్వయిరీ వేయమని అడుగుతున్నామని గ్రూప్ 1 పేరు ఎత్తడం మానేశారు..ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ కామెంట్లు..తూమాటి మాధవరావు మండలి డిప్యూటీ ఛైర్మన్గా ఏకగ్రీవమయ్యారుఆయన్ని చైర్లో కూర్చోబెట్టాల్సిన సమయంలో అధికారపక్షం అగౌరవంగా వ్యవహరించిందినాదెండ్ల మనోహర్, మరో మంత్రి సభ రూల్స్ ను నేర్పాలని చూశారు.. అలాంటి వారు సభా మర్యాదలను పాటించలేదుమండలి చరిత్రలో ఈరోజు చీకటి రోజునాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్ ను చైర్ లో కూర్చోబెట్టడానికిన మనసు రాలేదుడీఎస్సీలో విచారణకు రమ్మంటే లోకేష్ రావడం లేదుస్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాశాకే ఉద్యోగమిచ్చామని అధికారులు చెప్పారుస్పోర్ట్స్ కోటా వారికి ఏ పరీక్షా పెట్టలేదని లోకేష్ చెబుతున్నారువ్యవసాయ శాఖ మంత్రి లేకుండా వ్యవసాయం పై చర్చిస్తారువిద్యాశాఖ మంత్రికి బదులు ఫైనాన్స్ మంత్రి సమాధానం చెబుతాడుఓడలరేవులో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు15 రోజులైనా మత్స్యకారుల ఆచూకీ తెలియలేదుప్రభుత్వం ఏం చేస్తోందిమత్స్యకారులు గల్లంతైన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలిఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ..డీఎస్సీ పై మూడవ రోజు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారుఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటోందినిజానిజాలను చర్చించేందుకు మండలిలో అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరండిప్యూటీ ఛైర్మన్ కుర్చీని అధికారపక్షం అగౌరవపరిచిందిమండలి పట్ల అధికారపక్షానికి ఎంత గౌరవముందో తేలిపోయిందిబీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో చర్చించారుబలహీన వర్గాలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదుస్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందిజగన్ మోహన్ రెడ్డి జనరల్ పోస్టుల్లోనూ బిసిలకు అవకాశం కల్పించారుజీవో లేకపోయినా 36% బిసిలకు అవకాశం కల్పించిన మహానాయకుడు జగన్బీసీలే వెన్నుముక అని నమ్మిన నాయకుడు జగన్50 ఏళ్లకే బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారుఅధికారంలోకి వచ్చి రెండేళ్లైన బీసీలకు పెన్షన్ ఇవ్వలేదుజగన్ బీసీ కులాలకు కార్పొరేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు హేళన చేశారుఇప్పుడు తమ మనుషులతో అవే కార్పొరేషన్లను భర్తీ చేసుకున్నారుమేయర్, జడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తామనడం దుర్మార్గంతమ మనుషులకు మేలు చేయడం కోసమే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ..మంత్రి లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటలు మండలికి వచ్చి ఎందుకు చెప్పరు?డీఎస్సీ అక్రమాల పై చర్చకు రాకుండా పారిపోతున్నారుఈరోజు సభలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరంమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షం వ్యవహరించిందిరూల్స్ బుక్ తీసుకొచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు సభా మర్యాదలు తెలియదా?స్పీకర్ గా చేసిన వ్యక్తికి సభ రూల్స్ గుర్తులేదా?మండలి మీడియా పాయింట్ వద్ద రమేశ్ యాదవ్ కామెంట్లు.. బీసీలకు ‘వెన్నుపోటు పార్టీ’ వెన్నుపోటు పొడుస్తుంది..34 శాతం బీసీ రిజర్వేషన్ మీద సభలో హైడ్రామా నడిపారుగత ప్రభుత్వం 34శాతం బీసీ లకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జీవో విడుదల చేసిందివెన్నుపాటు పార్టీ ప్రతాప్ రెడ్డి అనే నాయకుడితో కోర్టులో రిట్ పిటిషన్ వేశారు..పార్టీ పరంగా బీసీ లకు 50శాతం సీట్లు ఇచ్చిన నేత జగన్..18 స్థానాలు ఎమ్మెల్సీ ఖాళీలు అయితే 11 బీసీ లకు ఇచ్చిన నేత జగన్..మున్సిపాలిటి, జిల్లా పరిషత్, కార్పొరేషన్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించారు..జగన్ ఇద్దరు బీసీలను డిప్యూటీ సీఎంగా చేశారు..కూటమి ప్రభుత్వం బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు..కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నాడుబీసీలకు చంద్రబాబు వెన్నుపోటూ పొడుస్తూనే వున్నాడు..136 కులాలను తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారుకోర్టుకు పొతే నిలవదని చంద్రబాబుకి తెలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు..బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో పెద్ద పీఠ వేశారు..చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి..బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ కి ప్రభుత్వం సిద్ధమా?మీడియా పాయింట్ వద్ద కౌరు శ్రీనివాస్ కామెంట్లు.. 2019 నుండి 2024 వరకు బీసీలకు అన్యాయం చేసారని చంద్రబాబు మాట్లాడుతున్నారురాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని గుర్తించిన నేత జగన్ఆ కులాలకు పదవి ఇచ్చిన నేత జగన్కూటమి బీసీలను ముందుకు తీసుకొని వెళ్లిన దాకలాలు లేవుబీసీలను ఏ విధంగా గుర్తించాలని అని ఆలోచించిన నేత జగన్రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందిఅన్ని పధకాలు బీసీలతో పాటు ఎస్సీఎస్టీలకు అందేలా చేసిన వ్యక్తి జగన్బీసీలు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి అంటే.. మళ్లీ జగన్ సీఎం కావాలివైఎస్ జగన్కు ధన్యవాదాలు: తూమాటిమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావుబాధ్యతలు స్వీకరించిన వెంటనే మాట్లాడిన తూమాటినాకు డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలుమండలి ఛైర్మన్, విపక్షనేత, సభ్యులకు ధన్యవాదాలుప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందిశాసనమండలి విలువలను కాపాడుతాబొత్స కామెంట్లు.. శాసన మండలిలో కూటమి ఎమ్మెల్సీల దుస్సంప్రదాయండిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు వెళ్లిపోయిన కూటమి సభ్యులుడిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలుమండలిలో వెన్నుపాటు పార్టీ నేతల తీరు బాధాకరం: బొత్సకూటమి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు: బొత్సఅధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవ పరిచారు: బొత్సడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం సరికాదు: బొత్ససభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు: బొత్సనాదెండ్ల ప్రవర్తనను చాలాసార్లు గమనించా: బొత్సపొరపాటు జరిగితే చెప్పాలిగానీ.. చైర్మనే హిత బోధ చేయడం ఏంటి?: బొత్సడీఎస్సీపై చర్చించాలన్నదే మా డిమాండ్: బొత్సనిబందనలు ఒక్కరికే కాదు.. అందరికీ వర్తిస్తాయి: బొత్సఅధికార సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు: బొత్స మంత్రులపై బొత్స ఆగ్రహంమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావుఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావువైఎస్సార్సీపీ తరఫున ఏకైక నామినేషన్తూమాటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన చైర్మన్ కొయ్యే మోషేనురాజుఅభినందనలు తెలిపిన వైఎస్సార్సీపీ సభ్యులుఆ వెంటనే డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తూమాటివాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలిసభలో మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహంవైఎస్సార్స్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనంచైర్మన్నే ఆదేశించేలా వ్యాఖ్యలుచైర్మన్పట్ల మంత్రి నాదెండ్ల వ్యవహరించిన తీరుపై బొత్స మండిపాటుప్రొసీజర్ బుక్ తెచ్చి.. తానేం తప్పుగా మాట్లాడలేదంటూ మంత్రి నాదెండ్ల బుకాయింపుసభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించిన నాదెండ్లచైర్మన్ సీటును మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని నాదెండ్లకు బొత్స హితవుప్రారంభం.. ఆ వెంటనే వాయిదాడీఎస్సీ అంశంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. శాసనసభలో సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. మండలికి వచ్చి అదే సమాధానం చెప్పాలని కోరుతోంది. అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. తప్పు ఒప్పుకుని నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని అంటోంది. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం తరఫున నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రావడం లేదు. కేవలం దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో వైఎస్సార్సీపీ సభ్యుల చైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో.. ఆయన మండలిని కాసేపు వాయిదా వేశారు.మంత్రులకు చైర్మన్ చురకలువైఎస్సార్సీపీ సభ్యుల డీఎస్సీ డిమాండ్తో కూటమి మంత్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమాధానం ఇవ్వలేక.. గట్టి గట్టిగా అరుస్తూ ఏవేవో స్టేట్మెంట్లు ఇచ్చారు. చివరకు మండలిని సరిగ్గా నడపాలంటూ చైర్మన్ కొయ్యే మోషేనురాజు మీద అసహనం ప్రదర్శించారు. మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా? అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. మంత్రి పార్థసారథి ఓ అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే మంత్రుల కమాండింగ్పై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రులందరికీ చురకలంటించారు.నల్ల కండువాతో..అంతకు ముందు.. మండలి సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా వచ్చారు. ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ మండలికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.పొంతన లేని సమాధానాలు: లేళ్ల అప్పిరెడ్డిఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు.ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ చెబుతుంటే.. ఎన్ఓసీ తీసుకున్నానంటూ నవీన్ కోర్టును ఆశ్రయించారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే.. పీవీ సింధు తరహాలోనే మిగతా వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, నియామకాల ప్రక్రియకు ఈ స్టేట్మెంట్కు సంబంధం ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘లోకేశ్ మండలికి వచ్చి సమాధానం చెప్పాలి’డీఎస్సీ అక్రమాలపై తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని అప్పిరెడ్డి విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవాళ్లు విసరడం తప్ప తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు విద్యాశాఖ, శాప్ అధికారులను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులందరినీ బదిలీ చేసినప్పుడు సంబంధిత మంత్రి లోకేశ్ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని వ్యాఖ్యానించారు.డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత దూరం తప్పించుకున్నా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు, యువతే ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం
-
ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్
-
డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ పారిపోతోందని ఎద్దేవా చేశారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయిడీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచి్చన చరిత్ర ఎక్కడా లేదు. కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ కుంభకోణంపై పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి. – లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది. డాక్టర్, టీచర్ ఉద్యోగాలను ఏ పరీక్షలూ లేకుండా ఇష్టమొచి్చనట్లు కార్యకర్తలకు పంచుతామంటే చూస్తూ ఊరుకోం. కుంభకోణంపై కచి్చతంగా సీబీఐ విచారణ జరపాలి. మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చర్చ అంటే పరారే శాసనసభలో డీఎస్సీపై ఏదో నివేదిక చదివి.. చర్చకు సిద్ధమని ప్రకటించిన తండ్రీకొడుకులు శాసనమండలిలో చర్చ అంటే ఎందుకు పారిపోతున్నారు. డీఎస్సీలో అక్రమాలు, అవినీతిపై ఆధారాలతో నిరూపించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ ఎందుకు జీవో మార్చారు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన 384 మందిలో ఎంతమందికి ఛాంపియన్షిప్లు, పతకాలు వచ్చాయో ప్రజల ముందు ఉంచాలి. నియామకాలు సక్రమంగా చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం మరి జీవో ఎందుకు మార్చింది? ఉపాధ్యాయ పోస్టు బేరసారాలు జరిగినట్లు ఆడియో/వీడియో ఆధారాలు వస్తే కేసు పెట్టామని చెప్పడం ద్వారా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయింది. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ ప్రకటనల్లోనే గందరగోళం శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చ జరగాలని పట్టుబడితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా తప్పించుకుంటోంది. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఒకలా.. కార్యదర్శి ఒకలా ప్రకటనలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ ఎంత గందరగోళంలో ఉందో అర్థమవుతోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సర్టీఫికెట్లపై స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ అసోసియేషన్ వారే లేఖ రాయడం మా దృష్టికి వచి్చంది. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ -
శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియమకాలలో అవకతవకలపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ చైర్మన్ పోడియం ముందుకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక దానిపై చర్చకు వీలు కాదంటూ శాసనమండలి చైర్మన్ మోషన్రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించడంతో చైర్మన్ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యల ఆందోళన మధ్యే ఐదు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఉదయం సభ ప్రారంభమైన 27 నిమిషాలకే పదిన్నర గంటల సమయంలో వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పునఃప్రారంభమైన వెంటనే తిరిగి బుధవారానికి వాయిదా పడింది. రైతులపై ప్రేమ అసెంబ్లీలో ఏమైంది?: బొత్సమరోవైపు.. మండలిలో ప్రతిపక్ష నేత బొత్య సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ‘మెగా డీఎస్సీపై, దాంట్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగాలని, విచారణ జరపాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. చర్చకు రెడీ అంటూ అన్ని చోట్లా మాట్లాడుతున్నారు. మరి శాసన మండలిలో మేం అడుగుతున్నాం కదా..? సమాధానం చెప్పండి..’ అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. దీనిపై మంత్రి కేశవ్ స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్సీపీకి ప్రజల అజెండా పట్టదని ఆరోపించారు. దీనికి బొత్స తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసెంబ్లీలో ముందుగా డీఎస్సీపై చర్చించాకే కరువుపై చర్చించారు కదా? మరి రైతులపై ఈ ప్రేమ అక్కడ ఏమైంది? ఇక్కడే వచ్చిందా?’ అంటూ నిలదీశారు. వ్యవసాయం– కరువుపై చర్చించాలని అడిగింది కూడా వైఎస్సార్సీపీనే అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎప్పుడూ లేని వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరగాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వ్యవసాయం – కరువు పరిస్థితులపై చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించవచ్చు కదా?’ అని బొత్స ప్రశ్నించారు. సమావేశాలను పొడిగించండి.. రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిద్దామంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో చైర్మన్ జోక్యం చేసుకుంటూ దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సూచించారు. బొత్స, మంత్రి పయ్యావుల సంవాదం కొనసాగుతున్న సమయంలో సభ ఉదయం పదిన్నర గంటల సమయంలో తాత్కాలికంగా వాయిదా పడింది.డీఎస్సీ పేరెత్తితే ప్రభుత్వం పారిపోతోంది⇒ మండలిలో విపక్ష నేత బొత్స ధ్వజం⇒ మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో విచారణ జరపాలి ⇒ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి ⇒ డీఎస్సీ అక్రమాలపై మండలిలో పూర్తిస్థాయిలో చర్చించాల్సిందే ⇒ అప్పటిదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందిసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం రెండో రోజు కూడా భయపడి పారిపోయిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు దాటవేత ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని పత్రికల్లో గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలిస్తూ ఇచి్చన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్లో గానీ అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి చర్యలతో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు..! మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. టీచర్ ఉద్యోగాల కోసం సెల్ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. ప్రభుత్వం శాసనసభలో ఏవో మాటలు చెప్పడం మినహా మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు దానిపై సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్ విసిరారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ డీఎస్సీపై మాట్లాడారు. ఎలాంటి తప్పు జరగకపోతే విచారణకు సిద్ధమని ఎందుకు అనడం లేదు? డీఎస్సీలో తప్పులు జరిగినట్లు అసెంబ్లీలోనే నారా లోకేశ్ ఇన్ డైరెక్ట్గా ఒప్పుకున్నారు. డీఎస్సీ మార్కులు తాము కన్సిడర్లోకి తీసుకోవడం లేదని లోకేశ్ ప్రకటించారు. పీవీ సింధుకు ఉద్యోగం విషయంలో లోకేష్ చెప్పింది తప్పు. ఆమె అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె ఒక్కరికే ఉద్యోగం వచి్చంది. మీకు లాగా అందరికీ ఒకే మాదిరిగా ఇవ్వలేదు. వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్ నా శాఖ మార్చి సీబీఐ విచారణ చేయించారు’ అని బొత్స పేర్కొన్నారు.రైతు సమస్యలపై చిత్తశుద్ధి కరువురాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ‘రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని కోరిందే మేం. ఈ రోజు సభకు వ్యవసాయ మంత్రి రాలేదు. కానీ దీనిపై చర్చ మాత్రం చేస్తామంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కరువు తాండవిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చారు.. ఎల్నినో వచ్చింది’ అని బొత్స వ్యాఖ్యానించారు. -
గాలింపు చర్యలు విస్తృతం చేయాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల నుంచి చాలా రోజులుగా ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. కోస్ట్గార్డ్, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగంతో పాటు సముద్రంలో అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక, సమాచార వ్యవస్థలను వినియోగించి గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు. కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల బోట్లు, ఇతర నౌకల సహకారాన్ని కూడా తీసుకుని గల్లంతైన బోటు ఆచూకీ కోసం నిరంతరం ప్రయత్నించాలని కోరారు. ఎనిమిది మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, వారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
నేడు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాజమండ్రి రూరల్కు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
మళ్లీ మాయోపాయం!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారికోసం తానే అంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఆయనకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచీ రిజర్వేషన్లను లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులిస్తున్నాయి. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడమొక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇపుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం ప్రయత్నించకుండా తూతూమంత్రంలా 34శాతం రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులుదులుపుకుంటే ప్రయోజనమేమిటి..? ఇది బీసీలను మరోసారి మోసం చేయడం కాదా? బీసీలను వంచించడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు అందుకోసం ఎంత కష్టపడి చదివారో చూస్తే ఆశ్చర్యపోవలసిందే.. ఏపీ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో తీర్పు ఇచ్చింది. దానికి కారకుడు చంద్రబాబే.. తమ పార్టీ నాయకుడితో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ఇప్పుడు బీసీల ఉద్ధారకుడిగా మాట్లాడుతుండడం గమనార్హం... కోర్టు కేసుతో అడ్డుకున్నా వైఎస్ జగన్ బీసీల తరఫున నిలబడ్డారు. వారిని బ్యాక్బోన్ క్లాస్గా నిలబెట్టారు. మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు.. ఇలా అన్నింటిలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిద్యం కల్పించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ జీవోను అడ్డుకున్నా అంతకుమించి గరిష్ట సంఖ్యలో బీసీలకు పాతినిధ్యం కల్పించి రాజకీయ సాధికారతకు కొత్త అర్థం చెప్పారు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జగన్ జీవో ఇస్తే అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీనే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాప్రెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాప్రెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పార్టీలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? మేనిఫెస్టోలోనూ మోసమే.. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడిన ప్రభుత్వమే కొనసాగుతున్పప్పటికీ రెండేళ్లగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీలకు సబ్ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్మెడల్ హోల్డరని... బీసీలకు మేలు జరిగింది జగన్ హయాంలోనే.. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్బోన్ క్లాసెస్ అని వైఎస్ జగన్ నమ్మారు.. నమ్మిన మాటను చేతల్లో చేసి చూపించారు. బీసీలకు అధికారం దక్కకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వెనుక నుంచి రాజకీయాలు చేస్తే.. జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సాకుగా చూపుతూ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరిగినా.. జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, డిప్యూటీ సీఎం, కేబినెట్ పదవుల నుంచి బీసీ కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో 34 శాతానికి మించి బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చారు. రాజ్యాధికారంలో బీసీలకు సమున్నత వాటా ఇచ్చిన జగన్ మంత్రివర్గంలో 25 మంది సభ్యులుండగా ఏకంగా 11 మంది బీసీలకు జగన్ స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్ను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. అంతకు ముందు టీడీపీ హయాంలో చంద్రబాబు, ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అలాగే శాసన మండలిలో జగన్ 28 పదవులు.. అంటే 48 శాతం పదవులు బీసీలకు ఇచ్చారు. పథకాల రూపంలో రూ.1.83 లక్షల కోట్లు లబ్ధి వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో ఒక్క బీసీల ఖాతాల్లోనే జమ చేసిన మొత్తం రూ.1,29,866.54 కోట్లు కాగా, నాన్ డీబీటీ రూపంలో బీసీలకు అందించిన లబ్ధి విలువ మరో రూ.52,884.18 కోట్లు. అంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన వ్యయం రూ.1,82,750.71 కోట్లు. ఈ స్థాయిలో గతంలో ఏనాడైనా, చంద్రబాబు తాను పదవిలో ఉన్నప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా బీసీలకు ప్రయోజనాలు అందించారా? కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్రెడ్డితో చంద్రబాబు (ఫైల్) చట్టం చేసి మరీ ‘నామినేటెడ్’దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకే (42 శాతం) ఇచ్చారు.స్థానిక సంస్థల్లోనూ బీసీలకు జగన్ పెద్దపీట స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి కోర్టు తీర్పు అడ్డం వచ్చినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్, దాన్ని ఆచరించి చూపారు. బీసీలకు పదవులు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 636 మండలపరిషత్ అధ్యక్ష పదవుల్లో 239 పదవులను బీసీలకు అంటే.. 38 శాతం పదవులను బీసీ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (69 శాతం) బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. చట్టసభల్లో 50శాతం సీట్లపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ బిల్లుబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించి జగన్ చరిత్ర సష్టించారు. 2019 మార్చిలో వైఎస్సార్సీపీ ఎంపీలు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా జగన్ కేంద్రాన్ని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు. -
‘గంజాయిపై ఏపీ ప్రభుత్వానికి నియంత్రణ లేదు’
ప్రకాశం: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే దొరుకుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. పోలీసుల కారులోనే గంజాయి తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. అద్దంకి పోలీసు కారులో గంజాయి బయటపడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఓటర్ల జాబిజా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ద్వారా 45 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తోందని, మరో 40 లక్షల ఓటర్లకు నోటిసులు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకతపై ఎన్నికల అథారిటీకి తమ పార్టీ తరుఫున లేఖ రాశామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు. రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశంరేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైఎస్ జగన్ను కలిసిన కేసీ కెనాల్ రైతులుశ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్కు గుర్తు చేశారు రైతులు. -
ఏపీలో పోలీసుల్ని ప్రజలే పట్టుకుంటున్నారు’
తాడేపల్లి: ఏపీలో పోలీసు వ్యవస్థ మరింత దిగజారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పోలీసులే తప్పతాగి యాక్సిడెంట్ చేసే పరిస్థితికి వచ్చారని, గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు పట్టుబడితే 24 గంటల వరకు ఎస్పీ స్పందించలేదని మండిపడ్డారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలించామని హోంమంత్రి చెప్పారని, కానీ ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తోందన్నారు. గతంలో పోలీసులే దొంగలను పట్టుకుంటే, ఇప్పుడు పోలీసులను ప్రజలు పట్టుకుంటున్నారన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ ఇంత జరుగుతున్నా హోంమంత్రి ఎందుకు నోరు మెదపటం లేదు?, దీన్నుంచి బయట పడే మార్గాలను వెతుక్కుంటున్నారా?, జగన్ హయాంలో ఏర్పాటు చేసిన సెబ్ ఏమైంది?, పోలీసులే గంజాయి సరఫరావారితో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఏపీలో జనం జెన్ జీ అంటుంటే పోలీసులు గంజాయి అంటున్నారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే పార్టీల నేతలు ఇప్పుడు ఏమయ్యారు?, పవన్ కళ్యాణ్ తన సోదరునికి పదవులు ఇచ్చుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. మరి గంజాయి సరఫరా చేస్తున్న పోలీసులను ఏం చేయాలి?, హోంమంత్రి పబ్జీ ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో ఒక కూలీ చనిపోతే ఆ కేసును కప్పి పెట్టేశారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?, సంపూర్ణ విద్యావ్యవస్థను లోకేష్ సర్వనాశనం చేశారు. ఆడపిల్లలు బహిర్భూమికి వెళ్లటానికి రోడ్లపై వరుసగా నిలబడిన వీడియోలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇంతకంటే చేతగాని ప్రభుత్వం మరోటి లేదు. డీఎస్సీలో అక్రమాలపై ప్రశ్నిస్తే అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు పోలీసులు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. జనసేన నేత నాగేంద్ర ఒక మహిళను రోడ్డుపై కొట్టినా చర్యల్లేవ్. గంజాయి మత్తులో జరుగుతున్న దారుణాలకు ఎవరు బాధ్యత వహించాలి?, మెడికో ప్రియాంక ఇద్దరు తాగుబోతులు కర్కశత్వానికి బలైంది. అయినప్పటికీ హోంమంత్రి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం పట్టించుకోలేదు. వినుకొండలో నడిరోడ్డు మీద యువకుడిని హత మార్చారు. ఈ హత్య లన్నీ ప్రభుత్వ హత్యలే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొంచెం తెలివి వచ్చింది అనుకునే లోపే... బుర్రలేనోడిలా మాట్లాడావ్...
-
కోనసీమలో విషాదం.. జగన్ దిగ్భ్రాంతి!
-
లోకేష్ కాదు 'లీకేష్"! చర్చకు భయపడి పారిపోయాడు..! పదవులు ఎందుకు?
-
అసెంబ్లీ అనుకున్నావా.. నీ ఇల్లు అనుకున్నావా? నోటికొచ్చినట్లు మాట్లాడకు చంద్రబాబు
-
మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు తుమాటి మాధవరావు నామినేషన్
అమరావతి: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడే ఉన్నారు.మరోవైపు, శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్నినోపై చర్చ అసెంబ్లీలో అవసరం లేదా అని, మండలిలోనే కావాల్సి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రైతాంగం ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిందే తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించాలని చెప్పారు. -
గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ లేటెస్ట్ విజువల్స్
-
AP అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. YSRCP ఎమ్మెల్సీల ర్యాలీ
-
రెండేళ్లుగా ప్రభుత్వం నన్ను వెంటాడి, వేటాడుతోంది: భూమన
తిరుపతి: ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా.. నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ అమలు అవుతోందని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం తనను వెంటాడి వేటాడుతోందని తెలిపారు.‘‘కోర్టులు, వ్యవస్థలపై కూటమి పాలకులకు నమ్మకం లేదు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని నాట్యం చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల మీద రెడ్ బుక్ పంజా విసురుతున్నారు. కలెక్టరే ఫిర్యాదుదారుగా ఓ కేసును నాపై పెట్టారు’’ అని తెలిపారు.‘‘లోకేశ్ ఆదేశాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన రాష్ట్రం అంతా రెడ్ బుక్ పంజా విసురుతున్నారు. తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టిస్తున్నారు. ఈ రోజు మీది పై చేయి కావచ్చు.. ఏళ్లకాలం మీ ఆటలు సాగవు. మీ తప్పుడు కేసులు కు నేను భయపడను. సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? లోకేశ్, చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని చెడు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు. పచ్చ దొంగలు పచ్చిగా దొరికారు, న్యాయ పోరాటం చేస్తా. తప్పు మీద తప్పు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాను. 53 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న నాపై గుండా, ల్యాండ్ గ్రాబర్ అని ముద్ర వేస్తారా? రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు టీటీడీ చైర్మన్గా ప్రజల కోసం నిబద్ధతతో పనిచేశాను. తుడా చైర్మన్గా, మూడుసార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన నాపైనే ఇంత కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. నాలాంటి సీనియర్ నేతపైనే ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం ఎలా దక్కుతుంది? ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థలన్నింటినీ కూటమి ప్రభుత్వం కక్షసాధింపుల కోసమే వాడుకుంటోంది’’ అని తెలిపారు. -
ఇంకెంతకాలం పారిపోతారు.. - దమ్ముంటే చర్చకు రండి...!
-
LIVE: శాసనమండలిలో టెన్షన్ టెన్షన్!
-
ఏపీ శాసన మండలి వాయిదా
డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.AP అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ముగిసిన బీఏసీ సమావేశం.. మండలి వాయిదాశాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదాడీఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వం తర్జన భర్జనచర్చకు సిద్ధమంటూనే.. డేట్, టైం ఫిక్స్ చేయని వైనంఎల్నినో చర్చ తర్వాత డీఎస్సీ చర్చపై చర్చిస్తామంటున్న కూటమిముందే చర్చించాలని పట్టుబడుతున్న వైఎస్సార్సీపీడిప్యూటీ చైర్మన్ పోస్ట్కి నామినేషన్ వేసిన తుమాటి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లుఎన్నికల బరిలో వైఎస్సార్సీపీనామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుఅసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలుపాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీ లు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంమీడియా పాయింట్ వద్ద తోట త్రిమూర్తులు కామెంట్స్.. డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబడుతుంటే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు..సభలో చర్చించి నోట్ ఇచ్చిన చప్పట్లు కొట్టుకొన్నారు..లోకేష్ చంద్రబాబు ని, చంద్రబాబు లోకేష్ ని సభలో పొగుడుకొన్నాడు.డీఎస్సీపై అక్రమాలపై ప్రశ్నించేది ఎవరు?మండలి లో మేము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావడం లేదు..డీఎస్సీ అక్రమాలపై జగన్ ఆధారాలతో బయట పెట్టారు..అవినీతి జరకపోతే చర్చించండి..6నెలలకు అసెంబ్లీ జరపాలి కాబట్టి మామ అనిపిస్తున్నారు..రైతులు కష్టాలపై మేము ప్రశ్నిస్తున్నాం..ప్రజలకు చెప్పేది ఎమ్ లేక ప్రతిపక్షం లేని సభలో చప్పట్లు కొట్టుకొంటున్నారు..టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగిటే 10 మంది కూడా ఉండడం లేదు..ఆడబిడ్డ నిది ఎక్కడని మహిళలు, రైతు భరోసా కోసం రైతులు గ్రామాల్లో అడుగుతున్నారు..ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొహం చాటస్తున్నారు..అమరావతి లో దాచుకు తింటున్నారు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు..మొండితోక అరున్ కామెంట్లు..DSC పై చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చాం..గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వొచ్చారు.. Dsc పై చర్చిస్తరని ఆశించం.లోకేష్ కాదు.. లీకేష్ తన మంత్రులతో పారిపోయాడు.స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేదని అబద్ధం చెప్పావ్..పీవీ సింధూకి పరీక్ష నిర్వహించకుండా ఇచ్చామమని లోకేష్ చెప్పాడు.సరేగానీ చర్చిద్దాం అంటే లీకేష్ ముందుకు రావడం లేదుసత్యం రామలింగ రాజు మేనేజ్మెట్ కోటాలో చదివాడో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే జాబ్ లు ఇచ్చాడు..హోమ్ శాఖ ఏవిధంగా కేంద్ర గణాంకాలులో దిగజారిందో అలాగే విద్యా శాఖ కుడా దిగజారుతుంది..మూడేళ్లు లీకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ర్యాంక్ కూడా పడిపోతుంది..డీఎస్సీతో పాటు మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపిద్దాంఅవకతవకలు జరిగినట్లు కనిపిస్తోంది కాబట్టి లీకేష్ రాజీనామా చేయాలి..లీకేష్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చిన 400స్పోర్ట్స్ కోట సీట్లు రద్దు చేయాలి..4 రోజులు సభ పెడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకి వస్తాయి..లీకేష్ స్కామ్ పై జనసేన, బీజేపీ మాట్లాడాలి..వాళ్ల స్టాండ్ ఏంటో బీజేపీ, జనసేనలు చెప్పాలి..ప్రశ్నించానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఈ లీకేజ్ పై లీకేష్ ని ప్రశ్నించాలి..బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చించాలని పట్టుబడుతున్నాం..వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు: మంచ నాగమల్లేశ్వరికూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఫైర్అసెంబ్లీ వేదిక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.బొత్స సత్యనారాయణ పై మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..మంత్రిగా విఫలమైన అచ్చెన్నాయుడు కంటే దద్దమ్మ మరొకరు లేరు.బొత్స సత్యనారాయణ కు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లేదంటే అచ్చెన్నాయుడు ఇంటిని ముట్టడిస్తాము..అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..బొత్సా సత్యనారాయణ కు లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉంది.బొత్స సత్యనారాయణ విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్ర విద్యార్ధులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు..దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.540 మంది రైతులు కూటమి పాలనలో చనిపోయారు.వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు.నారా లోకేశ్కు వైఎస్ అవినాష్రెడ్డి సవాల్నారా లోకేశ్కు సవాల్ విసిరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారుముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పుదుర్గయ్య నీతో చర్చకు సిద్ధం అంటున్నాడు..నువ్వు సిద్ధమా..?పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి..ఆ తర్వాత ఆ జీవో రద్దు చేశారునిన్న అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసిందిఅంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణంమీ కోన రవి, భరత్ ఇచిన సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన వారు..పీవీ సింధు ఒకటేనా...?నీతో చర్చకు జగన్ అవసరం లేదు...మా పేర్ని నాని వస్తున్నారునీకు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధమా..?చరిత్రలో ఎన్నడూ లేని అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుకోర్టులో ఉన్న అభ్యర్ధుల కేసులే నీకు ప్రశ్నలు..వాటికి సమాధానం చెప్పు లోకేష్టెట్ సమస్యపై మాతో పాటు ఉపాధ్యాయులు కేంద్రమంత్రిని కలిస్తే వేధింపులా...?టీచర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి...లేదంటే వారికి అండగా మేము ఉద్యమిస్తాండీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్సీపీశాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలుమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుమండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తినాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలుఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలుమండలి చైర్మన్కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తిఎల్నినోపై చర్చ అవసరం లేదా?ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేంఅసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండిపయ్యావుల పక్కనే లోకేశ్అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పయ్యావుల పక్కనే గప్చుప్గా కూర్చున్న లోకేశ్ లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరంమండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీతకౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్సమేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండిడీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదుప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాంఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలిమంత్రి లోకేశ్ రాజీనామా చేయాలిశాసన మండలిలో గందరగోళండీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంతిరస్కరించిన మండలి చైర్మన్సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం -
ఎమ్మెల్సీల ర్యాలీ.. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీబీఐ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు.. కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు? అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు భాగంగా ‘డీఎస్సీ అక్రమాలపై చర్చ’కు వైఎస్సార్సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. -
మెగా డీఎస్సీ స్కామ్కు సమాధానమేది
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 కుంభకోణంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లడం.. నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత, జెన్జీ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు నిద్ర పట్టడం లేదు. అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్లు రోజురోజుకీ వెల్లువెత్తుతుండటంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో తండ్రి, కుమారుడు డీఎస్సీ అక్రమాలను సమర్థించుకుంటూ తప్పుదోవ పట్టించేలా కళ్లార్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, అడ్డగోలు వాదనలు వినిపించారని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అని నిలదీస్తున్నారు. ‘‘ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను ఔట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలిస్తారా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయించడం ఏమిటి? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చి అసలు సూత్రధారులెవరో బయట పడకుండా తొక్కిపెడుతున్నదెవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే. ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారించాలి’’ అని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరటాన్ని, సభ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు సమాధానం చెప్పాల్సిందేనని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ ఒకరికేఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్లోడ్, డిజిటల్ నిర్వహణ అత్యంత గోప్యంగా జరగాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు బీజం పడింది ఇక్కడే. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వెనుక ఉద్దేశమేంటి?‘వెరిఫికేషన్కు రాలేదు’.. మరి కాల్ లెటర్ ఏది?మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే పోస్టు ఇవ్వలేదని లోకేష్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదా? ఎందుకంటే.. మెరిట్ జాబితాలో ఆ అభ్యర్థి పేరు తీసేశారు.. అభ్యర్థి డేటాను మాయం చేశారు.. కాల్ లెటర్ ఇవ్వలేదు.. ఇక అలాంటప్పుడు ధృవపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు? అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అతడు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.అవన్నీ గోల్మాల్ కాక మరేంటి?కీలక బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం..అతడికి టాప్ ర్యాంకు రావడం.. ఆ తర్వాత పోస్టు ఇవ్వకపోవడం.. అతడి వివరాలను మాయం చేయడం.. ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికీ అర్థం పేపర్ లీక్ అయిందని అంగీకరించినట్లే కదా? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐతో విచారణ జరగాలి.కలెక్టరేట్లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. మెగా డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ జాబితాలు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు. బహిరంగంగా జాబితాలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సందేశాలు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అసలు పారదర్శకత ఎక్కడ ఉంది? సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్లకు వెళ్తే పైకి వెళ్లండని, మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?వన్ టు వన్ పిలిచి.. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. నిబంధనల ప్రకారం మెరిట్, రోస్టర్ ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఓపెన్లోకి వస్తారా? రిజర్వేషన్లోకి వస్తారా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే తెలుసు. అందుకే 1 : 1 కింద పిలిచారు. మరి ధృవపత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వారిని తిరస్కరించిన జాబితాలో కూడా ఎందుకు చూపలేదు? ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు? వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా?క్రీడాకారుల ప్రతిభ చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. పతకాలు చూడలేదు. కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవపత్రం ఉంటే చాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. బాల్ బ్యాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా.. వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవు. అంతర్ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారు.ధృవపత్రాలు ఇచ్చేదీ.. ధృవీకరించేదీ వారేనా?సాఫ్ట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్ ఉన్నారు. వాళ్లే ధృవపత్రాలు ఇచ్చి.. వాళ్లే ధృవీకరించి.. వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగలేదా? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు రాకుండా.. కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు రావడం న్యాయమా?ఒక్కో పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాలా?స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్తో వదిలేశారు. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా ఉన్నా ఎఫ్ఐఆర్లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానికి సమాధానం లేదు. నిజాలు తేలాలంటే సీబీఐ విచారణే..మెగా డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రవేశం నుంచి టాప్ ర్యాంకు వరకు.. మెరిట్ జాబితా మార్పుల నుంచి కాల్ లెటర్ల వరకు.. స్పోర్ట్స్ కోటా నుంచి బేరసారాల ఆరోపణల వరకు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరిగితే నిష్పక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయా? స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున దీనిపై స్వతంత్ర విచారణ అవసరమని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మూడో పక్షం దర్యాప్తు జరగాలని స్పష్టంచేస్తున్నారు. సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న డిమాండ్పై చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించడంలేదు?అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంకర్ఈ ప్రక్రియలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు సాధించారు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించాడు. అంటే ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకు వెళ్లింది? ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నాపత్రం పొందినవారు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నిజంగానే మెరిట్తో ర్యాంకు సాధించి ఉంటే అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? లోకేశ్ వీటికి సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా.. మరో పెద్ద కుంభకోణంమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో రెండు శాతం ఉన్న క్రీడా కోటాను మూడు శాతానికి పెంచారు. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తన వివరణలో లోకేశ్ ఈ అంశాలను ప్రస్తావించనేలేదు. -
పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్
-
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ
తాడేపల్లి : అర్హులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. నిజమైన ఓట్లర హక్కులు కాపాడాలంటూ వైఎస్సార్సీపీ లేఖలో పేర్కొంది. ‘ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి. నోటీసులు ఇవ్వకుండా ఏ ఓటూ తొలగించవద్దు. ఈ మేరకు ఈసీ తక్షణ ఆదేశాలు జారీచేయాలి. రక్తసంబంధీకుల ద్వారా వెరిఫికేషన్కు అనుమతించండి. వీడియో-కాల్ ధ్రువీకరణ నిబంధనలు ఖరారు చేయండి. అన్మ్యాప్డ్ జాబితాలను బూత్వారీగా ప్రచురించాలి. రాజకీయ పార్టీలకు నోటీసుల వివరాలివ్వాలి. నకిలీ ఓట్లను తక్షణమే తొలగించాలి. వలస ఓటర్లకు న్యాయం చేయండి. ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి’ అని ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసినట్లు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
చింతాడ రవికుమార్ కు బెయిల్
-
PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు
-
మీరు తప్పు చేశారనే ఆ G.Oను రద్దు చేశారు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వరుదు కళ్యాణి
-
టీచర్ల సస్పెన్షన్ పై YS జగన్ ఆగ్రహం
-
DSCపై ఆధారాలతో వస్తాం..! చర్చకు సిద్ధమా..? లోకేష్ కు ఎమ్మెల్సీ రమేష్ సవాల్
-
సీదిరి అప్పలరాజును పరామర్శించిన పుష్ప శ్రీ వాణి
-
పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనం అంటూ ఫైరయ్యారు. చంద్రబాబూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించిన జగన్.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి?. ఎవరికి ఫిర్యాదు చేయాలి?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం (ఆగస్టు 17) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘హే రామ్…! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?చంద్రబాబు.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి.ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి’ అని సూచించారు. హే రామ్…!గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?@ncbn గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ… pic.twitter.com/g3iR1sx5uj— YS Jagan Mohan Reddy (@ysjagan) August 17, 2026 -
టీచర్ల సస్పెన్షన్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
-
‘ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తావ్ చంద్రబాబూ?’
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వెన్నుపోటు పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మండలి సమావేశాల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నదే మా డిమాండ్. అందుకు కూటమి నేతలు సమాధానం చెప్పడం లేదు. కౌన్సిల్లో మేము చర్చకు రావాలని కోరాం. కానీ తప్పు చేసిన ప్రభుత్వం చర్చకు రాకుండా తోక ముడిచింది. చర్చకు రాకుండా సవాల్ చేయటం ఎందుకు?. డీఎస్సీ కమిషనర్గా ఇతర అధికారిని ఎందుకు నియమించ లేదు?అధికారులు లేక రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా?.కృష్ణా జిల్లా టాపర్ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?. అతను ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది?. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. ఉద్యోగాలను అమ్ముకున్నట్టు వచ్చిన ఆడియో, వీడియో టేపులపై విచారణ ఏదీ?. వాళ్లను పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేవి కదా?.అందుకే మేము సీబిఐతో విచారణ చేయమని అడిగాం. గ్రూప్1 మీద కూడా సీబీఐతో విచారణ చేయించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తారు చంద్రబాబూ?.లక్షా 30 వేల ఉద్యోగాలను ఎలాంటి అక్రమాలు లేకుండా ఒకేసారి మా హయాంలో ఇచ్చాం. చంద్రబాబు 16 వేల పోస్టులకు అక్రమాలు చేశారు.ఈ మొత్తం వ్యవహారాలపై సీబిఐతో విచారణ చేయాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వం బెదిరించడం వల్లే డీఎస్సీ టీచర్లు కర్నూలు, విజయవాడలో ర్యాలీ చేశారు. ర్యాలీలకు రాకపోతే ఉద్యోగం తొలగిస్తామని బెదిరించారు. డీఎస్సీ అక్రమాలను రాజకీయ కోణంలో చూడవద్దు. అర్హులందరికీ న్యాయం జరగాలి. అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’అని స్పష్టం చేశారు. -
అచ్చెన్నాయుడికి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన MLC అరుణ్ కుమార్
-
సాక్షాలతో నేను బయటపెడతా! వాళ్ళ వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారు...
-
YSRCP నేత చింతాడ రవికుమార్కు బెయిల్
సాక్షి,శ్రీకాకుళం: అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్కు బెయిల్ లభించింది. సోమవారం ఆమదాల వలస కోర్టు చింతాడ రవికుమార్కు బెయిల్ మంజూరు చేసింది. చింతాడ రవికుమార్తో పాటు ఇతరలకు కూడా బెయిల్ లభించింది. బెయిల్ మంజూరుతో జైలు నుంచి చింతాడ విడుదలకు మార్గం సుగమమైంది. చింతాడ రవికుమార్కు బెయిల్ రావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
-
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
-
DSC అక్రమాలపై అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బుక్కైన లోకేష్
-
మేము ఏ చర్చకైనా రెడీ..! దమ్ముంటే రా... లోకేష్ కు బొత్స ఛాలెంజ్
-
దద్దమ్మ.. ఎద్దులా పెరిగితే సరిపోదు... అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్
-
DSCపై చర్చకు సమయం ఇవ్వండి..! లోకేష్ రాజీనామా చేస్తారా..?
-
DSCపై సీబీఐ ఎంక్వైరీ.. లోకేష్ రాజీనామా..! మండలి వద్ద YSRCP ర్యాలీ
-
బాబూ.. ప్రశ్నిస్తే టీచర్లపై సస్పెన్షన్ విధిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై కక్ష సాధింపు చర్యలేంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘మరీ ఇంత కక్షగడతారా చంద్రబాబు?. మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా?మీ రెడ్బుక్ అరాచక జంగిల్రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు.. అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు?. మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా?. మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా?. వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా?. ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా?.@ncbn గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 17, 2026ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామన్నారు. మెరుగైన PRC ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! IR లేదు! PRC లేదు! 5 DAలు పెండింగ్. CPS/OPSను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు CPSకు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన GPSను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు.ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవులు… ఇలా దాదాపు రూ. 35వేల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు.ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత?. అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు.వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు. -
నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు చంద్రబాబు పదవి ఇచ్చింది..!
-
ముగిసిన బీఏసీ సమావేశం.. నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. శాసనమండలి మీడియా పాయింట్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..నేడు ఏపీ చరిత్రలో చీకటి రోజునారా వారి స్కాంలో డీఎస్సీ స్కాం ఒకటిడీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వాయిదా తీర్మానం ఇచ్చాంవెన్నుపోటు పార్టీ సభను వాయిదా వేయించిందినారా లోకేష్ అసమర్ధుడు.. పనికిరాని వాడని వెన్నుపోటు పార్టీకి తెలిసిపోయిందిఅందుకే డీఎస్సీపై చర్చ జరగకుండా అడ్డుకున్నారువైఎస్ జగన్ ఒకే ఒక్క సంతకంతో లక్షా25వేల సచివాలయం ఉద్యోగాలిచ్చారు.పట్టుమని పదిహేను వేల ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది.సెప్టెంబర్ ఒకటి ప్రపంచ వెన్నుపోటు దినంచంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది సెప్టెంబర్ ఒకటినే.ఆరోజు నుంచి నేటికీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడుడీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో చర్చించేందుకు మేం సిద్ధంమీరెందుకు భయపడుతున్నారు?డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి ముగిసిన బీఏసీ సమావేశంనాలుగు రోజులు పాటు సమావేశాలు జరపాలని నిర్ణయం బీఏసీ సమావేశం..స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం.బీఏసీ భేటీకి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, విష్ణుకుమార్ రాజు, జీవీ ఆంజనేయులుఅసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేయనున్న బీఏసీమంత్రుల అసహనం..శాసనమండలి..డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక మంత్రుల అసహనంవైఎస్సార్సీపీపై, విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడుబొత్స సత్యనారాయణను దద్దమ్మ అంటూ నోరుపారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడుగొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన అసెంబ్లీశాసన మండలి వాయిదా.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసనడీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మండలిలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..డీఎస్సీలో విచారణ జరిపించాల్సిందేడీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదుప్రభుత్వం పారదర్శకంగా ఉండాలిడీఎస్సీలో పారదర్శకత లేదుఅందుకే డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలిమూడు లక్షల మంది అభ్యర్ధులను ఏ రకంగా మోసం చేశారన్న విషయంపై చర్చ జరగాలిడీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారుప్రారంభమైన శాసనమండలి సమావేశాలుడీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, రామ చంద్రారెడ్డివాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభండీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ పట్టుడీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీలు నినాదాలుఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి కామెంట్స్..డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి.డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్ రాజీనామా చేయాలి.మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి.మంత్రి లోకేష్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడమేంటి?. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీస్పోర్ట్స్ కోటా పేరుతో డీఎస్సీలో అక్రమాలు చేశారు.మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే.కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు లోకేష్ కూడా చేయాలి. 👉ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ఏపీ డీఎస్సీ అక్రమాలపై పోరాటానికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సిద్ధమైంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.👉శాసన మండలిలో దీనిపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు రెడీ అయ్యారు. ప్రదర్శనగా శాసనమండలిలోకి ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్సీ లు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, రామ చంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. -
అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్ వెంట జనం!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్భంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైఎస్సార్సీపీ క్యాడర్తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెబుతోంది.ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకుని వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను కర్నూలు జైలులో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానులలో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైలులో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు.వైఎస్సార్సీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతనిని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటీని తానే చించడమే కాకుండా, ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా, ఆ సన్నివేశాలు తెలియకుండా ఉండడానికి సిసిటీవీ ఫుటేజ్ని, డిస్క్ లను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నిటిని జగన్ తన టాబ్ ద్వారా మీడియాకు వివరించారు.జగన్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు కాని, ప్రభుత్వంలో ఉన్నవారు కాని వాటిపై ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైఎస్సార్సీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు.. పోలీసులు వారిపైనే ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భార్య నైటి చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసినవారిమీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీసు వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది.కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లినా, ఇప్పుడు కర్నూలు వెళ్లినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో పర్యటించినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో హెలికాఫ్టర్ దిగినప్పటినుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లేవరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్కు ఐదుగంటలకు పైగా పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపుమంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శయాత్రనా? లేక విజయ యాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియచేసినట్లవుతోంది.జగన్కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు. కాని పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ దశలో వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్ పై వారికి ఏర్పడిన అభిమానం అటువంటిదన్నమాట.అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు. లేదా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంటే, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయవచ్చు. అలాకాకుండా పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలులో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాదారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారు. కాని జగన్ను మాత్రం నిలబెట్టి ఒక గేటు వద్ద ఫోటో తీయడం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కాని ఈ విషయాన్ని జగన్ బయట చెప్పేయడంతో పోలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది.వైఎస్సార్సీపీవారితో పాటు సామాన్య ప్రజలలో కూడా ఇదేమిటి ప్రభుత్వం ఇంత సంకుచితంగా మారింది అన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును కుప్పం, అనపర్తిలలో శాంతిభద్రతల సమస్య ఉందని నిలువరించే యత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాట కాదని టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళతానని తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్దం, వ్యతిరేక పార్టీవారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు.కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డీఎస్సీ అక్రమాల బాధితులు కూడా జగన్ను కలిశారు. ఇలా వివిధ వర్గాలవారిని కలుసుకుంటూ, రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. జగన్కు ఇంత ఆదరణ ఎందుకు వస్తున్నదన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్ను, వైఎస్సార్సీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుంది.ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైఎస్సార్సీపీని అణచివేయాలని చూస్తే, అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్లు తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాపం శిలాఫలకంపై పేరు తీసేశారని పవన్ ఫీల్ అవుతున్నాడు..
-
వాడు మనిషేనా... మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు...
-
పోలీసుల కారులో గంజాయి, మద్యం
సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో గంజాయి, మద్యం రవాణా, వినియోగం ఏ స్థాయికి చేరుకున్నాయో.. పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు ప్రయాణిస్తున్న కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, పోలీసు యూనిఫాంలు ఉండడం కలకలం రేపుతోంది. అంతేకాక, మద్యం మత్తులో ఉన్న పోలీసు కారు డ్రైవర్ ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు అక్కడకు చేరుకుని వీడియో తీస్తున్న గ్రామస్తులను బెదిరించడం గమనార్హం..ఎస్సై ప్రైవేటు పార్టీ..బల్లికురవ ఈర్లకొండ వద్ద ఎస్సై నాగరాజు ప్రైవేటు పార్టీ నిర్వహించినట్లు చెబుతున్నారు. అక్కడ ఆయన పలువురు ప్రముఖులకు మద్యం పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో మిగిలిన మద్యాన్ని, గంజాయిని తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అర్ధమవుతోందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ప్రమాద ఘటన తరువాత ధర్మవరంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి కారులో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.మద్యం మత్తులో యాక్సిడెంట్..ఈర్లకొండలో పార్టీ అయిపోయిన తర్వాత ఏపీ 27 సీబీ 4789 నంబరు గల కారులో పోలీసులు బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ధర్మవరం నుంచి వస్తున్న ఆటోను కారు డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డితో పాటు ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును చుట్టుముట్టారు. 108కు ఫోన్ చేసి స్థానికులు క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.గ్రామస్తులకు సీఐ బెదిరింపులు..ఘటనా స్థలి వద్దకు గ్రామంలోని వారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదానికి కారణమై దెబ్బతిన్న కారు డిక్కీని స్థానికులు తెరిచి చూడగా అందులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైల పోలీసు యూనిఫాంలు ఉన్నాయి. అదేవిధంగా కారు లోపల సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, నాగరాజులున్నట్లు గుర్తించారు. కారును నడుపుతున్న డ్రైవరు సైతం మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులే గంజాయి, మద్యం రవాణా చేస్తుండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. కారు వద్ద ఉన్న గ్రామస్తులను అక్కడి నుంచి పంపించివేశారు. వీడియో తీస్తే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తానని గ్రామస్తులను బెదిరించడం గమనార్హం. పోలీసుల కారులో గంజాయి, మద్యం రవాణానా?గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులే మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టడం, పోలీసుల వాహనంలోనే మద్యం, గంజాయి రవాణా చేయడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. మద్యం, గంజాయి రవాణా చేస్తూ ఎస్సైలు దొరికిపోయినా సీఐ వచ్చి వీడియోలు తీస్తే లోపలేస్తానంటూ గ్రామస్తులను బెదిరించడమేమిటని అశోక్కుమార్ ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మద్యం, గంజాయితో దొరికిపోయిన ఎస్సైల మీద, గ్రామస్తులను బెదిరించిన సీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
-
ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ
-
కర్నూల్ లో జగన్ సునామీని చూసి కూటమికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది
-
పోలీస్ స్టేషన్ కు డబ్బు సూట్ కేసులు..!? సీసీటీవీ ఫుటేజ్ మాయం..
-
జగనన్న రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్.. మీరు ఒక చెప్పు చూపిస్తే.. మేము రెండు చెప్పులు చూపిస్తాం
-
డీఎస్సీ డైవర్షన్ కోసమే..!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలు, లీకేజీలపై జెన్జీ నిలదీస్తున్న వేళ.. అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్–1పై పసుపురాతల ‘ఈనాడు’ అభూత కల్పనలకు తెగబడింది. డీఎస్సీ పాపాల నుంచి లోకేశ్ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డీఎస్సీ కుంభకోణంపై లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావిడిగా గ్రూప్–1 అక్రమాలంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. వాస్తవానికి కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఎపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలలో డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్ల్యాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగినది ప్రిపరేటరీ వర్క్ మాత్రమేనని సాక్షాత్తూ చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెబుతారు. మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆధారాలే లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడ? అంతేకాదు.. అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డీఎస్సీ అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథనాలు.. ఎల్లోవీుడియా, చంద్రబాబు కలిసి లోకేశ్ని రక్షించడానికే ఇలాంటి అభూతకల్పనలు వండివార్చుతున్నట్లు అర్థం కావడం లేదూ... అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్ నివేదికలో పేర్కొన్న భాగం డీఎస్సీలాగా లీకేజీల్లేవ్.. అక్రమాల్లేవ్... వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డీఎస్సీ మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు. పరీక్షల నుంచి మినహాయింపులూ ఇవ్వలేదు. పేపర్ లీకేజీలు జరగలేదు. డీఎస్సీ మాదిరిగా ఏపీపీఎస్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకుల్లాంటివి రాలేదు. కోవిడ్ వల్లే డిజిటల్ మూల్యాంకనంకోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం గ్రూప్–1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో పేర్కొనలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్ గ్రౌండ్స్లో డిజిటల్ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి అయాచిత లబ్ధి జరిగిందనీ కాదు. హైకోర్టు డిజిటల్ మూల్యాంకనం నిలిపేసిన తర్వాత, మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి, కఠినమైన ఇంటర్వూ్యలో ఎంపికై, నాలుగేళ్లపాటు ఉన్నత ఉద్యోగాలు చేసి, ప్రజలకు సేవలందిస్తున్న 163 మంది గ్రూప్–1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న 163 మంది జీవితాలతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు.హైకోర్టు పర్యవేక్షణలోనే మొత్తం ప్రక్రియఅసలు ఈ నోటిఫికేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి, ఉద్యోగాల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే సాగింది. అలాగే ఉద్యోగాలు సాధించిన వారు, ఉద్యోగాలు రాని వారు, కేసులు వేసిన వారు, ఇలా అందరి జవాబు పత్రాలన్నీ కూడా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మార్పులు, చేర్పులు జరగలేదని, తారుమారు కూడా కాలేదని సిట్ నిర్ధారించింది. ఉద్యోగాల భర్తీలో డిజిటల్ మూల్యాంకనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన మాన్యువల్ మూల్యాంకనాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. మాన్యువల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత న్యాయ పర్యవేక్షణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం డీఎస్సీ లీకేజీ, అక్రమాల నుంచి డైవర్ట్ చేయడానికి కాక మరేమిటి?. అభ్యర్థుల ప్రతిభ, వారి ఎంపిక, వారి ర్యాంకుల్లో తప్పులు జరగలేదన్న విషయాన్ని సిట్ పదే పదే తన నివేదికలో స్పష్టం చేసింది. వారు తమ ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యారని నివేదికలో పేర్కొంది. అసలు వాల్యుయేషన్ ఎలా జరుగుతుందన్న దానిపై అటు ఎల్లో వీుడియాకు, ఇటు చంద్రబాబుకు అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.అంతా సవ్యంగానే జరిగిందన్న ఏపీపీఎస్సీచంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్ 22న విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇప్పించి, ఏపీపీఎస్సీ మూల్యాంకనంపై విచారణకు ఓ సిట్ వేశారు.. వాదనల సమయంలో ప్రస్తుత ఏపీపీఎస్సీ పాలక మండలి తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ మూల్యాంకనం అంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేశారు. కౌంటర్ దాఖలు చేశారు. అటు తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరొక సిట్ను 2026, ఫిబ్రవరి 14న వేసింది. ఈ సిట్ వేసిన దగ్గర నుంచి హైకోర్టులో వాదనలు మారిపోయాయి, గతానికి భిన్నంగా రాజకీయ బాస్ల ఆదేశాలకు అనుగుణంగా వాదనలు మొదలయ్యాయి. రెండో సిట్ అందుకు అనుగుణంగానే రాజకీయ కోణంలో ప్రాథమిక నివేదికలు ఇచ్చింది. సిట్ నివేదిక మొత్తం చూస్తే అభ్యర్థుల అర్హతల మీద కాని, వారి సామర్థ్యాల మీద గాని, పరీక్షలు నిర్వహించిన విధానాల మీద కాని, జవాబు పత్రాలను తారుమారు చేసినట్టుగాని ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ చంద్రబాబు, ఎల్లోవీుడియా బురదజల్లుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం మానసిక వేదనను అనుభవించాల్సి వస్తోంది.మూల్యాంకన ప్రక్రియ ఇలా ఉంటుంది...మూల్యాంకనంలో భాగంగా వాల్యుయేటర్ దిద్దిన తర్వాత, చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలున్నాయని చీఫ్ ఎగ్జామినర్ భావిస్తే, మళ్లీ ఆ జవాబుపత్రాన్ని మరొకసారి పరిశీలించమని మొదటి వాల్యుయేటర్ను కోరవచ్చు. లేదా మరో వాల్యుయేటర్కి అప్పగించవచ్చు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్న ఎవాల్యుయేటర్ దిద్దాడా? దిద్దిన ప్రతి ప్రశ్నకు మార్కులు వేశాడా? వేసిన ప్రతి మార్కును తిరిగి ఓఎంఆర్ షీట్లలో నింపారా? అని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దమని మరోసారి వాల్యుయేటర్కి ఇస్తారు. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా ప్రశ్నలవారీగా ఓఎంఆర్ షీటులో నమోదు చేస్తారు. ఇంత పకడ్బందీగా మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. ప్రతిభ ఉన్న వారికి అన్యాయం జరగకుండా ప్రతి దశలో కూడా పరిశీలనా ప్రక్రియ ఉంటుంది. రెండు సార్లు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. మరి ఈ ప్రక్రియను అక్రమంటూ తప్పుడు రాతలు రాసి రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. మూల్యాంకనంలో ఏకరూపత కోసం చీఫ్ ఎగ్జామినర్కు మార్కులను పరిశీలించి మాడరేట్ చేసే అధికారం ఉంటుంది అన్న అంశాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం అనేక దశల్లో జరుగుతుంది. ఇందులో అనేక మంది పాలుపంచుకుంటారు. ఒక క్యాంపు ఆఫీసర్, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్, ఆయన కింద ఎగ్జామినర్, ఎగ్జామినర్ చేసిన మూల్యాంకనాన్ని పరిశీలించడానికి ఒక స్క్రూటినైజర్ ఉంటారు. వీళ్లందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్లంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్లందరి దగ్గరకూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. సరిదిద్దాల్సిన చోట దిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీకూడా కంట్రోల్ బండిల్ స్లిప్పులో నమోదు అవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. అలాంటప్పుడు దిద్దివేతలు ఎలా అక్రమాలు అవుతాయి? అత్యున్నత అధికారులతో ఇంటర్వ్యూ బోర్డులు... విచిత్రంగా ఈ రెండో సిట్లో సభ్యుడిగా ఉన్న డీజీ ర్యాంకు అధికారి, సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. తదుపరి నోటిఫికేషన్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేశారు. 163 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్ ఐఏఎస్లు.. ఐపీఎస్లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లు ఇంటర్వూ్యలకు మార్కులు కూడా వేశారు.గతంలో ఒక బోర్డు.. వైఎస్సార్సీపీ హయాంలో మూడు బోర్డులువైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్–1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇంటర్వూ్యలు చేశారు.వీసీలకూ ఇంటర్వ్యూ బోర్డులో స్థానం.. ఎంపిక ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆరుగురు వైస్ఛాన్సలర్ (వీసీ)లకు కూడా ఇంటర్వ్యూ బోర్డులో స్థానం కల్పించారు. వారు కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉన్న సభ్యుల్లో, రెండు బోర్డులకు ఛైర్మన్లు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వారే ఉన్నారు.. వారిలో ఒకరు కె. విజయ్కుమార్ కాగా, మరొకరు ప్రొఫెసర్ పద్మరాజు.గ్రూప్–1కి ఎంపికైన వారిలో 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ సహా కేంద్ర సర్వీసులకు ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వారి వివరాలు జంబ్లింగ్ విధానంతో పారదర్శకత.. అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ 104 మందిని ఇంటర్వ్యూ చేస్తే, చంద్రబాబు హయాంలో నియామకం అయిన కె. విజయ్ కుమార్ 102 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఏ ఇంటర్వూ్యలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా.. జంబ్లింగ్ విధానాన్ని పాటించారు. దీనివల్ల అభ్యర్థుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించినట్లయింది.హాయ్ల్యాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదుహైకోర్టు సూచనల నేపథ్యంలో మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఏపీపీఎస్సీ సిద్ధమయ్యింది. కోవిడ్ నేపథ్యంలో హాయ్ల్యాండ్ను ఎంచుకున్నారు. కానీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ మూల్యాంకనం జరగలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. మాన్యువల్ ఎవాల్యూయేషన్కు అవసరమైన ప్రిపరేటరీ వర్క్ మాత్రమే అక్కడ జరిగిందని ఆ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అసలు అక్రమాలన్నీ హాయ్ల్యాండ్లోనే జరిగాయని, అక్కడే మూల్యాంకనం చేశారన్న పలువురి ఆరోపణలకు సిట్ కూడా తన నివేదికలో స్పష్టత ఇచ్చింది. హాయ్ల్యాండ్లో అసలు ఎలాంటి మూల్యాంకనం జరగలేదని తేల్చింది. గ్రూప్–1 వ్యవహారంలో హాయ్ల్యాండ్లో రెండో మూల్యాంకనం జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ‘అనర్హుల చేత మూల్యాంకనం చేయించారు’, ‘డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు’ అంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలోనే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా... పారదర్శకత కోసం ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టారు. పరీక్ష రాసే అభ్యర్థుల్లో డూప్లికేట్ క్యాండిడేట్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్, వేలిముద్రల స్వీకరణ, ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ కఠినమైన, పారదర్శకమైన పద్ధతులు అవలంబించడం మొదలుపెట్టగానే, అటు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవే పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టింది.పరీక్షలు పారదర్శకం.. అభ్యర్థుల ట్రాక్ రికార్డే నిదర్శనంఏపీపీఎస్సీ పరీక్షలు ఎంత సమర్థవంతంగా జరిగాయి, ఎంత పారదర్శకంగా జరిగాయి, ఎంత ప్రతిభ ఆధారంగా జరిగాయి అనడానికి ఎంపికైన అభ్యర్థుల ట్రాక్ రికార్డు కన్నా మరో నిదర్శనం ఉండదు. ఎంపికైన 163 మందిలో, ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో ఐఐటీల నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి ఏడుగురు, ఎన్ఐటీల నుంచి 17 మంది, బిట్స్ పిలానీ నుంచి ఇద్దరు, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తిచేసిన వారు 177 మంది, జనరల్ పీజీలు, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు.సివిల్స్ అర్హత సాధించిన అభ్యర్థులు..ఇందులో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు 39 మంది ఉంటే, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లుగా ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి సివిల్ సర్వీసుల్లో వేరే రాష్ట్రాల కేడర్ వస్తే సొంత రాష్ట్రాల్లోనే పనిచేద్దామని ఆ సివిల్ సర్వీసు పోస్టులను కూడా వదులుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. పైగా ఇదే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారు కూడా, మళ్లీ ఏపీపీఎస్సీ నిర్వహించిన మరో నోటిఫికేషన్లో కూడా పరీక్షలు రాసి, డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు.గ్రూప్–1కి ఎంపిక అయిన వారిలో ఐఐటీల నుంచి 19 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారుఇవే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేసినవారు 34 మంది, రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసిన వారు 103 మంది, ఇతర ఉద్యోగాలు చేసినవారు 101 మంది ఉన్నారు. ఐటీ రంగంలో నిపుణులుగానూ, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగులు గానూ, డాక్టర్లుగా పనిచేసిన వారూ ఉన్నారు. ఇదే రిక్రూట్మెంట్ లో ఎంపికైన వ్యక్తిని కుప్పం ఆర్డీఓగా చంద్రబాబు నియమించుకున్నారు. కోర్టు ఈ 163 మందిని నాన్ ఫోకల్ పోస్టుల్లో వేయాలని ఆదేశాలు ఇస్తే, ఇదే చంద్రబాబు మాత్రం ఆ ఆర్డీఓను తన నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేకంగా నియమించుకున్నారు. దిద్దివేతలు ఎగ్జామినర్లవేఓఎంఆర్ షీట్లో దిద్దివేతలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి సిట్ తన నివేదికలో ఎగ్జామినర్లే దిద్దివేతలు చేశారని, కాకపోతే వాళ్లు మూల్యాంకనం చేసిన తర్వాత పొరపాటున కొన్నిచోట్ల సంతకాలు మరిచారని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఎగ్జామినర్లు అంగీకరించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఇలా మరిచిపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఎలాంటి బయటవ్యక్తులు దిద్దివేతలు చేసే అవకాశం కూడా లేదని తేల్చిచెప్పింది. సమాధాన పత్రాలు చెక్కు చెదరలేదు. మాన్యువల్ మూల్యాంకనంలో ఉపయోగించిన అభ్యర్థుల అసలు సమాధాన పత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని సిట్ నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. హాయ్ల్యాండ్లో జవాబు పత్రాలు 84 రోజుల పాటు ఉన్నప్పటికీ వాటిలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదా మార్పులు జరగలేదన్నది ఫోరెన్సిక్ పరిశీలనలో తేలినట్లు సిట్ చెప్పింది.ఎన్ఐటీల నుంచి 17 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు కొందరికి లబ్ది చేకూర్చారన్న ఆరోపణలు తోసిపుచ్చిన సిట్...ఎంపికైన 163 మంది అభ్యర్థులు, ఎంపిక కాని వారు, అలాగే హైకోర్టును ఆశ్రయించిన 408 మంది రిట్ పిటిషనర్ల విషయంలో ఒకే రకమైన మార్పుల నమూనాలు ఉన్నాయన్న సిట్, ఈ తేడాలు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికే పరిమితం కాలేదని స్పష్టంగా పేర్కొంది. ముందుగా నిర్ణయించిన కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చడానికి రికార్డులను సవరించారన్న ఆరోపణను సిట్ తోసిపుచ్చింది. మూల్యాంకనంలో మార్కులు పెరిగాయన్న దానికి సిట్ తన నివేదికలో చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. టోటల్ మార్కుల లెక్కింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. తద్వారా మూల్యాంకన స్లిప్పై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీల్లేదని సిట్ తేల్చి చెప్పింది.అక్రమాలకు ఆధారాల్లేవన్న సిట్.. నిజానికి సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని నిర్ధారించలేదు. బార్కోడ్లు మారలేదని స్పష్టం చేసినా, జవాబు పత్రాల మార్పిడి జరగలేదని చెప్పినా, మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాల్లేవని తేల్చినా కూడా.. చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన 10 వేల పేజీల విచారణ నివేదికలో ‘ఒరిజినల్ జవాబు పత్రాలను మార్చినట్లు గానీ, బార్ కోడ్లను తారుమారు చేసినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ తేల్చింది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా లబ్ధి చేకూర్చినట్లు కూడా ఆధారాల్లేవంది. 287 బార్కోడ్ల వ్యత్యాసాలపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) జరిపిన అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్ పరీక్షల్లో అభ్యర్థుల పేపర్లు మారలేదని సిట్ తేల్చింది. అభ్యర్థుల గుర్తింపుపై గానీ, మూల్యాంకనంపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని సిట్ నివేదిక తేటతెల్లం చేసింది. -
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో నేడు పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష శ్రేణులు, ప్రజలపై అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపలిల్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడటం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూడటం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.పౌరులకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, సమానత్వపు హక్కులు ఏ ముఖ్యమంత్రో ఇచ్చినవి కావని, అవి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం పూర్తి కాదని, ఎన్నికల మధ్య కాలంలోనూ ప్రజల గొంతుకు విలువ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి రక్షణ, ప్రతి అర్హుడికి సంక్షేమం అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర స్ఫూర్తి సాకారమవుతాయని అన్నారు. నిజమైన స్వాతంత్య్రం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లని చెప్పారు.పాలకుల అధికారం శాశ్వతం కాదని, కేవలం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే శాశ్వతమని గుర్తుచేస్తూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. సమాజంలో వివక్ష, అణచివేత, పేదరికం లేని వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి, వారి హక్కుల సాధన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
‘వంచించడమే జీవిత ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు’
తిరుపతి: ప్రభుత్వ టీచర్ల భవిష్యత్తో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, వారి జీవితాలతో ఆటలాడటం సరైంది కాదని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. టీచర్లను నమ్మించి ఓట్ల దండుకున్న చంద్రబాబు.. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ‘ఉపాధ్యాయులు మనోభావాలు దెబ్బతీస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వైఖరిపై ప్రభుత్వ టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరడం తప్పా?, వంచించడమే జీవిత ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు సర్కారు మెడలు వంచి టీచర్లు పక్షాన వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. చంద్రబాబు అరాచక పాలన పై పోరాటం సాగిస్తాం’ అని భూమన స్పష్టం చేశారు. -
ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే...
-
కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు
-
ఏపీలో బ్రిటిష్ పాలన కంటే దారుణ పరిస్థితులు: బొత్స
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలి. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతోంది. రాజకీయ కోణంలో చూసి సంక్షేమ పథకాలు అందించడం సరికాదు. మనవాడా.. కాదా అని చూసి సంక్షేమం అందించడం పద్ధతి కాదు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే కేసులు అన్నట్లుగా పాలన సాగుతోందని ఆరోపించారు.ప్రస్తుత పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. “ఇలాంటి స్వాతంత్ర్యం కోసమా మన పూర్వికులు పోరాడింది?” అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నేతల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, అవి రాజ్యాంగం కల్పించిన హక్కులని అన్నారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలని, అదే నిజమైన పరిపాలన అని పేర్కొన్నారు.రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని అన్నారు. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందాలని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లని, పేదరికం లేని రాష్ట్రం కావాలని సూచించారు. వైఎస్ జగన్ హయాంలో ఇదే లక్ష్యంతో పాలన సాగిందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. -
YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
మేకప్ అంటే ఊగిపోయారు.. ఒక అమ్మాయి మెడపై కారు ఎక్కిస్తే ఏం పీకారు
-
సీదిరికి ఘన స్వాగతం పలికిన YSRCP నేతలు
-
మీ భూ దోపిడీని అడ్డుకున్నానని.. నాపై తప్పుడు రాతలా?
నెల్లూరు (వేదాయపాళెం): రామదాసుకండ్రిగ భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి అండ్ కో చేసిన యత్నాన్ని తాను అడ్డుకున్నానన్న కడుపుమంటతో.. ఇప్పుడు అదే భూములకు సంబంధించి తనపై పచ్చపత్రిక ఈనాడులో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తప్పుడు రాతలకు దమ్ముంటే ఆధారాలు చూపాలని ఆయన సవాలు విసిరారు. పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ, ‘సదరు భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. అధికార పార్టీ నేతలకు ఈ దమ్ములేదు. సీబీఐ విచారణ జరిపితే తాము చేసిన తప్పులు బయటకు వస్తాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండ్ కో భయపడడమే దీనికి కారణం. సీబీఐ విచారణ జరపాలని నేను స్వయంగా హైకోర్టులో వేసిన పిటిషన్ను సైతం కొట్టివేయాలని అధికారుల చేత కౌంటర్ వేయించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. రామదాసుకండ్రిగ వద్ద వంద ఎకరాల భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి ప్రయత్నించారు. ఎకరా రూ.15 లక్షల భూమికి గాను రూ.6 లక్షలు రైతుల చేతిలో పెట్టి మిగిలిన రూ.9 లక్షల మొత్తాన్ని మింగేయడానికి కుట్ర పన్నారు. అలాంటి సందర్భంలో నా వద్దకు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి న్యాయ పోరాటం చేశాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించిన ధర ప్రకారం రూ.15 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నాను. సోమిరెడ్డి అండ్ కో.. తమ మాట వినలేదని పేర్లు తొలగించిన రైతులకు సైతం పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతయినా తాను మోసపోయానని స్టేట్మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 100 ఎకరాల భూమిలో 50 ఎకరాలను మాత్రమే పరిశ్రమ కోసం ఇవ్వగలిగాం. మిగిలిన 50 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకురావాలి. మీరు చెబుతున్నట్లుగా ఎకరాకు రూ.కోటి చొప్పున రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి. కనుపూరు గ్రామంలోని దేవదాయశాఖ భూములను ఆక్రమించి వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్నారంటూ వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవం. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించాం. దేవదాయశాఖకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని స్పష్టం చేశారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూ దోపిడీ వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని కాకాణి స్పష్టం చేశారు. -
చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైతే అణిచివేత ఉంటుందో.. అక్కడ ప్రజల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు’’..ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.‘‘ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వారి పిల్లలే పిల్లలే ఆక్సిడెంట్ చేశారు. దానిపై ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడింది? మా మీద కక్ష తీర్చుకోవటం కోసం నా కొడుకుని బలితీసుకోవటం పట్ల అంతటా చర్చ జరుగుతుంది. నేను ఏం తప్పు చేశాను.. నన్ను జైలులో పెట్టేశారని మొదట్లో నాకు చిన్న నిరాశభావం ఉండేది. ఎప్పుడైతే మా నాయకుడు రాడానికి నిర్ణయం తీసుకున్నారో.. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అవుతుందని తెలిశాక జైలులో ఉండటాన్ని సానుకూలంగా తీసుకున్నాను. ఈ నెల రోజులు కాలం నాకు, నా కుటుంబానికి దీక్ష సమయం లాంటిది...మా నాయకుడు వచ్చేటప్పుడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్, తిలక్, జిల్లా పార్టీ అధ్యక్షులుపైన, ధర్మాన కుమారుడు పైన, చింతాడ రవి పైన కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలను ప్రభుత్వం తట్టుకోలేకోతుందేమోననుకుంటున్నాను. స్టేషన్ ఆఫీసర్లతో రాష్ట్ర ముఖ్యమ్మంత్రి రివ్యూ చేయటం దేశ చరిత్రలో ఇది మొదటిది. మరింత అణిచివేత ధోరణిలోకి వెళ్తామని మెసేజ్ ఇవ్వటమే ఇది. వైఎస్సార్సీపీకి, సాధారణ జనానికి మంచి రోజులు వచ్చినట్టే.. రానున్న కొద్ది రోజుల్లో వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహిస్తాడనడానికి ఇవన్నీ సంకేతాలు. రాజకీయాలలో నేనొక ధన్యుడిని’’ అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. -
జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదల
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన అనంతరం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు...ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.కాగా, వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది.పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
సీదిరి అప్పలరాజు కు బెయిల్
-
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్
-
కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్
-
2 వేల కోట్ల అవినీతి... అధికారంలోకి రాగానే నీ అంతు తేలుస్తాం..
-
గుర్తుపెట్టుకో సవితా... ఇదే కంటిన్యూ అయితే నీకు జైలే...
-
లొంగిపోయినవారు ఎక్కడ ?
-
400 మంది YSRCP నేతలపై అక్రమ కేసులు..
-
ఏమైపోయింది నీ జోకర్ షో... కారుమూరి మాస్ ర్యాగింగ్
-
నా భర్త ఆ రోజు అక్కడ లేడు... జగన్ శ్రీకాకుళం పర్యటనలో అక్రమ అరెస్ట్ లపై సంచలన నిజాలు
-
కలియుగ పతివ్రత.. ఇలాంటి రాజకీయాలు చూసి ఒక మహిళగా సిగ్గుపడుతున్నా
-
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
నువ్వు కాదు.. మీ తాత, ముత్తాతలు వచ్చినా జగన్ ను ఆపలేరు..!
-
బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు
బీసీ నాయకులపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాలపై ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం.– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెన్నుపోటు పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, బాధితులే నిందితులవుతున్నారని.. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయనపైనే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారు ఎమ్మెల్యేలైనా కూడా లెక్కలేకుండా అర్ధరాత్రి పూట పోలీసులే దొంగలు, బందిపోటు గూండాల మాదిరిగా ఇంట్లోకి చొరబడి సీసీ టీవీ కెమెరాలు దొంగిలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 3.50 గంటల ప్రాంతంలో ములాఖత్లో కలుసుకున్నారు. అరగంటపాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? ‘‘ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్ర పోతున్న ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇది జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి.. సీసీ కెమెరాలను దొంగిలించి.. డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో మరో 14 మందిపై కేసు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తంగా 38 మంది రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకుసహా కేసు పెట్టి జైలుపాలు చేశారు. మరో తమ్ముడి కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల ఆరు తప్పులు.. ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు ఆరు తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. (ఇందుకు సంబంధించి ఫోన్ కాల్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు చూపారు) 1 బాధితులపై దాడి చేసి.. వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంగాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీన రాత్రి 7.45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్ఐకి ఫోన్ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సీఐకి కూడా ఫోన్ చేస్తే కలువలేదు. తిరిగి 8.03 గంటలకు సీఐకి ఫోన్ చేసి కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8.08 గంటలకు గిరి.. ఎమ్మెల్యేకు మరోసారి ఫోన్ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంగాలకు వెళ్లి.. అక్కడ పరిస్థితులను తెలుసుకొని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసుల మొదటి తప్పు 2 నేమకల్లులో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లులో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చింపారని చెప్పి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారు. 3 ఎమ్మెల్యే కారుపైనే దాడి చేసి.. ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టి, దాడి చేసిన వారి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేపైనే మూడో కేసుపెట్టి పోలీసులు మూడో తప్పు చేశారు. 4 టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంగాల గిరి, చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యేపైనే రివర్స్ కేసు పెట్టారు. 5 సంగాల, నేమకల్లులలో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. పోలీసులే కేసులు కట్టడం ఐదో తప్పు. 6 ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొళ్లి.. పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం ఆరో తప్పు. ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులెవరూ ఫిర్యాదు ఇవ్వకున్నా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబూ ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావో తెలుసుకో.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పది మంది చూస్తుండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటకు రావడంతో రాష్ట్రం నివ్వెర పోయింది. చివరికి ఆ ఆడబిడ్డతో తప్పుడు మాటలు చెప్పించే పని చేయడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారి పోయిందో చెప్పడానికి చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలే నిదర్శనం. మీరే దాడి చేసి.. మీరే చేయి విరగ్గొట్టి.. మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంగాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగ్గొట్టిన సంఘటనల్లో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీ టీవీలను మాయం చేశారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు పేరు పొందిన బీసీ నాయకులపై చంద్రబాబునాయుడు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజుపై ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్ యాక్సిడెంట్ను వక్రీకరించి కుట్ర, హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టారు. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును నేను చూడడానికి వెళితే ప్రజలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి మహిళా ఎస్ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఇలాంటి కేసులు ఎలా కడతారు? వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి. ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తాఫాపై ఏరకంగా అక్రమ కేసు పెట్టారో చూశాం. ముస్తాఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా, తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తాఫా బా«ధితుడు అయితే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం. అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్.. లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు. నన్నూర్ టోల్గేట్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే ముందుకు సాగుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట గ్రిల్ వద్ద నిలబెట్టి వీడియోలు తీసి అవమానించారు.. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలకు హద్దే లేకుండా పోతోంది. దిగజారి కక్ష సాధింపులకు దిగుతున్నారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలుసుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. సాధారణంగా జైలులోకి ప్రవేశించిన తర్వాత వెళ్లిన వారిని కూర్చోబెట్టి వీడియో, ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించారు. ఎందుకిలా చేశారని సూపరింటెండెంట్ను ప్రశ్నిస్తే.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీన్నిబట్టి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్దేశ పూర్వకంగానే నన్ను అవమానించాడు. ఇది దారుణం. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట. అన్యాయంగా కేసులు.. అరెస్టులుఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారు. కేసుల నమోదు, ఎఫ్ఐఆర్లు డొల్లతనంగా ఉన్నాయి. ఒక ఫిర్యాదులో ఉన్న నలుగురి పేర్లు.. అదే ఫిర్యాదులో వేరే నిందితులుగా చూపారు. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్ను ఏ–22గా కూడా చూపారు. ఏ–17 మాల గాదిలింగను ఏ–25గా.. ఏ–19 సత్తిరెడ్డిని ఏ–23గా ఎ.సత్యనారాయణరెడ్డి అని చూపారు. ఏ–18 కురవ లింగప్పను మళ్లీ ఏ–24 గా చూపించారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది. ఎల్లకాలం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి చూస్తూ చూస్తూ ఉండగానే రెండేళ్లయిపోయింది. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికి ఇంకో మూడేళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబునాయుడు నాటిన విష బీజాలు రెండింతలవుతాయని ఆయన గుర్తుంచుకోవాలి’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్నినాని.. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇషాక్బాషా, మధుసూదన్, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటెత్తిన జనసునామీ!కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు కదిలింది.. ఓర్వకల్లు హోరెత్తింది.. రహదారులు జనసంద్రాలయ్యాయి..! కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిపై జన ప్రభంజనం కనిపించింది. తుంగభద్ర, హంద్రీ ప్రవాహంతో పోటీ పడుతూ యువ తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసుల ఆంక్షలు, చెక్ పోస్టులు, అడ్డంకులను చేధించుకుని ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ కష్టాలు చెప్పుకునేందుకు.. తమ గోడు వెళ్లబోసుకునేందుకు.. న్యాయం కోసం మొరపెట్టుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆడబిడ్డ నిధి అందని మహిళలు.. తల్లికి వందనం మిస్సయిన తల్లులు.. ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్న యువత.. దగా డీఎస్సీలో మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగార్థులు.. కరువుసీమలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న రైతులు.. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు.. కష్టాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు.. సూపర్సిక్స్.. సూపర్సెవెన్ హామీలను నమ్మి మోసపోయామని వాపోతున్న వివిధ వర్గాల ప్రజలు.. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఒక్కటే ఆశ.. జగన్ తమ గోడు వింటారన్న నమ్మకం! తమకు అండగా ఉంటారన్న నమ్మకం ! వీరి ఆవేదనకు తోడుగా.. తమ అభిమాన నేతను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు జనసునామీ కనిపించింది. జననేత పర్యటన ఆసాంతం ‘జెన్ జీ’ యూత్ జోష్ వెల్లువెత్తింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. ఎండ తీవ్రత ఠారెత్తిస్తున్నా.. 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టేంతగా జనప్రవాహం ఉప్పొంగింది. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, నగర పురవీధులు ఎటుచూసినా జనసంద్రమే. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు.. పూలవర్షాలు.. ‘జై జగన్’ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. జనమే జనం.. జననేతకు బ్రహ్మరథం.. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్పోర్టు నుంచి కర్నూలు– హైదరాబాద్ జాతీయ రహదారి కూడలికి చేరుకునేందుకే అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత పూడిచెర్ల క్రాస్, రాక్ గార్డెన్, హెచ్ 8 హోటల్ జంక్షన్, నన్నూరు, నన్నూరు టోల్ ప్లాజా, ప్రజా నగర్, కర్నూలు రింగ్ రోడ్డు జంక్షన్, వెంకన్నబావి, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, కల్లూరు, షరీఫ్ నగర్, హ్యాంగవుట్ హోటల్ సెంటర్, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, కేశవ గ్రాండ్ హోటల్ జంక్షన్, బళ్లారి చౌరస్తా, ఆటోనగర్, సంతోష్ నగర్, పంచలింగాల సర్కిల్, పంచలింగాలపల్లె మీదుగా జిల్లాజైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగింది. జగన్ను చూసేందుకు కర్నూలు, నంద్యాల పరిసర జిల్లాల నుంచి వచ్చిన జనంతో కర్నూలు నగరం జనసంద్రాన్ని తలపించింది. ఓర్వకల్లు ఎయిర్పోర్టు వద్ద భారీగా తరలి వచ్చిన జనసందోహానికి అభివాదం చేస్తున్న జననేత వైఎస్ జగన్కు డీఎస్సీ అభ్యర్థుల మొరమెగా డీఎస్సీ పేరిట తమను దగా చేశారంటూ.. అన్ని అర్హతలు ఉండి డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జాతీయ రహదారిపై ప్రజానగర్ వద్ద వీరంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. తప్పకుండా మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద్ద వైఎస్ జగన్ను కలిసిన డాక్యుమెంట్ రైటర్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొడుతోందంటూ వాపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు సంతోష్నగర్ వద్ద కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు పడవని, కరువుతో సీమ ప్రజలు అల్లాడిపోతుంటారని వాపోయారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజలు దారి పొడవునా వైఎస్ జగన్ను కలిసి తమ వినతులు అందజేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవి కలిసి తమగోడు చెప్పుకున్నారు. తనకోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను అన్ని విధాలుగా వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి జరిగిందంటే అది మీ హయాంలో మాత్రమేనని పార్వతి గుర్తుచేసుకున్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి మళ్లీ టెట్ నిర్వహించడం సరికాదని కేంద్రం దృష్టికి తెచ్చింది. టెట్ నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్ష మంది, దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది ఇన్సర్వీస్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్రెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ(టీచర్) ఎమ్మెల్సీలు టి.కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై ఈమేరకు వినతిపత్రం అందచేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రం దృష్టికి సమస్యను తెచ్చినట్లు చెప్పారు. అనంతరం వారంతా ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తాం సంబంధిత సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టులతో టెట్ పరీక్ష రాయాలనడం ఎంతవరకు సమంజసమని ఎంపీలు ప్రశ్నించారు. టెట్ నుంచి సీనియర్, ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ల ఓట్లతో గెలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమస్యను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు అన్ని పార్లమెంటరీ మార్గాలను ఉపయోగించి ఉపాధ్యాయుల తరఫున పోరాడతామని ప్రకటించారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారిపై టెట్ బలవంతంగా రుద్దడం వారి వృత్తిని అవమానించడమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టెట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని టీచర్ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని వినతి ఇన్సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమరనాథరెడ్డి, కడప, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.సంగమేశ్వరరెడ్డి ఢిల్లీలో ఎంపీలు గొల్ల బాబూరావు, డాక్టర్ మద్దిల గురుమూర్తి, టీచర్ ఎమ్మెల్సీలకు వినతిపత్రాన్ని అందచేశారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నామని, కొన్ని వేల మంది రెండు మూడేళ్లలో రిటైర్ కాబోతున్న విషయాన్ని ఎంపీల దృష్టికి తెచ్చారు. -
డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చేందుకే గ్రూప్–1పై విషం
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు కూటమి 2018లో జరిగిన గ్రూప్ –1 నియామకాలపై విషం చిమ్ముతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, పార్టీ స్టేట్ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ధ్వజమెత్తారు. వారు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కూటమి యువత ఆశలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని నాగార్జున యాదవ్ అన్నారు. ‘డిజిటల్ మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధమని ఎవరు చెప్పారు? ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా ఏపీపీఎస్సీ అనుసరించవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం నోటిఫికేషన్లో పేర్కొనలేదనే కారణంతోనే ఆ నియామకానికి వర్తింపజేయొద్దని కోర్టు చెప్పింది. హాయ్ల్యాండ్లో జరిగిన ప్రక్రియ రెండోసారి మూల్యాంకనం కాదని సిట్ స్పష్టంగా చెప్పింది. కేవలం డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేశారు. హాయ్ల్యాండ్లో జవాబు పత్రాలను మార్చలేదని, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లలో నమోదైన మార్కుల్లో ఎలాంటి తేడా లేదని సిట్ స్పష్టంగా చెప్పింది. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, 84 రోజుల పాటు హాయ్ల్యాండ్లో ఉన్నప్పటికీ అవి చెక్కుచెదరలేదని దేశంలోని ఏడు సీఎఫ్ఎస్ఎల్ కేంద్రాలు స్పష్టంగా చెప్పాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లోనూ అభ్యర్థుల మార్కుల నమోదులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లలో కరెక్షన్స్ సహజమే. ఎగ్జామినర్ తర్వాత చీఫ్ ఎగ్జామినర్, స్రూ్కటినైజర్ స్థాయిలోనూ జవాబు పత్రాలను పరిశీలిస్తారు. మానవ తప్పిదాలను నివారించేందుకే పలు దశల్లో పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తారు. జవాబు పత్రాలను బండిల్గా చేసి అందులో జరిగిన కరెక్షన్స్ సంఖ్యను నమోదు చేసే విధానం కూడా ఉంది. 2016, 2018, 2022, 2024లో జరిగిన పరీక్షల్లోనూ ఇదే విధానం అమలైంది. ఎగ్జామినర్లే కరెక్షన్స్ చేసినట్లు స్పష్టంగా చెప్పారు’ అని నాగార్జున యాదవ్ చెప్పారు. లోకేశ్ కోసం గ్రూప్–1అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసమే 163 మంది గ్రూప్ – 1 అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారని సలాంబాబు ధ్వజమెత్తారు. సిట్ నివేదికలోని వాస్తవాలను పక్కనపెట్టి, వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. సాధారణ మూల్యాంకన ప్రక్రియలో జరిగే కరెక్షన్స్ను అవకతవకలుగా చిత్రీకరించడం సరికాదని చెప్పారు. ‘జవాబు పత్రాల్లో కరెక్షన్స్ చేసింది తామేనని ఎగ్జామినర్లే సిట్ విచారణలో స్పష్టం చేశారు. కరెక్షన్స్ మూల్యాంకన ప్రక్రియలో భాగమే తప్ప అక్రమం కాదు. 2018 గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల్లో అత్యున్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతిభావంతులు ఉన్నారు. అర్హత లేని వారిని ఎంపిక చేశామని ఆరోపించడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఎంపికైన వారిలో 19 మంది ఐఐటీ, 17 మంది ఎన్ఐటీ, 6 మంది ఐఐఎం నుంచి వచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన 18 మంది కూడా ఎంపికయ్యారు. 39 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లిన వారు. వారిలో 16 మంది యూపీఎస్సీలో ఎంపికై ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లోకి వెళ్లారు. గ్రూప్ – 1 ఇంటర్వ్యూకు ఎంపికైన 325 మందిలో 103 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. బ్యాంకింగ్, ఐటీ తదితర రంగాల్లో పనిచేస్తున్న 101 మంది కూడా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రూప్ – 1కు ఎంపికయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మూల్యాంకన కేంద్రాలు, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్షల్లో ఇంపర్సనేషన్ను అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రూప్ – 1 ఇంటర్వ్యూల్లో 24 మంది సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ బోర్డుల్లో ఏపీపీఎస్సీ సభ్యులు, సీనియర్ అధికారులు, అకడమిషియన్లతో పారదర్శకమైన విధానం అమలు చేశారు. ఇంటర్వ్యూ మార్కుల్లో నిర్దేశిత గ్రేడింగ్ విధానంలో ఎలాంటి వ్యత్యాసం గుర్తించలేదని సిట్ నివేదికే చెబుతోంది. అంటే గ్రూప్–1లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నది సుస్పష్టం. అక్రమాలే జరిగితే అదే అభ్యర్థులను ఇప్పుడు మీరే ఎందుకు నియమించుకున్నారు? కుప్పం డెవలప్మెంట్ అథారిటీలో 2018 గ్రూప్ – 1 అభ్యరి్థని చంద్రబాబు ప్రభుత్వం నియమించలేదా? డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్న భయంతోనే గ్రూప్ – 1 అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తెరపైకి తెచ్చారు’ అని సలాంబాబు చెప్పారు. -
డీఎస్సీ స్కామ్పై నిలదీస్తే అక్రమ కేసులా?
సాక్షి, అమరావతి / నెట్వర్క్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. కక్ష సాధింపు చర్యల కోసం పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్ 2025పై వెల్లువెత్తుతున్న నిరసనలకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులు బనాయిస్తోంది. డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, దీనిపై సీబీఐతో విచారణ నిర్వహించాలనే డిమాండ్లతో మూడు రోజుల పాటు రిలే దీక్షలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలు విజయవంతం కావడంతో చంద్రబాబు సర్కారు బెంబేలెత్తుతోంది. నిరసన ర్యాలీలపై ఉక్కుపాదం మోపుతోంది. వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులకు దిగింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి వైఎస్సార్ సీపీ శ్రేణులను నిరోధించేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు, జెన్ జీ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలీసు అడ్డంకులను అధిగమించి ర్యాలీలను విజయవంతం చేశారు. జాతీయ స్థాయిలో చర్చ.. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ ర్యాలీలతో దద్దరిల్లాయి. ఈ నిరసనల్లో ప్రధానంగా జెన్ జీ యువత, పెద్ద ఎత్తున పాల్గొనడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవితపై కలవరపాటుకు గురైన సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో అణచివేత చర్యలకు దిగారు. రిలే దీక్షలు, ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమవడంతో అక్రమ కేసులు బనాయించే ఎత్తుగడ పన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డైరెక్షన్లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలపై వేధింపులకు దిగారు. పలుచోట్ల అక్రమ కేసులు నమోదయ్యాయి. యువతను మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నారా లోకేశ్తో రాజీనామా చేయించి డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణకు అంగీకరించాలని, యువతకు నిరుద్యోగ భృతి, ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొడాలి నానిని కలిసిన ఎస్ఐ వీఆర్కు.. ఈ నెల 10న గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని కలిసిన గుడివాడ ఒకటో పట్టణ ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ నిరసన ర్యాలీకి అనుమతిలేదని నోటీసు అందించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, జెన్ జీ యువత, ప్రజలతో కలిసి మాజీ మంత్రి కొడాలి నాని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కు పంపిస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. » కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 53 మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. » వినుకొండలో హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు పలువురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉండగానే ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. » అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టినందుకు మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపి చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సహా 15 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ను ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. » గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నూరి ఫాతిమా తదితర 17 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు పోలీస్ యాక్టు అమలులో ఉన్నా ర్యాలీ నిర్వహించినట్లు కేసు నమోదు చేశారు. » ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించినందుకు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. » అనకాపల్లి జిల్లాలో ఈనెల 10న నిరసన ర్యాలీకి పిలుపునిచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మరో 27 మందిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదయ్యాయి. » అనంతపురం జిల్లాలో అక్రమ కేసుల పరంపరం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్స్టేషన్లో అక్రమ కేసులు నమోదయ్యాయి. -
గుర్తుపెట్టుకో చంద్రబాబు వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
-
అసలు ఆ రోజు... మినిట్ టూ మినిట్ ఏమి జరిగిందో వివరించిన జగన్
-
కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ పరీక్ష భారం నుంచి బయటపడేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో టీచర్ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు.టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే వెన్నుపోటు పార్టీ నేతలు, టీచర్లను ఆదుకునేందుకు 'విద్యా హక్కు చట్టాన్ని' ఎందుకు సవరించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.50 ఏళ్లు వయసు దాటిన టీచర్లను ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులూ పరీక్ష రాయమనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి టీచర్ల ఆవేదనను వివరించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే, ఉపాధ్యాయ లోకం తరపున చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే..సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు?: గొల్ల బాబూరావుకేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే కూటమి నేతలు.. మరి ఉపాధ్యాయులను ఈ 'టెట్' భారం నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్ష మంది, దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీచర్లు ఈ ఎగ్జామ్ వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి ఎగ్జామ్ పాసై, ఉద్యోగంలో చేరి 20-30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 50 ఏళ్లు దాటిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయమనడం ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే.టీచర్ల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు సూటిగా సవాల్ చేస్తున్నా.. మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న మీరు పార్లమెంట్లో 'విద్యా హక్కు చట్టం' సెక్షన్ 23 కి సవరణలు ఎందుకు తీసుకురారు? వెంటనే ఈ వయసు పైబడిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇప్పించాలి. లేదంటే వైఎస్సార్సీపీ తరపున మా పోరాటం ఆగదు.టీచర్ల ఓట్లతో గెలిచి.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు: గురుమూర్తిమొన్నటి ఎన్నికల్లో టీచర్ల ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారిని గాలికొదిలేసింది. అధికార పక్షం పట్టించుకోకపోయినా, మా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకే మేము ఢిల్లీకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసి టీచర్ల కష్టాలను వివరించాం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వెన్నుపోటు పార్టీ.. టీచర్ల బాధలు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం.50 ఏళ్లు దాటిన వారిని ఆన్లైన్ ఎగ్జామ్ రాయమనడం, 60 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అనడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఇలాగే గాలికి వదిలేస్తే.. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం, జీరో అవర్లో లేవనెత్తుతాం. అవసరమైతే కోర్టుల్లో కూడా ఉపాధ్యాయుల పక్షాన న్యాయపోరాటం చేస్తాం.ఇన్-సర్వీస్ టీచర్లకి అండగా వైఎస్సార్సీపీ: ఎంవీ రామచంద్రారెడ్డిఉపాధ్యాయ సంఘాలన్నీ మా వద్దకు వచ్చి ఈ టెట్ పరీక్ష వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. వెంటనే మేము ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సూచనలతోనే దేశ రాజధానిలో కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. రాష్ట్రంలో లక్ష మంది, దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది టీచర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అన్ని సబ్జెక్టులు చదివి పరీక్ష రాయమనడం సీనియర్ టీచర్లకు శిక్ష లాంటిది. చట్ట సవరణ చేసి వయసు పైబడిన ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నుంచి వెంటనే మినహాయింపు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం టీచర్లను పట్టించుకోకపోయినా, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.పరీక్ష తప్పనిసరి అయితే వారి సబ్జెక్టులోనే పెట్టాలి: పర్వత రెడ్డి చంద్రశేఖర్రెడ్డివిద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్.. ఉపాధ్యాయుల కష్టాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? 2011కి ముందు సర్వీసులో చేరిన వారికి టెట్ నిబంధనలు లేవు. 1990ల నుంచి సర్వీస్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఉన్నట్టుండి టెట్ క్వాలిఫై కావాలని షరతు పెట్టడం టీచర్లను అవమానించడమే. ఒక ఉపాధ్యాయుడు తాను బోధించే సబ్జెక్టులో కాకుండా, అన్ని సబ్జెక్టులలో పరీక్ష రాసి తీరాలని బలవంతం చేయడం క్రూరమైన చర్య.సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. మీకు నిజంగా ప్రేమ ఉంటే, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఒకవేళ పరీక్ష తప్పనిసరి అయితే వారి సబ్జెక్టులోనే, అది కూడా ఆఫ్లైన్లో పెట్టాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి కేంద్రం వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలి.ఉద్యోగాలు పోతాయని భయపెడుతున్నారు: కల్పలతా రెడ్డిసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ క్వాలిఫై కావడానికి 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉంది. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడే టెట్ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో టీచర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యోగాలు పోతాయనో, ప్రమోషన్లు ఆగిపోతాయనో భయపెడుతున్నారు. 50 ఏళ్లు దాటిన సీనియర్ టీచర్లకు ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు.దీనివల్ల వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, దాని ప్రభావం నేరుగా విద్యార్థుల చదువులపైనా పడుతోంది. కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి, టీచర్లకు భరోసా కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపునిస్తూ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని సవరించాలి. ఉపాధ్యాయ లోకానికి మేమంతా తోడుగా ఉంటాం -
కథ,స్క్రీన్ ప్లే ..డైరెక్షన్ మొత్తం బాబుదే..!
-
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
-
భార్య బట్టలను భర్తే చింపించే స్థాయికి తల దించుకో చంద్రబాబు!
-
జైలులో విరుపాక్షికి ధైర్యం చెప్పిన జగన్
-
కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలు చేస్తూ.. విరూపాక్షిని అరెస్ట్ చేయించారని.. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీశారు.‘‘అధికార దుర్వినియోగం ఏస్థాయిలో ఉందో విరూపాక్షి అక్రమ అరెస్టే ఉదాహరణ. ఏపీలో బాధితులే నిందితులవుతున్నారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో వందల మంది పోలీసులు.. దొంగల మాదిరి విరూపాక్షి ఇంటి కిటీకీలను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మందిని ఇరికించారు. రెండో కేసులో మరో 14 మందిని చేర్చారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. మొత్తం 38 మందిని జైలుకు పంపారు. కార్యకర్త గిరిని తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. దారిలో ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేయిని విరగగొట్టారు. తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపాడు. పైగా ఆమెతో తప్పుడు మాటలు చెప్పించారు..ఎమ్మెల్యే అనుచరులు చింపారని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. భర్తే భార్య బట్టలు చింపుతున్న వీడియో బయటకొచ్చింది. బాబు కుట్ర రాజకీయాలు చూసి రాష్ట్రం షాక్కు గురైంది. కారును ధ్వంసం చేశారని ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. వాళ్లే కారును ధ్వంసం చేసి.. ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. పీఎస్కు వెళ్లి గిరి, శ్రీరాములు చూపించి ఫిర్యాదు చేశారు. కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET
-
ఎమ్మెల్యే విరుపాక్షితో YS జగన్ ములాఖత్
-
కర్నూలు జైలు వద్దకు చేరుకున్న YS జగన్
-
AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ లేఖ
తాడేపల్లి: విధానపరమైన లోపాలు, సాంకేతిక ఇబ్బందులు లేదా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోకూడదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తూ మూడు కీలక విజ్ఞప్తులను ప్రధానంగా ప్రస్తావించారు. ఉపాధి, విద్య, వలసల కారణంగా స్థానికంగా అందుబాటులో లేని ఓటర్ల తరఫున వారి తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు తగిన అధికార పత్రాలతో (Authorisation) ఆధారాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఓటర్లకు జారీ చేసే నోటీసుల్లో తనిఖీ వేదిక, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను కచ్చితంగా పేర్కొనేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అంతిమ చట్టబద్ధమైన నిర్ణయం సంబంధిత ERO/AERO వద్దే ఉన్నప్పటికీ, ఓటర్లు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా స్థానిక బిఎల్ఓ (BLO)ల ద్వారానే పత్రాల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ప్రక్రియను మరింత సరళతరం చేయాలని అభ్యర్థించారు. నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ఈ మూడు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని ఆయన లేఖ ద్వారా ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారంటే...వీరి ద్వారా పత్రాల సమర్పణకు అవకాశం కల్పించాలిచదువు, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీన స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు సరైన ఆధారాలు, అధికార పత్రంతో వారి తరఫున అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అనుమతించాలి.నోటీసుల్లో తనిఖీ వేదికను తప్పనిసరిగా పేర్కొనాలిఓటరుకు నోటీసు ఇచ్చినప్పుడు ఎక్కడికి రావాలో స్పష్టంగా తెలియకపోవడం సరికాదు. ప్రతి నోటీసులో కచ్చితమైన తనిఖీ వేదికతో పాటు తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ప్రతి ఓటరు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా సంబంధిత బీఎల్ఓల ద్వారా పత్రాలను స్వీకరించేలా, ప్రాథమిక మరియు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించేలా ప్రక్రియను సులభతరం చేయాలి. తుది నిర్ణయం ఈఆర్వో, ఏఈఆర్వోల పరిధిలోనే ఉన్నప్పటికీ బీఎల్ఓ స్థాయిలో సదుపాయం కల్పిస్తే ఓటర్లు తమ సమస్యలను స్థానికంగానే వేగంగా పరిష్కరించుకోగలరు. మ్యాపింగ్ కాలేదనే కారణంతో లేదా రికార్డుల్లో తేడాలు ఉన్నాయనే కారణంతో నిజమైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటర్ల ధ్రువీకరణ విషయంలో బీఎల్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు, ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి.మూడు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు ఇవ్వాలితల్లిదండ్రులు, రక్తసంబంధీకుల ద్వారా పత్రాల సమర్పణకు అవకాశం ఇవ్వడం, నోటీసుల్లో తనిఖీ వేదిక–తేదీ–సమయం స్పష్టంగా పేర్కొనడం, ప్రతి ఓటరు స్వయంగా ఉన్నతాధికారి వద్దకు వెళ్లేలా కాకుండా, సంబంధిత బిఎల్ఓ (BLO) ద్వారా పత్రాలను స్వీకరించడం మరియు ప్రాథమిక/క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టేలా ఈ ప్రక్రియను ఓటర్లకు మరింత సులభతరం చేయాలని కోరారు.మరోవైపు అంతిమ చట్టబద్ధమైన నిర్ణయం సంబంధిత ERO/AERO వద్దే ఉన్నప్పటికీ, బీఎల్ఓ స్థాయి సదుపాయం ద్వారా ఓటర్లు తమ సమస్యలను స్థానికంగా మరియు వేగంగా పరిష్కరించుకోవడానికి వీలవుతుందని... ఈ నేపధ్యంలో ఈ అంశాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదే విధంగా విధానపరమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం లేదా నోటీసుల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.


