YSRCP
-
చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోలీస్ జులుం
ప్రకాశం జిల్లా: పొదిలి పోలీస్ స్టేషన్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను చూడటానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీస్ జులుం ప్రదర్శించారు. స్టేషన్ లోపలికి వెళ్లడానికి లేదంటూ చెవిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దాంతో సీఐ వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే తనపై సీఐ అసభ్యంగా మాట్లాడరంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ముందే బైఠాయించి పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మీరు అక్రమ అరెస్ట్లు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. -
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావునుద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం అని వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కొమ్మినేనిపై హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని సుధాకర్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డిబేట్లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసింది. కొమ్మినేని విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టే సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే కొమ్మినేనిపై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ప్రభుత్వం కుట్రను బద్దలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడంలేదు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరం. హోంమంత్రి అనిత మాటలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయి’’ అని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా?. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదు. జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసింది...కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రికి పంపిస్తాను. తాను అనని మాటలను కొమ్మినేనికి ఆపాదించి, ఆ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు పోలీసులు పహరా కాశారు. దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. వీడియో, ఫొటోల రూపంలో అన్ని ఆధారాలున్నాయి. తుదపరి విచారణలో మొత్తం ఈ వ్యవహారాన్ని కోర్టు ముందుపెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకుంటే అరాచకం ప్రబలుతుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్సిక్స్తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్సిక్స్లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
తల్లులను మోసగించిన మిమ్మల్ని ఏమనాలి బాబూ?: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు...పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు. -
పోలీసుల నోటీసులపై ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్రెడ్డి రియాక్షన్
సాక్షి, ప్రకాశం జిల్లా: పోలీసుల నోటీసులపై దర్శి ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పందించారు. తాను ఎక్కడికి పారిపాలేదని.. పిల్లలను చూడటానికి హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. ‘‘పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తా.. పోలీసుల నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని బుచేపల్లి శిప్రసాద్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారంటూ పొదిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, నిరసనలు చేసి గొడవలు సృష్టించి.. వైఎస్సార్సీపీ శ్రేణుల పై దాడి చేసిన వారిపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కేసులు పెట్టి.. ఇప్పడు ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన!
విజయవాడ: వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన’ పై చర్చా వేదిక నిర్వహించారు విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్యి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం చర్చా వేదికను ప్రారంభించారుదీనిలో భాగంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘అవినీతి పాలన, అప్పుల ఆంధ్రాగా మారింది ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. మహిళలకు దశ,దిశా లేకుండా పోయింది. తొలియేడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళల పై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా?, సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?,సూపర్ సిక్స్ చేసేశాను..ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్లే అని సీఎం చెబుతున్నారు. నాలుక మందం ఎక్కడమేంటి దృశ్యం సినిమా మాదిరి ఒకే విషయాన్ని పదేపదే ఒకే విషయాన్ని చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే... ఎగ్గొట్టిన వారిని ఏమనాలిఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి గతంలో అమ్మఒడి పై విమర్శలు చేశారు. ఇప్పుడు అవే నిబంధనలు తల్లికి వందనం పథకంలో అమలు చేస్తున్నారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించేందుకు దేశచరిత్రలో తొలిసారి జగన్ అమ్మ ఒడిని ప్రవేశపెట్టారు. జగనన్న పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు..కానీ జగనన్న చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి,డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం, గతంలో జగనన్న దిశా యాప్ ను తెచ్చి మహిళలకు రక్షణ కల్పించారు. దిశా చట్టాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలిక పై టిడిపి కార్యకర్త ఆరునెలలుగా అత్యాచారం పాల్పడ్డారు’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు.సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మెసేజ్ ఇస్తున్నారు?రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచనే తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన కూటమి నాయకుల్లో లేదని ధ్వజమెత్తారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. జగనన్న మహిళలకు పెద్ద పీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి గుర్తుచేశారు. జగనన్న దిశా యాప్ తెస్తే ఆ యాప్ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశా యాప్ను పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పేరు పెట్టారు. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతును తగలబెట్టించారన్నారు. ‘ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.... ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు. ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. 40 ఏళ్ల సీనియర్నని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి?, అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే లోకేష్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికివందనం పథకంలో లోకేష్ రూ. 2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారుల పై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?, కులం,మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు. చంద్రబాబుకి...జగన్కి ఉన్న తేడా ఇదే. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని వనిత డిమాండ్ చేశారు. ఏపీఐడీసీ మాజీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ.. చంద్రబాబుకి అమరావతిలో ఉన్నవారు మాత్రమే మహిళలుగా కనిపిస్తారని, రాష్ట్రంలో ఉన్న మహిళలు గురించి చంద్రబాబుకు మనం గుర్తుచేయాలని ఎద్దేవా చేశారు. అనని మాటలను వైఎస్సార్సీపీకి, సాక్షికి ఆపాదించి నానా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండా పోయింది. విద్యాశాఖను గాడి తప్పిస్తున్నారు. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డుమీదకు లాగేశారు. టీచర్ల బదిలీల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్కూల్స్ కు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు. జగన్ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు’ అని స్పష్టం చేశారు. తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ.. ‘ ఆరోగ్యానికి జగన్ పెద్దపీట వేశారు. వైద్య విభాగంలో 47 వేల మంది నియామకాలు చేపట్టడం ఒక చరిత్ర. నాడు -నేడులో 16 వేల కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశారు. ఉద్ధానంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రూ. 750 కోట్లతో ఉద్ధానం ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. డాక్టర్ అవ్వాలనే పేద విద్యార్ధుల కలను నెరవేర్చడానికి వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ సీట్ల కోసం ప్రభుత్వాలు పోరాడుతుంటాయి. కానీ వచ్చిన మెడికల్ సీట్లను వద్దని చెప్పిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే’ అని ధ్వజమెత్తారు. -
టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు
-
తల్లికి వందనం పేరుతో తల్లులకు వంచన: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అమలు చేసినా తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తల్లులను మోసం చేసిందని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలోమాట్లాడారు.యూడైస్ రిపోర్టు మీద అబద్ధాలు:తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశాడు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)ను ప్రామాణికంగా తీసుకుంటారు. కలెక్టర్ల ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను తీసుకుని యుడైస్ ద్వారా కేంద్రానికి నివేదిక ఇస్తుంటారు. దీని ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు రూ.13,110 కోట్లు చెల్లించాలి.కానీ ప్రభుత్వం కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే చెల్లించి మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించింది. ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో పథకానికి అర్హులు కాకుండా ప్రభుత్వమే మోసగించింది. దీనినై వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్నిస్తుంటే, టీడీపీ నాయకులు యూడైస్ రిపోర్టు మీద కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ పిల్లలను మినహాయించి ఈ యూడైస్ రిపోర్టును తయారు చేసినట్టు స్పష్టంగా ఉన్నా, బయట రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, మంత్రి నారా లోకేష్ ఎదురుదాడి చేస్తూ, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.నాడు జే ట్యాక్స్ అన్నారు. ఇప్పుడేమంటారు?:ఎప్పుడిస్తారో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్డం పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకూ పథకాన్ని వర్తింప చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డబ్బులు మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన పాపాన పోలేదు. కానీ రేషన్ కార్డు లేదనే కారణంతో పథకం ఎగ్గొట్టారు. మా హయాంలో స్కూల్ నిర్వహణ కోసం అమ్మ ఒడిలో వెయ్యి రూపాయలు మినహాయిస్తే జే ట్యాక్స్ అంటూ నారా లోకేష్ విషప్రచారం చేశాడు. కానీ తల్లికి వందనంలో చెప్పాపెట్టకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.2 వేలు లాగేసుకున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఏం సమాధానం చెబుతాడు?.విద్యావ్యవస్థ సర్వనాశనమైంది:నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యింది. నారా లోకేష్ నిర్వహించే ఈ శాఖలో నిర్వహణ, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బడులు ప్రారంభించే నాటికి బదిలీలు పూర్తి చేయలేదు, పైగా బడులు ప్రారంభమైన నాలుగైదు రోజులకు టీచర్ల ట్రైనింగ్ క్లాసులు మొదలుపెట్టారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలంగా రద్దు చేయకపోగా దానికి ప్రత్యామ్నాయంగా మరో మూడు జీవోలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరంచెల విద్యావిధానాన్ని తీసేసి 9 అంచెల విధానాన్ని తీసుకొచ్చారు. బడులు ప్రారంభం అయ్యే నాటికి ఇవ్వాల్సిన విద్యాకానుక కిట్లు ఇప్పటికీ చాలా స్కూళ్లకు చేరలేదు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీ విధానంలో పలుకుబడి ఉన్నారికి, డబ్బులిచ్చినవారికే ప్రాధాన్యత లభించిందే కానీ ఎక్కడా నిబంధనలు అమలు జరగలేదు. గతంలో 3,158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే, వాటిని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించాడు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుమారుగా 1303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కొనసాగిస్తామని, 1076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా మార్చేస్తామని మరో అడ్డగోలు నిర్ణయం తీసుకుంది.నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాడు–నేడు ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు వెచ్చించి 38 వేల ప్రభుత్వ బడులను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ సిలబస్, 8 తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి వినూత్న ఆలోచనతో దేశంలో ఏపీ విద్యావ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడితే ఏడాది పాలనతోనే వాటికి ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడిపోయే దుస్థితి కల్పించారు.రూ.1306 కోట్లు వెచ్చించి 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోతరగతి నుంచి ఆ పైన తరగతులకు రూ.838 కోట్లతో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ), 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ కూటమి సర్కారు రద్దు చేసింది. గోరుముద్ద పథకం కోసం ఐదేళ్లలో మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,244.60 కోట్లు వ్యయం చేసింది. రోజుకో మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెట్టాం. కానీ కూటమి పాలనలో గోరుముద్ద కాస్త ‘ఘోర ముద్ద’గా మారిపోయింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అతిసారం బారిన పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేసేవాళ్లం. కానీ కూటమి సర్కారు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.7,800 కోట్లు పెండింగ్ పెట్టింది. 2024–25లో కేవలం రూ.700 కోట్లు విడుదల చేసి, రూ.7,100 కోట్లు బకాయిలు పెట్టింది. 2025–26 బడ్జెట్ లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయించినట్లు చూపారు. వీటన్నింటి ద్వారా పిల్లల చదువులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులువిద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం, మరోవైపు శాంతి భద్రతలు కాపాడడంలోనూ దారుణంగా విఫలమైంది. పొగాకు రైతుల పరామర్శ కోసం పోలీసుల అనుమతితో మా నాయకుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. అక్కడికి వేలల్లో వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు మాపై రాళ్ల దాడికి దిగితే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. నిరసన పేరుతో అడ్డుకోవాలని చూసిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. చివరకు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కూడా నోటీసులిచ్చారు.దళితులపై దమనకాండ:రాష్ట్రంలో దళితుల కుటుంబాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. యథేచ్ఛగా చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దళిత విద్యార్థిని మీద 18 మంది టీడీపీ యువకులు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన విషయం సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించివేశారు. ఆ బాలిక కుటుంబం టీడీపీ సానుభూతిపరులే అయినా ఆ పార్టీ నాయకులే అన్యాయం చేశారు. ఇంటర్ చదువుతున్న మరో గిరిజన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి దారుణంగా చంపేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మా నాయకులు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు. -
నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం.. జైల్లో కాకాణిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా రాజకీయ నేతలకు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. -
Kethireddy: నేనంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కి భయం
-
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి
-
మిడిమిడి జ్ఞానమా.. అతి తెలివా!?
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.యూడైస్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ సెల్ఫ్ గోల్ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్గోల్ వేసుకున్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రినీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?లోకేశ్కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్మీట్కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా! తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి -
అంత ఉలుకెందుకు లోకేశ్!?
సాక్షి, అమరావతి :తల్లికి వందనం పథకం అమలుతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. మంత్రి సవాల్కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ స్పందన ఏమిటంటే..‘‘నారా లోకేశ్.. యూడైస్ నివేదిక 2023–24 ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్టును జతచేస్తున్నాం. కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలను ఈ నివేదిక సమర్థించడంలేదు. దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా, హేళనచేస్తూ మాట్లాడ్డం సంస్కార హీనం’’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారానికి సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్స్లు జతచేసింది. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?‘‘మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బులు లాగేస్తున్నారని గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేశ్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మేం చెప్తుంటే అంత ఉలుకెందుకు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి? అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావో ఒక్కసారి విను’’.ఆ రోజుల్లో మీ వేదన అంతా ఇంతా కాదు..‘‘వైఎస్సార్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీరు, మీకు వత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండివార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పోస్టు ఇది. వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. మరి దీనికి ఎవరిపై కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియాను నడిపిన మీపైనా? ఏనాడూ నిజం చెప్పని ఈనాడుపైనా? లేక ఇద్దరిపైనా? లేకపోతే ఆ పోస్టు చేసింది మా పార్టీ కాదని మళ్లీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావా? అంతటి ఘనుడివే నువ్వు’’.. అంటూ శుక్రవారం వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. -
‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్
-
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలుఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. -
‘వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పనితీరు అద్భుతం’
గుంటూరు: తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.ఈరోజు(శుక్రవారం, జూన్ 13) గుంటూరులో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్రెడ్డిలతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.. రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.ఇవి పథకం ప్రకారం చేసే దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు. -
కొమ్మినేని అరెస్టుపై సుప్రీం తీర్పు హర్షణీయం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి,విజయవాడ: టీవీ డిబేట్లో గెస్టు చేసిన వ్యాఖ్యలకు సదరు డిబెట్ నిర్వహిస్తున్న యాంకర్ ఎలా బాధ్యులవుతారు? అంటూ ఏపీ పోలీసుల్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి ఛానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అరెస్టుపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొమ్మినేని వెంటనే విడుదల చేయాలంటూ తీర్పును వెలువరించింది. అయితే రాష్ట్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పేలా సుప్రీం తీర్పు ఇవ్వడం హర్షణీయం అంటూ వైఎస్సార్సీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.గురుమూర్తి, ఎంపీఏపీలో శాంతిభద్రతలు దిగజారాయిఅనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టిడిపి నేతలు అత్యాచారానికి పాల్పడ్డారుఈ అంశంపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారుఅత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాముహరికృష్ణ పై దాడి పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిందిబాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానుఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందిసాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారుకొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిందివిశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదువాక్ స్వాతంత్రానికి పెద్ద పీటల దేశం సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదల చేయాలని ఆదేశించింది బొల్లా బ్రహ్మనాయుడు:సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడం ముమ్మూటికీ చంద్రబాబు సర్కార్కు చెంపపెట్టే. చంద్రబాబు ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టించడం, అరెస్టు చేయించడం వంటివి ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయం. వెన్నపూస రవీంద్రరెడ్డి:సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశంకొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుకొమ్మినేనిపి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ట్వీట్సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఈ రోజు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బే.కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అవ్వడమే కాకుండా వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.గోరంట్ల మాధవ్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్ట్పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని హరించే అరాచకాలకు కోర్టు బుద్ధి చెప్పింది.డిబేట్ నిర్వహించినందుకు చంద్రబాబు చేయడం అక్రమమని సుప్రీం స్పష్టంగా చెప్పింది.ఈ తీర్పు ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టే గొప్ప విజయం.వంగా గీత:సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశం.కొమ్మినేని అక్రమ అరెస్ట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు.కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.ఆరె శ్యామల:సత్యమేవ జయతేకొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు, పత్రికా స్వేచ్ఛను సర్వనాశనం చేసే ప్రయత్నాలకు ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక.కనీసం ఈ తీర్పుతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టు చేయించడం ఆపాలి.పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి:కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది.చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక.ఇప్పటికైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.అక్రమ అరెస్టులను ఆపాలి.వరుదు కళ్యాణికొమ్మినేని గారి అరెస్ట్పై సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య రక్షణకు నిదర్శనం.చంద్రబాబు ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని అణచివేసే చర్యలకు కోర్టు బ్రేక్ వేసిందిడిబేట్ నిర్వహించినందుకు కేసు పెట్టడం అన్యాయమని సుప్రీం కోర్టు ఖండించడాన్ని స్వాగతిస్తున్నా.ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి.భూమన కరుణాకరరెడ్డి: కొమ్మినేని అరెస్టుపై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇచ్చింది.కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వంకు చెంప పెట్టు లాంటిదిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బుద్ధి చెప్పిందిఏపీలో పత్రిక స్వేచ్ఛను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు లాంటిదికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ను ఏ విధంగా బలహీన పరచాలని చూస్తూనే, సాక్షి మీడియాపై దాడులు చేయించిందిడిబేట్ నిర్వహించే వారిని అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందిఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని పునాదులను నిలబెట్టిందిసాక్షి కార్యాలయాలుపై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలిగుడివాడ అమర్నాథ్:సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను.సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టుసుప్రీం కోర్టు తీర్పుతో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలింది.కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు అక్రమమని సుప్రీం స్పష్టం చేయడం హర్షనీయం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమానవీయంగా వ్యవహరించారుఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్యలు ఆపాలి సీదిరి అప్పలరాజు:సీనియర్ పాత్రికేయలు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టు.కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ముమ్మూటికీ అక్రమ అరెస్టే అని తేలింది.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు ఆపాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలి -
విమాన ప్రమాద ఘటనపై YSRCP క్యాండిల్ ర్యాలీ..
-
Podili Tour: జనాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక పోయాడు..
-
విమాన ప్రమాద ఘటనపై YSRCP క్యాండిల్ ర్యాలీ..
-
రాళ్లు విసిరి.. కేసులు పెట్టి..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత బుధవారం చేపట్టిన పోరుబాటను భగ్నం చేసేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారులు తెరవెనుక కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు మూడు రోజుల ముందు నుంచే పొదిలిలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కారు రహస్యంగా తిరిగినట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్థానిక నాయకులు, పోలీసులు వద్దని మొరపెట్టుకున్నా వినకుండా అలజడి సృష్టించేందుకు పై స్థాయిలోనే కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందులో భాగంగా పోలీసుల సమక్షంలోనే రెండుచోట్ల వైఎస్ జగన్ కాన్వాయ్తోపాటు రైతులపై రాళ్లు విసిరి పలువురిని గాయపరిచారు. తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు మెప్పు కోసమే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు వైఎస్ జగన్ పొదిలి పర్యటన ఖరారైనప్పటి నుంచే మార్కాపురం ఎమ్మెల్యే హడావుడి చేయడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 8న సీఎం చంద్రబాబు మార్కాపురం వచి్చనప్పుడు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఏమాత్రం బాగా లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాగైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మెప్పు పొందాలని నిర్ణయించుకున్న నారాయణరెడ్డి... ఇందుకు వైఎస్ జగన్ పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో అలజడి సృష్టించడం ద్వారా మొత్తం కార్యక్రమాన్ని విఫలం చేయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు ముందురోజు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు నారాయణరెడ్డి పొదిలిలోనే తిష్ట వేసి గొడవలకు పథకం రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పది ప్రాంతాల్లో నిరసనలు తెలిపేందుకు తొలుత పథకం రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, నిరసనలు తెలిపేందుకు స్థానిక నాయకులు విముఖత చూపడంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను తెచ్చి రెండుచోట్ల నిరసనలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుడు గుణుపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మందిని, నవాబ్మిట్టలోని పోలీస్స్టేషన్ సమీపంలో మరో 200 మందిని ఉంచి దాడులకు ఉసిగొల్పినట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడక్కడ భవనాలపై ముందుగానే చేర్చుకున్న రాళ్లను కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ కాన్వాయ్పై విసిరారు. పోరుబాటకు తరలివచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇదంతా వీడియోల్లో చిత్రీకరించిన టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు పంపించినట్లు తెలుస్తుంది. పోరుబాటలో రాళ్లదాడి జరుగుతుందన్న విషయం టీడీపీ పెద్దలకు, స్థానిక ఎల్లో మీడియాకు ముందే తెలుసుకున్న ప్రచారం జరుగుతోంది. టీడీపీవారు రాళ్లు, చెప్పులు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మార్కెట్ యార్డు పదవిని ఆశ పెట్టి కొందరు టీడీపీ నాయకులను నిరసనలకు ఉసిగొల్పినట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ... మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలికి వస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తల నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులు వద్దని చెబుతున్నా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు నిరసనలకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే 200 మందికి పైగా గుమిగూడినా ఎందుకు చెదరగొట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. మాజీ సీఎం కాన్వాయ్పైనే రాళ్లు విసురుతున్నా పక్కనే ఉన్న పోలీసులు వారించకుండా చోద్యం చూడడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లు విసిరినవారిని వదిలేసి ఎవరి ఆదేశాలతో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారో పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. జాకెట్ ముక్కలు, నగదు పంపిణీ చేసిన పచ్చమూకలు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకున్న మహిళలకు పచ్చమూకలు రూ.500 నగదు, జాకెట్ ముక్కలు పంపిణీ చేయడం మీడియా కంటపడింది. వైఎస్ జగన్పై అభిమానంతో పొదిలికి వచ్చిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, చిన్నారులు, మహిళలకే ఈ ప్లకార్డులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్లకార్డులపై ఏమి రాసి ఉందో తమకు తెలియదని వారు చెబుతుండటం గమనార్హం. -
రామగిరిలో గూండాగిరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రామగిరి మండలం రౌడీరాజ్యానికి అడ్డాగా మారింది. పరిటాల పైశాచికత్వం రాజ్యమేలుతోంది. గతంలో పరిటాల రవి అనుచరులతో ఎలా అయితే ఇక్కడ ఘాతుకాలు జరిగాయని చెప్పుకుంటారో.. ఇప్పుడూ అదే జరుగుతున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. గురువారం జరిగిన ఘటన దీనికి అద్దం పడుతోంది. వారం రోజుల క్రితం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లికి చెందిన ఓ దళిత బాలిక సామూహిక లైంగిక దాడికి గురైన విషయం తెలిసిందే. బాధిత బాలిక కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రులు పరామర్శించాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పరిటాల సునీత సైన్యం రంగంలోకి దిగింది. ‘ఆ ఊళ్లోకి వైఎస్సార్ సీపీ నాయకులు ఎలా వెళతారో మేమూ చూస్తాం’ అంటూ తన అనుచరులతోపాటు పోలీసులతో అడుగడుగునా అడ్డుకున్నారు. బాలిక ఊరిలోకి వెళ్లనివ్వలేదు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వెళుతున్న రెండు వాహనాలను టీడీపీ మూకలు ధ్వంసం చేశాయి. కార్ల అద్దాలు పగులగొట్టాయి.ముందురోజే ప్లాన్ మారింది లైంగికదాడి బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఏడుగుర్రాలపల్లికి గురువారం వెళుతున్నట్టు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఉషశ్రీచరణ్, శైలజానాథ్లతోపాటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నాటికి కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రామగిరి మండలంలో టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఏడుగుర్రాలపల్లికి వస్తున్నారన్న ప్రకటనతో బైక్ ర్యాలీని గురువారం రాత్రికి రాత్రి రామగిరి నుంచి పేరూరుకు ఎమ్మెల్యే సునీత మార్చారు. అంతేకాదు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలను పేరూరుకు తీసుకురావాలని పరిటాల కుటుంబం ఆదేశించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలంతా పేరూరుకు చేరుకున్నారు. ఈ ఊర్లోకి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారు. దీంతోపాటు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆ ఊర్లోకి ఎవరూ రాకుండా అడ్డుకోవాలని పోలీసులనూ ఆదేశించినట్టు తెలిసింది. అడుగడుగునా అడ్డుగోడలే ముందుగా ప్రకటించిన మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు గురువారం ఉదయమే అనంతపురం నుంచి బయలు దేరారు. ఉషశ్రీచరణ్ మాత్రం పెనుకొండ నుంచి బయలు దేరారు. కానీ ఏ రూటులో వెళ్లినా.. పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపైనే ఉషశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శైలజానాథ్, మేరుగ నాగార్జున, తోపుదుర్తి ప్రకాష్రెడ్డిలనూ అడ్డుకున్నారు. అడ్డంకులను దాటుకుని అతికష్టమ్మీద మద్దెలచెరువు గ్రామం వరకూ నాయకులు వెళ్లారు. అక్కడినుంచి పోలీసులు వారిని పేరూరుకు వెళ్లనివ్వలేదు. దీంతో వారు అక్కడే మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు. అంతకుముందే వందలాదిమంది టీడీపీ మూకలు పేరూరులోనే వంటావార్పు చేపట్టి మకాం వేశాయి. ఎలాగైనా ప్రతిపక్ష నేతలు బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించకూడదనే ఈ ఎత్తుగడ వేశారు.మహిళా ఎమ్మెల్యే అయి ఉండీ.. తన నియోజకవర్గం, తన సొంత మండలానికి చెందిన దళిత బాలికపై నెలల తరబడి 14 మంది లైంగిక దాడికి ఒడిగడితే ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం బాధిత బాలికను పరామర్శించిన పాపాన పోలేదు. పైగా ఆ ఊళ్లోకి ఎవరూ రాకుండా గూండాలను పెట్టి అడ్డుకుంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత బాలిక ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ బతుకునీడిస్తోంది. ప్రత్యేక వైద్యం లేదు, ఇప్పటివరకూ సర్కారు నుంచి సాయమూ లేదు. ఇవన్నీ దగ్గరుండి చూడాల్సిన స్థానిక మహిళా ఎమ్మెల్యే..పేరూరులో బలగాలను మోహరించి, ఆ ఊర్లోకి ఎవరినీ రాకుండా చూడటం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగిరిలో రౌడీరాజ్యం కాదు ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో మూడు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఊర్లోకి ఎవరూ రాకూడదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ప్రెస్నోట్ రిలీజ్ చేయడం మరో విశేషం. -
ఏడాది పాలన అంతా అరాచకమే
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ్టికీ చంద్రబాబు నిత్యం బురద చల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, పి.అనిల్కుమార్ యాదవ్, మేరుగు నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ‘క్రిమినౖలెజేషన్ ఆఫ్ పాలిటిక్స్’కు ఆద్యుడు చంద్రబాబే అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యథావిథిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్పై నిందలు మోపుతూ.. నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకుని ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఎవరున్నారో నాడు రాష్ట్ర హోం మంత్రిగా పని చేసిన చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చి, వారిని దాచి పెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆ కేసును ఉద్దేశ పూర్వకంగా రాజకీయంగా వాడుకుని, తామే హత్య చేశామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పిన వారిని కూడా అప్రూవర్గా మార్చి, ఆ నెపాన్ని నిర్దోషుల మీద మోపి రాజకీయ విష క్రీడ ఆడుతున్నది ఎవరో ప్రజలకు తెలిసిందే. తెల్గీ స్టాంప్ పేపర్ల స్కామ్ మొదలు.. స్కిల్ స్కామ్, మద్యం స్కామ్ వరకు ఏ నేరం చూసినా సరే చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది’ అని తెలిపారు. వారు ఇంకా ఏం చెప్పారంటే.. కూటమి ప్రభుత్వంలో 390 హత్యలు » ఏడాదిగా చంద్రబాబు అత్యంత హేయమైన పాలన సాగించారు. విపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, ఆస్తుల విధ్వంసంతోపాటు టార్గెట్ చేసుకున్న వారిపై అక్రమ కేసుల బనాయింపునకు బరితెగించారు. » ఏడాదిలో 390 హత్యలు. హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. ఇద్దరు ప్రజా సంఘాల నాయకులు, ఎనిమిది మంది జర్నలిస్టులు జైలుకు వెళ్లారు. » విద్యార్థి దశలో ఉన్నప్పుడే తన సహచరులకు మద్యం పట్టించి ప్రత్యర్థులపైకి దండయాత్రకు పంపానని చంద్రబాబు స్వయంగా తన ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మామ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చాక.. ఆయన చేసిన నిర్వాకాలన్నింటినీ ఆయన తోడల్లుడు చెప్పారు. జర్నలిస్ట్ పింగళి దశరథరాం హత్య వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలిసిందే.» వైఎస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం పొదిలి వెళితే టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి, రాజకీయ హింసను రాజేసి ఆ మంటల్లో చలి కాచుకుందామని కుట్ర పన్నారు. అది ఫలించకపోవడంతో రైతులపై రౌడీలుగా ముద్ర వేసి, వారిపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్న చంద్రబాబువి నేరమయ రాజకీయాలు కావా?. -
‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయాలనే గొంతులను మాత్రం ఏడాదిది నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, జూన్ 12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. ‘తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నామని అబద్దం చెబుతున్నారు.రికార్డ్స్ ప్రకారం దాదాపు 87 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి. పదమూడు వేల కోట్ల రూపాయిలు తల్లికి వందనం పథకానికి కావాలి. కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం అని తెలియదా?, దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా?, దమ్ము దైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబూ?, ప్రజా స్వామ్య విలువలు పాటించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు?, ఒక పథకాన్ని అమలు చేయడంలో ఇంత వంచనా?, ఇవ్వాల్సిన సొమ్ములో రెండు వేలు కట్ చేసి, తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు?, P4 అనేది ప్రణాళిక లేని కార్యక్రమం. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళితుల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు?, రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు.శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలి అనుకుంటున్నారా?, ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతగా రైతులు తిరగ బడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.ప్రభుత్వం పై రైతులు తిరగబడితే రౌడి లా కనపడుతున్నారా?, రైతులను రౌడీలంటూ అగౌరవపరుస్తారా?, ఇదేనా మీ సంస్కారం?’ అని విమర్శించారు. -
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 241 మంది మరణించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు, మృతులకు సంతాప సూచకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి.కాగా, అహ్మదాబాద్లో దారుణ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. -
గవర్నర్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు.. గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంచార్స్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి, బెల్లం దుర్గలు ఉన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ. . ‘గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించాము. స్థానిక ప్రజాప్రతినిధుల చేస్తున్న ఇసుక అక్రమ రవాణా పై వివరించాము. మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి , జగన్ పోన్నూరు టూర్ లో రాళ్ళ దాడిపై వినతిపత్రం అందించాం’ అని అన్నారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కి ఇచ్చాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం , అక్రమ అరెస్టులు అన్ని వివరించాము. గవర్నర్తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. గత హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలు పెట్టారు..కూటమి నేతలు తల్లికి వెన్నుపోటు పొడిచారు.. 30లక్షల మంది పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని సహజ సంపదని తెలంగాణకి అమ్మేసుకొంటున్నారు’ అని మండిపడ్డారు. -
రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు.. ఉష శ్రీ చరణ్ వార్నింగ్..
-
‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.మరోవైపు.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ఏడాది పాలన.. వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
-
అందుకే కాకాణిపై కేసులు.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
మానసికంగా ఆరోజే చచ్చిపోయా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయయారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏవిధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కూటమి మాయమాటలతో.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ (2024 అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి) దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఈ మధ్య రోజుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే!. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోసిన ప్రతీ కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు.. అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు. నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది. గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం. కానీ అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చిందనే కేసు పెట్టారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టి వదిలేయని చెప్పింది. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా. ఈ మధ్య.. ‘నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికేనా?’ అని ఈనాడు లో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్లో మచిలీపట్నంకు సంబంధించిన ఒకటి పోర్ట్.. రెండోది ఇళ్ల పట్టాలు సమస్య చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారు. అయినా కూడా 15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి ఇచ్చాం.అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది. అప్లికేషను నంబర్ల నుంచి వాటి నరిహద్దులతో సహా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది?. 500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళ్తున్నారట. ఎంతకు అమ్మారు.. పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా? అని అడుగుతున్నారట. ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు. -
పచ్చ మూకల పైశాచికత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలు నీరాజనం పలకడంతో సీఎం చంద్రబాబు అండ్ గ్యాంగ్కు వణుకు పుట్టింది. అనూహ్యంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తుండటం చూసి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే జగన్ పర్యటనను అభాసుపాలు చేయాలని కుట్రకు తెర లేపారు. ఇందుకు పోలీసులూ సహకరించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి 2.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొగాకు వేలం కేంద్రానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మంది పచ్చ మూకలు కాపు కాశారు. ర్యాలీ పట్టణంలోకి ప్రవేశించగానే ఖాళీ కుండలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ నవాబ్ పేటకు చేరుకోగాని మరో పచ్చ గుంపు రోడ్డుపైకి చొచ్చుకొచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లతోపాటు జగన్ కాన్వాయ్ మీదకు చెప్పులు విసిరారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పైకి రాళ్లు, చెప్పులు విసరడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో ముందుగానే తిష్ట వేసిన పచ్చ మూకలు.. డాబాల మీద నుంచి, ఇళ్లలోని కిటీకీల నుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, కొందరు రైతులు, కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రాళ్ల దాడి చేసిన పచ్చ మూకలను వదిలిపెట్టి.. రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల మద్దతుతోనే రాళ్ల దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. నిరసనలకు పోలీసుల అనుమతి వైఎస్ జగన్ పోరుబాట ర్యాలీ జరుగుతున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలుగా పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు రాక అల్లాడిపోతున్నారు. సరుకు కొనకుండా కంపెనీలు చేసిన కుట్రలకు మోసపోతున్నారు. కళ్లున్న కబోదిలా కూటమి ప్రభుత్వం పొగాకు రైతులు, ఇతర రైతులను పట్టించుకోకుండా కంపెనీలకు అండగా నిలబడింది.ఈ పరిస్థితిలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లను సిద్ధం చేసుకున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసులు మిన్నకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో మాజీ సీఎం కాన్వాయ్ మీద చెప్పులు విసరడం, ర్యాలీకి వ చ్చిన రైతులు, కార్యకర్తల మీద రాళ్లు రువి్వతే పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. డాబాల మీదకు రాళ్లు ఎలా వెళ్లాయి? పోరుబాట ర్యాలీకి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ర్యాలీ దృశ్యాలను టాప్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫొటోగ్రాఫర్లను పోలీసులు అనుమతించ లేదు. కానీ ర్యాలీ పొడవునా డాబాల మీద టీడీపీ కార్యకర్తలు కాపుకాశారు. ఇళ్లపై నుంచి ర్యాలీకి తరలివచ్చిన రైతుల మీదకు రాళ్లు రువ్వారు. అసలు డాబాల మీదకు రాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులే బదులివ్వాలి. స్పెషల్ బ్రాంచి పోలీసులు, ఇంటిలిజెన్స్ పోలీసులు ఏం చేసినట్లు? అంటే పోలీసుల మద్దతుతోనే పచ్చ మూకలు రాళ్ల దాడికి ప్లాన్ చేశాయని ఇట్టే స్పష్టమవుతోంది. పోరుబాటలో అడుగడుగునా పచ్చమూకలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించాయి. గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ మూకలు ఇంతగా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం పాటించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం ఇష్టం లేని టీడీపీ నేతలే కుట్ర పూరితంగా వ్యవహరించడం కనిపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
హోంమంత్రిగా మహిళ ఉన్నా అరాచకాలు దారుణం
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలు, రెడ్బుక్ రాజ్యాంగంపై ధ్వజమెత్తారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుజేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని కురుసా పార్వతమ్మ విమర్శించారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. అయినా, తోటి మహిళగా హోంమంత్రికి బాధితులను పరామర్శించే కనీస దయ కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు. -
సాగుకు శాపం.. 'బాబుదే ఈ పాపం': వైఎస్ జగన్
గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడి పోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా రూ.11,781తో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. ఎన్ని కేజీలు కొన్నారు? ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటా కూడా కొనలేదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, ఇటీవల ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరులో ఒకరు, కొండపిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడ అధికారులు, రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, రైతులకు కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ చెల్లించిందని చెప్పారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అదే ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే అది పూర్తిగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రైతు భరోసా లేదుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టారు. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను, దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం. జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా చార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేశారు. రైతు దళారీలకు అమ్ముకున్నాడు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటా వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించాం. ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను కూర్చోబెట్టి.. ప్రతి పంట ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్డేట్ చేయించాం. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.పొగాకుకు మద్దతు ధర పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరం (2023–24)లో కూడా కేజీ రూ.360 చొప్పున క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా క్వింటా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయింది. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. ఏం మాట్లాడుతాడోనని.. అల్లరవుతామేమేనని వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. కేవలం 40 మిలియన్ టన్నులు మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం కిలో రూ.220 నుంచి రూ.260 మధ్య అమ్ముడుపోతోంది. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రావడం లేదు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు. ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. ఆ ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కు తీసుకెళ్తున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల మధ్యకొచ్చాం. సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్ణాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈ రోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. రూ.4 లక్షల పరిహారం ఘనత మాదేపొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చి రైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా.. వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్గా ఈ–క్రాప్ జరిగేది. ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా ఐదు ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చాం.రైతులను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ‘ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువగా పండించండి.. మేము కొనుగోలు చేస్తాం’ అని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పంటను కొంటామని హామీ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం 30 శాతం పెరిగింది. ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఇతర పంటలదీ అదే దుస్థితి నిన్న (మంగళవారం)నే మా ఆఫీస్కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1,050 ఉండేది. ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606కి పడిపోయింది. ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం.ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాంపొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసాఅన్నదాతలు, అధికారులతో ముఖాముఖిపొదిలి/కొనకనమిట్ల: పొగాకు రైతులు అధైర్య పడొద్దని, ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పంట ఉత్పత్తి, ధరలు, రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు. వేలం అధికారి గిరిరాజ్కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్కు వివరించారు. ‘4,390 మంది రైతులు 2,601 బ్యారన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారు. 8,534 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా, 11,031 హెక్టార్లలో సాగు చేశారు. 11.10 మిలియన్ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా, 18 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నాం. బ్రైట్ రకం కిలో రూ.265, మీడియం రూ.225, లో గ్రేడ్ రూ.180 సగటు ధరగా కొనుగోలు చేస్తున్నాం. బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లోనూ 25% ఉత్పత్తి పెరిగింది. బయ్యర్లు లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో రిజక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది’ అని తెలిపారు. ‘లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిల్వ ఉంది. సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది. రిజక్షన్ బేళ్ల సంఖ్య పెరిగింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ధైర్యం వీడొద్దని, రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు, రైతులకు మేలు జరిగేలా మార్క్ఫెడ్ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు, పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు. జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్హం. -
చంద్రబాబు మీది కూటమి ప్రభుత్వం కాదు.. వంచన ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. వంచన ప్రభుత్వం అని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. తల్లికి వందనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కాదు.. వంచన. మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే. అదికూడా పూర్తిగా ఇస్తారో లేదో?. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు. గత ఏడాది పూర్తిగా ఎగనామం, రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు. ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇది వంచన కాదా?ఎన్నిలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలుఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఏడాదికాలంపాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాతకూడా, చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడంలేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీచేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థం అవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, ప్రతిఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపథకాన్ని రద్దుచేసి గత విద్యాసంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?యూడీఐఎస్ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. గత ఏడాది ఒక్కపైసా ఇవ్వలేదు.గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాని, ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తే, ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింప చేస్తే, ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యాశాఖమంత్రి చెప్తున్నారు. ఇది చాలా దారుణం. అలా చూసినాసరే ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది’ అని దుయ్యబట్టారు. -
జగన్ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్ టార్గెట్: వైఎస్సార్సీపీ
సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైఎస్ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు.జెడ్ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే.పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైఎస్ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు.పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్.రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్లు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు.మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి ప్రోత్సహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.టీడీపీ నేతలు సిగ్గుపడాలి: చుండూరి రవికిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి రవి అన్నారు. -
‘డైవర్షన్ పాలిటిక్స్కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్కి తెగబడ్డారు. వారి దిగజారుడు రాజకీయాలకు మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. మహిళల నిరసన పేరిట సాక్షి కార్యాలయాలను టార్గెట్ చేసుకుని గడిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు టీడీపీ కుట్ర చేసింది.మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం, రక్షణ కల్పించడం వంటివి చేయకపోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మహిళా కార్యకర్తలను పంపించి, వారి వెనుక టీడీపీ కార్యకర్తలను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదుసాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. చంద్రబాబులా మహిళల గురించి ఏనాడైనా వైఎస్ జగన్ చులకనగా మాట్లాడటం జరిగిందా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకనే అవమానించేలా మాట్లాడిందే చంద్రబాబు. దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మహిళలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలతో అండగా నిలిస్తే, చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు మహిళలను వాడుకుంటున్నాడు.ఈ ప్రభుత్వంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఎంతోకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. ఇలాంటి కుట్రలు, వక్రీకరణలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలి. కూటమి మోసపు హామీలు నమ్మి మోసపోయామని ఇప్పటికే మహిళలు ఆందోళనగా ఉన్నారు. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం
-
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్రెడ్డి అన్నారు.మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు...కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
జగన్ రాకతో దిగొచ్చిన కూటమి..
-
నువ్వొక మహిళా మంత్రివా.. మంత్రి అనితని ఏకిపారేసిన మహిళలు
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మీరు ఎవరూ అధైర్యపడొద్దు... వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని రైతులు, ఇంటింటికీ రేషన్ వాహనాల(ఎండీయూ) డ్రైవర్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, అయిల్పామ్, పొగాకు రైతులు, రేషన్ వాహనాల(ఏపీ ఎండీయూ–మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ‘మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది’ అని రైతులు వాపోయారు. దీంతో అన్నదాతలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ భరోసాగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ⇒ ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసి... 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి, తమను ఆదుకున్నది మీరేనంటూ వైఎస్ జగన్కు రేషన్ వాహనాల డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, రేషన్ వాహనాల డ్రైవర్లను తొలగించి జీవనోపాధి లేకుండా చేసిందని వాపోయారు. తమతోపాటు దాదాపు 10 వేలమంది హెల్పర్ల కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి అండగా ఉంటామని వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆయిల్పామ్ రైతులకు ఏమీ మిగలడం లేదు నాకు నాలుగెకరాల ఆయిల్పామ్ తోట ఉంది. గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ.21,400 ఉండేది. ఇప్పుడు రూ.18,600కు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఏం మిగలడం లేదు. ఇంకా ధర తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం. దయచేసి టన్నుకు కనీసం రూ.20 వేల మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. – అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లాధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు మేం కోకో రైతులం. వైఎస్ జగన్కు మా సమస్యను వివరించాం. కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ.వెయ్యికి కొనుగోలు చేశాయి. ఈసారి సీజన్ ప్రారంభంలో కేజీకి రూ.750 ఇచ్చి.. ఇప్పుడు రూ.400కి తగ్గించేశారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ.850కి అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ.300–400 మధ్య కొంటున్నారు. అదికూడా టీడీపీకి చెందిన రైతుల దగ్గరే కొంటున్నారు. పైగా నిరుడు ధర పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే ఏం కావాలి? వైఎస్సార్సీపీ సానుభూతిపరులం అని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ వైఎస్ జగన్కు వివరించాం. మా సమస్యలు విన్న ఆయన తప్పనిసరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. – తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాల డ్రైవర్లను నిలువునా ముంచింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాలు ఉన్న సమయంలో బియ్యం పక్కదోవ పట్టాయన్నారు. కానీ.. ఈ నెలలో రేషన్ షాప్ల ద్వారా పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేకచోట్ల బ్లాక్ మార్కెట్కు తరలుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు? మాకు వాహన రుణాలు క్లియర్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిరీ్వర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్లలో నిల్చోలేకపోతున్నామని వాపోతున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్లీమళ్లీ తిప్పించుకుంటున్నారు. మేం వైఎస్ జగన్ను కలిసి సమస్యలు వివరించాం. తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. – పి.శ్యాంబాబు, రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ -
సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మంగళవారం ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో స్త్రీలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని మహిళలంతా నినదించారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఆంక్షల నడుమ పోటెత్తిన ర్యాలీలు గుంటూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లి నిరసన తెలియజేశారు. లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలు చేస్తూ మహిళలు అంబేడ్కర్ స్మృతి వనానికి తరలివెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ వినతిపత్రం సమర్పించారు. బాపట్లలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీఎత్తున నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేసి వినతిపత్రం సమర్పించారు. భీమవరంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు భారీ నిరసన చేపట్టి గోకవరం బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చి ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి ప్లకార్డులు పట్టుకుని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ విశాఖపట్నంలో మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లిలో మహిళలు రింగ్ రోడ్ నుంచి ర్యాలీగా రైల్వే జంక్షన్కు వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘రెడ్బుక్ పాలన పోవాలి.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.రాయలసీమ జిల్లాల్లో నిరసన గళం మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్లపై బైఠాయించారు. రాప్తాడు, హిందూపురంలో మహిళలు నిరసన తెలిపారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నినదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ జరిపారు. కర్నూలులో నల్లబ్యాడ్జీలు ధరించి కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల విషయం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి -
చంద్రబాబు మమ్మల్ని నిండా ముంచారు.. వైఎస్ జగన్తో ఎండీయూ యూనియన్లు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డితో ఏపీ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రజల వద్దకు ఇంటింటకీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా ఆపరేటర్లు మొరపెట్టుకున్నారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అనంతరం, ఎండీయూ ఆపరేటర్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను నిలువునా ముంచింది.వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ ఆపరేటర్లు ఉన్న సమయంలో రైస్ పక్కదోవ పట్టాయన్నారు కానీ ఈ నెలలో రేషన్ షాప్ ల ద్వారా రైస్ పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేక చోట్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. మాకు వెహికిల్ లోన్స్ క్లియర్ చేస్తామని అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. ప్రజాపంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్స్లో నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్ళీ మళ్ళీ తిప్పించుకుంటున్నారు. మేం వైఎస్ జగన్ని కలిశాం. వారితో కలిసి మా సమస్యలు వివరించాం, తప్పకుండా మిమల్ని ఆదుకుంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు’ అని అన్నారు. -
హోంమంత్రి అనిత రాజీనామా చేయాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, గుంటూరు: ప్రతిపక్షనేతలపై కేసులు పెట్టడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం మంగళవారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు విజయవంతం కావడంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ..రాష్ట్రంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముచ్చుమర్రి ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది. అందుకే కూటమి వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మేం నిరసన చేపట్టాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. .. రాష్ట్రంలో చంద్రబాబు పాలన లో మహిళలకి రక్షణలేదు. రాప్తాడు లో 14 ఏళ్ల మైనర్ బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేశారు. టీడీపీ కార్యకర్తలను నిన్నటి వరకు అరెస్టు చేయలేదు. ఈ హత్యలు, అత్యాచారాలకు కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి, డ్రగ్స్ డోర డెలివరీ అవుతున్నాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పోలీసులు , ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. తన సొంత నియోజకవర్గంలో అఘాయిత్యాలు జరిగినా హోం మంత్రి అనిత పట్టించుకోవడంలేదు. టీడీపీ కార్యకర్తలే మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అనంతపురం జిల్లాలో చిన్నారి చనిపోయింది. చిన్నారి మృతిపై హోం మంత్రి బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా చేయాలి. అనంతపురం చిన్నారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’’ అని వరుదు కళ్యాణి అన్నారు. -
హోం మంత్రి వంగలపూడి అనితకు YSRCP అధికార ప్రతినిధి కౌంటర్
-
ప్రజలకిచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారు: శైలజానాథ్
-
‘జగన్ సర్.. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాట ధర ఉండడం లేదని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అని రైతులు వైఎస్ జగన్(YS Jagan) వద్ద వాపోయారు. అయితే ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు. నాకు నాలుగెకరాలు పామాయిల్ ఉంది, సీజన్ ప్రారంభం అయింది, గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ. 21,400 ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టన్ను రూ. 18,600 కు వచ్చింది, మాకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి, రైతులకు ఏం మిగలడం లేదు, ఇంకా రేటు తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం, దయచేసి ప్రభుత్వం కనీసం టన్నుకు రూ. 20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేం మా సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన తప్పక మాకు అండగా ఉంటామన్నారు.::అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లామేం కోకో రైతులం. జగన్ను కలిసి మా సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్ ప్రారంభంలో ఇచ్చి ఇప్పుడు రూ. 400 ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ. 850 అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ. 300-400 మధ్య కొనుగోలు చేస్తున్నారు. పైగా టీడీపీ రైతుల(TDP Farmers) దగ్గరే కొంటున్నారు. మేం వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ జగన్ గారికి చెప్పాం. పైగా నిరుడు రేట్ పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. మా రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మా రైతులు ఏమవ్వాలి, మా సమస్యలు విని వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.::తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా -
‘ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర’
తాడేపల్లి : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమని, ఎలాంటి అరెస్టు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, జూన్ 10) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుముట్ల.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘చర్చా వేదికలో జరిగిన విషయాలను సాక్షి టీవీకి, వైఎస్ఆర్ సీపీకి రుద్దే ప్రయత్నం చేసారు. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ప్రీప్లాన్డుగానే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటలను కొమ్మినేని అదే వేదిక మీద ఖండించారు. అయినప్పటికీ అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను డైవర్టు చేసేందుకే ఈ దాడులు, అక్రమ .మహిళలు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు. దీనిపై చంద్రబాబు కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రత్యర్థి పార్టీలు, ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి. కొమ్మినేనికి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. చట్టం, రాజ్యాంగాలతో పని లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొమ్మినేని తన న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.అసలు కొమ్మినేని మీద ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?, అంటే కొమ్మినేని మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధింపునకు దిగిందో అర్థం చేసుకోవచ్చు’ అని కోరుముట్ల ధ్వజమెత్తారు.. -
చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం
-
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
విజయవాడ : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు. చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్కే రోజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందిహోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదుఅధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలిఅధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారుమహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటునగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారుఅనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదుపరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందిడిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదుహోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి విజయవాడలో..రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా:లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.విశాఖలో..మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా:కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళనరాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసనరాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలుహోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటుఆమెకు నిత్యం జగన్ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్నమహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్కాకినాడ జిల్లా:మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసనడా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేతపాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాతఏలూరు జిల్లా:సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసనపాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులుఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులుమహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది: సరిత రెడ్డికూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయికూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదుజగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారుచంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదుఅంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూజగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారుగత వారం రోజుల వ్యవధిలోని మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయిహోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు కర్నూలు:కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళనమహిళలు, బాలికల పై జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు చిత్తూరు జిల్లా: దర్గా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంఅంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులురాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డికూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డివైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డిమహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , -
Kakumanu Rajasekhar: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
-
ప్రభుత్వంపై అడ్వకేట్ పొన్నవోలు ఫైర్
-
టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను అరెస్ట్ ఎప్పుడు చేస్తారు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొమ్మినేనిపై మరోసారి చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు దిగిందని స్పష్టమవుతోందన్న కామెంట్ సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో.. కూటమి ప్రభుత్వం సమాన న్యాయం పాటించడంలేదని వైఎస్సార్సీపీ అంటోంది. తాజాగా టీవీ5 డిబేట్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనుగానూ టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి అని వైఎస్సార్సీపీ నిలదీసింది. -
రేపు ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(మంగళవారం) రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం పిలుపు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిర్ణయించింది. కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఏడాది పాలనలో నేరాలు ఘోరాలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా హోం మంత్రి అనిత కనీసం స్పందించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సగటున రెండు రోజులకి ఒక అత్యాచారం జరుగుతుండగా.. ఇంకా వెలుగులోకి రాని అఘాయిత్యాలు ఎన్నో?!. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని.. ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని వైఎస్సార్సీపీ చంద్రబాబుకు హితవు పలుకుతోంది. -
‘కొమ్మినేని అరెస్ట్కు 200 టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల కుట్ర’
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ను వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఆర్గనైజ్డ్గా టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజులుగా టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న రాద్దాంతం దారుణం. విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, కృష్ణం రాజు మాటలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆపేశారు. అసలు విషయాలు పక్కకు పోతాయని, అనసవర విషయాలు పట్టించుకునే వాళ్లం కాదు. దుర్మార్గులు, పిరికివాళ్లు అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని. వాళ్లు ట్వీట్ పెట్టడంతో వారు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనే అనుమానం వచ్చింది.కృత్రిమంగా ఆర్గనైజ్డ్ చేసిన నిరసనలే. ఈనెల 6వ తేదీ ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని షోలో కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆ షోలో ఓ అంశం పై కృష్ణం రాజు వ్యాఖ్యలు. 24 గంటల తర్వాత పథకం ప్రకారం రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ, ఆ పార్టీ ప్రచార సంస్థలు, 200 యూట్యూబ్ ఛానల్స్ మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా చేస్తోంది అధికార పార్టీనే.6వ తేదీన జరిగిన డిబేట్ లో అమరావతి చుట్టుపక్కల గురించి ప్రస్తావన వచ్చినపుడు కొమ్మినేని వారించారు. కొమ్మినేని వారించారు...డిబేట్ కూడా అయిపోయింది. ఆ డిబేట్ తర్వాత మరోసారి ప్రసారం కాలేదు. కొమ్మినేని కానీ, కృష్ణంరాజు కానీ మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. 7వ తేదీ నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఏబీఎన్, టీవీ5లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా వందల డిబేట్లు నిర్వహించారు. కానీ మేం ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం దూర్భషలాడేవాళ్లు...సత్తా లేనివాళ్లు మాత్రమే ఇలా చేస్తారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఇలాంటి దూర్భషలాడేలా వ్యవహరించలేదు. లేని సమస్యను సృష్టించి విషప్రచారం చేయడం టీడీపీకి, చంద్రబాబుకు అలవాటు. నారా లోకేష్ ట్వీట్ పెట్టిన తర్వాత మాకు అనుమానం వచ్చింది. సాక్షి మీడియా కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించింది.ఇలాంటివి తామెప్పుడూ ప్రోత్సహించమని సాక్షి స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఖండన విడుదల చేసింది.8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, దుర్భాషలు, సాక్షి ఆఫీస్పై దాడులతో పరాకాష్టకు చేరింది. తన షోలో జరిగిన అంశం కాబట్టి కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పారు. టీడీపీ వాళ్లు ఆర్గనైజ్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అంచెలంచెలుగా ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలని చూస్తున్నారు. అమరావతిని పొరబాటున ఎవరైనా ఏదైనా అంటే రాష్ట్రమంతా కదిలొస్తుందని చూపేందుకు ఆర్గనైజ్ గా కార్యక్రమాలు చేపట్టారు.చంద్రబాబు ట్వీట్తో సహా టీడీపీ అధికారిక మీడియాలో మూడు రోజుల నుంచి అమరావతి మహిళల పరువు తీస్తున్నారు. అదే పనిగా మహిళల పరువును తీసేలా వ్యవహరించినది ఎవరు? రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రం మొత్తాన్నీ అవమానించినట్లేనా. చంద్రబాబు ఒక పథకం ప్రకారం తనకు తెలిసిన ఏకైక విద్యను ప్రదర్శిస్తున్నాడు. కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిజంలో పొరబాటున కూడా ఒకరిని ఒక మాట అనలేదు. ఎన్టీవీలో నిస్పక్షపాతంగా డిబేట్లు చేసినందుకు ఉద్యోగంలోంచి తీయించాడు. ఉద్యోగం తీసేవరకూ ఎన్టీవీ ప్రసారాలను చంద్రబాబు నిలిపివేయించాడు. ఆతర్వాత కొమ్మినేని సాక్షి టీవీలో చేరారు.ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజూ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు ...పోలీసుల దుర్మార్గాలు ఎవరికీ కనబడటం లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మహిళల పట్ల ఏదైనా ఘటన జరిగితే స్పందించిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. అనంతపురంలో 14 ఏళ్ల బాలికను చంపేస్తే ఈ ప్రభుత్వానికి కనిపించదు. కంప్లెంట్ ఇచ్చిన రోజే పోలీసులు స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో ఉండేది. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను ఇంటికి కేంద్రబిందువుగా గుర్తించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి జగన్ మోహన్ రెడ్డి మహిళలను కించపరుస్తారా. ఈ ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనించాలి. అరెస్టులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చిందిఓ సీనియర్ జర్నలిస్టును ఈ విధంగా అరెస్ట్ చేయడం.. మొత్తం మీడియాకే ప్రమాద ఘంటికలు. చంద్రబాబును పొగిడితేనే మీడియాకు మనుగడ ఉంటుందనేలా హెచ్చరిస్తున్నారు. ఓ జర్నలిస్టు డిబేట్ పెడితేనే చంద్రబాబు భయపడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. -
ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం! అందుకే ఓడిపోయాం..
-
కొండపై విష‘నాగులు’
నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్ఫోర్స్గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టార్కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్ లేటరైట్..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ (ఉన్నత శ్రేణి) లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్ అనేది ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025 -
YSRCP: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది. -
‘నువ్వా విలువల గురించి మాట్లాడేది’.. అనితపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
సాక్షి,విశాఖ : హోంమంత్రి అనితపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైరయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని,ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను మా పార్టీ ఎంత మాత్రం సమర్ధించదు.రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు. వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోం మంత్రి అనిత ఏం చేశారు..? కనీసం స్పందించారా..? ఈ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా..?. విలువలు నేర్పించే అర్హత హోం మంత్రి అనితకు ఉందా..? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోం మంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా జరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. -
‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే. -
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
నువ్వు రాప్తాడు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు
-
జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన కామెంట్స్ తమకు ఆపాదించటంపై YSRCP ఖండన
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదు
-
ఈ పతనం ఏ లోతుల్లోకి?
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్లో ఉంటూనే, లా అండ్ ఆర్డర్ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్సీపీ ఖండన
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
కూటమి వైఫల్యాలు దృష్టి మళ్ళించేందుకే 'ఈనాడు' భజన కథనాలు
సాక్షి, శ్రీకాకుళం: అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా 'ఈనాడు'లో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు.చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ ఈనాడు రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమంటున్నారంటే..చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఇంకా కొంత పెండింగ్లో ఉంది. వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉంది.పెన్షన్ల పథకం అమలులోనూ మోసంకూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్, అలాగే 143 హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి. పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా? ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి. అలా ఇచ్చినట్లయితే అదనంగా 20 లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న 66 లక్షల పెన్షన్లకు అదనంగా మరో 20 లక్షలు కలిస్తే, మొత్తం 86 లక్షల పెన్షన్లను ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అలా జరుగుతోందా? పైగా వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి, వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు, మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇళ్ళ వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్ళకు పిలిపించుకుని, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారు.అధ్వాన్నంగా శాంతిభద్రతలురాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, కక్షసాధింపులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే చాలు వెంటనే దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి, బురదచల్లుతున్నారు. రాష్ట్రంలో ఇలా పెట్టుబడిదారుపై దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు.కానీ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలపై మామూళ్ళ కోసం దాడులు, వేధింపులతో ఒక భయోత్పాతంను సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ కంపెనీని వేధించారు. అలాగే రాయలసీమలో సిమెంట్ కంపెనీలపై, పోర్ట్ల్లో రవాణా వాహనాల నుంచి మామూళ్ళ కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎంఓయులు చేసుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు. కూటమి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు. దావోస్కు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు.పథకాల అమలుపై స్పష్ట ఏదీ?రాష్ట్రంలో 1.60 కోట్ల దీపం కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.869 కోట్లు కేటాయించారు. ఇవి వాస్తవం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దీనిని అమలు చేస్తారు? ఏడాదికి సుమారు రూ.32,400 కోట్లు అవసరం. ఉచిత బస్సు అన్నారు, దాని అమలు ఊసే లేదు. యువగళం అంటూ నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.ఎంతమంది నిరుద్యోగులకు దీనిని ఇచ్చారు? రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వన్నీ ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా? అమ్మ ఒడి కింద గత ఏడాది పూర్తిగా దాదాపు 80 లక్షలకు పైగా విద్యార్ధులను, వారి తల్లులను దగా చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఎగ్గొడతారో తెలియదు. రైతులకు ఇస్తామన్న రైతుభరోసా ఏమయ్యిందీ? కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇచ్చే రైతుభరోసాపై గతంలో చంద్రబాబు పలుసార్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే దానితో కలిపే ఇస్తామని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నారు? కనీసం అలా అయినా ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాము. కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎల్లా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్సార్ వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్ననేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటివెలుగు, విదేశీ విద్యాదీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన, కాపునేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్దిదారులకు రూ.36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం.దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడింది. అలాగే 2023-24 లో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 22 శాతం. పారిశ్రామిక, వ్యవసాయ గ్రోత్లో ప్రగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి పాలనలో జీడీపీ గ్రోత్ 22 శాతం తగ్గిపోయిందంటే వారి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.2024-25కి సంబంధించి కూటమి ఏడాది పాలనలో స్టేట్ జీఎస్టీ రెవెన్యూ రూ.2652 కోట్లు అయితే, 2023-24 వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో వచ్చిన రాష్ట్ర జీఏస్టీ రెవెన్యూ రూ.3499 వచ్చింది. అంటే సుమారు 24 శాతం ఆదాయం తగ్గిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ప్రతిసారీ చెబుతూ ఉంటారు. 3.3 లక్షల కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు రూ.1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్. -
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
రైతుల గోడు పట్టదా?: కూటమి సర్కార్పై కారుమూరి ఫైర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారుసిండికేట్గా మారిన పొగాకు కంపెనీలురాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.రైతుల వేదన అరణ్య రోదనరాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండివైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్ను పట్టుకున్నారు.ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి. -
పార్టీ మార్పు పుకార్ల పై అబ్బాయా చౌదరి రియాక్షన్
-
ఏ పాఠశాలకు వస్తావో రా.. లోకేష్కి విద్యార్థుల ఛాలెంజ్
-
ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
రాష్ట్రాన్నిబట్టి న్యాయం మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బెడిసికొట్టిన బాబు సర్వే.. జగన్ కు జై కొట్టిన టీడీపీ ఓటర్లు
-
నెల్లూరు జైలు నుంచి కాకాణి తరలింపు
-
పార్టీ మార్పు పుకార్లపై అబ్బాయా చౌదరి రియాక్షన్
-
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాం«దీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎన్ఆర్కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ రాకతో వేధింపులు సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాను వైఎన్ఆర్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు. నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా? సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. ‘నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?’ అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. ‘మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా’ అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి. అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచి్చపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్సీపీ అని వేధిస్తున్నారన్నా’ అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రెడ్బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తడీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలిసీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు. కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై వైఎస్ జగన్ ఆవేదన
తాడేపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘ఆ కార్యకర్త గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెడ్బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి… pic.twitter.com/DQYqumM3Hz— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025 -
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
గుంటూరు: సత్తెనపల్లి పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నాం. 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా సూసైడ్ నోట్లో వివరంగా చెప్పాడు. ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోకింగ్ చేసుకుని లక్ష్మీనారాయణ వేధించడం మంచి పద్ధతి కాదు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు’ అని పేర్కొని ఆత్మహత్యాయత్నం చేశాడు. -
టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం
-
లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా?
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి ఎలాంటి ఆధారాలూ లేవని బాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా ? అందుకే మొన్నటి కేబినెట్ భేటీలో పిల్లిలా సన్నాయినొక్కులు నొక్కారా ? అదే అనిపిస్తోంది. వాస్తవానికివైఎస్ జగన్ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్ కార్పొరేషన్ చేసింది.. లాభమంతా కార్పొరేషన్ కు వస్తుంది.. కార్పొరేషన్ అంటే ప్రభుత్వం .. అంటే సర్కారుకు లిక్కర్ వ్యాపారం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.. పైగా వీధుల్లో ఇష్టానుసారం దుకాణాలు.. అక్రమ బెల్ట్ షాపులు కూడా లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మద్యం ద్వారా భారీ ఆదాయం రావడంతోవైఎస్ జగన్ కూడా సంక్షెమ పథకాలు దర్జాగా అమలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ కుంభకోసం అనే కాన్సెప్ట్ ను ప్రజల్లోకి ఎక్కించేందుకు యాతన పడ్డారు. అనుకూల మీడియాలో రకరకాల వార్తలు రాయించారు..పనిలోపనిగా అప్పటి ఏపీ బీసీఎల్ ఎండీ వసుదేవరెడ్డిని ... రాజ్ కసిరెడ్డిని ఇంకొందరిని అరెస్ట్ చేసి అదేదో పెద్ద కుంభకోణం అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు తపనపడ్డారు. ఇదే ఊపులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా లీకులు ఇచ్చారు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నిన్న వాస్తవాలు చెప్పేసారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద స్పష్టత ఇచ్చేసారు. "నన్ను స్కిల్ స్కాములోవైఎస్ జగన్ సర్కారు అరెస్ట్ చేసింది కదాని నేను ఆయన్ను లిక్కర్ కుంభకోణంలో ఎలా అరెస్ట్ చేస్తాను.. ఆధారాలు ఉండాలి కదా.. అవి లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలకు దొరికిపోతాం కదా." అనేసారు.. అంటే రాష్ట్రంలో ఆనాడు కుంభకోణమే జరగలేదని చంద్రబాబు అన్యాపదేశంగా కేబినెట్లో ఒప్పేసుకున్నారు. అంటే అది అసలు కుంభకోణమే కాదని.. కేవలంవైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలెట్టిన దుష్ప్రచారం అని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లు కేబినెట్ సహచరులు చెబుతున్నారు. మరి ఏమీ లేనిదానికి ఇలా కుంభకోణం అని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే వచ్చి ఏడాది అయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుచేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో నెల ఒక్కో అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి వారి దృష్టిని మరల్చడానికి చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు అర్థం అవుతోంది..-సిమ్మాదిరప్పన్న -
‘పవన్.,. మీ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?’
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. -
టీడీపీ నేతల వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ‘ ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్ల కు చెందిన టిడిపి నాయకులు ఖలీల్ రామారావు పత్తిపాటి రామారావు వంశీలు పోలీసులు వేధిస్తున్నారు. డీఎస్సీ ఆఫీసుకు పిలిచి మరిచి వేధించారు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మవాడివా.. కమ్మవాడివైతే వైఎస్సార్సీపీలో ఎలా ఉంటావని దూషించారు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
BIG QUESTION: అది పోలీస్ స్టేషనా..టీడీపీ ఆఫీసా ?
-
3 కోట్లు లంచం తీసుకున్న బాబు.. బయటపెట్టిన దగ్గుబాటి
-
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
‘రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి’
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్మెన్తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
రాష్ట్రవాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దాం’’ అని సజ్జల పిలుపునిచ్చారు.‘‘ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలి. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలి. రెడ్బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలి’’ అని సజ్జల చెప్పారు.ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, పూడి శ్రీహరి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేద్దామన్నారు. -
Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్
-
పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారుఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.ఈ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట్జర్ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ఆర్గనైజేషన్తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్ జగన్ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
‘కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం సడుస్తోంది’
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు
-
జగన్ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్
-
YSRCP విద్యార్ధి నేతలను అడ్డుకున్న పోలీసులు, విద్యార్ధి నేతలు నెట్టివేత
-
బాబు,పవన్ పై నిప్పులుచెరిగిన అంబటి
-
రెడ్బుక్ రాజ్యాంగంలో కీచకులుగా మారిన పచ్చమూక
-
పర్యావరణాన్ని పరిరక్షించాలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఈ భూ మండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం. దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై… pic.twitter.com/v1nn0zvnqy— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2025 -
కూటమి సర్కార్ కక్షసాధింపునకు మరో నేత బలి
-
Vennupotu Dinam: ఉదయగిరిలో YSRCP భారీ ర్యాలీ
-
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెన్నుపోటు దినం నిరసన హోరు.. ఇది ట్రైలర్ మాత్రమే!
-
పనికిమాలిన వెధవ.. గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే..
-
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తీరుపై నిరసన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్పంచుకోగా.. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మద్దతు పలికారు. ఎక్కడికక్కడ మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. సీఎం డౌన్డౌన్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్నూలులో ఎండీయూ వాహన ఆపరేటర్లు తమ వాహనాలతో నిరసన ర్యాలీలో మద్దతు తెలిపారు. ఏడాదంతా రెడ్ బుక్ పాలనే.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన దినం చేపట్టారు. కర్నూలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి బుధవారపేట, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, ఎనీ్టఆర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూటమి నేతలు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో మరింత వ్యతిరేకత ఉందని, కూటమి నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికక్కడ తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు.జిల్లా వ్యాప్తంగా నిరసనలు మంత్రాలయం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, ప్రదీప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలూరు: ఎమ్మెల్యే బి.విరూపాక్షి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాణ్యం: కల్లూరులో నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్యతో కలిసి వెన్నుపోటు నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. కల్లూరులోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదోని: పట్టణంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను వినతిపత్రం అందజేశారు. పత్తికొండ: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు: నియోజకవర్గంలోని గూడురులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ పాల్గొన్నారు. పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు: పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుకా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్నోహాన్ రెడ్డి పాల్గొన్నారు.పోరాటాన్ని కొనసాగిస్తాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడు. రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రూ.1000లు కూడా సంక్షేమ పథకాల కింద ఇవ్వలేకపోయాడు. మరి అంత డబ్బు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు నిరసన దినం చేపట్టింది. నిరసనలను ఇంతటితో ఆపం.. ప్రజలతో కలిసి ఇక మీదట కూడా చంద్రబాబు మెడలు వంచేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుచంద్రబాబు నైజం ప్రజలకు తెలిసిపోయింది ఏడాది గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. తాము మోసపోయామనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తిరగబడటం ఒక్కటే మిగిలింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. – మధుసూదన్, ఎమ్మెల్సీ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసినట్లుంది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు చూసి చూపించారు. ఈ ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పడంతో ఓట్లేశాం. ఇప్పుడు చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు అందింది లేదు. సంవత్సరమైనా ఎదురుచూడటంతోనే సరిపోతుంది. సూపర్సిక్స్ పథకాలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసినారు. ఈ నాయకులకు మళ్లీ మా దగ్గరికి రావాలంటే మొహం ఎలా వస్తుంది. బుద్ధి ఉంటే ఇంకోసారి నమ్ముతామా?. – దస్తగిరి, హాలహర్వి గ్రామం, నందవరం మండలం -
మాజీ మంత్రి అంబటిపై కేసు
-
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం
కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పవన్ కళ్యాణ్.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్ డీసీఎంగా పవన్కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, అనూప్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శేషగిరిరావు, సతీష్రెడ్డి, షాహుల్, వైస్ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్ తదితరులు ఉన్నారు. మోసం చేయడంలో దిట్ట ∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.నమ్మించి నట్టేట ముంచాడు∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు∙బుర్రా మధుసూదన్యాదవ్ కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్సిక్స్ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలకే పంగనామాలు∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (అర్బన్): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ విజయకుమార్కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్ఖాన్, అబ్దుల్ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు. రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్కు వినతి పత్రం సమరి్పంచారు. అనపర్తినియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. -
చంద్రబాబు, లోకేష్ కు నాగార్జున యాదవ్ ఓపెన్ ఛాలెంజ్
-
వెన్నుపోటు దినం సూపర్ హిట్టు.. టెన్షన్ లో బాబు, పవన్
-
హామీలకు నేను బాద్యుడిని అన్నావ్.. గొంతు లేవడం లేదా PPP
-
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు... వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన జనం
-
ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు
-
పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
బాబు 'సూపర్ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలను అందజేశారు. ‘సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్బుక్తో టెర్రర్ సృష్టిస్తున్నావు.. ఇక చాలు మీ నిర్వాకం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల డ్రైవర్లు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. ఆ పిలుపే ప్రభంజనమై.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగన్ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహించిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయడానికి కుట్రలు చేసింది. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్ బుక్తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. గుంతకల్లు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉసిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు. -
‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు...బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
MLA Deepika: బాలయ్య అడ్డాలో బాబుకు సవాల్..!
-
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య: శ్యామల
-
వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ
-
చంద్రబాబు చరిత్ర పూర్తిగా మోసపూరితం : ఎంపీ మిథున్ రెడ్డి
-
ప్రజా శంఖారావం.. ఇది ఆరంభం మాత్రమే!
-
Victims Emotional Words: మమల్ని చిత్రహింసలు పెట్టారు
-
నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నపోటు దినంలో పాల్గొన్న బొత్స.. ప్రసంగిస్తుండగానే సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే తిరిగి కోలుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రసంగిస్తుండగా.. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో కోలుకున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. -
సొమ్మసిల్లి పడిపోయిన బొత్స సత్యనారాయణ
-
ప్రజలకే వెన్నుపోటు.. బాబును క్షమించే ప్రసక్తే లేదు (చిత్రాలు)
-
Vennupotu Dinam మళ్లీ పొడిచాడురా బాబూ.. ఎన్ఆర్ఐల నిరసన
-
ఏపీకి ట్రబుల్ మేకర్గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. -
ఏం చేశారని దీపావళి చేసుకోవాలి.. వెన్నుపోటుపై వినూత్న నిరసన
-
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
ఇచ్చిన హామీలు ఎక్కడ.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?
-
చెవిలో పూవ్వులతో వెన్నుపోటుదినం RK రోజా మాస్ ర్యాగింగ్
-
కూటమిపై తిరుగుబాటు.. బాబుకు కౌంట్ డౌన్
-
Vennupotu Dinam: వెన్నుపోటుకు ఏడాది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
నేడు ఏపీవ్యాప్తంగా వెన్నుపోటు నిరసనలు
-
Vennupotu Dinam: నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటుకూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనవెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలుకూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహంచంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు👉ప్రకాశం జిల్లా:చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజుఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజు ఈరోజుఅప్పుడు మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారుచంద్రబాబు గతంలో కూడా చెప్పిన హామీలను నెరవేసిన ఘనత ఎప్పుడూ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారుచంద్రబాబు మారాడు మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడుచంద్రబాబు ఎప్పటికీ మారకపోవడం, వెన్నుపోటు ఆయన రక్తంలోనే ఉందిఅందుకే ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 👉నంద్యాల జిల్లా డోన్లో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందిఅధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారుగత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు.కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెంచి, సూపర్ సిక్స్ అంటూ పిల్లల నుంచి ముసలి వారి వరకు మోసం చేసారు.సంపద సృష్టిస్తాం అని చెప్పి చివరకు పథకాల హామీలలో చేతులు ఎత్తేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు 👉వైఎస్ఆర్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ. 1500, రైతన్నలకు ఏడాదికి ూ. 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేదు👉తిరుపతి జిల్లా :నేడు వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినానికి పిలుపు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు.చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలిరెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలికూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాముకూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది.విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వంఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదుపవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదుపదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలికూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం👉పశ్చిమగోదావరి జిల్లా:వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజలు👉పశ్చిమగోదావరి జిల్లా:పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు వెన్ను పోటు దినంపాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కు వినతిపత్రంవెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు👉పశ్చిమగోదావరి జిల్లా:పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంఅంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా:రావులపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసనపెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ..👉ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు..బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు👉అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు👉విశాఖ .. ఈస్ట్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినంగురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావుభారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు👉గుంటూరు:గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంపాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు👉విజయవాడతూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంభారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు👉గన్నవరంఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నానిముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారుజగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారుజగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు ఉచిత బస్సు తుస్సు మందిసంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారురోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయిపనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదుపథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉందిరూపాయి లేదని చెపుతారులోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారులోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడుఅమ్మ ఓడికి ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరుదోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారుచికెన్లో కూడా కమిషన్ అడుగుతారుMla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారురాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారుదేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారుఅన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారుమోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలిగన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు వంశీ పై 11 కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు.. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది👉ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినంమైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంభారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులుకూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు👉అనంతపురం:చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంవినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉గన్నవరంవైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నానివెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు👉విశాఖ:పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసనగాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా:రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావంచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాంమాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాంప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదుఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారుఅక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయితిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాముడాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఅమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారుసంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందిభూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారురాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం👉శ్రీసత్యసాయి జిల్లా:పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమంమాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీపార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులుప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీమునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..బొబ్బిలిలో మొదలైన ర్యాలీబొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.👉అనకాపల్లి. నర్సీపట్నంవెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.నిన్న సాయంత్రం బైక్లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.👉అనంతపురం:మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంచంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతిఅయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణనేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుకూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలుచీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వంఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణచంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులుఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వంఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటునమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారుహామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనంటీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాటఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపుఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలుతక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు -
ప్రజలకే వెన్నుపోటు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదంతొక్కుతున్నాయి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఒనగూరే ప్రయోజనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల్లో 143 హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి, గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోయేలా అబద్ధాలు వల్లె వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ‘నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న’ సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు.. అప్పుల్లో రికార్డులు సృష్టించినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తుంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటూనే ఉన్నారు.తల్లికి వందనం పేరుతో అమ్మలకు మోసం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇచ్చిన పాపాన పోలేదు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.మహిళలకు ద్రోహం ⇒ ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా ఆడబిడ్డ నిధి ఊసే లేదు.. ⇒ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఏడాది అయినా ఉచిత బస్సు జాడే లేదు. ⇒ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మబలికారు. గతేడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్తో సరిపెట్టి, మహిళలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ మాటే లేదు..అన్నదాతకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకూ రూ.20 వేలు అందించలేదు. తొలి ఏడాది రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన రూ.10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది సీజన్ ప్రారంభమైనా పైసా పెట్టుబడి సాయం అందించకుండా నిలువునా ముంచేశారు. ఐదేళ్లుగా పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి వారిపై బీమా భారం మోపారు.ఖరీఫ్ 23 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల మేర పంటల బీమా పరిహారం రైతులకు దక్కకుండా చేశారు. కరువు బకాయిలతో సహా గడిచిన ఏడాదిలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 8.94 లక్షల మంది రైతులకు రూ.554 కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచారు. ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాటు పాడి రైతులకు అండగా నిలిచిన అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి.. కార్పొరేట్, ప్రైవేటు డెయిరీల దోపిడీ బారిన పడేలా చేశారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతకు టోపీ సూపర్ సిక్స్ హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని– ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్న హామీ ఒకటి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమం కోసం ఒక్కపైసా కూడా విదిల్చలేదు. ఏపీలో గతేడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా, నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు అయితే ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండి చెయ్యి చూపించింది. 2025–26 బడ్జెట్కు వచ్చే సరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు చొప్పున ఏడాదికి రూ.61,200 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి వ్యయం అవుతుంది. ఇచ్చిన హామీలో భాగంగా ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు నిరుద్యోగుల కోసమే వెచ్చించాలి. కానీ, చంద్రబాబు చాణిక్యంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ దగాకు గురయ్యారు.జాబ్ క్యాలెండర్ హుష్కాకి..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పటి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగులను నియమించారు. 2019–24 మధ్య శాశ్వత, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి కొలువులిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లా పారిపోయే బ్యాచ్ కాదు మేము’ అని చంద్రబాబు, లోకేష్ బీరాలు పోయారు. జనవరి పోయి 5 నెలలు దాటినా జాబ్ కేలండర్ దేవుడెరుగు.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచి్చన గ్రూప్–1, 2 మెయిన్స్ను పలుసార్లు వాయిదా వేసి, అభ్యర్థులను నిలువునా మోసం చేసి గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపే నిర్ణయం తీసుకుని గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేసేందుకు ప్రణాళిక వేశారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ దాదాపు వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతించింది. వాటికి నోటిఫికేçÙన్లు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బాబొచ్చారు.. జాబేదీ? బాబు వస్తే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఏడాదయినా ఒక్కరికీ ఉద్యోగం వచి్చంది లేదు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు.బట్టబయలైన దుష్ప్రచారంగుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారకముందే తలుపుతట్టి వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ అందించడం దగ్గరనుంచి అన్ని ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా సమకూర్చారు.పరిపాలన సంస్కరణల్లో ఇదో విప్లవమనే ప్రశంసలు పొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ విషం చిమ్మారు. 2023 అక్టోబరు 7న రెండో విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు రోడ్ షోలో.. 33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ పవన్ హేయంగా మాట్లాడారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరు 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమేనని.. 46 మంది బాధితులని వెల్లడించడం గమనార్హం. ఇసుక దోపిడీ.. అడ్డగోలు తవ్వకాలువైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేసింది. దీంతో రూ.750 కోట్ల ఆదాయం వచి్చంది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం వచి్చన కొద్ది రోజుల్లోనే 80 లక్షల టన్నుల ఇసుకను పచ్చ మాఫియా దోచేసి, జేబులు నింపుకొంది. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తవ్వేసి.. అధిక ధరలకు అమ్ముకుంటూ భారీఎత్తున దోచేస్తోంది. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకు వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.రెడ్బుక్తో టెర్రర్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు.. పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతును నొక్కేందుకు రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి వెంటాడి, వేటాడి హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 390 మందిని చంపేశారు.హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి.. 500 మంది నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 79 మందిని జైలు పాల్జేశారు. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. 63 అక్రమ కేసులు నమోదు చేసి.. 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి.. ఇద్దరిని జైలుపాల్జేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.మద్యం మాఫియా బయటకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతిపెట్టిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి చంద్రబాబు సర్కారు మళ్లీ ఊపిరిపోసి వదిలింది. మద్యం ఏరులై పారించడం ద్వారా భారీ దోపిడీకి టీడీపీ మద్యం సిండికేట్ పన్నాగం పన్నింది. ప్రైవేటు దుకాణాలను తిరిగి తెచి్చంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా టీడీపీ గూండాలతో పాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 3,396 మద్యం దుకాణాల పరిధిలో దాదాపు 55 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది.ఎంఆర్పీ కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అన్ని దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచి్చన రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని 2025–26లో రూ.35 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కనీసం రూ.10 వేల కోట్లు చొప్పున మద్యం ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2028–29 నాటికి ఏకంగా రూ.75 వేల కోట్లకు చేరాలన్న ఉద్దేశంలో ఉంది.రాజధాని నిర్మాణంలో అడ్డగోలు దోపిడీ..తాను, తన సన్నిహితులు, బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరలకే కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి అధిక వడ్డీలకు రూ.31 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. మరో రూ.21 వేల కోట్లు అప్పునకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రూ.77 వేల కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.అధిక వడ్డీలకు తెచి్చన నిధులతో.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. దేశంలో ఎన్హెచ్ఏఐ కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున జాతీయ రహదారులను నిరి్మస్తుంటే.. రాజధానిలో మాత్రం కి.మీ.కు రూ.66 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేశారు. చదరపు అడుగు రూ.1,800 నుంచి రూ.2 వేల లోపు వ్యయంతో భవనాలను నిరి్మంచవచ్చు. కానీ.. ఏకంగా చదరపు అడుగు రూ.పదివేల చొప్పున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో అధిక వడ్డీలకు తెచి్చన అప్పులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. పప్పులు బెల్లాల్లా.. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు పప్పులు, బెల్లాల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం పంచిపెడుతోంది. ఊరూపేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉర్సా.. మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడిది. ఇక లులూ సంస్థకు మాల్ నిర్మాణానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండడం భూదోపిడీకి పరాకాష్ట. మొదటి సంతకమే దగా.. దగాఅధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సీఎం హోదాలో 16,437 పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేశారు. గత ఏడాది డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా దాదాపు 11 నెలలు కాలయాపన చేసి మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనూ అనేక కొర్రీలు పెట్టారు. 50 శాతం అర్హత మార్కుల నిబంధన తెచ్చి అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని డీఎస్సీకి దూరం చేశారు. టెట్ ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు.ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటరీ్మడియట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసినవారికి ఈ నిబంధన వర్తించదని 2019లో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల ఉసురు తీసింది.తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలు ఇచి్చంది. జనరల్ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 50 శాతంగా అలాగే ఉంచింది. జనరల్ అభ్యర్థులకు టెట్లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆ మేరకు తగ్గించకపోవడం గమనార్హం.పాలనలో అట్టర్ ప్లాప్.. డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతున్నారు. కూటమి వచి్చన వెంటనే పచ్చమూకలు.. వెంటాడి, వేటాడి 36 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంపేశాయి. 300 మంది నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.ఈ దారుణాన్ని దేశానికి చాటిచెప్పేందుకు జూలై 24న ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాకు దిగారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. కృష్ణా, బుడమేరు వరద నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో విజయవాడను వరద చుట్టుముట్టి 50 మంది పైగా బలితీసుకుంది. దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో గేట్లను ఢీకొట్టే కుట్ర చేశారని ఆరోపించారు. వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. ఇంటింటికీ కరెంట్ షాక్ కరెంటు చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని గెలిచాక.. కరెంటు చార్జీలను పెంచేసి.. ఇంటింటికీ కరెంట్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.ఇంటింటికీ రేషన్ రద్దు.. మద్యం సరఫరా ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడంతో 20 వేల మంది రోడ్డున పడ్డారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ బియ్యం, సరుకులు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ దుకాణం వద్ద గంటల కొద్దీ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.వలంటీర్లపై సమ్మెట దెబ్బ తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.పది వేల వేతనం ఇస్తామని పవన్ కళ్యాణ్ సైతం వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసి వారిని నట్టేట ముంచేశారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ఫ్రచారం చేశారు. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం తప్పుడు కథనాలను వండివార్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు.చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రూ.7,21,918 కోట్లే. ఈ లెక్కన 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు మాత్రమే. ఇందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం సంపద సృష్టించి.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నమ్మలికారు. కానీ.. సంపద సృష్టి మాటలకే పరిమితమైంది. సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన ప్రజలనుద్దేశించి.. సంపద సృష్టించడం ఎలాగో తన చెవిలో చెప్పాలంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్రాన్ని 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు.లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిరాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై యూటర్న్ ప్రజల భూములు లాక్కునేందుకే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారని, దస్తావేజులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని దారుణమైన అబద్ధాలతో కూటమి నేతలు ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. 13 వేల గ్రామాలకుగాను 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ కుట్రలో ఈ చట్టం బలైపోయింది. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయత్నించారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు. -
రెడ్బుక్ వత్తాసు.. అదుపు తప్పిన ‘పోలీసు’
రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తు కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి, పోలీసులకింత, ఎమ్మెల్యేకు ఇంత, చంద్రబాబుకు ఇంత, లోకేశ్కు ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది.ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్ రూములకు అనుమతిస్తున్నారు. ప్రతి పర్మిట్ రూమ్, ప్రతి బెల్ట్ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్ , ల్యాటరైట్.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా?గొడవల వల్ల కేసులుండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు.. ఏది న్యాయం.. అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారు. కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా? అలా చేస్తే అది ధర్మమేనా?-వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఎవరి మీదైనా కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై ముగ్గురు యువకులను అరికాళ్లపై కొడుతూ హింసించిన ఘటనకు సంబంధించి బాధిత యువకుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేస్తోందో కనిపిస్తోందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలేం జరిగిందంటే.. ⇒ పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరిముల్లాలు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్ తెనాలిలో ఉండడు. పాలిటెక్నిక్ చదివిన అతను హైదరాబాద్లో జొమాటో కంపెనీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా యువకులు. చిన్నతనంలో ఏదో పాత కేసు వాయిదా కోసం రాకేష్ తెనాలి వచ్చాడు. అతన్ని చూడటానికి అతని స్నేహితుడు జాన్ విక్టర్ మంగళగిరి నుంచి వచ్చాడు. అతను జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయ్యాడు. విక్టర్ వెంట అతని స్నేహితుడు మెకానిక్ అయిన కరీముల్లా కూడా వచ్చాడు. ⇒ ఈ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతా నగర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్విక్టర్ బైక్తో పాటు, అతడి మొబైల్ను సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించి ఆ కానిస్టేబుల్ నుంచి బైక్ కీ, మొబైల్ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్ విక్టర్ మంగళగిరి వెళ్లారు. ఇది జరిగింది ఏప్రిల్ 24న. ⇒ ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్.. జూనియర్ అడ్వకేట్ అయిన జాన్విక్టర్తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాకేష్ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్ పీఎస్లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 26న ముగ్గురినీ స్టేషన్కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ తెనాలి టూ టౌన్సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు. (ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చూపారు) ⇒ అంతటితో ఊర్కోక, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 27న కూడా మరో రోడ్ సెంటర్కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా, విక్టర్ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించారు. ఆ మర్నాడు, ఏప్రిల్ 28న వారిని కోర్టులో హాజరు పర్చారు. పోలీసుల దెబ్బలకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషషన్కు తీసుకెళ్లి, ప్రైవేట్ పార్టులకు కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారు.ఈ ప్రశ్నలకు బదులేది?⇒ ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూపినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి. ⇒ ఏప్రిల్ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీరి్ణంచుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు. ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.అన్ని వ్యవస్థలూ నాశనం⇒ లా అండ్ ఆర్డర్ కుప్పకూలిన పరిస్థితుల మధ్య.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వక పోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేదు. ⇒ మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.అందుకే ‘వెన్నుపోటు దినం’ ⇒ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ను గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా బుధవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని మరోసారి పిలుపునిస్తున్నా. ⇒ ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నా. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.పలకరించిన వారే లేరు.. జగన్ భరోసా ఇచ్చారుమా అబ్బాయి బాబులాల్ అలియాస్ కరిముల్లా మంగళగిరిలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలసి తెనాలి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించ లేదు. వైఎస్ జగన్ ఒక్కరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.– షేక్ అమీర్బాషా, రాంతున్ (బాబులాల్ తల్లిదండ్రులు) బాధలో ఉన్న మాకు ధైర్యం చెప్పారు మా అబ్బాయి రాకేష్కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్ వేశారు. కాలులో రాడ్ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. – దోమ వాసు, మాధవి (రాకేష్ తల్లిదండ్రులు)పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?⇒ ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవరు? ⇒ జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్విక్టర్ జూనియర్ అడ్వకేట్ కాదా? రాకేష్ చెల్లెలు ఇంజనీర్ (ఆమెను చూపుతూ). రాకేష్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, కొట్టి పరువు తీయడం ధర్మమేనా? ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి? అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్ ⇒ కరీముల్లాపై కూడా గతంలో ఎలాంటి కేసులు లేవు. కానీ అతడని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్విక్టర్, రాకేష్ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొచ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్ మీడియా ఇష్టానుసారం దు్రష్పచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు. ⇒ కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా.. పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరు అయితేనేం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాల పరువు తీస్తారా? ⇒ పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశారు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టుల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని, పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ పరువు తీయడం భావ్యమేనా? ⇒ ఇది రాకేష్ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్రే. అతడి కాలు విరిగితే ఆపరేషషన్ చేసి లోపల రాడ్ వేశారు. ఆ విషయం మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చితకబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమేనా?⇒ ఈ పాప రాకేష్ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. వీరి పరువు తీశారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా? విక్టర్ జూనియర్ అడ్వకేట్. విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్. ఒక మాజీ జర్నలిస్ట్ కొడుకు పరిస్థితి ఇది. ఇది ధర్మమేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి.పోలీస్ రాజ్యం.. హింసాకాండ⇒ ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడిపై తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్లో పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామçÜ్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. కానీ హరికృష్ణ ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉన్నాడు. ⇒ రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. వీరు పోలీసులా.. రాక్షసులా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అతడిని హింసించారు. చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు సుధారాణి, కృష్ణవేణి మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.జగన్ పర్యటనలో భద్రత లోపాలుచింతలపూడి చెక్పోస్టు నుంచే ఆటంకాలుట్రాఫిక్ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యంటీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో వచ్చినా అడ్డుకోని వైనంకనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్ పోలీసులువైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. కొంత మంది పోలీసులను కేటాయించినా, వారు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కి ఆటంకాలు మొదలయ్యాయి. జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసినా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏ మాత్రం దారి మళ్లించలేదు. దీంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి ఆలస్యం అయ్యింది. పట్టణంలోకి అడుగు పెట్టాక కూడా కనీసం రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్ వస్తున్న మార్గంలో వారు నల్ల బెలూన్లతో వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు. వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టిన జనం.. కానరాని పోలీసులు ఓ దశలో వారు జగన్ కాన్వాయ్కి అడ్డం పడే ప్రయత్నం చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించడానికి వస్తున్నారన్న కారణంతోనే పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐతా నగర్లో దోమా రాకేష్ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుకు సందులో ఉన్న రాకేష్ ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు, జగన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరిద్దరు అధికారులు తప్ప పోలీసు సిబ్బంది కనపడలేదు. జగన్ కాన్వాయ్లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్ కూడా దిగలేదు. దీన్ని బట్టి కావాలనే జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన సమాచారం ముందుగానే జిల్లా ఎస్పీకి అందించినా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. -
ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు...ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the @ncbn Garu-led government.In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a… pic.twitter.com/vuvKiJidBn— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.