శాసన మండలి అప్డేట్స్..
శాసనమండలి మీడియా పాయింట్
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..
- మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయి
- ప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయి
- మొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి విడుదల చేయాలి
- మేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదు
- ప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారు
- ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదు
- ప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నం
- ప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.
- దేవాలయంగా భావించే సెక్రటేరియట్కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారు
- చంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..
- మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారు
- దేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారు
- మండలి ఛైర్మన్ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.
బొత్స చిట్చాట్..
- ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.
- టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.
- టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.
- ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.
- లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా?
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..
- ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నం
- అందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాం
- మేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారు
- ఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- మేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాం
- చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాం
- మేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయి
- సాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారు
- తిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశం
- మేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదు
- మాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారు
- మొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ను కోరాం
- మేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదు
- మండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారు
- శాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరం
- బీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారు
- తప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చింది
- సభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది
- సెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారు
- ఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..
- రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదు
- ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి
- ఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలి
- అధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం
ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..
- వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్ను బయటపెట్టండి
- మాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారు
- మరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయి
- నేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండి
- ఈ క్షణమే రాజీనామా చేస్తా
- హౌస్ మొత్తం ప్రొసీడింగ్స్ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది
- సభలో ప్రొసీడింగ్స్ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.
- మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్ను విడుదల చేయండి
- లేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..
- శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదు
- కేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదు
- దళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోంది
- చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..
- ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాం
- మేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాం
- దేవదేవుడంటే మాకు అమితమైన భక్తి
- తిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబు
- లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబు
- మండలిలో మొత్తం ఫుటేజ్ను బయటపెట్టాలి
- చంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు
- ఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలి
- పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..
- ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాం
- కానీ చర్చ జరగనివ్వడం లేదు
- అందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాం
- పోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదు
- మేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారు
- మండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాం
- కానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారు
- మాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాం
- దమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి
ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..
- ఏపీలో శాంతిభద్రతలు లేవు
- ప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు
- ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా
- లడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?
- లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుంది
- మండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారు
- శాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- మండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు
- మా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..
- దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.
- అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.
- మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.
- గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.
- చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.
- తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.
- ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.
- టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- టీటీడీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.
- శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
👉 శాసనమండలి కాసేపు వాయిదా..
టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..
- మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.
- శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.
- మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.
- టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.
- ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.
- ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.
- మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం.
మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్స
- తిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్స
- అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.
- మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.
- రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంది
- దేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.
శాసనమండలిలో గందరగోళం
- చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలు
- నినాదాలు చేసిన ఇరుపక్షాలు
- సభలో గందరగోళ పరిస్థితి..
- సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్
- శాసన మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం
- 11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..
- లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం
👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.
👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది.


