టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న | YSRCP MLCs Protest In AP Assembly After Council Chairman Rejects Adjournment Motion On Indapur Dairy Issue, Check Updates Inside | Sakshi
Sakshi News home page

టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న

Feb 23 2026 10:14 AM | Updated on Feb 23 2026 11:24 AM

YSRCP MLCs Protest In AP Assembly

శాసన మండలి అప్‌డేట్స్‌..

👉 శాసనమండలి కాసేపు వాయిదా.. 

టీడీపీ ఎడిటింగ్‌ వీడియో విడుదలపై ఫిర్యాదు..

  • మండలి చైర్మన్‌ చాంబర్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భేటీ.
  • శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.
  • మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్‌ యాదవ్‌ ఫిర్యాదు.
  • టీడీపీ నేతలు ఎడిటింగ్‌ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.
  • ఎడిట్‌ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్‌.
  • ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్‌.
  • మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. 

బొత్స చిట్‌చాట్‌..

  • ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్‌లో 560 రూపాయలకు దొరుకుతుంది.
  • టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.
  • టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.
  • ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.
  • లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? 

మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్స

  • తిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్స
  • అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.
  • మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.
  • రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంది
  • దేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.

శాసనమండలిలో గందరగోళం

  • చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలు
  • నినాదాలు చేసిన ఇరుపక్షాలు
  • సభలో గందరగోళ పరిస్థితి..
  • సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్
  • శాసన మండలి చైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల సమావేశం
  • 11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..
  • లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం

👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎ‍స్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.

👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్‌ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్‌సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్‌ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement