శాసన మండలి అప్డేట్స్..
👉 శాసనమండలి కాసేపు వాయిదా..
టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..
- మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.
- శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.
- మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.
- టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.
- ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.
- ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.
- మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం.
బొత్స చిట్చాట్..
- ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.
- టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.
- టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.
- ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.
- లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా?
మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్స
- తిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్స
- అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.
- మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.
- రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంది
- దేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.
శాసనమండలిలో గందరగోళం
- చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలు
- నినాదాలు చేసిన ఇరుపక్షాలు
- సభలో గందరగోళ పరిస్థితి..
- సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్
- శాసన మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం
- 11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..
- లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం
👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.
👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది.


