భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం | - | Sakshi
Sakshi News home page

భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం

భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం

భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయానికి చేరువ కావాలని, భావితరాల బంగారు భవిష్యత్‌కు ప్రకృతి సాగే కీలకమని వక్తలు పేర్కొన్నారు. సేంద్రియ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్‌ వైబ్రెంట్‌ విజయవాడ, శ్రేయాస్‌ ఫార్మర్స్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ ఆర్గానిక్‌ రైతోత్సవం ఆదివారం జరిగింది. ప్రకృతి సాగును ముందుకు తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు రైతులు ప్రతిజ్ఞ చేశారు.

విస్తృతంగా అవగాహన..

● దేశీయ గో ఉత్పత్తుల కేంద్రం, రైతు సాధికార సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్‌, పీఆర్‌ఐటీహెచ్‌యూ (రీజెన్‌ అగ్రి కార్బన్‌ ప్రాజెక్టు), వన్‌ ఎర్త్‌ – వన్‌ లైఫ్‌ టెర్రాస్‌ గార్డెన్‌, సాయిశ్రీనివాస్‌ గోశాల, స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్‌ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, ఆరోగ్య వనం తదితర స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్‌ సాగుతో పాటు ఉత్పత్తుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

● ప్రబాల్‌ తోమర్‌ (కిసాన్‌ లెడ్జర్‌), ఆశా కిరణ్‌ (అమరావతి ఆర్గానిక్‌), రఘురాం (భూమి ఆర్గానిక్‌) తదితర ప్రకృతి సేద్యం, ఉత్పత్తుల రంగ నిపుణులు మార్కెట్‌ లింకేజీలపై అవగాహన కల్పించారు.

● రైతులు తాము పండించిన ప్రకృతి సేద్య ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

● వినియోగదారుడు కూడా తనకు నాణ్యమైన ప్రకృతి సేద్య ఉత్పత్తులే కొనుగోలు చేశాననే విశ్వాసం పెంపొందించేలా తీసుకొచ్చిన ట్రేసబులిటీపై కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి. విజయకుమార్‌ మాట్లాడుతూ 2030 నాటికి రాష్ట్రంలోని ప్రతిరైతుకూ ప్రకృతి వ్యవసాయాన్ని చేరువ చేస్తామన్నారు. ప్రకృతి ‘వ్యవసాయం వెనుక శాసీ్త్రయత అనే అంశం’పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), రాష్ట్ర ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ శావల దేవదత్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, జేసీ ఎస్‌.ఇలక్కియ, డీపీఎం వై.శంకర్‌ నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ ఆర్గానిక్‌ రైతోత్సవంలో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement